బహిష్టు మరియు బాలింత స్త్రీలు మస్జిద్లో ధర్మ విద్య నేర్చుకొనుటకు ఖురాన్ క్లాసులలో పాల్గొనవచ్చా?

బహిష్టు మరియు బాలింత స్త్రీలు మస్జిద్లో ధర్మ విద్య నేర్చుకొనుటకు ఖురాన్ క్లాసులలో పాల్గొనవచ్చా?
https://youtu.be/EBFz1Z_TW9g [3 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

సఫ్ (లైన్)లో ఖాలీ స్థలం వదలకండి, స్వర్గంలో గృహం పొందండి

తఫ్సీర్ సూరతుల్ జుముఆహ్ 62: ఆయతులు 9-11 (Tafsir Suratul Jumuah Ayah 9-11) [వీడియో]

బిస్మిల్లాహ్
తఫ్సీర్ సూరతుల్ జుముఆహ్ 62: ఆయతులు 9-11 (Tafsir Suratul Jumuah Ayah 9-11)

[49 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

ఇమాం వెనుక జుహ్ర్, అస్ర్ నమాజు చివరి రెండు రకాతులలో సూరహ్ ఫాతిహా తో పాటు ఇంకొక సూరా కూడా చదవవచ్చా? [వీడియో]

బిస్మిల్లాహ్

[1:32 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

వీడియో పాఠాలు

ధర్మపరమైన నిషేధాలు – 19: ఆరాధన ఉద్దేశంతో మూడు మసీదులు తప్ప మరెక్కడికీ ప్రయాణం చేయకు [వీడియో]

బిస్మిల్లాహ్

[1 నిముషం]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ధర్మపరమైన నిషేధాలు – 19

19- ఆరాధన ఉద్దేశంతో మూడు మసీదులు తప్ప మరెక్కడికీ ప్రయాణం చేయకు. 1. మక్కాలో ఉన్న మస్జిదుల్ హరాం. 2. మదీనలో ఉన్న మస్జిదె నబవి [1]. 3. ఫాలస్తీనలోని ఖుద్స్ లో ఉన్న మస్జిదె అఖ్సా. ఇవి గాకుండా వేరే మస్జిదుల వైపునకు వాటిని ఉద్దేశించి ప్రయాణం చేయరాదు.

عَنْ أَبِي هُرَيْرَةَ عَنِ النَّبِيِّ قَالَ: (لَا تُشَدُّ الرِّحَالُ إِلَّا إِلَى ثَلَاثَةِ مَسَاجِدَ الْمَسْجِدِ الْحَرَامِ وَمَسْجِدِ الرَّسُولِ @ وَمَسْجِدِ الْأَقْصَى)

“మస్జిదె హరాం, మస్జిదె నబవి మరియు మస్జిదె అఖ్సా. ఈ మూడు మస్జిదులు తప్ప మరే చోట (పుణ్యాన్ని ఆశించి) ప్రయాణించవద్దు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు

(బుఖారి/ బాబు ఫజ్లిస్ సలాతి ఫీ మస్జిది మక్కా వ మదీన/ 1189, ముస్లిం/ బాబు లా తుషద్దుర్ రిహాలు ఇల్లా…/ 1397).


[1] ప్రవక్త సమాధినుద్దేశించి మదీన ప్రయాణం చేయుట నిషిద్ధము. స్వయంగా ప్రవక్తయే దీనిని నిషేధించారు, హెచ్చరించారు. ఇలా చేయుట ఒక పండుగగా, ఉత్సవంగా అయిపోతుంది. ఇలా చేయువాడు హదీసు ఆధారంగా శాపగ్రస్తుడవుతాడు.

పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

డ్యూటీ వల్ల ఫజర్ నమాజులో, సున్నత్ చేయకుండా ఫర్జ్ ఒక్కటే చేస్తే నమాజు చెల్లుతుందా? అజాన్ ముందే నమాజు చేసుకోవచ్చా? [వీడియో]

బిస్మిల్లాహ్

[12:35 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) – పార్ట్ 12: సామూహిక నమాజ్, పంక్తుల విషయం, ఖస్ర్, జమ్అ [వీడియో]

బిస్మిల్లాహ్

[68 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

సామూహిక నమాజ్:

ఫర్జ్ నమాజ్ యొక్క జమాఅతు నిలబడిన తరువాత మస్జిదులో ప్రవేశించినవారు నఫిల్ లేక సున్నతులు చేయుట ధర్మ సమ్మతం కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః

إِذَا أُقِيمَتْ الصَّلَاةُ فَلَا صَلَاةَ إِلَّا الْمَكْتُوبَةُ. (مسلم ).

“ఏ నమాజ్ యొక్క ఇఖామత్ అయ్యిందో ఆ ఫర్జ్ నమాజ్ తప్ప మరో నమాజ్ చేయరాదు”. (ముస్లిం 710).

జహరీ([1]) నమాజులో ముఖ్తదీ([2]) నిశబ్దంగా

 ఇమాం ఖిరాత్ ను వినాలి. కాని సూరె ఫాతిహ మాత్రం తప్పక పఠించాలి. ఎందుకనగా సూరె ఫాతిహ పఠించని వ్యక్తి నమాజ్ కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:

(لَا صَلَاةَ لِمَنْ لَمْ يَقْرَأْ بِفَاتِحَةِ الْكِتَابِ).

“సూరె ఫాతిహ చదవనివారి నమాజ్ కాదు”. (బుఖారి 756, ముస్లిం 394)

పంక్తుల విషయం:

ముఖ్తదీ పంక్తిలో స్థలము పొందనిచో పంక్తుల వెనక ఒంటరిగా నమాజ్ చేయుట ఎట్టి పరిస్థితిలో కూడా యోగ్యం కాదు. అతనితో ఏ ఒకరైనా పంక్తిలో ఉండి నమాజ్ చేయుటకు ఒక వ్యక్తిని చూడాలి లేక ఒక వ్యక్తి

వచ్చే వరకు వేచి ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః        لاَ صَلاَةَ  لِفَردٍ خَلفَ الصَّف

“పంక్తుల వెనక ఒంటరిగా చేయు వ్యక్తి నమాజ్ కాదు”. (సహీ ఇబ్ను ఖుజైమ 3/30. సహీ ఇబ్ను హిబ్బాన్ 5/579 ).

వేచి ఉన్నప్పటికీ ఏ ఒక్కరినీ పొందనిచో వీలుంటే ఇమాం కుడి వైపున నిలబడాలి. లేదా ఇమాం సలాం తిప్పే వరకు వేచించాలి. అప్పటి వరకూ ఎవరు రాని యడల ఇమాం సలాం తింపిన తరువాత ఒంటరిగా నమాజ్ చేసుకోవాలి. (కాని షేఖ్ ఇబ్ను ఉసైమీన్ ఫత్వా చాలా బాగుంది: ముందు పంక్తిలో ఏ కొంచం స్థలం దొరికే అవకాశం లేకుంటే అతను ఒంటరిగా నిలబడాలి. ఈ సందర్భంలో హదీసు వ్యతిరేకం అనబడదు, గత్యంతరం లేని పరిస్థితి అనబడుతుంది).

మొదటి పంక్తిలో ఉండి నమాజ్ చేయుట పుణ్యకార్యం. దాని కాంక్ష ఎక్కువగా ఉండాలి. ఎందుకనగా పురుషుల కొరకు మేలయిన పంక్తి మొదటిది. అదే విధంగా ఇమాంకు కుడి ప్రక్కన ఉండుటకు ప్రయత్నించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః

(خَيْرُ صُفُوفِ الرِّجَالِ أَوَّلُهَا وَشَرُّهَا آخِرُهَا وَخَيْرُ صُفُوفِ النِّسَاءِ آخِرُهَا وَشَرُّهَا أَوَّلُهَا)

“పురుషుల మేలయిన పంక్తి మొదటిది. చెడ్డది చివరిది. స్త్రీలకు మేలయిన పంక్తి చివరిది. చెడ్డది మొదటిది”. (ముస్లిం 440).

