ఇస్లాంలో పవిత్ర మాసాలు, రజబ్ మాసంలో ఒక ముస్లిం ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? [2 వీడియోలు]

బిస్మిల్లాహ్

ఇస్లాంలో పవిత్ర మాసాలు,
రజబ్ మాసంలో ఒక ముస్లిం ఏమి చేయాలి? ఏమి చేయకూడదు?

రెండు వీడియోలు చూడండి

మొదటి భాగం:


ఈ వీడియోలో ఇస్లాం లో పవిత్ర మాసాల విషయం, వాటి ప్రాముఖ్యత, మరియు వాటిలో జుల్మ్ (అన్యాయం) చేసుకోకూడదని వివరించబడింది.

రెండవ భాగం:


ఈ వీడియో లో రజబ్ మాసంలో జరిగే బిద్’అత్ (దురాచారాల) గురుంచి వివరించబడింది.

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

మేరాజున్‌ నబీ పండుగ

బిస్మిల్లాహ్

12- మేరాజున్‌ నబి పండుగ

రజబ్‌ నెల 27వ తేది మేరాజున్‌ నబీ పవిత్రమైన సంఘటన జరిగిందని ఆ పండుగను జరుపుకునే వారి అభిప్రాయం. అందువలన వారు ప్రతి ఏటా మేరాజున్‌ నబీ రాత్రి ఒక పండుగ కొరకు ముస్తాబవుతారు. అలాగే తమ ఇండ్లల్లో ప్రత్యేకమైన వంటకాలు చేసుకుంటారు. మరియు ఫాతిహాలు అర్పిస్తారు. మసీదులను పచ్చటి మరియు ఎర్రటి లైట్లతో అలంకరిస్తారు, మసీదులలో ప్రత్యేకమైన నఫిల్‌ నమాజులు చదువుతారు. మరియు ఆ రాత్రంతా మేరాజున్‌ నబీ జరిగిన సంఘటను గురించి మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) చరిత్ర గురించి ప్రసంగాల సభలు నిర్వహిస్తారు. మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ప్రత్యేకమైన “దరూద్‌ దుఆ” లను చదువుతారు. ఆ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు.

కొంతమంది ప్రజలు మేరాజున్‌ నబీ గురించి కొన్ని కల్పిత విషయాలు జొప్పించుకొని ప్రసంగాలు చేస్తారు, అంతే కాక ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహివసల్లం) గారి పట్ల ధర్మ హద్దులు మీరి అతిగా పొగుడ్తారు. ఉదాహరణకు:

1- ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) కొరకు అల్లాహ్‌ తన తేజస్సు తెరను తొలిగించాడు. కనుక అల్లాహ్‌ను అసలైన రూపంలో ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) కళ్ళారా దర్శించే భాగ్యాన్ని పొందినట్లు అంటారు.

2- ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) మేరాజ్‌ రాత్రి అల్లాహ్‌ వద్దకు చేరుకునేందుకు తమ కాళ్ళ నుండి చెప్పులను తీయబోతే, అల్లాహ్‌ ఆయన్ని చెప్పులతో సహా ఆహ్వానించారు అని కథలు చెప్పుకుంటారు.

౩- మేరాజ్‌ రాత్రి ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్‌ ను స్వయంగా సందర్శించారు మరియు అల్లాహ్‌ మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి మధ్య ఆలింగనము చేసుకునే వ్యత్యాసం మాత్రమే మిగిలిందని అంటారు.

4- అల్లాహ్‌ తన తేజస్సు తెరను తొలిగించినప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు అల్లాహ్‌ను చూస్తే అల్లాహ్‌ కూడా ప్రవక్త రూపంలోనే ఉన్నారని అంటారు.

హజ్రత్ ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణి ఆయిషా (రజియల్లాహు అన్హ) గారు ఇలా తెలియజేసారు: “ఎవరైతే అల్లాహ్‌ను ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు కళ్ళారా చూసారని అంటారో వారు అల్లాహ్‌ పై  అబద్దాన్ని అంటగట్టినట్టే”…. (బుఖారి: 259)

ఇలా అనేకమైన షిర్క్ కు చెందిన విషయాలను మేరాజ్‌ రాత్రిన అమాయక ప్రజల ముందు ప్రసంగిస్తారు. ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని అల్లాహ్‌ స్థాయికి పెంచి అల్లాహ్‌ అంటే ప్రవక్త, ప్రవక్త అంటే అల్లాహ్‌ అని విశ్వసిస్తారు. ఇలా విశ్వసించటం క్రైస్తవుల విశ్వాసంకంటే హీనమైన విశ్వాసంగా తెలుస్తుంది. ఎందుకంటే? క్రైస్తవులు యేసు (అలైహిస్సలాం) వారిని అల్లాహ్‌ కుమారునిగా విశ్వసిస్తారు. కాని మన ముస్లిం ప్రజలలో కొంత మంది ప్రజలు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను పూర్తిగా అల్లాహ్‌ స్థాయికి పెంచి అనేక కవితాగానాలు రచించారు. మరియు ఆ రాత్రంతా వాటిని పాడుతుంటారు.

అందుకనే ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు: “మీరు నన్ను పొగడటంలో హద్దులు మీరకండి, ఎలాగైతే క్రైస్తవులు మర్యమ్‌ కుమారుడగు ఈసా(అలైహిస్సలాం) గారి పట్ల హద్దుమీరి పొగడ్తల్లో ముంచారో! నిశ్చయంగా నేను అల్లాహ్‌ దాసుడను మాత్రమే. కనుక మీరు నన్ను అల్లాహ్‌ దాసుడు మరియు ఆయన ప్రవక్త అని మాత్రమే అనండి.” (బుఖారి: ౩189)

13- పవిత్రమైన మేరాజ్‌ సంఘటన వాస్తవం

మేరాజున్‌ నబీ యాత్ర ఎప్పుడు జరిగిందని అడిగితే? దానికి సూటిగా ఒక జవాబుగా హిజ్రత్ కు ఒక ఏడాది ముందు జరిగిందని చెప్పవచ్చు.

కాని ఏ నెలలో? ఏ తేదిలో అని చెప్పడానికి స్పష్టమైన ఆధారం ఇస్లామీయ చరిత్రలో భధ్రపరచబడలేదు. కనుక ప్రవక్త గారి చరిత్రను రచించినవారిలో కూడా మేరాజ్‌ సంఘటన గురించి అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. వాటిలో కొన్నిటిని మీ ముందు ఉంచుతున్నాము:

1- దైవదౌత్యం ప్రసాదించబడిన సంవత్సరమే ఈ మేరాజ్‌ సంభవించిందని ఇమామ్‌ తబ్రీ కథనం.

2- దైవదౌత్యం అయిదు సంవత్సరాల తరువాత జరిగిందని ఇమామ్‌ నూవీ, ఇమామే ఖుర్తిబీ కథనం.

౩- దైవదౌత్యం పదవ సంవత్సరం రజబ్‌ నెల 27వ తేదిన సంభవించిందని, సులైమాన్‌ మన్సూర్‌పూరి కథనం.

4- హిజ్రత్ పదహారు మసాల ముందు రమజాన్‌ నెలలో సంభవించిందని, లేక హిజ్రత్ పదునాలుగు మాసాల ముందు ముహర్రం నెలలో సంభవించిందని, లేక హిజ్రత్ కు ఒక సంవత్సరం ముందు రబీఉల్‌ అవ్వల్‌ మాసంలో సంభవించిందని రచయితలు భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. ఏదైనప్పటికి ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణి హజ్రత్ ఖదీజా (రజియల్లాహు అన్హ) గారి తదనంతరం మేరాజ్‌ సంఘటన జరిగినట్లు స్పష్టమవుతుంది. మరియు హజ్రత్ ఖదీజా (రజియల్లాహు అన్హ) గారు దైవదౌత్య శకం పదవ సంవత్సరం రమజాన్‌ నెలలో మరణించినట్లు తెలుస్తుంది. కనుక ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) హిజ్రత్‌ కంటే ఒక యేడాది ముందు మేరాజ్‌ సంఘటన సంభవించినదిగా భావించాలి. (వివరాలకు అర్రహిఖుల్‌ మఖ్తూమ్‌ – మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత చరిత్ర తెలుగు, 224-225 చూడండి).

మేరాజున్‌ నబీ సంఘటన ఏ నెలలో మరియు ఏ తేదిన జరిగిందో అన్న విషయం మన మహానీయులైన ధర్మ గురువులకే స్పష్టమైన జ్ఞానం లేదంటే మనం రజబ్‌ నెల 27వ తేదిన మేరాజున్‌ నబీ పండుగ జరుపుకోవడం ఎంతవరకు ధర్మం. అలాగే మేరాజ్‌ రాత్రి ఆరాధనలు మరియు పగలు ఉపవాసం గనక ఇస్లామీయ సాంప్రదాయం అనుకుంటే, ప్రవక్త ముహమ్మద్‌(సల్లల్లాహు అల్లిహి వసల్లం) మేరాజ్‌ తరువాత పన్నెండు సంవత్సరాల వరకు సహాబాల మధ్య బతికున్నారు, అయినా ఆయన మేరాజ్‌ జరిగిన పవిత్రమైన రోజు ఇలాంటి ఆరాధనలు ఎందుకు పాటించలేదు? తరువాత సహాబాలు మేరాజ్‌ రోజున పండుగగా ఎందుకు నిర్వహించలేదు. ఒకవేళ వారు ప్రతి సంవత్సరం మేరాజ్‌ రాత్రిని ఆరాధనల కొరకు మరియు పగలు ఉపవాసం కొరకు ప్రత్యేకం చేసుకొని పర్వదినంగా నిర్వహించి ఉంటే, మేరాజ్‌ జరిగిన మాసము మరియు తేది కూడా స్పష్టంగా తెలిసి ఉండేది కదా! మరియు ఆ రోజున చేసే కార్యాలకు, ఆరాధనలకు ప్రవక్త ఆమోదం కూడా లభించి ఉండేది కదా!.

నా ప్రియమైన ముస్లిం సోదరులారా! మనం పుణ్యాలు చేయుట కొరకు ఆశక్తి చూపాలి, కాని ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) మార్గదర్శకం ప్రకారమే మనం ఆరాధనలు చెయ్యాలి. అప్పుడే అవి అల్లాహ్‌ వద్ద ఆమోదయోగ్యానికి నోచుకుంటాయి. మేరాజున్‌ నబీ అన్నది ఇస్లామీయ ధర్మానికి చెందిన ఒక విశ్వాసనీయ సంఘటన, మరియు ఎంతో అద్భుతమైన సంఘటన, ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు చాలా కష్టాలకు, దుఃఖాలకు నష్టాలకు గురికాబడ్డారు. అంతలో హజ్రత్ ఖదీజా(రజియల్లాహు అన్హా) కూడా మృతి చెందారు. చివరికి ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ సంవత్సరానికి ఆముల్‌ హుజ్న్‌ (శోక సంవత్సరం) గా భావించారు. అప్పుడు అల్లాహ్‌ ఆయన శోకాన్ని, మరియు దుఃఖాన్ని దూరం చేయుట కొరకు ఈ మహోన్నతమైన మేరాజ్‌ గగన యాత్రను ఏర్పాటు చేసినట్లు ధర్మగురువులు భావిస్తారు.

అక్కడ ప్రవక్త ముహమ్మద్‌(సల్లల్లాహు అలైహి వసల్లం) గారు అనేక మంది ప్రవక్తలను కలిసి మాట్లాడారు. స్వర్గం, నరకం మరియు అనేక అద్భుత విషయాలను చూసారు. తరువాత ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు వారి ఉమ్మత్‌ కొరకు అల్లాహ్‌ ఒక మహోన్నత బహుమానంగా, ఐదు సమయాల నమాజులను విధిగా ప్రసాదించాడు. మరియు “సూరతుల్‌ బఖరా” చివరి ఆయతులను కూడా ప్రసాదించాడు.

మనం మేరాజున్‌నబి గురించి పవిత్రమైన సంఘటనగా విశ్వసించాలి, ఆ సంఘటన గురించి ఉన్న వాస్తవాలను యదాతధంగా నమ్మాలి. మరియు ప్రతి రోజు ఐదు సమయాల నమాజును విధిగా పాటించాలి. ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వర్గం, నరకం గురించి తెలియజేసిన విషయాలను నిత్యం గుర్తుంచుకొని భయభక్తితో జీవితాన్ని గడపాలి.


ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 83-87). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)

బిద్అత్ (నూతనాచారం) – Bidah

రజబ్‌ నెల వాస్తవికత – రజబ్‌కీ కుండే (కుండల పండుగ)

బిస్మిల్లాహ్

10- రజబ్‌ నెల వాస్తవికత

రజబ్‌ అంటే: అరబీ భాషలో “గౌరవమైనది, పవిత్రమైనది”. కనుక అరబ్‌ వాసులు ఈ నెలను పవిత్రంగా భావించేవారు మరియు మూఢ (జాహిలియత్‌) కాలంలో ఈ నెలలో తమ ఆరాధ్యులైన విగ్రహాల పేరున జంతువులను బలినిచ్చేవారు. ఆ జంతువులను వారు ‘అతీరా’ అని పేర్కొనేవారు. కాని ఇస్లాం ధర్మం వచ్చిన తరువాత ఆ ఆచారాన్ని నిర్మూలించడం జరిగింది.

ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) రాక మునుపే, అంటే అజ్ఞాన కాలం నుండే రజబ్‌, జిల్‌ ఖాదా, జిల్‌ హిజ్జా మరియు ముహర్రం నెలలను పవిత్రంగా భావించేవారు. ఆ నెలలలో దండయాత్రలు లేక యుద్దాలు, తగాదాలు వంటి కార్యాలు నిషేధించబడి యున్నవి. దానివల్ల ప్రజలు హజ్‌ నియమాలను శాంతి భద్రతతో నెరవేర్చుటకు అనుకూల మయ్యేది. తరువాత ఆ నిషేధిత ఆదేశం కూడా తొలిగిపోయింది. అనివార్యమైన స్థితిలో ధర్మయుద్దాలు చేయవచ్చునని ధర్మగురువులు ఏకీభవించారు. కాని ఇతర నెలలకంటే ఎక్కువగా ఈ నాలుగు నెలల పవిత్రతను దృష్టిలో ఉంచుకొని పాపాలకు మరియు అల్లాహ్‌ ఎడల అవిధేయతకు గురికాకుండా జాగ్రత్త పడాలని హితోపదేశం చేశారు. (లతాయిఫుల్‌ మఆరిఫ్‌).

కనుక ఖుర్‌ఆన్‌ గ్రంథంలో అల్లాహ్‌ ఇలా తెలియజేశాడు:

إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ

“నెలల సంఖ్య అల్లాహ్‌ దగ్గర అల్లాహ్‌ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజు నుంచీ (ఈ లెక్క ఇలాగే కొనసాగుతున్నది) వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి). ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి”. (సూరతు తౌబా:36).

ప్రస్తుత కాలంలో కొంత మంది ముస్లింల చేత రజబ్‌ నెలలో ప్రత్యేకమైన నూతన కార్యాలను ఆరాధనలుగా జొప్పించుకున్నారు. అంటే; నఫిల్‌ ఉపవాసాలు, రగాయిబ్‌ నమాజ్‌, మరియు షబే మేరాజ్‌ పండుగ వంటి ఆరాధనలు. ఇలాంటి ఆరాధనలు నెరవేర్చుటకు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఆదేశించినట్లు హదీసు గ్రంథాలలో ఎక్కడ రుజువులు లేవు. అయినా కొంత మంది ప్రజలు కొన్ని బలహీనమైన, మనోకల్పిత హదీసులను ఆధారంగా చేసుకొని ఆరాధిస్తున్నారు. అలాంటి హదీసుల పట్ల అనేక ఇస్లామీయ ముఖ్య పండితులు ఇలా తెలియజేశారు:

ఇమామ్‌ హజ్రత్ ఇబ్ను హజర్‌ (రహ్మతుల్లాహి అలైహి) ఇలా తెలియజేశారు: “రజబ్‌ నెలలో పాటించే ఉపవాసాలకుగాని, నఫిల్‌ నమాజులకుగాని ఎటువంటి ఆధారపూర్వకమైన హదీసులు లేవు” (తబ్యీ నుల్‌ అజబ్‌: 71)

ఇమామ్‌ సుయూతి (రహ్మతుల్లాహి అలైహి) ఇలా తెలిపారు: “రజబ్‌ నెల ఉపవాసాల గురించి ఉన్న హదీసులన్నీ నిరాధారమైనవి, మనోకల్పితమైనవి కూడా. ” (అష్షమారీఖ్‌ ఫీ ఇల్మిత్‌ తారీఖ్‌-40).

హజ్రత్ అలీ బిన్‌ ఇబ్రాహీమ్‌ అల్‌ అత్తార్‌(రహ్మతుల్లాహి అలైహి) ఇలా తెలిపారు: “రజబ్‌ నెల ఉపవాసాల గురించి హదీసులన్నీ నిరాధారమైనవి, మనోకల్పితమైనవి.” (అల్‌ ఫాయిదుల్‌ మజ్మూఅ -440).

ఇమామ్‌ ఇబ్నుల్‌ జౌజి(రహ్మతుల్లాహి అలైహి) మరియు షేఖుల్‌ ఇస్లాం ఇమామ్‌ ఇబ్ను తైమియా (రహ్మతుల్లాహి అలైహి) మరియు ఇమామ్‌ ఇబ్నుల్ ఖయ్యూమ్‌ (రహ్మతుల్లాహి అలైహి) మరియు అనేక ప్రముఖ ధర్మ గురవుల అభిప్రాయం ప్రకారం: “రజబ్‌ నెలలో పాటించే ప్రత్యేకమైన ఆరాధనల ప్రాముఖ్యతకు ఎలాంటి విశ్వాసనీయ ఆధారాలు లేవు” అని తెలిపారు.

ప్రియమైన ముస్లిం సోదరులారా! మనం ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) విధేయతను మరియు ఆయన చూపిన మార్గాన్ని మాత్రమే అనుసరించాలి. క్రొత్త క్రొత్త ఆచారాలను, ఆరాధనలను వెలుగులోకి తెచ్చుకొని ఆరాధించడం ధర్మ సమ్మతం కాదు. ప్రతి నెలలో ధర్మ పరమైన ఆరాధనలు ఎలాగైతే పాటిస్తున్నామో, అలాగే రజబ్‌ నెలలో కూడా మనం ఆరాధనలు పాటించాలి.

11- రజబ్‌కే  కుండే

రజబ్‌కే కుండే పేరుతో ఒక పండుగ 1906వ సంవత్సరంలో భారతదేశం రాంపూర్‌ అనే పట్టణంలో ఆరంభమైనది. ఖుర్‌షీద్‌ అహ్మద్‌ మీనాయి అనే వ్యక్తి “దాస్తానే అజీబ్‌” అనే పేరున ఒక కట్టుకథ రచించాడు.

హజ్రత్‌ ఇమామ్‌ జాఫర్‌ సాదిఖ్‌ (రహ్మతుల్లాహి అలైహి) గారి గురించి ఆయన ఆదేశించినట్లుగా అతను ఇలా రాశాడు:

“ఎవరైతే రజబ్‌ 22వ తేదిన నా పేరున మొక్కుబడి చెల్లిస్తూ “కుండల ఆచారాన్ని” పాటించి, నా పేరున తన అవసరాన్ని వేడుకుంటే అతని అవసరం తప్పక తీరుతుంది. ఒక వేళ అతని అవసరం తీరకపోతే ప్రళయ దినాన నా దుస్తుల అంచు అతని చేతిలో ఉంటుంది.”

మన అమాయక ముస్లిం ప్రజలు ఆ కథను ఆధారంగా చేసుకొని, ప్రతి ఏట ‘కుండల పండుగ‘ పేరుతో మొక్కుబడి చెల్లిస్తూ రాత్రంతా హల్వా, పూరీలు అర్పిస్తారు. మరియు వాటిపై ఫాతిహాలు చేస్తారు. స్వతహాగా వారు తింటారు, ఇతరులను కూడా విందుగా ఆహ్వానిస్తారు.

1, ప్రియమైన ముస్లిములారా! మీరే ఆలోచించండి ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) చనిపోయిన 1400 సంవత్సరాల తరువాత ఆరంభమైన ఈ కార్యం ఎలా పుణ్యపరమైనది?

2, ధర్మానికి చెందిన ప్రతి పుస్తకంలో మొక్కుకోవడం మరియు వేడుకోవడం, అల్లాహ్‌ యొక్క ఆరాధనే అవుతుందని ఉంది. ఆ ఆరాధన అల్లాహ్‌కు మాత్రేమే సొంతం చేయాలి. అల్లాహ్‌ను తప్ప ఇతరులను ‘మొక్కుకోవడం, మొరపెట్టుకోవడం షిర్క్‌ అవుతుంది. అలాంటప్పుడు హజ్రత్‌ ఇమామ్‌ జాఫర్‌ (రహ్మతుల్లాహి అలైహి) లాంటి మహా ధర్మ గురువులు ఇలాంటి బహుదైవారాధన గురించి ఆదేశమిచ్చినట్టు, దానిని ప్రోత్సహించినట్లు మనం ఎలా భావించగలం?

3, రజబ్‌ నెల 22వ తేదికి మరియు ఇమామ్‌ జాఫర్‌ (రహ్మతుల్లాహి అలైహి) గారికి సంబంధం ఏమిటి? ఆ రోజు ఆయన జననం కాదు మరియు మరణం కూడా కాదు. ఆయన 80 హిజ్రీ, రమజాన్‌ 8వ తేదిన జన్మించారు, 148 హిజ్రీ, షవ్వాల్‌ 15వ తేదిన మరణించారు. ఆయన జీవితంలో ఆ తేదిన ముఖ్యమైన సంఘటన జరిగినట్లు కూడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే; రజబ్‌ 22వ తేదిన కాతిబే వహీ హజ్రత్‌ ముఆవియా (రజియల్లాహు అన్హు) గారి మరణం జరిగింది. అలాంటప్పుడు ఇమామ్‌ జాఫర్‌ (రహ్మతుల్లాహి అలైహి) గారికి మరియు రజబ్‌ నెలకు ఎలాంటి పొంతన లేదు.


ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 79-82). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)

బిద్అత్ (నూతనాచారం) – Bidah

రజబ్ నెల కల్పితాచారాలు, వడ్డీ తినుట, వ్యభిచారం, ప్రవక్త సమాధికి సంభందించిన దురాచారాలు [వీడియో]

బిస్మిల్లాహ్

31:22 నిమిషాలు

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia


బిద్అత్ (నూతనాచారం) – Bid’ah

మేరాజ్ (గగణ ప్రయాణ) దృశ్యాలు [వీడియో]

బిస్మిల్లాహ్

ప్రవక్త మేరాజ్ (గగణ ప్రయాణాని)కి రజబ్ లోనే వెళ్ళారా?
ఈ సందర్భంగా తర్వాత రోజుల్లో షబె మేరాజ్ జరుపుకున్నారా? 

36:38 నిమిషాలు, తప్పక వినండి

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

%d bloggers like this: