[5:38 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ధర్మపరమైన నిషేధాలు –37
37- సత్కార్యాలు చేయకుండానే అల్లాహ్ కారుణ్యం పట్ల ఆశ ఉంచకు. మంచి కార్యాలు చేయడమే అల్లాహ్ పట్ల మంచి తలంపు ఉంచినట్లు నిదర్శనం. అలసట, అలక్ష్యం ద్వారా అల్లాహ్ కారుణ్యం లభించదు. సత్యవిశ్వాసం, సత్కార్యాల ద్వారానే లభిస్తుంది. వాస్తవానికి అల్లాహ్ కారుణ్యం పుణ్యాత్ములకు సమీపంలో ఉంది.
నిశ్చయంగా విశ్వసించి, అల్లాహ్ మార్గంలో తమ ఇల్లూ వాకిలీ సహితం విడిచి జిహాద్ చేసేవారు అల్లాహ్ కారుణ్యం ఆశించటానికి అన్ని విధాలా అర్హులు. అల్లాహ్ వారి తప్పులను క్షమించి వారిని కరుణిస్తాడు. (బఖర 2: 218).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[8:39 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ధర్మపరమైన నిషేధాలు –36
36- అల్లాహ్ ఆరాధన కేవలం ప్రేమతో, లేదా కేవలం ఆశతో, లేదా కేవలం భయంతో చేయకూడదు. ఆశ, భయం పక్షికి ఉండే రెండు రెక్కల్లాంటివి. పక్షి ఒక రెక్కతో పైకి ఎగర లేదు కదా? అందుకే విశ్వాసులైన పుణ్యాత్ములు ఆశ, భయం ఈ రెండిటి ద్వారా అల్లాహ్ ను ఆరాధించేవారు:
ఈ ప్రజలు మొరపెట్టుకుంటున్న వారే స్వయంగా తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు, ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. వారు ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు. ఆయన శిక్షకు భయపడుతున్నారు. (బనీ ఇస్రాఈల్ 17: 57).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
9 వ అధ్యాయం
చెట్లు , రాళ్ళతో శుభం (తబర్రుక్ ) కోరుట అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.
అల్లాహ్ ఆదేశం: “ఈ లాత్, ఈ ఉజ్జా, మూడోది ఒక దేవత అయిన మనాత్ల వాస్తవికతను గురించి కాస్తయినా ఆలోచించారా?”(సూరా నజ్మ్ 53:19,20).
అబూ వాఖిద్ లైసీ (రది అల్లాహు అన్హు) కథనం: మేము ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) తో కలసి హునైన్ యుద్దానికి వెళ్ళాము. అప్పుడే మేము కొత్తగా ఇస్లాం స్వీకరించి యుంటిమి. (దారి మధ్యలో ఒక చోట) ముష్రిక్కుల ఒక ‘రేగు చెట్టు’ ఉండింది. అక్కడ వారు శుభం (తబర్రుక్) కలగాలని కూర్చుండేవారు, తమ ఆయుధాలను దానికి తగిలించేవారు. దానిని “జాతు అన్వాత్”” అనేవారు. ఆ రేగుచెట్టు దగ్గరి నుండి మేము వెళ్తూ “మాకు కూడా అలాంటి ఒక “జాతు అన్వాత్ ” నిర్ణయించండి ప్రవక్తా’ అని అన్నాము.
అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అన్నారు: “అల్లాహు అక్బర్! ఇవే (గత జాతులు పాటించిన) పద్దతులు, మార్గాలు. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్ష్యం! బనీ ఇస్రాయీల్ “తమ ప్రవక్త మూసా (అలైహిస్సలాం) తో అన్న తీరే మీరన్నారు. “వాళ్ళ దేవుళ్ళ వంటి ఒక దేవుణ్ణి మాకు కూడా చేసి పెట్టు” (అని వారన్నప్పుడు), మూసా (అలైహిస్సలాం) ఇలా అన్నారు: “మీరు చాలా అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నారు”. (ఆరాఫ్ 7:138). తప్పకుండా మీకంటే ముందు గడిచిపోయినవారి మార్గాలను మీరు కూడా అనుసరిస్తారు”అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) హెచ్చరించారు.
(తిర్మిజీ ). సహీ అని నిరూపించబడిన హదీసు.
ముఖ్యాంశాలు
1. సూరె నజ్మ్ లోని ఆయత్ యొక్క వ్యాఖ్యానం తెలిసింది. (అదే మనగా: ఆ దేవతలు వారికి లాభనష్టాలు చేకూర్చేవి అని ముష్రికులు భావించేవారు. అందుకే వారితో మొరపెట్టుకునేవారు. అక్కడ జంతువులను బలిచ్చేవారు. వారి సాన్నిధ్యం కోరేవారు).
3. సహాబాలు (సహచరులు) కేవలం తమ కోరికను వెల్లడించారు తప్ప, దాన్ని ఆచరణ రూపంలోకి తీసుకురాలేదు.
4. కోరిక ఉద్దేశం కూడా అల్లాహ్ సాన్నిధ్యం పొందడానికే ఉండేది. ఎందుకనగా: అల్లాహ్ దానిని ప్రేమిస్తాడని వారనుకున్నారు.
5. ఇది షిర్క్కు సంబంధించినదని సహాబాలకు తెలియనప్పుడు ఇతరులకు తెలియకపోవడం సంభవం. (కాని తెలిసిన వెంటనే విడనాడడం కూడా తప్పనిసరి).
6. ప్రవక్త సహాబాలు (సహచరులు), తమ సత్కార్యాలకు బదులుగా పొందిన వాగ్దానం, క్షమాపణ శుభవార్త లాంటివి అంత సులభంగా ఇతరులు పొందలేరు.
7. వారికి తెలియదు కదా అని ప్రవక్త ఊరుకోలేదు. “అల్లాహు అక్బర్! ఇవే మార్గాలు. మీకంటే ముందు గతించిన వారి మార్గాలను మీరు అనుసరిస్తారు” అని మూడు సార్లు హెచ్చరించి, అలాంటి కోరికలు చెడు అని స్పష్టం చేసారు.
8. మరో ముఖ్య విషయం ప్రవక్త తమ సహచరులతో ఇలా అనడం: మీ ప్రశ్న, కోరిక బనీ ఇస్రాయీల్, మూసాతో ప్రశ్నించి, కోరినటువంటిదే. వారు: “వాళ్ళ దేవుళ్ళవంటి ఒక దేవుణ్ణి మాకు కూడా చేసిపెట్టు” అని కోరారు.
9. ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) వారిని నివారించడం “లాఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావంలోనే వస్తుంది. ఇది చాలా సూక్ష్మమైనది. అందుకే సహచరులు కూడా అది “లాఇలాహ ఇల్లల్లాహ్” భావానికి విరుద్ధమైనదని ముందు గమనించలేక పోయారు.
10. ఇచ్చట కూడా ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం), అల్లాహ్ ప్రమాణం చేసి చెప్పారు. (మాటి మాటికి ప్రమాణం చేయటం ఆయన అలవాటు కాదు. కాని విషయం చాలా గంభీరమైనది గనుక ప్రమాణం చేసి చెప్పారు).
11. తమ కోరికను వెల్లడించినందుకు వారు మతభ్రష్టులు కాలేదు. దీనీతో తెలిసిందేమిటంటే షిర్క్ చిన్నదీ (కనబడనిది) ఉంటుంది, పెద్దదీ (కనబడునది) ఉంటుంది.
12 “మేము కొత్తగా ఇస్లాం స్వీకరించియుంటిమి” అన్న వారి మాటతో ఇతర సహచరులు దినిని షిర్క్గా భావించేవారు అని తెలుస్తుంది.
13. ఆశ్చర్యం కలిగినప్పుడు “అల్లాహు అక్బర్” అనవచ్చు అని తెలిసింది. ఇలా అనకూడదు అని అనేవారి మాట ప్రవక్త మాటకు విరుద్ధం అని స్పష్టమయింది.
14. (షిర్క్ మరియు బిద్ అత్ )కు చేర్పించే సాధనాలన్నిటినీ రద్దు చేయాలని తెలిసింది.
15. జాహిలియ్యత్ (అజ్ఞానకాలం) నాటి పోలికను అవలంబించుట నుండి నివారించబడింది.
16. విద్య నేర్పుతున్నప్పుడు అవసర సందర్భంగా ఆగ్రహించవచ్చును.
17. “ఇవే సాంప్రదాయాలు” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) ఒక నియమం తెలిపారు.
18. ప్రవక్త మహత్యాల్లో ఒకటి ఆయన భవిష్యసూచన ఇచ్చినట్టు సంభవించింది.
19. ఖుర్ఆన్లో యూదుల, క్రైస్తవుల ఏ విషయాల్ని చెడుగా ప్రస్తావించి వారిన హెచ్చరించబడిందో, అలాంటి పనుల నుండి మనము దూరముండాంలని మనకు కూడా హెచ్చరిక ఉంది.
20. పండితుల వద్ద ఉన్న ఒక నియమం వాస్తవమైనది. అది: ఆరాధనల (ఇబాదత్ల) పునాది ఆజ్ఞ (హుకుం) పై ఉంది. (మన ఇష్టానుసారం ఇబాదత్ చేయరాదు).
21. గ్రంథమవ్వబడిన వారి సాంప్రదాయాలు, అలవాట్లు ఎలా చెడ్డవో ముష్రికులవి కూడా అలాగే చెడ్డవి.
22. ఎవరైతే అధర్మం నుండి ధర్మంలో అడుగుపెడుతాలో వారిలో కొన్ని పాత అలవాట్లు ఉంటాయి అని తెలిసింది. అబూ వాఖిద్ లైసీ (రది అల్లాహు అన్హు) అదే చెప్పింది. “మేము కొత్తగా ఇస్తాం స్వీకరించియుంటిమి”.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ)
‘చెట్లతో, రాళ్ళతో శుభం కోరుట ముష్రిక్కుల పని. ‘చెట్లతో, రాళ్ళతో, సమాధులతో ఇంకేదానితోనైనా శుభం కోరుట ధర్మసమ్మతం కాదని పండితులు ఏకీభవించారు. ఇది “గులువ్వు” (అతిశయోక్తి). ఎవరితో, ఏ దానితో తబర్రుక్ కోరబడుతుంటో, వారి ఆరాధన, వారితో దుఆ (ప్రార్ధన) చేయడం లాంటి పనులకు ఇది గురి చేస్తుంది. అల్లాహ్ యేతరుల ఆరాధన, వారితో దుఆ షిర్క్ అక్బర్ (పెద్ద షిర్క్) అన్న విషయం తెలిసిందే. చివరికి ముఖామె ఇబ్రాహీం, ప్రవక్త యొక్క గృహం, బైతుల్ మఖ్డిస్, అక్కడ ఉన్న “సఖ్ర్” మొదలగు వాటితో తబర్రుక్ కోరుట కూడా తప్పు.
కాబతుల్లా లోని హజర్ అస్వద్ (నల్ల రాయి)ను ముట్టుకొనుట, చుంబించుట మరియు రుక్నె యమానిని ముట్టుకొనుట మొదలైనవి అల్లాహ్ కు విధేయత చూపుట. ఆయన ఔన్నత్యాల ముందు వినయ వినమ్రతతో మెలుగుటయే ఇబాదత్ యొక్క సారాంశము. దీనికున్న ఆదేశం ఇతర వాటికి లేదు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మానవజాతి సృష్టి యెక్క ఉద్దేశ్యం ఏమిటి? అనే చిక్కు ప్రశ్న ప్రతి మానవుడికీ తన జీవితంలో ఎక్కడో ఒక చోట ఎదురవుతుంది. ఏదో ఒక సందర్బంలో ప్రతి మానవుడు “నేనెందుకు జీవిస్తున్నాను?“, “దేనికోసం నేను ఈ భూమిపై ఉన్నాను?“, “నా జీవితలక్ష్యం ఏమిటి?” అని తనను తాను ప్రశ్నించుకోవటం కూడా జరుగుతుంది. కానీ సమాధానం కనుక్కోవటానికి మనం ఎప్పుడైనా ప్రయత్నించామా? నిజాయితీగా చూస్తే, ఆ ఆలోచనే ఇంత వరకు రానివాళ్ళు అధికంగా ఉన్నారు.
మానవజాతి సృష్టి యెక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని గురించి అల్లాహ్ ఖురాన్ లో ఇలా తెలుపుతున్నాడు:
“నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే“. (ఖురాన్ 51:56)
మానవులను, జిన్నులను పుట్టించటం లోని తన ఉద్దేశం ఏమిటో అల్లాహ్ పై వాక్యం లో తెలియపరిచాడు. వారంతా తనను మాత్రమే ఆరాధించాలి, తనకు మాత్రమే విధేయత చూపాలన్నది ఆయన అభిమతం. అయితే దానికోసం ఆయన మనుషులను గానీ, జిన్నాతులను గానీ కట్టుబానిసలుగా చేసుకోలేదు. వారి స్వేచ్చా స్వాతంత్ర్యాలను హరించలేదు. ఒకవేళ అదే కనక అయి ఉంటే మనుషులు, జిన్నాతులు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా ధైవారాధనకు కట్టుబడి ఉండేవారు. కానీ అల్లాహ్ వారికి స్వేచ్చను ఇస్తూనే తనను ఆరాధించమని కోరాడు. వారి పుట్టుక లోని పరమార్ధాన్ని వారికి ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఈ పరమార్ధాన్ని విస్మరించిన వారికి పరలోకంలో ఎదురయ్యే పరాభవాన్ని గురించి కూడా హెచ్చరించాడు.
ఈ ఆరాధన మరియు విధేయత ద్వారా అల్లాహ్ పోషణ జరుగుతుందని అనుకుంటున్నారేమో. అదేమీ కాదు. ప్రపంచంలో అవిశ్వాసులు కల్పించే చిల్లరదేవుళ్ళ లాంటివాడు కాదు అల్లాహ్.
దీనిని గురుంచి అల్లాహ్ ఇలా తెలుపుతున్నాడు:
“నేను వారినుండి జీవనోపాధిని కోరడంలేదు. వారునాకు అన్నం పెట్టాలని కూడా నేను కోరటం లేదు“.
“అల్లాహ్ యే స్వయంగా అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు. ఆయన మహాశక్తిశాలి, మహాబలుడు“. (ఖురాన్51:57-58)
అల్లాహ్ కు మానవుల ఆరాధన యెక్క అవసరంలేదు. ఆయన తన అవసరాలను పూర్తిచేసుకోవటం కోసం మానవులను సృష్టించలేదు. భూమ్యాకాశాల్లోని సమస్త ఖజానాలు అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. అల్లాహ్ ఆరాధన వల్ల అల్లాహ్ భక్తులకే లాభం చేకూరుతుంది. వారికి ఇహపరాల సాఫల్యం కలుగుతుంది. అంతేగానీ అల్లాహ్ కు చేకూరే ప్రయోజనం ఏమీ ఉండదు.ఒక్కమానవుడు కూడా ఆయనను ఆరాధించక పోయినా ఆయన యెక్క మహొన్నత స్థానానికి ఎటువంటి హానీ కలగదు. అలాగే, ప్రతి ఒక్క మానవుడు ఆయనను ఆరాధించిన, ఆయన యెక్క మహొన్నత స్థానానికి ఎటువంటి లాభము చేకూరదు. ఆయన సంపూర్ణుడు. కేవలం ఆయన మాత్రమే ఎటువంటి అవసరాలు లేకుండా ఉనికిలో ఉన్నాడు. సృష్టించ బడిన వాటన్నింటికీ అవసరాలు ఉన్నాయి. కాబట్టి, మానవజాతికే ఆయనను ఆరాధించే అవసరం ఉన్నది.
ఘోరాతి ఘోరమైన మహా పాపం:
పైన తెలుపబడిన సృష్టి యెక్క ఉద్దేశ్యం (అంటే అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుట)తో విభేదించటమనేది మానవుడు చేయగల అత్యంత ఘోరమైన మహా పాపం. ఒకసారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను “అల్లాహ్ దృష్టిలో అత్యంత ఘోరమైన పాపం ఏది?” అని అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ప్రశ్నించగా, వారిలా జవాబిచ్చినారు “అల్లాహ్ యే మీ సృష్టికర్త అయినప్పటికీ, ఆయనకు భాగస్వామ్యం కల్పించటం (షిర్క్ చేయటం)”.
సృష్టికర్తతో పాటు లేక సృష్టికర్తను వదిలి, ఇతరులను ఆరాధించటాన్ని అరబీ భాషలో షిర్క్ చేయటం అంటారు. కేవలం ఇది మాత్రమే ఎట్టి పరిస్థితిలోను, అస్సలు క్షమించబడని అత్యంత ఘోరమైన మహాపాపం. ఒకవేళ మానవుడు అటువంటి ఘోరమైన మహాపాపం నుండి పశ్చాత్తాప పడకుండా, క్షమాపణ కోరకుండా మరణించినట్లయితే, అల్లాహ్ వారి మిగిలిన పాపాలన్నింటినీ క్షమిస్తాడు గాని, షిర్క్ ను మాత్రం అస్సలు క్షమించడు. ఈ విషయమై అల్లాహ్ దివ్యఖురాన్ లో ఇలా ప్రకటిస్తున్నాడు:
“నిశ్చయంగా, అల్లాహ్ తనకు భాగస్వామి(సాటి)ని కల్పించటాన్ని ఏ మాత్రమూ క్షమించాడు. మరియు అది తప్ప దేనినీ (ఏ పాపాన్ని) అయినా, ఆయన తానుకోరిన వారిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ కు భాగస్వాములను కల్పించిన వాడే, వాస్తవానికి మహాపాపం చేసినవాడు!“(ఖురాన్ 4:48).
అల్లాహుతా’ఆలాకు సాటి (భాగస్వాములను) కల్పించటం మహా దుర్మార్గం మరియు క్షమించరాని పాపం. కావున ఇది ఎంత మాత్రం క్షమించబడదు. ముష్రికులకు స్వర్గం నిషేధించబడినది. నిశ్చయంగా, బహుధైవారాధన (షిర్క్) గొప్ప దుర్మార్గం.
25.349808 55.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సత్కార్య వనాలు అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
సోదర మహాశయ! కప్పి ఉంచుట అనేది రెండు రకాలుగా ఉంటుంది. 1. బాహ్యముగా. 2. అంతర్యముగా.
అంతర్యముగా అంటే ఒక ముస్లిం ఏదైనా పాపం లేదా అశ్లీల కార్యానికి ఒడిగడితే నీవు అతడ్ని నలుగురి ముందుకు తెచ్చి అవమానపరచకు. అతడ్ని పాపం చేయకుండా నిరోధించు. మృదుత్వము, అప్యాయతతో కూడిన ఉపదేశం చేస్తూ అతనితో మెతకవైఖరి అవలంభించు. అతడ్ని దాచి ఉంచి, అతని తప్పిదాన్ని బహిర్గతం చేయకు. అల్లాహ్ ఎవరి తప్పిదాన్ని కప్పి ఉంచాడో నీవు దాన్ని బట్టబయలు చేయకు.
మాఇజ్ అస్లమీ తాను పాల్పడిన వ్యబిచారం గురించి ప్రవక్త ﷺ ముందు స్వయంగా తన నోట ప్రస్తావించాడు. అయినా ప్రవక్త ﷺ మాఇజ్ తన తప్పిదాన్ని కప్పి ఉంచి, అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటే బావుండు అని తపన పడుతూ ఇలా అన్నారుః ఏమైంది నీకు, తిరిగి వెళ్ళు, క్షమాభిక్ష కోరి, అల్లాహ్ వైపునకు మరలిపో”. (ముస్లిం 1695). మాఇజ్ కొంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడు. ప్రవక్తా! నన్ను పవిత్రపరచండి అని అంటాడు. ప్రవక్త అదే సమాధానమిస్తారు. ఇలా మూడు సార్లు జరుగుతుంది. ఎప్పుడైతే ప్రవక్తకు నమ్మకం కుదిరిందో అతను ఈ దుష్కార్యానికి పాల్పడ్డాడని; ఈ పాపం నుండి పవిత్రుడు అవదలుచు- కుంటున్నాడని; మరియు తాను తన ప్రభువుతో కలుసుకున్నప్పుడు అతనిపై ఈ పాపభారం ఉండద్దని ఆశిస్తున్నాడని. అప్పడు ప్రవక్త ﷺ అతనిపై “హద్” (శిక్ష) విధించాలని సహచరులకు ఆదేశించారు. వారు అతన్ని తీసుకెళ్ళి అతనిపై రాళ్ళు రువ్వడం ఆరంభించారు. రాళ్ళ తాకిడిని సహించలేక అక్కడి నుండి పరుగెత్తాడు. కొందరు సహచరులు అతని వెంటబడి రాళ్ళు రువ్వారు. చివరికి అతను చనిపోయాడు. అతని పారిపోయే విషయం తెలిసినప్పుడు ప్రవక్త ﷺ ఇలా చెప్పారుః
హా! ఎంతటి విచిత్రం! ఎక్కడ ఏ దుష్కార్యం, ఏ చెడు సంభవిస్తుందో అని కొందరు నిరీక్షిస్తూ ఉంటారు. ఎందుకు? దానికి సంబంధించిన అధికారులకు తెలియజేస్తే వారు ధర్మపరమైన సాధనాలతో దాన్ని ఖండిస్తారు అనా? కాదు, దాన్ని ప్రజల్లో వ్యాపింపజేయాలని, అంతే కాదు సెల్, ఇంటర్ నెట్ లో మరియు ఇతర సాధనాలతో ప్రచురించాలని. ఇది వదంతులను వ్యాపింపజేయాలన్న వాంఛ, ఇది మహా విపరీతంగా పాకుతుంది. సరియైన ఇంక్వైరీ చేయుట, నిర్ధారించుట, దాచి ఉంచుట మరియు సభ్యతను పాటించుట లాంటి నిజమైన సాధనాలకు భిన్నంగా ఉంది ఈ వైఖరి. ధర్మపరమైన శ్రేయోభిలాష పునాదులను తెలుసుకోకుండా వీరు ఎక్కడు- న్నారు? అల్లాహ్ యొక్క ఈ ఆదేశాన్ని ఎందుకు చెవున బెట్టుట లేదు?
విశ్వాసుల మధ్య అశ్లీలత వ్యాపించాలని కోరేవారు, ప్రపంచంలోనూ, పరలోకంలోనూ వ్యధాభరితమైన శిక్షకు అర్హులు. అల్లాహ్ ఎరుగును. మీరు ఎరుగరు. (నూర్ 24: 19).
ప్రజల మరుగు విషయాల వెంట పడేవారు తమ ఈ అలవాటును వదులుకోకుంటే వారు స్వయంగా నీచాతినీచమైన స్థితిలో అవమానానికి గురి కావలసి వచ్చే సందర్భం నుండి ఇకనైన భయపడాలి.
అబూ బర్జా అస్లమీ ఉల్లేఖనం ప్రకారం: నవయువకురాళ్ళకు కూడా వినిపించే విధంగా ప్రవక్త ﷺ గొంతెత్తి చాటింపు చేస్తూ ఇలా చెప్పారుః “ఓ ప్రజలారా ఎవరైతే నోటి ద్వారా విశ్వసించారో, విశ్వాసం వారి ఆంతర్యంలో చేరలేదో! ముస్లిములను పరోక్షంగా నిందించకండి. వారి రహస్య విషయాల వెంటబడకండి. ఎవరు తన సోదరుని రహస్య విషయాల వెంట పడుతాడో అల్లాహ్ అతని రహస్య విషయాల వెంటపడతాడు. అతడు తన ఇంట్లో ఉండగానే అల్లాహ్ అతడిని అవమానం పాలు చేస్తాడు”. (అహ్మద్. సహీ లిగైరిహీ, దాని సనద్ హసన్).
బాహ్యముగా కప్పి ఉంచుట అంటే దుస్తులు లేకుండా నగ్నంగా ఉన్నవానికి దుస్తులు ధరించి ప్రజల చూపు పడకుండా ఉంచుట. అల్లాహ్ సాక్షిగా! ఇది ప్రియప్రవక్త పద్ధతి. మాఇజ్ అస్లమీ సంఘటనలో ఈ రెండు రకాలు ఉన్నాయి. (మొదటి రకం గురించి పై హదీసులు చదివారు, రెండవ రకం గురించి) అబూ దావూద్(4377)లో ఉంది, ప్రవక్త ﷺ హజ్జాల్ అను వ్యక్తిని మాఇజ్ కు ఏదైనా గుడ్డ ఇవ్వాలని ప్రోత్సహిస్తూ ఇలా చెప్పారుః
(لَوْ سَتَرْتَهُ بِثَوْبِكَ كَانَ خَيْرًا لَكَ).
“నీ దుస్తులతో అతడ్ని దాచి ఉంచితే అది నీ కొరకే మేలుగా ఉండును”.
అల్లాహ్ నిన్ను కాపాడుగాక! ప్రవక్త ﷺ ముస్లిముల బాహ్యంతర రహస్యాలను, వారు సజీవంగా ఉన్నప్పుడు మరియు చనిపోయిన తర్వాత కూడా ఎలా దాచి ఉంచుతున్నారో గమనించు.
అల్లాహ్ నీకు సద్భాగ్యం ప్రసాదించుగాక! పూర్వపు ఇద్దరి పుణ్యపురుషుల్లో జరిగిన ఈ సంఘటన; వారు ముస్లిముల రహస్యాలను కప్పి ఉంచడంలో ఉన్న ప్రవక్త ﷺ యొక్క ఉత్తమ పద్ధతిని ఎలా ప్రస్తావించుకుంటున్నారో శ్రద్ధగా పఠించు (ఆలకించు): ఇదిగో ఇతను అబ్దుల్లాహ్ హౌజని, ఇలా తెలిపారుః నేను ప్రవక్తగారి మొఅజ్జిన్ బిలాల్ ను హలబ్ అను ప్రాంతంలో కలిశాను. బిలాల్! ప్రవక్త ఖర్చులు ఎలా ఉండేవి ఏమైనా నాకు తెలుపుతావా అని అడిగాను. దానికి అతను ఇలా సమాధానం ఇచ్చాడుః ఆయన వద్ద ఏమి లేకుండింది. అల్లాహ్ వారిని ప్రవక్తగా చేసినప్పటి నుండి ఆయన గతించే వరకు నేనే ఆయన ఖర్చులకు బాధ్యునిగా ఉంటిని. ఆయన వద్దకు ఎవరైనా ముస్లిం నగ్న స్థితిలో వచ్చింది చూస్తే నన్ను ఆదేశించేవారు. నేను ఎవరి నుంచైనా అప్పు తీసుకొని అతనికి దుస్తులు ధరించి, భోజనం చేయించేవాడిని. ఒకసారి ఒక బహుదైవారాధకుడు నన్ను కలసి, బిలాల్! నేను చాలా ఉన్నవాడిని, నా నుంచే నీవు అప్పు తీసుకో, చూడు సుమా! వేరెవ్వరి నుంచి తీసుకోవద్దు అని చెప్పాడు. నేను అలాగే చేసేవాడిని. ఒకనాడు నేను వుజూ చేసుకొని నమాజు కొరకు అజాన్ ఇవ్వడానికి సిద్ధమయ్యాను అప్పుడే అదే బహుదైవారాధకుడు కొందరి వ్యాపారుల మధ్య వస్తూ నన్ను చూడగానే ‘ఓ హబషీ!’ అని అరిచాడు. హాజరుగా ఉన్నాను చెప్పండి అన్నాను. అతి చెడ్డ ముఖంతో నా ముందుకు వచ్చి ఓ చెడ్డ మాట అని, తెలుసా నెల పూర్తి కావడానికి ఎన్ని రోజులున్నాయో? అని అడిగాడు. దగ్గరే ఉంది అని నేనన్నాను. కేవలం నాలుగు రోజులే అని చెప్పి, నీ మీద ఉన్న నా అప్పుకు బదులుగా నిన్ను తీసుకెళ్ళి నీవు గతంలో ఉన్నట్లు మేకల కాపరిగా ఉంచుతాను అని అనేశాడు. ఈ మాటలు విని నా గుండె చలించి పోయింది. ఇతరులకు కూడా ఇలాంటి బాధే అవుతుంది కదా. నేను ఇషా నమాజు చేసుకున్నాను, అప్పటికి ప్రవక్త ﷺ ఇంటికి తిరిగి వచ్చేశారు. ఆయన వద్దకు వెళ్ళి నేను రావచ్చా అని అనుమతి కోరాను, ఆయన నాకు అనుమతించారు. నేను నా తల్లిదండ్రుల్ని మీకు అర్పిస్తును. ఏ బహు- దైవారధకునితో నేను అప్పు తీసుకునేవాడినో అతడు ఇలా ఇలా అన్నాడు. నా వైపు నుండి మీరు చెల్లించడానికి మీ వద్ద ఏమీ లేదు, అలాగే నా వద్ద ఏమీ లేదు. అతడు నా పరువుతీయనున్నాడు. మీరు అనుమతిస్తే గనక ఇస్లాం స్వీకరించిన ఫలాన తెగవారి వద్దకు వెళ్తాను. నా అప్పు తీర్చడానికి అల్లాహ్ తన ప్రవక్తకు ఏదైనా ప్రసాదించవచ్చు. అక్కడి నుండి బయలుదేరి నా ఇంటికి వచ్చాను. నా తలవారి, తిత్తి, చెప్పులు మరియు ఢాలు నా తలకడన పెట్టుకున్నాను. సహరీ సమయం (ఫజ్ర్ సమయానికి కొంచం ముందు) అవుతుంది. ఇక నేను వెళ్దామని అనుకుంటున్నాను. ఎవరో ఒకరు పరుగెత్తుకుంటు వస్తూ బిలాల్! తొందరగా ప్రవక్త వద్దకు చేరుకో అని కేకేశాడు. నేను ప్రవక్త వద్దకు వచ్చాను. అక్కడ నాలుగు జంతువులు సామానులతో సహా ఉన్నాయి. అనుమతి కోరాను. అప్పుడు ప్రవక్త ﷺ అల్లాహ్ నీ అప్పు తేర్చడానికి పంపాడు అని శుభవార్త వినిపిస్తూ, అదిగో సామానులతో నిండి ఉన్న నాలుగు జంతువులను చూడటం లేదా? అని అడిగారు. అవును అని నేనన్నాను. ప్రవక్త ﷺ చెప్పారుః ఆ జంతువులు, వాటి మీద ఉన్న సామానులన్నియూ నీకే. వాటిలో బట్టలు, అన్నపానీయాలున్నాయి. ఫదక్ ప్రాంత రాజు బహుకరించాడు. వీటిని ఆధీనపరుచుకో నీ అప్పును చెల్లించు. …. (హదీసులో పూర్తి వివరణ ఉంది; బిలాల్ ప్రవక్త మీద ఉన్నఅప్పంత చెల్లించి వచ్చి ప్రవక్తకు తెలియజేశారు, అప్పుడు ప్రవక్త) ఆ సొమ్ము నా వద్ద ఉండగానే ఎక్కడ చావు వస్తుందో అన్న భయంతో (ఆ వార్త తెలిసినందుకు) అల్లాహ్ గొప్పతనాన్ని చాటుతూ, ఆయన స్తుతులు స్తుతించసాగారు. (అబూ దావూద్ 3055. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ దీనిని సహీ అని అన్నారు).
రహస్యాలను కప్పి ఉంచుట చాలా ఉత్తమ గుణం. గొప్ప మనస్సుగలవారు ఈ గుణాన్ని అవలంబించి వారి సమావేశాలు ప్రజల పరువుల జోక్యంతోనే నిండిపోకుండా దూరంగా ఉంటారు. వారి కలములు ప్రజల తప్పులు వ్రాయడానికి అవసరం లేకుండా ఉంటాయి. వారి చెవులు ప్రజల దోషాలు వినకుండా మూతబడి ఉంటాయి. ఈ అందమైన కప్పిఉంచే గుణంది ఎంతటి వైభవం. నిజంగా ఇందులో అల్లాహ్ యొక్క గొప్ప దయను అంగీకరిస్తున్నట్లుందిః ఆయన మనల్ని నగ్నంగా పుట్టించాక అందమైన దుస్తుల్లో కప్పి ఉంచాడు.
ఓ ఆదము సంతానమా! మేము మీపై దుస్తులను అవతరింప జేశాము. అవి మీరు సిగ్గు పడే మీ శరీర భాగాలను కప్పుతాయి. మీ శరీర రక్షణకు శోభకు సాధనంగా ఉంటాయి. భయభక్తులు అనే దుస్తులే మంచి దుస్తులు. ఇది అల్లాహ్ సూచనలలోని ఒక సూచన. భహుశా ప్రజలు దీని ద్వారా గుణపాఠం నేర్చుకుంటారేమో!. (ఆరాఫ్ 7: 26).
మనం ఎన్నో పాపాలకు, దోషాలకు గురవుతున్నది చూస్తూ కూడా అల్లాహ్ మనల్ని సర్వ సృష్టి ముందు అవమాన పరచకుండా కాపాడి ఎంతో గొప్ప మేలు చేశాడు. ఏ రోజైతే మర్మావయవాలు బయటపడతాయో, పాపాలు అందరి ముందు ప్రత్యక్షంగా వస్తాయో ఆ రోజు అల్లాహ్ నిన్ను కప్పి ఉంచాడంటే ఇంతకంటే గొప్ప కప్పి ఉంచడం ఇంకేదైనా ఉంటుందా!! ప్రవక్త ﷺ చెప్పారుః
“నిశ్చయంగా (ప్రళయదినాన) అల్లాహ్ విశ్వాసికి దగ్గరగా వచ్చి తన దండ అతని మీద పెట్టి అతన్ని దాచి పెట్టుకుంటాడు. మళ్ళీ నీవు చేసిన ఫలాన పాపం గుర్తుందా, ఫలాన పాపం చేశావు కదూ? అని అడుగుతాడు. అవును ఓ ప్రభువు అని అతడంటాడు. అల్లాహ్ అతన్ని తన పాపాల గురించి ఒప్పిస్తాడు. (అతడు వాటిని ఒప్పుకొని) ఇక నాశనమయ్యానని భావిస్తాడు. అప్పుడు అల్లాహ్ అంటాడుః “నీ పాపాలను (ప్రజలకు తెలియకుండా) ప్రపంచంలో దాచి ఉంచాను. మరి ఈ రోజు వాటిని కూడా నీ కొరకు క్షమిస్తున్నాను”. అప్పుడు (మిగిలిన) సత్కర్మల పత్రం అతనికి ఇవ్వబడుతుంది. అయితే అవిశ్వాసి మరియు వంచకుల విషయం ఇలా ఉందిః “తమ ప్రభువునకు అబద్ధాన్ని అంటగట్టిన వారు వీరే అని అపుడు సాక్షులు సాక్ష్యం చెబుతారు. విను! దుర్మార్గుల మీద దేవుని శాపం పడుతుంది”. (ఈ విషయం ఖుర్ఆన్ సూర హూద్ 11: 18లో ఉంది). (బుఖారి 2441, ముస్లిం 2768).
ప్రియ పాఠకుడా! ముస్లిములను కప్పి ఉంచే వనానికి చిత్తశుద్ధి అనే నీరు పెడుతూ ఉండు. అప్పుడే దాని ఉత్తమ పంటను కోయగలుగుతావు. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః
ప్రియ సోదరా! ఈ వనం ఆరంభం ఒక చిన్న సంఘటన ద్వారా చేస్తాను, నా స్నేహితుడైన షేఖ్ (ఇబ్రాహీం బిన్ సాలిహ్, అహ్ సాలోని షరీఆ కాలెజ్ లెక్చరర్) చెప్పారుః
“సుమారు 18 సంవత్సరాల ఒక నవయువకుడు అహ్‘సా నుండి దమ్మామ్ తన కార్లో బయలుదేరాడు. అతడు అస్థమ రోగి. దమ్మామ్ చేరుకున్న వెంటనే అతనికి ఊపిరి ఆడనట్లు ఏర్పడింది. ఇది ఓ భయంకర విషయానికి సంకేతం అని అస్థమ రోగులకు ముందే తెలుసు. ఇలాంటప్పుడు వివేకవంతమైన చురుకుతనం, వెంటనే రోగి చుట్టు గుమిగూడి అతని ఆరోగ్యం గురించి సూక్ష్మమైన శ్రద్ధ చాలా అవసరం.
ఎప్పుడైతే తాను ఏ క్షణాన్నైనా స్పృహ తప్పి పోవచ్చని, పడిపోవచ్చనీ ఆ యువకునికి అర్థమయ్యిందో, అప్పడతను చుట్టాల ముందు పడిపోతే బాగుండదు కదా అన్న మరింత ఆవేదనతో దమ్మామ్ చేరుకొని ఏమంత సమయం కాక ముందే తిరిగి అహ్ సా చేరుకోవాలని నిశ్చయించు కున్నాడు. అతని ఛాతిలో ఏదో అవస్త ఉన్నట్లు, సరిగ్గా శ్వాస తీసుకోలేక పోతున్నాడని దగ్గరున్న వారు గ్రహించి, ఈ స్థితిలో వెళ్ళకుంటే బావుంటదని ప్రాధేయ పడ్డారు. ఎన్నో రకాలుగా అతనిపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయినా అతడు ఒక్కటీ పట్టించు కోకుండా తిరిగి పోవడానికి తన కారు ఎక్కాడు. ఒక్కో క్షణం అతి కఠినంగా గడుస్తుంది. ఒక్కో క్షణం ఒక్కో శ్వాసను ఆపుతున్నట్లుంది. ప్రక్కన తిరుగుతే ధైర్యం ఇచ్చే కారుణ్యతండ్రి లేడు. మమకారంతో గుండెకు హత్తుకునే మాతృమూర్తి లేదు. త్వరగా తొలి చికిత్స అందించే, ఆపద్బాంధువ సోదరుడు లేడు. రెప్పలార్పకుండా ముందుకు చూస్తూ పోతే పొడగాటి రొడ్డు. గమ్యానికి చేరుకునేంత శక్తి లేనట్లు ఏర్పడుతుంది. సగం దారి చేరుకున్నాడో లేదో అవస్త ఎక్కువై పోయింది. కంట్రోల్ కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. కళ్ళు తేటగిల్లుతున్నాయి. చావు సమీపించి- నట్లనిపిస్తుంది. ఇక చివరి ఘడియలే అని భావించాడు. ఒక బ్రిడ్జి క్రింద కారును ఆపాడు. దారి గుండా పోయేవారితో ఏదైనా సహాయం కోరుదామన్నా శక్తి లేకుండా అయిపోయింది. ఆశలు కోల్పోయాడు. ఇక అల్లాహ్ వైపునకు మరలాడు. అమానతుగా ఉన్న ఆత్మను అప్పజెప్పటానికి, ఒంటరి ప్రయాణంలో ఉండి, ఏమి చేయాలో దోయక అనుకోకుండా బండి నుండి దిగి దాని ముందు వచ్చి వెలకిల పడ్డాడు. బహుశా అల్లాహ్ కారుణ్యం కురుస్తేందేమో, జాడలేని ఒంటరితనంపై అల్లాహ్ కరుణ దృష్టి పడుతుందేమో. అదే క్షణంలో తనకు తానే మరచిపోయినట్లయింది. సృహ తప్పినట్లయింది. ఏమి జరుగుతుందో ఏమీ తెలియదు. ఒక విషయం తప్ప; ఇక ఈ జీవితాన్ని దాని అందచందాలను వీడిపోయే సమయం వచ్చేసిందని.
కాని అల్లాహ్ కారుణ్యం అతని వెంటే వెంబడిస్తూ ఉంది. ఎందుకు అలా కాదు? ఆయన కరుణామయుడు, క్షమించువాడు, కృపాసాగరుడు, ఓర్పుగల పరిశుద్ధుడు.
దారి గుండా పోతున్న ప్రయాణికుల్లో ఒకతను స్పృహ తప్పినట్లు తన కారుపై పడి ఉన్న పడచుపిల్లవాడిని చూడటానికి వస్తాడు. ఏ యాక్సిడెంట్ చిహ్నాలు లేవు, ఇతని ఈ స్థితికి అసలు కారణం ఏమిటో తెలియడం లేదు. అయినా అతను ప్రశ్నల మోతలకు తావివ్వకుండా ముందు ఈ అపరిచిత వ్యక్తికి సహాయం అందించాలి అని చెయితో పట్టి చూస్తే యువకుని చెయ్యి కదిలినట్లు చూశాడు అతడు తన మూతి, ముక్కు వైపు సైగ చేస్తున్నాడు. అంటే ఇక శ్వాస నడిచే అవకాశాల్లేవు అని తెలియజేస్తున్నాడు. అతడ్ని ప్రాణంతో చూసి ఈ పుణ్యాత్ముడు సంతోషపడ్డాడు. అల్లాహ్ అతడ్ని కాపాడడానికే నన్ను పంపాడెమో అని అనుకొని, దగ్గర ఉన్న ఓ ఊరిలో మంచి చెస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ వద్దకు తీసుకెళ్ళడానికి తొందర పడ్డాడు. అక్కడికి చేరుకున్నాక తన మెడపై వచ్చి పడ్డ అమానతు పట్ల మంచి శ్రద్ధ చూపాడు ఓ డాక్టర్. ఆ పుణ్యాత్ముడు శ్వాస ఆగిపోతున్న, చావుగురకలకు గురైన యువకుని తలాపున నిలబడి చూస్తునే ఉన్నాడు. తాను ఏ ఉద్దేశంతో ప్రయాణానికి బయలుదేరాడో మరచి పోయాడు. లోకాన్నే తన వెనక వదిలాడు. ప్రాణం కోల్పోతున్న మనిషిని కాపాడుటకు ముందుకు వచ్చి అల్లాహ్ దయతో తిరిగి అతని స్థానంలో చేర్చడానికి. ఏదో ముందు నుండే పరిచయం ఉన్నట్లు కాదు. ఐహిక లాభాన్ని ఉద్దేశించీ అంతకు కాదు. అల్లాహ్ అనుగ్రహించిన ఓ సత్కార్యం చేసుకోవాలని మాత్రమే. అలాగే దృష్టి సారించి యువకుని వైపు చూస్తూ, తనకు తోచిన శ్రద్ధ చూపుతూ, అల్లాహ్ అతనికి స్వస్థత ప్రసాదించాలని, తిరిగి కొత్త జీవితం దొరకాలని అల్లాహ్ తో దుఆలో నిమగ్నుడై ఉన్నాడు. కొంచం కొంచం మంచిగా శ్వాస తీసుకోగలుగు తున్నాడు. క్లిష్టపరిస్థితి దూరమవుతుంది. వ్రేళ్ళు ఆడుతన్నాయి. జీవితం మెరుపు కళ్ళల్లోని కాంతి ద్వారా మినుకుమినుకుమంటుంది. ఆ పుణ్యాత్ముడు ఎంతో ఆశతో డాక్టర్ కళ్ళల్లో కళ్ళేసి తదేకదృష్టి సారించి ఉన్నాడు. అతని మోమున ఒక ఆనందమైన చిరునవ్వు గురించి పెనగులాడుతున్నాడు. క్షణం తర్వాత క్షణం గడుస్తుంది. నీ ప్రభువు కారుణ్యం మేలుచేసేవారికి సమీపం కనబడుతుంది. యువకుని శరీరంగాలలో జీవచలనం మొదలయింది. డాక్టర్ ముఖకవలికల్లో సంతోషం తొనికిసలాడింది. అతని నూతన జీవిత శుభవార్త డాక్టర్ నోట వెలువడింది. ఆ పుణ్యాత్ముడు అప్పుడే అతని నోట అతని ఇంటి ఫోన్ నంబర్ తెలుసుకున్నాడు. అతని ఇంటివారికి తాను తెలియకుండా ఉండటానికి అక్కడి నుండి జారుకున్నాడు. తన ఈ సత్కార్యాన్ని వివేకవంతముతో గట్టెక్కించడానికి అతని ఇంటికి ఫోన్ చేసి వారి అబ్బాయి క్షేమ విషయంతో పాటు ప్రస్తుతం ఉన్న అడ్రస్ వారికి తెలిపేశాడు.
కాని: … మీరెవరండి మాట్లాడుతున్నది? చెప్పండి అల్లాహ్ మీకు సద్భాగ్యం ప్రసాదించుగాక? ఓ పుణ్యాత్ముడా మీరెవరో చెప్పండి? మీ శుభనామం తెలియజేయండి, మీ గొప్పతనం గురించి ప్రజలకు తెలుపనివ్వండి, మీరు చేసిన సత్కార్యం గురించి వివరించనివ్వండి, మీరు మాకు చేసిన మేలుకు బదులుగా మీకు మేలు చేయనివ్వండి, పరిశుద్ధుడైన అల్లాహ్ దయతో మా కొడుకు ప్రాణాన్ని కాపాడిన మీరు, మీకు ఏ మేలు చేస్తే సమతూలుతుంది. మిమ్మల్ని గౌరవించి, సత్కరించే భాగ్యం మాకివ్వరా? చెప్పండి మీరెవరు? అన అడిగిన ప్రశ్నకు బదులుగా “పుణ్యం సంపాదించుకోదలిచిన వాడు”… అన్న రెండే రెండు పదాలు చెప్పి కరుణామయుడు, కనికరించేవాడైన అల్లాహ్ నుండి సత్ఫలితాన్ని ఆశిస్తూ ఆ పుణ్యాత్ముడు ఫోన్ పెట్టేశాడు.
సత్కార్యం చేసినవాడా నీకు శుభం కలుగుగాక, అల్లాహ్ నీకు సరిపోవుగాక, నీ అడుగులు మంచి వైపే పయనమవుగాక, అల్లాహ్ నిన్ను సర్వ చెడుల నుండి కాపాడి, రక్షణ కల్పించుగాక, అల్లాహ్ నీ ఆరోగ్యం, నీ జీవితం, నీ సంతానాల్లో శుభం, వృద్ధి కలుగజేయుగాక, మీకు, మాకూ స్వర్గంలో ఉన్నత స్థానం ప్రసాదించుగాక అని వారు దీవించారు.
షేఖ్ నాతో చెప్పాడు: ఇప్పటికీ దీనమైన, వినయపూర్వకమైన ఈ చేతులు ఆ పుణ్యాత్ముని కొరకు దుఆ చేయుటకై అల్లాహ్ ముందు ఎత్తబడుతాయి. అతని మేలు గుర్తుకొచ్చినప్పుడల్లా ఇదే పరిస్తితి ఉంటుంది.
తన సోదరుని ఓ అవసరాన్ని తీర్చాడు, చూడ్డానికి అదేమంతలే… కాని దానికి రెండు పక్కల్లో (ఇరువైపుల్లోని మధ్య) ఉన్న మనస్సు కావాలి. తన సోదరుని అవసరం తీర్చి ఎంత గొప్ప అదృష్టం సంపాదించాడు!! త్వరలో తీసుకెళ్ళి తొలి చికిత్స చేయించి ఏ సాఫల్యం, విజయం సాధించాడు!! నిశ్చయంగా అది గొప్ప సాఫల్యం, విజయం, దాని గురించే అల్లాహ్ ఇలా తెలిపాడుః
మీ ప్రభువును ఆరాధించండి, మంచి పనులు చేయండి, వీటి ద్వారానే మీకు సాఫల్య భాగ్యం లభిస్తుంది. (హజ్ 23: 77).
సోదరా నీకు సద్భాగ్యం ప్రాప్తమవుగాక! నీ సోదరుని ఏదైనా అవసరం తీర్చడంలో వెనకాడకు, అది నీ సమయం కెటాయించైనా, నీ శ్రమ ద్వారానైనా సరే. నీ సృష్టికర్త నీ అవసరాల్ని తీరుస్తూ ఉంటాడని, నీ బాధను తేలికగా చేస్తాడని, నీ చింతను దూరం చేస్తాడని మరియు నీ ఉపాధిలో శుభం కలుగజేస్తాడని నమ్మకం ఉంచు. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః
“ఒక వ్యక్తి వాహనము మీద కూర్చోడానికి లేదా అతని ఏదైనా సామాను దాని మీద పెట్టడానికి అతనికి సహాయపడుట కూడా సత్కార్యమే“. (ముస్లిం 1009, బుఖారి 2989).
బహుశా నీవు ఒక హవాల్దారునిగా పనిచేస్తున్న వీరుని సంఘటన విని ఉంటావు. అతని పేరు జుమ్ హూర్ బిన్ అబ్దుల్లాహ్ గామిదీ రహిమహుల్లాహ్. ఏదో కోర్ నిష్ లో మునుగుతున్న ఒక తండ్రి అతని ఇద్దరు కొడుకులను కాపాడే భాగ్యం అల్లాహ్ అతనికి ప్రసాదించాడు. అస్ర్ నమాజు చేసుకోవడానికి తాను ఓ మస్జిద్ వైపు వెళ్తుండగా ‘కాపాడండి, కాపాడండి’ అని అంతరాత్మ నుండి వెళ్తున్న, పరిచయమైన కేకలు విని, క్షణం పాటు ఆలస్యం చేయ కుండా మునుగ బోతున్న ఆ ముగ్గురి ప్రాణాలు కాపాడుటకు ప్రయత్నం చేసి, ముందు తండ్రిని కాపాడి ఒడ్డుకు చేర్చి తన మిత్రునికి అప్పజెప్పాడు. అనంతమైన ధైర్యంతో, నిరుపమానమైన త్యాగంతో తన ఆత్మను, జీవితాన్ని ధారాపోసి తండ్రి లాంటి ప్రేమతో ఇద్దరు పిల్లలను కాపాడుటకు వెంటనే వెనక్కి తిరిగాడు. వారిద్దరిని కాపాడే భాగ్యం అల్లాహ్ అతనికి ప్రసాదించాడు. కాని క్షేమంగా ఒడ్డు చేరుకొనుటకు అతని శక్తి అతనికి తోడివ్వలేక పోయింది. విపరీతమైన అలసటకు గురయ్యాడు. సముద్ర సుడిగుండంలో పట్టు కోల్పోయాడు. కెరటాలు అతన్ని మరింత లోతుకే తీసుకెళ్ళ సాగాయి. శక్తి నశించి పోయింది. కళ్ళ ముందే కొంచెం కొంచెం జీవిత జ్యోతి ఆరిపోయింది. అతడు అల్లాహ్ మార్గంలో అమరవీరుడయ్యాడు. బహుశా ఈ అమరవీర పతకం తన గురించే ఎదిరి చూస్తుండవచ్చు. మనం ఇదే మంచి భావన ఉంచుతాము. అల్లాహ్ ఇదే మంచి స్థానం అతనికి ప్రాప్తి చేయుగాక. అయితే ఇలా ఈ వీరుడు కనుమరుగయి పోయాడు. సముద్రం లోతులోకి మునిగి పోయాడు. తన ఈ ధైర్యం మరియు శౌర్యంతో అరుదైన ఫిదాయీ మరియు ప్రాధాన్యత పలకలు చెక్కాడు. వాస్తవానికి మన ఈ కాలంలో ఇది అరుదైన నిదర్శన. నేను ఇంకేమనాలి. ఇంతకంటే ఎక్కువ ఏమీ అనలేను. అల్లాహ్ నీపై అనేకానేక కరుణలు కురిపించుగాక. విశాల స్వర్గంలో నివాసముంచుగాక. అమరవీరుల, పుణ్యాత్ముల స్థానం ప్రసాదించుగాక. ఆయన సత్కార్యఫలమిచ్చువాడు, కనికరం, దయ గలవాడు.
నీ సోదరుని అవసరం అంటేః అతనికి ఏదైనా బాధ ఉంటే నీవు దాన్ని సులువుగా చేయుట. అవస్త ఉంటే చికిత్స చేయించుట. అప్పు ఉంటే తీర్చుట. అతను అడిగినప్పుడు అప్పిచ్చుట. ఏదైనా లోపం ఉంటే దూరం చేసి అతని పరువు కాపాడుట. స్నేహం ద్వారా తృప్తినిచ్చుట. అతని వెనక అతని కొరకు దుఆ చేయుట. ప్రతి సత్కార్యంలో అతనికి చేయూతనిచ్చుట. మంచి విషయంలో సహాయపడుట. ఈ సత్కార్యాల ద్వారా అల్లాహ్ ప్రేమను చూరగొని, ఆయన కొరకే ప్రాయాసపడి ఆయన సంతృష్టి పొంది విజయ వంతునివి అయిపో.
ప్రియ సోదరా! దైవ వాగ్దానాలు, అప్పులిచ్చేవారికి రెండితలు లభించే పుణ్యాలు, ఉత్తమ ఫలితాలు, ఎల్లకాలం ఉండే ఫలాలు, నీడలు గల స్వర్గాలు. ఎవరికీ? మనస్తృప్తితో, ఆత్మసంతోషంతో, ఉదార గుణంతో దానం చేసేవారికి. అతని ముందు ఉత్తమ వాగ్దాన ఖుర్ఆన్ ఆయతులు అట్లే వచ్చేస్తాయిః
అల్లాహ్ కు రుణం ఇచ్చేవాడెవడైనా ఉన్నాడా? మేలైన రుణం: అటువంటి వానికి అల్లాహ్ దానిని ఎన్నో రెట్లు పెంచి తిరిగి ఇస్తాడు. అతనికి ఎంతో శ్రేష్ఠమైన ప్రతిఫలం లభిస్తుంది. (హదీద్ 57: 11).
తమ సంపదను రెయింబవళ్ళు బహిరంగంగానూ, రహస్యంగానూ ఖర్చు చేసే వారు తమ ప్రతిఫలాన్ని తమ ప్రభువు వద్ద పొందుతారు. (బఖర 2: 274).
దానధర్మాలు ఐశ్వర్యవంతమైన చెలమ. దాని ప్రవాహంతో జీవిత పాపాలు, కష్టాలన్నీ కొట్టుకపోతాయి. మంచి విషయాల్లో ఖర్చు పెట్టుట ఎన్నో పెద్ద రోగాలకు బల్సమ్ చికిత్స లాంటిది. గుప్తంగా ఖర్చు పెట్టుట వలన ధనంలో అభివృద్ధి, శుభాలు కలుగుతాయి. భూమ్యాకాశాల ప్రభువు వీటి వాగ్దానం చేశాడు.
ఇలా చెప్పండిః నా ప్రభువు తన దాసులలో తన కిష్టమైన వారికి విస్తృతమైన ఉపాధిని ఇస్తాడు. తన కిష్టమైన వారికి ఆచితూచి ఇస్తాడు. మీరు దేనిని ఖర్చు చేసినప్పటికీ దాని స్థానంలో ఆయనే మీకు మరింత ఇస్తాడు. ఆయనే సర్వశ్రేష్ఠుడైన జీవనోపాధిప్రదాత. (సబా 34: 39).
ఔదార్యుడా! నీవు చేసే దానం ఒక బీజం లాంటిది. ఈ నేలపై కాలు మోపిన అతి ఉత్తమమైనవారు; అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాని బీజం నాటారు. “వాస్తవానికి దానధర్మాలు చేయడంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రభంజనం కన్నా చురుకుగా ఉండేవారు”. (బుఖారి 6, ముస్లిం 2308).
ఈ వనంలోని పూవుల్లో ఒక పూవును సమీపించడానికి ఈ పేజిలో ఈ సంఘటన చదువుదాము. తెల్ల జాతివారి ఇంట్లోని ఓ వ్యక్తి మధ్యలో ఉన్న మంచం మీద సంపూర్ణ జడత్వానికి గురి అయిఉన్నాడు. అతని ప్రక్కనే ఉన్న నాడిమితి (Pulsimeter), శ్వాసను కంట్రోల్ చేసే యంత్రం మరియు మెడికల్ సుల్యూషన్ ట్యూబుల గురించి అతనికి ఏమీ తెలియదు.
సంవత్సరం పైగా ఎడతెగ కుండా ప్రతి రోజు అతని భార్య మరియు 14 సంవత్సరాల ఓ కొడుకు అతని వద్దకు వచ్చి, ప్రేమ, వాత్సల్యంతో అతని వైపు చూసి, అతనికి బట్టలు మార్చి, అతని క్షేమ విషయాలు తెలుసుకుంటూ, అతని గురించి డాక్టర్ తో కూడా మరిన్ని వివరాలు తెలుసుకుంటూ ఉండేవారు. అతనిలో ఏ కొత్త మార్పు లేకుండా, ఎక్కువ తక్కువ కాకుండా అదే ఆరోగ్య స్థితిలో సంపూర్ణ జడత్వం (Coma)లో ఉన్నాడు. అల్లాహ్ తప్ప అతని స్వస్థత ఆశ ఎక్కడా లేకుండా అయిపోయింది. కాని ఓర్పుగల స్త్రీ మరియు యౌవనారంభదశలో ఉన్న అబ్బాయి ఇద్దరూ వినయ నమ్రతతో తమ చేతులు అల్లాహ్ వైపు ఎత్తి అతని స్వస్తత, ఆరోగ్యం గురించి దుఆ చేయనిదే అక్కడి నుండి వెళ్ళేవారు కారు.
అదే రోజు మళ్ళీ తిరిగి రావడానికి హాస్పిటల్ నుండి వెళ్ళిపోయేవారు. ఇలా ఎడతెగకుండా చికాకు, అలసట లేకుండా ప్రతి రోజు వస్తూ ఉండేవారు. హృదయాలు ప్రేమతో ఏకమైనాయి, సత్యంతో కలసిపోయాయి, కష్టాల్లో ఓర్పు, సానుభూతి, జాలి లాంటి పూర్ణసౌందర్య పుష్పాలు పుష్పించాయి.
ఏ కొత్త మార్పు లేని ఈ శవం లాంటి రోగి దర్శనానికి వస్తున్న స్త్రీ మరియు అబ్బాయిని చూసి పేషెంట్లు, నర్సులు, డాక్టర్లే ఆశ్చర్యపోయేవారు. అల్లాహ్! అల్లాహ్!! ఎంతటి విచిత్రమైన సందర్భం! తన ప్రక్కన ఏముందో తెలియని రోగి దర్శనం రోజుకు రెండు సార్లా? డాక్టర్లు మరియు వారి అసిస్టెంటులు వారిద్దరిపై జాలి, దయ చూపుతూ అతని దర్శనమవసరం లేదు. వారంలో ఒకసారి రండి చాలు అని స్పష్టం చేశారు. అప్పుడు “అల్లాహుల్ ముస్తఆన్, అల్లాహుల్ ముస్తఆన్”(సహాయం కోసం అర్థింపదగినవాడు అల్లాహ్ మాత్రమే) అన్న పదాలే ఆ శ్రేయోభిలాష గుణం గల ఆడపడచు నోట వెళ్లేవి.
ఒకరోజు … భార్య, కొడుకుల దర్శానినికి కొంచెం ముందు ప్రభా- వితమైన ఓ వింత సంఘటన సంభవించింది; కోమలో ఉన్న మనిషి తన మంచంలో కదులుతున్నాడు, ప్రక్క మార్చుతున్నాడు, క్షణాలు గడవక ముందే కళ్ళూ తెరుస్తున్నాడు, ఆక్సిజన్ యంత్రాన్ని తన నుండి దూరం జేస్తూ, సరిగ్గా కూర్చుంటున్నాడు, నర్సును పిలుస్తూ ఓ కేక వేస్తున్నాడు. ఆమె బిత్తరపోయి వెంటనే హజరయింది. అతడు ఆమెతో వైద్య యంత్రాలన్నిటి (Medical equipents)ని తీయమని కోరాడు. ఆమె నిరాకరించి వెంటనే డాక్టర్ ను పిలిచింది. అతడు దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే ఎన్నో రకాల చెకప్ లు చేశాడు. కాని ఆ మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు. అప్పుడు డాక్టర్ అవును ఈ యంత్రాలన్నిటిని తీసేసి అతని శరీరాన్ని శుభ్రపరచండని ఆదేశించాడు.
నిష్ఠగల భార్య దర్శన సమయం సమీపించింది. భార్య మరియు కొడుకు తమ ప్రియమైనవారి వద్దకు వచ్చారు. నేను ఏ విధంగా ఆ దయార్థ క్షణాలను వర్ణించాలో, ఏ పదాలను కూర్చి నీ ముందు ఉంచాలో, వాస్తవానికి (వర్ణాతీతమైన ఘడియ అది) చూపులు చూపులను కౌగలించుకుంటున్నాయి, ఆశ్రువులు ఆశ్రువుల్లో మిశ్రమం అయిపోతున్నాయి. చిరునవ్వులు పెదవులపై నివ్వెర పరుస్తున్నాయి. అనుభూతులు నోరుమూతపడవేశాయి. కేవలం అమిత దయాలుడు, మహోపకారుడైన అల్లాహ్ స్తోత్రములు తప్ప. ఆయనే ఆమె భర్తకు స్వస్తత వరం ప్రసాదించాడు.
ఓ పుణ్యాత్ములారా ఈ సంఘటన ఇక్కడికే అంతం కాలేదు. ఇందులో ఓ గొప్ప రహస్యం ఉంది. అది స్పష్టమయ్యే వరకు డాక్టర్ కే ఓపిక లేదు. వెంటనే అతని భార్యను ‘నీవెప్పుడైనా ఇతడ్ని ఈ స్థితిలో చూడగలుతావని ఆశించావా?’ అని ప్రశ్నించాడు. ఆమె చెప్పిందిః ‘అవును, అల్లాహ్ సాక్షిగా! ఒక రోజు తప్పక రానుంది ఆయన మా రాక గురించి కూర్చుండీ వేచిస్తారు అని నేను ఆశించాను’.
డాక్టర్ చెప్పాడు: అతను ఈ స్థితికి రావడానికి ఎదో విషయముంది. అందులో వైద్యశాలకే గాని లేదా వైద్యులకే గాని ఏ ప్రమేయం, ఏ పాత్ర లేదు. అల్లాహ్ సాక్షిగా అడుగుతున్నాను నీవు తప్పక చెప్పే తీరాలి. అవును? రోజుకు రెండేసి సార్లు నీవు ఎందుకని వస్తూ ఉంటివి? నీవు ఏమి చేస్తూ ఉంటివి?
ఆమె చెప్పింది: నీవు నాపై అల్లాహ్ పేరున ప్రమాణం చేసి అడగావు గనక చెబుతున్నానుః నేను మొదటి దర్శనానికి ఆయన తృప్తి మరియు ఆయన గురించి దుఆ చేయుటకు వచ్చేదానిని. మళ్ళీ నేను, నా కొడుకు అల్లాహ్ సామీప్యం కోరుతూ, అల్లాహ్ ఆయనకు స్వస్థత ప్రసాదించాలని బీదవాళ్ళ మరియు నిరుపేదల వద్దకు వెళ్ళి దానధర్మాలు చేసేవాళ్ళము.
అల్లాహ్ ఆమె ఆశను, దుఆను నిరాశగా చేయలేదు. ఆమె చివరి దర్శనానికి వచ్చి, ఆయన రాక కొరకు వేచిస్తూ ఉన్న ఆమె, ఆయన్ని తన వెంట తీసుకువెళ్ళసాగింది. ఆమె, ఆమె ఇంటి వారి కొరకు చిరునవ్వులు, సంతోషాలు తిరిగి రాసాగాయి.
తమ సంపదను రేయింబవళ్ళు బహిరంగంగానూ, రహస్యంగానూ ఖర్చు చేసేవారు తమ ప్రతిఫలాన్ని తమ ప్రభువు వద్ద పొందుతారు. వారికి ఏ విధమైన భయంగాని, దుఃఖంగాని కలిగే అవకాశం లేదు. (బఖర 2: 274).
ఈ సంఘటనను గౌరవనీయులైన అధ్యాపకులు అహ్మద్ సాలిమ్ బా దువైలాన్ “లా తయ్అస్” అన్న తన రచనలో పేర్కొన్నారు. అల్లాహ్ వారికి మరింత సద్భాగ్యం ప్రసాదించుగాక. మరియు మా వైపున ఉత్తమ ఫలితం నొసంగుగాక.
మీరు అమితంగా ప్రేమించే వస్తువులను (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టనంత వరకు మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు. (ఆలిఇమ్రాన్ 3: 92).
దానధర్మాలు ఏ చోట చేస్తే చాలా మేలు ఉందో వెతకాలి. అయితే అన్నిట్లో కెల్లా అతిఉత్తమమైన స్థానం అల్లాహ్ వద్ద అతి చేరువ స్థానం పొందుటకు ఇల్లాలు, పిల్లలకు మరియు బంధువులపై ఖర్చు చేయాలి.
ఉమ్మె సల్మా రజియల్లాహు అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ‘ప్రవక్తా! నేను అబూ సలమ సంతానం కొరకు ఖర్చు చేస్తే నాకు పుణ్యం లభిస్తుందా? నేను వారిని (దీన స్థితిలో చూస్తూ) వదలలేను. వాళ్ళు కూడా నా పిల్లలే కదా?’ అని అడిగింది. దానికి ప్రవక్త ﷺ చెప్పారుః “అవును, నీవు వారి కొరకు ఖర్చు చేస్తున్నదాని ప్రతిఫలం నీకు తప్పక లభిస్తుంది”. (బుఖారి 5369, ముస్లిం 1001).
మనం మన భార్యపిల్లలపై ఖర్చు చేయని రోజంటు ఏదైనా ఉంటుందా? కావలసిందేమిటంటే మనం సర్వ లోకాల ప్రభువైన అల్లాహ్ తో పుణ్యాన్నాశించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
“నీవు అల్లాహ్ ప్రసన్నత కోరుతూ ఖర్చు చేసే ప్రతీదానికి నీకు తప్పకుండా పుణ్యం లభిస్తుంది. చివరికి నీవు నీ భార్య నోటికందించే దాని(ముద్ద, గుటక) పై కూడా నీకు పుణ్యం దొరుకుతుంది“. (బుఖారి 56, ముస్లిం 1628).
అల్లాహ్ నీ ఉపాధిలో వృద్ధి చేసి ఉంటే నీవు స్వయం నీపై మరియు దేశ, విదేశాల్లో ఉన్న నీ సోదరులపై ఎక్కువైనా, తక్కువైనా శుభప్రదమైన ఖర్చు చేస్తూ ఉండడంలో పిసినారితనం వహించకు.
తక్కువదాని ఉదాహరణ ఒక మస్జిద్ ఇమాం ఇలా ప్రస్తావించాడుః మస్జిద్ శుభ్రపరిచే పనిమనుషుల్లో ఒకరి విషయం చాలా గొప్పగా ఉంది; అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయుటకు ఎప్పుడు చెప్పినా వెంటనే అంగీకరించి, తాను స్వయంగా ఆర్థికంగా బలహీనుడు, దీనుడయినప్పటికీ వెనకాడకుండా అతని శక్తి ప్రకారంగా అర్థ రూపాయి దానం చేసేవాడు.
కేవలం అర్థ రూపాయి!! జాగ్రత్త! చాలా తక్కువే కదా అన్న హీనభావం నీలో కలగకూడదు. నిశ్చయంగా అల్లాహ్ వద్ద దాని విలువ చాలా గొప్పగా ఉంది. ఎందుకో నీకు తెలుసా? ఎందుకనగా, ప్రవక్త ﷺ ఇలా చెప్పారుః
“అల్లాహ్ ధర్మసమ్మతమైన సంపాదన (నుండి ఇచ్చే దానాల్ని) మాత్రమే స్వీకరిస్తాడు. అందుకే ఎవరైనా ధర్మసమ్మతమైన సంపాదన నుండి ఖర్జూరపుటంత వస్తువేదైనా దానం చేస్తాడో అల్లాహ్ దానిని కుడి చేత్తో అందుకొని మీరు గుర్రపు పిల్లను పెంచి పెద్ద చేసినట్లుగా దానిని దానం చేసినవాడి కోసం పెంచుతాడు. అలా పెరుగుతూ చివరకు అది పర్వతమంత పెద్దదిగా అయిపోతుంది“. (బుఖారి 1410).
అది అర్థ రూపాయి మాత్రమే.. కాని అల్లాహ్ ఆజ్ఞతో నరకాగ్ని నుండి రక్షణకై గొప్ప కారణం కావచ్చు. నాతో పాటు మీరు కూడా
ప్రవక్త ఈ ప్రవచనం గుర్తు చేసుకోలేరా?
(اتَّقُوا النَّارَ وَلَوْ بِشِقِّ تَمْرَةٍ)
“మిమ్మల్ని మీరు నరకం నుండి కాపాడుకోండి, ఒక ఖర్జూరపు ముక్క (దానం)తోనైనా సరే“. (బుఖారి 1417).
మనం నింపాదిగా అడుగులు ముందుకేస్తూ ఒక స్వచ్ఛంద సేవ సంస్థ వైపుకెళ్దాము, అక్కడ ఓ దాతృత్వ దృశ్యాన్ని వీక్షిద్దాముః పండుగకు ఒకరోజు ముందు రాత్రి వేళ అక్కడి ఒక అధికారి వద్దకు పది సంవత్సరాలు కూడా దాటని ఒక అబ్బాయి వచ్చి సుమారు రెండు వందల రూపాలు దానం చేస్తాడు. ఎంతో ఆశ్చర్యంతో ‘నీకీ డబ్బలు ఎక్కడివి, మేము వీటిని ఏమి చేయాలి’ అని అతను అడుగుతాడు. అబ్బాయి ఇలా సమాధానమిస్తాడుః ఈ డబ్బులు నాకు నా తండ్రి పండుగ కొరకు బట్టలు ఖరీదు చేసుకోమని ఇచ్చాడు. అయితే ఈ డబ్బులతో అనాధ అబ్బాయి ఎవరైనా పండుగ సందర్భంగా తన కొరకు కొత్త బట్టలు ఖరీదు చేసుకుంటే బాగుంటుందని నా కోరిక. ఇక పోతే నాకు నా శరీరంపై ఉన్న ఈ బట్టలే చాలు అని అన్నాడు.
అల్లాహ్ మరింత సద్భాగ్యం ప్రసాదించుగాక ఆ ఇంటివారికి ఎందులోనైతే నీవు పెరుగుతున్నావో ఎవరి ఒడిలో నీవు పెద్దగవుతున్నావో! అల్లాహ్ ఇహపరాల్లో నిన్ను వారి కళ్ళకు చల్లదనంగా చేయుగాక.
ప్రియపాఠకుడా! ఒకవేళ నీవు ఎక్కువ ధనం గలవాడివై ఉంటే అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన సంఘటనను గుర్తుచేసుకోః
మదీనాలోని అన్సార్ ముస్లిములలో అందరికంటే ఎక్కవ ఖర్జూరపు తోటల సంపద కలిగి ఉన్న వ్యక్తి అబూ తల్హాయే ఉండిరి. తన సంపదలో ఆయనకు ‘బైరుహా’ అనే తోటంటే చాలా ఇష్టం. అది మస్జిదె నబవికి ఎదురుగా ఉండింది. ప్రవక్త ﷺ కూడా ఆ తోటలోకి వెళ్తుండేవారు. అక్కడ లభించే మంచి నీళ్ళు త్రాగేవారు. ]మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు దానం చేయనంత వరకు మీరు పుణ్య స్థాయికి చేరుకోలేరు[ అనే అల్లాహ్ ఆయతు అవతరించినప్పుడు అబూ తల్హా లేచి, ‘ప్రవక్తా! ]మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు దానం చేయనంత వరకు మీరు పుణ్య స్థాయికి చేరుకోలేరు[ అనే ఆయతు అల్లాహ్ మీపై అవతరింప జేశాడు. నా సంపద మొత్తంలో ‘బైరుహా’ తోట నాకు అత్యంత ప్రీతికరమైనది. అందుకు నేను దానిని అల్లాహ్ కోసం దానం చేస్తున్నాను. దానిపై నాకు పుణ్యం లభిస్తుందని, అల్లాహ్ వద్ద అది నిలువచేసి ఉంచబడుతుందని ఆశిస్తున్నాను. కనుక ప్రవక్తా! మీరు దీనిని అల్లాహ్ మీకు చూపిన పద్దుల్లో వినియోగించండి’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త ﷺ “ఓహో! ఇదెంతో లాభదాయకమైన సంపద, నిజంగా ఇది ఎంతో లాభదాయకమైన సంపద. ఇప్పుడు నువ్వన్న మాటలన్నీ నేను విన్నాను. అయితే నీవు దానిని నీ బంధువుల్లో పంచిపెడితే బాగుంటుందని నేను భావిస్తున్నాను” అని అన్నారు. దానికి అబూ తల్హా ‘నేను అలాగే చేస్తాను ప్రవక్తా!’ అని అన్నారు. అన్న ప్రకారమే ఆయన దానిని తన బంధువులకు, పెద్దనాన్న, చిన్నాన్న పిల్లలకు పంచిపెట్టారు”. (బుఖారి 1461).
ప్రియసోదరా! దైవదూతలు ఎవరి కొరకు దుఆ చేస్తారో వారిలో ఒక్కనివి నీవు అయిపోః
(اللَّهُمَّ أَعْطِ مُنْفِقًا خَلَفًا)
“ఓ అల్లాహ్! నీ (మార్గంలో) దానం చేసేవారికి నీవు వెంటనే మరింత ప్రసాదించు“. (బుఖారి 1442, ముస్లిం 1010).
ప్రియసోదరా! అల్లాహ్ ఎవరిపై ఖర్చు చేస్తాడో వారిలో ఒకనివి నీవు ఐపో, ఆయనే స్వయంగా ఒక హదీసె ఖుదుసిలో ఇలా చెప్పాడుః
(أَنْفِقْ يَا ابْنَ آدَمَ أُنْفِقْ عَلَيْكَ)
“ఆదము కుమారా నీవు ఖర్చు చేయి నేను నీపై ఖర్చు చేస్తాను“. (బుఖారి 5352).
ప్రియసోదరా! నీవు దానం చేసిందే నీ కొరకు మిగిలి ఉండేది. అది అంతం అయ్యేది కాదు. ఏదైతే నీవు ఖర్చు చేయకుండా ఆపి ఉంచుతావో అదే నిజానికి నీకు కానిది అని నమ్ము.
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం: వారు ఓ మేకను కోశారు. (దాని మాంసంలో చాలా భాగం ప్రజలకు పంచి పెట్టారు). ఆ సందర్భంగా ప్రవక్త ﷺ ఆయిషాతో “ఆ మాంసంలో ఇంకా ఎంత మిగిలి ఉంది?” అని అడిగారు. ‘అంతా అయిపోయింది, ఒక్క భుజ భాగం మాత్రమే మిగిలి ఉంది అని చెప్పారామె. దానికాయన “(కాదు) ఆ భుజ భాగం తప్ప తతిమ్మా మాంసమంతా మిగిలి ఉంది” అని చెప్పారు. (ఇమాం తిర్మిజి దీనిని ఉల్లేఖించి ఇది సహీ హదీసు అని చెప్పారు).
కాదు.. మనం దానం చేసింది మిగిలి ఉండడమే కాదు. అది పెరుగుతూ ఉంటుంది. ప్రవక్త ﷺ చెప్పారుః
(مَا نَقَصَتْ صَدَقَةٌ مِنْ مَالٍ) {مسلم 2588}
“దానధర్మాలు ఎప్పుడూ సంపదలో లోటు ఏర్పరచవు“. (ముస్లిం).
ధర్మప్రచారంలో ఉన్న నా సోదరుడు డా. ఖాలిద్ బిన్ సఊద్ అల్ హులైబీ తెలిపాడుః దాతృత గుణంగల ఒక పెద్ద వ్యాపారి అహ్ సా పట్టణంలోని గొప్ప ధనవంతుల్లోని ఒకరు షేఖ్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ అజీజ్ అన్నుఐమ్ ఇలా చెప్పేవారు: నేను అల్లాహ్ మార్గంలో ఏది ఖర్చు చేసినా, దాని ఘనత వల్ల అందులో చాలా శుభం నా కళ్ళార చూసేవాడిని.
ఈ హదీసుపై శ్రద్ధ వహించు, ఇది ఈ సుందర వనం ఫలాల్లోని ఓ ఫలాన్ని నీకు అతి చేరువుగా చేస్తుందిః
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఒక వ్యక్తి ఓ మైదానం గుండా వెళ్తుండగా ఏదో ఓ మేఘం నుంచి “ఫలానా వ్యక్తి తోటలో వర్షం కురిపించు” అన్న శబ్దం వినపడింది. మళ్ళీ ఆ మేఘం పక్కకు జరిగి ఓ నల్లని రాతి నేలపై కురిసింది. (దాంతో చిన్న చిన్న కాల్వలు ఏర్పడ్డాయి) చివరకు ఒక (పెద్ద) కాలువ మిగతా కాలువలన్నిటిని తనలో కలుపుకొని ప్రవహించసాగింది. ఆయన కూడా ఆ ప్రవాహం వెంట నడవసాగాడు. అటు ఓ మనిషి పారతో తన తోటకు నీళ్ళు కడుతున్నాడు. ‘ఓ దైవ దాసుడా! నీ పేరేమిటి అని అతడ్ని అడిగాడు. ఫలాన పేరు అని ఇతను మేఘంలో విన్నపేరే అతడు చెప్పాడు. ‘ఓ దైవదాసుడా! నా పేరెందుకు అడుగుతున్నావు’ అని అతడడిగాడు. ఇతడన్నాడుః నీవు చెప్పిన పేరే చెబుతూ ఫలాన తోటలో వర్షం కురిపించు అని నేను ఏ మేఘంలో విన్నానో దాని నీళ్ళే ఇవి. అయితే అసలు నీవు చేస్తున్న పనేమిటి? అతడన్నాడుః నీవు అడిగావు గనక చెబుతున్నానుః పంట పండిన తర్వాత నేను దాని అంచనా వేసుకొని, మూడో వంతు భాగం దానం చేస్తాను. మరో మూడో వంతు నేను, నా ఆలుబిడ్డలు తినడానికి (ఉంచుకుంటాను). మరో మూడో వంతు తిరిగి విత్తనంగా వేయుటకు ఉపయోగిస్తాను”. మరో ఉల్లేఖనంలో ఉందిః “నేను మూడో వంతును పేదవాళ్ళల్లో, అడిగేవారిలో మరియు బాటసారుల్లో దానం చేస్తాను”. (ముస్లిం 2984).
దానధర్మాలు చేయడం కూడా ఓ సద్గుణమే. ఎక్కడైతే అవసరం, బీదరికం ఉందో అక్కడ దాని అందం మరీ పెరుగుతుంది. అందులో దాతృత్వం మరియు ప్రాధాన్యత గుణాలు కలసి ఏకమవుతాయి. అత్యంత దాతృతుడు, మహోపకారుడైన అల్లాహ్ స్వయంగా ఆశ్చర్య(సంతోష) పడ్డాడన్న హదీసు ఒకటి శ్రద్ధగా చదువుః అబూ హురైరా దానిని ఉల్లేఖించారుః
ఒక వ్యక్తి ప్రవక్త ﷺ వద్దకు వచ్చి ‘నేను తిండి లేక పరితపిస్తున్నాను’ అని చెప్పాడు. అందుకు ప్రవక్త ﷺ తమ ఒక భార్యకు ఈ వార్త పంపారు. ‘మిమ్మల్ని సత్య ధర్మం ఇచ్చిపంపిన అల్లాహ్ సాక్షిగా! నా దగ్గర నీళ్ళు తప్ప మరేమీ లేదు” అని ఆమె చెప్పంపింది. తర్వాత మరో భార్య వద్దకు పంపారు. ఆమె కూడా అలాగే జవాబు చెప్పింది. చివరికి ఆయన భార్యలందరూ “మిమ్మల్ని సత్యధర్మం తో పంపిన అల్లాహ్ సాక్షిగా! నా దగ్గర నీళ్ళు తప్ప మరేమీ లేదు” అనే చెప్పారు. అప్పుడు ప్రవక్త ﷺ తమ సహచరులనుద్దేశించి “ఈ రాత్రి ఇతనికి ఆతిథ్యమిచ్చే వారెవరైనా మీలో ఉన్నారా” అని అడిగారు. ఒక అన్సార్ వ్యక్తి లేచి, నేను ఇస్తాను ప్రవక్తా! అని అన్నారు. ఆయన అతడ్ని తనింటికి తీసుకెళ్ళాడు. తన భార్యతో ‘ఇతను ప్రవక్తగారి అతిథి, ఇతనికి మంచి ఆతిథ్యమివ్వాలి’ అని చెప్పాడు. మరో ఉల్లేఖనంలో ఉందిః ‘ఇంట్లో భోజనానికి ఏదైనా ఉందా’ అని తన భార్యను అడిగారు. దానికి ఆమె ‘పిల్లలకు సరిపోయేంత మాత్రమే ఉంది’ అని చెప్పింది. అప్పుడాయన చెప్పారుః రాత్రి భోజనం నుండి పిలవాళ్ళ మనస్సు మళ్ళించు. ఎప్పుడు వారు రాత్రి భోజనం కోరుతారో అప్పుడు వారిని పడుకోబెట్టు. ఇక అతిథి ఇంట్లోకి రాగానే (అన్నం వడ్డించి, తినేముందు) దీపం ఆర్పెయ్యి. ఆయన ముందు మనం కూడా అన్నం తిన్నట్లు నటిద్దాం. అందరూ భోజనానికి కూర్చున్నారు. (ఆమె దీపం ఆర్పేసింది) వచ్చిన అతిథి (కడుపునిండా) భోజనం చేశాడు. కాని ఆ దంపతులు మాత్రం పస్తుండిపోయారు. ఆ అన్సార్ సహచరుడు మరునాడు ఉదయం ప్రవక్త ﷺ వద్దకు వెళ్ళగా ఆయన ﷺ ఇలా చెప్పారుః
“నిశ్చయంగా రాత్రి మీరు మీ అతిథికి చేసిన సేవ చూసి అల్లాహ్ చాలా సంతోషించాడు“. (ముస్లిం 2054).
ఈ సమాజం ప్రవక్త ﷺ చూపిన సద్గుణాలపై శిక్షణపొందిన, స్వచ్చమైన చెలమ నుండి ఆస్వాదించిన సమాజం. అహం, స్వార్థం అంటే తెలియని సమాజం. ఇదిగో; సమాజంలో ఒక రకమైన సమాజాన్ని వారిలో ఉన్న ఆదర్శవంతమైన ఉత్తమ గుణాన్ని ప్రవక్త ﷺ ప్రశంసించారు. ఆ మనుగడపై గనక నేటి అనుచర సంఘం నడిచి ఉంటే వారిలో ఒక్క బీదవాడు అంటూ ఉండడు. వారు అష్అరీ తెగకు చెందినవారు. వారి గురించే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః
“అష్అరీ తెగవాళ్ళు యుద్ధరంగంలో ఉన్నప్పుడు వారి ఆహార పదార్థాలు అయిపోవస్తే లేదా (స్వస్థలం) మదీనాలో ఉన్నప్పుడు తమ ఆలుబిడ్డల ఆహారపదార్థాల్లో కొరత ఏర్పడితే ఎవరి వద్ద ఏ కొంత ఆహారం ఉన్నా వారు దాన్ని ఒక వస్త్రంలో పోగుచేస్తారు. మళ్ళీ ఒక పాత్రతో అందరూ సమానంగా వాటిని పంచుకుంటారు. అందుకే వారు నాతో పాటు ఉన్నారు. నేను వారితో పాటు ఉన్నాను“. (బుఖారి 2486, ముస్లిం 2500).
జాగ్రత్తా! ఓ ఉదారుడా! నిరాశ నిస్పృహలు నీపై తిష్టవేయకుండా జాగ్రత్తగా ఉండు. ఇప్పటికీ ఈ అనుచర సంఘంలో ప్రవక్త అడుగుజాడల్లో, పూర్వపు పుణ్యపురుషుల బాటలో నడిచే ఉపకా- రులున్నారు. ప్రతి చోట మన బలహీన సోదరుల కొరకు విరాళాల మరియు దానాల ఉద్యమాలు మనం ఎన్నటికీ మరవలేము. విరాళాల, దానాల ఈ రకాల్ని చూసి మనస్సు సంతోషిస్తుంది, హృదయం ఆనందిస్తుంది. వీటిని చూసేవాడు, వాస్తవానికి ఇవి భూమ్మీద ఓ మంచి రక్షక విధానం అని మరియు భూవాసుల శాంతి క్షేమాల రహస్యమని గ్రహించగలుగుతాడు. అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు, కృతజ్ఞతలు.
రెండు సంఘటనలు నన్ను చాలా ఆశ్చర్యపరచాయి. వాటిని షేఖ్ అలీ తంతావీ రహిమహుల్లాహ్ “జిక్రయాత్” అన్న తన రచనలోని భూమికలో ప్రస్తావించాడుః మా తండ్రిగారి అధ్యాపకులు షేఖ్ సలీమ్ అల్ మసూతీ రహిమహుల్లాహ్ స్వయంగా ఎంతో బీదవారైనప్పటికీ ఏ ఒక్క బీదవాడిని ఎప్పుడూ నెట్టలేదు. అతను ఓ చొక్కా ధరించి బైటికి వెళ్ళేవారు, దారిలో చలితో వణికిపోతున్న ఓ మనిషిని చూసి ఆ చొక్కా అతనికి ఇచ్చేసి, తాను కేవలం లాగు మీద ఇంటికి తిరిగి వచ్చేవారు. ఒక్కోసారి తన ఆలుబిడ్డలతో కలసి భోజనం చేస్తుండగా వారు తింటూ ఉన్న ఆహారపదార్థాలు తీసి ఇంటి ముందు వచ్చిన భిక్షకునికి ఇచ్చేవారు. ఒకసారి రమజానులో ఇఫ్తార్ గురించి తినుత్రాగు పదార్థాలు (దస్తర్ ఖ్వాన్ మీద) పెట్టి సైరన్ గురించి వేచిస్తుండగా ఒక భిక్షకుడు వచ్చి తనకు తన ఆలుబిడ్డలకు తినడానికి ఏమీ లేదు అని ప్రమాణాలు చేశాడు. షేఖ్ తన ఆవిడ అశ్రద్ధను గమనించి ఇఫ్తార్ గురించి వడ్డించిన మొత్తం ఆహారం అతనికిచ్చేశారు. కాని ఆవిడ చూసి అరవడం, విలపించడం మొదలెట్టి, నీ దగ్గరే కూర్చోను పో! అని ప్రమాణం చేసింది. ఆయన గారు మౌనంగా ఉన్నారు. అర్థ గంట కూడా గడవక ముందే ఎవరో తలుపు తట్టుతున్న శబ్దం విన్నారు. చూసే సరికి ఒక వ్యక్తి పెద్ద పళ్ళం ఎత్తుకువస్తున్నాడు. అందులో ఎన్నో రకాల తినుభంఢారాలు, స్వీట్లు, ఫలాలున్నాయి. ఏమిటి? అని అడిగితే, ఇక్కడి మన నగర పాలకుడు కొంతమంది పెద్దమనుషులను ఆహ్వానించాడు. వారు రానట్లుగా విన్నవించుకోగా, ఆయన కోపంతో నేనూ తినను అని ప్రమాణం చేసి ఇదంతా షేఖ్ సలీం అల్ మసూతీ ఇంటికి తరలించండని ఆదేశించాడు అని వారు చెప్పారు.
రెండవ సంఘటనః ఒక ఆడపడచు సంఘటన. ఆమె కొడుకు ఏదో ప్రయాణానికి వెళ్ళాడు. ఒకరోజు ఆమె తినడానికి కూర్చుంది. ఆమె ముందు ఓ రొట్టె ముక్క, దానికి సరిపడు కొంత కూర ఉంది. అంతలోనే ఒక భిక్షకుడు వచ్చాడు. అందుకు ఆమె తన నోట్లోకి తీసుకుపోయే ముద్దను ఆపేసి, అతనికిచ్చేసింది. తాను పస్తుండి పోయింది. ఆమె కొడుకు ప్రయాణం నుండి తిరిగి వచ్చాక ప్రయాణంలో చూసిన విషయాల్ని చెప్పసాగాడు. అన్నిట్లోకెల్ల చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటేమిటంటేః ఒక దారిలో ఓ పులి నన్ను ఒంటరిగా చూసి వెంబడించింది. నేను పరుగులు తీశాను. ఒక్కసారి కొంచెం దగ్గరున్నప్పుడు అమాంతం దూకి నా మీద పడింది. ఇక నేను దాని నోట్లో పోయానని భావిస్తున్న వేళ ఒక మనిషి తెల్లని దుస్తుల్లో నా ముందుకు వచ్చి నన్ను పులి నుండి విడిపించి “ముద్దకు బదులు ముద్ద” అన్నాడు. కాని ఏమిటుద్దేశ్యం నాకు అర్థం కాలేదు. అప్పుడే అతని తల్లి సంఘటన జరిగిన రోజు, సమయం అడిగింది. అదే సమయానికి ఇక్కడ తల్లి బీదవానికి దానం చేసిన వేళ. తన నోట్లోకి పోయే ముద్దను వెనక్కి తీసుకొని అల్లాహ్ మార్గంలో దానం చేసింది. ఇలా తన కొడుకు పులి నోట్లో నుండి బయటికి తీయబడ్డాడు. ఇక్కడికి షేఖ్ తంతావీ మాట సమాప్తమయింది.
ఓ! ఇంతనా పిసినారితనం? పిసినారితనం, పిసినారిని అవమానం, అవహేళన పాలు జేస్తుంది. దాని పర్యవసానం వినాశకరం. దాని వాసన దుర్గంధమైనది. వ్యక్తిగతంగాగాని, జాతియపరంగాగాని అది వినాశనం పాలుజేస్తుంది. సత్యసంధులైన ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః
“పిసినారితనానికి బహుదూరంగా ఉండండి. ఈ పిసినారితనమే మీకు పూర్వం గతించినవారిని సర్వనాశనం చేసింది. తమవారి రక్తం చిందించేందుకు, నిషిద్ధ విషయాల్ని ధర్మసమ్మతం(హలాల్) గా చేసుకోవడానికి ప్రేరేపించింది“. (ముస్లిం 2578).
మల్లె మరియు గులాబీ లాంటి సువాసన ఈ వనం వెదజల్లుతుంది. తాజాగా దాని కొమ్మలు కరుణగల హృదయుల ముందు వంగి ఉంటాయి. ఆ హృదయాలు కరుణామయుడైన అల్లాహ్ ముందు నమ్రతతో ఉండే విధంగా శిక్షణ పొంది ఉన్నాయి. అందుకే అవి తమ ప్రభువు కరుణను మరియు దయను కోరుతూ ఆయన సృష్టి పట్ల మెత్తగా, దాసుల పట్ల మృదువుగా ఉన్నాయి.
“కరుణామయులు”, ఇలాగే మన ప్రభువు మనల్ని నిర్వచించాడు. మనం సానుభూతి చెలమ దగ్గర మేశాము, మరియు దయాగుణ చెలమ నీటి త్రాగాము.
ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త. ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులగానూ ఉంటారు, పరస్పరం కరుణామయులుగానూ ఉంటారు. నీవు వారిని చూసినప్పుడు, వారు రుకూ సజ్దాలలో, అల్లాహ్ అనుగ్రహాన్నీ, ఆయన ప్రసన్నతనూ అర్థించటంలో నిమగ్నులై ఉండటం కనిపిస్తుంది. (ఫత్ హ్ 48: 29 ).
ఇదిగో కారుణ్యమూర్తి ప్రవక్త ﷺ ఊపిరాడుతున్న ఓ చంటి పాపను తమ చేతుల్లో తీసుకున్నారు. ఏ క్షణంలోనైనా ప్రాణం పోతుందన్న పరిస్థితిలో వున్న ఆ అబ్బాయిని చూసి ప్రవక్త చక్షువుల్లో కన్నీరు కారాయి. ఇది గమనించిన సఅద్ ‘ప్రవక్తా! ఇదేమిటి? అని అడిగారు. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారుః
“ఇది కారుణ్యం. అల్లాహ్ తన దాసుల హృదయాల్లో దీనిని పెట్టాడు. తన దాసుల్లో కరుణామయులైన వారిని అల్లాహ్ కరుణిస్తాడు“. (బుఖారి 1384, ముస్లిం933).
అల్లాహ్ నిన్ను కాపాడుగాకా! తెలుసుకోః కారుణ్యం స్వర్గానికి బాట. ఇతర బాటల్లో కెల్లా మరీ అందమైన బాట. ఎలా కాదు? ఒక మనిషి మనస్సులో ఉన్న ఈ కారుణ్యం కారణంగానే అల్లాహ్ అతడ్ని స్వర్గంలో ప్రవేశింపజేశాడు. ఆ కారుణ్యం వల్ల అతడు ఏమి చేశాడు? రండి, సత్యసంధులైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట సంక్షిప్త వాక్యాల్లో ఈ సంఘటన వివిరాలు చదువుదాముః
“ఒక వ్యక్తి ఓ దారి గుండా నడచి వెళ్తుండగా అతనికి విపరీతంగా దాహం కలిగింది. ఒక బావిలో దిగి నీళ్ళు త్రాగి బైటికి వచ్చేశాడు. అంతలోనే ఓ కుక్క నాలుక వెళ్ళబెట్టి బురదమట్టిని నాకుతూ (కనబడింది). ‘నేను దప్పికతో అల్లాడిపోయినట్లు ఈ కుక్క కూడా బాధపడుతుందేమో’ అనుకొని (మళ్ళీ బావిలో దిగి) తన మేజోడును నీటితో నింపి, దాన్ని నోటితో పట్టుకొని పైకి తెచ్చాడు. ఆ నీరు కుక్కకు త్రాపించాడు. అప్పుడు అల్లాహ్ అతను చేసిన పనిని మెచ్చుకొని అతన్ని క్షమించాడు. సహచరులు ఈ వృత్తాంతం విని ‘ప్రవక్తా! భూతదయపై కూడా మాకు పుణ్యం లభిస్తుందా? అని అడిగారు. ప్రవక్త ﷺ ఇలా సమాధానమిచ్చారుః “తడి కాలేయం (అంటే ప్రతి ప్రాణం) గల జీవికి చేసే మేలుకు మీకు పుణ్యం లభిస్తుంది. (బుఖారి 2363, ముస్లిం 2244).
అహా! కర్శక నోరు మరియు కఠిన హృదయుల సంగతే విచిత్రం!! అతని వద్ద ఏ మనిషికి కరుణా కటాక్షాలు లభించవు. చివరికి అతని పెదవులపై చిన్నటి మందహాసమైనా కానరాదు. ఇలాంటి వాడు నోరులేని జీవులపై ఏ దయచూపగలడు? మహా దుస్థితి అతనిది. ఇలాంటి మానవుల దుస్థితి, దురదృష్టం గురించి నేను లేదా నువ్వు కాదు తీర్పు చేసింది? కారుణ్యమూర్తి ﷺ తీర్పు చేశారు.
(لَا تُنْزَعُ الرَّحْمَةُ إِلَّا مِنْ شَقِيٍّ).
“దురదృష్టుని నుండే కారుణ్యం తీసుకోబడుతుంది“. (అహ్మద్, తిర్మిజి 1923. దీని సనద్ హసన్. అబూ దావూద్ 4942).
నరకాగ్ని కంటే మించిన దురదృష్టం ఇంకేమైనా ఉంటుందా? ఒక స్త్రీ అతి చెడ్డ స్థానమైన నరకానికి ఆహుతి అవుతుంది. కారుణ్య స్వభావం ఆమె చీకటి హృదయంలో నిరంకుశం మరియు కఠినత్వంలో మారింది. ఆమె దుష్ఫలిత సమాచారం మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతున్నారుః
“ఒక స్త్రీ పిల్లి కారణంగా శిక్షించబడింది. ఆమె దానిని బంధించింది చివరికి అది చనిపోయింది. అందుకు ఆమె నరకంలో చేరింది. ఆమె ఆ పిల్లికి అన్నం పెట్టలేదు. నీరు త్రాగించలేదు. కట్టి ఉంచింది. కనీసం ఆమె దానిని వదిలివేసినా అదే స్వయంగా నేల మీద తిరిగే క్రిమికీటకాలు తినిబ్రతికేది“. (బుఖారి 3482, ముస్లిం 2242).
ప్రియ సోదరా! నిద్ర లేకుండా చేసిన నొప్పి, రాత్రంత మేల్కొనే ఉండినట్లు చేసిన అవస్థ గల ఓ రోగిని పరామర్శించడం ద్వారా నీపై ఎలా కారుణ్యం కురుస్తుందో ఎప్పుడైనా నీవు అనుభవించావా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః
“ఒక ముస్లిం తోటి ముస్లింను ఉదయం పూట పరామర్శిస్తే, డెబ్బైవేల దైవదూతలు సాయంత్రం వరకూ అతని శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ ఉంటారు. అదే సాయంత్రంవేళ పరామర్శిస్తే డెబ్బై వేల దేవదూతలు ఉదయం వరకూ అతని శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ ఉంటారు. ఇంకా అతని కోసం స్వర్గఫలాలు ఏరి ఉంచబడుతాయి“. (తిర్మిజి 969, అబూ దావూద్ 3098).
ప్రియసోదరా! తండ్రి ప్రేమను కోల్పోయిన అనాథ రక్షణకై చెయ్యి చాచు. అతడు ఎడబాటు బాధను చవిచూశాడు. నీవు చేసే ఈ పుణ్యంలో ప్రవక్త ﷺ చెప్పిన ప్రకారం నీకో వాట లభించుగాకః
“నేను మరియు అనాథ సంరక్షకుడు స్వర్గంలో ఇలా ఉంటాము అని ప్రవక్త ﷺ తమ చూపుడు వ్రేళు మరియు మధ్య వ్రేళును కలపకుండా కొంత సంధు ఉంచి చూపించారు“. (బుఖారి 5304).
విధవల పట్ల దయార్థ హృదయునివిగా ఉండు. చావు ఆమెను తన ప్రియభర్తతో దూరము చేసింది, ఈ దూరం ఆమె గుండెను చీల్చివేసింది. ప్రజల ముందు అవసరాలు ఉంచడం వీపు మీద మోయలేని భారం వేసుకున్నట్లయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారుః
“విధవలు మరియు నిరుపేదల బాగుకోసం కృషిచేసేవాడు అల్లాహ్ మార్గం లో పోరాడే యోధుడితో సమానం. లేదా రాత్రంతా నమాజు, పొద్దంతా ఉపవాసం ఉన్నవారితో సమానం”. (బుఖారి 5353, ముస్లిం 2982).
బలహీనుడి పట్ల నీ కారూణ్య ప్రక్కలను చాచు. బాధలు అతడిని బలహీనతకు గురిచేశాయి. ఈ బలహీనతే అతడ్ని ఒంటరిగా చేసింది. అల్లాహ్ ఆదేశం ఇలా ఉందిః
కావున నీవు అనాథుల పట్ల కఠినంగా ప్రవర్తించకు. యాచకుణ్ణి కసురుకోకు. (జుహా 93: 9,10).
నీ భార్య, సంతానం మరియు ఇతర బంధువుల పట్ల కారూణ్య ఛాయల్ని వేసి ఉంచు. వారు ధన, జ్ఞానపరంగా ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా నీ అవసరం, వాత్సల్యం ఛాయ లేనిది ఉండలేరు. పుణ్య విత్తనం నాటువాడా గుర్తుంచుకో దాని కోత శుభపరం అయినది. ఫలాలు రుచికరమైనవి. ఆయిషా తెలిపిన ఓ సంఘటన ఎలా ఉందో గమనించు:
ఓ నిరుపేద స్త్రీ తన ఇద్దరు బిడ్డలను ఎత్తుకొని నా వద్దకు వచ్చింది. నేనామెకు మూడు ఖర్జూర పండ్లు ఇచ్చాను. ఇద్దరు కూతుళ్ళకు ఒక్కో ఖర్జూరపండు ఇచ్చి మిగిలిన ఒకటి తన నోట్లో వేసుకోబోయింది. అంతలోనే అది కూడా ఇచ్చేయమని వారు కోరారు. వెంటనే ఆమె తాను తిందామనుకున్న ఆ ఖర్జూరాన్ని రెండు ముక్కలు చేసి తలోముక్క ఇద్దరు కూతుళ్ళకిచ్చింది. అది చూసి నాకు చాలా సంతోషం కలిగింది. నేనీ విషయాన్ని ప్రవక్తకు తెలియజేశాను. దానికి ఆయన ﷺ ఇలా సమాధానం చెప్పారుః “అల్లాహ్ ఆమె చేసిన పనిని మెచ్చుకొని ఆమె కోసం స్వర్గం తప్పనిసరి చేశాడు. లేదా ఆమెకు నరకాగ్ని నుండి విముక్తి నొసంగాడు”. (ముస్లిం 2630).
బంధుత్వాల్ని కలుపుకోవడం నీపై విధిగా ఉంది. ఎందుకనగా “రహిమ్” (బంధుత్వం) అన్న అరబీ పదం “రహ్మత్” (కారూణ్యం) అన్న పదం నుండే వచ్చింది. బంధుత్వాన్ని కలుపుకుంటే, పెంచుకుంటే దాని సాఫల్య మాధుర్యం పరలోకం కంటే ముందు ఇహ లోకంలోనే నీవు చవిచూస్తావు. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః
“తన ఉపాధిలో సమృద్ధి, ఆయుష్యులో పెరుగుదల ఎవరికి ఇష్టమో వారు తన బంధువులతో సత్సంబంధాలు పెట్టుకోవాలి“. (ముస్లిం 2557, బుఖారి 2067).
అల్లాహ్ నీకు తన ప్రత్యేక దయ నొసంగి ఉంటే, గుర్తుంచుకో! నీ వద్ద పనిచేయుటకు వచ్చిన వ్యక్తి తన పరిస్థితి బాగులేక, ఆర్థిక దుస్థితి తన సంతానాన్ని శక్తిహీనంగా చేసినందుకు వచ్చాడు. అతనితో నీవు కఠినంగా ప్రవర్తించకు. అతనితో జరిగే లోపాల్ని మన్నించేసెయ్యి. అనస్ రజియల్లాహు అన్హు ప్రకారం:
“నేను పది సంవత్సరాలు ప్రవక్త ﷺ సేవలో ఉన్నాను. ఒక్కసారి ఊఁ అనలేదు. ఎందుకు చేశావు, ఎందుకు చేయలేదు అనీ అనలేదు“. (బుఖారి 6038).
ఆయిషా ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త ﷺ ఎన్నడూ తమ సేవకుణ్ణి- గానీ, భార్యనుగానీ కొట్టలేదు. కొట్టడానికి తమ చెయ్యి లేపినది కేవలం అల్లాహ్ మార్గంలో యుద్ధం చేసిన్నప్పుడే. (అహ్మద్. ఇది సహీ హదీసు).
ఇబ్ను ఉమర్ ఉల్లేఖనం ప్రకారం: ఒక వ్యక్తి ప్రవక్త ﷺ వద్దకు వచ్చి ‘ప్రవక్తా! నా సేవకుడు చెడుగా ప్రవర్తిస్తాడు, అన్యాయం చేస్తాడు. అలాంటప్పుడు నేనతడ్ని కొట్టవచ్చా?’ అని అడిగాడు. అందుకు ప్రవక్త సమాధానమిస్తూ “నీవు అతడ్ని ప్రతి రోజు డెబ్బై సార్లు మన్నిస్తూ ఉండు” అని చెప్పారు. (అహ్మద్, తిర్మిజి. ఇది సహీ హదీసు).
అహా! ఎంత విచిత్రం!! మనం మనలో ఉన్న బలహీనుల హక్కులను నెరవేర్చడంలో వెనకబడి ఉన్నాము, అయినా అల్లాహ్ తో వర్షం కొరకు దుఆ చేస్తున్నాము. ప్రవక్త ﷺ ఈ ప్రవచనాన్ని మరచిపోయామా?
“ప్రవక్త ﷺ ప్రయాణంలో నడచినప్పుడు అందరికన్నా వెనుక ఉండి బలహీనులకు ఊతమిచ్చి నడిపించేవారు. లేదా వారిని వాహనం మీద తన వెనుక కూర్చోబెట్టుకునేవారు. వారికోసం (అల్లాహ్ ను) ప్రార్థించేవారు“. (అబూ దావూద్ 2639. దీని సనద్ హసన్).
ఈ అనుచర సంఘంలో బీదవాళ్ళ, అగత్యపరుల (సహాయానికి) ఎందరో వీరులున్నారు; వారిలోని బలహీనుల పట్ల సానుభూతి చూపేవారు. వస్త్రాల్లేనివారికి వస్త్రాలు ధరించేవారు. వారిలోని అనాథలను పోషించేవారు. వారిలోని వితంతువుల పట్ల మేలు చేసేవారు.
ఈ సంఘటన ప్రజల్లో ప్రభలియుంది. అయినా నేను కూడా దాన్ని ప్రస్తావించడంలో తృప్తి, ఇతరులకు గుణపాఠం అని ఆశిస్తున్నాను. ఒక వ్యక్తి కలలో ప్రవక్త ﷺ తన వద్దకు వచ్చి “నీవు ఫలాన చోట ఫలాన బిన్ ఫలాన వద్దకు వెళ్ళి స్వర్గం శుభవార్త ఇవ్వు” అని చెప్పినట్లు విన్నాడు. ఇతను మేల్కొని, ప్రవక్త కలలో చెప్పిన వ్యక్తి పేరు ఆలోచించగలిగాడు. ఆ పేరు గల ఏ వ్యక్తి అతనికి గుర్తురాలేదు. అప్పుడు అతను స్వప్నభావం చెప్పే వ్యక్తి వద్దకు వెళ్ళాడు. ఎవరి గురించి నీవు స్వప్న చూశావు అతనికి ఈ శుభవార్త వినిపించు అని అతడు చెప్పాడు. అడుగుతూ, తెలుసుకుంటూ చివరికి అతనుండే గ్రామం తెలుసుకున్నాడు. ఆ గ్రామానికి వెళ్ళాడు. ఆ వ్యక్తి గురించి అడిగాడు. ఎవరో అతని వద్దకు తీసుకెళ్ళారు. అతడ్ని కలిశాక ‘నా వద్ద నీకో శుభవార్త ఉంది. అయితే నీవు చేసే సత్కార్యాలేమిటో చెప్పనంత వరకు నేను కూడా శుభవార్త వినిపించను అని చెప్పేశాడు. ఇతర ముస్లింలు చేసే సత్కార్యాలే చేస్తున్నాను అని అతడన్నాడు. అయితే నేను చెప్పను అని అతను చేసే సత్కార్యమేమిటో చెప్పే తీరాలని మొండిపట్టు పట్టాడు. అప్పుడు అతడు ఇలా చెప్పాడుః “వినుః నేను ఓ చిన్న పాటి పని చేసుకొని నా భార్యసంతానానికి ఖర్చు పెడుతూ ఉంటాను. ఎప్పుడైతే నా పక్కింటి మనిషి చనిపోయాడో, అతనింట్లో భార్య, పిల్లలున్నారో అప్పటి నుండి నా నెలసరి జీతంలో రెండు వంతులు చేసి ఒక వంతు నా ఇంట్లో మరో వంతు నా పొరుగువారింట్లో ఖర్చు పెడుతున్నాను. అప్పుడు ఇతను చెప్పాడుః ఇదే సత్కార్యం నిన్ను ఇంతటి గొప్ప స్థానానికి చేర్చింది. తెలుసుకో! నేను ప్రవక్త ﷺ ని కలలో చూశాను. ఆయన నీకు స్వర్గం శుభవార్త ఇచ్చాడు అని చెప్పాడు
సత్కార్యాల్లో ఓ కార్యం దానికి సరిసమానం మరో కార్యం లేదు. దాని గురించి నేను ఏ కోణం నుండి ఆరంభించి ఏ కోణంలో అంతం చేయాలో నాకే దోయడం లేదు. అదో సత్కార్యం, అల్లాహ్ తన ఏకత్వం తర్వాత దాని ఆదేశమే ఇచ్చాడు. ప్రవక్త ﷺ కూడా దాని గురించి చాలా ప్రోత్సహించారు. పండితులు, ఉపన్యాసకులు, వక్తలు దాని గురించి చాలా చెప్పారు. అల్లాహ్ ఆదేశం తర్వాత ఇక నేనేమి చెప్పగలనుః
నీ ప్రభువు ఇలా నిర్ణయం చేశాడుః మీరు కేవలం ఆయనను తప్ప మరెవ్వరినీ ఆరాధించకండి. తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించండి. ఒకవేళ మీ వద్ద వారిలో ఒకరుగాని ఇద్దరుగాని ముసలివారై ఉంటే, వారిముందు విసుగ్గా “ఛీ” అని కూడా అనకండి. వారిని కసరుకుంటూ సమాధానం ఇవ్వకండి. వారితో మర్యాదగా మాట్లాడండి. మృదుత్వమూ, దయాభావమూ కలిగి వారిముందు వినమ్రులై ఉండండి. ఇలా ప్రార్థిస్తూ ఉండండి. ప్రభూ! వారిపై కరుణ జూపు, బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో, వాత్సల్యంతో పోషించినట్లు. మీ హృదయాలలో ఉన్నది ఏమిటో మీ ప్రభువుకు బాగా తెలుసు. మీరు గనక మంచివారుగా నడుచుకుంటే తమ తప్పులను గ్రహించి దాస్యవైఖరి వైపునకు మరలివచ్చే వారందరినీ ఆయన మన్నిస్తాడు [ (బనీ ఇస్రాఈల్ 17: 23-25).
ప్రవక్త చెప్పిన తర్వాత నేను చెప్పడానికి ఏమి మిగిలి ఉంటుందిః
“వాడి ముక్కుకి మన్ను తగల! వాడి ముక్కుకి మన్ను తగల! వాడి ముక్కుకి మన్ను తగల!” అని మూడుసార్లు ప్రవక్త ﷺ శపించారు. ప్రవక్తా! వాడెవడు? అని మేమడగ్గా, “ఎవడైతే తన తల్లిదండ్రుల్లో ఇద్దరినీ లేదా ఒక్కరిని వారి వృద్ధాప్యంలో పొంది కూడా స్వర్గంలో ప్రవేశించలేక పోయాడో” అని ప్రవక్త ﷺ సమాధానమిచ్చారు. (ముస్లిం 2551).
మన ఆపద ఏమిటంటే? తల్లిదండ్రుల సేవ వృక్షం తొందరగా ఫలిస్తుందన్నది, దాని ఫలాలు అతి చేరువుగా ఉంటాయన్నది మరచిపోతాము. మనిషి ఆ ఫలాన్ని ఇహంలోనే తన కళ్ళారా చూడగలుగుతాడు. అంతకంటే గొప్పగా తన కొరకు పరంలో సమ- కూర్చబడుతుంది. అయితే ప్రాపంచిక ఉపద్రవాలు మన ఈ నమ్మకాన్ని ఎందుకు వమ్ము చేస్తున్నాయి? చివరికి మన తల్లిదండ్రుల సేవ చేయకుండా చేసేస్తున్నాయి? ఉపకారం చేయలేని, లేదా ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయలేని జీవితం అతి చెడ్డ జీవితం. తల్లిదండ్రులతో సత్ప్రవర్తన వారి పట్ల ఉపకారం కంటే విలువ గలది, సమానమైనది మరేదైనా ఉంటుందా?
అల్లాహ్ దయ తర్వాత తల్లిదండ్రుల సేవయే జీవితంలో సాఫల్య రహస్యం. అనేక ఆపదల నుండి రక్షణ. దానితో మనస్సులు తృప్తి చెందుతాయి. హృదయాలు వికసిస్తాయి. వారి సేవలో ఉండేవాడు అదృష్టాన్ని, తన ధన, ప్రాణ, సంతానంలో శుభాన్ని తన కళ్లారా చూస్తాడు.
చెవి మొగ్గి, హృదయాంతరంతో ఈ హదీసు విని మరచిపోకుండా ఉండు, అందులో ఉన్న సత్కార్యాల పట్ల మరియు వాటి ఫలం ఎలా ఉంటుందో గమనించుః
“ముగ్గురు వ్యక్తులు నడచి వెళ్తుండగా దారిలో వర్షం కురిసింది. అందుకు వారు ఒక కొండ గుహలోకి వెళ్ళారు. అంతలోనే ఒక బండరాయి గుహ ముఖద్వారం మీద వచ్చిపడింది. వారు బైటికి వెళ్ళకుండా దారి మూతపడింది. అప్పుడు వారు పరస్పరం ఇలా అనుకున్నారుః ‘అల్లాహ్ కొరకే ప్రత్యేకంగా చేసుకున్న సత్కర్మల లో ఒకదాని ఆధారంగా అల్లాహ్ తో దుఆ చేయండి. బహుశా అల్లాహ్ మన కొరకు సంది ఏర్పరుస్తాడు. అప్పుడు వారిలో ఒకడు ఇలా అన్నాడుః ఓ అల్లాహ్! నాకు తల్లిదండ్రి, భార్య పిల్లలు ఉండే వారు. నేను మేకలు కాస్తూ వారిని పోషించేవాడిని. సాయంకాలం వేళ ఇంటికి తిరిగొచ్చిన తర్వాత నేను పాలు పితికి మొట్టమొదట నా తల్లిదండ్రులకు ఇచ్చేవాడిని. పిలవాళ్ళకంటే ముందు వారికి త్రాగించేవాడిని. ఒక రోజు నేను (పశువులకు) చెట్లమేత కోసం చాలా దూరం వెళ్ళిపోయాను. ఇంటికి చేరుకునే సరికి రాత్రయింది. అప్పటికే వారు నిద్రపోయారు. ప్రతి రోజు పాలు పితికే విధంగా పితికి పాల పాత్ర తీసుకొని వారి వద్దకు వచ్చి వారి తలాపున నిలబడ్డాను. వారిని నిద్ర నుండి మేల్కొలపటం భావ్యం కాదనుకున్నాను. వారికంటే ముందు పిల్లలకు త్రాగించడం కూడా నాకు ఇష్టం అనిపించ లేదు. పిల్లలు నా కాళ్ళ దగ్గర ఆకలితో తల్లడిల్లిపోతూ ఏడ్వసాగారు. (అయినా నేను నా తల్లిదండ్రులకు నిద్రా భంగం కలిగించలేదు). వారు పడుకునే ఉన్నారు. నేను కూడా తెల్లవారే దాకా అలాగే వారి ముందు నిల్చున్నాను. అల్లాహ్! నేనీ పని కేవలం నీ ప్రసన్నత కోసం చేశాను. అది నీకూ తెలుసు. అందుచేత మా గుహలో నుంచి మేము ఆకాశాన్ని చూడ గలిగే అంత సందు చెయ్యి. అప్పుడే అల్లాహ్ ఓ సందు చేశాడు. అందులో నుండి వారు ఆకాశాన్ని చూడగలిగారు”. (ముస్లిం 2743, బుఖారి 2215). ఈ విధంగా మిగితా ఇద్దరు వారు చేసుకున్న సత్కర్మల ఆధారంగా దుఆ చేశారు. అల్లాహ్ సాన్నిధ్యం పొందగోరారు. చివరికి అల్లాహ్ వారిని ఆ ఆపద నుండి వెలికి తీశాడు. వారందరూ గుహ నుండి బైటికి వచ్చేశారు.
ఓ రకంగా మృత్యువువాత పడి జీవం పొందారు. నామరూపాల్లే- కుండా నాశనమయ్యేవారు మోక్షం పొందారు. నిశ్చయంగా ఇదీ పుణ్యఫలం. సత్కార్య సాఫల్యం.
ఇదీ పుణ్యఫలం. సత్కార్య సాఫల్యం: తల్లిదండ్రుల పట్ల విధేయతగలవాడా! నీ సత్కార్యఫలం నీవు నీ సంతానంలో చూస్తావు. వారు సుగుణవంతులై, నిన్ను ప్రేమించేవారై, వారి తల్లి పట్ల ప్రేమ వాత్సల్యంతో మెలుగుతారు. నీవు చేసుకున్న పుణ్యానికి ఫలితం నీకు ఇహంలోనూ ఉంది. పరంలోనూ ఉంది.
ఇక తల్లిదండ్రుల పట్ల అవిధేయతకు పాల్పడేవాడు -అల్లాహ్ కొరకు చెప్పండి- ఏమి సంపాదిస్తాడు? కేవలం దుర్భరమైన జీవితం, బిగుసుకుపోతున్న హృదయం, ఉపాధి విషయంలో అపశకునాలు, తన సంతానం నుండి ధూత్కారం. తల్లిదండ్రుల పట్ల కఠిన హృదయులుగా ఉండేవారు గనక అల్లాహ్ వైపునకు మరలకుంటే వారికి శాపమే పడుతుంది. తల్లిదండ్రులపై చేతులు లేపేవారు గనక అల్లాహ్ తో స్వచ్ఛమైన తౌబా చేయకుంటే వినాశనానికి గురవుతారు. కర్కశనోరు గలవారు గనక అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుకోకుంటే నాశనమయిపోతారు.
అతడ్ని వాని తల్లి ఎంతో బలహీనతకు గురి అయి పెంచి పోషించింది. తన రక్తం (పాలుగా) అతనికి త్రాగించింది. తన మాంసం, ఎముకలను (కరిగించి) అతనికి ఆహారమిచ్చింది. అతడు బలపడుతూ ఉంటే తాను బలహీనపడుతుండేది. అతడు హాయిగా నిద్రిస్తుంటే తాను మేల్కొని ఉండేది. అతనికి చిన్న ఆపద ఎదురైనా ఆమె కళ్ళకు చీకటి క్రమ్ముకున్నట్లయ్యేది. అతను చిరునవ్వితే ఆమె ముందు జీవితమంతా చిరునవ్వులనిపించేది. అతని సుఖం కోసం తాను రుచికరమైన వాటిని వదిలేసేది. రుచికరమైన ఆహారాలు, ఆనందకరమైన త్రాగుపదార్థాలు అతనికి ఇవ్వడానికి ప్రాధాన్యత ఇచ్చేదామె. అతడు చిన్నోడు గనక జోకొడుతూ ఉండేది కాని అతనిలో ఆమె పెద్ద ఆశలు చూసేది. శరీరం బలపడ్డాక, యుక్తవయస్సుకు చేరాక, నాలుక చకాచకా మాట్లడ్డం మొదలెట్టాక అతను కోరిన స్త్రీతో పెళ్ళి చేయించింది. అతని సంతోషంతో తాను సంతోషపడింది. అతనికంటే ఎక్కువ ఆనందపడింది. కాని…
ప్రియ సోదరా! టెలిఫోన్ మోగుతూ నా చెవులు గిల్లుమన్నాయి… ఇదేమిటి? బొంగురుపోయిన, ఏడుపుతో కూడిన ఓ శబ్దం వింటు- న్నాను… అస్థమ రోగి గురక లాంటి శబ్దం… హృదయవిదారక- మయిన ఏడుపు స్వరం… అది ఒక ముసలి తల్లి గొంతు, ఆమె తన కొడుకు అవిధేయత యొక్క వ్యధాభరితమైన సంఘటన నాకు ఇలా వినిపించసాగిందిః అతని తండ్రి గుండె ఆగిపోయి చనిపోయాడు. సుమారు పది సంవత్సరాల ఒక అబ్బాయి (అతని తమ్ముడు) నా వెంట ఉన్నాడు. నేను ఎన్నో దీర్ఘ కాలపు రోగాలకు గురయి ఉన్నాను. అతడు తన భార్యతో మీదంతస్తులో ఉన్నాడు. అతడు ఎప్పుడు క్రిందికి దిగి, నా దగ్గరి నుండి దాటినా నన్ను కించపరుస్తూ, అవమానపరుస్తూ, దూషించుకుంటూ వెళ్తాడు. అతని అనాథ తమ్ముడు ఎప్పుడైనా అతని కొడుకుతో కొట్లాడితే మరీ చెప్పరాని విధంగా అతని తమ్ముడ్ని కొడుతాడు. అసలే నేను ఒక రోగిని, పైగా వృద్ధురాలిని నేనెలా ఎదుర్కోగలుగుతాను. అంతే కాదు; తన రెండు చేతులతో తన తమ్ముడ్ని పట్టుకుంటాడు. అతని కొడుకు కాళ్ళు, చేతులతో మనస్సు తీరా అలసిపోయేంత వరకు కొడుతాడు. ఇలా తన తమ్ముని పట్ల సౌభ్రాత్రం, జాలి, దయ చూపే బదులు దౌర్భాగ్య, నిర్భంధ, దుర్భర స్థితి రుచి చూపిస్తూ వదలుతున్నాడు. అంతే కాదు ఒక్కోసారి నన్ను చూడవద్దని తన ముఖం కప్పుకుంటూ వెళ్తాడు. కఠోరంగా ‘నీవు నా తల్లే కావు’ అని అంటాడు. ఈ మాట వెనకే ఎలాంటి పదాలు వెళ్తాయంటే… ఎవరి మనస్సులోనైనా కనీస కారుణ్యం, కటాక్షం ఉన్నా అనలేడు. ఇంకా వాడు ఇలా చేస్తాడు, అలా చేస్తాడు…
ఇలాంటి వ్యదాభరితమైన మాటలు మన సురక్షిత సమాజం లో వింటానని నేనెప్పుడూ అనుకోలేదు. కాని చాలా అరుదు, మరియు దౌర్భాగ్యం అంతే… బహుశా అతడు తన అలక్ష్యం నుండి మేల్కొంటాడు అని ఆమెకు నచ్చజెప్పగలిగాను. వెంటనే అందిః వద్దు, వద్దు, మీరు మాట్లాడకండి, నన్ను అతడి తమ్మున్ని మరింత బాధ పెడతాడేమోనని భయం అనిపిస్తుంది. అతని ముందు, అతని బలం, శక్తి ముందు నాదేం నడుస్తుంది. అప్పుడు నేను చెప్పానుః అయితే అతని గురించి కోర్టులో కేసు పెడతాను. ఇది విన్న వెంటనే గొంతెత్తుకుంటూ ఇలా అనసాగిందిః ‘కేసా!! నా కంటి చలువను గురించి నేను ఫిర్యాదు చేయాలా? నా చేతులతో పెంచినవాని మీద కేసు పెట్టాలా? నేను అతనికి పాలు పట్టలేదా? అతడు నా ప్రియకుమారుడు, అతడు నా జీవితపు చివరి ఆశ, అతనికి ఏదైనా అవమానం జరుగుతే నాకిష్టమేనా? నేను అతని సమస్య కరుణామయుడు, కృపాసాగరుని ముందు పెడతాను. ఆయనే అతనికి సన్మార్గం చూపుతాడు, అతని పరిస్థితి బాగుజేస్తాడు.
అప్పుడు నాకర్థమయింది; ఇదో గాయపడిన దీర్ఘ నిశ్వాసము. (ఎవరికైనా చెప్పుకొని) ఊపిరాడుటకు, భారం దించుకొనుటకు ఓ ప్రయత్నం ఆమె చేసింది.
లాఇలాహ ఇల్లల్లాహ్!! తల్లి గుండె ఎంతైనా ప్రేమ, కరుణతో నిండి ఉన్న గుండె. జాలి హృదయం.
ప్రియులారా! ఆ తర్వాత తెలిసింది; అతడు చాలా దుస్థితికి గురయ్యాడు, అతని నరాలు బిగుసుకుపోయేవి అని. అవును ఇందులో ఏలాంటి ఆశ్చర్యం లేదు. అతడు ఆనందకరమైన సత్కార్య తోట (తల్లిదండ్రుల విధేయత) దారి నుండి తప్పిపోయాడు. దానికి బదులుగా దౌర్భాగ్య యడారి అవిధేయత మైదానాన్ని కోరి ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు (అందులో కొట్టుమిట్టాడుతున్నాడు).
మనం ఇతరులతో గుణపాఠం నేర్చుకోవాలి. ఇతురలతో గుణ పాఠం నేర్చుకున్న వాడే భాగ్యవంతుడు.
ఈ తోట దారి చాలా పొడుగ్గా మరియు కష్టాలతో కూడి ఉంది. అయినా అందులో ఓ అలంకరణ, అందం ఉంది. దాని దూరం అలసట, ఆయాసానికి గురి చేస్తుంది. కాని దాని పర్యవసానం చాలా మంచిది, ప్రశంసనీయమైనది. సంతానం పచ్చని చిన్న చిన్న మొక్కల లాంటి వారు, వాటికి నీవు సద్వర్తన అనే నీటితో సాగు చేసి ఉంటే. అందమైన పూలు, వారికి నీవు మంచి శిక్షణ ఇచ్చి ఉంటే. మెరుస్తున్న ఇళ్ళు, విశ్వాస కాంతితో ప్రకాశించి ఉంటే. వారి శిక్షణ మార్గంలో ఓపిక వహించు, అప్పుడు నీవు నీ కళ్ళకు చలువగల, నీ మనస్సును సంతోషపెట్టే సమయం చూస్తావు. వారి ఒక్కసారి సాఫల్యం నీవు అనేక సార్లు భరించిన కష్టాల్ని మరిపిస్తుంది. వారి ఒక సంవత్సరపు విజయం నీవు సంవత్సరాల తరబడి చేసిన జాగారాలను మరిపిస్తుంది. వారి చిన్నతనంలో వారి గురించి నీవు కొంత శ్రమపడడం, వారు పెరిగిన తర్వాత మంచి అదృష్ట ఫలాన్నిస్తుంది. వారి దైనందిక స్కూల్ పాఠాలు (హోంవర్కులు), వారి శిక్షణ, వారి ఆరోగ్యం అన్నిట్లో నీవు శ్రద్ధ చూపు. నీవు నీ హృదయం, దేహంతో వారితో ఉండు. ఏదైనా కారణం వల్ల నీ అస్థిత్వంతో నీవు వారితో ఉండలేకపోతే కనీసం నీ మనస్సు, దుఆలతో. వారు నీ మెడలో న్యాసం అన్న విషయం తెలుసుకో. వారి పట్ల ఏలాంటి అశ్రద్ధ పాటించకు. ప్రవక్త ఆదేశాన్ని గమనించుః
“మీలో ప్రతి ఒక్కడు బాధ్యుడు, అతని బాధ్యతలో ఉన్నదాని గురించి అతనితో ప్రశ్నింపబడును“. (బుఖారి).
కొన్ని సంవత్సరాల సంరక్షణ మరియు శ్రద్ధతో పుష్పవంతమైన, ఫలవంతమైన జీవితం లభిస్తుంది. కొన్నేళ్ళు నీవు సహనం వహించావంటే దాని ఫలితంగా వారు నీ ముందుకు వచ్చినప్పటికీ లోకమంత ఆనందంతో నిండిపోయినట్లు నీవు చూస్తావు. అప్పటికీ వారిలో ఒకడు ఇంజనీరింగ్ లో నైపుణ్యుడయి ఉంటాడు. లేదా గొప్ప డాక్టర్ అయి ఉంటాడు. లేదా ఏదైనా పనిలో మంచి నేర్పు గలవాడు (లేదా మ్యానుఫాక్చరర్ గా) అయి ఉంటాడు. లేదా ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడవుతాడు. లేదా సౌభాగ్యవంతుడైన బోధకుడవుతాడు. వీటన్నిటితో పాటు వారు నీ పట్ల మేలు చేస్తూ ఉంటారు. మరీ నీవు వారి సంస్కారం మరియు ధర్మనిష్ఠతతో సంతోషపడుతూ ఉంటావు. ఇంతకంటే ఐహిక అలంకారం ఇంకేమి కావాలి. ఇది రహ్మాన్ దాసుల దుఆల ఫలితం:
వారు ఇలా ప్రార్థిస్తూ ఉంటారుః మా ప్రభూ! మాకు మా భార్యల ద్వారానూ మా సంతానం ద్వారానూ కన్నుల చల్లదనాన్ని ప్రసాదించు, మమ్మల్ని భయభక్తులు కలవారికి ఇమాములుగా చేయు. (ఫుర్ఖాన్ 25: 74).
మంచి శిక్షణ తోట ద్వారా నీవు ఏరుకునే ఫలం ఇంతే కాదు; నీవు చనిపోయిన తర్వాత నీ సంతానం దుఆలు కూడా నీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః
“మనిషి చనిపోయినప్పుడు అతని ఆచరణలు అంతమవుతాయి. కాని మూడు రకాల ఆచరణలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. (1) సదఖ జారియ (సుదీర్ఘ కాలం వరకు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే సత్కార్యం) (2) ప్రయోజనకరమయిన విద్యాజ్ఞానం. (3) అతనికై ప్రార్థించే ఉత్తమ సంతానం. (ముస్లిం).
దాని ఫలం అల్లాహ్ దయతో స్వర్గంలో ఉన్నత స్థానం రూపం లో కూడా నీకు ప్రాప్తమవుతుంది. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః
“అల్లాహ్ స్వర్గంలో పుణ్యపురుషునికి ఒక స్థానం పెంచుతాడు. అతడంటాడుః ప్రభూ! ఏ కారణంగా నాకిది ప్రాప్తమయింది? అప్పుడు అల్లాహ్ అంటాడుః నీ సంతానం నీ పాపాల క్షమాభిక్ష కోరుతున్నందు వల్ల“. (అహ్మద్, దీని సనద్ హసన్).
శిక్షణ శిబిరం దాని ఛాయ ఎంత అందమైనది! ! అందుకే మంచి కృషి చేస్తూ దానిపై నిలకడగా ఉండు. అప్పుడే నీవు అందమైన ఫలాలు పొందగలుగుతావు.
మంచి విషయం నిమిత్తం సిఫారసు చేసేవానికి అందులో భాగం లభిస్తుంది. (నిసా 4: 85).
ఇది అల్లాహ్ యొక్క వాగ్దానం; నీవు చేసే మంచి సిఫారసుకు బదులుగా ఓ వాట మేలు నీకు లభిస్తుంది. ఇంకా నీవు చేసిన సిఫారసు యొక్క పుణ్యం అదనంగా ఉంటుంది. తన సోదరుల పట్ల ప్రేమ కలిగి ఉన్నవ్వక్తికి ఇవి అల్లాహ్ వాగ్దానాలు. అతను ఈ ప్రేమకు ప్రతీకగా చురుకతనంతో తన శక్తానుసారం తన పరపతి, మాట ద్వారా వారి అవసరాలు పూర్తి చేస్తాడు. సహీ హదీసులో ప్రవక్త ﷺ ఇలా ప్రవచించినట్లు ఉందిః
“విశ్వాసులు పరస్పరం కట్టడంలా రూపొందాలి; అందులోని ఒక ఇటుక మరో ఇటుకతో కలసి బలపడినట్లు. మళ్ళీ ప్రవక్త ﷺ తమ ఒక చేతి వ్రేళ్ళను మరో చేతి వ్రేళ్ళలో జొప్పించి కలిపి చూపించారు. ఈ విషయం చెబుతున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చుండి ఉన్నారు. అప్పుడే ఒక వ్యక్తి ఏదో ప్రశ్నిస్తూ లేదా ఏదో అవసరం గురించి అడుగుతూ వచ్చాడు. అది విన్న ప్రవక్త ﷺ వెంటనే మా వైపు తిరిగి “సిఫారసు చేయండి పుణ్యం పొందండి, అల్లాహ్ తలచుకుంటే తన ప్రవక్త నోట వెలవడిన మాటను పూర్తి చేస్తాడు” అని అన్నారు. (బుఖారి 6028, ముస్లిం 2585, 2627).
ప్రియ సోదరా! నీ సిఫారసు అంగీకరింపబడకపోయిన, లేదా నీ కోరిక పూర్తి కాకపోయినా నీవు చేసిన సిఫారసుకు బదులుగా నీకు పుణ్యం లభించుట సరిపోదా?. ఇందులో నీకు ఆదర్శం ప్రియ ప్రవక్త ﷺ. ఆయన సిఫారసు చేశారు, అయినా అది అంగీకరింప బడలేదు. ఇబ్ను అబ్బాస్ ఉల్లేఖనం ప్రకారం: బరీర అను ఒక స్త్రీ యొక్క భర్త బానిసగా ఉండేవాడు. అతని పేరుః ముఘీస్ . అతను తన భార్య బరీరా వెనక వెనకనే తిరుగుతూ ఉండేవాడు. ఆమె కూడా బానిసగా ఉండినది. అయితే ఆమెకు విముక్తి ఇవ్వ బడింది. కాని అతడికి విముక్తి లభించలేదు. అందుకు ఆమె అతని వివాహ బంధం నుండి విడిపోదామని నిర్ణయించింది. (కాని అతనికి బరీరా అంటే ఎనలేని ప్రేమ). అందుకు అతను చాలా ఏడుస్తూ ఉండేవాడు. అతని అశ్రువులు గడ్డం మీద పారుతూ ఉండేవి. అప్పుడు ప్రవక్త ﷺ అబ్బాస్ తో ఇలా చెప్పారుః
“బరీరా పట్ల ముఘీస్ ప్రేమ మరియు ముఘీస్ పట్ల బరీరా ద్వేషాల్ని చూస్తే విచిత్రం అనిపించడం లేదా?” (ఆ సందర్భంలో) ప్రవక్త బరీరాతో చెప్పారుః “నీవు తిరిగి ముఘీస్ తో ఉంటే బావుంటుంది” అని. అప్పుడు బరీరా అడిగిందిః ప్రవక్తా! మీరు ఆదేశిస్తున్నారా? అని. అందుకు ప్రవక్త చెప్పారుః “లేదు, నేను సిఫారసు చేస్తున్నాను”. “నాకు అతని అవసరం లేదు” అని బరీరా నిక్కచ్చిగా చెప్పేసింది. (బుఖారి 5283).
అనుభవం చేసి చూడు; ప్రజల్లో ఎవరికైనా అతని ఓ అవసరం లో సిఫారసు చేయి. నీ సోదరుడ్ని సంతోష పెట్టిన సత్కార్యం నీ గుండెను ఎలా చల్లబరుచుతుందో, అతని దుఆ వల్ల నీ హృదయానికి ఎంత సంతోషం కలుగుతుందో తెలుస్తుంది. అది క్షణం పాటు శ్రమ కావచ్చు కాని దీర్ఘ కాల సంతోషాన్ని తెస్తుంది. ఓ గడియ సమయం వెచ్చించుటయే కావచ్చు కాని సుఖుసంతోష జీవితానికి కారణం అవుతుంది.
విశ్వాసులు పరస్పరం సోదరులు. కనుక మీ సోదరుల మధ్య సంబంధాలను సంస్కరించండి. అల్లాహ్ కు భయపడండి, మీపై దయచూపటం జరగవచ్చు. (హుజురాత్ 49: 10).
సోదరా! మంచి మనస్సులు అనైక్యత, భిన్నత్వం అంటే సహించవు, ఇష్టపడవు. అవి స్వచ్ఛత, పవిత్రతను ఇష్టపడని నైర్మల్యానికి దూరంగా కలుషితమైన సమాజంలో అవి దాన్ని లెక్కిస్తాయి. అందుకే అవి (మంచి మనస్సులు) పవిత్ర ఛాయలోనే నీడ వెతుకుతూ ఉంటాయి. సౌభ్రాతృత్వంతో వీచే గాలితోనే ప్రీతి చెందుతాయి. ప్రేమ పచ్చిక మరియు అనురాగ పుష్పాల మధ్యే తృప్తి చెందుతాయి. అందుకే ప్రేమంగా ఉండేవారి మధ్య ద్వేషాల తుఫాను గాలి వీస్తున్నప్పుడు మంచి మనస్సుగలవాడు తృప్తిగా ఉండలేని విషయం నీవు చూస్తావు. అప్పుడు అతడు శాంతిపావురం మాదిరిగా తహతహలాడుతూ హృదయాల్లో ప్రేమ, మనస్సులో నైర్మల్యం తిరిగి రానంత వరకు నిద్రపోడు. పరస్పరం సత్సంబంధాలు లేని వారి మధ్య రాజీ కుదిర్చే వ్యక్తి ఎంత చల్వ హృదయుడు. ఈ శ్రేయోభిలాషిది ఎంత మంచి మనస్సు.
ఈ తోట ఫలం అల్లాహ్ సంతృష్టితో పాటు గొప్ప పుణ్యం కూడాను.
ప్రజలు జరిపే రహస్య సమాలోచనలలో సాధారణంగా ఏ మేలూ ఉండదు. కాని ఎవరైనా రహస్యంగా దానధర్మాలు చెయ్యండి అని బోధిస్తే లేక ఏదైనా సత్కార్యం కొరకు లేదా ప్రజల వ్యవహారాలను చక్కబరిచే ఉద్దేశ్యంతో ఎవరితోనైనా ఏదైనా రహస్యం చెబితే అది మంచి విషయమే. ఎవరైనా అల్లాహ్ సంతోషం కొరకు ఈ విధంగా చేస్తే వారికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము. (నిసా 4: 114).
నీ సోదరుల మధ్య రాజీ కుదిర్చే పని దుఆతో ఆరంభించు. ఇలా దుఆ చెయిః అల్లాహ్ ఈ మేలు కొరకు వారి హృదయాలను తెరువుగాక! అల్లాహ్ ఇలా అంటున్నాడుః [وَالصُّلْحُ خَيْر] ]రాజీ కుదుర్చడంలోనే ఎంతో మేలుంది[.
వేరు వేరు దృక్పథాల్ని దగ్గర చేసే, విభేదాల కారణాల్ని తక్కువ చేసే ప్రయత్నం చేయి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలుగజేయి. ప్రతి ఒక్కరికి రెండోవాడు అతనితో చాలా గాఢంగా ప్రేమిస్తున్నాడని, అతనిలో నీ మీద ఏలాంటి ద్వేషం, కపటం లేదని తెలియజేయి. ఇందులో నీకు కొంత అబద్ధం చెప్పవలసి వచ్చినా పరవాలేదు. (ఈ అబద్ధం అనుమతి కేవలం రాజీ కుదర్చడానికే సుమా, మరే దానికి కాదు). ప్రవక్త ﷺ ఇలా ఆదేశించారుః
“ప్రజల మధ్య సంబంధాలను చక్కదిద్దే ఉద్దేశ్యంతో ఒకరి సద్గుణాలు మరొకరి ముందు వ్యక్తపరిచేవాడు లేదా ఒకిర్ని గురించి ఏదైనా మంచి విషయాన్ని మరొకరి ముందు వెలిబుచ్చేవాడు అబద్ధాలకోరు కాజాలడు”. (బుఖారి 2692, ముస్లిం 2605).
సోదరుల మధ్య సంధి కుదర్చడం కూడా ఓ సత్కార్యమే. అందుకు ఈ పని చేస్తూ పుణ్యాన్ని ఆశించడం మరచిపోకు. అదే సద్భాగ్య రహస్యం. సంధి కుదుర్చడానికి తాళంచెవి లాంటిది. స్వీకృతికి సబబు. ప్రవక్త ﷺ ఇలా ఆదేశించారుః
అల్లాహ్ సాక్షిగా ఇంతకంటే అందమైన తోట మరొకటి ఉండదు; రకరకాల ఫలాలు, ప్రభావితం చేసే పుష్పాలు, ఈ తోట దర్శనానికి వచ్చిన వాడు అలసిపోడు, దాని చెలమలు అంతం కావు. దాని ఛాయ ఎడతెగనిది. దాని ఊటలు లెక్కలేనివి. అందులో తన హృదయం, నోరు మరి ఆలోచనలతో పనితీసుకునువాడే విజయ వంతుడు. తేనెటీగ మాదిరిగా; అది విసుగు, అలసట అంటే తెలియదు. రకారకాల రసాన్ని పీల్చుకుంటూ తేనె తయారు చేస్తుంది. ఈ (ప్రచార, శిక్షణ) తోటలో పని చేసేవాడు ప్రతిఫలం పొందుతాడు. దాని కోతకు సిద్ధమయ్యేవాడు లాభం మరియు సంతోషం పొందుతాడు.
ఒక మంచి మాట ద్వారా నీవు బోధన ఆరంభించు. ఎందుకనగా మంచి మాట ఒక సదకా (సత్కార్యం). ఒక చిరునవ్వు ద్వారా ప్రచారం ఆరంభించు. నీ తోటి సోదరునితో నీవు మందహాసముతో మాట్లాడడం కూడా సత్కార్యం. నీ ఉత్తమ నడవడిక ద్వారా నీవు ప్రచారకుడివయిపో. నీవు నీ ధనంతో ప్రజల్ని ఆకట్టుకోలేవు. నీ సద్వర్తనతో ఆకట్టుకోగలుగుతావు.
సోదరా! ప్రవక్తగారి ఒక వచనం అయినా సరే ఇతరుల వరకు చేరవేయి. నీ ప్రేమికుల గుండెల్లో ప్రవక్తి గారి ఒక సంప్రదాయ ప్రేమను కలిగించు. వారి హృదయాలను వారి ప్రభువు విధేయతతో అలంకరించు. వివేకము మరియు మంచి ఉపదేశం ద్వారా వారిని పిలువు. దూరం చేసే మాటలు, కఠోర పద్ధతి విడనాడు.
(ప్రవక్తా!) అల్లాహ్ యొక్క అనంత కరుణ వల్లనే నీవు వారిపట్ల మృదు స్వభావుడవు అయ్యావు. నీవే గనక కర్కశుడవు కఠిన హృదయుడవు అయినట్లయితే వారందరూ నీ చుట్టు పక్కల నుండి దూరంగా పోయేవారు. (ఆలి ఇమ్రాన్ 3: 159).
నీ పట్ల తప్పు చేసిన వాడిని క్షమించి పిలుపునిచ్చావని ఆశించు. పాపంలో మునిగి ఉన్న నీ సోదరునికి సహాయం చేసి నీ చేత అతని సన్మార్గానికి మార్గం సుగమం చేయి. రుజుమార్గం నుండి దూరమైన ప్రతి ఒక్కరి పట్ల వాత్సల్య కాంతి ద్వారా నీ కళ్ళను ప్రకాశవంతం చేసుకో చివిరికి నీవు ఎవరెవరి కోసం సన్మార్గం కోరుతున్నావో వారికి ఈ కాంతి లభిస్తుంది.
నీ పొరుగువానికి ఒక క్యాసెట్ బహుకరించి, లేదా నీ మిత్రునికి ఓ పుస్తకం పంపి, ఇస్లాం వైపు స్వచ్ఛముగా పిలిచి అల్లాహ్ అతనికి సధ్బాగ్యం ప్రసాదించుగాక అని ఆశిస్తూ కూడా నీవు ప్రచారకునివి కావచ్చు.
నీకు ప్రసాదించబడిన సర్వ శక్తులను, ఉపాయాలను ఉపయోగించి ప్రచారకునివి కావచ్చు. నీవు కాలు మోపిన ప్రతి చోట శుభం కలగజేసేవానివిగా అయిపో. అడ్డంకులుంటాయని భ్రమ పడకు. చిన్నవాటిని మహా పెద్దగా భావించి (భయం చెందకు). విద్యావంతులు, గొప్ప ప్రచారకులతో సంప్రదించి నీ ప్రచారం ఆరభించు. ఇలా నీ ప్రచారం పరిపూర్ణజ్ఞానం మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది.
నీ ప్రభువు మార్గం వైపునకు పిలువు, వివేకంతో, చక్కని హితబోధతో. ఉత్తమోత్తమ రీతిలో వారితో వాదించు. నీ ప్రభువుకే బాగా తెలుసు; ఆయన మార్గం నుండి తప్పిపోయినవాడు ఎవడో, రుజు మార్గంపై ఉన్నవాడూ ఎవడో (నహ్ల్ 16: 125).
స్పష్టమైన రీతిలో సందేశాన్ని అందజేయడమే మా బాధ్యత. (యాసీన్ 36: 17). హృదయాలకు మార్గం చూపే బాధ్యత, తాలాలు పడి ఉన్నవాటిలో తాను కోరేవారివి విప్పే బాధ్యత కూడా అల్లాహ్ దే.
ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం. దీని ద్వారా ఆయన తాను కోరిన వారిని సత్యమార్గంపైకి తీసుకువస్తాడు. స్వయంగా అల్లాహ్ మార్గం చూపనివాడికి, మరొక మార్గదర్శకుడు ఎవ్వడూ లేడు (జుమర్ 39: 23).
నీ ప్రచారం ఫలించినది, దాని ఫలితంగా పండిన ఫలాలు చూసి సంతోషపడు. నీవు పొందే ప్రతి విజయాన్ని నీ కొరకు వేచి చూస్తున్న, నీ అడుగులు పడటానికి ఎదురుచూస్తున్న మరో విజయానికి మెట్టుగా ఉంచి ముందుకెదుగు.
ప్రవక్త ﷺ తమ జాతి వారి సన్మార్గంతో ఎంత సంతోషించారు? కాదు, అనారోగ్య యూదుని పిల్లవాని సన్మార్గంతో ప్రవక్త ﷺ చాలా సంతోషించారు. ఆ సంఘటనను అనస్ ఇలా ఉల్లేఖించారుః
ఒక యూద బాలుడు ప్రవక్త సేవ చేస్తూ ఉండేవాడు. ఒకసారి అతని ఆరోగ్యం చెడిపోయింది. అతడ్ని పరామర్శించడానికి ప్రవక్త ﷺ వచ్చి, అతని తలాపున కూర్చున్నారు. కొంతసేపటికి “నీవు ఇస్లాం స్వీకరించు” అని అతనితో అన్నారు. అప్పుడు అతడు అక్కడే ఉన్న తన తండ్రి వైపు చూశాడు. దానికి అతను నీవు అబుల్ ఖాసిం ﷺ (అంటే ప్రవక్త) మాటను అనుసరించు అని అన్నాడు. అప్పుడు ఆ బాలుడు ఇస్లాం స్వీకరించాడు. (ఆ తర్వాత కొంత సేపటికి ఆ బాలుడు చనిపోయాడు. అప్పుడు ప్రవక్త) అల్ హందులిల్లాహ్! అల్లాహ్ ఇతడిని నరకం నుండి కాపాడాడు అన్నారు. (బుఖారి 1356).
తలతలలాడే ప్రవక్త మాటలను శ్రద్ధగా విను, అతిఉత్తమ, అతిఉన్నతమైన ప్రచారకులు (అంటే ప్రవక్త) తాను తయ్యారు చేసిన ప్రచారకుల్లో చిత్తశుద్ధిగల ఒకరైనా అలీ బిన్ అబీ తాలిబ్ కు కైబర్ రోజున ఇలా చెప్పారుః
“వారిని ఇస్లాం వైపునకు పిలువు. వారిపై విధిగా ఉన్న విషయాల్ని వారికి తెలియజేయి. అల్లాహ్ సాక్షిగా! నీ ద్వారా ఒక్క మనిషికి కూడా సన్మార్గం ప్రాప్తమయ్యిందంటే అది నీకు మేలు జాతికి చెందిన ఎర్ర ఒంటెల కంటే ఎంతో ఉత్తమం“. (బుఖారి 2942).
ప్రచార కార్యం ద్వారా లేదా ఎవరికైనా ఒక ధర్మ విషయం నేర్పడం ద్వారా నీవెన్ని పుణ్యాలు పొందుతావు లెక్కించలేవు. నీవు ఇచ్చిన పిలుపు ప్రకారం ఆచరించే వారు, నీవు నేర్పిన విద్యకు క్రియరూపం ఇచ్చేవారు ఎంతమంది ఉంటారో అంతే పుణ్యం నీకు లభిస్తుంది. వారి పుణ్యాల్లో ఏలాంటి కొరత జరగదు. అల్లాహ్ గొప్ప దయగలవాడు.
ప్రచార కార్యం నీ నుండి, నీ ఇల్లాలు పిల్లలతో, నీ దగ్గరివారితో ఆరంభం చేయి. బహుశా అల్లాహ్ నీ శ్రమలో శుభం కలుగు జేయుగాక. నీ సత్కా- ర్యాన్ని అంగీకరించుగాక. ఆయన చాలా దాతృత్వ, ఉదార గుణం గలవాడు.
అల్లాహ్ వైపు పిలుపుకు సంబంధించిన ఓ సత్కార్య సంఘటన శ్రద్ధగా చదువు. ఎవరితో ఈ సంఘటన జరిగిందో స్వయంగా అతడే చెప్పాడు. అతను ఇటాలీ దేశానికి సంబంధించిన అల్ బర్తో ఓ. పచ్చీని (Alberto O. Pacini): నాకు సత్య ధర్మం వైపునకు సన్మార్గం చూపిన అల్లాహ్ కే అనేకానేక స్తోత్రములు. అంతకు మునుపు నేను నాస్తికునిగా, విలాసవంతమైన జీవితం గడుపుతూ మనోవాంఛల పూజ చేసేవాడిని. జీవితం అంటే డబ్బు, పైసా అని. సంపాదనే పరమార్థం అని భావిస్తూ ఉండేవాడిని. ఆకాశ ధర్మాలన్నిటితో విసుగెత్తి పోయి ఉంటిని. ప్రథమ స్థానంలో ఇస్లామే ఉండినది. ఎందుకనగా మా సమాజంలో దానిని చరిత్రలోనే అతి చెడ్డ ధర్మంగా చిత్రీకరిస్తున్నారు. ముస్లిములు అంటే మా మధిలో విగ్రహాలను పూజించేవారు, సహజీవన చేయలేనివారు, ఏదో కొన్ని అగోచరాలను నమ్ముతూ వాటి ద్వారానే తమ సమస్యల పరిష్కారాన్ని కోరువారు. రక్తపిపాసులు, గర్వులు, కపటులు మరియు ఇతరులతో ప్రేమపూర్వకమైన వాతవరణంలో జీవితం గడిపే గుణం లేనివారు అని అనుకునేవాడిని.
ఇస్లాంకు వ్యతిరేకమైన ఈ వాతావరణంలో నేను పెరిగాను. కాని అల్లాహ్ నా కొరకు మార్గదర్శకత్వం వ్రాసాడు, అది కూడా సంపాదన కొరకై ఇటాలీ వలస వచ్చిన ఓ ముస్లిం యువకుని ద్వారా. ఏ ఉద్దేశ్యం లేకుండానే నేను అతడిని కలిశాను. ఒక రాత్రి నేను చాలా సేపటి వరకు ఒక బార్ లో రాత్రి గడిపి తిరిగి వస్తున్నాను. మత్తు కారణంగా పూర్తి స్పృహ తప్పి ఉన్నాను. రోడ్ మీద నడుస్తూ వస్తున్నాను నాకు ఏదీ తెలియకుండా ఉంది పరిస్థితి. అకస్మాత్తుగా వేగంగా వస్తున్న ఓ కార్ నన్ను ఢీకొంది. నేలకు ఒరిగాను. నా రక్తంలోనే తేలాడుతుండగా, అప్పుడే ఆ ముస్లిం యువకుడు తారసపడి నా తొలి చికిత్సకు ప్రయత్నం చేశాడు. పోలీస్ కు ఖబరు ఇచ్చాడు. నేను కోలుకునే వరకు నన్ను చూసుకుంటూ నా సేవలో ఉన్నాడు. ఇదంతా నాకు చేసిన వ్యక్తి ఒక ముస్లిం అని నేను నమ్మలేక పోయాను. అప్పుడు నేను అతనికి దగ్గరయ్యాను. అతని ధర్మం యొక్క మూల విషయాలు తెలుపమని కోరాను. దేని గురించి ఆదేశిస్తుంది, దేని గురించి నివారిస్తుందో చెప్పుమన్నాను. అలాగే ఇతర మతాల గురించి నీ ధర్మ అభిప్రాయమేమిటి? ఈ విధంగా ఇస్లాం గురించి తెలుసుకొని, ఆ యువకుని సద్పర్తన వల్ల అతనితో ఉండసాగాను. చివరికి పూర్తి నమ్మకం కలిగింది; నేను అజ్ఞానంలో ఉండి నా ముఖంపై దుమ్ము రాసుకుంటుంటినీ అని, ఇస్లామే సత్యధర్మమని. వాస్తవానికి అల్లాహ్ చెప్పింది నిజమేననిః
ఎవడైనా ఈ విధేయతా విధానాన్ని (ఇస్లాం) కాక మరొక మార్గాన్ని అవలంబించదలిస్తే, ఆ మార్గం ఎంతమాత్రం ఆమోదించ బడదు. అతడు పరలోకంలో విఫలుడౌతాడు, నష్టపోతాడు. (ఆలి ఇమ్రాన్ 3: 85). అప్పుడు నేను ఇస్లాం స్వీకరించాను.
కేవలం అల్లాహ్ సంతృష్టి కొరకు ఇందులో ఓ పాలు పంచుకున్నవారికి రెండింతల పంట, అంటే నీవు ఒక్క రోజులో రెండు ఉపవాసాలు ఉంటున్నావన్నమాట. అది ధర్మసంపద నుండి కొంత ఖర్చు పెట్టినంత మాత్రనా. దట్టమైన తోటల ఛాయలో నీవు ఛాయ పొందుతావు. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః
“ఎవరు ఉపవాసమున్నవారికి ఇఫ్తార్ చేయిస్తారో అతనికి ఉపవాసమున్న వారంత పుణ్యం లభించును. ఉపవాసమున్నవారి పుణ్యంలో ఏ కొరత జరగదు“. (తిర్మిజి 807. ఈ హదీసు హసన్ మరియు సహీ అని ఇమాం తిర్మిజి స్వయంగా చెప్పారు).
ఈ రోజుల్లో -అల్లాహ్ దయతో- కొన్ని స్వచ్ఛంద సేవ సంస్థలు ఎన్నో చోట్ల ఈ ఆరాధనను చాలా సులభమైనదిగా చేస్తున్నారు. కొన్ని (ఇఫ్తార్ చేయించే) మార్గాలు చూపిస్తారు. నీవు నీ కొంత సంపదతో అందులో పాల్గొనవచ్చు. వాస్తవానికి ఇది అగత్య పరులపై అల్లాహ్ కరుణ మరియు ఉపకారం చేసేవారికై రెట్టింపు పుణ్యాలకు మంచి దారి.
నీవు స్వయంగా ఈ దృశ్యాలు చూసి ఉంటావు. మస్జిదు ఆవరణలో మంచి మంచి ఆహారపదార్థాలతో విస్తరి వేయబడి ఉంటుంది. దాని చుట్టు దేశ, విదేశ బీద ముస్లింలు ఎంతో ప్రేమ, సంతోషంతో కూర్చుండి ఉంటారు. శ్రీమంతులు, ధనవంతులు స్వయంగా వారి సేవలో ఉండటాన్ని చూసి నీ నర నరాల్లో విశ్వాసం జీర్ణించుకుపోతుంది. వారు (శ్రీమంతులు) వారి(ఇఫ్తార్ చేయువారి)కి చన్నీళ్ళు, వేడి వేడి జిలేబీలు, ఇతర తీపి పదార్థాలు అందిస్తూ ఉంటారు. సౌభ్రాత్వం, ప్రేమతో కూడిన చిరునవ్వు దాని మాధుర్యాన్ని మరింత పెంచుతుంది. ఇది ఓ చెప్పరాని విశ్వాసం. ఇది నిన్ను నీ ధర్మంపై గౌరవంగా ఉండే విధంగా చేస్తుంది. ఈ ధర్మమే ధనవంతుడిని పేదవాని పెదవుపై చిరునవ్వు తెప్పించే వానిగా చేస్తుంది. అంతే కాదు ధనవంతుడు స్వయంగా పేదలను వెతికి వారు సంతోషపడే వరకు వారికి ఇస్తూ ఉండే విధంగా చేస్తుంది.
వాస్తవానికి నేను ఆ సౌభ్రాత్రుత్వ దృశ్యాన్ని మరవలేను. నా కళ్ళార నేను చూశాను (ఇఫ్తార్ సందర్భంలో) ఒక యజమాని తన చేతిలో ముద్ద తీసుకొని తన పనిమనిషి నోటిలో పెట్ట బోయాడు. ఆ పనిమనిషి సిగ్గుపడి తాను కూర్చున్న స్థలాన్ని వదలి పరిగెత్తాడు. యజమాని అతని వెంట పరుగిడుతూ చివరికి అతని నోట్లో ముద్ద పెట్టాడు. ఇది ఏదో ఒక నూతన సంఘటన కాదు. ప్రవక్త ﷺ ప్రవచనానికి ఆచరణ రూపం.
“మీలో ఎవరి దగ్గరికైనా అతని సేవకుడు భోజనం తీసుకువస్తే, అతను సేవకుడ్ని తనతో పాటు భోజనానికి కూర్చోబెట్టుకోలేని స్థితిలో ఉంటే అందులో నుంచి ఒక రెండు ముద్దలయినా అతనికి తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే అతను అన్నం వండే శ్రమ భరించాడు”. (బుఖారి 2557, ముస్లిం 1663).
ప్రియసోదరా! అల్లాహ్ నీపై తన ప్రత్యేక అనుగ్రహాన్ని అనుగ్రహించి ఉంటే డబ్బు అవసరం గల ఓ సోదరునికి నీవు సహాయం చేసి ఉంటే, అతడు నీ సొమ్ము తిరిగి ఇవ్వడానికి నీవు అతనిపై ఒత్తిడి తీసుకువచ్చి నీవు చేసుకున్న శుభప్రదమైన బహుమానాన్ని పాడుచేసుకోకు. అతనికి సౌలభ్యం కలుగజేయి. అతని వ్యవధిని కొంత పొడిగించు. అతన్ని ఎత్తిపొడచి, హెచ్చరించి లేదా మాటిమాటికి అడిగి నీ దానాన్ని కలుషితం చేయకు. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః
“ఎవరు పేదరుణగ్రస్తునికి సౌలభ్యం కలుగుజేస్తారో అల్లాహ్ అతనికి ఇహపరాల్లో సౌలభ్యం కలుగజేస్తాడు“. (ముస్లిం 2699).
అతనికి వ్యవధి ఇవ్వడమే కాకుండా కొంత అప్పు అతని నుండి మాఫీ చేసి, అంటే ఇచ్చేదానికంటే మరీ తక్కువ తీసుకొని నీ ఈ ఉపకారతోటను మరింత అందంగా చేసుకో. ఇలా నీవు పుణ్యం సంపాదించుకొని ముందు నీపై గొప్ప ఉపకారం చేసినవాడివి అవుతావు. ఆ తర్వాత అతని భారాన్ని దించి అతని పట్ల ఉపకారం చేసినవాడివవుతావు. ప్రవక్త ﷺ ఇలా చెప్పారు:
“అల్లాహు తఆలా పరలోక కష్టాల నుండి కాపాడి, మోక్షం ప్రాప్తిం- చాలని ఎవరికి ఇష్టమో వారు పేద రుణగ్రస్తునికి తగినంత వ్యవధి ఇవ్వాలి.లేదా అతని అప్పును మాఫీ చేయాలి”. (ముస్లిం 1563).
మనం ఇహలోక సుఖం గురించి ఎంతో పాకులాడుతాము. కాని దాని వరకు చేర్పించే సరియైన దారిని తప్పిపోతాము. లేదా ఇలాంటి దైవమార్గాల్లో సుఖం ఉండదని భ్రమ చెందుతాము. అయితే ఇక నుండి అల్లాహ్ తన గ్రంథంలో మరియు ప్రవక్త తమ నోట చేసిన వాగ్దానాలను పూర్తి విశ్వాసంతో నమ్మాలి. అప్పుడే మనం ఇహపరాల సుఖాన్ని పొందగలుగుతాము.
“అల్లాహ్ మార్గంలో పోరాడే యోధునికి కావలసిన సామాగ్రి సమకూర్చేవాడు యోధునిగా పరిగణింపబడతాడు, అలాగే అల్లాహ్ మార్గంలో పోరాడే యోధుని ఇంటివారి అవసరాలు తీర్చేవాడు కూడా యోధునిగా పరిగణింపబడతాడు“. (బుఖారి/ ఫజ్లు మన్ జహ్హజ గాజియ…2843, ముస్లిం/ ఫజ్లు ఇఆనతిల్ గాజీ…1895).
నీవు (బైటికి వెళ్ళకుండా) నీ ఇంటివారి మధ్య ఉండి, ఈ సత్కార్య వనం ద్వారా అల్లాహ్ మార్గంలో పోరాడే యోధునికి సమానమైన పుణ్యం పొందుతావు. అందుకై నీవు ఆ యోధుని కుటుంబాన్ని కనిపెట్టుకుంటూ, తండ్రి లాంటి ప్రేమ, అప్యాయత చూపుతూ, వారి అవసరాలు తీరుస్తూ ఉండు.
“దారి నుండి అవస్త కలిగించే వస్తువును దూరం చేయుట ఒక సత్కార్యమే“. (బుఖారి 2989, ముస్లిం 1009).
ఈ పని కేవలం పాకీవాళ్ళు మరియు (మున్సిపాలిటీకి సంబంధించిన) సఫాయివాళ్ళదే కాదు. వాస్తవానికి ఇది మనందరి పని. ఈ సత్కార్యంలో మనం వెనకబడి దాని అవసరం లేనట్లుగా భావించాము. మరికొందరు మనలో ఈ పనికి అతీతులుగా భావించి ఈ పనిని నీచంగా చూడసాగారు. కాని అల్లాహ్ వద్ద దాని స్థానం చాలా గొప్పగా ఉంది. దాని బహుమానం ఎంతో విలువైనది. ప్రవక్త ﷺ తెలుపుతున్న ఈ ప్రవచనాన్ని శ్రద్ధగా పఠించు:
“ఒక వ్యక్తి దారికి అడ్డంగా ఉన్న ఓ చెట్టుకొమ్మ దగ్గర్నుంచి వెళుతూ, ‘అల్లాహ్ సాక్షిగా! ఇది ముస్లిములకు బాధ కలిగించ కుండా నేను దీన్ని ఇక్కడి నుండి దూరం చేస్తాను’ అని (దూరం చేసేశాడు కూడా, అందుకు) అతణ్ణి స్వర్గంలో ప్రవేశింపజేయడం జరిగింది“. (ముస్లిం 1914, బుఖారి 2472).
ఒక చెట్టు కొమ్మ, నీవు దారి నుండి తీసి పక్కకు వేస్తే, దాని ఫలితం భూమ్యాకాశాల వైశాల్యముగల స్వర్గం. ఇవి పుణ్య వనాలు, సత్కార్య తోటలు. మన ప్రభువు ఉదారుడు మరియు దయాశీలుడు.
ప్రియసోదరా! నీవు దానధర్మాలు చేసేంత పొడుగుగా నీ చేయి లేనట్లయితే, నీ సమయం, నీ హోదా, నీ శక్తి సామర్థ్యాలను వ్యయం చేసి నీ తోటి సోదరులకు సహాయపడలేకపోతే, ఇంకే విధంగానైనా వారికి మేలు చేకూర్చలేక పోతే కనీసం ఒక మంచి మాట మాట్లాడడంలో వెనకాడకు. ఇది చాలా గొప్ప విషయం. దీని ద్వారా నీ ప్రభువును సంతోష పెట్టగలుగుతావు. నీ సోదరుడ్ని ఓదార్చగల్గుతావు. లెక్కలేనన్ని పుణ్యాలు సంపాదించుకోగల్గుతావు. ప్రవక్త ﷺ చెప్పారుః
(وَالْكَلِمَةُ الطَّيِّبَةُ صَدَقَةٌ)
“మంచి మాట కూడా సత్కార్యమే“. (బుఖారి 2989, ముస్లిం 1009).
సత్కార్య వనాలు అనేకం. వాటిలో అల్లాహ్ దయ చాలా ఎక్కువ. మేలైన మార్గాలు అనేకం. వ్రాస్తూపోతే స్థలం (కాగితం) సరిపోదు. సమయం తోడివ్వదు. కొంత మార్గం చూపడం కూడా సరిపోతుంది. అల్లాహ్ గ్రంథంలో, ప్రవక్త ﷺ హదీసుల్లో మన రోగ నివారణ చాలా ఉంది. పోతే కొందరు స్వయం తమ పట్ల లోభిగా ప్రవర్తిస్తారు. పిసినారిగా మెదులుతారు. ఆ మేలు తమ సోదరుల వరకు చెందకుండా మసలుకుంటారు. కనీసం ఒక మంచి మాట ద్వారా అయినా మేలు చేయరు. దానికి వారు తమ శరీరంలోని నాలుకను కదలించడం తప్ప మరేమీ చేయనక్కరలేదు. కాని ఏ మేలు చేయరు. మంచి మాట మాట్లాడరు. అలాంటి వారికి చెప్పడానికి మిగిలింది ఇక ఒకే విషయం: మీరు కనీసం మీ పట్ల మేలు చేసుకోండి. ప్రజలకు హాని కలగకుండా మెదులుకోండి. తమ వాక్కర్మ ద్వారా బాధ కలిగించకండి. అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
“ఏ ఆచరణ చాలా శ్రేష్ఠమైనద”ని నేను ప్రవక్త ﷺని అడిగాను. “అల్లాహ్ ను విశ్వసించడం, ఆయన మార్గంలో యుద్ధం చేయడం” అని ప్రవక్త ﷺ సమాధానమిచ్చారు. “ఏలాంటి బానిసకు స్వేచ్ఛ కలిగించడం ఉత్తమం” అని అడిగాను. దానికి ప్రవక్త ﷺ అన్నారుః “ఎక్కువ ధర గలవాడికి మరియు యజమాని వద్ద ఉత్తమంగా ఉన్నవాడిని విముక్తి కలిగించడం”. “ఇది చేసే శక్తి లేనిచో ఎలా?” అని అడిగాను. “కష్టంలో ఉన్నవానికి సహాయం చేయు, పనిరాని వానికి పని చేసిపెట్టు” అని చెప్పారు ప్రవక్త. అది కూడా నేను చేయలేక పోయాననుకోండి, అప్పుడు? అని ప్రశ్నించినందుకు ప్రవక్త ﷺ ఇలా సమాధానమిచ్చారుః “ప్రజలకు నీ నుండి ఏ కీడు కలగకుండా జాగ్రత్తపడు. ఇది కూడా ఒక సదకా (సత్కార్యం). నీవు స్వయంగా నీపై సదకా చేసినవానివి అవుతావు”. (బుఖారి 2518, ముస్లిం 84).
]కనుక తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కా- ర్యాలు చేయాలి. ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ చేర్చకూడదు[. (కహఫ్ 18: 110).
2- ఏ సత్కార్యం గురించి విన్నా దానిని ఆచరించడంలో ఆలస్యం చేయకు. సంతోషంతో, ఇష్టాపూర్వంగా సద్మనస్సుతో ముందడుగు వేయి. ఇది దైవభీతి చిహ్నం. అల్లాహ్ ఇలా ఆదేశించాడుః
మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పోయే మార్గంలో పరుగెత్తండి. ఆ స్వర్గం భూమ్యాకాశాల అంత విశాలమైనది. అది భయభక్తులు కలవారి కొరకు తయారు చెయ్యబడింది (ఆలి ఇమ్రాన్ 3: 133).
దైవాదేశాల పాలనకు త్వరపడే ఓ అరుదైన సంఘటన శ్రద్ధగా చదవండిః అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు నఫిల్ నమాజు చేస్తూ ఉన్నారు. నాఫిఅ అను ఆయన బానిస ప్రక్కనే కూర్చుండి, ఆయన ఏదైనా ఆదేశమిస్తే దాని పాలనకు వేచిస్తూ ఉన్నాడు. స్వయంగా నాఫిఅ ఓ గొప్ప పండితులు, ప్రఖ్యాతి గాంచిన హదీసు గ్రంథం మువత్త ఇమాం మాలిక్ యొక్క ఉల్లేఖకుల్లో ఒకరు. అతనిలో ఉన్న ఉన్నత గుణాల వల్ల అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ అతణ్ణి చాలా ప్రేమించేవారు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ నమాజులో ఖుర్ఆన్ పఠిస్తూ]మీరు అమితంగా ప్రేమించే వస్తువులను (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టనంత వరకు మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు[. (ఆలిఇమ్రాన్ 3: 92). చదివినప్పుడు వెంటనే తన చెయితో సైగ చేశాడు. ఆదేశపాలనకై సిద్ధంగా ఉన్న నాఫిఅకు ఆయన ఎందుకు సైగ చేస్తున్నాడో అర్థం కాలేక పోయింది. అర్థం చేసుకొనుటకై ఎంతో ప్రయత్నం చేశాడు. ఫలితం లేకపోయింది. అందుకు ఆయన సలాం తిప్పే వరకు వేచించి, ఎందుకు సైగ చేశారు? అని అడిగాడు. దానికి అబ్దుల్లాహ్ ఇలా సమాధానం చెప్పారు “అమితంగా నేను ప్రేమించే వస్తువులు ఏమిటని ఆలోచిస్తే నీవు తప్ప నాకు ఏదీ ఆలోచన రాలేదు. అయితే నేను నమాజులో ఉండగానే నీకు స్వేచ్ఛ ప్రసాదించుటకు సైగ చేయడమే మంచిదిగా భావించాను. నమాజు అయ్యే వరకు వేచిస్తే బహుశా నా కోరిక, వాంఛ ఆధిక్యత పొంది ఈ నిర్ణయానికి వ్యతిరేకం జరుగుతుందని భయం అనిపించింది. అందుకే వెంటనే సైగ చేశాను. ఈ మాటను విన్న నాఫిఅ వెంటనే “మీ సహచర్యం లభిస్తుంది కదా”? అని అడిగాడు. అవును నీవు నాతో ఉండవచ్చు అన్న హామీ ఇచ్చారు అబ్దుల్లాహ్.
3- అల్లాహ్ నీకు ఏదైనా సత్కార్యం చేసే భాగ్యం నొసంగాడంటే దానిని మంచి విధంగా సంపూర్ణంగా చేయుటకు ప్రయత్నించు.
మంచి పనులు చేసే వారికి మంచి బహుమానాలు లభిస్తాయి. ఇంకా ఎక్కువ అనుగ్రహం లభిస్తుంది. వారి ముఖాలను నల్లదనం గానీ అవమానం గానీ కప్పివేయవు. వారు స్వర్గానికి అర్హులు, అక్కడే శాశ్వతంగా ఉంటారు (యూనుస్ 10: 26).
నీ అవసరం ఎవరికి పడిందో అతని స్థానంలో నీవు నిన్ను చూసుకో, అప్పుడు ప్రవక్త ఈ ఆదేశాన్ని కూడా దృష్టికి తెచ్చుకోః
“మీలో ఒకరు తాను తన గురించి కోరుకున్నట్లు తమ సోదరుని గురించి కోరనంత వరకు విశ్వాసి కాజాలడు“. (బుఖారి 13, ముస్లిం 45).
4- చేసిన పుణ్యాన్ని గుర్తు చేసుకోకు. ఎవరి పట్ల ఆ కార్యం చేశావో అతన్ని ఎత్తిపోడవకు, హెచ్చరించకు. దాని గురించి మరెవరికో చెప్పుకోబోకు. ఏదైనా ఔచిత్యం ఉంటే తప్ప. అల్లాహ్ ఆదేశం ఇలా ఉంది గమనించుః
విశ్వాసులారా! మీరు దెప్పిపొడిచి, గ్రహీత మనస్సును గాయ- పరచి మీ దానధర్మాలను మట్టిలో కలపకండి. (బఖర 2: 264).
నీవు చేసిన దాన్ని అల్లాహ్ వద్ద నీ త్రాసులో పెట్టడం జరుగుతుంది. ఎవరి పట్ల నీవు మేలు చేశావో వారు దాన్ని తిరస్కరించినా పరవా లేదు.
5- నీ పట్ల ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయి. అది కనీసం ఒక మంచి మాట ద్వారా అయినా సరే. అల్లాహ్ దయ తర్వాత నీవు సత్కార్యం చేయునట్లు ఇది నీకు తోడ్పడుతుంది. అల్లాహ్ ఆదేశం ఇలా ఉందిః
ఇవి కొన్ని సత్కార్యవనాలు, సత్కార్యతోటలు. అవి చేయుటకు సుగమమైన మార్గం ఉంది. ద్వారాలు తెరువబడి ఉన్నాయి. మంచి ఫలాలు ఉన్నాయి. ఇహపరాల్లో ఉత్తమమైన ఫలితాలూ ఉన్నాయి. ఓ అల్లాహ్! నీకు ఇష్టమైనవి, నీవు కోరినవి చేసే సద్భాగ్యం మాకు ప్రసాదించమని, మాకు స్వర్గం ప్రసాదించి, నరకం నుండి కాపాడమని నీతో వేడుకుంటున్నాము. నీ మార్గంలో అత్యంత కృషి సలుపుతున్నవారికి, నీ మార్గంలో పోరాడుతున్న వారికి సహాయం చేయి. అల్లాహ్ వారి గురి సరిచేయి. వారి సామాగ్రిలో శుభం కలుగజేయి. వారి బలం రెట్టింపు చేయి. వారిలోని రోగు లకు స్వస్థత ప్రసాదించు. అమరవీరులైనవారిని నీవు అంగీకరించు. వారిలోని బలహీనులకు అతిఉత్తమ సహాయకునివిగా అయిపో. ఓ అల్లాహ్ ఆక్రామకులైన యూదుల పంజా నుండి మస్జిద్ అక్సాను విడిపించు. ఓ అల్లాహ్ యూదులకు, వారికి తోడ్పడే వారికి ఓటమి పాలు చేయి. వారి మధ్య విభేదాలు పుట్టించు. వారిలో అనైక్యత ఏర్పరచు. వారిని ఇస్లాం మరియు ముస్లిముల కొరకు లాభకరంగా చేయి. అల్లాహ్ మా దేశంలో ప్రత్యేకంగా, తద్వారా ముస్లిములు జీవించే ప్రతి చోట శాంతిభద్రతలు వర్థిల్లునట్లుగా చేయి. అల్లాహ్ నీవు ప్రసాదించిన మా భార్య, సంతానం, సంపాదనల్లో శుభం కలుగజేయి. వారిని ఇహపరాల్లో మా కళ్ళకు చల్లదనంగా చేయి. అల్లాహ్! మమ్మల్ని, మా తల్లిదండ్రుల్ని, ముస్లిము- లందరిని క్షమించు. నిశ్చయంగా నీవు వినేవానివి, అంగీకరించేవానివి.
25.34980855.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
టైటిల్: నమాజు నిధులు అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
నమాజులో చాలా గొప్ప నిధులు, కోశాగారాలున్నాయి. బహుశా అవి అనేక మందికి తెలియకపోవచ్చు. ఇవి సత్కర్మ, పుణ్యం మరియు హోదా అంతస్తులతో నిండి ఉన్నాయి. షైతాన్ కూడా మనల్ని వాటి నుండి దూరముంచడానికి సిద్ధమై యున్నాడు. మనం మన నిద్ర (అలక్ష్యం) నుండి మేల్కొనే సరికి తెలుపబోయే అనేక పుణ్యాల నుండి దూరముంచడానికి కొన్నిటిపై మాత్రమే తృప్తి పడేలా చేశాడు. అందువల్ల మనం ఒక్క నమాజు చేసుకొని వెళ్తాము కాని ఒక్క పుణ్యం కూడా మనకు దక్కదు. ఇలాంటి పరిస్థితి నుండి అల్లాహ్ మనల్ని కాపాడాలి-. అందుకే ‘అల్లాహ్ పై విశ్వాసం’ మరియు ‘వాచా కర్మ’లో చిత్తశుద్ధి ఆయుధంతో సన్నద్ధమై, (అల్లాహ్) ‘సహనం’, ‘స్మరణం’ కోటలో భద్రంగా ఉండి, ‘వినయ’, ‘విమ్రత’ కవచం ధరించి యుద్ధపతాకం ఎగిరేసి, గత కాలంలో కోల్పోయిన మన నమాజులను మరియు దానికి సంబంధించిన అమూల్య నిక్షేపాలను, నిధులను కాపాడుకొనుటకు మనోవాంఛలకు మరియు షైతాన్ కు వ్యతిరేకంగా పోరాడుదాం.
ఇకనైనా సమయం రాలేదా? నిద్ర నుండి మేల్కొనే సమయం, ఏమరుపాటును వదులుకునే సమయం, పుణ్యాత్ముల బృందంలో కలిసేసమయం, సత్కార్యాల అకౌంట్ పెంచుకునే సమయం, కరుణామయుని కరుణ, మన్నింపుకై నిరీక్షించి సజ్జనులతో స్వర్గంలో ప్రవేశించేందుకు ప్రయత్నం చేసే సమయం రాలేదా?
నిశ్చయంగా నమాజు నిధులు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని నమాజుకు ముందు పొందవచ్చు, మరి కొన్ని నమాజు మధ్యలో, మిగితావి నమాజు తర్వాత.
ఇక రండి! పయనమవుదాము…….చిత్తశుద్ధి’ మరియు ‘ధైర్య’ నౌకలో నమాజులోని మూడు గుప్తమైన నిధుల అన్వేషణకై ప్రయాణం మొదలెడదాం.
1- మొదటి నిధి: (నమాజుకు ముందు) నమాజు కొరకు సిద్ధమవటం. 2- రెండవ నిధి: (నమాజు సందర్భంలో) నమాజు చేయటం. ౩- మూడవ నిధి: (నమాజు తర్వాత) జిక్ర్ మరియు కొన్ని ఆచరణలు.
1- వుజూ 2- వుజూ తర్వాత దుఆ ౩ మిస్వాక్ 4- నమాజు కోరకు తొలి సమయంలో వెళ్ళటం 5- అజాన్ కు బదులు పలకటం 6- అజాన్ తర్వాత దుఆ 7- నమాజ్ కొరకు నడచి వెళ్ళడం 8- మొదటి పంక్తి, కుడి పంక్తి 9- సున్నతె ముఅక్కద 10- అజాన్ మరియు అఖామత్ మధ్వలో దుఆ 11- నమాజు కొరకు వేచియుండుట 12- ఖుర్ఆన్ పారాయణం, జిక్ర్ 13- పంక్తులు సక్రమంగా ఉంచుట
రెండవ నిధి: నమాజు చేయటం
1- నమాజు ఘనత 2- సామూహిక నమాజు ఘనత ౩- ఖుషూ (అణుకువ, వినమత) 4- సనా 5- సూరె ఫాతిహ పారాయణం 6- ఆమీన్ పలకడం 7- రుకూ 8- రుకూ నుండి నిలబడిన తర్వాత 9- సజ్దాలు 10- మొదటి తషహ్హుద్ 11- చివరి తషహ్హుద్ (ప్రవక్తపై దరూద్) 12- సలాంకు ముందు దుఆ
మూడవ నిధి: నమాజు తర్వాత అజ్కార్
[క్రింద పూర్తి పుస్తకం చదవండి]
ముందు మాట
అల్ హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అఫ్ జలిల్ ముర్ సలీన్, అమ్మాబాద్:
నిశ్చయంగా నమాజు ఇస్లాం మూల స్తంభాలలో రెండవది. అది ముస్లిం మరియు కాఫిర్ (సత్య తిరస్కారి)ల మధ్య వ్యత్యాస చిహ్నం. అల్లాహ్ ఇలా ఆదేశించాడు:
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రజియల్లాహు అన్హుమా) బానిస నాఫిఅ రహిమహులాహ్ ఉల్లేఖనం ప్రకారం: ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు తన గవర్నర్లకు ఇలా వ్రాసేవారుః “మీ సమస్త వ్యవహారాల్లో నా వద్ద అతి ముఖ్యమైనది నమాజ్. దానిని కాపాడి దానిపై స్థిరంగా ఉన్నవాడే తన ధర్మాన్ని కాపాడేవాడు. దాన్ని వృథా చేసేవాడు ఇతరవాటిని మరింత ఎక్కువగా వృథా చేసేవాడు“(ముఅత్త మాలిక్ 1/5, హ.నం.: 5.).
ఇస్లాం కడియాల్లో అన్నిటికంటే చివరిగా విరిగేది ఇదే. అబూ ఉమామ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః
“ఇస్లాం కడియాలు ఒక్కొక్కటి విరుగుతాయి. ఒక కడియం విరిగిన వెంటనే ప్రజలు దాని వెనక దాన్ని గట్టిగా పట్టుకుంటారు. అన్నిట్లోకెల్లా ముందు విరిగే కడియం “హుకుం” అయితే చివరిగా విరిగేది “నమాజ్“([1]).
[1] అహ్మద్ 5/215, తబ్రానీ కబీర్ 7486, అల్ ఇబానతుల్ కుబ్రా లిబ్ని బత్త 4, ముస్తద్రక్ హాకిం 4/92, (హాకిం దీనిని సహీ అన్నారు). తాజీము కద్రిస్సలా లి ముహమ్మద్ బిన్ నస్ర్ 407, ఇబ్ను హిబ్బాన్ 257, ఇది హసన్ హదీసు.
ఈ హదీసు ఆధారంగానే ఇమాం అహ్మద్ ‘నమాజ్ వదిలేవారు అవిశ్వాసుల’ని సిద్ధాంతీకరించారు. దీనిపై అనేక ఆధారాలున్నాయి. అందుకే ‘నమాజు వదిలేవారు అవిశ్వాసానికి’ పాల్పడుతున్నారన్న విషయంపై ప్రవక్త సహచరులు ఏకీభవించారు.
ముజాహిద్, జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమాను ప్రశ్నించారు: ‘ప్రవక్త కాలంలో మీ వద్ద విశ్వాసం మరియు అవిశ్వాసం మధ్య వ్యత్యాస పరిచే ఆచరణ ఏముండినది’? అని, అందుకు ఆయన “నమాజ్” అని సమాధానం ఇచ్చారు([2]). “మీ వద్ద” అంటే ముస్లిముల వద్ద, వారు ప్రవక్త సహచరులు.
[2] తాజీము కద్రిస్సలా 892, అస్సున్న లిల్ ఖల్లాల్ 1379, అల్ ఇబాన 876, షర్హు ఉసూలి ఇఅతికాది అహ్లిస్సున్న 1538. దీని సనద్ (పరంపర) హసన్, అందులో ఏ అభ్యంతరం లేదు.
అబుజ్జుబైర్ ఉల్లేఖనం ప్రకారం: ‘పాపాన్ని మీరు షిర్క్ అనేవారా?’ అని ఒక వ్యక్తి జాబిర్ రజియల్లాహు అన్హుమాను ప్రశ్నించగా నేను విన్నాను. దానికి ఆయన “లేదు” అని జవాబిచ్చారు. “మనిషి విశ్వాసం మరియు అవిశ్వాసం మధ్యలో బేధం తెలుపునదేమిటి?” అని అడగ్గా “నమాజ్ వదలడం” అని సమాధానమిచ్చారు([3]).
ఇలాంటి మరో ఉల్లేఖనాన్ని అబుజ్జుబైర్ ఉల్లేఖించారు, పాపాన్ని మీరు కుఫ్ర్ (అవిశ్వాసం)గా భావించేవారా? అని జాబిర్ జాబిర్ రజియల్లాహు అన్హుమాను ప్రశ్నించినపుడు, “లేదు” అని జవాబిచ్చి, “మనిషి (విశ్వాసం) మరియు అవిశ్వాసంలో ఉన్న వ్యత్యాసం నమాజును విడనాడడమే” అని చెప్పారాయన(*).
ప్రవక్త సహచరులు ఇలా అనేవారని నాకు తెలిసిందని హసన్ ఉల్లేఖించారు([4]): “మనిషి (విశ్వాసం) మరియు షిర్క్ చేసి అవిశ్వాసుడయ్యే వాని మధ్య వ్యత్యాసం ఏదైనా ఉంటే, ధార్మిక పరమైన ఏ కారణం లేకుండా నమాజు విడనాడడం“. దీని సనద్ (ఆధారం) ప్రామాణికమైనది. హసన్ అంటే హసన్ బస్రీ, అతను అనేక మంది సహాబాలను కలసి వారితో హదీసులు విన్నారన్న విషయం తెలిసినదే.
[4] అస్సున్న 1372, అల్ ఇబాన 877, షర్హు ఉసూలి…..1539.
అబ్దుల్లాహ్ బిన్ షఖీఖ్ ఇలా తెలిపారుః “మనిషి ఏదైనా ఆచరణ విడనాడితే అతను అవిశ్వాసానికి పాల్పడినట్లగునని ప్రవక్త సహచరులు భావించేవారు కాదు. కాని నమాజ్ విడనాడితే మాత్రం అవిశ్వాసానికి గురి అయినట్లని అనుకునేవారు“. దీని సనద్ ప్రామాణికమైనది. మరో ఉల్లేఖనంలోని పదాలు ఇలా ఉన్నాయిః “నమాజ్ తప్ప ఏదైనా ఆచరణ విడనాడితే అది అవిశ్వాసానికి పాల్పడినట్లు అవుతుందనే విషయం మాకు తెలియదు“. (అంటే నమాజు విడనాడుట కుఫ్ర్ కు సమానం అని). (అస్సున్న 1378).
ముహమ్మద్ బిన్ నస్ర్ తన గ్రంథం తాజీము కద్రిస్సలా 990లో ఇలా పేర్కొన్నారుః ఇస్ హాఖ్ చెప్పగా నేను విన్నానుః “సమయం దాటినప్పటికీ ఏ ధార్మిక ఆటంకం లేకుండా ఉద్దేశ్యపూర్వకంగా నమాజ్ చేయనివాడు అవిశ్వాసి” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా రుజువైన విషయమే. ఇస్ హాఖ్ అంటే ఇస్ హాఖ్ బిన్ రాహ్ వైహ్. ఇతను సహాబాల తర్వాత వచ్చినవారిలో ఏ కొందరైతే ఈ విషయంలో విభేదించారో వారిలో ఒకరు కారు. అందుకే అతని శిష్యుడు ముహమ్మద్ బిన్ నస్ర్ ఇలా చెప్పాడుః “నమాజు విడనాడేవాడు అవిశ్వాసి (బేనమాజి కాఫిర్), అతను ధర్మ భ్రష్టుడు మరియు దానిని స్థాపించనివానితో యుద్ధం చేయాలని” ఉల్లేఖించబడిన ప్రవక్త సూక్తులను అతను (ఇస్ హాఖ్) ఉల్లేఖించాడు. ప్రవక్త సహచరులతో కూడా ఇలాంటి విషయమే రుజువైనది. సహచరుల్లో ఏ ఒక్కరు కూడా దీనికి భిన్నాభిప్రాయం గలవారని రుజువు లేదు. వారి తర్వాత వచ్చిన విద్వాంసుల్లో కొందరు “బేనమాజి కాఫిర్, దానిని స్థాపించని వానితో యుద్ధం చేయాలని” ప్రవక్త మరియు వారి సహచరులతో ఉల్లేఖించబడిన ఉల్లేఖనాల వేరు భావం తీసి విభేదించారు.
అబ్దుల్లాహ్ “సున్నహ్”లో, ఇబ్ను నస్ర్ “తాజీము కద్రిస్సలా”లో, ఖల్లాల్ “సున్నహ్”లో, ఆజుర్రి “షరీఅ”లో మరియు ఇబ్ను బత్త “ఇబాన”లో ఉల్లేఖించారుః “సహాబాల ఒక పెద్ద సంఖ్య మరియు తదితరులు నమాజు విడనాడినవారిని కాఫిర్ అనేవారు“. మరి కొందరైతే నమాజు వదిలేవాడు కాఫిర్ అనే అధ్యాయం ప్రత్యేకించి దానికి సంబంధించిన నిదర్శనాలు అందులో పేర్కొన్నారు.
సోదరుడు సులైమాన్ బిన్ ఫహ్ ద్ అల్ ఉతైబీ “కునూజుస్సలా”(నమాజు నిధులు) పేరుతో చిరు పుస్తకం వ్రాసి అందులో ఈ గొప్ప విధిని, ఇస్లాంలో దాని స్థానాన్ని స్పష్టపరిచారు. నమాజు యొక్క లాభాల్ని దాని ప్రత్యేకతల్ని సైతం తెలియజేస్తూ ఇతర విధులపై దీని (నమాజ్) ప్రాముఖ్యతను చాటి చెప్పారు. దాన్ని నెరవేర్చే వారికి లభించే పుణ్యాలను కూడా మన ముందుంచారు. అల్లాహ్ వారికి మంచి ప్రతిఫలం నొసంగుగాక! మరింత సద్భాగ్యం ప్రసాదించుగాక!
అబ్దుల్లాహ్ బిన్ అబ్దుర్రహ్మాన్ అస్సఅ’ద్
భూమిక
అల్ హందు లిల్లాహిల్ మలికిల్ జబ్బార్, అల్ వాహిదిల్ ఖహ్హార్, వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లాషరీకలహూ రబ్బుస్సమావాతి వల్ అర్జి వమా బైనహుమల్ అజీజుల్ గఫ్ఫార్. వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ. అల్లాహ్ ప్రవక్తను ఆకాశాల వైపు ఆహ్వానించి విధి నమాజుల బహుమానం ప్రసాదించాడు. అది విశ్వాసం తర్వాత మొదటి విధి. విశ్వాసుల ఉత్తమ, ప్రథమ, ప్రముఖమైన గుణం.
నిశ్చయంగా నమాజ్ మనస్సుకు మంచి శిక్షణ ఇస్తుంది, ఆత్మను శుద్ధి పరుస్తుంది. హృదయాలను ప్రకాశవంతం చేస్తుంది, అందువల్ల మనిషిలో అల్లాహ్ యొక్క గొప్పతనం మొలకెత్తుతుంది. తద్వారా మనిషిని సౌభాగ్యవంతునిగా చేసి, అతని నడవడికలో మంచి మార్పును తీసుకువస్తుంది. ఒకరి వెనుక ఒకరు వచ్చిన అనేక ప్రవక్తల వద్ద తౌహీద్ తర్వాత అతి ముఖ్యమైన సంప్రదాయం ఇది. ఇస్మాఈల్ అలైహిస్సలాం గురించి అల్లాహ్ ఇలా తెలిపాడుః
“అతను తన ఇంటివారిని నమాజును పాటించండి అని ఆజ్ఞాపించేవాడు“. (మర్యం 19: 55).
నమాజ్ ద్వారా ప్రతి రోజూ అల్లాహ్ తో సంబంధం పెరుగుతుంది. ఇలా భక్తునికి ఒక రకమైన ఆత్మబలం లభిస్తుంది. అది అతనికి ఇతర విధుల నిర్వహణకు సహాయపడుతుంది.
నిశ్చయంగా నమాజ్ లోని అమూల్యమైన నిధులు మన కళ్ళ ముందు స్పష్టంగా ఉన్నాయి. కాని గుడ్డివారు ఎలా చూడ గలుగుతారు? నమాజులో గుప్తమైన మూడు నిధులున్నాయి. అల్లాహ్ తో సహాయం కోరిన తర్వాత అన్వేషణ, పరిశీలన మరియు చిత్తశుద్ధి, దృఢ సంకల్పంతో నీవు చేసే ఒకే ఒక్క నమాజు వల్ల సర్వ ముస్లిములోకెల్లా ఎక్కువ ధనసంపత్తి గలవాడవు అవుతావు.
గుప్తమైన మొదటి నిధిః “నమాజు కొరకు సంసిద్ధత”. వుజూ, అజాన్ యొక్క జవాబు మరియు త్వరగా నమాజుకు వెళ్ళడం ద్వారా నీవు ఈ నిధిని పొందగలవు.
దాగి ఉన్న రెండవ నిధిః పూర్తి శ్రధ్ధాభక్తులతో ప్రవక్త పద్దతి ప్రకారం నమాజు చేస్తూ, దాని అంతరంగంలో మునిగి తేలాడుతూ సంపాదించవచ్చు.
ఇక మూడవ నిధిని నమాజు తర్వాత జిక్ర్, దుఆ మరి సున్నతుల ఆచరణ, ఇంకా దాని తర్వాత నమాజు ప్రతీక్షణలో ఉండి పొందవచ్చు.
ఈ రచనలో ఏదైనా లోటు, పొరపాటు జరిగి ఉంటే మన్నించాలని, దీనిని ముస్లిలకు ప్రయోజనకరమైనదిగా చేయాలని అల్లాహ్ నే వేడు కుంటున్నాను. నా ఈ కృషికి బదులుగా రెట్టింపు పుణ్యాలు; (1. ఇజ్తిహాద్, 2. సరియైన దాని పుణ్యం) ప్రసాదించాలని కూడా ఆ కరుణప్రదాతనే వేడుకుంటున్నాను.
వ ఆఖిరు దఅవానా అనిల్ హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
అబూ సుల్తాన్ సులైమాన్ బిన్ ఫహ్ ద్ అల్ ఉతైబి పోస్ట్ బాక్స్ నం: 270144. రియాజ్. పిన్ కోడ్: 11352
నమాజు నిధులు
నమాజులో చాలా గొప్ప నిధులు, కోశాగారాలున్నాయి. బహుశా అవి అనేక మందికి తెలియకపోవచ్చు. ఇవి సత్కర్మ, పుణ్యం మరియు హోదా అంతస్తులతో నిండి ఉన్నాయి. షైతాన్ కూడా మనల్ని వాటి నుండి దూరముంచడానికి సిద్ధమై యున్నాడు. మనం మన నిద్ర (అలక్ష్యం) నుండి మేల్కొనే సరికి తెలుపబోయే అనేక పుణ్యాల నుండి దూరముంచడానికి కొన్నిటిపై మాత్రమే తృప్తి పడేలా చేశాడు. అందువల్ల మనం ఒక్క నమాజు చేసుకొని వెళ్తాము కాని ఒక్క పుణ్యం కూడా మనకు దక్కదు. ఇలాంటి పరిస్థితి నుండి అల్లాహ్ మనల్ని కాపాడాలి. అందుకే ‘అల్లాహ్ పై విశ్వాసం’ మరియు ‘వాచా కర్మ’లో చిత్తశుద్ధి ఆయుధంతో సన్నద్ధమై, (అల్లాహ్) ‘సహనం’, ‘స్మరణం’ కోటలో భద్రంగా ఉండి, ‘వినయ’, ‘విమ్రత’ కవచం ధరించి యుధ్ధపతాకం ఎగిరేసి గత కాలంలో కోల్పోయిన మన నమాజులను మరియు దానికి సంబంధించిన అమూల్య నిక్షేపాలను, నిధులను కాపాడుకొనుటకు మనోవాంఛలకు మరియు షైతాన్ కు వ్యతిరేకంగా పోరాడుదాం.
ఇకనైనా సమయం రాలేదా? నిద్ర నుండి మేల్కొనే సమయం, ఏమరుపాటును వదులుకునే సమయం, పుణ్యాత్ముల బృందంలో కలిసే సమయం, సత్కార్యాల అకౌంట్ పెంచుకునే సమయం, కరుణామయుని కరుణ, మన్నింపుకై నిరీక్షించి సజ్జనులతో స్వర్గంలో ప్రవేశించేందుకు ప్రయత్నం చేసే సమయం రాలేదా?
నిశ్చయంగా నమాజు నిధులు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని నమాజుకు ముందు పొందవచ్చు. మరి కొన్ని నమాజు మధ్యలో. మిగితావి నమాజు తర్వాత.
ఇక రండి! పయనమవుదాము……..’చిత్తశుద్ధి’ మరియు ‘ధైర్య’ నౌకలో నమాజులోని మూడు గుప్తమైన నిధుల అన్వేషణకై ప్రయాణం మొదలెడదాం.
1- మొదటి నిధిః (నమాజుకు ముందు) నమాజు కొరకు సంసిద్ధత.
2- రెండవ నిధిః (నమాజు సందర్భంలో) నమాజు చేయుట.
3- మూడవ నిధిః (నమాజు తర్వాత) జిక్ర్ మరియు కొన్ని ఆచరణలు.
మొదటి నిధి (నిక్షేపం): నమాజు కొరకు సంసిద్ధత
ఈ విలువగల నిధిని మనం నమాజులో ప్రవేశించక ముందు నమాజుకు సంబంధించిన ప్రథమ ఏర్పాట్లు మరియు మానసిక, ఆత్మీయ సంసిద్ధతల ద్వారా పొందగలము. దానికి అర్హులమయ్యే మార్గాలు క్రింది విధంగా ఉన్నాయి, శ్రద్ధ వహించండి.
1 – వుజూ
వుజూ యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది. పుణ్యాల సంపాదన, వాటి రెట్టింపులకై ఇది మొదటి మెట్టు. వుజూ ద్వారా ఈ క్రింద తెలుపబడే పుణ్యాలు పొందగలము.
(అ) అల్లాహ్ యొక్క ప్రేమ
అల్లాహ్ ఆదేశం:
“నిశ్చయంగా తౌబా చేసేవారిని మరియు పరిశుద్ధతను పాటించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు“. (బఖర 2: 222).
అల్లాహ్ మనల్ని ప్రేమించటం కంటే గొప్ప పుణ్యమేమిటి?
షేఖ్ సఅదీ తన తఫ్సీర్ -తైసీరుల్ కరీమిర్రహ్మాన్ ఫీ తఫ్సీరి కలామిల్ మన్నాన్-లో చెప్పారుః “ఈ ఆయతులో ‘పరిశుద్ధతను పాటించేవారు’ అంటే పాపాల నుండి దూరముండడం, అయితే ఇందులో మలినము నుండి శుద్ధి పొందుట కూడా వస్తుంది. పరిశుభ్రత మరియు వుజూ ఒక ధార్మిక విషయం అని దీని ద్వారా తెలుస్తుంది. ఎలా అంటే దాన్ని పాటించేవారిని అల్లాహ్ ప్రేమిస్తున్నాడు అని వచ్చింది. అందుకే పరిశుభ్రత, వుజూ నమాజ్, తవాఫ్ మరియు ఖుర్ఆన్ పారాయణానికి ఒక షరతుగా ఉంది.”
అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారుః
“ముస్లిం లేక మోమిన్ దాసుడు వుజూ చేస్తూ, తన ముఖం కడిగినపుడు ప్రవహించే నీళ్ళతో లేక చివరి నీటి చుక్కతో కళ్ళతో చూసి చేసిన ప్రతి పాపం రాలిపోతుంది (మన్నించబడుతుంది). రెండు చేతులు కడిగినపుడు వెళ్ళే నీళ్ళతో లేక చివరి నీటి చుక్కతో చేయితో పట్టి చేసిన ప్రతి పాపం రాలిపోతుంది. రెండు కాళ్ళు కడిగినపుడు వెళ్ళే నీళ్ళతో లేక చివరి నీటి చుక్కతో కాళ్ళు నడచి చేసిన ప్రతి పాపం రాలిపోతుంది. చివరికి అతను పాపాల నుండి పూర్తిగా పరిశుద్ధుడై వెళ్తాడు”. (ముస్లిం 244).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ ఉమామ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఏ వ్యక్తి నమాజు ఉద్దేశ్యంతో వుజూ చేస్తూ రెండు అరచేతులు కడుగుతాడో నీటి తొలి చుక్క ద్వారా అతని రెండు చేతులతో చేసిన పాపాలు తొలిగిపోవును. నోట్లు నీళ్ళు తీసుకొని పుక్కిలించి, ముక్కులో నీళ్ళు ఎక్కించి చీది శుభ్రపరచుకుంటాడో నీటి మొదటి చుక్క ద్వారా అతని నాలుక మరియు పెదవుల ద్వారా చేసిన పాపాలు తొలిగిపోతాయి. ముఖము కడిగినప్పుడు కళ్ళు మరియు చెవి ద్వారా చేసిన పాపాలు నీటి మొదటి చుక్క ద్వారా తొలిగి పోతాయి. మోచేతుల వరకు చేతులు, మోకాళ్ళ వరకు కాళ్ళు కడినగినప్పుడు సర్వ పాపాల నుండి విముక్తి పొంది తల్లి గర్భం నుండి పుట్టినప్పటి స్థితి మాదిరిగా అయిపోతాడు”. (అహ్మద్ 36/601). [ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను అని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
“ప్రళయదినాన నా అనుచర సమాజాన్ని (కర్మ విచారణ కోసం) పిలవడం జరుగుతుంది. అప్పుడు వారి ముఖాలు, చేతులు వుజూ ప్రభావంతో తెల్లగా, మహోజ్వలంగా ఉంటాయి. అందువల్ల మీలో ఎవరైనా తమ తెలుపు, తేజస్సులను వృద్ధి చేసుకో దలిస్తే వారు అలా వృద్ధి చేసుకోవచ్చు”. (బుఖారి 136, ముస్లిం 246).
అబూహురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారుః
“పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో నేను మీకు తెలుపనా?” దానికి సహచరులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారుః “(1) వాతావరణం, పరిస్థితులూ అననుకూలంగా ఉన్నప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం. (2) మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం. (3) ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం. ఇది రిబాత్ తో సమానం, ఇది రిబాత్ తో సమానం”. (ముస్లిం 251).
పరిస్థితులూ అననుకూలంగా ఉండుటః అంటే చలి కాలంలో చల్ల దనం, లేక అనారోగ్యం వల్ల చలనం, కదలిక కష్టంగా తోచినపుడు వుజూ చేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది. అయితే ఇలాంటి సందర్భంలో పాపాల మన్నింపు, పుణ్యాల రెట్టింపు, స్వర్గంలో ప్రవేశముద్దేశంతో పై మూడు కార్యాలు నెరవేర్చువాడిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పాపాల మన్నింపు మరియు షహాదత్ అపేక్షతో శత్రువు మధ్యలో పహరా కాయడం (రిబాత్)తో పోల్చారు.
మరికొందరి అభిప్రాయ ప్రకారం, వీటిని ‘రిబాత్‘ అనటానికి కారణ మేమంటే అవి మనిషిని పాపాల నుండి దూరముంచుతాయి. నిజము దేవుడెరుగును. (అల్ మత్జరుర్రాబిహ్ ఫీ సవాబిల్ అమలిస్సాలిహ్ లిల్ హాఫిజ్ అబూ ముహమ్మద్ షర్ఫొద్దీన్ అబ్దుల్ మోమిన్ అద్దిమ్యాతి).
ఉస్మాన్ రజియల్లాహు అన్హు వుజూ చేసి ఇలా చెప్పారుః నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలాగే వుజూ చేస్తూ ఉండగా చూశాను. పిదప ఆయన ఇలా ప్రవచించారుః “ఎవరు నా ఈ పద్ధతి ప్రకారం వుజూ చేసి, మనసులో ఎలాంటి (ప్రాపంచిక) ఆలోచనలు రానివ్వకుండా పూర్తి ఏకాగ్రతతో రెండు రకాతుల నమాజు చేస్తారో అతని గత పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 1934, ముస్లిం 226).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారని ఉఖ్బా బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరైనా ఒకరు ఉత్తమ రీతిలో వుజూ చేసుకొని, పూర్తి శ్రద్ధాభక్తులతో రెండు రకాతుల నమాజు చేసినచో అతనికి తప్పక స్వర్గం లభిస్తుంది”. (అబూ దావూద్ 906, ముస్లిం 234).
2 – వుజూ తర్వాత దుఆ
వుజూ తర్వాత దుఆ యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది. మొదటి నిధిలోని మరికొన్ని పుణ్యాల అన్వేషణలో మనం ఉన్నాము. వుజూ తర్వాత గల ప్రత్యేక దుఆల ద్వారా క్రింది పుణ్యాలు సంపాదించవచ్చు.
(అ) స్వర్గపు ఎనిమిది ద్వారాల్లో ఇష్టమున్న ద్వారము నుండి ప్రవేశించే స్వేచ్ఛ:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా సంపూర్ణంగా వుజూ చేసి, “అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ” చదివితే వారి కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. తాను కోరిన ద్వారము నుండి అతను అందులో ప్రవేశించవచ్చు”. (ముస్లిం 234).
(ఆ) తోలుకాగితంలో పేరు వ్రాయబడి దానిపై ముద్ర వేయబడుతుంది. అది ప్రళయదినం వరకు తీయబడదుః
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరైనా వుజూ చేసి, “సుబ్ హానకల్లాహుమ్మ వ బిహందిక అష్ హదు అల్లాఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక” చదువుతారో అతని పేరు తోలు కాగితంలో వ్రాయబడుతుంది. ముద్ర వేయబడుతుంది. ప్రళయదినం వరకు తీయబడదు”([6]).
[6] [సునన్ నిసాయీ అల్ కుబ్రా/ బాబు మా యఖూలు ఇజా ఫరగ మిన్ వుజూఇహీ. 9909. 6/25. సహీహుత్తర్గీబు వత్తర్ హీబ్ 225. సహీహుల్ జామిఅ 6170]
3 – మిస్వాక్
ఒక పుణ్యం తర్వాత మరో పుణ్యం సంపాదించడంలోనే ఉన్నాము, ఇప్పుడు మనం (మిస్వాక్) స్టేషన్ లో ఉన్నాము. ఈ గొప్ప పుణ్యం గురించి చదవండిః మిస్వాక్ నోటిని శుభ్రం చేయునది, అల్లాహ్ ను సంతృష్టి పరచునది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లఖించారుః
నమాజు కొరకు తొలి సమయంలో (త్వరగా, శీఘ్రముగా) బయలుదేరుట చాలా ఘనతగల విషయం. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
“అజాన్ చెప్పడంలో, మొదటి పంక్తిలో చేరడంలో ఎంత పుణ్యం ఉందో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు చీటులు వేసుకునే పద్ధతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, వారు తప్పకుండా పరస్పరం చీటులు వేసుకుంటారు. అలాగే నమాజ్ వేళ కాగానే తొలి సమయంలో (మస్జిద్) చేరడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటీపడతారు”. (బుఖారీ 615, ముస్లిం 437).
జుమా నమాజు కొరకు తొలి సమయంలో వెళ్ళటంలో ప్రత్యేక శ్రేష్ఠత మరియు చెప్పరాని విశిష్ఠత ఉంది. ఈ హదీసుపై శ్రద్ధ వహించండి. ఔస్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః
“ఎవరు జుమా రోజు తలంటు స్నానం చేసి, తొలి సమయంలో అందరికంటే ముందుగా (మస్జిద్ చేరుకుని), ఇమాంకు సమీపంగా నిశ్శబ్దంగా కూర్చున్నాడో, అతను నడిచే ప్రతి అడుగుకు బదులుగా ఒక సంవత్సరపు ఉపవాసాల మరియు ఒక సంవత్సరపు తహజ్జుద్ నమాజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇది అల్లాహ్ కు ఎంతో కష్టం కాదు“([8]).
[8] అల్ ముఅజముల్ కబీర్ లిత్తబ్రానీ 1/214. అహ్మద్ 4/9. దీని భావం అబూ దావూద్ 345. తిర్మిజి 496. నిసాయీ 1381. ఇబ్ను మాజ 1087లో ఉంది
జుమా కొరకు ఒక్కో అడుగుపై ఒక సంవత్సరపు ఉపవాసాల మరియు తహజ్జుద్ చేసినంత పుణ్యం!! ఇంతకంటే గొప్ప శ్రేష్ఠత, ఘనతగల ఫలితం ఇంకేముంది?
నిరంతరం నమాజు కొరకు తొలి సమయంలో వెళ్ళటం మనసంతా మస్జిద్ లోనే ఉందన్నదానికి సంకేతం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఉపదేశించారుః “అల్లాహ్ ఛాయ తప్ప మరెలాంటి ఛాయ లభించని (ప్రళయ)దినాన అల్లాహ్ ఏడుగురు వ్యక్తులను తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. అందులో ఒకడుః మస్జిద్ నుండి వెళ్ళినప్పటి నుండీ అక్కడికి తిరిగి వచ్చే వరకు మనసంతా మస్జిదులోనే ఉండేటటువంటి వ్యక్తి“. (తిర్మిజి 2391, బుఖారి 660, ముస్లిం 1031).
5 – అజాన్ కు బదులు పలకటం
ఇప్పటికీ మనం నమాజుకు సంబంధించిన నిధుల మధ్య ఉత్తమ మైన సుకృతాలు, అమూల్యమైన పుణ్యాల అన్వేషణలో ఉన్నాము. అజాన్ యొక్క జవాబు ద్వారా స్వర్గం పొందవచ్చన్న శుభవార్త ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చియున్నారు. ఈ రెండు హదీసులపై శ్రద్ధ వహించండిః
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ముఅజ్జిన్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అన్నపుడు దానికి జవాబుగా మీలో ఒకడు తన హృదయాంతరంతో అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అంటే, అతను (ముఅజ్జిన్) అష్ హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్ అన్నపుడు ఇతను (మీలో ఒకడు) అష్ హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్ అంటే, అతను అష్ హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్ అన్నపుడు ఇతను అష్ హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్ అంటే, అతను హయ్య అలస్సలా అన్నపుడు ఇతను లాహౌల వలా ఖవ్వత ఇల్లా బిల్లాహ్ అంటే, అతను హయ్య అలల్ ఫలాహ్ అన్నపుడు ఇతను లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అంటే అతను అల్లాహు అక్బర్ అన్నపుడు ఇతను అల్లాహు అక్బర్ అంటే మళ్ళీ అతను లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్నపుడు ఇతను లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఇతను స్వర్గంలో ప్రవేశిస్తాడు”. (ముస్లిం 385).
అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో యమన్ వైపున హిజాజులో ఒక ఎత్తైన ప్రదేశంలో ఉండగా, బిలాల్ నిలబడి అజాన్ ఇచ్చాక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః “ఇతను (బిలాల్) చెప్పినట్లు పూర్తి నమ్మకంతో ఎవరు జవాబిస్తారో అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు”. (అహ్మద్ 2/352. నిసాయీ 668).
6 – అజాన్ తర్వాత దుఆ
అజాన్ తర్వాత దుఆ యొక్క ఘనత కూడా గొప్పగా ఉంది. కాని అనేకులు దీని పట్ల అశ్రద్ధ వహిస్తున్నరు. దాని సారాంశం క్రింది విధంగా ఉందిః
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం అల్లాహ్ స్వర్గంలో ఆతిథ్యం ఇస్తాడు”. (ముస్లిం 669, బుఖారి 662).
అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః “ఎవరైనా తనింట్లో వుజూ చేసుకొని అల్లాహ్ గృహాల్లోని ఒక గృహానికి అల్లాహ్ విధుల్లోని ఒక విధి నెరవేర్చడానికి బయలుదేరుతే అతని ఒక అడుగుకు బదులుగా పాప మన్నింపు జరిగితే రెండవ అడుగుకు బదులు అతని స్థానం పెరుగుతుంది”. (ముస్లిం 666).
అబూ మూసా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా శుభవార్తిచ్చారుః “నమాజు విషయంలో అందరికంటే గొప్ప ఫలానికి అర్హుడు అందరికంటే ఎక్కువ దూరం నండి నమాజు కోసం నడిచి వచ్చేవాడు. నమాజు తొందరగా చేసి పడుకునే వ్యక్తి కంటే సామూహిక నమాజు కోసం ఎదురు చూస్తూ ఇమాంతో నమాజు చేసుకునే వ్యక్తి ఎక్కువ పుణ్యానికి అర్హుడవుతాడు”. (ముస్లిం 662, బుఖారీ 651).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని బురైద రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “చీకట్లో నడుచుకుంటూ మస్జిద్ కు వెళ్ళే వారికి ప్రళయదినాన సంపూర్ణ కాంతి శుభవార్త ఇవ్వండి”. (తిర్మిజి 223. అబూ దావూద్ 561).
అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః “మంచి మాట ఒక సదకా (దానం) మరియు నమాజు కొరకు మస్జిదుకు వెళ్తున్నప్పుడు వేసే ప్రతి అడుగు దానమే”. (బుఖారీ 2891, ముస్లిం 1009).
మస్జిద్ లో ప్రవేశిస్తూ ఎవరైనా “అఊజు బిల్లాహిల్ అజీం వబివజ్ హిహిల్ కరీం వసుల్తానిహిల్ కదీం మినష్షైతానిర్రజీం” చదివితే, ‘ఈ రోజంతా ఇతడు నా నుండి కాపాడబడ్డాడు’ అని షైతాన్ అంటాడు. (అబూదావూద్ 466, సహీహుల్ జామి 4715).
8 – మొదటి పంక్తిలో నిలబడటానికి ముందంజ వేయటం
(అ) మొదటి పంక్తిలో ఉండే కాంక్ష
మొదటి పంక్తిలో ఉండే కాంక్షలో కూడా గొప్ప ఘనత ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాని నిర్ణీత ఫలితం తెలుపకుండా మౌనం వహించడమే దాని గొప్ప శ్రేష్ఠతను సూచిస్తుంది. ఆయన ప్రవచనం ఇలా ఉందిః
“అజాన్ చెప్పడంలో, మొదటి పంక్తిలో చేరడంలో ఎంత పుణ్యం ఉందో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు చీటులు వేసుకునే పద్ధతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, వారు తప్పకుండా పరస్పరం చీటులు వేసుకుంటారు. అలాగే నమాజ్ వేళ కాగానే తొలి సమయంలో (మస్జిద్) చేరడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటీపడతారు”. (బుఖారీ 615, ముస్లిం 437).
జాబిర్ బిన్ సముర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా మధ్యలో వచ్చి “దైవదూతలు తమ ప్రభువు ముందు ఏ విధంగా బారులు తీరియుంటారో మీరు ఆ విధంగా మీ పంక్తులను సరి చేసుకోరా?” అని ప్రశ్నించారు. ‘దైవదూతలు తమ ప్రభువు ముందు ఎలా బారులు తీరియుంటారు ప్రవక్తా’ అని మేమడిగాము. “మొదటి పంక్తి పూర్తి చేశాకే దాని తర్వాత పంక్తిలో నిలబడతారు. మరియు దగ్గర దగ్గరగా కట్టు దిట్టంగా నిలబడతారు” అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. (ముస్లిం 430).
అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ అనుచరుల్ని నమాజులోని పంక్తుల నుండి వెనక ఉండడాన్ని చూసి ఇలా చెప్పారుః “ముందుకు రండి, మీరు నన్ను అనుసరించండి. మీ వెనక వారు మిమ్మల్ని అనుసరిస్తారు. (జాగ్రత్త!) ప్రజలు గనక ఎప్పుడూ వెనకే ఉంటే అల్లాహ్ కూడా వారిని వెనకబాటుతనానికి గురిచేస్తాడు”. (ముస్లిం 438).
(క) మొదటి పంక్తుల్లో ఉన్నవారిపై అల్లాహ్ మరియు ఆయన దూతల దీవెనలుః
బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పంక్తుల మధ్య వచ్చి మా భుజాలను, ఛాతిని వెనకా ముందు ఉండ కుండా సరిచేసేవారు. ఇంకా ఇలా అనేవారుః “మీరు పంక్తుల్లో వెనకా మందు విభిన్న రీతిలో నిలబడకండి, అందువల్ల మీలో మనస్పర్థలు ఏర్పడవచ్చు”. ఇంకా ఇలా అనేవారుః “మొదటి పంక్తుల్లో ఉన్నవారిని అల్లాహ్ తనకు అతిసన్నిహితంగా ఉన్న దైవదూతల మధ్య ప్రశంసిస్తాడు మరియు దైవదూతలు వారి కొరకు దుఆ చేస్తారు”. (అబూ దావూద్ 664).
9 – సున్నతె ముఅక్కద
(అ) నిరంతరం సున్నతె ముఅక్కద చదివేవారు స్వర్గంలో ఒక గృహానికి అర్హులవుతారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నానని ఆయన సతీమణి ఉమ్మె హబీబ రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః “ముస్లిం దాసుడు ప్రతి రోజూ ఫర్జ్ నమాజు కాకుండా పన్నెండు రకాతుల నఫిల్ నమాజు అల్లాహ్ కొరకు చేస్తూ ఉంటే అల్లాహ్ అతని కొరకు స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు. లేక ఒక ఇల్లు అతని కొరకు నిర్మించబడుతుంది”. (ముస్లిం 728).
సున్నతె ముఅక్కదలో కొన్ని ఫర్జ్ నమాజుకు ముందున్నాయి, మరి కొన్ని తర్వాతున్నాయి. అవి మొత్తం 12 రకాతులు.
ఫర్జ్ కంటే ముందున్నవిః
1- ఫజ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః
“ఫజ్ర్ కు ముందు రెండు రకాతులు ప్రపంచము మరియు అందులో ఉన్నవాటి కంటే ఉత్తమమైనవి“. (ముస్లిం 725).
నాతో పాటు మీరు కూడా ఈ హదీసుపై శ్రద్ధ చూపండిః ఫజ్ర్ సున్నతులు ప్రపంచం, వాటిపై ఉన్న డబ్బు, ధనము, బిల్డింగులు, కార్ల కంటే చాలా మేలైనవి.
2- జొహ్ర్ కు ముందు 4రకాతులు.
ఫర్జ్ తర్వాతవిః
1- జొహ్ర్ తర్వాత రెండు. 2- మగ్రిబ్ తర్వాత రెండు. 3- ఇషా తర్వాత రెండు.
(ఆ) అస్ర్ కు ముందు నాలుగు రకాతులు చేయడం వల్ల అవి చేసేవారికి ప్రవక్త చేసిన రహ్మత్ యొక్క దుఆలో పాలుపంచుకునే భాగ్యం లభిస్తుంది. ఇబ్నె ఉమర్ ఉల్లేఖించారుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః
“అస్ర్ కు ముందు నాలుగు రకాతులు చదివేవారి పై అల్లాహ్ కరుణ కురియుగాకా!“. (అబూ దావూద్ 1271, తిర్మిజి 430).
10 – అజాన్ మరియు ఇఖామత్ మధ్యలో దుఆ
నమాజు వైపునకు త్వరగా వెళ్ళడం వల్ల అజాన్ మరియు ఇఖామత్ మధ్య దుఆ చేసే భాగ్యం కలుగుతుంది. మరియు ఇది దుఆ అంగీకార సమయం గనుక అదృష్టంగా భావించాలి. సమయమే గాకుండా మస్జిద్ స్థలం గనుక దాని శ్రేష్ఠతను దృష్టిలో ఉంచుకోవాలి. ఇంకా నమాజు కొరకు వేచి ఉండి దుఆ చేయడం అన్నది మరీ ఘనత గల విషయం. (ఇలా దుఆ అంగీకరించబడే అవకాశం ఎన్నో రకాలుగా ఉంది). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారుః
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
“మనిషి ఎంత వరకు నమాజు చేసుకున్న స్థలంలో కూర్చోని ఉంటాడో అంతవరకూ అతనికి నమాజు చేస్తున్నంత పుణ్యం లభిస్తుంది. అతను అక్కడి నుండి లేచిపోనంత వరకు లేదా అపానవాయువు వెడిలే వరకు. దైవదూతలు అతని కొరకు ఇలా దీవిస్తారుః అల్లాహ్ ఇతన్ని క్షమించు, ఇతన్ని కరుణించు”. (ముస్లిం 649, బుఖారీ 176). ఒక మనిషి కొరకు దైవదూతలు దుఆ చేస్తున్నారంటే అల్లాహ్ అతని గురించి చేస్తున్న వారి దుఆలను తప్పకుండా అంగీకరిస్తాడు. (అష్షర్హుల్ ముమ్తిఅలి షేఖ్ ఇబ్ను ఉసైమీన్).
అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయులు ﷺ ఇలా అడిగారుః “పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో నేను మీకు తెలుపనా?” దానికి సహచరులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారుః “(1) వాతావరణం, పరిస్థితులూ అననుకూలంగా ఉన్నప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం. (2) మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం. (3) ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం – ఇది రిబాత్ తో సమానం”. (ముస్లిం 587). (రిబాత్ భావం పేజి నం. 15లో చూడండి).
12 – ఖుర్ఆన్ పారాయణం మరియు జిక్ర్ (అల్లాహ్ స్మరణ)లో నిమగ్నులై యుండుట
మస్జిద్ లో త్వరగా వచ్చిన వ్యక్తి అల్లాహ్ సాన్నిధ్యం పొందుటకు ఎన్నో రకాల ఆరాధనలు పాటించ గలుగుతాడు. ఉదాః జిక్ర్, ఖుర్ఆన్ పారాయణం మరియు అల్లాహ్ వరాల పట్ల యోచించటం, ఇహలోకం, దానికి సంబంధించిన ఆలోచనల నుండి దూరం ఉండటం. దీని వల్ల మనుసును నమాజులోనే నిలిపి, వినయ వినమ్రత పాటించే అవకాశం ఉండును. అదే వెనక వచ్చే వ్యక్తి (పై లాభాలను నోచుకోలేడు) అతను నమాజు చేసినా అతని మనస్సు ఐహిక విషయాల్లో ఇరుక్కొని ఉంటుంది, నమాజులో లీనమై నమ్రత పాటించకపోవచ్చు. అతని శరీరం మస్జిదులో, నమాజులో ఉన్నా అతని అంతర్యం నమాజులో ఉండకపోవచ్చు.
ముస్లిం సోదరా! నీ పరలోక సేవింగ్ అకౌంట్ పెరుగుదలకై నీవు నమాజు కొరకు నిరీక్షిస్తున్నంత సమయంలో కొన్ని స్వర్ణవకాశాలు ఉదాహరణగా చూపిస్తున్నాను. వాటిపై శ్రద్ధ వహించుః
(అ) దివ్య ఖుర్ఆన్ పారాయణం
పారాయణ పరిమాణం
ఫలితం
విధానం
1- ప్రతి నమాజు యొక్క అజాన్ మరియు ఇఖామ- తుల మధ్యలో 5పేజిల పారాయణం. ఇలా ప్రతి రోజు 25 పేజిలవుతాయి.
24 రోజుల్లో మొత్తం ఖుర్ఆన్ యొక్క పారాయణం అవుతుంది.
ఖుర్ఆన్ పేజిలు 604 25 పేజిలు × 24 రోజులు = 600
2- నమాజుకై నిరీక్షిస్తూ ప్రతి రోజు ఒక్క పారా.
30 రోజుల్లో పూర్తి ఖుర్ఆన్ పారాయణం
ఖుర్ఆన్ పారాలు 30. నెల రోజులు 30. 30 పారాలు ÷ 30 రోజులు = రోజుకు 1 పార
3- నమాజు కొరకు నిరీక్షిస్తూ ప్రతి రోజు 3 ఆయతులు కంఠస్తం చేయుట.
ఇన్షా అల్లాహ్ 8 సంవత్సరాల్లో పూర్తి ఖుర్ఆన్ కంఠస్తం.
అనుభవ పూర్వకమైన విషయం.
4- నమాజు కొరకు నిరీక్షిస్తున్న వ్యవధిలో ప్రతి రోజు 1 ¼ పేజి కంఠస్తం
సుమారు పదహారు మాసాల్లో పూర్తి ఖుర్ఆన్ కంఠస్తం అవుతుంది. ఇన్షాఅల్లాహ్!
604 ÷ 1¼ పేజి = 483.2 రోజులు 483.2 ÷ 30 రో. = 16 నెలల 10 రో.
5- నమాజు కొరకు నిరీక్షిస్తున్న వ్యవధిలో ప్రతి రోజు రెండు పేజిలు కంఠస్తం
సుమారు 10 నెలల్లో పూర్తి ఖుర్ఆన్ కంఠస్తం ఇన్షాఅల్లాహ్
604 ÷ 2 = 302 రోజులు = పది నెలలు.
6- మూడు సార్లు సూరె ఇఖ్లాస్ పారాయణం
పూర్తి ఖుర్ఆన్ పారాయణం చేసినంత పుణ్యం
అబూ సఈద్ ఖుద్రీ ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా ఒక రాత్రిలో మూడోవంతు ఖుర్ఆన్ చదవలేడా? అని ప్రవక్త ﷺ ప్రశ్నించారు. ఇది వారికి కష్టంగా ఏర్పడి ‘ఎవరు చదవగలుగుతారు ప్రవక్తా? అని చెప్పారు, అప్పుడు ప్రవక్త “అల్లాహుల్ వాహిదుస్సమద్ (సూరె ఇఖ్లాస్) మూడోవంతు ఖుర్ఆన్ కు సమానం” అని చెప్పారు. (బుఖారిః ఫజాఇలుల్ ఖుర్ఆన్/ ఫజ్లు ఖుల్ హువల్లాహు అహద్ 4628. ముస్లిం 1344).
ప్రవక్త ﷺ ఉపదేశిం-చారని అబూ హురైర ఉల్లేఖించారుః “ఖుర్ఆనులో 30 ఆయతుల ఒక సూర ఉంది. (దాన్ని చదివిన వారి పట్ల) అది సిఫారసు చేస్తే దాని సిఫారసు అంగీకరింపబడుతుంది. అది తబారకల్లజీ బియదిహిల్ ముల్క్ (సూర ముల్క్). (తిర్మిజిః ఫజాఇలుల్ ఖుర్ఆన్/ ఫజ్లు సూరతిల్ ముల్క్. 2816).
ఇప్పటికీ మనము పుణ్యాల వనంలోనే ఉన్నాము. నాతో పాటు మీరు కూడా ఖుర్ఆన్ పారాయణం యొక్క ఈ గొప్ప ఘనతపై శ్రద్ధ వహించండి.
عن عَبْدِ الله بْنِ مَسْعُودٍ ÷ يَقُولُ: قَالَ رَسُولُ الله ﷺ: (مَنْ قَرَأَ حَرْفًا مِنْ كِتَابِ الله فَلَهُ بِهِ حَسَنَةٌ وَالْـحَسَنَةُ بِعَشْرِ أَمْثَالِهَا لَا أَقُولُ الم حَرْفٌ وَلَكِنْ أَلِفٌ حَرْفٌ وَلَامٌ حَرْفٌ وَمِيمٌ حَرْفٌ).
అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ ఉల్లేఖించారు ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారుః “దివ్యగ్రంథంలోని ఒక అక్షరం చదివినవానికి ఒక పుణ్యం, ఆ ఒక పుణ్యం పది రెట్లు ఎక్కువగా లభించును. అలిఫ్, లామ్, మీమ్ ను ఒక అక్షరం అనడం లేదు. అలిఫ్ ఒక అక్షరం, లాం ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం. (తిర్మిజి 2835).
ఖుర్ఆనులోని అతి చిన్న సూరా ద్వారా దీని ఉదాహరణ చూడండిః
సూర కౌసర్ యొక్క అక్షరాలు 42.
ఒక పుణ్యం పది రెట్లు ఉంటుంది. ఇలా 42×10=420 అవుతాయి.
ఖుర్ఆనులోని అతి చిన్న సూరా కౌసర్ యొక్క ఘనతను గ్రహించు, ఇక నమాజు కొరకు నిరీక్షిస్తున్న సమయంలో నీవు చాలా పేజీలు చదివినప్పుడు నీకు ఎన్ని పుణ్యాలు లభిస్తాయో యోచించు?
(ఆ) అజ్ కార్ (అల్లాహ్ స్మరణ)
జిక్ర్
ఘనత/ పుణ్యం
నిదర్శనం
1- 100 సార్లు సుబ్ హానల్లాహ్
1000 పుణ్యాలు లేదా 1000 పాపాల మన్నింపు
సఅద్ తెలిపారుః మేము ప్రవక్త ﷺసన్నిధిలో ఉండగా ఆయన ఇలా ప్రశ్నించారుః ప్రతి రోజు వెయ్యి పుణ్యాలు సంపా దించడం మీలోనెవరితోనైనా కాని పనియా? అచ్చట కూర్చున్నవారిలో ఒకరన్నారుః మాలో ఎవడైనా వెయ్యి పుణ్యాలు ఎలా సంపాదించగల డు? దానికి ప్రవక్త ﷺ ఇలా సమాధానమిచ్చారుః “100 సార్లు సుబ్ హానల్లాహ్ చదవాలి. దానికి బదులు అతనికి వెయ్యి పుణ్యాలు లిఖించబడతాయి, లేదా వెయ్యి పాపాలు మన్నించబడతాయి”.
2- లా ఇలాహ ఇల్ల ల్లాహు వహ్ దహూ లా షరీక లహూ ల హుల్ ముల్కు వల హుల్ హందు వహు వ అలా కుల్లి షైఇన్ కదీర్. 100 సార్లు.
పది బానిసలను విడుదల చేసినంత పుణ్యం + 100 పుణ్యాలు + 100 పాపాల మన్నింపు + షైతాన్ నుండి రక్షణ.
ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ హురైరా ఉల్లేఖిం చారుః “ఎవరైతే ఒక రోజులో 100 సార్లు “లా ఇలాహ ఇల్ల ల్లాహు వహ్ దహూ లా షరీ క లహూ లహుల్ ముల్కు వ లహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్” పఠిస్తాడో, అతనికి పది బానిసల్ని విడుదల చేసిన పుణ్యం ప్రాప్తమవుతుంది. 100 పుణ్యాలు లిఖించబడతాయి. 100 పాపాలు మన్నించబడతాయి. అతనికి సాయంకాలం వరకు షైతాన్ నుండి రక్షణ ఉంటుంది. ఈ వచనాలను వందకు పైగా పఠించేవాడి ఆచరణ తప్ప మరెవరి ఆచరణా ఇతని ఆచరణ కంటే శ్రేష్ఠమైనది కాదు.
3- లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్
స్వర్గ కోశాల్లో ఒకటి
ప్రవక్త ﷺ ఇలా ఉప దేశించారని అబూ మూసా అష్అరీ ఉల్లేఖించారుః స్వర్గ కోశాల్లోని ఒక కోశం గురించి నీకు తెలుపనా? అని. తప్పక తెలుపండి ప్రవక్తా! అని నేను విన్నవించు కున్నాను. అప్పుడు చెప్పారుః “లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్”.
4- సుబ్ హా నల్లాహిల్ అజీం వ బి హందిహి
ఒక్క ఖర్జూ రపు చెట్టు స్వర్గంలో నాట బడు తుంది
ప్రవక్త ﷺ ఆదేశం: “ఎవరు సుబ్ హానల్లా హిల్ అజీం వ బిహందిహీ” అంటారో వారి కొరకు స్వర్గంలో ఒక ఖర్జూరపు చెట్టు నాట బడుతుంది.
5- విశ్వాసులైన స్త్రీ పురు షుల మన్నింపు కొరకు అల్లాహ్ ను కోరడం
ప్రతి విశ్వాస స్త్రీ పురుషునికి బదు లుగా ఒక పుణ్యం
ప్రవక్త ﷺ ఇలా ఆదే శించారుః “ఎవరు విశ్వాస స్త్రీ పురుషుల మన్నింపు కొరకు అల్లాహ్ ను వేడుకుంటారో వారికి ప్రతి విశ్వాస స్త్రీ పురుషునికి బదులు ఒక పుణ్యం లభిస్తుంది.” [ముస్లిం 2698. బుఖారీ 6403. ముస్లిం 2691. బుఖారీ 6409, ముస్లిం 2704. తిర్మిజి 3464. తబ్రానీ, సహీహుల్ జామి 6026.]
ఒక ముస్లిం ముఖ్యంగా నమాజు కొరకు నిరీక్షిస్తున్న వ్యక్తి ఈ అమూల్యమైన సమయాన్ని ఈ శ్రేష్ఠ స్థలం (మస్జిద్)లో పై అజ్ కార్ చదవడంలో గడపడాన్ని అదృష్టంగా భావించాలి. తద్వారా అనేక పుణ్యాలు లభించవచ్చు.
13 – పంక్తులు సక్రమంగా ఉంచుట
నమాజు చేయుటకు పంక్తులను సరి చేసుకొనుట విధిగా ఉంది. దీని ఘనతలు చాలా ఉన్నాయి.
నౌమాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః “మీరు మీ పంక్తులను సక్రమంగా ఉంచుకోండి. అలా చేయకపోతే అల్లాహ్ మీ ముఖాలను పరస్పరం వ్యతిరేకంగా మార్చివేస్తాడు”. (బుఖారి 717, ముస్లిం 436).
ఇమాం నవవీ ఇలా చెప్పారుః ‘మీ మధ్య విరోధ ద్వేషాలను నాటుతాడు. మీ హృదయాలను పరస్పరం వ్యతిరేకంగా మార్చివేస్తాడు‘.
ఇక పంక్తులను సరి చేయకపోవడం ఎంత పాపమో, ప్రవక్త సంప్ర దాయానికి విరుద్దమో తెలియనిది కాదు.
(ఆ) పంక్తులను సక్రమంగా ఉంచడం నమాజు పరిపూర్ణతలో ఒక భాగం:
ప్రవక్త ﷺ ఉపదేశించారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ ఉల్లేఖించారుః “….. పంక్తులను కలిపి ఉంచినవారితో అల్లాహ్ కలిసి ఉంటాడు. పంక్తు లను తెంచేవారితో అల్లాహ్ కలిసి ఉండడు”. (అబూ దావూద్ 666).
నమాజులోని మొదటి నిధి సారాంశం
కర్మ
ఫలితం
1- వుజూ
1) అల్లాహ్ యొక్క ప్రేమ 2) వుజూ నీళ్ళతో పాపాల తొలగింపు 3) ప్రళయదినాన వుజూ అవయవాలు ప్రకాశించటం 4) పాపాల తుడిచివేత మరియు ఉన్నత స్థానం 5) పాపాల మన్నింపు మరియు స్వర్గ ప్రవేశం
2- వుజూ తర్వాత దుఆ
(1) స్వర్గపు ఎనిమిది ద్వారాల్లో ఇష్టమున్న ద్వారము గుండా ప్రవేశించే స్వేచ్ఛ (2) తోలుకాగితంలో పేరు వ్రాయబడి దానిపై ముద్ర వేయబడుతుంది. అది ప్రళయకాలం వరకు తీయబడదు
3- మిస్వాక్
నోటి శుభ్రత, అల్లాహ్ సంతుష్టి
4) నమాజు కొరకు శీఘ్రముగా వెళ్ళుట
1) గొప్ప ఘనత, శుభము మరియు మేలు 2) ఏలాంటి నీడ లభించని ప్రళయదినాన అల్లాహ్ నీడలో ఆశ్రయం (మస్జిద్లో మనసు నిలిపినతనికి) 3) ప్రతి అడుగుకు బదులు సంవత్సరపు ఉపవాసాలు మరియు తహజ్జుద్ పుణ్యం( జుమా)
5- అజాన్ జవాబు
స్వర్గ ప్రవేశం
6- అజాన్ తర్వాత దుఆ
1) పాపాల ప్రక్షాళనం 2) ప్రళయదినాన ప్రవక్త సిఫారసు
7- నమాజు కొరకు నడచి వెళ్ళటం
1) స్వర్గంలో ఆతిథ్యం 3) గొప్ప పుణ్యం 2) పాపాల తుడిచివేత, ఉన్నత స్థానం 4) ప్రళయదినాన పూర్తి కాంతి 5) పాపాల తుడిచివేత 6) ప్రతి అడుగుపై ఒక సదకా
8- మొదటి పంక్తి, కుడి పంక్తి
1) దైవతూతల పోలిక 2) మంచితనం 3) అల్లాహ్, ఆయన దూతల దీవెనలు 4) వెనక ఉండేవారికివ్వబడిన శాపం నుండి దూరం
9- సున్నతె ముఅక్కద
1) స్వర్గంలో ఒక గృహం 2) అస్ర్ కు ముందు నాలుగు రకాతుల పై అల్లాహ్ కరుణ
10- అజాన్, ఇఖామత్ మధ్యలో దుఆ
దుఆ అంగీకరించబడుతుంది
11- నమాజుకై వేచి ఉండటం
1) నమాజు ఘనతకు సమానం 2) అల్లాహ్ దూతల ఇస్తిగ్ఫార్ 3) పాపాల మన్నింపు, ఉన్నత స్థానం
12- ఖుర్ఆన్ పారాయణం మరియు అజ్ కార్
1) సంపూర్ణ ఖుర్ఆన్ పారాయణం 2) ఖుర్ఆన్ కంఠస్తం 3) గొప్ప పుణ్యాలు 1) వెయ్యి పుణ్యాలు, వెయ్యి పాపాల మన్నింపు 2) పది బానిసల విడుదల పుణ్యం + 100 పుణ్యాలు + 100 పాపాల మన్నింపు + షైతాన్ నుండి రక్షణ. 3) స్వర్గ కోశాల్లో ఒకటి. 4) స్వర్గంలో ఒక చెట్టు
13- పంక్తులను తీర్చిదిద్దటం
1) మనసుల మరియు ఉద్దేశాల ఐక్యత 2) నమాజు పరిపూర్ణత 3) షైతాన్ని ఇరకాటంలో పడవేయటం 4) పంక్తులను కలిపేవారితో అల్లాహ్ కలిసి ఉంటాడు
రెండవ నిధి (నిక్షేపం): నమాజు చేయటం
నమాజును నిర్ణీత పద్ధతిలో నెరవేరుస్తూ మనం ఈ అమూల్యమైన నిధిని పొందవచ్చు. దీనికి అర్హులయ్యే మార్గం క్రింది విధంగా ఉందిః
1 – నమాజు ఘనత
సామాన్యంగా నమాజు ఘనత చాలా ఉంది. దానితో పాటు ప్రత్యేక నమాజులకు ప్రత్యేక ఘనతలు కూడా ఉన్నాయి. ఉదాః ఫజ్ర్ నమాజు ఘనత, అస్ర్ నమాజు ఘనత, ఇషా నమాజు ఘనత…… దిగువ దీనినే సంక్షిప్తంగా తెలుపుతున్నాము.
నమాజుల సామాన్య ఘనత
దివ్య ఖుర్ఆన్ మరియు ప్రవక్త హదీసుల ద్వారా నమాజు నిక్షేపాలు స్పష్టమై ఉన్నాయి, వాటిని అదృష్టంగా భావించడం, వాటిని సక్రమంగా నెరవేర్చే పూర్తి ప్రయత్నం చేయడం ద్వారా మన పుణ్యాల బ్యాలెన్సును పెంచుకోవచ్చు.
(అ) ఉన్నత స్థానాలు, తప్పుల మన్నింపు, శ్రేష్ఠమైన ఆహారం
{ఎవరు నమాజును స్థాపిస్తారో, వారికి మేమిచ్చిన దాని నుండి (మా మార్గంలో) ఖర్చు పెడతారో అటువంటి వారే నిజమైన విశ్వాసులు. వారి కొరకు వారి ప్రభువు వద్ద ఉన్నత స్థానాలు ఉన్నాయి. తప్పులకు మన్నింపు ఉంది. శ్రేష్ఠమైన ఆహారం ఉంది}. (అన్ఫాల్ 8: 3,4).
{నీ కుటుంబ సభ్యులను నమాజు చెయ్యండి అని ఆజ్ఞాపించు. స్వయంగా నీవు కూడా దానిని పాటించు. మేము నీ నుండి ఉపాధినేమీ కోరడం లేదు. ఉపాధిని మేమే నీకు ఇస్తూ ఉన్నాము. చివరకు మేలు జరిగేది భయభక్తులకే}. (తాహా 20: 132).
(ఆ) తప్పుల ప్రక్షాళనం, పాపాల తుడిచివేత
{నమాజును స్థాపించు, పగటి యొక్క సరిహద్దు సమయాలలోనూ, కొంత రాత్రి గడచిన తరువాతనూ, వాస్తవానికి సత్కార్యాలు దుష్కా ర్యాలను దూరం చేస్తాయి. హితవుగోరే వారికి ఇది ఒక హితబోధ}. (హూద్ 11: 114).
ఒక సారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరుల ముందు ఇలా ప్రశ్న వేశారుః “మీలో ఒక వ్యక్తి ఇంటి ముందు ఒక కాలువ ప్రవహిస్తూ ఉండి, అతనా కాలువలో ప్రతి రోజు అయిదు సార్లు స్నానం చేస్తూ ఉంటే, ఇక అతని శరీరం మీద మలినం ఉంటుందా? ‘అతని శరీరం మీద ఎలాంటి మలినం మిగిలి ఉండదు’ అని వారు చెప్పారు, అప్పుడు ప్రవక్త ఇలా బోధించారుః “ఐదు వేళలా నమాజు చేయడం కూడా అంతే. వీటి ద్వారా అల్లాహ్ (ఐదు నమాజులను పాటించే దాసుని) పాపాలను తుడిచివేస్తాడు.” (బుఖారీ 528, ముస్లిం 667).
“ఐదు పూటలా చేసే నమాజులు, ఒక జుమా నుండి మరో జుమా వరకు, రమజాను నుండి మరో రమజాను వరకు ఆ మధ్యలో జరిగిన పాపాలకు అవి పరిహారం అవుతాయి. అయితే పెద్ద పాపాల నుండి దూరంగా ఉండుట తప్పనిసరి.” అని ప్రవక్త ﷺ చెప్పారని అబూ హురైరా ఉల్లేఖించారు. (ముస్లిం 233).
(ఇ) కారుణ్యం
{నమాజును స్థాపించండి, జకాత్ ఇవ్వండి, అల్లాహ్ ప్రవక్తకు విధేయులుగా ఉండండి. అప్పుడు మీరు కరుణింపబడుతారని ఆశించవచ్చు}. (నూర్ 24: 56).
(ఈ) జన్నతుల్ ఫిర్ దౌస్ లో ప్రవేశం
{వారు తమ నమాజులను శ్రద్ధగా కాపాడుకునే వారు, వారే స్వర్గాన్ని వరసత్వంగా పొందేవారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు}. (మూమినూన్ 23: 9-11).
{తమ నమాజును కాపాడుకునేవారు, ఇలాంటి వారే సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు}. (మఆరిజ్ 70: 34,35).
ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ మాలిక్ హారిస్ బిన్ ఆసిం అల్ అష్అరీ ఉల్లేఖించారుః “నమాజు నూర్, సదకా నిదర్శనం, సహనం ప్రకాశం మరియు ఖుర్ఆన్ నీకు అనుకూలంగా లేక ప్రతికూలంగా సాక్షి. ప్రతి మానవుడు ఉదయం లేచి తన ఆత్మను విక్రయిస్తాడు, అయితే అల్లాహ్ దాన్ని (శిక్ష నుండి విముక్తి కలిగిస్తాడు) లేదా (కారుణ్యానికి దూరముంచి) నష్టపరుస్తాడు. (ముస్లిం 223).
నమాజు సామాన్యంగా ఒక నూర్ గనక ఇది భక్తిపరులకు కంటి చలువ కూడాను. ఇదే విషయం ప్రవక్త ﷺ ఇలా చెప్పారుః “నమాజు నా కళ్ళకు చల్లదనంగా చేయబడింది”. (నిసాయి 3940, ముస్నద్ అహ్మద్ 3/285).
ప్రత్యేక నమాజుల ఘనత
1) ఫజ్ర్, అస్ర్ నమాజుల ఘనత
(అ) పగలు దూతలు, రాత్రి దూతలు అందులో హాజరవుతారు
{ప్రాతఃకాలంలో ఖుర్ఆన్ పారాయణం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించు. ఎందుకంటే ప్రాతఃకాలపు ఖుర్ఆన్ పారాయణం సాక్ష్యంగా ఉంటుంది}. (బనీ ఇస్రాఈల్ 17: 78).
ఖుర్ఆను వ్యాఖ్యానకర్తలు దీని వ్యాఖ్యానం ఇలా చెప్పారుః ప్రాతఃకాలపు ఖుర్ఆన్ పారాయణం అంటే ఫజ్ర్ నమాజులోని పారాయణం, అందులో పగటి మరియు రాత్రి పూట దైవదూతలు హాజరవుతారు, దానికి వారు సాక్ష్యంగా ఉంటారు. (బుఖారి 649, ముస్లిం 649).
“మీ దగ్గరకు రాత్రి దైవదూతలు, పగటి దైవదూతలు ఒకరి వెనుక మరొకరు వస్తారు. ఈ రెండు బృందాలు ఫజ్ర్, అస్ర్, నమాజులలో మాత్రం కలుస్తారు. రాత్రంతా మీతోపాటు గడిపిన దైవదూతలు తిరిగి ఆకాశానికి వెళ్ళినప్పుడు -ఇదంతా మీ ప్రభువు గుర్తెరిగి ఉంటాడు- అయినా వారినుద్దేశించి “మీరు నా దాసులను ఏ స్థితిలో వదలిపెట్టి వచ్చారని” అడుగుతాడు. దానికి దైవదూతలు మేము వారి దగ్గర్నుంచి బయలుదేరేటప్పుడు వారు నమాజు చేస్తుండటం కనిపించింది. అంతకు ముందు మేము వారి దగ్గరకు చేరుకున్నప్పుడు కూడా వారిని నమాజు స్థితిలో చూశాము” అని సమాధానమిస్తారు అని ప్రవక్త ﷺ తెలుపుతుండగా నేను విన్నానని అబూహూరైరా ఉల్లేఖించారు. (బుఖారీ 555, ముస్లిం 632).
ప్రవక్త ﷺ ఇలా ఆదేశించారని అబూ మూసా ఉల్లేఖించారుః “రెండు చల్లని వేళల్లోని నమాజు పాటించేవారు స్వర్గంలో చేరుతారు”. (బుఖారీ 574, ముస్లిం 635). చల్లని వేళలంటే ఫజ్ర్ మరియు అస్ర్.
ప్రవక్త సెలవియ్యగా నేను విన్నానని అబూ జుహైర్ ఉమార బిన్ రుఐబ ఉల్లేఖించారుః “సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి ముందు గల నమాజులను పాటించినతను నరకంలో ప్రవేశించడు”. (ముస్లిం 634). అంటే ఫజ్ర్, అస్ర్.
ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారని జుందుబ్ బిన్ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఫజ్ర్ నమాజు చదివినవారు అల్లాహ్ రక్షణలో ఉంటారు. అయితే ఓ మానవుడా! అల్లాహ్ తన రక్షణలో ఉంచిన దాని గురించి నిన్ను మందలించకుండా ఉండటానికి జాగ్రత్తగా ఉండు”. (ముస్నద్ అహ్మద్ 4/313, ముస్లిం 657).
జరీర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః మేము ఒకసారి దైవప్రవక్త ﷺ వద్ద కూర్చొని ఉండగా ప్రవక్త ﷺ పున్నమి చంద్రుడ్ని చూసి మాతో ఇలా అన్నారుః “ఇప్పుడు మీరు చంద్రుడ్ని ఎలా స్పష్టంగా చూస్తున్నారో అదే విధంగా త్వరలోనే మీరు (ప్రళయదినాన) మీ ప్రభువుని చూస్తారు. ఆయన్ని దర్శించడంలో మీ ముందు ఎలాంటి అడ్డంకి ఉండదు. అందువల్ల మీరు సూర్యోదయానికి పూర్వం చేయవ లసిన (ఫజ్ర్) నమాజును, సూర్యాస్తమయానికి పూర్వం చేయవలసిన (అస్ర్) నమాజును చేయడంలో వీలయినంత వరకు మీ ముందు ఎలాంటి ఆటంకం ఏర్పడ కుండా ఉండేలా కృషి చేయండి (అశ్రద్ధ, అలసత్వాలకు ఏ మాత్రం తావీయకండి)”. (బుఖారీ 7434, ముస్లిం 633).
నేను ప్రవక్త ﷺ చెప్పగా విన్నానని ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరైతే ఇషా నమాజ్ సామూహికంగా పాటించారో వారికి అర్థ రాత్రి తహజ్జుద్ చేసినంత పుణ్యం, మరెవరైతే ఫజ్ర్ నమాజ్ సామూహికంగా చేశారో వారికి రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం లభిస్తుంది”. (ముస్లిం 656).
2 -సామూహిక నమాజు ఘనత
నమాజు సామూహికంగా చదవడంలో చాలా పుణ్యముంది. ఈ ఆచరణ ప్రవక్త ﷺ ద్వారా రుజువైనది. మీరు సయితం ఈ హదీసుపై శ్రద్ధ వహించండిః
ప్రవక్త ﷺ ఇలా శుభవార్తిచ్చినట్లు అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ ఉల్లేఖించారుః “వ్యక్తిగతంగా చేసే నమాజుకన్నా సామూహికంగా చేసే నమాజు ఇరవై ఏడు రెట్లు శ్రేష్ఠమైనది”. (బుఖారీ 645, ముస్లిం 650). ఒక పుణ్యం పది రెట్లు ఎక్కువగా లభిస్తుంది గనక సామూహిక నమాజు పుణ్యం 27×10=270 ఉంటుంది.
3 – ఖుషూఅ (అణకువ, వినమ్రత)
ఖుషూఅనమాజుకు ప్రాణం లాంటిది, పుణ్యాల రెట్టింపు దానిపై ఆధారపడియుంది. దానికి సంబంధించిన కొన్ని లాభాలను క్రింద పేర్కొంటున్నాము గమనించండిః
(అ) సాఫల్యం (జన్నతుల్ ఫిర్ దౌసులో ప్రవేశ సాఫల్యం, నరకం నుండి విముక్తి)
{నిశ్చయంగా సాఫల్యం పొందే విశ్వాసులు తమ నమాజులో వినమ్రతను పాటిస్తారు, వ్యర్థ విషయాల జోలికి పోరు. …… వారే స్వర్గాన్ని వారసత్వంగా పొందేవారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు}. (మూమినూన్ 23: 1-3, 9-11).
ప్రవక్త ﷺ తెలిపారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “అల్లాహ్ యొక్క అర్ష్ (సింహాసన) నీడ తప్ప మరెలాంటి నీడా లభించని (ప్రళయ)దినాన అల్లాహ్ ఏడు గుణాలవారిని తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. వారిలో ఒకడుః ఏకాంతములో అల్లాహ్ ను తలచుకొని కంట తడి పెట్టే వ్యక్తి”. (బుఖారీ 660, ముస్లిం 1031).
ఈ హదీసు నిదర్శనంగా ఎలా నిలిచిదంటే, నమాజులో ఖుషూఅ పాటించు వ్యక్తి ఇతర సందర్భాల కంటే ఏకాంతములో ఉన్నప్పుడు ఎక్కువ కంటి తడపెడతాడు. ఇలా ఆ ఎడుగురిలో ఒకడు కావడానికి అర్హుడవుతాడు.
ప్రవక్త ﷺ చెప్పగా నేను విన్నానని అమ్మార్ బిన్ యాసిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఒక దాసుడు నమాజు చేస్తాడు కాని అతనికి తన నమాజు యొక్క పదవ వంతు లేక తొమ్మిదవ లేదా ఎనిమిదవ లేదా ఏడవ లేదా ఆరవ లేదా ఐదవ లేదా నాల్గవ లేదా మూడవ లేదా సగం పుణ్యము మాత్రమే వ్రాయబడుతుంది”. (ముస్నద్ అహ్మద్ 4/321 అబూ దావూద్ 796, ఇబ్ను హిబ్బాన్ ఇది సహీ అని ధృవీక రించారు). (దీని భావమేమిటంటే ఎవరిలో ఖుషూఅ ఎంత ఎక్కువ ఉంటుందో అంతే ఎక్కువ పుణ్యాలు వారికి లభిస్తాయి).
(ఉ) పాపాల మన్నింపు మరియు గొప్ప ప్రతిఫలం
అల్లాహ్ ఆదేశం సూర అహ్ జాబ్ 33: 35లో ఇలా ఉందిః
{వినమ్రత పాటించే పురుషులు మరియు స్త్రీలు}… {అల్లాహ్ వారి కొరకు క్షమాభిక్షను, గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు}.
4 -సనా
నమాజు ఆరంభములో సూరె ఫాతిహాకు ముందు తక్బీరె తహ్రీమ తర్వాత అనేక దుఆలున్నాయి. వాటిలో ఈ దుఆను నేను తెలుపు తున్నాను. “అల్లాహు అక్బరు కబీరా, వల్ హందులిల్లాహి కసీరా, వ సుబ్ హాల్లాహి బుక్రతౌఁ వఅసీలా”. దీని ఉద్దేశం దీని గొప్ప ఘనతను చాటడమే తప్ప ఈ ఒక్క దుఆయే అని తెలపడం కాదు. ఆ ఘనత ఏమిటి? దాన్ని చదివిన వారి కొరకు ఆకాశ తలుపులు తెరువబడుతాయి.
ఇబ్ను ఉమర్ (రదియల్లాహు అన్హు) తెలిపారుః మేము ప్రవక్త ﷺ తో నమాజు చేస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి “అల్లాహు అక్బరు కబీరా, వల్ హందులిల్లాహి కసీరా, వ సుబ్ హాల్లాహి బుక్రతౌఁ వఅసీలా” అని పలికాడు, (నమాజు ముగించిన తర్వాత) “ఈ పదాలు పలికిన వారెవరు?” అని ప్రవక్త ﷺ అడిగారు. నేనే ఓ ప్రవక్తా! అని అతను చెప్పగా, “నేను ఆశ్చర్య పోయాను. ఆ పదాల వల్ల ఆకాశ తలుపులు తెరువబడ్డాయి” అని ప్రవక్త ﷺ తెలిపారు. ఇబ్ను ఉమర్ ఇలా చెప్పారుః నేను ఈ విషయం ప్రవక్తతో విన్నప్పటి నుండి వాటిని పలకడం మానలేదు. (ముస్లిం 601).
5 -సూరె ఫాతిహ పారాయణం
(అ) ఖుర్ఆనులోని గొప్ప సూరా
నీవు నమాజులో సూరె ఫాతిహ చదువుతున్నప్పుడు ఖుర్ఆనులోని ఒక గొప్ప సూర చదివినవానివవుతావు. నాతో పాటు నీవు కూడా ఈ హదీసుపై శ్రద్ధ వహించుః
అబూ సఈద్ బిన్ ముఅల్లా తెలిపారుః నేను మస్జిదులో నమాజు చేస్తుండగా ప్రవక్త ﷺ నన్ను పిలిచారు, వెంటనే నేను హాజరు కాలేకపోయాను, కొంత సేపయ్యాక హజరయి, ‘ప్రవక్తా! నేను నమాజు చేస్తుంటిని’ అని విన్నవించుకోగా, {అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పిలుపుకు జవాబు పలకండి} అని అల్లాహ్ ఆదేశం తెలియదా? అని మందలించి, “నీవు మస్జిద్ నుండి బైటికి వెళ్ళక ముందే నేను నీకు ఒక సూరా నేర్పుతాను, అది ఖుర్ఆనులోని ఒక గొప్ప సూరా” అని చెప్పారు. నా చేతిని పట్టుకున్నారు. ఇక ఎప్పుడైతే మస్జిద్ నుండి మేము బైటికి వెళ్ళబోయామో, అప్పుడు నేను ‘ప్రవక్తా! ఖుర్ఆనులోని ఒక గొప్ప సూరా గురించి తెలుపుతానన్నారు కదా’ అని గుర్తు చేశాను. అప్పుడాయన ఇలా చెప్పారుః “అది ఏడు ఆయతులు గల సూరా, మాటిమాటికి పఠింపదగినది మరియు గొప్ప ఖుర్ఆను నాకు ఇవ్వబడినది”. (బుఖారీ 4474).
(ఆ) ఇది సనా (అల్లాహ్ స్తోత్రం) మరియు దుఆ
ఫాతిహ సూరా పారాయణం అల్లాహ్ మరియు ఆయన దాసుని మధ్యలో రెండు భాగాలుగా విభజించబడింది. మొదటి భాగంలో అల్లాహ్ స్తోత్రం, ఆయన మహత్తు, గొప్పతనం ఉంది. రెండవ భాగంలో దాసుని అర్ధింపు మరియు దుఆ ఉంది.
అబూ హురైరా ఉల్లేఖించారుః అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త ﷺ చెప్పారుః “నమాజు (సూరె ఫాతిహా)ను నేను నా మధ్య మరియు నా దాసుని మధ్య రెండు భాగాలుగా జేశాను. నా దాసుడు అర్థించినది అతనికి ప్రాప్తమవుతుంది. అతడు {అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆల మీన్} అన్నప్పుడు, నా దాసుడు నన్ను స్తుతించాడు అని అల్లాహ్ అంటాడు. అతడు {అర్రహ్మానిర్రహీం} అన్నప్పుడు, నా దాసుడు నన్ను ప్రశంసించాడు అని అల్లాహ్ అంటాడు. అతడు {మాలికి యౌమిద్దీన్} అన్నప్పుడు, నా దాసుడు నా గొప్పతనాన్ని చాటాడు అని అల్లాహ్ అంటాడు. అతడు {ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్} అన్న ప్పుడు, ఇది నా మధ్య మరియు నా దాసుని మధ్య ఉన్న సంబంధం, ఇక నా దాసుడు ఏది అడిగినా అతనికి ప్రాప్తమవుతుంది. అతడు {ఇహ్దినస్సిరాతల్ ముస్తఖీం, సిరాతల్లజీన అన్అమ్ త అలైహిం గైరిల్ మగ్ జూబి అలైహిం వలజ్జాల్లీన్} అన్నప్పుడు, ఇది నా దాసుడు అడిగింది, అతడు కోరినది అతనకి ప్రాప్తమవుతుంది అని అల్లాహ్ అంటాడు”. (ముస్లిం 395).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ఉపదేశించారని అమర్ బిన్ అంబస రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అతను (ముస్లిం వ్యక్తి) నమాజు చేయుటకు నిలబడి అల్లాహ్ స్తోత్రము, ప్రశంసలు పఠించి, తగిన రీతిలో ఆయన గొప్పతనాన్ని చాటుతూ, తన హృదయంలో అల్లాహ్ తప్ప మరే ధ్యానం లేకుండా ఉంచుకుంటే తన తల్లి గర్భం నుండి పుట్టినప్పటి స్థితిలో అతను పాపాల నుండి దూరమవుతాడు”. (ముస్లిం 832).
6 -ఆమీన్ పలకడం
నమాజీ సోదరా! శుభవార్త!! ఎవరి ఆమీన్ అల్లాహ్ దూతల ఆమీన్ తో కలిసిపోవునో అతని పూర్వ పాపాలు క్షమించబడతాయి.
ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “(నమాజులో) ఇమాం గైరిల్ మగ్జూబి అలైహిం వలజ్జాల్లీన్ అని అన్నప్పుడు మీరంతా ఆమీన్ అని చెప్పండి, మీరు చెప్పే ఆమీన్ అల్లాహ్ దూతలు చెప్పే ఆమీన్ కు అనుగుణంగా ఉంటే ఆమీన్ చెప్పే వ్యక్తి పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 782, ముస్లిం 410).
ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా ఆమీన్ అని పలకగా, ఆకాశంలో దైవదూతలు కూడా ఆమీన్ అన్నప్పడు ఇలా ఇవి రెండు కలిసిపోతాయి. తద్వారా ఆమీన్ అన్న వ్యక్తి పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 781).
ప్రవక్త ﷺ ఉపదేశించారని ఇబ్ను ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మనిషి నమాజు కొరకు లేచినప్పుడు అతని పాపాలు అతని తల మరియు భుజాలపై వేయబడతాయి, అతను రుకూ, సజ్దాలు చేసినపుడల్లా అవి రాలిపోతాయి”. (బైహఖీ 3/10, సహీహుల్ జామిఅ 1671).
8 -రుకూ నుండి నిలబడిన తర్వాత దుఆలు
రుకూ తర్వాత దుఆల ఘనత గొప్పది, పుణ్యం పెద్దది.
(అ) ఎవరి ‘అల్లాహుమ్మ రబ్బనా లకల్ హందు / రబ్బనా వలకల్ హంద్’ పలుకులు దైవదూతల పలుకులతో కలిసిపోవునో అతని పాపాలు క్షమించబడును
ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఇమాం నమాజులో ‘సమిఅల్లాహు లిమన్ హమిదహ్’ అన్నపుడు మీరు ‘అల్లాహుమ్మ రబ్బనా లకల్ హంద్’ అనండి, ఎవరి ఈ మాట అల్లాహ్ దూతల మాటకు అనుగుణంగా ఉంటుందో అతని పూర్వ పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 796, ముస్లిం 409). మరో ఉల్లేఖనంలో ‘రబ్బనా వలకల్ హంద్’ అనండి అని ఉంది.
(ఆ) ‘రబ్బనా వ లకల్ హందు హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్’ పదాలను వ్రాయడానికి అల్లాహ్ దూతలు ఒకరిని మించి ఒకరు ముందుకు వెళ్తుంటారు.
రిఫాఅ బిన్ రాఫిఅ అజ్జర్ఖి తెలిపారుః ప్రవక్త వెనక మేము నమాజు చేస్తూ ఉన్నాము, రుకూ నుండి తల లేపుతూ ప్రవక్త ‘సమిఅల్లాహు లిమన్ హమిదహ్’ అన్నారు, వెనక ఒక మనిషి ‘రబ్బనా వలకల్ హందు హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్’ అని అన్నాడు, ప్రవక్త నమాజు ముగించాక, “నమాజులో ఈ పదాలు పలికినవారెవరు?” అని అడిగారు. ‘నేను’ అని ఆ మనిషి అన్నాడు, అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారుః “నేను ముప్ఫై (30) కి పైగా అల్లాహ్ దూతలను చూశాను, ప్రతి ఒక్కరు తానే ముందుగా ఈ పదాలను వ్రాయాలని ఆరాట పడుతున్నాడు”. (బుఖారీ 799).
9 – సజ్దాలు
సజ్దా నమాజులోని అతి గొప్ప భాగం, అందులో అల్లాహ్ కొరకు నమ్రత, సమర్పణ సంపూర్ణ రీతిలో పాటించబడుతుంది. అందుకే అనేక పుణ్యాలు, ఉత్తమ ఫలితాలు సజ్దా విషయంలో చెప్పబడ్డాయి. ఈ గొప్ప పుణ్యాన్ని గమనించండి.
(అ) సాఫల్యం (నరకం నుండి రక్షణ, స్వర్గ ప్రవేశ సఫలత)
అల్లాహ్ ఆదేశం: {విశ్వాసులారా! రుకూ చేయండి, సజ్దా చేయండి, మీ ప్రభువుకు దాస్యం చేయండి, మంచి పనులు చేయండి, దీని ద్వారానే మీకు సాఫల్య భాగ్యం లభించవచ్చును}. (హజ్ 22: 77).
{లఅల్లకుం తుఫ్లిహూన్} వ్యాఖ్వానంలో అబూ బక్ర్ అల్ జజాయిరీ ఇలా చెప్పారుః ‘అంటే నరకం నుండి రక్షణ పొంది స్వర్గ ప్రవేశ ప్రాప్తమే గొప్ప సాఫల్యం’. (ఐసరుత్తఫాసీర్ లికలామిల్ అలియ్యిల్ కదీర్).
(ఆ) ప్రళయదినాన అల్లాహ్ దయానుగ్రహాలు, ఆయన సంతోషం మరియు కాంతి లభిస్తాయి
{ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త, ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులుగా ఉంటారు, పరస్పరం కరుణామయులుగా ఉంటారు. నీవు వారిని చూసినప్పుడు, వారు రుకూ సజ్దాలలో, అల్లాహ్ అనుగ్రహాన్నీ ఆయన ప్రసన్నతనూ అర్థించటంలో నిమగ్నులై ఉండటం కనిపిస్తుంది. సజ్దాల సూచనలు వారి ముఖాలపై ఉంటాయి. వాటి వల్ల వారు ప్రత్యేకంగా గుర్తించ బడతారు}. (ఫత్ హ్ 48: 29).
{సజ్దాల సూచనలు వారి ముఖాలపై ఉంటాయి} యొక్క వ్యాఖ్యానం లో సఅదీ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారుః ‘అధికంగా మరియు మంచిరీతిలో చేసిన దాస్యం (ఇబాదత్) ప్రభావం వారి ముఖాలపై పడింది. చివరికి వారి నమాజుల వల్ల వారి బాహ్యం మెరిసినట్లు వారి ఆంతర్యం సయితం కాంతివంతమైంది. (తైసీరుల్ కరీమిర్రహ్మాన్ ఫీ తఫ్సీరి కలామిల్ మన్నాన్)
(ఇ) స్థానం రెట్టింపు, పాపం మన్నింపు
فَقَالَ النَّبِي صلى الله عليه وسلم: (عَلَيْكَ بِكَثْرَةِ السُّجُودِ لِله فَإِنَّكَ لَا تَسْجُدُ لِله سَجْدَةً إِلَّا رَفَعَكَ اللهُ بِهَا دَرَجَةً وَحَطَّ عَنْكَ بِهَا خَطِيئَةً).
ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారుః “నీవు ఎక్కువగా సజ్దాలు చేయి, నీవు సజ్దా చేసినపుడల్లా నీ ప్రతి సజ్దాకు బదులుగా అల్లాహ్ నీ కొరకు ఒక స్థానం పెంచుతాడు, పాపం మన్నిస్తాడు”. (ముస్లిం 488).
(ఈ) ప్రవక్త సామీప్యం
రబీఅ బిన్ కఅబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః నేను వుజూ నీళ్ళు, మరేదైనా అవసరమున్నవి అందించుటకు ప్రవక్త ﷺ వద్దనే రాత్రి గడపేవాణ్ణి. అయితే ఒకసారి ప్రవక్త ﷺ “అడుగు (నీకిష్టమున్నది అడుగు)” అని అన్నారు. ‘నేను స్వర్గంలో మీ సామీప్యం కోరుతున్నాను’ అని అన్నాను, ఇంకేదైనా? అని ప్రవక్త అడిగాడు, ‘కేవలం అది మాత్రమే’ అని నేన న్నాను. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారుః “నీ స్వప్రయోజనం కోసం నీవు అధిక సజ్దాలు (నమాజులు) చేసి నాకు సహాయపడు”. (ముస్లిం 489).
(ఉ) దుఆ స్వీకారానికి తగిన సమయం
ప్రవక్త ﷺ ప్రబోధించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు)ఉల్లేఖించారుః “దాసుడు తన ప్రభువుకు అతి చేరువుగా ఉండేది సజ్దా స్థితిలో, గనక అందులో ఎక్కువగా దుఆ చేయండి”. (ముస్లిం 482).
మరో ఉల్లేఖనంలో ఆయన ﷺ ఇలా చెప్పారుః “సజ్దాలో దుఆ ఎక్కువగా చేయండి, అది స్వీకారయోగ్యమవుతుందన్న నమ్మకం ఈ స్థితిలో ఎక్కువగా ఉంటుంది”. (ముస్లిం 479).
(ఊ) పాపాల ప్రక్షాళన
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః “మనిషి నమాజు చేయుటకు లేచినప్పుడు అతని పాపాలు అతని తల మరియు భుజాలపై వేయబడతాయి, అతను రుకూ, సజ్దాలు చేసినపుడల్లా అవి రాలిపోతాయి”. (బైహఖీ 3/10, సహీహుల్ జామిఅ 1671).
(క) సజ్దా అంగమును నరకాగ్ని కాల్చదు
ప్రవక్త ﷺ సెలవిచ్చారుః “(మానవ శరీరములో) సజ్దా భాగాన్ని అల్లాహ్ నరకంపై నిషేధించాడు, అంటే అది దాన్ని కాల్చదు”. (బుఖారీ 806, ముస్లిం 182).
విశ్వాసులు చేసిన పాపాల్ని అల్లాహ్ క్షమించనిచో, మరియు వారి పాపాలను అధిగమించే, తుడిచివేసే పుణ్యాలు కూడా వారి వద్ద లేకున్నచో వారు వారి పాపాల పరిమాణాన్ని బట్టి అగ్నిలో శిక్షించబడతారు. అయితే సజ్గా అంగములు చాలా గౌరవనీయమైనవి గనక అగ్ని వాటిని తినదు, వాటిపై ఏలాంటి ప్రభావం పడదు. (అష్షర్హుల్ ముమ్తిఅ…., 3వ సంపుటం: షేఖ్ ఇబ్ను ఉసైమీన్)
10 -మొదటి తషహ్హుద్
భూమ్యాకాశాల్లో ఉన్న అల్లాహ్ దాసులకు సమానంగా పుణ్యం
మొదటి తషహ్హుద్ లో ‘అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లా హిస్సాలిహీన్’ అన్న దుఆ చదువుతున్నప్పుడు గొప్ప ఘనత మనకు తెలుస్తుంది. నాతో పాటు మీరూ గమనించండిః
అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః నా చేయి ప్రవక్త ﷺ చేతిలో ఉండగా ఖుర్ఆను సూరాలు నేర్పినట్లు ఆయన నాకు తషహ్హుద్ దుఆ నేర్పారు. ‘అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యి బాతు అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహిస్సాలిహీన్’ ఈ పదాలు మీరన్నప్పుడు భూమ్యాకాశాల్లో ఉన్న ప్రతి పుణ్య పురు షునికి ఈ దుఆ లభిస్తుంది. ‘వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్డహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు’. (బుఖారీ 831).
నీవు సలాం చేస్తున్నావంటే; భూమ్యాకాశాల్లో బ్రతికి ఉన్న, చని పోయిన పుణ్యపురుషులు, జిన్నాతులు మరియు అల్లాహ్ దూతలు అందరూ అన్ని రకాల లోపాలకు అతీతంగా మరియు ఆపదలకు దూరంగా ఉండాలని దుఆ చేస్తున్నావు అని అర్థం. దీని వల్ల అల్లాహ్ నీపై కరుణించి ఎవరెవరిపై నీవు సలాం చేశావో ప్రతి ఒక్కరికి బదులుగా పుణ్యం ప్రసాదిస్తాడు.
11 -చివరి తషహ్హుద్: (ప్రవక్త పై దరూద్)
ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లంపై దరూద్ చదవడంలో చాలా పుణ్యాలు, రెట్టింపు ప్రతిఫలాలున్నాయి.
(అ) అల్లాహ్ మరియు ఆయన దూతల అనుకరణ
{అల్లాహ్ ఆయన దూతలు ప్రవక్తకై ‘దరూద్’ను పంపుతారు, విశ్వాసులారా! మీరు కూడా ఆయనకై దరూద్, సలామ్ లు పంపండి}. (అహ్ జాబ్ 33: 56).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరు నాపై ఒక సారి దరూద్ పంపుతారో అల్లాహ్ అతనిపై పది సార్లు కరుణిస్తాడు”. (ముస్లిం 408).
(ఇ) పది పుణ్యాలు లిఖించబడతాయి, పది పాపాలు తొలగించ బడతాయి
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశ ప్రకారం: “నాపై ఒక్కసారి దరూద్ పంపిన వానికి అల్లాహ్ పది పుణ్యాలు వ్రాస్తాడు”. (తిర్మిజి 485), మరో ఉల్లేఖనంలోని పదాలు ఇలా ఉన్నాయిః “అతని పది పాపాలు తొలగిస్తాడు”. మరో హదీసు పదాలు ఇవిః “అతని పది పాపాలు తుడిచివేస్తాడు”. (ముస్నద్ అహ్మద్ 3/102, 4/29([10])).
[10] ‘పది స్థానాలు రెట్టింపు చేయబడతాయని’ ముస్నద్ అహ్మద్ 4/29లో ఉంది.
12 -సలాంకు ముందు దుఆ
సలాంకు ముందు దుఆ విషయంలో ఏ ఘనత లేకున్నా అది దుఆ అంగీకార శుభసందర్భమవడమే చాలు. అదెలాగంటే నమాజీ అప్పుడు తన ప్రభువు వైపునకు మరలి, ఆయనతో మొరపెట్టు కుంటాడు. అతను నమాజులోనే ఉన్నాడు గనక ఇది దుఆ అంగీకారానికి ఎంతో ఉత్తమం.
అలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః “మీలో ఎవరైనా నమాజు చేస్తున్నప్పుడు ‘అత్తహియ్యాతు లిల్లాహి…’ చదవాలి, దాని పిదప తనకిష్టమున్న దాన్ని అర్థించుకోవాలి”, మరో ఉల్లేఖనంలో ఉంది “ఇంకేదైనా దుఆ ఎంచుకోవాలి”. (బుఖారి, ముస్లిం).
అబూ ఉమామ ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త ﷺ ను ఎవరో అడిగారు, ‘ఏ దుఆ ఎక్కువ వినబడుతుంది’ అని. దానికి ప్రవక్త ﷺ ఇలా చెప్పారుః “మధ్య రాత్రిలో మరియు ఫర్జ్ నమాజుల చివరి భాగంలో”. (తిర్మిజి 3499). హదీసులో అరబీ పదం ‘దుబురుస్సలవాత్’ అని ఉంది, అయితే సామాన్యంగా దీని భావం నమాజు చివరి భాగం, అంటే సలాంకు ముందు అని. అయితే ఒకప్పుడు నమాజు తర్వాత అని కూడా చెప్పబడుతుంది.
నమాజులోని రెండవ నిధి సారాంశం
కర్మ
ఫలితం
1- నమాజు ఘనత
1) ఉన్నత స్థానాలు, పాపాల మన్నింపు, ఉత్తమ ఉపాధి. 2) తప్పుల ప్రక్షాళనం, పాపాల తుడిచివేత 3) కారుణ్యం, 4) జన్నతుల్ ఫిర్ దౌస్ లో ప్రవేశం 5) కాంతి, 6) స్వర్గ ప్రవేశం, (ఫజ్ర్, అస్ర్) 7) పగటి మరియు రాత్రి దూతల ఆగమనం, (ఫజ్ర్, అస్ర్) 8) నరక విముక్తి (ఫజ్ర్, అస్ర్) 9) అల్లాహ్ రక్షణ (ఫజ్ర్). 10) అల్లాహ్ దర్శనం (అస్ర్) 11) అర్థ రాత్రి తహజ్జుద్ చేసినంత పుణ్యం (ఇషా), రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం (ఫజ్ర్).
2- సామూహిక నమాజు
270 పుణ్యాలు (27×10=270 పుణ్యాలు)
3- ఖుషూఅ (నమాజు లో అణుకువ)
1) స్వర్గ ప్రవేశ సాఫల్యం, నరకం నుండి రక్షణ 2) అల్లాహ్ యొక్క ప్రేమ 3) ఏ నీడా లేని రోజు అల్లాహ్ నీడలో ఆశ్రయం 4) నమాజు పుణ్యాల రెట్టింపు 5) పాపాల మన్నింపు, గొప్ప ప్రతిఫలం.
4- సనా
ఆకాశ ద్వారాలు తెరవబడుట
5- సూర ఫాతిహా పారాయణం
1) ఖుర్ఆనులోని గొప్ప సూరా పారాయణం 2) స్తోత్రము + దుఆ
6- ఆమీన్
పాపాల మన్నింపు
7- రుకూ
పాపాలు రాలిపడుట
8- రుకూ తర్వాత దుఆలు
1) పాపాల మన్నింపు. 2) వాటిని వ్రాయటానికి అల్లాహ్ దూతలు ఎగబడతారు
9- సజ్దాలు
1) సాఫల్యం. 2) స్థానం రెట్టింపు, పాపం మన్నింపు 3) ప్రళయదినాన అల్లాహ్ దయ, ప్రసన్నత, కాంతి 4) స్వర్గంలో ప్రవక్త సన్నిహితం. 5) పాపాలు రాలిపడుట. 6) పాపాత్ములైన విశ్వాసుల సజ్దా అంగములను నరకాగ్ని కాల్చదు.
10- మొదటి తషహ్హుద్
ఏ ఏ పుణ్యాత్ములకు నీవు సలా చేశావో వారందరి పుణ్యం
11- చివరి తషహ్హుద్, ప్రవక్త పై దరూద్
1) అల్లాహ్ మరియు ఆయన దూతల అనుకరణ 2) పది రెట్ల వరకు పుణ్యాలు పెరగడం 3) పది పుణ్యాలు లిఖించబడటం, పది పాపాలు తుడిచివేయబటడం
12- సలాం కు ముందు దుఆ
అంగీకార సమయం.
మూడవ నిధి (నిక్షేపం)
నమాజు తర్వాత అజ్కార్
నమాజు తర్వాత చేయవలసిన అజ్కార్ వివిధ వాక్యాల్లో ఉన్నవి. అలాగే వాటి పుణ్యాలు కూడా వివిధ రకాలుగా ఉన్నవి. అందులో కొన్నిః
(అ) పాపాల మన్నింపుః
అబూ హురైరా ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారుః “ప్రతి నమాజు తర్వాత ఎవరు 33 సార్లు సుబ్ హానల్లాహ్, 33 సార్లు అల్లాహు అక్బర్, 33 సార్లు అల్ హందులిల్లాహ్, మరి లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్ చదివి వంద పూర్తి చేస్తాడో అతని పాపాలు సముద్రపు నురుగంత ఉన్నా క్షమించబడతాయి”. (ముస్లిం 597).
(ఆ) అనుగ్రహం, ఉన్నత స్థానాలు మరియు భోగబాగ్యాలు + స్వర్గ ప్రవేశం + 1500 పుణ్యాలు
అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః (ఓ రోజు కొందరు పేద ప్రజలు ప్రవక్త ﷺ వద్దకు వచ్చి) ‘ప్రవక్తా! ధనికులు తమ సిరిసంపదల మూలంగా ఉన్నత స్థానాలు అధిరోహించడానికి, శాశ్వతపు భోగభాగ్యా లు పొందడానికి మాకంటే ముందు వెళ్ళారు’ అని ఫిర్యాదు చేశారు. “అది ఎలా?” అని ప్రవక్త ﷺ అడిగారు. వారన్నారుః ‘వారు మా లాగా నమాజు చేస్తారు, మా లాగానే ధర్మ యుద్ధాలు కూడా చేస్తారు. డబ్బు ఉన్నందున వారు (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెడుతున్నారు, మా వద్ద ఆ డబ్బు లేదు. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారుః “నేను మీకో విషయం తెలియజేయనా? మీరు దాన్ని పాటించి మిమ్మల్ని మించిపోయిన వాళ్ళతో సమానులవుతారు, మీ కంటే వెనక ఉన్న వాళ్ళతోను మించిపోతారు, మీ లాంటి ఈ పద్దతిని అనుసరించే వాడు తప్ప మీ లాంటి ఆచరణ తెచ్చేవాడు మరొకడు ఉండడు. ఆ విషయం: ప్రతి నమాజు తర్వాత 10 సార్లు సుబ్ హానల్లాహ్, 10 సార్లు అల్ హందులిల్లాహ్, 10 సార్లు అల్లాహు అక్బర్ పలకండి”. (బుఖారీ 6329).
ప్రవక్త ﷺ ప్రవచించారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “రెండు గుణాలున్నాయి, వాటిని పాటించిన ముస్లిం భక్తుడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. అవి తేలికైనవి, కాని వాటిని పాటించేవారు అరుదు. ప్రతి నమాజు తరువాత 10 సార్లు సుబ్ హానల్లాహ్, 10 సార్లు అల్ హందులిల్లాహ్, 10 సార్లు అల్లాహు అక్బర్ చెప్పాలి. ఇవి (ఐదు నమాజుల్లో చేస్తే) నోటి పై 150 అవుతాయి, కాని (ప్రళయదినాన) త్రాసులో 1500 అవుతాయి”. (అబూ దావూద్ 5065, తిర్మిజి 3410, నిసాయి 1348, ఇబ్ను మాజ 926).
నోటి పై 150, దీని ఫిగర్ ఇలా ఉంటుందిః
10 సుబ్ హానల్లాహ్ + 10 అల్ హందిలిల్లాహ్ + 10 అల్లాహు అక్బర్ = 30.
30 × 5 (నమాజులు) = 150
త్రాసులో 1500 యొక్క ఫిగర్ ఇదిః
150 × 10 పుణ్యాలు = 1500 పుణ్యాలు
(ఇ) ఆయతుల్ కుర్సీ = స్వర్గ ప్రవేశం
అబూ హూరైర(రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ﷺ ఆదేశించారుః “ఎవరు ప్రతి నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో వారి స్వర్గ ప్రవేశానికి మరణమే అడ్డు”. (నిసాయి ).
(ఈ) సున్నతె ముఅక్కద = స్వర్గంలో ఒక గృహం
సున్నతె ముఅక్కద 12 రకాతులని గత పేజిల్లో మనం తెలుసు కున్నాము.
ప్రవక్త ﷺ చెప్పగా విని ఉమ్మె హబీబ బిన్తె సుఫ్యాన్ రజియల్లాహు అన్హా ఉల్లేఖిస్తున్నారుః “ముస్లిం దాసుడు ప్రతి రోజు ఫర్జ్ నమాజు కాకుండా పన్నెండు రకాతుల నఫిల్ నమాజు అల్లాహ్ కొరకు చేస్తూ ఉంటే అల్లాహ్ అతని కొరకు స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు. లేక ఒక ఇల్లు అతని కొరకు నిర్మించబడుతుంది”. (ముస్లిం 728).
నమాజులోని మూడవ నిధి సారాంశం
కర్మ
ఫలితం
1- సుబ్ హానల్లాహ్, అల్ హందు లిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్
పాపాల మన్నింపు + అనుగ్రహం + ఉన్నత స్థానాలు + భోగభాగ్యాలు+ స్వర్గ ప్రవేశం + 1500 పుణ్యాలు
2- ఆయతుల్ కుర్సీ పఠనం
స్వర్గ ప్రవేశం
3) సున్నతె ముఅక్కద
స్వర్గంలో ఒక గృహం
[1]. అహ్మద్ 5/215, తబ్రానీ కబీర్ 7486, అల్ ఇబానతుల్ కుబ్రా లిబ్ని బత్త 4, ముస్తద్రక్ హాకిం 4/92, (హాకిం దీనిని సహీ అన్నారు). తాజీము కద్రిస్సలా లి ముహమ్మద్ బిన్ నస్ర్ 407, ఇబ్ను హిబ్బాన్ 257, ఇది హసన్ హదీసు.
[2]. తాజీము కద్రిస్సలా 892, అస్సున్న లిల్ ఖల్లాల్ 1379, అల్ ఇబాన 876, షర్హు ఉసూలి ఇఅతికాది అహ్లిస్సున్న 1538. దీని సనద్ (పరంపర) హసన్, అందులో ఏ అభ్యంతరం లేదు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ ఉమామ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఏ వ్యక్తి నమాజు ఉద్దేశ్యంతో వుజూ చేస్తూ రెండు అరచేతులు కడుగుతాడో నీటి తొలి చుక్క ద్వారా అతని రెండు చేతులతో చేసిన పాపాలు తొలిగిపోవును. నోట్లు నీళ్ళు తీసుకొని పుక్కిలించి, ముక్కులో నీళ్ళు ఎక్కించి చీది శుభ్రపరచుకుంటాడో నీటి మొదటి చుక్క ద్వారా అతని నాలుక మరియు పెదవుల ద్వారా చేసిన పాపాలు తొలిగిపోతాయి. ముఖము కడిగినప్పుడు కళ్ళు మరియు చెవి ద్వారా చేసిన పాపాలు నీటి మొదటి చుక్క ద్వారా తొలిగి పోతాయి. మోచేతుల వరకు చేతులు, మోకాళ్ళ వరకు కాళ్ళు కడినగినప్పుడు సర్వ పాపాల నుండి విముక్తి పొంది తల్లి గర్భం నుండి పుట్టినప్పటి స్థితి మాదిరిగా అయిపోతాడు”. (అహ్మద్ 36/601). [ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ]
[6]. (సునన్ నిసాయీ అల్ కుబ్రా/ బాబు మా యఖూలు ఇజా ఫరగ మిన్ వుజూఇహీ. 9909. 6/25. సహీహుత్తర్గీబు వత్తర్ హీబ్ 225. సహీహుల్ జామిఅ 6170).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ఉపదేశించారని అమర్ బిన్ అంబస రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అతను (ముస్లిం వ్యక్తి) నమాజు చేయుటకు నిలబడి అల్లాహ్ స్తోత్రము, ప్రశంసలు పఠించి, తగిన రీతిలో ఆయన గొప్పతనాన్ని చాటుతూ, తన హృదయంలో అల్లాహ్ తప్ప మరే ధ్యానం లేకుండా ఉంచుకుంటే తన తల్లి గర్భం నుండి పుట్టినప్పటి స్థితిలో అతను పాపాల నుండి దూరమవుతాడు”. (ముస్లిం 832).
1 ‘పది స్థానాలు రెట్టింపు చేయబడతాయని’ ముస్నద్ అహ్మద్ 4/29లో ఉంది.
25.34980855.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
లైంగిక అశుద్ధ స్థితిలో చేసే గుసుల్ విధానం, వుజూ విధానం
వుజూను భంగపరిచే విషయాలు
తయమ్ముమ్ గురించి
తయమ్ముమ్ విధానం
మస్జిద్ ప్రవేశ సమయంలో చేసే దుఆలు
అజాన్ గురించి
నమాజు గురించి
విత్ర్ నమాజు
నమాజు వ్యవధులు (వేళలు)
నమాజ్ చేయకూడని వేళలు
మస్టిద్ నియమాలు – సామూహిక నమాజు నమాజుకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాల గురించి…ప్రాముఖ్యత
నమాజు నియమాలు
నమాజులోని విధులు (ఆర్కాన్)
నమాజ్లోని వాజిబ్ అంశాలు
నమాజ్లోని సున్నతులు
నమాజ్ చేసే మస్నూన్ పద్ధతి
కొన్ని సూరాలు
సజ్దా గురించి
జల్సా
సజ్దా సహూ
తహజ్జుద్, ఖియాము అల్ లైల్ (లేక) తరావీహ్
విత్ర్ నమాజు గురించి
ఖునూతె విత్ర్ గురించి
ఖునూతె నాజిలా
ప్రయాణంలో ఖస్ర్ నమాజు
జుమా నమాజు గురించి
పండుగ నమాజుల గురించి
సూర్యగ్రహణం,ఇష్రాక్, ఛాష్త్, అవ్వాబీన్ నమాజులు
జనాజా నమాజు గురించి
25.34980855.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.