మరో ఉల్లేఖనంలో ఇలా ఉందిః

(إِنَّ اللهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى مَيَامِنِ الصُّفُوفِ).

“కుడి పంక్తుల్లో ఉండి నమాజ్ చేసేవారిని అల్లాహ్ కరుణిస్తాడు, అల్లాహ్ దూతలు వారి కొరకు దుఆ చేస్తారు”. (అబూ దావూద్ 676).

పంక్తులను సరి చేసుకొని, నమాజీలు దగ్గరదగ్గరగా నిలబడుట తప్పనిసరి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

(سَوُّوا صُفُوفَكُمْ فَإِنَّ تَسْوِيَةَ الصَّفِّ مِنْ تَمَامِ الصَّلَاة)

“మీరు మీ పంక్తులను సరి చేసుకోండి. పంక్తులను సరిచేసుకొనుట నమాజ్ పరిపూర్ణతలో ఒక భాగం”. (ముస్లిం 433).

ఖస్ర్:

ఖస్ర్ అనగా నాలుగు రకాతుల నమాజ్ రెండు రకాతులు చేయుట. ప్రతి రకాతులో సూరె ఫాతిహ చదవాలి. దానితో పాటు మరో సూర లేదా ఖుర్ఆనులోని సులభంగా జ్ఞాపకమున్న కొన్ని ఆయతులు చదవాలి. మగ్రిబ్ మరియు ఫజ్ర్ మాత్రం ఖస్ర్ చేయరాదు.

ప్రయాణంలో ఉన్న వారు నమాజ్ ఖస్ర్ చేయుటయే ధర్మం. అంతే కాదు; ప్రయాణికుడు నమాజును ఖస్ర్ చేయుటయే ఉత్తమం. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణం చేసినప్పుడల్లా ఖస్ర్ చేశారు. 80 కిలోమీటర్లకు పైగా ఎవరైనా ప్రయాణము చేస్తే దానినే ప్రయాణమనబడును. అల్లాహ్ అవిధేయతకు గాకుండా విధేయత కొరకు ప్రయాణం చేసినప్పుడు ఖస్ర్ చేయుట ధర్మం.

స్వనగర గృహాలను దాటిన తరువాత ఖస్ర్ ప్రారంభించి, తమ నగరానికి తిరిగి వచ్చేంత వరకు ఖస్ర్ చేయవచ్చును. ఇలా ప్రయాణం ఎన్ని రోజులయినా సరే. కాని ఒక వేళ ప్రయాణం చేసిన ఊరిలో నాలుగు లేక అంతకంటే ఎక్కువ రోజులు నిలవాలని ముందే నిశ్చయించుకుంటే ఖస్ర్ చేయకూడదు. పూర్తి నమాజ్ చేయాలి.

ప్రయాణంలో సున్నత్, నఫిల్ నమాజులు చేయనవసరం లేదు. కాని ఫజ్ర్ సున్నత్ లు మరియు విత్ర్ తప్పకుండా చేయాలి. వాటిని విడనాడకూడదు.

జమ్అ:

జొహ్ర్ మరియు అస్ర్ నమాజులు రెండిట్లో ఏదైనా ఒక సమయంలో, అలాగే మగ్రిబ్ మరియు ఇషా నమాజులు రెండిట్లో ఏదైనా ఒక సమయంలో చేయుటనే జమఅ అంటారు. అయితే జొహ్ర్, అస్ర్ జొహ్ర్ సమయంలో మరియు మగ్రిబ్, ఇషా మగ్రిబ్ సమయంలో చేస్తే జమఅతఖ్ దీమ్ అంటారు. ఒకవేళ జొహ్ర్, అస్ర్ అస్ర్ సమయంలో మరియు మగ్రిబ్, ఇషా ఇషా సమయంలో చేస్తే జమఅ తాఖీర్ అంటారు. ప్రయాణికుడు జమఅతఖ్ దీమ్ లేక జమఅతాఖీర్ చేయుట ధర్మమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తబూక్ నగరానికి ప్రయాణించినప్పుడు ఇలా చేశారని రుజువయినది. (బుఖారి, ముస్లిం).

ప్రయాణికుడు ఖస్ర్ చేయవచ్చనే విషయం పైన చదివారు, అయితే ఖస్ర్ తో పాటు జమఅ కూడా చేయవచ్చును. జమఅ తఖ్ దీమ్ చేయాలనుకున్నప్పుడు ఇఖామత్ చెప్పి జొహ్ర్ సమయంలో జొహ్ర్ యొక్క రెండు రకాతులు చేసి సలాం తింపిన తరువాత మళ్ళీ ఇఖామత్ చెప్పి అస్ర్ యొక్క రెండు రకాతులు చేయాలి. మగ్రిబ్ సమయంలో ఇఖామత్ చెప్పి మగ్రిబ్ యొక్క మూడు రకాతులు చేసి సలాం తింపిన తరువాత మళ్ళీ ఇఖామత్ చెప్పి ఇషా యొక్క రెండు రకాతులు చేయాలి.

అదే విధంగా స్థానికులు కూడా జమఅచేయవచ్చును. కాని ఖస్ర్ చేయరాదు. జమఅ చేయు సందర్భాలుః వర్షం కురిసినప్పుడు, లేదా చలి ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా తూఫాను గాలి ఉండి నమాజీలకు మస్జిద్ వెళ్ళడం కష్టంగా ఉన్నప్పుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి వర్షం కురిసిన రాత్రి మగ్రిబ్ మరియు ఇషా నమాజులు కలిపి చేశారు.

అదే విధంగా వ్యాదిగ్రస్తుడు ప్రతి నమాజ్ దాని సమయాన పాటించుట కష్టంగా ఉన్నప్పుడు రెండు నమాజులు కలిపి చేయవచ్చును.


[1]) జహరీ నమాజు అంటే శబ్దంగా ఖుర్ఆను పారాయణం జరిగే ఫజ్ర్, మగ్రిబ్, ఇషా నమాజులు.

[2]) ముఖ్తదీ అంటే సామూహిక నమాజులో ఇమాం వెనక నమాజు చేయువారు.  


ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

జుమా రోజు మసీదుకు పిల్లలను తీసుకువచ్చే వారికి కొన్ని సూచనలు [వీడియో]

బిస్మిల్లాహ్

[2 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

ఇతరములు:

మూడో అతను మఖం తిప్పుకున్నాడు. అల్లాహ్ కూడా అతని నుండి ముఖం తిప్పుకున్నాడు

బిస్మిల్లాహ్

حَدَّثَنَا إِسْمَاعِيلُ، قَالَ حَدَّثَنِي مَالِكٌ، عَنْ إِسْحَاقَ بْنِ عَبْدِ اللَّهِ بْنِ أَبِي طَلْحَةَ، أَنَّ أَبَا مُرَّةَ، مَوْلَى عَقِيلِ بْنِ أَبِي طَالِبٍ أَخْبَرَهُ عَنْ أَبِي وَاقِدٍ اللَّيْثِيِّ، أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم بَيْنَمَا هُوَ جَالِسٌ فِي الْمَسْجِدِ وَالنَّاسُ مَعَهُ، إِذْ أَقْبَلَ ثَلاَثَةُ نَفَرٍ، فَأَقْبَلَ اثْنَانِ إِلَى رَسُولِ اللَّهِ صلى الله عليه وسلم وَذَهَبَ وَاحِدٌ، قَالَ فَوَقَفَا عَلَى رَسُولِ اللَّهِ صلى الله عليه وسلم فَأَمَّا أَحَدُهُمَا فَرَأَى فُرْجَةً فِي الْحَلْقَةِ فَجَلَسَ فِيهَا، وَأَمَّا الآخَرُ فَجَلَسَ خَلْفَهُمْ، وَأَمَّا الثَّالِثُ فَأَدْبَرَ ذَاهِبًا، فَلَمَّا فَرَغَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم قَالَ ‏

‏ أَلاَ أُخْبِرُكُمْ عَنِ النَّفَرِ الثَّلاَثَةِ أَمَّا أَحَدُهُمْ فَأَوَى إِلَى اللَّهِ، فَآوَاهُ اللَّهُ، وَأَمَّا الآخَرُ فَاسْتَحْيَا، فَاسْتَحْيَا اللَّهُ مِنْهُ، وَأَمَّا الآخَرُ فَأَعْرَضَ، فَأَعْرَضَ اللَّهُ عَنْهُ ‏”

అబూ ‘వాఖిద్‌ అల్లెతి (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు; ఒకసారి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మసీదులో కూర్చొని ఉన్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో పాటు ఇంకా కొందరు కూడా అక్కడ కూర్చోని ఉన్నారు. ఇంతలో ముగ్గురు మనుషులు అక్కడకు వచ్చారు. వారిలో ఇద్దరయితే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరకు ప్రసంగం వినేందుకు వచ్చారు. మూడో మనిషి అక్కణుంచి వెళ్లిపొయ్యాడు. ఆ ఇద్దరూ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముందుకు వచ్చి కొంతసేపు నిలబడ్డారు. అంతలో వారిలో ఒకడు సభలో మధ్యన ఒకచోట కొంచెం ఖాళీ స్థలం ఉండటాన్ని గమనించి అక్కడకు పోయి కూర్చున్నాడు. రెండో అతను సభలో జనం వెనుక భాగంలో కూర్చున్నాడు. మూడో అతను వెనుతిరిగి వెళ్లిపోయాడు. తమ ప్రసంగాన్ని ముగించిన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

ఈ ముగ్గురి వ్యక్తుల గురుంచి మీకు తెలుపనా? ఒకతను ఆ అల్లాహ్‌ శరణు కోరుకున్నాడు; అల్లాహ్‌ అతన్ని కరుణించి అతనికి స్థలాన్ని ప్రసాదించాడు. రెండో అతను సభ లోపలకు చొరబడటానికి పోయి కూర్చోటానికి సిగ్గుపద్డాడు. అల్లాహ్ కూడా అతన్ని చూసి సిగ్గుపడ్డాడు, అతనిపై కృప చూపాడు. మూడో అతను మఖం తిప్పుకున్నాడు. అల్లాహ్ కూడా అతని నుండి ముఖం తిప్పుకున్నాడు.”

సహీహ్ బుఖారి. 3 వ అధ్యాయం “జ్ఞానం”. హదీథ్ నెంబర్:66

ధర్మపరమైన నిషేధాలు – 16 : షిర్క్ సాధనాలను అంతమొందించుటకు సమాధి ఉన్న మస్జిదులో నమాజు చేయకు [వీడియో]

బిస్మిల్లాహ్

[4:36 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ధర్మపరమైన నిషేధాలు 16

16- షిర్క్ సాధనాలను అంతమొందించుటకు సమాధి ఉన్న మస్జిదులో నమాజు చేయకు [1]

وَأَنَّ المَسَاجِدَ للهِ فَلَا تَدْعُوا مَعَ اللهِ أَحَدًا] {الجنّ:18}

మసీదులు అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కనుక వాటిలో అల్లాహ్ తో పాటు ఇతరులెవ్వరినీ ప్రార్థించకండి[. (జిన్ 72: 18).


[1]  సమాధిపై మస్జిద్ నిర్మిచబడితే దానిని పడగొట్టుట లేదా మస్జిదులో సమాధి చేయబడితే శవాన్ని అందులో నుండి తీసి స్మశానం (ఖబ్రి- స్తాన్)లో సమాధి చేయుట విధిగా ఉంది. ఇలాగే షిర్క్ ఉపద్రవాల నుండి రక్షణ పొందగలుగుతాము.

పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

%d bloggers like this: