నరకవాసుల పడకలు మరియు ఇతర శిక్షలు [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు [పార్ట్ 7] – నరకంలో వారికి లభించే పడకలు, దుప్పట్లు
[మరణానంతర జీవితం – పార్ట్ 61 [21 నిముషాలు]
https://www.youtube.com/watch?v=jcQ-5KK6IMk
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[డౌన్లొడ్ పిడిఎఫ్]

ఈ ప్రసంగంలో నరకవాసుల గురించి తీవ్రమైన హెచ్చరికలు చేయబడ్డాయి. నరకంలో వారికి లభించే పడకలు, దుప్పట్లు నరకాగ్నితో కూడుకున్నవని, వారి తలల పైనుండి, పాదాల క్రింది నుండి శిక్ష కమ్ముకుంటుందని వివరించబడింది. నరకవాసులను బంధించే సంకెళ్లు, ఇనుప గదలు, వేడి నీటితో చర్మం కాలిపోవడం, తిరిగి కొత్త చర్మం రావడం వంటి భయంకరమైన శిక్షల గురించి ఖురాన్ ఆయతుల ద్వారా తెలపబడింది. ముఖం కిందికి లాగబడటం, గాడిదలా తిరగడం, పాములు, తేళ్లు కుట్టడం వంటి శిక్షలను వివరిస్తూ, ఈ నరక యాతనల నుండి ఏ విధంగానూ ఉపశమనం లేదా మరణం ఉండదని వక్త హెచ్చరించారు. చివరగా, అల్లాహ్ దయతో ఇహలోకంలో ప్రసాదించిన వరాన్ని సద్వినియోగం చేసుకుని నరక శిక్ష నుండి రక్షణ పొందాలని కోరారు.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు “మరణానంతర జీవితం” అనే అంశంలో స్వాగతం. నరక శిక్షలు, నరకవాసులకు ఇవ్వబడే ఆహారం, పానీయాలు, దుస్తులు వీటన్నిటి వివరాలు మనం తెలుసుకున్నాము.

ఇక ఈ రోజు మనం వారి గురించి ఎలాంటి పడక ఉంటుంది? ఎలాంటి పరుపు అనేది పడుకోవడానికి వారికి ఇవ్వడం జరుగుతుంది? ఈ విషయాలు మనం తెలుసుకుందాము. అయితే, నరకం అనేది విశ్రాంతి స్థలం కాదు కదా పడుకొని ఉండడానికి! నరకం అనేది ఏదైనా ఆనందకరమైన ప్రదేశం కాదు, అక్కడ మనిషి కొంతసేపటి గురించి ఏదైనా ఎంజాయ్మెంట్ చేసుకోవాలని. అది శిక్షలతో కూడిన స్థలం. అయినా, అక్కడ ఇవ్వబడే తిండి, పానీయం, దుస్తులు ఇవన్నీ శిక్షలతో కూడి ఉంటాయి. ఈ విధంగా వారి గురించి ఏ పరుపులైతే ఉంటాయో, అవి కూడా శిక్షలతో కూడి ఉంటాయి.

సూరహ్ అల్ ఆరాఫ్, ఆయత్ నంబర్ 41 లో అల్లాహ్ తెలిపాడు:

لَهُم مِّن جَهَنَّمَ مِهَادٌ وَمِن فَوْقِهِمْ غَوَاشٍ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الظَّالِمِينَ
[లహుమ్ మిన్ జహన్నమ మిహాదువ్ వమిన్ ఫౌకిహిమ్ గవాష్. వ కజాలిక నజ్ జిజ్ జాలిమీన్]
వారి క్రింద నరకాగ్నితో చేయబడిన పాన్పుఉంటుంది. పైన దుప్పటి కూడా (దానితోనే తయారైనదయి ఉంటుంది). దుర్మార్గులకు మేము విధించే శిక్ష ఇలాగే ఉంటుంది. (7:41)

నరకమే నరకం. మరియు వారు కప్పుకోవడానికి పైనుండి ఏ దుప్పట్లయితే వేసుకుంటారో, అవి కూడా నరకానికి సంబంధించినవే,

సూరహ్ అన్ కబూత్, ఆయత్ నంబర్ 55 లో అల్లాహ్ తెలిపాడు:

يَوْمَ يَغْشَاهُمُ الْعَذَابُ مِن فَوْقِهِمْ وَمِن تَحْتِ أَرْجُلِهِمْ وَيَقُولُ ذُوقُوا مَا كُنتُمْ تَعْمَلُونَ
[యౌమ యగ్ షాహుముల్ అజాబు మిన్ ఫౌకిహిమ్ వమిన్ తహ్ తి అర్జులిహిమ్ వ యకూలు జూకూ మా కున్తుమ్ త’మలూన్]

ఆ రోజు శిక్ష వారి పైనుంచి, వారి పాదాల క్రింద నుంచి వారిని ఆక్రమించుకుంటూ ఉంటుంది. అప్పుడు (అల్లాహ్‌) వారితో “మీరు చేసుకున్న కర్మల రుచి చూడండి” అని అంటాడు. (29:55)

ఇక వారు ఆ నరకం నుండి పారిపోయి ఏ నీడ పొందాలని కోరుతారో, ఆ నీడ కూడా నరకం యొక్క నీడ! అందులో కూడా వారికి ఎలాంటి ప్రశాంతత అనేది, సౌఖ్యం అనేది ఉండదు. వారు నీడను చూసి, ఆ నీడలోకి వచ్చినప్పుడు, అక్కడ వారికి నరకం నుండి ఏదైతే పారిపోయి వచ్చారో, నరకాగ్ని నుండి రక్షణ పొందాము అన్నట్లుగా వారికి అర్థమవుతుందో, నీడలో వచ్చిన తర్వాత అక్కడ పెద్ద పెద్ద నిప్పులు వచ్చి పడుతూ ఉంటాయి. ఈ విధంగా పొగ వారిని కమ్ముకొని ఉంటుంది మరియు దుర్వాసన అనేది వారు భరించలేకపోతారు. అలాంటి ఆ స్థితిలో, నరకంలో నరకాగ్నిని భరిస్తూ ఏదైతే ఉన్నారో దానికంటే మరీ ఘోరమైన పరిస్థితి వారిది ఉంటుంది.

ఇంకా మహాశయులారా, నరకంలో ఇన్ని కష్టాలు వారు భరిస్తూ ఉంటారు, కానీ ఇంతటితో వారి యొక్క కష్టాలకు అంతం అనేది ఉండదు. నరకంలోనే ఇంకా ఎన్నో రకాల శిక్షలు ఉంటాయి. కొందరిని బందీలుగా ఖైదు చేయడం జరుగుతుంది. మరికొందరిని చాలా ఇరుకు ప్రదేశంలో వారిని వేయడం జరుగుతుంది. ఎంతటి ఇరుకు ప్రదేశం అంటే, వారు అక్కడ కదలడానికి కూడా అవకాశం ఉండదు.

وَإِذَا أُلْقُوا مِنْهَا مَكَانًا ضَيِّقًا مُّقَرَّنِينَ دَعَوْا هُنَالِكَ ثُبُورًا
[వ ఇజా ఉల్కూ మిన్హా మకానన్ దయ్యికమ్ ముఖర్రనీన దఅవ్ హునాలిక సుబూరా]

నరకంలోని ఒక ఇరుకైన స్థలంలో వారిని కాళ్ళూ, చేతులూ బంధింపబడిన స్థితిలో పడవేయబడినప్పుడు వారు చావు కోసం అరుస్తారు. (25:13)

అయితే వారికి సమాధానం ఇవ్వబడుతుంది: “ఏమిటి ఒక్క చావును? ఎన్నో చావులను మీరు పిలిచినా, కేకలు వేసినా ఏ ఒక్క చావు కూడా మీకు రాదు, మీరు అసలు అక్కడ చనిపోనే చనిపోరు.”

మరో రకమైన శిక్ష ఎలా ఉంటుందో సూరహ్ ఇబ్రాహీం ఆయత్ నంబర్ 49 లో తెలపడం జరిగింది:

وَتَرَى الْمُجْرِمِينَ يَوْمَئِذٍ مُّقَرَّنِينَ فِي الْأَصْفَادِ
[వతరల్ ముజ్రిమీన యౌమఇజిమ్ ముకర్రనీన ఫిల్ అస్ ఫాద్]
ఆ రోజు అపరాధులంతా ఒకచోట సంకెళ్ళతో బంధించబడి ఉండటం నువ్వు చూస్తావు. (14:49)

మరియు సూరహ్ ఇన్సాన్ ఆయత్ నంబర్ 4 లో ఉంది:

إِنَّا أَعْتَدْنَا لِلْكَافِرِينَ سَلَاسِلَ وَأَغْلَالًا وَسَعِيرًا
[ఇన్నా అఅతద్ నా లిల్ కాఫిరీన సలాసిల వ అగ్లాలవ్ వసయీరా]
అవిశ్వాసుల కోసం మేము సంకెళ్ళను, ఇనుప పట్టాలను, జ్వలించే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. (76:4)

అబూ లహబ్ యొక్క భార్య, ఆమె గురించి ప్రస్తావిస్తూ అల్లాహ్ ఏం చెప్పాడు?

فِي جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍ
[ఫీ జీదిహా హబ్లుమ్ మిమ్ మసద్]
ఆమె మెడలో (ఖర్జూర ఆకుతో) గట్టిగా పేనిన ఒక త్రాడు ఉంటుంది (111:5)

మరియు సూరహ్ హాక్కా లో ఇంతకుముందే మీరు విని ఉన్నారు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, ఎడమ చేతిలో ఎవరైతే తమ కర్మపత్రాన్ని తీసుకుంటారో వారు ఎలా బాధపడుతూ అరుస్తారో, ఆ తర్వాత వారిని ఎలా బంధించడం జరుగుతుందో తెలియజేస్తూ:

ثُمَّ فِي سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَاسْلُكُوهُ
[సుమ్మ ఫీ సిల్సిలతిన్ జర్ఉహా సబ్ ఊన జిరాఅన్ ఫస్లుకూహ్]
మరి వాణ్ణి డెభ్భై మూరల పొడవు గల సంకెళ్ళతో బిగించి కట్టండి. (69:32)

ఇంకా మహాశయులారా, మరో రకమైన శిక్ష అక్కడ ఏం జరుగుతుంది అంటే, పెద్ద పెద్ద ఇనుప గదలతో, ఇనుప రాళ్లతో, ఇనుప సలాకులతో నరకవాసులను కొట్టడం జరుగుతుంది.

وَلَهُم مَّقَامِعُ مِنْ حَدِيدٍ
[వలహుమ్ మకామిఉ మిన్ హదీద్]
ఇంకా, వారి కొరకు (వారిని చితక బాదటానికి) ఇనుప సుత్తులు కూడా ఉన్నాయి. (సూరహ్ హజ్ 22:21)

మరియు అక్కడి శిక్షల్లో ఒక రకమైన శిక్ష, నరకవాసుల తలల మీదుగా బాగా వేడిలో, మితిమీరి వేడిగల నీళ్లు వారిపై పోయడం జరుగుతుంది. ఆ నీళ్లు వారి శరీరంపై పడిన వెంటనే తోలు అంతా కాలిపోతూ కాలిపోతూ లోపల కడుపులోని ప్రేగులు కూడా ముక్కలు ముక్కలు అవుతూ ఉంటాయి.

ఇంకా నరకంలో ఒక రకమైన శిక్ష మరీ ఘోరంగా ఉంది. చూడడానికి అంతం సమాప్తం అని ఏర్పడుతుంది కానీ అలా జరగదు. ఒక హదీసులో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: ఎవరైతే మదీనా వాసుల పట్ల చెడుగా చూస్తాడో, చెడుగా ప్రవర్తిస్తాడో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నరకంలో అతన్ని ఎలాంటి శిక్షకు గురి చేస్తాడు అంటే, ఉప్పు నీళ్లలో ఎలా కరిగిపోతుందో అతడు అలా నరకంలో కరిగిపోతా ఉంటాడు. ఇలాంటి శిక్ష అతనికి జరుగుతూనే ఉంటుంది.

ఇంకా మహాశయులారా, అక్కడి శిక్షల్లో మరొక ఘోరమైన శిక్ష ఏమిటంటే, ఎప్పుడెప్పుడు శిక్షించబడి తోలు కాలిపోతూ ఉంటుందో, అప్పుడప్పుడు మరొక కొత్త తోలు వారిపై వేయడం జరుగుతుంది. వారికి కొత్త తోలు పుట్టుకొస్తుంది. మళ్లీ శిక్షించడం జరుగుతుంది. తోలు కాలిపోతుంది, మళ్లీ కొత్తగా వారికి తోలు వస్తూ ఉంటుంది.

كُلَّمَا نَضِجَتْ جُلُودُهُم بَدَّلْنَاهُمْ جُلُودًا غَيْرَهَا لِيَذُوقُوا الْعَذَابَ
[కుల్లమా నజిజత్ జులూదుహుమ్ బద్దల్నాహుమ్ జులూదన్ గైరహా లియజూకుల్ అజాబ్]
వారి చర్మాలు బాగా ఉడికిపోయినప్పుడల్లా, వాటికి బదులుగా, వారు శిక్ష యొక్క రుచి చూసేందుకు వేరే చర్మాలను సృష్టిస్తాము (4:56)

మరి ఈ రోజుల్లో సైంటిఫిక్ పరంగా కూడా, మనిషి యొక్క తోలులో కొన్ని కణాలు ఉన్నాయి, అవి మనిషికి కలిగే బాధను గ్రహించగలుగుతాయి. ఎప్పుడైతే అవి కాలిపోతూ ఉంటాయో, వాటిని మార్చడం జరుగుతూ ఉంటుంది.

ఇంకా సోదరులారా, నరకంలో వారిని ఎలా పడవేయడం జరుగుతుందో దాని ప్రస్తావన కూడా వచ్చి ఉంది మహాశయులారా.

తల క్రిందులుగా చేసి అవమానకరంగా వారిని నరకంలో వేయడం జరుగుతుంది.

يَوْمَ يُسْحَبُونَ فِي النَّارِ عَلَىٰ وُجُوهِهِمْ
[యౌమ యుస్ హబూన ఫిన్నారి అలా వుజూహిహిమ్]
వారిని ముఖం క్రిందులుగా చేసి నరకం వైపునకు లాగుతూ ఉండడం జరుగుతుంది. (54:48)

మరి కొందరికి శిక్ష అక్కడ ఎలా ఉంటుంది? బహుశా కొన్ని పల్లెటూర్లలో మనం చూసి ఉంటాము, నూనె తీయడానికి ఎద్దు గాని, గాడిద గాని గుండ్రంగా త్రిప్పుతూ ఉండడం జరుగుతుంది. అటు ఇటు చూసి అది తన పని వదలకూడదు అని కొన్ని సందర్భాల్లో దాని ముఖం మొత్తం కప్పి ఉంచడం కూడా జరుగుతుంది. కేవలం ఒక విషయం అర్థం కావడానికి మన గ్రామాల్లో జరిగే ఒక విషయం ఉదాహరణగా చెప్పాను. కానీ నవూజుబిల్లాహ్, నరకంలో ఉండే నరక శిక్షల యొక్క పోలిక కాదు ఇది. విషయం ఏంటంటే, నరకంలో కొందరికి శిక్ష ఈ విధంగా జరుగుతుంది.

ప్రళయ దినాన ఒక వ్యక్తిని తీసుకొచ్చి నరకంలో వేయడం జరుగుతుంది. నరకంలో అతను పడిన తర్వాత అతని పేగులన్నీ బయటికి వచ్చి ఉంటాయి. కడుపు చాలా పెద్దగా అయిపోతుంది. అతడు లేచి నిలబడాలి అనుకుంటాడు, కానీ నిలబడలేడు, తిరుగుతాడు. ఇలా ఆ గాడిద లేదా ఎద్దు తిరిగే విధంగా అలాగే అతనికి శిక్ష ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు అతన్ని చూసి, “నీవు మంచిని గురించి ఆదేశిస్తూ ఉండేవాడివి కదా! చెడు నుండి ఆపుతూ ఉండేవాడివి కదా! నీవు ఇలాంటి శిక్షకు ఎందుకు గురయ్యావు?” అని అంటే, అతను అంటాడు:

كُنتُ آمُرُكُم بِالْمَعْرُوفِ وَلَا آتِيهِ وَأَنْهَاكُمْ عَنِ الْمُنكَرِ وَآتِيهِ
[కున్తు ఆమురుకుమ్ బిల్ మఅరూఫి వలా ఆతీహి వ అన్హాకుమ్ అనిల్ మున్కరి వ ఆతీహ్]
“ఏ మంచిని గురించి మీకు ఆదేశిస్తూ ఉండేవాడినో, అది నేను పాటించేవాడిని కాదు. ఏ చెడు నుండి మిమ్మల్ని వారిస్తూ ఉండేవాడినో, ఆ చెడు నేను చేసేవాడిని.”

అందుకే ఇలాంటి శిక్ష జరుగుతుంది అని అంటాడు. అల్లాహ్ ఈ విధంగా మనకు చెప్పే బోధనలను స్వయంగా ఆచరించే భాగ్యం కలిగించు గాక. ఏ విషయాల నుండి మనం వారిస్తున్నామో వాటి నుండి స్వయంగా మనం ముందు దూరంగా ఉండే అటువంటి భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

నరకంలోని శిక్షల్లో ఒక రకమైన శిక్ష ఏమిటంటే, ఆ శిక్షలను భరించలేక వారు పెడబొబ్బలు పెడతారు. ఏడుస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. కానీ ఎక్కడి నుండి ఏ సహాయం అందదు, ఎవరూ వారి యొక్క ఏడ్పుబొబ్బలను వినేవారు ఉండరు.

حَتَّىٰ إِذَا أَخَذْنَا مُتْرَفِيهِم بِالْعَذَابِ إِذَا هُمْ يَجْأَرُونَ
[హత్తా ఇజా అఖజ్ నా ముత్రఫీహిమ్ బిల్ అజాబి ఇజా హుమ్ యజ్ అరూర్]
ఆఖరికి మేము వారిలోని భోగలాలసులను శిక్షగా పట్టుకున్నప్పుడు, వారు ఆర్తనాదాలు చేయసాగారు.(23:64)

لَا تَجْأَرُوا الْيَوْمَ ۖ إِنَّكُم مِّنَّا لَا تُنصَرُونَ
[లా తజ్ అరుల్ యౌమ ఇన్నకుమ్ మిన్నా లా తున్సరూన్]
వారికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది: “మీరు ఈ రోజు ఎలాంటి సహాయానికై మీరు కేకలు వేయకండి, ఈ రోజు మా వైపు నుండి మీకు ఎలాంటి సహాయం అందదు.” (23:65)

నరకంలో ఒక రకమైన శిక్ష: మనిషి నరకాగ్నిలో ఉండి ఉండి, నీళ్లు త్రాగడానికి అని పక్కకు వస్తాడు, వేడి వేడి నీళ్లు, మితిమీరిన వేడి నీళ్లు!

يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ آنٍ
[యతూఫూన బైనహా వబైన హమీమిన్ ఆన్]
అటు అది త్రాగలేడు, ఇటు దీనిని భరించలేడు, ఈ విధంగా ఇటునుండి అటు, అటునుండి ఇటు తిరుగుతూనే ఉంటాడు. (55:44)

అంతేకాదు నరకంలో, నరకంలో ఇవ్వబడే శిక్షల్లో అక్కడ కూడా భయంకరమైన పాములు మరియు తేళ్లు ఉంటాయి. నరకవాసులకు అవి వాతలు పెడుతూ ఉంటాయి, కుడుతూ ఉంటాయి. ముస్నద్ అహ్మద్ మరియు సహీహ్ ఇబ్న్ హిబ్బాన్ లోని ఉల్లేఖనం, షేక్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహ్ అని ప్రస్తావించారు: నరకంలో పెద్ద పెద్ద పాములు ఉంటాయి. ఒక్కొక్క పాము “బుఖ్త్” ఒంటె (చాలా పెద్ద, ఎత్తుగా ఉండే ఒంటె) అలాంటి ఒంటెల మాదిరిగా పెద్ద పెద్ద పాములు ఉంటాయి.

ఒక్కసారి అది కాటు వేసిందంటే నలభై సంవత్సరాల వరకు దాని యొక్క బాధను మనిషి భరిస్తూనే ఉంటాడు అల్లాహు అక్బర్. మరియు నరకంలో సామానుతో ఎత్తుగా ఉన్నటువంటి కంచర గాడిద రూపంలో అంత పెద్ద పెద్ద తేళ్లు కూడా ఉంటాయి. ఆ తేళ్లు వాటి యొక్క విషం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒక్కసారి అవి కాటు వేస్తే దాని యొక్క విషం, దాని యొక్క బాధ నలభై సంవత్సరాల వరకు భరిస్తూ ఉండవలసి ఉంటుంది.

ఇంకా సోదరులారా, సోదరీమణులారా, నరకంలో ఇవ్వబడే శిక్షల్లో ఒక రకమైన శిక్ష, పెద్ద పెద్ద పర్వతాల మీద ఎక్కడానికి బలవంతం చేయబడుతుంది. ఇది కూడా ఒక రకమైన వారికి శిక్ష ఉంటుంది.

سَأُرْهِقُهُ صَعُودًا
[స ఉర్హికహు సఊదా]
దానిని వారు ఎక్కలేరు, పడుతూ ఉంటారు, మళ్లీ ఎక్కడం జరుగుతుంది. త్వరలోనే నేను వాణ్ణి కఠినమైన ఎత్తుకు ఎక్కిస్తాను. (74:17)

అల్లాహ్ ఆయత్లలో తిరస్కరించి, ఖురాన్ గ్రంథాన్ని “ఓ మనిషి లాంటి మాటలే కదా ఇందులో ఉన్నవి” అన్నటువంటి ఎగతాళి చేసే వారి గురించి ఇలాంటి శిక్షలు కూడా జరుగుతాయి.

నరకంలో ఇవ్వబడే శిక్షల్లో ఒక రకమైన శిక్ష: నరకంలో ఉన్న వ్యక్తి ఏ శ్వాస పీలుస్తాడో, మళ్లీ వదులుతాడో, పీల్చుకునే, వదులుకునే ప్రతి ఒక్క శ్వాసకు మహా భయంకరమైన ధ్వని, చప్పుడు అనేది ఉంటుంది.

فَأَمَّا الَّذِينَ شَقُوا فَفِي النَّارِ لَهُمْ فِيهَا زَفِيرٌ وَشَهِيقٌ
[ఫఅమ్మల్ లజీన షకూ ఫఫిన్నారి లహుమ్ ఫీహా జఫీరువ్ వషహీక్]
ఎవరైతే దౌర్భాగ్యులో వారు నరకాగ్నిలో ఉంటారు. వారు అందులో విలపిస్తూ, కేకలు వేస్తూ (భయంకరమైన శ్వాసలు తీస్తూ) ఉంటారు. (11:106)

అది ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఒక సందర్భంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: ఈ మస్జిద్ లో లక్ష, లక్షకు పైగా మంది ఉన్నారంటే, వీరి మధ్యలో కేవలం ఒకే ఒక వ్యక్తి నరకవాసుల్లోని వ్యక్తి ఉండి అతను శ్వాస తీసుకుంటే, అతని శ్వాస ఏదైతే అతను బయటికి వదిలాడో దానివల్ల ఈ లక్ష, లక్షకు పైగా ఉన్న వారందరూ కాలిపోతారు, చనిపోతారు. అల్లాహు అక్బర్.

నరక వాసులకు ఇవ్వబడే శిక్షల్లో ఒక రకమైన శిక్ష, వారి ముఖాన్ని మరీ అంధకారంగా చేసి భయంకరమైనవిగా కూడా చేయబడతాయి. ఒక హదీసులో ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క తండ్రి ఆజర్ విషయంలో ఇలాంటి ప్రస్తావన ఒక సహీహ్ హదీసులో వచ్చి ఉంది.

అయితే మహాశయులారా, ఇంతటి ఘోరమైన శిక్షలు వారు అనుభవిస్తున్నప్పుడు వారికి అక్కడ చావు వస్తుందనా? వారి యొక్క శిక్షల్లో ఏదైనా తగ్గింపు జరుగుతుంది అనా? వారికి ఏదైనా సహాయం దొరుకుతుందా? ఇవన్నీ ఏమాత్రం అవకాశం లేదు. ఇవన్నీ కూడా అసంభవం.

فَلَا يُخَفَّفُ عَنْهُمُ
[ఫలా యుఖఫ్ఫఫు అన్హుము]
వారి యొక్క శిక్షల్లో ఎలాంటి తగ్గింపు జరగదు, అని ఎన్నో సందర్భాల్లో ఖురాన్ లో చెప్పడం జరిగింది. మరియు మీకు ఎలాంటి సహాయం అందించేవాడు కూడా అక్కడ ఎవరూ ఉండడు.

మరియు వారికి చావు వస్తుందా?

لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ
[లా యమూతు ఫీహా వలా యహ్యా]
అక్కడ చావు రాదు, హాయిగా బ్రతికినట్లు కూడా ఉండదు. (87:13)

గమనించండి, ఇహలోకంలో ఎంత పెద్ద శిక్ష జరిగినా కనీసం చచ్చిపోదాము అని భావిస్తాడు, మనిషి చనిపోతాడు, ఆత్మహత్య చేసుకుంటాడు, ఏదో జరుగుద్ది, కానీ అక్కడ నరకంలో చావు కూడా రాదు. నరకవాసులు అందరూ నరకంలో, స్వర్గవాసులు అందరూ స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత, స్వయంగా చావును అల్లాహ్ త’ఆలా ఒక పొట్టేలు రూపంలో తీసుకొస్తాడు. వారందరూ దానిని గుర్తుపడతారు, ఇది చావు అని ఒప్పుకుంటారు. అల్లాహ్ త’ఆలా ఆ చావుకే చావు ఇచ్చేస్తాడు. ఇక ఆ తర్వాత ఎవరికీ ఏ చావు అనేది ఉండదు.

అయితే నరకం నుండి ఏదైనా పారిపోవడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? అది కూడా ఉండదు.

كُلَّمَا أَرَادُوا أَن يَخْرُجُوا مِنْهَا أُعِيدُوا فِيهَا
[కుల్లమా అరాదూ అయ్ యఖ్ రుజూ మిన్హా ఉఈదూ ఫీహా]
ఎప్పుడెప్పుడు వారు బయటికి వెళ్ళాలని అనుకుంటారో, ఏదైనా కొంచెం పైకి వస్తారో, కొంచెం బయటికి రావాలనుకుంటారో, వారిని తిరిగి అందులోనే వేయడం జరుగుతుంది. (32:20)

మరియు వారు నరకం నుండి బయటికి వెళ్లడానికి ఏ అవకాశమూ లేదు అని కూడా అల్లాహ్ స్పష్టంగా తెలియజేశాడు.

మహాశయులారా, సమయం సమాప్తం కానుంది, ఇక్కడ ఒక హదీస్ తప్పకుండా మీరు వినండి. వాటిపై శ్రద్ధ వహించండి. అవకాశం అల్లాహ్ ఏదైతే మనకు ఇచ్చాడో దానిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అల్లాహ్ ఈ భాగ్యం నాకు, మీకు మనందరికీ ప్రసాదించుగాక.

ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా ఒక వ్యక్తిని హాజరు పరుస్తాడు. అతనితో ప్రశ్నిస్తాడు:

أَلَمْ أَجْعَل لَّكَ سَمْعًا وَبَصَرًا وَمَالًا وَوَلَدًا
[అలమ్ అజ్ అల్ లక సమ్ అన్ వ బసరన్ వ మాలన్ వ వలదా]
“నేను నీకు చెవులు, కళ్లు, డబ్బు ధనం, సంతానం ఇవన్నీ ప్రసాదించలేదా?” ఆ మనిషి అంటాడు: “అవును ఓ అల్లాహ్! అన్నీ నీవే ప్రసాదించావు, ఇందులో ఏమాత్రం అనుమానం లేదు.”

وَسَخَّرْتُ لَكَ الْأَنْعَامَ وَالْحَرْثَ وَتَرَكْتُكَ تَرْأَسُ وَتَرْبَعُ
[వ సఖ్ఖర్తు లకల్ అన్ ఆమ వల్ హర్స వ తరకుక తర్ అసు వ తర్బఉ]
“నీకు పంటలు, పొలాలు, జంతువులు ఇంకా ఎన్నో రకాల వరాలు ప్రసాదించాను. వాటన్నిటిపై నీవు అధికారం కలిగి ఉన్నావు. వాటన్నిటితో ఎంజాయ్మెంట్ చేసుకుంటూ నీ జీవితం గడిపావు, అవునా?” అతను అంటాడు: “అవును ఓ అల్లాహ్!”

“అయితే ఈ రోజు వచ్చి నన్ను నీవు కలుసుకుంటావు అన్నటువంటి నమ్మకం నీకు ఉండెనా ఇహలోకంలో?” అని అడుగుతాడు.

అప్పుడు అతను అంటాడు: “లేదు ఓ అల్లాహ్! చనిపోయేది ఉంది, నీవు మళ్లీ నన్ను లేపుతావు, నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను అన్నటువంటి నమ్మకం నాకు లేకుండినది.”

అప్పుడు అంటాడు అల్లాహ్:

الْيَوْمَ أَنْسَاكَ كَمَا نَسِيتَنِي
[అల్యౌమ అన్సాక కమా నసీతనీ]
“ఇహలోకంలో నీవు నన్ను ఎలా మర్చిపోయావో, ఇక ఈ రోజు కూడా నేను నిన్ను మర్చిపోతాను.”

అంటే ఏమిటి భావం? అల్లాహ్ యొక్క కరుణాకటాక్షాల్లో స్వర్గం, అక్కడి యొక్క వరాలు ఏమీ కూడా అతనికి లభించవు, నరకంలోనే ఉండవలసి వస్తుంది.

గమనించారా సోదరులారా? ఇహలోకంలోని వరాలన్నీ కూడా మనకు ఎలా లాభాన్ని తీసుకొచ్చాయి? ఒకవేళ మనం అల్లాహ్ ను తిరస్కరిస్తే, అల్లాహ్ చెప్పినట్లుగా అల్లాహ్ యొక్క ఆదేశం మేరకు మన జీవితం గడపకుంటే. అందుగురించి అల్లాహ్ ను విశ్వసించి, ప్రవక్తల్ని విశ్వసించి, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బాటను అనుసరించి జీవితం గడిపే ప్రయత్నం చేస్తూ, పరలోక దినాన్ని విశ్వసించాలి.

అల్లాహ్ త’ఆలా మనందరికీ కూడా అన్ని రకాల నరక శిక్షల నుండి రక్షణ పొందే భాగ్యం కలిగించు గాక.

వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=46128

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

యూట్యూబ్ – ప్లే లిస్ట్ (మరణానంతర జీవితం)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3hWrEGNnzcmMZV3PtDByJH

అయ్యాముత్ తష్రీఖ్ (హజ్జ్ మాసంలోని తష్రీఖ్ దినాల) ఘనత

అయ్యాముత్ తష్రీఖ్ ఘనత
కూర్పు: ముహమ్మద్ నసీర్పద్దీన్ జామిఈ

[పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి]


అయ్యాముత్ తష్రీఖ్ అనగా ఇస్లామీయ క్యాలెండర్ లోని 12వ నెల అయిన జుల్ హిజ్జా యొక్క 11, 12 మరియు 13 తేదీలు. ఇవి ఖుర్బానీ, అల్లాహ్ స్మరణ, తక్బీరాత్ మరియు అల్లాహ్ అనుగ్రహాలపై కృతజ్ఞత తెలిపే రోజులు. ఈ రోజులకు ఇస్లాంలో గొప్ప మహిమ ఉంది.

అల్లాహు తఆలా ఇలా సెలవిచ్చాడు:

وَاذْكُرُوا اللَّهَ فِي أَيَّامٍ مَعْدُودَاتٍ
గణించదగిన ఆ దినాలలో (తష్రీఖ్ దినాలలో) అల్లాహ్ ను స్మరించండి (సూరహ్ అల్-బఖరా: 203).

ముఫస్సిరీన్లలో (ఖుర్ఆన్ వ్యాఖ్యానకర్తలలో) ముఖ్యంగా అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా మరియు జుమ్హూర్ ఉలమా అభిప్రాయం ప్రకారం “అయ్యామిన్ మఅదూదాత్” అనగా అయ్యామె తష్రీఖ్.

అల్లాహు తఆలా ఇలా సెలవిచ్చాడు:

لِيَشْهَدُوا مَنَافِعَ لَهُمْ وَيَذْكُرُوا اسْمَ اللَّهِ فِي أَيَّامٍ مَعْلُومَاتٍ
వారు తమ ప్రయోజనాలు పొందటానికి (హజ్ కు) రావాలి. ఆ నిర్ణీత దినాలలో అల్లాహ్ నామాన్ని స్మరించాలి. (సూరహ్ అల్-హజ్: 28).

అధిక ముఫస్సిరీన్ల ప్రకారం “అయ్యామిమ్ మఅలూమాత్” అంటే జుల్ హిజ్జా మొదటి పది రోజులు; “అయ్యామిమ్ మఅదూదాత్” అంటే అయ్యాముత్ తష్రీఖ్. ఇక్కడ ఖుర్బానీ ప్రస్తావన వచ్చింది గనక, ఈ ఖుర్బానీ ఎన్ని రోజులు చేయవచ్చు అన్నది కూడా స్పష్టంగా తెలుసుకుందాం.

అయితే పండుగ రోజు (10వ జిల్ హిజ్జా) మరియు ఆ తర్వాత మూడు రోజులు, మొత్తం నాలుగు రోజులు ఖుర్బానీ చేయవచ్చు. దీనికి మొదటి ఆధారం ప్రవక్తవారి ఈ హదీసు «كُلُّ أَيَّامِ التَّشْرِيقِ ذَبْحٌ» అయ్యాముత్ తష్రీఖ్ యొక్క అన్ని రోజులు జిబహ్ చేయవచ్చును అంటే ఖుర్బానీ ఇవ్వవచ్చును. (ముస్నద్ అహ్మద్ 1651, సహీహ్ 2476).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు:

«إِنَّ يَوْمَ عَرَفَةَ وَيَوْمَ النَّحْرِ وَأَيَّامَ التَّشْرِيقِ عِيدُنَا أَهْلَ الْإِسْلَامِ ، وَهِيَ أَيَّامُ أَكْلٍ وَشُرْبٍ»
నిశ్చయంగా అరఫా రోజు, నహ్ర ఖుర్బానీ రోజు మరియు అయ్యాముత్ తష్రీఖ్ ముస్లింల పండుగ రోజులు మరియు తినే త్రాగే రోజులు. (అబూ దావూద్ 2419. చివరి పదాలు ముస్లిం 1141లోనివి).

ఇమాం ఇబ్నె తైమియా, ఇమాం ఇబ్నె ఖయ్యిమ్, ఇమాం షౌకానీ, షేఖ్ బిన్ బాజ్ మరియు షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లాహ్ ఈ మాటనే బలపరిచారు, మరియు రాజిహ్ అని చెప్పారు. సూర బఖరలోని 203వ ఆయతు ద్వారా కూడా ఈ మాట గ్రహించడం జరిగినది. (వివరాలు ఆ ఆయతు వ్యాఖ్యానం మరియు హదీసుల్లో చూడవచ్చు).

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

أَيَّامُ التَّشْرِيقِ أَيَّامُ أَكْلٍ وَشُرْبٍ وَذِكْرِ اللَّهِ
అయ్యాముత్ తష్రీక్ అనేవి తినే, త్రాగే మరియు అల్లాహ్ స్మరణ చేసే రోజులు. (ముస్లిం: 1141).

ఈ హదీస్ స్పష్టంగా తెలియజేస్తుంది: ఈ రోజుల్లో అల్లాహ్ అనుగ్రహాలపై సంతోషం వ్యక్తం చేయడం షరియత్ లో సమ్మతం.

విశ్వాసులారా! లెక్కలేనన్ని సత్కార్యాలలో ఏదైనా సత్కార్యం గురించి అధికంగా చేయండి అని అల్లాహ్ చెప్పి ఉన్నాడా అంటే, అవును జిక్ర్ గురించి చెప్పి ఉన్నాడు. శ్రద్ధ వహించండి సురతుల్ జుముఅలోని ఈ ఆయత్:

﴿ وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَّعَلَّكُمْ تُفْلِحُونَ ﴾ [الجمعة ١٠]
ఎక్కువగా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి.

పైన ఉన్న ఆయతు అనువాదం ఇంతేనా, కాదు. అల్లాహ్ మరో శుభవార్త ఇచ్చాడు. అదే: మీరు సాఫల్యం పొందవచ్చు. అల్లాహు అక్బర్! మనం అల్లాహ్ ను ఎక్కువగా, అధికంగా స్మరిస్తూ ఉంటే సాఫల్యం లభించేది మనకే.

﴿ وَالذَّاكِرِينَ اللَّهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ أَعَدَّ اللَّهُ لَهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا ﴾
అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు – స్మరించే స్త్రీలు – వీరందరి కోసం అల్లాహ్ (విస్తృతమైన) మన్నింపును, గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు. (అహ్జాబ్ 33:35).

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఆదేశించారు:

لَا تَصُومُوا هَذِهِ الْأَيَّامَ
(అయ్యాముత్ తష్రీక్ లో) ఉపవాసం పాటించకండి. (సహీహ్ 3573).

అందువల్ల సాధారణ ముస్లింలకు 11, 12, 13 జుల్ హిజ్జా రోజుల్లో ఉపవాసం పాటించడం యోగ్యం కాదు. అయితే హజ్ తముత్తు లేదా ఖిరాన్ చేసిన హాజీలకు ఖుర్బానీ చేయలేని పరిస్థితిలో ఉపవాసం పాటించే అనుమతి ఉంది.

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

إِنَّ أَعْظَمَ الْأَيَّامِ عِنْدَ اللَّهِ يَوْمُ النَّحْرِ، ثُمَّ يَوْمُ الْقَرِّ
అల్లాహ్ వద్ద అత్యంత గొప్ప రోజు యౌమున్ నహర్ (10వ జుల్ హిజ్జా), తరువాత యౌముల్ ఖర్ర్ (11వ జుల్ హిజ్జా). (అబూ దావూద్: 1765.

ఇమామ్ అల్బానీ రహిమహుల్లాహ్ దీనిని సహీహ్ అన్నారు.) “యౌముల్ ఖర్ర్” అనగా అయ్యాముత్ తష్రీక్ మొదటి రోజు; ఈ రోజున హుజ్జాజ్ మినా లో నివసిస్తారు.

وَاذْكُرُوا اللَّهَ فِي أَيَّامٍ مَعْدُودَاتٍ
“గణించదగిన ఆ దినాలలో (తష్రీఖ్ దినాలలో) అల్లాహ్ ను స్మరించండి ” (సూరహ్ అల్-బఖరా: 203)

ఈ ఆయత్ ఆధారంగా సహాబాయె కిరామ్ రజియల్లాహు అన్హుమ్ అయ్యాముత్ తష్రీఖ్ రోజుల్లో గట్టిగా (బిగ్గరగా) తక్బీరాత్ పలికేవారు.

[1] హజ్రత్ ఇబ్ను ఉమర్ మరియు హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హుమా మార్కెట్ లోకి వెళ్లి తక్బీర్ పలికేవారు; వారిని విని ప్రజలు కూడా తక్బీర్లు పలికేవారు. (బుఖారీ, కితాబుల్ ఈదైన్, బాబ్ ఫజ్జుల్ అమల్ ఫీ అయ్యామిత్ తష్రీక్).

[2] హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు మినా లో తన గుడారంలో గట్టిగా తక్బీర్ పలికేవారు; అది మినాలోని మస్జిదె ఖైఫ్ లో ఉన్నవారికి వినబడేది, అప్పుడు వారు తక్బీర్ పలికేవారు. ఇలా మొత్తం మస్జిద్ తక్బీర్లతో మారుమ్రోగేది, తరువాత బజార్ల వరకు ఆ ధ్వని వినిపించేది. (బుఖారీ, కితాబుల్ ఈదైన్).

సహాబాయె కిరామ్ నుండి భిన్నమైన పదాలు మనకు లభించాయి. ప్రసిద్ధ పదాలు ఇవి:

الله أكبر الله أكبر لا إله إلا الله، والله أكبر الله أكبر ولله الحمد
(అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, వల్లాహు అక్బర్ , అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్ )

  1. అధికంగా జిక్ర్ చేయడం – తక్బీర్, తహ్లీల్, తహ్మీద్, తస్బీహ్, దురూద్ షరీఫ్.
  2. నమాజ్ ల తర్వాత తక్బీరాత్. (దీనినే తక్బీరె ముఖయ్యద్ అంటారు). ఉమ్మత్ యొక్క ఫుఖహా అభిప్రాయం ప్రకారం ఫర్జ్ నమాజ్ ల తరువాత తక్బీరాత్ పలకడం మష్రూ.
  3. ఖుర్బానీ మాంసం తినడం మరియు పంచడం.
  4. సంతోషం మరియు కృతజ్ఞత వ్యక్తం చేయడం.

ఈ రోజులు ఇబాదత్ తో పాటు ఆనందానికి కూడా సంబంధించినవి. ఇస్లాం సన్యాసాన్ని కాదు, షుక్ర్ మరియు జిక్ర్ తో కూడిన సమతుల్య జీవనాన్ని బోధిస్తుంది.

గౌరవనీయులైన ముస్లిములారా!

ఇమాం ఇబ్ను రజబ్ రహిమహుల్లాహ్ ఈ రోజుల గురించి తెలిపిన ఆణిముత్యాలు కొన్ని ఇలా ఉన్నాయి.

[1] అయ్యాముత్ తష్రీఖ్ లో విశ్వాసుల కొరకు శారీరక అనుగ్రహం మరియు మానసిక అనుగ్రహం రెండూ ఏకంగా లభిస్తాయి. శారీరక అనుగ్రహాలంటే తిను, త్రాగుట మరియు హృదయ అనుగ్రహాలంటే జిక్ర్ మరియు షుక్ర్.

فَأَيَّامُ التَّشْرِيقِ يَجْتَمِعُ فِيهَا لِلْمُؤْمِنِينَ نَعِيمُ أَبْدَانِهِمْ بِالْأَكْلِ وَالشُّرْبِ، وَنَعِيمُ قُلُوبِهِمْ بِالذِّكْرِ وَالشُّكْرِ.

[2] పండుగ రోజులలో తినడం, త్రాగడం అనేవి కేవలం ఆనందం కోసం మాత్రమే కాదు; వాటివల్ల మనకు శక్తి వచ్చి, ఆ శక్తితో అల్లాహ్ ను స్మరించడం మరియు ఆయన ఆజ్ఞలను పాటించడం. ఇదే నిజమైన కృతజ్ఞత. కానీ ఎవరు ఆ వరాలను పాపాలకు ఉపయోగిస్తారో, వారు అల్లాహ్ ఇచ్చిన అనుగ్రహం పట్ల కృతఘ్నత చూపినవారవుతారు. అలాంటి వారు ఆ అనుగ్రహాన్ని కోల్పోయే పరిస్థితికి చేరుకుంటారు.

أَنَّ الْأَكْلَ فِي أَيَّامِ الْأَعْيَادِ وَالشُّرْبِ إِنَّمَا يُسْتَعَانُ بِهِ عَلَى ذِكْرِ اللَّهِ تَعَالَى وَطَاعَتِهِ … فَمَنِ اسْتَعَانَ بِنِعَمِ اللَّهِ عَلَى مَعَاصِيهِ فَقَدْ كَفَرَ نِعْمَةَ اللَّهِ وَبَدَّلَهَا كُفْرًا، وَهُوَ جَدِيرٌ أَنْ تُسْلَبَ مِنْهُ

[3] మరో చోట చెప్పారు: ఈ రోజుల్లో మనం ఏ జంతువులను ఖుర్బానీ చేస్తామో అవి స్వయంగా అల్లాహ్ ను ఆరాధిస్తాయి, ఆయనకు విధేయులుగా ఉంటాయి. అయితే వాటి మాంసం తినడం ద్వారా మనలో విశ్వాసం పెరిగి, అల్లాహ్ ఆరాధన మరింత ఎక్కువగా చేసే బుద్ధి, ఎల్లవేళల్లో ఆయనకు విధేయులుగా ఉండే బుద్ధి కలగాలి. (ఇక్కడ అరబీ ఇవ్వలేకపోయాము మరీ సంక్షిప్తంగా చేసి అనువదించాము గనక).

[4] ఈ లోక జీవితం అంతా హజ్ యాత్ర రోజుల్లాంటిదే ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మోమిన్ (విశ్వాసి) అల్లాహ్ నిషేధించిన కోరికలు, పాపాల నుండి దూరంగా ఉండాలి; ఇది ఇహ్రామ్ లో ఉన్న హజ్ యాత్రికుడిలా ఉంటుంది.

ఎవరు తమ జీవిత ప్రయాణంలో సహనంతో ఉండి, తమ కోరికలను అదుపులో పెట్టుకుంటారో, వారు జీవిత యాత్ర ముగిసినప్పుడు తమ ఆశల గమ్యాన్ని చేరుకుంటారు. అప్పుడు వారు తమ బాధ్యతను పూర్తి చేసి, అల్లాహ్ కు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినవారవుతారు. ఆ తర్వాత వారి రోజులు అన్నీ మినా రోజుల్లా మారిపోతాయి — ఆనందం, తినడం, త్రాగడం, మరియు అల్లాహ్ స్మరణతో నిండిన రోజులుగా.

كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا أَسْلَفْتُمْ فِي الْأَيَّامِ الْخَالِيَةِ
గత కాలంలో మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తినండి, త్రాగండి” (అని వారితో అనబడుతుంది)“. (అల్ హాఖ్ఖహ్ 69:24).

فَإِنَّ الدُّنْيَا كُلَّهَا أَيَّامُ سَفَرٍ كَأَيَّامِ الْحَجِّ، وَهُوَ زَمَانُ إِحْرَامِ الْمُؤْمِنِ عَمَّا حُرِّمَ عَلَيْهِ مِنَ الشَّهَوَاتِ، فَمَنْ صَبَرَ فِي مُدَّةِ سَفَرِهِ عَلَى إِحْرَامِهِ وَكَفَّ عَنِ الْهَوَى، فَإِذَا انْتَهَى سَفَرُ عُمْرِهِ وَوَصَلَ إِلَى مِنَى الْمُنَى، فَقَدْ قَضَى تَفَثَهُ وَوَفَّى نَذْرَهُ، فَصَارَتْ أَيَّامُهُ كُلَّهَا كَأَيَّامِ مِنًى، أَيَّامَ أَكْلٍ وَشُرْبٍ وَذِكْرِ اللَّهِ عَزَّ وَجَلَّ. كما قال تعالى: كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا أَسْلَفْتُمْ فِي الْأَيَّامِ الْخَالِيَةِ

  1. అల్లాహ్ జిక్ర్ — మన నాలుక ఎల్లప్పుడూ తక్బీర్లతో తడిసి ఉండాలి.
  2. అల్లాహ్ అనుగ్రహాలపై షుక్ర్ — తినే, త్రాగే ప్రతి విషయంలో అల్లాహ్ ను స్మరించాలి.
  3. ఉమ్మత్ ఐక్యత — ప్రపంచవ్యాప్తంగా ముస్లింలంతా ఒకే జిక్ర్ మరియు ఒకే నినాదంతో ఏకమవ్వాలి.

سبحان ربك رب العزة عما يصفون وسالم على المرسلين والحمد لله رب العالمين

బిదత్ వర్గాలు: జమాఅత్ అల్-ఇఖ్వాన్ అల్-ముస్లిమూన్ (Muslim Brotherhood) గురించి పది అంశాలు – షేక్ అహ్మద్ బిన్ యహ్యా అన్-నజ్మీ

ఇఖ్వాన్ అల్-ముస్లిమూన్ నిర్వచనం:

వీరు హసన్ అల్-బన్నా అనుచరులు. వారి విధానం (మన్హజ్) గురించి గమనించవలసిన అనేక అంశాలు ఉన్నాయి, వాటిలో అతి ముఖ్యమైనవి ఈ క్రిందివి:

[1] ఇస్లాంలో అత్యంత ముఖ్యమైన విషయమైన తౌహీద్ అల్-ఇబాదహ్ [1] కు వీరు ప్రాముఖ్యత ఇవ్వరు. ఇది లేకుండా ఏ వ్యక్తి ఇస్లాం కూడా చెల్లుబాటు కాదు.

[2] ప్రజలు పెద్ద షిర్క్ (బహుదేవతారాధన) చేస్తున్నప్పుడు, అల్లాహ్‌ను కాకుండా ఇతరులను ప్రార్థిస్తున్నప్పుడు, సమాధుల చుట్టూ తవాఫ్ (ప్రదక్షిణలు) చేస్తున్నప్పుడు, సమాధులలో ఉన్న మృతులకు మొక్కులు చెల్లిస్తున్నప్పుడు మరియు వారి పేర్లతో బలులు ఇస్తున్నప్పుడు వారు మౌనంగా ఉండి ఆమోదిస్తారు.

[3] ఈ విధాన స్థాపకుడు ఒక సూఫీ. అతనికి సూఫీయిజంతో ఎంత సంబంధం ఉందంటే, అతను అబ్దుల్-వహ్హాబ్ అల్-ఖుసాఫీకి, అతని ఖుసాఫీ షాద్-లీ తరీకా (మార్గం) అనుసరించడానికి బైఅత్ (విధేయత ప్రమాణం) చేశాడు.

[4] వారిలో బిదఅత్‌లు (నూతన ఆచారాలు) ఉండటం మరియు వాటి ద్వారా అల్లాహ్‌ను ఆరాధించడం జరుగుతుంది – ఎంతవరకు అంటే, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ జిక్ర్ (స్మరణ) సభలకు హాజరవుతారని మరియు వారు గతంలో చేసిన పాపాలను ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) క్షమిస్తారని ఈ విధాన స్థాపకుడు అంగీకరించాడు. ఇది అతని ఈ మాటల్లో కనిపిస్తుంది:

“లోకాలకు ఏ కాంతితో అయితే ఆయన కనిపించాడో ఆ వ్యక్తిని (ప్రవక్తను) అల్లాహ్ ఆశీర్వదించుగాక,
ఆయన సూర్యచంద్రులను మించిపోయాడు.
ఈ హబీబ్ (అనగా ముహమ్మద్) తన ప్రియమైన వారితో సమావేశమయ్యాడు.
మరియు వారు గతంలో చేసిన పాపాలన్నింటినీ క్షమించాడు.”

[5] వారు ఖిలాఫత్ (ఇస్లామిక్ పాలన) స్థాపనకు పిలుపునిస్తారు మరియు ఇది ఒక బిదఅత్ (నూతన కల్పన). ఎందుకంటే ప్రవక్తలు మరియు వారి అనుచరులకు తౌహీద్ (ఏకదైవారాధన) వైపు పిలవడం మినహా మరే బాధ్యత అప్పగించబడలేదు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: “మరియు నిశ్చయంగా మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను పంపాము, (తన ప్రజలతో ఇలా చెప్పమని): ‘అల్లాహ్‌ను ఆరాధించండి మరియు తాగూత్ (మిథ్యా దైవాల)కు దూరంగా ఉండండి.’” [సూరా అన్-నహ్ల్: 36]

[6] వారికి వలా మరియు బరా (విధేయత మరియు నిరాకరణ) లేకపోవడం లేదా అది చాలా బలహీనంగా ఉండటం జరుగుతుంది. సున్నీలు మరియు షియాల మధ్య సామీప్యాన్ని తీసుకురావాలన్న వారి పిలుపులో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మరియు వారి స్థాపకుడు ఇలా చెప్పినట్లు ఉటంకించబడింది: “మనం అంగీకరించే విషయాలలో ఒకరికొకరు సహకరించుకుంటాము మరియు మనం విభేదించే విషయాలలో ఒకరినొకరు క్షమించుకుంటాము.”

[7] వారు తౌహీద్ ప్రజలను మరియు సలఫీ మార్గానికి కట్టుబడి ఉన్నవారిని ద్వేషిస్తారు మరియు అసహ్యించుకుంటారు. సౌదీ రాజ్యం గురించి వారు మాట్లాడే మాటల్లో ఇది స్పష్టమవుతుంది. ఆ రాజ్యం తౌహీద్ పునాదిగా స్థాపించబడింది మరియు దాని పాఠశాలలు, విద్యాసంస్థలు మరియు విశ్వవిద్యాలయాలలో తౌహీద్‌ను బోధిస్తుంది. అంతేకాకుండా, జమీల్ అర్-రహ్మాన్ అల్-అఫ్ఘానీ కేవలం తౌహీద్ వైపు పిలిచినందుకు, తౌహీద్ బోధించే పాఠశాలలను కలిగి ఉన్నందుకే అతన్ని వారు చంపడంలో కూడా ఇది స్పష్టమైంది.

[8] వారు నాయకుల (పాలకుల) తప్పులను వెతుకుతారు మరియు వారి లోపాలను – అవి నిజమైనా లేదా అబద్ధమైనా – బహిర్గతం చేస్తారు. యువత దృష్టిలో నాయకులను అసహ్యులుగా చూపించడానికి మరియు వారి పట్ల యువత హృదయాల్లో ద్వేషాన్ని నింపడానికి వారు వీటిని వ్యాప్తి చేస్తారు.

[9] వారు తమను తాము ఆపాదించుకునే పార్టీ పట్ల హేయమైన పక్షపాత వైఖరిని కలిగి ఉంటారు. కాబట్టి వారు ఈ పార్టీ ఆధారంగానే స్నేహాన్ని కనబరుస్తారు మరియు ఈ పార్టీ ఆధారంగానే శత్రుత్వాన్ని ప్రదర్శిస్తారు.

[10] స్థాపకుడు నిర్దేశించిన పది షరతుల ప్రకారం ఇఖ్వానీ మన్హజ్ (విధానం) కోసం పని చేయడానికి వారు తమ విధేయతా ప్రమాణాన్ని (బైఅత్) ఇస్తారు. ఇంకా ఆందోళన కలిగించే ఇతర విషయాలు కూడా ఉన్నాయి, బహుశా వాటిని తర్వాత సమయంలో చర్చించవచ్చు.

[1] అనువాదకుని గమనిక: ఇది అల్లాహ్‌కు చేసే ఆరాధనలో ఆయన ఏకత్వానికి (ఒక్కడే అనడానికి) సంబంధించిన తౌహీద్ వర్గం. అనగా, మనం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధిస్తాము, మరెవరినీ ఆరాధించము అని దీని అర్థం.

Translated from English:
https://abdurrahman.org/2016/05/27/ten-points-about-jamaaat-ul-ikhwaan-al-muslimoon/

Posted from al-ibaanah eBook: Modern Day Deviant Groups – Shaikh Ahmad bin Yahyaa An-Najmee

ఈ వ్యాసంలో రచయిత, హసన్ అల్-బన్నా స్థాపించిన ‘ఇఖ్వాన్ అల్-ముస్లిమూన్’ (ముస్లిం బ్రదర్‌హుడ్) వర్గం యొక్క విధానంలోని (మన్హజ్ లోని) ప్రధాన లోపాలను విమర్శిస్తూ పది ముఖ్యమైన అంశాలను వివరించారు. వాటి సారాంశం క్రింది విధంగా ఉంది:

తౌహీద్ పట్ల నిర్లక్ష్యం & షిర్క్‌ను సహించడం: ఇస్లాంలో అత్యంత ముఖ్యమైన ‘తౌహీద్ అల్-ఇబాదహ్’ (కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించడం)కు వీరు ప్రాముఖ్యత ఇవ్వరు. ప్రజలు సమాధులను పూజించడం, మృతులను ప్రార్థించడం వంటి మహా షిర్క్ (బహుదేవతారాధన) చేస్తున్నా మౌనంగా ఆమోదిస్తారు.

సూఫీ ప్రభావం మరియు బిదఅత్ (నూతన ఆచారాలు): ఈ వర్గ స్థాపకుడికి సూఫీలతో సంబంధాలు ఉన్నాయి. వీరు తమ జిక్ర్ సభలకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా హాజరై తమ పాపాలను క్షమిస్తారని నమ్మడం వంటి తీవ్రమైన నూతన కల్పనలకు (బిదఅత్ లకు) పాల్పడతారు.

ఖిలాఫత్ స్థాపన అనే రాజకీయ లక్ష్యం: ప్రవక్తలు ప్రజలను కేవలం తౌహీద్ వైపు మాత్రమే పిలిచారు, కానీ వీరు మాత్రం రాజకీయ అధికారం (ఖిలాఫత్) కోసం పనిచేస్తారు. రచయిత దీనిని ఒక బిదఅత్‌గా పేర్కొన్నారు.

‘వలా మరియు బరా’ లోపం: ఇస్లామిక్ సిద్ధాంతమైన ‘వలా మరియు బరా’ (సత్యం పట్ల విధేయత, అసత్యం పట్ల నిరాకరణ) వీరికి లేదు. మౌలిక సిద్ధాంతాలలో తేడాలున్నా సున్నీలు మరియు షియాలను ఏకం చేయడానికి వీరు ప్రయత్నిస్తారు.

తౌహీద్ అనుచరుల పట్ల ద్వేషం (సలఫీ మన్హజ్ వ్యతిరేకత): సలఫీ మార్గంలో నడిచేవారిని, తౌహీద్‌ను బోధించేవారిని వీరు తీవ్రంగా ద్వేషిస్తారు. తౌహీద్‌ను ప్రచారం చేస్తున్నాడన్న ఒకే ఒక కారణంతో జమీల్ అర్-రహ్మాన్‌ను చంపడం మరియు సౌదీ రాజ్యం పట్ల వారికున్న వ్యతిరేకత దీనికి ఉదాహరణలు.

పాలకులపై తిరుగుబాటు ధోరణి: ముస్లిం పాలకుల తప్పులను వెతికి పట్టుకుని, వాటిని యువతలో ప్రచారం చేసి, పాలకులపై యువత హృదయాల్లో ద్వేషాన్ని మరియు విరోధాన్ని నింపుతారు.

గుడ్డి పక్షపాతం మరియు బైఅత్ (ప్రమాణం): ఇస్లాం కంటే తమ పార్టీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తమ పార్టీ ఆధారంగానే ఇతరులతో స్నేహం లేదా శత్రుత్వం నెరపుతారు. తమ ఇఖ్వానీ మన్హజ్ కోసం ప్రత్యేకంగా విధేయతా ప్రమాణం (బైఅత్) చేయించుకుంటారు.

ముగింపు: స్థూలంగా చెప్పాలంటే, ‘ఇఖ్వాన్ అల్-ముస్లిమూన్’ వర్గం ఇస్లాం యొక్క మూల సిద్ధాంతాలైన తౌహీద్ మరియు సున్నత్‌లకు బదులుగా రాజకీయ లక్ష్యాలకు, పార్టీ పక్షపాతానికి, మరియు బిదఅత్‌లకు ప్రాధాన్యత ఇస్తుందని షేక్ అహ్మద్ బిన్ యహ్యా అన్-నజ్మీ ఈ వ్యాసంలో స్పష్టం చేశారు.

అరఫా దినం – షేక్ అబ్దుర్రజ్జాఖ్ అల్-బద్ర్

The Day of ‘Arafah – by Shaykh ‘Abdurrazzāq al Badr [Video|Ar-En Subtitles]
https://youtu.be/b_laOsp-N6Y [56 min]

గౌరవనీయ సోదరులారా, అరఫా దినం చాలా గొప్ప దినం. దానికి ఇవ్వాల్సిన సరైన ప్రాముఖ్యతను మనం ఇవ్వాలి, దాని స్థాయిని మనం తెలుసుకోవాలి. దాని స్థానం మరియు ప్రాధాన్యత పట్ల మనం స్పృహతో ఉండాలి. తద్వారా దాని అపారమైన ప్రాముఖ్యతను, ఉన్నత స్థాయిని అలాగే దాని గొప్ప అంతస్తును స్పష్టంగా అర్థం చేసుకుని మనం ఆ రోజులోకి ప్రవేశించగలము. ఇది మరే ఇతర దినం లాంటిది కాదు, ప్రత్యేకంగా అరఫాలో నిలబడే భాగ్యాన్ని అల్లాహ్ ఎవరికైతే ప్రసాదించాడో వారికి ఇది మరింత ప్రత్యేకం, అయితే ఈపుణ్యం కేవలం వారికి మాత్రమే పరిమితం కాదు.

ఎందుకంటే, మీ అందరికీ తెలిసినట్లుగా, అరఫా రోజున ఉపవాసం ఉండటం గురించి ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “గత సంవత్సరం మరియు రాబోయే సంవత్సరం పాపాలను అల్లాహ్ క్షమిస్తాడని నేను ఆశిస్తున్నాను.” ఇది సాధారణ ముస్లింలకు వర్తిస్తుంది. హజ్ యాత్రికుల (హాజీల) విషయానికొస్తే, వారు అరఫా రోజున ఉపవాసం ఉండక పోవడమే వారికి ఉత్తమం. ప్రవక్త (సల్లల్లాహు అలైహివసల్లం)ను ఆదర్శంగా తీసుకుని, ఆ గొప్ప మరియు పవిత్రమైన రోజున అల్లాహ్ స్మరణలో (జిక్ర్), దుఆలు చేయడంలో మరియు అల్లాహ్ ధ్యానంలో గడపడానికి వారు తమను తాము, తమ శరీరాలను బలోపేతం చేసుకోవాలి. ఉమ్ముల్ ఫజ్ల్ బింత్ అల్-హారిస్(రజియల్లాహు అన్హా) ఉల్లేఖించిన హదీసు సహీహైన్ (బుఖారీ, ముస్లిం)లో ఉంది, ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపవాసం ఉన్నారా లేదా అనే విషయమై కొందరు ఆమె దగ్గర చర్చిస్తున్నారు, అది అరఫా రోజు. కాబట్టి, ఆమె ఒక కప్పు పాలు తీసుకుని ప్రవక్తకు అందించగా, ఆయన దానిని త్రాగారు. ‘మీరు చూస్తున్నదే సమాధానం’ అని ఆమె చెప్పినట్లుగా అది ఉంది. ప్రవక్త దానిని త్రాగారు, కాబట్టి ఆయన ఉపవాసం లేరని తెలిసింది. కాబట్టి, అరఫా రోజున హాజీలు ఉపవాసం ఉండక పోవడమే సున్నత్. హాజీలు కాని ఇతరుల విషయానికొస్తే, అరఫా రోజున ఉపవాసం ఉండటం అనేది ఐచ్ఛిక (నఫిల్) ఉపవాసాలలో అత్యుత్తమమైనది. నిశ్చయంగా, ప్రవక్త ఇలా అన్నారు: “గత సంవత్సరం మరియు రాబోయే సంవత్సరం పాపాలను అల్లాహ్ క్షమిస్తాడని నేనుఆశిస్తున్నాను.”

అలీ (రదియల్లాహు అన్హు) హితబోధ : ధర్మ జ్ఞానం యొక్క విశిష్టత

అల్-ఇస్తిఖామహ్ మ్యాగజైన్, సంచిక నం.6 – జుల్-ఖైదా 1417 హిజ్రీ / మార్చి 1997
మూలం: https://abdurrahman.org/2014/01/15/advice-of-alee/

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కుమైల్ ఇబ్న్ జియాద్ కు చేసిన ఈ హితబోధలో జ్ఞానం (ఇల్మ్) యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను వివరించారు. ఆయన మనుషులను మూడు రకాలుగా వర్గీకరించారు: సత్యమార్గాన్ని చూపే నిజమైన పండితులు, జ్ఞానాన్ని అభ్యసించేవారు, మరియు సరైన అవగాహన లేకుండా ఇతరులను గుడ్డిగా అనుసరించే సామాన్యులు. సంపదను మనమే రక్షించుకోవాలని, ఖర్చు చేస్తే అది తగ్గిపోతుందని, కానీ జ్ఞానం మనల్ని రక్షిస్తుందని, ఆచరించిన కొద్దీ అది పెరుగుతుందని తెలుపుతూ సంపద కంటే జ్ఞానమే అత్యుత్తమమైనదని ఆయన నొక్కి చెప్పారు. ధర్మాన్ని ప్రాపంచిక ప్రయోజనాల కోసం వాడుకునే వారి గురించి హెచ్చరిస్తూనే, అల్లాహ్ యొక్క సత్య మార్గాన్ని మరియు ఆయన ఆధారాలను కాపాడే అత్యంత విలువైన పండితులు భూమిపై ఎల్లప్పుడూ కొద్దిమందైనా ఉంటారని, వారే ఈ లోకంలో అల్లాహ్ యొక్క రాయబారులని ఆయన స్పష్టం చేశారు.

కుమైల్ ఇబ్న్ జియాద్ ఇలా అన్నారు: ‘అలీ ఇబ్న్ అబీ తాలిబ్ నా చేయి పట్టుకుని నన్ను ఎడారి వైపు తీసుకువెళ్ళారు. మేము అక్కడికి చేరుకోగానే, ఆయన కూర్చుని, ఒక దీర్ఘశ్వాస తీసుకుని ఇలా అన్నారు:

ఓ కుమైల్ ఇబ్న్ జియాద్! హృదయాలు పాత్రల లాంటివి. వాటిలో ఏది ఉత్తమంగా భద్రపరుస్తుందో అదే అత్యుత్తమమైనది. కాబట్టి నేను నీకు చెబుతున్నది జ్ఞాపకం పెట్టుకో.

ప్రజలు మూడు రకాలు: రబ్బానీ[1] అయిన పండితుడు (ఆలిమ్), మోక్ష మార్గంలో జ్ఞానాన్ని అభ్యసించేవాడు, మరియు పిలిచే ప్రతి ఒక్కరినీ గుడ్డిగా అనుసరించే గందరగోళానికి గురైన సామాన్య జనం. వీరు వీచే ప్రతి గాలికి వంగిపోతారు, వీరు జ్ఞానపు కాంతితో ప్రకాశించరు మరియు ఏ విధమైన దృఢమైన పునాది (ఆధారం) కలిగి ఉండరు.

సంపద కంటే జ్ఞానం అత్యుత్తమమైనది. జ్ఞానం నిన్ను రక్షిస్తుంది, కానీ సంపదను నువ్వే రక్షించుకోవాలి. జ్ఞానానికి జకాత్ ‘ఆచరణ’, అయితే ఖర్చు చేయడం వల్ల సంపద తగ్గిపోతుంది. పండితుడిని ప్రేమించడం ధర్మంలో (దీన్‌లో) ఒక భాగం. జ్ఞానం పండితునికి అతని జీవితకాలంలో విధేయతను తెచ్చిపెడుతుంది మరియు మరణం తర్వాత అతనికి సత్కీర్తిని కలిగిస్తుంది, కానీ సంపద వల్ల కలిగే ప్రయోజనం అది నశించగానే ఆగిపోతుంది. సంపదను కూడబెట్టే వారు బ్రతికి ఉన్నప్పటికీ చనిపోయినవారితో సమానం, కానీ కాలం ఉన్నంత కాలం పండితులు సజీవంగానే ఉంటారు – వారి దేహాలు మాయమైనా, వారి ఆదర్శాలు (ఉదాహరణలు) హృదయాలలో నిలిచిపోతాయి.

ఇక్కడ, నిశ్చయంగా ఇక్కడే – (అని ఆయన తన ఛాతీ వైపు చూపించారు) – అపారమైన జ్ఞానం ఉంది, దీనిని మోయగలిగే వారు (వారసులు) నాకు దొరికితే ఎంత బాగుండు! కానీ దానికి బదులుగా తొందరగా గ్రహించే సామర్థ్యం ఉండి కూడా, నమ్మకానికి పాత్రులు కాని వారిని నేను చూశాను. వారు ప్రాపంచిక ప్రయోజనాల కోసం ధర్మాన్ని ఉపయోగిస్తారు. సత్యవంతులను అనుసరిస్తున్నప్పటికీ, దాన్ని స్వీకరించే విషయంలో వారికి ఎలాంటి అంతర్దృష్టి (సరియైన అవగాహన) లేదు. వీరు అల్లాహ్ గ్రంథానికి వ్యతిరేకంగా, అల్లాహ్ యొక్క ఆధారాలనే వాడుకోవాలని ప్రయత్నిస్తారు.

ఏదైనా సమస్యాత్మకమైన విషయం ఎదురైనప్పుడు సందేహం వారి హృదయాలను చీలుస్తుంది. వారు ఇటు గానీ అటు గానీ ఉండరు. సత్యం ఎక్కడ ఉందో వారికి తెలియదు, ఒకవేళ వారు తప్పు చేస్తే ఎందుకు చేశారో కూడా వారికి తెలియదు. వారు తమకు ఏమాత్రం వాస్తవం తెలియని ఏదో ఒకదానితో తీవ్రమైన వ్యామోహంలో పడతారు – అందువల్ల వారు ఇతరులకు ఒక ఫితనా (పరీక్ష/విపత్తు) గా మారతారు.

నిశ్చయంగా, అల్లాహ్ ఎవరికైతే ధర్మం (దీన్) పట్ల అవగాహన ప్రసాదిస్తాడో అతనే అత్యుత్తముడు. ఒక వ్యక్తికి తన ధర్మం గురించి తెలియకపోవడమే అతని అజ్ఞానానికి తగిన నిదర్శనం. అటువంటి వ్యక్తి ప్రాపంచిక సుఖాలకు తీవ్రంగా బానిస అవుతాడు, మనోవాంఛలను అనుసరించడానికి అలవాటు పడతాడు లేదా సంపదను పోగుచేయడం, కుప్పలు తెప్పలుగా కూడబెట్టడానికే అంకితమవుతాడు. అటువంటి వ్యక్తులు ధర్మం వైపు పిలిచే వారు కారు, వారు కేవలం మేత మేసే పశువుల లాంటి వారు. ఈ విధంగా జ్ఞానాన్ని మోసేవారు మరణించడంతో జ్ఞానం కూడా అంతరించిపోతుంది.

అవును! అల్లాహ్ యొక్క ఆధారాలు మరియు స్పష్టమైన సంకేతాలు అంతరించిపోకుండా ఉండటం కోసం, అల్లాహ్ కొరకు ఆధారాలతో నిలబడే వారు లేకుండా ఈ భూమి ఎప్పుడూ ఉండదు. వారు సంఖ్యలో చాలా తక్కువగా ఉంటారు, కానీ అల్లాహ్ దృష్టిలో అత్యంత విలువైనవారు. వారి ద్వారా, అల్లాహ్ తన ఆధారాలను వారి సమకాలీనులలో స్థిరపరుస్తాడు మరియు వాటిని వారిలాంటి వారి హృదయాలలో నాటుతాడు. వారితో, జ్ఞానం వాస్తవ పరిస్థితులను ఛేదిస్తుంది, తద్వారా సులభమైన జీవితానికి అలవాటు పడిన వారికి ఏది కష్టంగా అనిపిస్తుందో, దానిని వీరు తేలికగా భావిస్తారు; అజ్ఞానులను భయపెట్టే విషయాలతో వీరు ప్రశాంతంగా ఉంటారు. వారు ఈ లోకంలో తమ దేహాలతో జీవిస్తారు, కానీ వారి ఆత్మలు ఉన్నతమైన విషయాలకు అనుసంధానించబడి ఉంటాయి. వారు అల్లాహ్ భూమిపై ఆయన రాయబారులు మరియు ఆయన ధర్మం వైపు పిలిచేవారు (దాఈలు). ఆహా! వారిని చూడాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. నేను నా కోసం, నీ కోసం అల్లాహ్ క్షమాపణ కోరుతున్నాను. నీకు ఇష్టమైతే, నువ్వు ఇక వెళ్ళవచ్చు.” [2]

[1] రబ్బానీ (Rabbaanee): తన జ్ఞానానికి అనుగుణంగా ఆచరించే పండితుడు (ఆలిమ్) మరియు ప్రజల పరిస్థితి పట్ల అంతర్దృష్టి కలిగినవాడు – అతను ప్రజలకు లోతైన మరియు కష్టమైన విషయాల కంటే ముందు, జ్ఞానం యొక్క ప్రాథమిక విషయాలను నేర్పి, వారి స్థాయిని పెంచుతాడు.

[2] అబూ నుయైమ్ చే ‘హిల్వతుల్-ఔలియా‘ (1/79-80) లో, అల్-ఖతీబ్ అల్-బగ్దాదీ చే ‘అల్-ఫఖీహ్ వల్-ముతఫక్కిహ్‘ (1/49-50) లో, మరియు ఇబ్న్ కసీర్ చే ‘అల్-బిదాయహ్ వన్-నిహాయహ్‘ (9/47) లో ఉల్లేఖించబడింది.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=45477

హదీసులు కూడా కేవలం అల్లాహ్ యొక్క వహీనే! [పుస్తకం]

హదీసులు కూడా కేవలం అల్లాహ్ యొక్క వహీనే!
తఖ్రీజ్: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ రహిమహుల్లాహ్, షోబా తహ్రీఖ్ వతాలీఫ్, దారుస్సలామ్, లాహోర్
తెలుగు అనువాదం, సమర్పణ: ఇక్రాముద్దీన్ ముహమ్మద్
పరిశీలన: షేఖ్ నసీరుద్దీన్ జామి’ ఈ మరియు సోదరులు అబ్దుల్ ఖాదిర్ హఫిజహుముల్లాహ్

[బుక్ డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [21 పేజీలు]

“హదీసులు కూడా కేవలం అల్లాహ్ యొక్క వహీనే!” అనే ఈ పుస్తకం, ముస్లింల జీవితంలో ఖురాన్‌తో పాటు దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి హదీసులు (సున్నత్) కూడా అల్లాహ్ చేత అవతరింపబడిన దివ్యజ్ఞానమే (వహీ) అని స్పష్టంగా నిరూపిస్తుంది. ప్రవక్త ధర్మవిషయంలో ఏదీ తన ఇష్టానుసారం చెప్పలేదని, అవన్నీ వహీ ద్వారానే వచ్చాయని ఖురాన్ ఆయతుల ఆధారంగా గ్రంథకర్త వివరించారు. ఖిబ్లా మార్పు, ముగ్గురు వ్యక్తుల పశ్చాత్తాపం, ఉపవాసం, జకాత్ మరియు నమాజు విధానాలు వంటి అనేక విషయాలు ఖురాన్‌లో ప్రస్తావించబడినప్పటికీ, వాటి పూర్తి వివరాలు కేవలం హదీసులలోనే లభిస్తాయని ఉదాహరణలతో సహా నిరూపించారు. కేవలం ఖురాన్‌ను మాత్రమే నమ్ముతాము అని చెబుతూ “హదీసులను తిరస్కరించే వారి” (మున్కిరీనె హదీసు) వాదనలను ఖండిస్తూ, హదీసుల ప్రామాణికత లేకుండా దైనందిన ఇస్లామిక్ విధులను ఆచరించడం అసాధ్యమని ఈ పుస్తకం ఉద్ఘాటిస్తుంది.

వస్వాస్ (షైతాన్ యొక్క గుసగుసలు) తో బాధపడేవారికి సలహా – షేఖ్ సులైమాన్ అర్-రుహైలీ

“వస్వాస్ ఖహ్రీ” అంటే — వ్యక్తి ఎంత ప్రయత్నించినా దూరం చేసుకోలేని, పదే పదే మనసులోకి బలవంతంగా వచ్చే చెడు ఆలోచనలు, సందేహాలు లేదా శంకలు.

ఆధునిక వైద్య పరిభాషలో దీనిని OCD (Obsessive-Compulsive Disorder / అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్) అని పిలుస్తారు — అంటే ఒక వ్యక్తికి కొన్ని ఆలోచనలు పదే పదే వస్తుండడం, వాటిని తొలగించుకోవడానికి కొన్ని పనులను బలవంతంగా చేయవలసి రావడం (ఉదా: పదే పదే వుజూ చేయడం, నమాజ్ తిరిగి తిరిగి చదవడం, పరిశుభ్రత గురించి అతి ఆందోళన పడడం మొదలైనవి).

ఇస్లామిక్ సందర్భంలో, ఇది ఎక్కువగా ఇబాదత్ (ఆరాధన), తహారత్ (పరిశుభ్రత), అఖీదా (విశ్వాసం), లేదా తలాఖ్ (విడాకులు) వంటి విషయాలలో కనిపిస్తుంది.

వస్వాస్ (షైతాన్ యొక్క గుసగుసలు) తో బాధపడేవారికి సలహా – షేఖ్ సులైమాన్ అర్-రుహైలీ
Advice to those afflicted with Waswaas (whisperings) – Shaykh Sulaymaan ar-Ruhaylee
https://abdurrahman.org/?p=44410
ఇంగ్లీష్ అనువాదం: యాసీన్ అబూ ఇబ్రాహీం
తెలుగు అనువాదం : teluguislam.net

ఒక వ్యక్తి వస్వాస్ ఖహ్రీ (Waswaas Qahree) తో బాధపడుతున్నాడు. దీనికి మీ సలహా ఏమిటి? అల్లాహ్ మిమ్మల్ని రక్షించుగాక.

ఇది ఇబ్లీస్ (షైతాన్) పన్నాగాలలో ఒక మార్గం. వస్వాస్ (Waswaas) గురించి ఉన్న ప్రధాన సూత్రం ఏమిటంటే, అది ఒక దాసుని యొక్క ధర్మబద్ధతకు మరియు అతని హృదయ స్వచ్ఛతకు నిదర్శనం. ఎందుకంటే, ఒక దాసుడు ధర్మబద్ధంగా ఉన్నాడని మరియు సత్కార్యాల ద్వారా అతనిని ఓడించడం తన వల్ల కాదని షైతాన్ కు అర్థమైనప్పుడు, అతనికి (చెడు) గుసగుసలు చెప్పడం ప్రారంభిస్తాడు. అందుకే ప్రవక్త – సల్లల్లాహు అలైహి వ సల్లంకు ఈ (వస్వాస్ విషయం) ప్రస్తావించబడినప్పుడు ఆయన ఇలా అన్నారు: “షైతాన్ కుట్రను కేవలం అల్-వస్వసహ్ (al-Waswasah – గుసగుసలు) స్థాయికి తగ్గించిన అల్లాహ్ కే సర్వ ప్రశంసలు.” వాడు మనల్ని జయించలేకపోయాడు, అందుకే వస్వాస్ తో మన వద్దకు వచ్చాడు. మరియు ఆయన (ప్రవక్త) ఇలా అన్నారు: “అది విశ్వాసానికి స్పష్టమైన సంకేతం.” ఇది వస్వాస్ యొక్క సారాంశం. అంటే: వస్వాస్ కలుగుతోందంటే, దానికి ఇదే నిదర్శనం.

అయితే దీని అర్థం వస్వాస్ బారిన పడిన వారిని మనం ప్రశంసిస్తామని కాదు. ఎందుకంటే, వస్వాస్ కు ప్రతిస్పందించడం ఒక చెడు. దాన్ని నివారించడం మరియు దానికి దూరంగా ఉండటం విధి. మరియు వస్వాస్ బారిన పడిన వారు రెండు రకాలుగా ఉంటారు.

మొదటి రకం: వస్వాస్ అతనిని పూర్తిగా లోబరుచుకోలేకపోవడం. బదులుగా అది వస్తుంది మరియు వెళ్లిపోతుంది. ఎక్కువగా ఇస్తిఆజహ్ (isti’aadhah – అల్లాహ్ శరణు కోరడం) చేయడం ద్వారా దీనిని నయం చేయవచ్చు. అతడు దాని నుండి రక్షణ కోసం అల్లాహ్ శరణు కోరుతాడు మరియు తన ఎడమ వైపున ఉమ్మివేసినట్లు చేస్తాడు. మరియు అతడు ఖుర్ఆన్ మరియు హదీసులు పఠిస్తాడు.

రెండవ రకం: వస్వాస్ చాలా ఎక్కువగా ఉండి అతనిని పూర్తిగా అదుపులోకి తీసుకోవడం. దీనిని ఏ ఆచరణ ద్వారానూ నయం చేయలేము, ఎందుకంటే అతడు ఎన్ని ఆచరణలు చేస్తే, అతని వస్వాస్ అంతగా పెరుగుతుంది. అతడు ఖుర్ఆన్ చదివినా సరే, అతని వస్వాస్ పెరుగుతుంది! కాబట్టి ఇది ఎలా నయమవుతుంది? దీని నుండి పూర్తిగా ముఖం తిప్పుకోవడం (పూర్తిగా పట్టించుకోకపోవడం) ద్వారానే ఇది నయమవుతుందని ఫుకహా (Fuqahaa’ – ఇస్లామిక్ న్యాయవేత్తలు) చెబుతారు. దీని అర్థం ఏమిటి? దాని (వస్వాస్) కారణంగా మీరు ఏ పని చేయకూడదు లేదా దాని కారణంగా దేనినీ వదిలిపెట్టకూడదు. ఒకవేళ అది మీ వద్దకు వచ్చినా, అది మీకు ఎలాంటి హాని చేయదని మీకు కచ్చితంగా తెలిసిన ఒక పిచ్చివాడు మీ వెనుక నుండి మాట్లాడుతున్నట్లుగా భావించండి. మరియు దాని కారణంగా ఏ పని చేయకండి లేదా దాని కారణంగా దేనినీ వదిలివేయకండి.

కొందరు వ్యక్తులు, తమకు వస్వాస్ వచ్చినప్పుడు, చదవడానికి ఖుర్ఆన్ తెరుస్తారు. అప్పుడు ఇబ్లీస్ అతనిని లొంగదీసుకోవడంలో మరింత ఆసక్తి చూపుతాడు, కాబట్టి ఖుర్ఆన్ కు సంబంధించి అతనికి గుసగుసలు చెప్పడం ప్రారంభిస్తాడు. అతడు లేచి ప్రార్థన (నమాజ్) చేస్తాడు, అప్పుడు వాడు (షైతాన్) అతని ప్రార్థనలో కూడా గుసగుసలు చెబుతాడు.

అందుకే దాని (వస్వాస్) కారణంగా మీరు దేనినీ వదిలిపెట్టవద్దు! మీరు ఖుర్ఆన్ చదువుతున్నప్పుడు షైతాన్ మీకు గుసగుసలు పెడుతూ వస్తే, మీరు ఖుర్ఆన్ పఠించడం ఆపవద్దు, దాన్ని కొనసాగించండి! మీ అంతట మీరుగా దానిని ఆపాలనుకున్నప్పుడే ఆపండి. వస్వాస్ వస్తుందన్న కారణంతో మాత్రం దాన్ని మానుకోవద్దు. మీరు ఇలా చేసి, సహనంతో ఉంటే… ఈ విషయానికి సహనం అవసరమని తెలుసుకోండి, ఎందుకంటే వస్వాస్ కు గురైన వ్యక్తి వద్దకు ఇబ్లీస్ ఒక సలహాదారుని వలె, జాలిపడే వాడి వలె వస్తాడు. నమాజులో (షైతాన్ ఇలా అంటాడు): “ఇది నమాజు! నమాజు అనేది ఒక దాసునికి మరియు అతని ప్రభువుకి మధ్య ఉన్న అనుసంధానం! నీ నమాజు రద్దైపోతే, నీకు ఇక మిగిలేది ఏమిటి? జాగ్రత్త! ప్రార్థన వదిలేసి వెళ్లి వుజూ చేసుకో!” అతని నమాజును పాడు చేయడానికే (వాడు అలా చేస్తాడు). కానీ వాడు సలహాదారుడు కాడు, వాడు ఇబ్లీస్! కాబట్టి దీనికి ఓపిక అవసరం. సహనంతో ఉండండి!

మీరు వుజూ చేసేటప్పుడు మీకు వస్వాస్ వస్తే, మీ వుజూ పూర్తి చేసి వెళ్లిపోండి. ఆ తర్వాత ఇబ్లీస్ మీ వద్దకు వచ్చి, “ఇంకా ఏదో మిగిలిపోయింది!” అని అంటే, అప్పుడు: “ఏమీ మిగిలిలేదు” అని చెప్పండి. వాడిని పట్టించుకోకండి! వెళ్లి నమాజు చేసుకోండి! అల్లాహ్ సాక్షిగా, అది మీకు ఎలాంటి హాని చేయదు! అల్లాహ్ సాక్షిగా, అది మీకు హాని చేయదు. మీరు ఖుర్ఆన్ పఠిస్తున్నప్పుడు ఇబ్లీస్ మీకు గుసగుసలు చెబుతూ వస్తున్నాడా? పఠనం కొనసాగించండి! మరియు వాడిని (ఇబ్లీస్ ను) వదిలేయండి! పఠించడం కొనసాగించండి! అల్లాహ్ సాక్షిగా, అది మీకు హాని చేయదు! నిజానికి, దానికి మీకు ప్రతిఫలం లభిస్తుంది! ఎందుకంటే మీరు ఇబ్లీస్ కి వ్యతిరేకంగా జిహాద్ చేస్తున్నారు. అప్పుడు ఇబ్లీస్ మీ విషయంలో నిరాశ చెంది, ఈ తలుపు (వస్వాస్ మార్గం) వదిలేసి, మరో తలుపు వెతుక్కోవడం మొదలుపెడతాడు.

కాబట్టి, ఓ సోదరులారా, వస్వాస్ ఖహ్రీ (Waswaas Qahree) ఉందని చెప్పబడుతున్న ఈ సోదరుడికి, అంటే వస్వాస్ ఎవరినైతే పూర్తిగా లోబరుచుకుందో అతనికి ఉన్న ఏకైక నివారణ మార్గం – పూర్తిగా ముఖం తిప్పుకోవడమే. మరియు పూర్తిగా ముఖం తిప్పుకోవడం అంటే, అది తనకు ఎలాంటి హాని చేయదని, అల్లాహ్ అపార కరుణామయుడని, మరియు దీని కారణంగా అల్లాహ్ తన దాసులను శిక్షించడం అసాధ్యమని, మరియు ఇది మతంలో (ధర్మంలో) భాగం కాదని అతను కచ్చితమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి!

అల్లాహ్ ఇలా అంటున్నాడు: “మరియు ఆయన మతంలో మీపై ఎలాంటి కష్టాన్నీ మోపలేదు…” (22:78). ఒక వ్యక్తి డెబ్భై సార్లు వుజూ చేయాలనేది మతంలో భాగం ఎలా అవుతుంది?! కాబట్టి మీరు దీనిని తెలుసుకోవాలి మరియు దానిపై పూర్తి నమ్మకంతో ఉండాలి, అంతే! ప్రజలు సాధారణంగా ఏమి చేస్తారో మీరూ అదే చేయండి, మరియు (ఆ ఆలోచనల నుండి) ముఖం తిప్పుకోండి. మీరు మీ పనిని కొనసాగించండి, వస్వాస్ కారణంగా దానిని వదిలిపెట్టవద్దు. మరియు వస్వాస్ కారణంగా ఏ పనీ చేయకండి. అల్లాహ్ సాక్షిగా, అల్లాహ్ అనుమతితో అతడు నయమవుతాడు. మరియు ఇది మాకు అనుభవం ద్వారా తెలుసు.

అల్లాహ్ సాక్షిగా, ఓ సోదరులారా. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, తన భార్యకు సంబంధించి, అతను ఆమెకు విడాకులు ఇస్తున్నాడని షైతాన్ ఎప్పుడూ అతనికి గుసగుసలు చెబుతూ ఉండేవాడు. అతను ఆమెతో కలిసి ఆమె కుటుంబం దగ్గరికి వెళ్ళి, “నీ కుటుంబం దగ్గరికి వెళ్ళు” అని ఆమెతో చెబితే, ఇబ్లీస్ అతని దగ్గరికి వచ్చి, “నువ్వు ఇప్పుడే ఆమెకు విడాకులు ఇచ్చేశావు” అని చెప్పేవాడు. కొన్నిసార్లు అతను రాత్రి రెండు గంటలకు మరియు మూడు గంటలకు నాకు ఫోన్ చేసి, “ఓ షేక్, ప్రస్తుతం ఆమె నా పక్కన మంచంపై ఉంది, ఆమె నా భార్యా లేక నేను ఆమెకు విడాకులు ఇచ్చేశానా?” అని అడిగేవాడు. మొదట్లో మేము అతనికి ఇలా చెప్పాము: “నీవు ఈ విషయాన్ని వదిలేసే వరకు నిన్ను నీవు అల్లాహ్ స్మరణలో (జిక్ర్ లో) బిజీగా ఉంచుకో.” అప్పుడు అతను తనను తాను అల్లాహ్ స్మరణలో బిజీగా ఉంచుకోవడం ప్రారంభించాడు, ఆ తర్వాత ఇబ్లీస్ అతని దగ్గరకు రావడం మొదలుపెట్టాడు; అతడు “సుబ్ హా నల్లాహ్ ” అన్నప్పుడల్లా ఇబ్లీస్, “లేదు! నువ్వు ఆమెకు విడాకులు ఇచ్చావని పరోక్షంగా చెబుతున్నావు” అని చెప్పేవాడు. అతడు “అల్లాహు అక్బర్ అన్నప్పుడల్లా ఇబ్లీస్, “నువ్వు ఆమెకు విడాకులు ఇచ్చావని పరోక్షంగా చెబుతున్నావు! మరియు ఇది పరువుకు సంబంధించిన విషయం!” అని చెప్పేవాడు. ఈ వ్యవహారం తీవ్రంగా మారిందని మేము చూసినప్పుడు, దీనిని పూర్తిగా పట్టించుకోవద్దని (ఈ వస్వాస్ నుండి ముఖం తిప్పుకోమని) అతనికి సలహా ఇచ్చాము. అప్పుడు అతను కొంతకాలం దానిని పట్టించుకోకుండా ఉండేవాడు, కానీ మళ్ళీ (తన పాత వస్వాస్ స్థితికి) తిరిగి వచ్చేవాడు. అతను కొన్నిసార్లు నా ఇంటికి వచ్చేవాడు, నేను అతన్ని నా ఇంటి నుండి బయటికి పంపించేసేవాడిని. ఎందుకంటే అతనికి ఊరటనిచ్చే వారు ఎవరో ఒకరు ఉన్నారని వాడికి తెలిసినంత కాలం, అతను తన వస్వాస్ ను కొనసాగిస్తూనే ఉంటాడు. కానీ మేము అతనికి ఒక సూత్రాన్ని నేర్పాము. కొంతకాలం తర్వాత, సర్వ ప్రశంసలు మరియు ఆశీర్వాదాలు అల్లాహ్ కే చెందుతాయి, అతని జీవితం స్థిరంగా మారింది మరియు ఈ వస్వాస్ అతని నుండి పూర్తిగా వెళ్లిపోయింది, ఎందుకంటే అతను ఆ సూత్రంపై స్థిరంగా ఉన్నాడు. మరియు నాకు చాలా మంది తెలుసు, వారిలో ఒకరికి ఇరవై ఏళ్ళకు పైగా వస్వాస్ ఉంది! అతను మా దగ్గరకు వచ్చాడు, మేము అతనికి సలహా ఇచ్చాము మరియు కొంతకాలం అతని పట్ల సహనంతో వ్యవహరించాము, ఆ తర్వాత అల్లాహ్ ఈ విధానం ద్వారా అతనికి నయం చేశాడు. కాబట్టి ఆ సోదరుడికి నా సలహా ఏమిటంటే, నేను పేర్కొన్న విధంగా అతను ఆచరించాలి, మరియు అల్లాహ్ కే బాగా తెలుసు.

Advice to those afflicted with Waswaas (whisperings) – Shaykh Sulaymaan ar-Ruhaylee
https://www.youtube.com/watch?v=nz0fxK7KRkU [5 min]

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=45331

ఇదే మా పిలుపు (సలఫ్‌ల మార్గం) – ఇమామ్ అల్-అల్బానీ [పుస్తకం] రచయిత: ఇమామ్ ముహమ్మద్ నాసిరుద్దీన్ అల్-అల్బానీ ఆంగ్ల అనువాదం: అల్-ఇబానా బుక్ పబ్లిషింగ్ (Al-Ibaanah Book Publishing)

ఇదే మా పిలుపు (సలఫ్‌ల మార్గం) – ఇమామ్ అల్-అల్బానీ [పుస్తకం]

ఇదే మా పిలుపు (సలఫ్‌ల మార్గం)
This is Our Call (The Way of the Salaf) – Imaam Al-Albaanee
రచయిత: ఇమామ్ ముహమ్మద్ నాసిరుద్దీన్ అల్-అల్బానీ
ఆంగ్ల అనువాదం: అల్-ఇబానా బుక్ పబ్లిషింగ్ (Al-Ibaanah Book Publishing)
https://abdurrahman.org/?p=21224
తెలుగు అనువాదం : teluguislam.net

ఇది ఇమామ్ అల్-అల్బానీ (రహిమహుల్లాహ్) చేసిన ఒక ప్రసంగం యొక్క అనువదించబడిన లిఖిత రూపం (transcription). ఈ ప్రసంగం రికార్డ్ చేయబడి “హాదిహీ దఅవతునా” (ఇదే మా పిలుపు) అనే పేరుతో పంపిణీ చేయబడింది. ప్రస్తుత ఈ అనువాదం నేరుగా అరబిక్ ఆడియో నుండి అనువదించబడింది.

ఈ ప్రసంగంలో, సలఫీ మన్హజ్ (విధానం) యొక్క మూలాధారాన్ని ఇమామ్ అల్-అల్బానీ వివరించారు. ఆ విధానమేమిటంటే – సలఫ్‌ల (ముస్లింల మొదటి మూడు తరాల వారి) మార్గాన్ని, వారి అవగాహనను మరియు వారి ఆచరణను అనుసరించడం. ఆ మూడు తరాల వారు: సహాబాలు (ప్రవక్త అనుచరులు), తాబియీన్లు (సహాబాల అనుచరులు), మరియు అత్బాఉత్-తాబియీన్లు (తాబియీన్‌ల అనుచరులు). ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ క్రింది విధంగా చెప్పినప్పుడు సూచించింది వీరి గురించే: “మానవాళిలో అత్యుత్తమమైన వారు నా తరానికి చెందినవారు, ఆ తరువాత వచ్చే వారు, ఆ తరువాత వచ్చే వారు.”

ఇస్లాం వైపుకు పిలిచే సత్యమైన పిలుపును, ఇతర తప్పుడు మరియు దోషపూరితమైన పిలుపుల నుండి వేరుచేసే ప్రాథమిక ఆధారం ఇదే. ఇతర వర్గాల వారు తాము “ఖుర్ఆన్ మరియు సున్నత్‌ల పై ఉన్నాము” అని ఎంతగా దావా చేసినప్పటికీ సత్యం, అసత్యాల మధ్య అసలు భేదాన్ని ఈ ఆధారమే (సలఫ్‌ల మార్గమే) చూపుతుంది. ఈ వాస్తవాన్ని అల్-అల్బానీ (రహిమహుల్లాహ్) ఇందులో లోతుగా చర్చించారు, అదేమిటంటే – సలఫ్‌ల అవగాహన మరియు ఆచరణను అనుసరించనిదే ఎవరూ ఖుర్ఆన్ మరియు సున్నత్‌లను నిజంగా అర్థం చేసుకోలేరు మరియు ఆచరించలేరు. ఈ ప్రయత్నాన్ని అల్లాహ్ స్వీకరించి, దీని ద్వారా ముస్లింలకు ప్రయోజనం చేకూర్చాలని మేము దుఆ చేస్తున్నాము.

షిర్క్ యొక్క మూలాలు (The Origins of Shirk) – షేక్ అల్-అల్బానీ 

షిర్క్ యొక్క మూలాలు (The Origins of Shirk) [1]
రచయిత: షేక్ అల్-అల్బానీ (Shaykh al-Albaanee)
https://abdurrahman.org/2014/01/17/the-origins-of-shirk/
అల్-ఇబానా మ్యాగజైన్, సంచిక నం.3 – దుల్-ఖాదహ్ 1416H / ఏప్రిల్ 1996

షరీఅత్ (ధర్మశాస్త్రం)లో నిర్ధారించబడిన అంశం ఏమిటంటే, మానవాళి – ప్రారంభంలో – స్వచ్ఛమైన ‘తౌహీద్’ (ఏకదైవారాధన)పై ఉన్న ఒకే సమాజంగా ఉండేది. ఆ తరువాత ‘షిర్క్’ (ఆరాధనలోని ఏ భాగాన్నైనా, రూపాన్నైనా, లేదా కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందాల్సిన హక్కును అల్లాహ్ యేతరులకు ఆపాదించడం/సాటి కల్పించడం) క్రమంగా వారిని ఆవహించింది. దీనికి ఆధారం మహోన్నతుడు, శుభకరుడైన అల్లాహ్ యొక్క ఈ వాక్యం:

كَانَ النَّاسُ أُمَّةً وَاحِدَةً فَبَعَثَ اللَّهُ النَّبِيِّينَ مُبَشِّرِينَ وَمُنْذِرِينَ

మానవులంతా ఒకే సమాజంగా ఉండేవారు. అల్లాహ్‌ ప్రవక్తలను శుభవార్తనిచ్చే వారుగా, భయపెట్టే వారుగా చేసి పంపాడు. (సూరహ్ అల్-బఖరహ్ 2:213)

ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు:

నూహ్ మరియు ఆదమ్ (అలైహిమస్సలాం) ల మధ్య పది తరాల అంతరం ఉండేది. వారందరూ సత్యధర్మమైన షరీఅత్ పైనే స్థిరంగా ఉండేవారు, ఆ తరువాత వారు విభేదించుకున్నారు. అప్పుడు అల్లాహ్ శుభవార్తనిచ్చేవారిగా మరియు హెచ్చరించేవారిగా ప్రవక్తలను పంపాడు.” [2]

ఇబ్న్ ఉర్వా అల్-హంబలీ (మరణం హి.శ 837) ఇలా అన్నారు:

“ఖాబిల్ (Cain) మరియు అతని కుమారులు అగ్ని ఆరాధకులు అని దావా చేసే గ్రంథ ప్రజలలోని (People of the Book) చరిత్రకారుల వాదనను ఈ మాట ఖండిస్తుంది.”.” [3]

నేను (రచయిత) చెబుతున్నాను: మానవుని (సహజ) మూల స్వభావం షిర్క్ అని, మరియు తౌహీద్ మానవునిలో క్రమంగా పరిణామం చెందిందని వాదించే కొందరు తత్వవేత్తలకు మరియు నాస్తికులకు కూడా ఇందులో ఒక ఖండన ఉంది! పైన పేర్కొన్న ఆయత్ (ఖుర్ఆన్ వాక్యం) ఈ వాదనను అబద్ధమని రుజువు చేస్తుంది, అలాగే ఈ క్రింది రెండు ప్రామాణికమైన (సహీహ్) హదీసులు కూడా దీనిని ఖండిస్తున్నాయి:

మొదటిది: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ప్రభువు (అల్లాహ్) నుండి ఉల్లేఖించిన మాట (హదీసే ఖుద్సీ) ఇలా ఉంది:

إِنِّي خَلَقْتُ عِبَادِي حُنَفَاءَ كُلَّهُمْ، وَإِنَّهُمْ أَتَتْهُمُ الشَّيَاطِينُ فَاجْتَالَتْهُمْ عَنْ دِينِهِمْ، وَحَرَّمَتْ عَلَيْهِمْ مَا أَحْلَلْتُ لَهُمْ، وَأَمَرَتْهُمْ أَنْ يُشْرِكُوا بِي مَا لَمْ أُنْزِلْ بِهِ سُلْطَانًا

నేను నా దాసులందరినీ సత్యధర్మంపై (షిర్క్ లేని తౌహీద్ పై) సృష్టించాను. ఆ తరువాత షైతాన్లు వారి వద్దకు వచ్చి, వారిని వారి సత్యధర్మం నుండి దారి తప్పించాయి. నేను వారికి ధర్మసమ్మతం (హలాల్) చేసినవాటిని, అవి వారికి నిషిద్ధం (హరామ్) చేశాయి. నేను ఎలాంటి ఆధారాన్ని దించని వాటిని వారు నా పట్ల భాగస్వాములుగా (షిర్క్) చేయాలని ఆ షైతాన్లు వారిని ఆదేశించాయి.” [4]

రెండవది: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం:

كُلُّ مَوْلُودٍ يُولَدُ عَلَى الفِطْرَةِ، فَأَبَوَاهُ يُهَوِّدَانِهِ، أَوْ يُنَصِّرَانِهِ، أَوْ يُمَجِّسَانِهِ، كَمَثَلِ البَهِيمَةِ تُنْتَجُ البَهِيمَةَ جَمْعَاءَ، هَلْ تُحِسُّونَ فِيهَا مِنْ جَدْعَاءَ

ప్రతి శిశువూ ఫిత్రా (ఇస్లాం/తౌహీద్ యొక్క సహజ స్వభావం)[5] పైనే జన్మిస్తాడు. అయితే అతని తల్లిదండ్రులు అతనిని యూదునిగానో, క్రైస్తవునిగానో లేదా మజూసీ (అగ్ని ఆరాధకుడు) గానో మారుస్తారు. ఇది ఒక జంతువు పూర్తి అవయవాలున్న ఆరోగ్యవంతమైన పిల్లకు జన్మనివ్వడం లాంటిది. మీరు దాని చెవిని కోయడానికి ముందు (పుట్టుకతోనే) చెవి కోయబడి ఉండడాన్ని మీరెప్పుడైనా చూశారా?

ఆ తరువాత అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “మీరు కావాలంటే (ఈ ఖుర్ఆన్ వాక్యాన్ని) పఠించండి:

فِطْرَتَ اللَّهِ الَّتِي فَطَرَ النَّاسَ عَلَيْهَا لَا تَبْدِيلَ لِخَلْقِ اللَّهِ

అల్లాహ్‌ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావంపైన్నే (ఉండండి). అల్లాహ్‌ సృష్టిని మార్చకూడదు సుమా! (సూరహ్ అర్-రూమ్ 30:30) [6]

ఈ స్పష్టమైన వివరణ తరువాత, మువహ్హిదీన్ (తౌహీద్ పై ఉన్న ప్రజలు) గా ఉన్నప్పటికీ, విశ్వాసులలో షిర్క్ ఎలా వ్యాపించిందో తెలుసుకోవడం ఒక ముస్లింకు అత్యంత ఆవశ్యకమైన విషయం. అత్యంత పరిపూర్ణుడైన అల్లాహ్ నూహ్ (అలైహిస్సలాం) జాతి గురించి చెప్పిన మాటలను పరిశీలిస్తే:

وَقَالُوا لَا تَذَرُنَّ آلِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّا وَلَا سُوَاعًا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا

ఇంకా వారిలా అన్నారు – ఎట్టి పరిస్థితిలోనూ మీ పూజ్య దైవాలను వదలకండి. వద్ద్ద్ ను గానీ, సువాను గానీ, యగూస్, యవూఖ్, నస్ర్ లను గానీ వదలి పెట్టకండి.” (సూరహ్ నూహ్ 71:23)

సలఫ్ (సజ్జనులైన పూర్వీకుల) బృందం నుండి అనేక ఉల్లేఖనాలలో ఇలా తెలుపబడింది: దైవాలని భావించే ఈ ఐదుగురు నిజానికి సజ్జనులైన ఆరాధకులు. అయితే వారు మరణించినప్పుడు, వారి సమాధుల వద్ద ఆశ్రయం పొంది కూర్చోవాలని షైతాన్ ఆ ప్రజల మనస్సులలో వసవసా (దురాలోచన) కలిగించాడు. ఆ తరువాత వారి తర్వాతి తరానికి, వారిని విగ్రహాలుగా మలచుకోవాలని వసవసా కలిగించాడు. విగ్రహాల వల్ల వారిని గుర్తుంచుకుంటారని తద్వారా వారు చేసిన సత్కార్యాలనే అనుకరిస్తారని వారికి అందంగా భ్రమింపజేశాడు. ఆ తరువాత వచ్చిన మూడవ తరానికి, వారు సర్వోన్నతుడైన అల్లాహ్ తో పాటు ఈ విగ్రహాలను కూడా ఆరాధించాలని షైతాన్ దురాలోచన కలుగజేశాడు. “మీ పూర్వీకులు కూడా ఇలాగే చేసేవారు కదా!!!” అని వారిని నమ్మించాడు.

అప్పుడు అల్లాహ్ మాత్రమే ఆరాధించబడాలని ఆదేశించడానికి వారి వద్దకు నూహ్ (అలైహిస్సలాం) ను అల్లాహ్ పంపాడు. కానీ కొద్దిమంది తప్ప ఇంకెవరూ ఆయన పిలుపుకు స్పందించలేదు. సర్వశక్తిమంతుడు మరియు మహోన్నతుడైన అయిన అల్లాహ్ ఈ సంఘటన మొత్తాన్ని సూరహ్ నూహ్ లో వివరించాడు. ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన విధంగా: “నిశ్చయంగా ఈ ఐదు పేర్లు నూహ్ జాతికి చెందిన పుణ్యాత్ములైన వ్యక్తులవి. వారు చనిపోయినప్పుడు, షైతాన్ వారి ప్రజలకు వారి విగ్రహాలను తయారు చేసి వారిని గుర్తుంచుకోవడానికి వారి సమావేశ మందిరాలలో ప్రతిష్టించాలని వసవసా (దుర్బోధ) కలిగించాడు, వారు అలాగే చేశారు. అయితే, వారు ఆ విగ్రహాలను ఎన్నడూ ఆరాధించలేదు. కానీ ఆ తరం వారు చనిపోయిన తరువాత, ఆ విగ్రహాల అసలు ఉద్దేశ్యం మరచిపోబడింది. అప్పుడు (ఆ తర్వాతి తరం వారు) వాటిని ఆరాధించడం మొదలుపెట్టారు.” [7]

ఇబ్న్ జరీర్ అత్-తబరీ మరియు ఇతరులు అనేక మంది సలఫ్‌ల (సజ్జనులైన పూర్వీకుల) నుండి ఇలాంటి విషయాలనే ఉల్లేఖించారు. అద్-దుర్రుల్-మన్సూర్ (6/269)లో: అబ్దుల్లాహ్ ఇబ్న్ హుమైద్, అబూ ముత్తహర్ ద్వారా ఉల్లేఖించారు, ఆయన ఇలా అన్నారు: యజీద్ ఇబ్న్ అల్-ముహల్లబ్ గురించి అబూ జాఫర్ అల్-బాఖిర్ (మరణం హి.శ 114) తో ప్రస్తావించబడినప్పుడు ఆయన ఇలా అన్నారు: “అల్లాహ్ కాకుండా మొదటిసారిగా ఎవరినైతే ఆరాధించారో ఆ ప్రదేశంలోనే అతడు చంపబడ్డాడు”. ఆ తరువాత ఆయన ‘వద్ద్’ గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు:

వద్ద్ ఒక ముస్లిం వ్యక్తి, అతనిని అతని ప్రజలు ఎంతగానో ప్రేమించేవారు. అతను మరణించినప్పుడు, బాబిల్ (బాబిలోన్) ప్రాంతంలో ప్రజలు అతని సమాధి చుట్టూ గుమిగూడి విలపిస్తూ, శోకించడం ప్రారంభించారు. వారు అతని కోసం శోకిస్తూ విలపించడాన్ని ఇబ్లీస్ (షైతాన్) చూసినప్పుడు, ఒక మనిషి రూపం ధరించి వారి వద్దకు వచ్చి ఇలా అన్నాడు: ‘మీరు అతని కోసం దుఃఖిస్తూ విలపించడాన్ని నేను చూస్తున్నాను. అయితే మీరు అతని చిత్రాన్ని (అనగా విగ్రహాన్ని) తయారు చేసి, అతన్ని గుర్తుంచుకోవడానికి మీ సమావేశ మందిరాలలో ఎందుకు ఉంచకూడదు?’. దానికి వారు: ‘సరే’ అన్నారు, మరియు అతని చిత్రాన్ని (విగ్రహాన్ని) తయారు చేసి వారి సమావేశ మందిరంలో ఉంచారు; అది వారిని అతన్ని గుర్తుచేసేలా చేసింది. వారు అతన్ని (అతిగా) స్మరించుకోవడాన్ని చూసిన ఇబ్లీస్, ఇలా అన్నాడు: ‘మీలో ప్రతి ఒక్కరూ మీ ఇళ్ళలో ఉంచుకోవడానికి ఇలాంటి చిత్రాన్ని ఎందుకు తయారు చేయకూడదు, తద్వారా మీరు అతనిని (నిరంతరం) స్మరించుకోవచ్చు’. దానికి వారందరూ ‘సరే’ అన్నారు. కాబట్టి ప్రతి ఇంటి వారు అతని చిత్రాన్ని (విగ్రహాన్ని) తయారు చేశారు, వారు దానిని పూజించడం మరియు భక్తితో ఆరాధించడం ప్రారంభించారు, అది వారికి నిరంతరం అతనిని గుర్తుచేసేది.” అబూ జాఫర్ ఇలా అన్నారు: “ఆ తరువాత వచ్చిన తరం వారు (తమ పూర్వీకులు) చేసినదానిని చూసి వారు అతనిని అల్లాహ్ తో పాటు ఆరాధించబడే ఇలాహ్ (ఆరాధ్య దైవంగా) స్వీకరించే స్థాయికి చేరుకున్నారు.” ఆ తరువాత ఆయన ఇలా అన్నారు: “అల్లాహ్ కాకుండా ఆరాధించబడిన మొట్టమొదటి విగ్రహం ఇదే, ఆ విగ్రహాన్ని వారు ‘వద్ద్’ అని పిలిచారు.”[8]

ఈ విధంగా శుభకరుడు మరియు మహోన్నతుడైన అల్లాహ్ యొక్క జ్ఞానం (హిక్మత్) పరిపూర్ణమైంది. ఆయన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అంతిమ ప్రవక్తగా పంపినప్పుడు మరియు దైవికమైన అన్ని ధర్మశాస్త్రాల ముగింపుగా ఆయన షరీఅత్ ను పరిపూర్ణం చేసినప్పుడు, మహా పాపమైన షిర్క్ లో ప్రజలు పడిపోయే అన్ని మార్గాలను మరియు దారులను ఆయన నిషేధించాడు. ఈ కారణంగానే, సమాధులపై కట్టడాలు (దర్గాలు/మజార్లు) నిర్మించడం, ప్రత్యేకంగా వాటి సందర్శన కొరకే ప్రయాణించడం, వాటిని పండుగలు మరియు సమావేశాల స్థలాలుగా మార్చుకోవడం, మరియు సమాధిలో ఉన్నవారి పేరిట ప్రమాణాలు చేయడం; ఇవన్నీ ఇస్లాంలో నిషేధించబడ్డాయి. ఇవన్నీ మితిమీరిన భక్తికి (అతివాదానికి) దారితీస్తాయి మరియు తద్వారా సర్వోన్నతుడైన అల్లాహ్ కాకుండా ఇతరుల ఆరాధనకు (షిర్క్ కు) దారితీస్తాయి.

జ్ఞానం క్షీణిస్తున్న, అజ్ఞానం పెరుగుతున్న ఈ యుగంలో ఇది మరీ ఎక్కువగా వర్తిస్తుంది. (సత్యాన్ని బోధించే) చిత్తశుద్ధి గల సలహాదారులు చాలా తక్కువగా ఉన్నారు మరియు మానవాళిని దారి తప్పించడానికి, శుభకరుడు మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఒక్కడి ఆరాధన నుండి వారిని దూరం చేయడానికి షైతాన్ మానవులతో మరియు జిన్నాతులతో సహకరిస్తున్నాడు.

  1. తహ్దీరుస్-సాజిద్ మిన్ ఇత్తిఖాదిల్-ఖుబూరి మసాజిద్ (పేజీలు 101-106)
  2. ఇబ్న్ జరీర్ అత్-తబరీ తన తఫ్సీర్ (4/275) లో మరియు అల్-హాకిమ్ (2/546) ఉల్లేఖించారు. హాకిమ్ దీని గురించి ఇలా అన్నారు: “ఇది అల్-బుఖారీ ప్రమాణాల ప్రకారం ప్రామాణికమైనది.” అజ్-జహబీ కూడా దీనితో ఏకీభవించారు.
  3. అల్-కవాకిబుద్-దురారీ ఫీ తర్తీబ్ ముస్నదుల్-ఇమామ్ అహ్మద్ ‘అలా అబ్వాబిల్-బుఖారీ (6/212/1), వ్రాతప్రతి (మాన్యుస్క్రిప్ట్) రూపంలో.
  4. ముస్లిం (8/159) మరియు అహ్మద్ (4/162) ద్వారా ఇయాజ్ ఇబ్న్ హిమార్ అల్-ముజాషిఈ (రదియల్లాహు అన్హు) నుండి ఉల్లేఖించబడింది.
  5. [సంపాదకుల వివరణ] ఇబ్న్ అల్-అసీర్ అన్-నిహాయా (3/457) లో ఇలా అన్నారు: “అల్-ఫిత్ర్: అంటే ప్రారంభించడం మరియు సృష్టించడం, మరియు అల్-ఫిత్రా అనేది దాని ఫలితంగా ఏర్పడే పరిస్థితి (స్వభావం). దీని అర్థం ఏమిటంటే మానవాళి సత్యధర్మాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న (స్వచ్ఛమైన) స్వభావం పైనే జన్మిస్తుంది. కాబట్టి అతనిని ఈ స్వభావం పైనే వదిలేస్తే, అతను దానిపైనే కొనసాగుతాడు. అయితే, దీని నుండి దారి తప్పేవారు మానవ బలహీనతలను అనుసరించడం మరియు ఇతరులను గుడ్డిగా అనుకరించడం వల్లే అలా చేస్తారు…

    అల్-హాఫిజ్ ఇబ్న్ హజర్ అల్-ఫత్ (3/248) లో ఇలా అన్నారు: “అల్-ఫిత్రా అంటే ఏమిటి అనే విషయంపై పండితుల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి, అత్యంత ప్రసిద్ధ అభిప్రాయం ఏమిటంటే దాని అర్థం ఇస్లాం.

    ఇబ్న్ అబ్దుల్-బర్ర్ ఇలా అన్నారు: “సలఫ్ లలో అత్యధికులకు ఇదే ప్రసిద్ధమైనది, మహోన్నతుడైన అల్లాహ్ యొక్క వాక్యం “అల్లాహ్ మానవులను ఏ స్వభావంతో పుట్టించాడో, ఆ స్వభావం” అనేదాని భావం ఇస్లాం అని ముఫస్సిరీన్ (తఫ్సీర్ పండితులు) ఏకాభిప్రాయానికి వచ్చారు.”
  6. అల్-బుఖారీ (11/418) మరియు ముస్లిం (18/52) ఉల్లేఖించారు.
  7. అల్-బుఖారీ (8/534) ఉల్లేఖించారు.
  8. ఇబ్న్ అబీ హాతిమ్ కూడా ఉల్లేఖించారు, ఇది ఇబ్న్ ఉర్వా అల్-హంబలీ యొక్క అల్-కవాకిబుద్-దురారీ (6/112/2) లో అబూ ముత్తహర్ వరకు ‘హసన్’ అయిన ఇస్నాద్‌ తో ఉంది. అయితే, అద్-దౌలాబీ యొక్క అల్-కునా వల్-అస్మా లో కానీ, ముస్లిం యొక్క అల్-కునా లో కానీ, మరెవరి గ్రంథాలలో కానీ అతని జీవిత చరిత్ర కనుగొనబడలేదు. ఇందులో ఉన్న దాగివున్న లోపం ఏమిటంటే అతను షియా వర్గానికి చెందినవాడు, కానీ అతని జీవిత చరిత్ర అత్-తూసీ యొక్క అల్-కునా (షియా ఉల్లేఖకుల సూచిక) లో కూడా చేర్చబడలేదు.

సూఫీయిజం యొక్క వాస్తవికత : ఖుర్ఆన్ మరియు సున్నత్ వెలుగులో – షేక్ ముహమ్మద్ ఇబ్న్ రబీ ఇబ్న్ హాదీ [పుస్తకం]

ఖుర్ఆన్ మరియు సున్నత్ వెలుగులో సూఫీయిజం యొక్క వాస్తవికత
(The Reality Of Sufism In Light Of The Qur’aan & Sunnah)
రచన: షేక్ ముహమ్మద్ ఇబ్న్ రబీ ఇబ్న్ హాదీ అల్-మద్ఖలీ
తెలుగు అనువాదం : teluguislam.net

సకల స్తోత్రాలు మరియు కృతజ్ఞతలు అల్లాహ్ ఒక్కడికే శోభిస్తాయి, మరియు ఎవరి తర్వాత మరే ప్రవక్త రారో వారిపై అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలు మరియు శాంతి కురియుగాక, ఆ తర్వాత:

ఇది 1401H సంవత్సరంలో మక్కాలోని దారుల్-హదీస్ విద్యార్థులకు “ఖుర్ఆన్ మరియు సున్నత్ వెలుగులో సూఫీయిజం యొక్క వాస్తవికత” అనే శీర్షికతో నేను ఇచ్చిన ప్రసంగం. ఆ తర్వాత, సాధారణ ప్రజల ప్రయోజనార్థం దీనిని ముద్రించి ప్రచురించాలని కొందరు నికార్సైన శ్రేయోభిలాషులు కోరారు. సమయాభావం ఉన్నప్పటికీ నేను వారి అభ్యర్థనకు స్పందించాను. దీన్ని సిద్ధం చేసేటప్పుడు, ఏ విద్యార్థులకైతే ఈ ప్రసంగం ఇవ్వబడిందో వారి అవగాహనా స్థాయిని నేను దృష్టిలో ఉంచుకున్నాను. కాబట్టి, ఈ అంశంలోని వివిధ కోణాలను వివరిస్తూనే ఇది అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది, సకల స్తోత్రాలు మరియు కృతజ్ఞతలు అల్లాహ్ కే. సత్యాన్వేషకులందరికీ ఇది ఉపయోగపడేలా చేయాలని మహోన్నతుడైన అల్లాహ్ ను నేను కోరుకుంటున్నాను, మరియు అల్లాహ్ మా ఉద్దేశ్యాలను ఎరిగినవాడు.

ముహమ్మద్ ఇబ్న్ రబీ ఇబ్న్ హాదీ అల్-మద్ఖలీ
మక్కా. 6/3/1404H.