నరకవాసుల ఆహారం, పానీయాలు & వస్త్రాలు [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు [పార్ట్ 6] – నరకవాసుల ఆహారం, పానీయాలు & వస్త్రాలు
[మరణానంతర జీవితం – పార్ట్ 60] [21 నిముషాలు]
https://www.youtube.com/watch?v=N4VPIs8xrlQ
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[డౌన్లొడ్ పిడిఎఫ్]

ఈ ప్రసంగంలో నరకవాసుల ఆహారం మరియు పానీయాల గురించి వివరించబడింది. జఖూమ్, దరీ, మరియు ఘిస్లీన్ వంటి భయంకరమైన ఆహార పదార్థాలు, అలాగే అల్ ముహ్ల్, హమీమ్, ఘస్సాఖ్ మరియు సదీద్ వంటి పానీయాలు నరకంలో పాపాత్ములకు ఎలా ఇవ్వబడతాయో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివరించారు. నరకవాసుల వస్త్రాల గురించి మరియు అహంకారులకు కలిగే శిక్షల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు. మనిషి ఈ లోకంలో చేసే పాపాల నుండి దూరంగా ఉండి, నరక శిక్ష నుండి తప్పించుకోవాలని ఈ ప్రసంగం బోధిస్తుంది.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అల్ హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మ బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

మహాశయులారా! నరకవాసులకు ఎలాంటి ఆహారం ఇవ్వబడుతుందో దాని గురించి తెలుసుకుంటూ జఖూమ్ (జముడు వృక్షం) గురించి మనం గత కార్యక్రమంలో తెలుసుకున్నాము.

ఇక రెండో రకమైన ఆహారం వారికి ఇవ్వబడేది ‘దరీ‘. దీని ప్రస్తావన సూరహ్ గాషియాలో వచ్చి ఉంది. దరీ ఒక చెట్టు, దానికి ముళ్లు ఉంటాయి. అందులో చాలా దుర్వాసన ఉంటుంది మరియు దానివల్ల ఆకలి అనేది మనిషికి దూరం కాదు. అలాంటిది ఆ రోజు నరకవాసులకు తినడానికి ఇవ్వడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా తెలిపాడు:

لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ لَّا يُسْمِنُ وَلَا يُغْنِي مِن جُوعٍ
(లైస లహుమ్ త’ఆమున్ ఇల్లా మిన్ దరీ’. లా యుస్మిను వలా యుగ్నీ మిన్ జూ’)
వారికి తినడానికి ముండ్ల చెట్టు తప్ప వేరొకటి ఆహారంగా దొరకదు.అది వారిని లావుగానూ చేయదు, వారి ఆకలిని కూడా తీర్చదు. (88:6-7)

ఇలాంటిది వారికి ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక మూడో విషయం ఏదైతే వారికి ఆహారంగా ఉంటుందో అది ‘ఘిస్లీన్‘. దీని ప్రస్తావన సూరహ్ హాక్కా లో వచ్చి ఉంది. ఘిస్లీన్ అంటే రక్తము మరియు పుండు నుండి వెళ్ళే పదార్థము. అది నరకవాసుల పుండ్ల నుండి వారికి అగ్ని తగలడం వల్ల అక్కడ నుండి ఏదైతే చీము కారుకుంటూ వస్తుందో అది. ఇది ఎలాంటి వారికి ఆహారం అవుతుంది? అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూరహ్ హాక్కా లో తెలుపుతూ:

فَلَيْسَ لَهُ الْيَوْمَ هَاهُنَا حَمِيمٌ وَلَا طَعَامٌ إِلَّا مِنْ غِسْلِينٍ
(ఫలైస లహుల్ యౌమ హాహునా హమీమ్. వలా త’ఆమున్ ఇల్లా మిన్ గిస్లీన్)
“కాబట్టి ఈ రోజు ఇక్కడ వీడి (స్థితిపై సానుభూతి చూపే) స్నేహితుడెవడూ లేడు.గాయాల కడుగు నీరు తప్ప మరొకటేదీ వీడికి ఆహారంగా లభించదు” (69:35-36)

అల్లాహ్ మనందరినీ ఆ ఘిస్లీన్ నుండి కూడా కాపాడుగాక. ఇమామ్ ఖుర్తుబీ రహ్మతుల్లాహి అలైహి తెలిపారు: ఘిస్లీన్ అంటే నరకవాసుల చెమట, చీము అవన్నీ కలిపి వచ్చే పదార్థాలు అని.

అంతే కాకుండా మరో భయంకరమైన, వింటేనే వికారం కలిగేటటువంటి విషయం ఏమిటంటే ఏ వ్యభిచారిణీలను నరకంలో వేయడం జరుగుతుందో వారి యొక్క మర్మాంగాల నుండి వచ్చే చెడు, అలాంటిది కొందరి పాపాత్ములకు ఆహారంగా ఉంటుంది. అల్లాహ్ మనందరికీ అలాంటి చెడు విషయాల నుండి రక్షణ కలిగించుగాక. ఇక్కడ ఇంత చెడు ఉంటుందా అని అడ్డప్రశ్నలు వేసి మరింత విశ్వాసాన్ని పాడు చేసుకునే దానికి బదులు మనం నరకంలో తీసుకెళ్లే పాపాల నుండి దూరం ఉండటం మేలు అన్న విషయాన్ని మనం గ్రహించాలి.

అయితే మహాశయులారా! ఈ రకరకాల ఆహారాల గురించి ఏదైతే ప్రస్తావన వచ్చిందో, జఖూమ్ గాని, ఘిస్లీన్ గాని లేదా దరీ గాని మరియు కొన్ని ఆయతులలో ‘జా గుస్సహ్’ అనే ఒకటి ప్రస్తావన వచ్చింది. ఇలాంటి వివిధ రకమైన ఆహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకే సందర్భంలో ఇవ్వబడతాయా? వేరువేరు సందర్భాల్లో ఇవ్వబడతాయా? మరియు ప్రతి ఒక్కటి ఒక రకమైన పాపాత్ములకు ఇవ్వబడుతుందా? ఇవన్నీ వివరాలు పరలోకంలో అల్లాహ్ కు బాగా తెలుసు. ఇవన్నీ కూడా పరలోక విషయాలు వాటి వివరాలు కేవలం అల్లాహ్ కు మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ మనం వాటి ద్వారా అర్థం చేసుకునే విషయాలు ఏమిటంటే ఏ పాపాలకు కూడా ఎలాంటి అవిశ్వాసానికి కూడా మనం గురి కాకూడదు మరియు సత్యాన్ని తిరస్కరించకూడదు. వీటన్నిటిలో ఏ ఒక్క చెడైనా గాని మనల్ని నశింపచేయడానికి, మనల్ని అవమానపరచడానికి మహా ఎక్కువగా ఉంటుంది. అందుగురించి మనం సత్యాన్ని స్వీకరించి నరకం నుండి దూరం ఉండే ప్రయత్నం చేయాలి. ఇదే మన గురించి ఇందులో ఉన్నటువంటి గొప్ప బోధ.

ఇక రండి మహాశయులారా! వారికి త్రాగడానికి ఇవ్వబడే పానీయాలు ఎలాంటివి అవి కూడా కొంచెం మనం తెలుసుకుందాము. అయితే ఎప్పుడైతే వారికి దాహం కలుగుతుందో అప్పుడు కొన్ని జంతువులు దాహంతో తల్లడిల్లుతూ దూరం నుండి నీళ్లను చూస్తే పిచ్చివారిగా ఎలా పరిగెత్తుతాయో, వారు పరిగెత్తడంలో ఒకరిని ఒకరు త్రోసుకుంటూ మరియు ఎటువైపున ఏ నష్టం జరుగుతుందో ఏమాత్రం ఆలోచించకుండా ఒకే వైపున పరిగెడతారో అలా ఆ రోజు నరకవాసుల పరిస్థితి అవుతుంది.

وَنَسُوقُ الْمُجْرِمِينَ إِلَىٰ جَهَنَّمَ وِرْدًا
(వనసూఖుల్ ముజ్రిమీన ఇలా జహన్నమ విర్దా)
అపరాధులను తీవ్రంగా దప్పికగొన్న స్థితిలో నరకం వైపుకు తోలుకుపోతాము (19:86)

ఇంకా ఆ రోజు దాహం ఎక్కువగా ఏర్పడినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ నరకవాసులకు స్వర్గవాసులు సేవిస్తున్న పానీయాలు కూడా చూపించడం జరుగుతుంది. అప్పుడు వారు అరుస్తారు:

وَنَادَىٰ أَصْحَابُ النَّارِ أَصْحَابَ الْجَنَّةِ أَنْ أَفِيضُوا عَلَيْنَا مِنَ الْمَاءِ أَوْ مِمَّا رَزَقَكُمُ اللَّهُ ۚ قَالُوا إِنَّ اللَّهَ حَرَّمَهُمَا عَلَى الْكَافِرِينَ

నరకవాసులు స్వర్గవాసులను పిలుస్తూ, “మాపైన కొద్దిగా నీళ్ళయినా పోయండి లేదా అల్లాహ్‌ మీకు ప్రసాదించిన దాంట్లోంచి ఏ కాస్తయినా ఇటు పడేయండి” అని ప్రాధేయ పడతారు. దానికి సమాధానంగా వారు, “ఈ రెండింటినీ అల్లాహ్‌ అవిశ్వాసుల కొరకు నిషేధించాడు” అని అంటారు. (7:50)

ఇది ఎంతటి అవమానం గమనించండి. కళ్లారా చూస్తున్నాము వారు ఎంతో తీయటి నీళ్లు త్రాగుతూ ఆనందిస్తూ ఉన్నారు ఆ విషయం మనకు కనబడుతుంది. కనీసం ఒక బొట్టు నీళ్లు ఇవ్వండి అని అంటే మీకొరకు ఇది నిషిద్ధమని అక్కడ నుండి సమాధానం వస్తుంది అప్పుడు మనిషికి ఎంత బాధ కలుగుతుంది. ఆ రోజు అంత బాధ కలగకూడదు అంటే ఈ రోజు విశ్వాసం పై ఉండి సత్కార్యాలు చేస్తూ ఉండాలి.

మహాశయులారా! నరకవాసులకు దాహం కలిగినప్పుడు ఇవ్వబడే పానీయాల విషయంలో ‘అల్ ముహ్ల్’ ఒకటి. అల్ ముహ్ల్ అంటే నూనె అడుగున నూనె యొక్క మడ్డి ఏదైతే ఉంటుందో దానిని అల్ ముహ్ల్ అంటారు. అయితే అదే ఒకవేళ బాగా కాగిన నూనె ఉండేదుంటే దాని యొక్క వేడి ఎంత ఉంటుందో, ఆ మడ్డి, మడ్డిలోని వేడి మీది నూనె కంటే మరీ ఘోరంగా ఉంటుంది. సూరహ్ కహఫ్ లో దాని ప్రస్తావన వచ్చింది.

وَإِن يَسْتَغِيثُوا يُغَاثُوا بِمَاءٍ كَالْمُهْلِ يَشْوِي الْوُجُوهَ
(వ ఇన్ యస్తగీసూ యుగాసూ బిమాయిన్ కల్ ముహ్ల్ యష్విల్ వుజూహ్)
ఒకవేళ వారు సహాయం (ఉపశమనం, నీళ్లు) అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో వారికి సహాయం అందజేయబడుతుంది. అది ముఖాలను మాడ్చివేస్తుంది. (18:29)

ఎప్పుడైతే వారు త్రాగడానికి తమ ముఖానికి దగ్గరగా తీసుకుంటారో ముఖం యొక్క ఈ తోలు మొత్తం కాలిపోతుంది. అల్లాహు అక్బర్.

రెండో రకమైన పానీయం ‘హమీమ్‘. దీని ప్రస్తావన ఎన్నో సందర్భాల్లో వచ్చి ఉంది. ఉదాహరణకు:

لَهُمْ شَرَابٌ مِّنْ حَمِيمٍ
(లహుమ్ షరాబుమ్ మిన్ హమీమ్)
వారి కొరకు మరిగే నీటి పానీయం ఉంది. (6:70)

وَسُقُوا مَاءً حَمِيمًا فَقَطَّعَ أَمْعَاءَهُمْ
(వసుఖూ మాఅన్ హమీమన్ ఫఖత్త’ఆ అమ్’ఆఅహుమ్)
మరియు మరిగే నీరు త్రాగించబడే వారికి (పోలిక ఉందా)? ఆ నీరు వారి పేగులను ముక్కలు ముక్కలు చేస్తుంది. (47:15)

హమీమ్ ఎలా ఉంటుంది దాని యొక్క వివరణ ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకుందాం. నరకవాసులకు ఇవ్వబడే పానీయాల్లో రెండో రకమైనది హమీమ్. దేనినంటారు నీళ్లు వేడికి ఎక్కి దాని యొక్క చివరి భాగం ఏదైతే ఉండగలుగుతుందో దానిని హమీమ్ అని అంటారు. ఎప్పుడైతే మనిషి అది త్రాగుతాడో కేవలం మీది శరీరం యొక్క పై భాగమే కాదు లోపలి భాగాన్ని కూడా అది చాలా చెడ్డమైన విధంగా పాడు చేస్తుంది. ఒకసారి సూరహ్ హజ్ లోని ఆయత నెంబర్ 19 మరియు 20 వినండి మరియు శ్రద్ధ వహించండి.

يُصَبُّ مِن فَوْقِ رُءُوسِهِمُ الْحَمِيمُ يُصْهَرُ بِهِ مَا فِي بُطُونِهِمْ وَالْجُلُودُ
(యుసబ్బు మిన్ ఫౌఖి రుఊసిహిముల్ హమీమ్. యుస్ హరు బిహీ మా ఫీ బుతూనిహిమ్ వల్ జులూద్)
సలసల కాగే నీరు వారి తలలపై నుంచి కుమ్మరించబడుతుంది. దాని మూలంగా వారి చర్మాలే కాకుండా వారి కడుపుల్లో ఉన్నవి కూడా కరిగిపోతాయి. (22:19-20)

అల్లాహ్ ఇలాంటి హమీమ్ నుండి మనందరినీ రక్షించుగాక.

ఇక మూడో రకమైన పానీయం అది ‘ఘస్సాఖ్‘. సూరహ్ నబా లో ‘హమీమన్ వ ఘస్సాఖ’ అని రెండు కలిపి వచ్చాయి, హమీమ్ మరియు ఘస్సాఖ్. హమీమ్ అంటే ఏమిటో తెలుసుకున్నారు కదా! అతి వేడి. ఇక ఘస్సాఖ్ అన్నది దానికి ఆపోజిట్ విరుద్ధమైనది. చలి మరియు ఐస్ లో ఎంత ఎక్కువ చల్లదనం ఉండగలుగుతుందో దానికి మితిమీరినది. మరియు మనకు తెలుసు చల్లదనం మితిమీరిన రీతిలో ఉంటే అది కూడా మహా నష్టపరుస్తుంది. దానివల్ల కూడా మనిషి యొక్క శరీరంలో తోలు ఇదంతా కాలిపోతుంది మరియు అదంతా చిదిరిపోతుంది. విపరీతమైన చలి పడినప్పుడు పచ్చని చెట్లు కూడా నల్లగా అయినట్లు మనం చూస్తూనే ఉన్నాం.

ఈ విధంగా మహాశయులారా! నరకంలో ఒక భాగం వేడి ఉంది మరొక భాగం జమ్హరీర్ చల్లదనంలో మితిమీరినది ఉంది. అలాగే నరకవాసులకు ఇవ్వబడే పానీయాల్లో కూడా హమీమ్ వేడిలో మితిమీరినదైతే ఘస్సాఖ్ చల్లదనంలో మితిమీరినది.

మహాశయులారా! నరకవాసులకు ఇవ్వబడే పానీయాల్లో నాలుగో రకమైనది ‘సదీద్‘. సదీద్ అంటే రక్తము మరియు చీము ఇవన్నీ కలిపి ఏదైతే వస్తుందో దానినంటారు. ఇది కూడా కొందరి నరకవాసులకు త్రాగడానికి ఇవ్వడం జరుగుతుంది కానీ పరిస్థితి ఎలా ఉంటుంది? సూరహ్ ఇబ్రాహీమ్ ఆయత నెంబర్ 16, 17 లో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా తెలిపాడు.

وَيُسْقَىٰ مِن مَّاءٍ صَدِيدٍ يَتَجَرَّعُهُ وَلَا يَكَادُ يُسِيغُهُ
(వయుస్ఖా మిన్ మాఇన్ సదీద్. యతజర్రఉహు వలా యకాదు యుసీగుహ్)
అక్కడ అతడికి త్రాగటానికి చీము నెత్తురుతో కూడుకున్న నీరు ఇవ్వబడుతుంది. అతడు అతి కష్టమ్మీద ఒక్కొక్క గుక్కెడూ త్రాగుతాడు. కాని గొంతులోకి దించలేకపోతాడు.  (14:16-17)

ఇక ఎవరైతే ఇహలోకంలో మత్తు సేవిస్తారో అలాంటి వారికి ఇలాంటి సదీద్ త్రాగించడం జరుగుతుంది అని హదీసుల ద్వారా తెలుస్తుంది. అయితే హదీసుల్లో సదీద్ అన్న పదం కాకుండా ‘తీనతుల్ ఖబాల్’ అన్న పదం వచ్చి ఉంది. తీనతుల్ ఖబాల్ అంటే ఏమిటి ప్రవక్తా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అని అడిగినప్పుడు నరకవాసుల నెత్తురు మరియు చీము అని దాని వివరణ తెలిపారు.

అయితే మహాశయులారా! నరకంలో ప్రవేశించకూడదు ఇలాంటి శిక్షలు మనం పొందకూడదు అంటే ఇహలోకంలో ఇలాంటి పాపాలకు కూడా మనం దూరం ఉండాలి.

అలాగే మహాశయులారా! ఎవరైతే ఇహలోకంలో అహంకారంతో జీవిస్తారో ఇతరులను చాలా చిన్నగా చూసి తమకు తాము ఎంతో గొప్పవారని భావించుకుంటూ గర్వంతో పొగరుబోతుతనం వహిస్తారో ప్రళయ దినాన వారు ఏ స్థితిలో వస్తారో మరియు వారికి ఏమి త్రాగించడం జరుగుతుందో ప్రవక్తా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక హదీసులో తెలిపారు. ఆ హదీసు జామె తిర్మిజి లో ఉంది షేక్ అల్బాని రహిమహుల్లాహ్ సహీహుత్తర్గీబ్ లో పేర్కొన్నారు. ‘ప్రళయ దినాన అహంకారులను చీమల పరిమాణంలో తీసుకురావడం జరుగుతుంది. అన్ని వైపుల నుండి వారిని అవమానం అనేది క్రమ్ముకొని ఉంటుంది మరియు ఒక రకమైన జైలులో బందిఖానాలో వారిని తోలుకుపోవడం జరుగుతుంది. అక్కడ వారికి తీనతుల్ ఖబాల్ త్రాగించడం జరుగుతుంది. తీనతుల్ ఖబాల్ అంటే ఏమిటి ప్రవక్తా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అని అడిగినప్పుడు నరకవాసుల నెత్తురు చీముతో కూడి ఉన్న ఒక పదార్థం అని ప్రవక్తా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు.’

అయితే నరకవాసులు నరకంలో హమీమ్, ఘస్సాఖ్, ఘిస్లీన్, సదీద్, తీనతుల్ ఖబాల్ ఇవన్నీ అవి అంత చెడుగా ఉన్నప్పటికీ ఎందుకు త్రాగుతారు అని కూడా ఒక ప్రశ్న రావచ్చు. అయితే విషయం ఏమిటంటే వారికి ఎప్పుడెప్పుడు దాహం కలుగుతుందో వారికి ఎప్పుడెప్పుడు వేడి ఎక్కువ కలుగుతుందో కనీసం ఇలాంటి నీటితో మనం దాహం తీర్చుకుందాం అన్నటువంటి ఆలోచన వారికి ఉంటుంది. కానీ అది త్రాగడం వల్ల ఇంత నష్టం ఏర్పడుతుంది అని వారు ముందు ఊహించలేరు తర్వాత ఆ విషయం వారికి తెలిసి వస్తుంది. అయితే మహాశయులారా! వారు త్రాగడానికి ఏదైతే ఇలాంటి పానీయాలు ఇవ్వబడతాయో వాటిని వారు ఎలా త్రాగుతారు? దాని యొక్క ప్రస్తావన కూడా ఖురాన్ లో వచ్చి ఉంది.

فَشَارِبُونَ شُرْبَ الْهِيمِ
(ఫషారిబూన షుర్బల్ హీమ్)
దప్పికగొన్న ఒంటెలు త్రాగినట్లు మీరు దానిని త్రాగుతారు. (56:55)

మహా దాహం కలిగి ఉన్న ఒంటెలు ఎలా నీళ్లు చూసిన వెంటనే పరిగెడతాయో ఆ విధంగా వారు ఆ నీరు వైపునకు పరిగెడతారు.

నరకవాసులకు ఎలాంటి వస్త్రాలు ధరింపజేయబడతాయో దాని ప్రస్తావన కూడా ఖురాన్ హదీసులో వచ్చి ఉంది. సూరహ్ హజ్ లో అల్లాహ్ తెలిపాడు:

فَالَّذِينَ كَفَرُوا قُطِّعَتْ لَهُمْ ثِيَابٌ مِّن نَّارٍ
(ఫల్లజీన కఫరూ ఖుత్తిఅత్ లహుమ్ సియాబుమ్ మిన్నార్)
అందుచేత అవిశ్వాసుల కోసం అగ్ని వస్త్రాలు కత్తిరించబడతాయి. (22:19)

దుస్తులు కూడా నరకంలోనివే. ఇక ఎలా ఉంటుంది వారి పరిస్థితి గమనించండి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఒక బానిస ఉన్నాడు ఒక యుద్ధంలో. తెలియని ప్రదేశం నుండి ఒక బాణం వచ్చి గుచ్చుకుంది అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ప్రజలందరూ అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లుగా షహీద్ అయిపోయాడు అమరవీరుడు అయ్యాడు అని మాట్లాడుతుండగా ప్రవక్తా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: “అతడు యుద్ధ ఫలంలో నుండి మాలే ఘనీమత్ యుద్ధ ఫలంలో నుండి అనుమతి లేకుండా ఒక చాదర్ ఏదైతే తీసుకున్నాడో అది అతనిపై అగ్ని జ్వాలల్ని లేపుతుంది దానివల్ల అతనిపై అగ్ని నిప్పులు అనేటివి వచ్చి పడుతూ ఉన్నాయి

అలాగే సోదరులారా! ఎవరైతే తమ బంధువుల్లో ఎవరైనా చనిపోతే వారిపై శోకం చేస్తారో వారి గురించి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: “నౌహ చేసేవారు శోకం చేసేవారు ఒకవేళ వారు తౌబా చేసుకోకుంటే ప్రళయ దినాన వారిని లేపడం జరుగుతుంది వారి యొక్క శరీరంపై తార్ (డాంబర్) కు సంబంధించిన షర్ట్ ఉంటుంది మరియు వారి యొక్క పైజామా అనేది గంధకముతో చేయబడినదిగా ఉంటుంది“. ఇలా తార్ డాంబర్ తో చేయబడిన షర్ట్ మరియు గంధకముతో తయారు చేయబడిన పైజామా అంటే ఎంత వేడి ఎక్కుతుందో ఎలా శిక్ష వారికి ఉంటుందో వారికి ఏ దుస్తులైతే ధరింపజేయబడుతున్నాయో అవి కేవలం వారిని దాచి పెట్టడానికి వారి యొక్క ప్రదేశాలను రక్షణ కొరకు కాదు వాటి ద్వారా కూడా వారికి ఎంతో శిక్ష అనేది లభిస్తూ ఉంటుంది.

ఈ విధంగా సోదరులారా! వారి యొక్క ఆహారం, వారి యొక్క పానీయాలు, వారి యొక్క దుస్తులు ఇవన్నీ వివరాలు ఏదైతే వచ్చాయో ఎందుకు? మనం వాటి పట్ల భయపడి మనకు మనం ఆ నరకానికి దూరం ఉంచే ప్రయత్నం ఇహలోకంలోనే చేసుకోవాలి. అల్లాహ్ మనందరికీ ఆ సద్భాగ్యం ప్రసాదించుగాక.

వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=46108

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

యూట్యూబ్ – ప్లే లిస్ట్ (మరణానంతర జీవితం)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3hWrEGNnzcmMZV3PtDByJH

పవిత్ర మాసాలలో పాపాల ప్రమాదం – షేఖ్ హబీబుర్ రహ్మాన్ జామిఈ [వీడియో & టెక్స్ట్]

పవిత్ర మాసాలలో పాపాల ప్రమాదం
షేఖ్ హబీబుర్ రహ్మాన్ జామిఈ [వీడియో & టెక్స్ట్]
https://youtu.be/2Vh-tmsTEZc [38 నిముషాలు]
[డౌన్లోడ్ పిడిఎఫ్]

ఈ ప్రసంగం ఇస్లాంలోని పవిత్ర మాసాల (ముహర్రం, రజబ్, జుల్ ఖాదా మరియు జుల్ హిజ్జా) విశిష్టతను మరియు ఆ మాసాలలో పాపాలకు దూరంగా ఉండవలసిన ఆవశ్యకతను వివరిస్తుంది. అల్లాహ్ పన్నెండు నెలల్లో నాలుగింటిని ప్రత్యేకంగా పవిత్రమైనవిగా ప్రకటించారని, ఈ కాలంలో చేసే సత్కార్యాలకు ప్రతిఫలం పెరగడమే కాకుండా, చేసే పాపాల తీవ్రత మరియు వాటి శిక్ష కూడా ఇతర సమయాల కంటే అధికంగా ఉంటాయని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివరించారు. పాపాలు సంఖ్యాపరంగా పెరగకపోయినా, పవిత్ర స్థలాలు మరియు కాలాల గౌరవాన్ని బట్టి వాటి ప్రభావం తీవ్రమవుతుందని, ఇవి హృదయాలకు తుప్పు పట్టించి మనిషిని అల్లాహ్ కరుణకు దూరం చేస్తాయని ఆయన హెచ్చరించారు.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అల్ హమ్దులిల్లాహి మలికిల్ ఖుద్దూసిస్సలాం, ముజ్రిల్లయాలి వల్ అయ్యాం, వ ముజద్దిదిష్ షుహూరి వల్ ఆవాం. వస్సలాతు వస్సలాము అలా నబియ్యినా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), వ అలా ఆలిహిల్ కిరాం, వ సహ్ బిహిల్ బరరాతిల్ ఆలాం, వత్తాబియీన లహుమ్ బి ఇహసాన్.

సర్వస్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన, ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణాశుభాలు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.

అభిమాన సోదరులారా! ఈరోజు అంశం మీకందరికీ తెలిసిందే, “పవిత్ర మాసాలలో పాపాల ప్రమాదం“. ఇస్లాంలో నాలుగు మాసాలను అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రత్యేక పవిత్రతతో గౌరవించాడు. అవి జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం మరియు రజబ్. ఇందులో జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం వరుసగా వచ్చే మూడు నెలలు. రజబ్ ఇది జుమాదా మరియు షాబాన్ మధ్యలో ఉంటుంది. దీని ప్రస్తావన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూరహ్ తౌబా ఆయత్ 36 లో ఇచ్చాడు:

إِنَّ عِدَّةَ ٱلشُّهُورِ عِندَ ٱللَّهِ ٱثْنَا عَشَرَ شَهْرًا فِى كِتَٰبِ ٱللَّهِ يَوْمَ خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ مِنْهَآ أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ ٱلدِّينُ ٱلْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا۟ فِيهِنَّ أَنفُسَكُمْ

నిశ్చయంగా అల్లాహ్ వద్ద నెలల సంఖ్య పన్నెండు. ఆకాశాలనూ, భూమినీ సృష్టించిన రోజు నుండి అల్లాహ్ గ్రంథంలో అవి పన్నెండే. వాటిలో నాలుగు పవిత్రమైనవి. ఇదే సరైన ధర్మం. కాబట్టి ఆ నెలలలో మీరు మీపై అన్యాయం చేసుకోకండి. (9:36)

మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “సంవత్సరంలో పన్నెండు నెలలు ఉన్నాయి. వాటిలో నాలుగు పవిత్రమైనవి. వాటిలో మూడు వరుసగా వచ్చే జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం. మరొకటి జుమాదా మరియు షాబాన్ మధ్యలో ఉన్న రజబ్ మాసం.” ఇది సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం లో ఉన్న హదీసు.

అభిమాన సోదరులారా! పవిత్ర మాసాలలో సత్కార్యాల ప్రతిఫలం మరియు పాపాల శిక్ష వాటి గొప్పతనం మరియు తీవ్రత పరంగా పెరుగుతాయని తెలుస్తుంది. అంటే పవిత్ర మాసాలలో పుణ్యాలు చేసినా వాటి ప్రతిఫలం ఎన్నో రెట్లు పెరుగుతుంది. అలాగే పాపాలు చేసినా పాపాల శిక్ష వాటి గొప్పతనం మరియు తీవ్రత పరంగా పెరుగుతాయని తెలుస్తుంది. కాబట్టి పవిత్ర మాసాలలో చేసే ఒక సత్కార్యం ఇతర సాధారణ కాలాలలో చేసే అదే సత్కార్యం కంటే అల్లాహ్ వద్ద మరింత గొప్పది. అలాగే పవిత్ర మాసాలలో చేసే ఒక పాపం ఇతర సాధారణ కాలాలలో చేసే అదే పాపం కంటే మరింత తీవ్రమైనది మరియు భారమైనది.

ఒక ప్రశ్న: పవిత్ర మాసాలలో పాపం రెట్టింపు అవుతుందా? అంటే ఒక పాపం రెండు పాపాలకి సమానంగా, నాలుగు పాపాలకి సమానంగా, పది పాపాలకి సమానంగా అవుతుందా? ఈ ప్రశ్న. దీనికి సమాధానం ధార్మిక పండితులు ఇలా వివరించారు: పవిత్ర మాసాలలో సత్కార్యాలు మరియు పాపాలు రెట్టింపు అవుతాయని స్పష్టంగా తెలిపే సహీహ్ మరియు స్పష్టమైన హదీసులు లేవు. అయితే కొందరు పండితులు అల్లాహ్ ఈ విధంగా చెప్పినందున ఈ మాసాలలో సత్కార్యాల ప్రతిఫలం మరియు పాపాల తీవ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. సూరహ్ తౌబా ఆయత్ 36: “ఫలా తజ్లిమూ ఫీహిన్న అన్ఫుసకుమ్.” కాబట్టి ఆ పవిత్ర మాసాలలో మీపై మీరు అన్యాయం చేసుకోకండి.

ఈ ఆయత్ యొక్క తఫ్సీర్ ను వివరిస్తూ ఇబ్నె కసీర్ రహ్మతుల్లాహి అలైహి ఇలా పేర్కొన్నారు:

ఆ మాసాలలో మీపై మీరు అన్యాయం చేసుకోకండి అంటే ఈ పవిత్ర మాసాలలో పాపాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ మాసాలలో పాపం చేయడం ఇతర సమయాల్లో పాపం చేయడం కంటే మరింత తీవ్రమైనది మరియు ఎక్కువ భారమైనది. ఎలాగైతే పవిత్ర నగరమైన మక్కాలో చేసిన పాపాలు మరింత ఘోరమైనవిగా పరిగణించబడతాయో, అలాగే ఈ పవిత్ర మాసాలలో చేసిన పాపాలు కూడా మరింత తీవ్రమైనవిగా పరిగణించబడతాయి.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూరహ్ హజ్ లో సెలవిచ్చాడు:

وَمَن يُرِدْ فِيهِ بِإِلْحَادٍۭ بِظُلْمٍ نُّذِقْهُ مِنْ عَذَابٍ أَلِيمٍ
(వ మయ్ యురిద్ ఫీహి బి ఇల్ హాదిమ్ బిజుల్మిన్ నుజిఖ్ హు మిన్ అజాబిన్ అలీమ్)

ఎవడు అందులో (మస్జిదే హరామ్ లో) అన్యాయపూర్వకంగా మార్గభ్రష్టతను కోరుకుంటాడో అతనికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపిస్తాము. (22:25)

అంటే పవిత్ర మాసాలలో పాపాల తీవ్రత, పాప భారం మరియు అల్లాహ్ దృష్టిలో వాటి ఘోరత పెరిగిపోతుంది. అందువల్ల ఈ మాసాలలో పాపాలకు దూరంగా ఉండి తౌబా, నమాజ్, ఖురాన్ పఠనం, జిక్ర్ మరియు ఇతర సత్కార్యాలను ఎక్కువగా చేయాలి.

హాఫిజ్ ఇబ్నె కసీర్ రహ్మతుల్లాహి అలైహి ఇలా వివరించారు: పవిత్ర మాసాలలో పాపాలు మరింత తీవ్రమవుతాయి. అందువల్ల ఇమామ్ షాఫీ రహ్మతుల్లాహి అలైహి మరియు అనేకమంది పండితుల అభిప్రాయం ప్రకారం, ఈ మాసాలలో హత్య జరిగినట్లయితే ‘దియత్’ (రక్త పరిహారం) మరింత కఠినంగా పరిగణించబడుతుంది. అలాగే హరమ్ ప్రాంతంలో హత్య చేసిన వారికి లేదా నిషిద్ధ బంధుత్వం (మహరమ్) కలిగిన వ్యక్తిని హత్య చేసిన వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఆ తర్వాత ఆయన ఖతాదా గారి మాటలను ఉటంకించారు. అవేమిటి? పవిత్ర మాసాలలో జరిగే అన్యాయం ఇతర సమయాల్లో జరిగే అన్యాయం కంటే మరింత పెద్ద పాపం మరియు ఎక్కువ భారమైనది.

అయితే అన్యాయం ఎలాంటి పరిస్థితుల్లోనైనా గొప్ప పాపమే. అన్యాయం అన్యాయమే, ప్రతి సందర్భంలో ప్రతి పరిస్థితిలో అది గొప్ప పాపమే అవుతుంది, ఘోరమైన పాపమే అవుతుంది. కానీ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తన ఇష్టానుసారం కొన్ని విషయాలకు మరింత గొప్పతనాన్ని మరియు ప్రాముఖ్యతను ప్రసాదిస్తాడు. అలాగే ఈ ప్రత్యేకత ఈ నాలుగు మాసాలకు అల్లాహ్ ప్రసాదించాడు.

ఇమామ్ ఖుర్తుబీ రహ్మతుల్లాహి అలైహి ఇలా అన్నారు:

“ఈ పవిత్ర మాసాలలో పాపాలు చేసి మీరు మీపై అన్యాయం చేసుకోకండి. ఎందుకంటే అల్లాహ్ ఒక విషయాన్ని ఒక కోణం నుండి గౌరవప్రదంగా చేసినప్పుడు దానికి ఒక ప్రత్యేకత, పవిత్రత ఉంటుంది. కానీ రెండు లేదా అంతకంటే ఎక్కువ కోణాల నుండి దానిని గొప్పదిగా చేసినప్పుడు దాని పవిత్రత, దాని యొక్క గౌరవం మరింత పెరిగిపోతుంది. అందువల్ల అలాంటి సమయాల్లో లేదా ప్రదేశాల్లో చేసిన చెడు పనికి శిక్ష మరింత తీవ్రమైపోతుంది. అలాగే చేసిన సత్కార్యానికి ప్రతిఫలం కూడా మరింత గొప్పదిగా ఉంటుంది.”

అభిమాన సోదరులారా! పవిత్ర మాసంలో పవిత్ర స్థలమైన మక్కాలో అల్లాహ్ కు విధేయత చూపిన వారి ప్రతిఫలం సాధారణ నెలలలో అదే మక్కాలో విధేయత చూపిన వారి ప్రతిఫలంతో సమానం కాదు. అలాగే సాధారణ నెలలో మక్కాలో చేసిన సత్కార్యానికి లభించే ప్రతిఫలం, సాధారణ నెలలో సాధారణ ప్రదేశంలో చేసిన సత్కార్యానికి లభించే ప్రతిఫలంతో సమానం కాదు.

సారాంశం ఏమిటంటే పవిత్ర కాలాలు అంటే ఇది ముహర్రం, రజబ్, జుల్ ఖాదా, జుల్ హిజ్జా. పవిత్ర ప్రదేశాలు మక్కా, మదీనా వగైరా అల్లాహ్ వద్ద ప్రత్యేక గౌరవం కలిగినవి. అందువల్ల వాటిలో చేసే సత్కార్యాలకు మరింత గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. వాటిలో చేసే పాపాలు మరింత తీవ్రమైనవిగా పరిగణించబడతాయి. కాబట్టి ఈ పవిత్ర మాసాలలో ముస్లింలు పాపాలకు దూరంగా ఉండాలి. సత్కార్యాలలో అధికంగా పాల్గొనాలి. పాపం ఎప్పుడూ చేయకూడదు. పూర్తి సంవత్సరం పన్నెండు మాసాలు చేయకూడదు. ముఖ్యంగా, ప్రత్యేకంగా పవిత్ర మాసాలలో ఎందుకంటే దాని యొక్క తీవ్రత పెరిగిపోతుంది.

షరియత్ ఆధారాల ద్వారా నిరూపితమైన విషయం ఏమిటంటే పవిత్ర కాలాలలో మరియు పవిత్ర ప్రదేశాలలో సత్కార్యాల ప్రతిఫలం మరింత పెరుగుతుంది. ఉదాహరణకు రంజాన్ మాసం, జుల్ హిజ్జా మాసం అలాగే ఈ ముహర్రం మాసం వంటి పవిత్ర కాలాలలో సత్కార్యాల ప్రతిఫలం అధికంగా ఉంటుంది. అలాగే మస్జిదుల్ హరామ్ మక్కా, మస్జిద్ నబవీ మదీనా వంటి పవిత్ర ప్రదేశాలలో కూడా సత్కార్యాలకు ప్రత్యేకమైన గొప్ప ప్రతిఫలం లభిస్తుంది.

జాబిర్ రజియల్లాహు అన్హు ద్వారా వచ్చిన ఒక సహీహ్ హదీసులో ఇలా ఉంది: మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “నా మస్జిద్ అంటే మస్జిద్ నాబవి లో చేసిన ఒక నమాజ్, మస్జిదుల్ హరామ్ తప్ప ఇతర ఏ ప్రదేశంలో చేసిన వెయ్యి నమాజుల కంటే ఉత్తమమైనది. మరియు మస్జిదుల్ హరామ్ లో చేసిన ఒక నమాజ్ ఇతర ప్రదేశాలలో చేసిన లక్ష నమాజుల కంటే ఉత్తమమైనది.” ఈ హదీసును ప్రముఖ ముహద్దిసీన్లు సహీహ్ గా నిర్ధారించారు. ఈ హదీసు యొక్క సనద్ పరంపర సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.

అభిమాన సోదరులారా! పవిత్ర కాలాలలో సత్కార్యాల ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది, పవిత్ర ప్రదేశాలలో చేసిన ఆరాధనలు మరింత గొప్ప ఫలితాన్ని కలిగిస్తాయి. అందువల్ల రంజాన్ మాసం, జుల్ హిజ్జా ముఖ్యంగా జుల్ హిజ్జా మొదటి పది రోజులు, ముహర్రం వంటి పవిత్ర కాలాలను మరియు మక్కా మదీనా వంటి పవిత్ర ప్రదేశాలను సత్కార్యాలతో సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి చిన్న పెద్ద పాపం నుండి అవిధేయత నుండి దూరంగా ఉండాలి. దుష్ట క్రియలు పాపాలు గురించి పండితుల అభిప్రాయం ప్రకారం, ధార్మిక పండితుల అభిప్రాయం ప్రకారం మనం చేసే పాపాలు ఈ పవిత్ర కాలాలలో మాసాలలో అవి సంఖ్యాపరంగా పెరగవు. సంఖ్యాపరంగా పెరగవు అంటే ఒక పాపం పది పాపాలుగా లెక్కించబడవు. కానీ వాటి తీవ్రత లేదా స్వభావం పరంగా పెరుగుతాయి. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూరహ్ అన్ ఆమ్ లో సెలవిచ్చాడు:

مَن جَآءَ بِٱلْحَسَنَةِ فَلَهُۥ عَشْرُ أَمْثَالِهَا ۖ وَمَن جَآءَ بِٱلسَّيِّئَةِ فَلَا يُجْزَىٰٓ إِلَّا مِثْلَهَا وَهُمْ لَا يُظْلَمُونَ

ఎవరైనా ఒక పుణ్యం చేస్తే అతనికి దాని పదింతల ప్రతిఫలం లభిస్తుంది. కానీ ఎవరైనా ఒక చెడు చేస్తే అతనికి దాని సమానమైన శిక్ష మాత్రమే ఇవ్వబడుతుంది. వారికి ఎటువంటి అన్యాయం చేయబడదు. (6:160)

కాబట్టి రంజాన్ మాసంలో గానీ, ముహర్రం మాసంలో గానీ లేదా మరెక్కడైనా గానీ పాపాలు సంఖ్యాపరంగా పెరగవు, పాపం ఎప్పుడూ ఒకటిగానే లెక్కించబడుతుంది. ఇది అల్లాహ్ యొక్క అపారమైన కరుణ మరియు అనుగ్రహం. అయితే, అయితే ఇది మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం. పాపం యొక్క తీవ్రత ప్రదేశం మరియు సమయాన్ని బట్టి మారుతుంది. సాధారణమైన మాసంలో చేసే పాపం, పవిత్ర మాసంలో చేసే పాపం సమానం కావు. తీవ్రత పెరిగిపోతుంది. దాని ప్రభావం పెరిగిపోతుంది. పవిత్ర స్థలాలు మక్కా హరమ్ లో చేసే పాపం ఇతర నగరాలలో చేసే పాపం కంటే చాలా తీవ్రమైనది, పెద్దది. అలాగే పవిత్ర మాసాలలో చేసే పాపం ఇతర నెలలలో చేసే పాపం కంటే అత్యంత ఘోరమైనది మరియు తీవ్రమైనది అని మనం మర్చిపోకూడదు.

పాపాలు మక్కాలో కూడా పుణ్యాల వలే రెట్టింపు మొత్తం పరంగా అవుతాయని సామాన్య ప్రజలు చెబుతుంటారు. ఈ మాట సరైనది కాదు. ఎందుకంటే పాపాలు రెట్టింపు కావడం ఖచ్చితంగా నిషిద్ధం. అల్లాహ్ ఎలా సెలవిచ్చాడు: “ఎవరైనా ఒక పాపం చేస్తే అతనికి దాని సమానమైన శిక్ష మాత్రమే ఇవ్వబడుతుంది.” ఇది పాపాలు రెట్టింపు కావు అని స్పష్టంగా చెబుతున్న ఖురాన్ ఆయత్. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే మక్కా వంటి పవిత్ర స్థలాల్లో పాపం యొక్క తీవ్రత పెరిగిపోతుంది. ఎందుకంటే సమయం మరియు స్థలం యొక్క పవిత్రతను బట్టి పాపం యొక్క తీవ్రత మారుతుంది. పాపం ఎంత తీవ్రమైతే శిక్ష కూడా అంత ఎక్కువగా ఉంటుంది. పాపం ఎంత చిన్నదైతే శిక్ష అంత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ శిక్ష పెరగడం అనేది పాపం యొక్క తీవ్రత పెరగడం వల్ల జరుగుతుంది.

అందుకే మక్కా హరమ్ గురించి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు – ఇది సూరహ్ హజ్ లో ఉంది ఆయత్ 25 లో: “మరియు ఎవరైనా అందులో అన్యాయంతో కూడిన ధర్మ విరుద్ధమైన పనిని చేయాలని సంకల్పిస్తే వారికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపిస్తాము.” అలాగే పవిత్ర మాసాల గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “ఫలా తజ్లిమూ ఫీహిన్న అన్ఫుసకుమ్.” కావున ఆ మాసాలలో మీరు మీకు అన్యాయం చేసుకోకండి. దీని అర్థం ఏమిటి? పవిత్ర మాసాలు కానీ ఇతర సమయాల్లో కూడా తమకు తాము అన్యాయం చేసుకోవడం, పాపం నిషిద్ధమే. కానీ పవిత్ర మాసాల్లో దాని తీవ్రత మరియు శిక్ష చాలా ఎక్కువగా ఉంటుంది.

అభిమాన సోదరులారా! షేక్ ఇబ్నె ఉసైమీన్ రహ్మతుల్లాహి అలైహి ఇలా అన్నారు: మక్కాలో చేసిన పాపాలు సంఖ్యాపరంగా పెరగవు అయితే వాటి తీవ్రత గొప్పతనం పరంగా పెరుగుతాయి. అంటే వాటికి విధించబడే శిక్ష మరింత కఠినంగా మరియు బాధాకరంగా ఉంటుంది. దీనికి ఆధారం అల్లాహ్ యొక్క ఈ ఆయత్ సూరహ్ అన్ ఆమ్ 160: “ఎవడు ఒక సత్కార్యం చేస్తాడో అతనికి దానికి పదిరెట్లు ప్రతిఫలం ఉంటుంది మరియు ఎవడు ఒక పాపం చేస్తాడో అతనికి దాని సమానమైన శిక్ష మాత్రమే ఇవ్వబడుతుంది. వారికి ఎటువంటి అన్యాయం చేయబడదు.” ఈ ఆయత్ స్పష్టంగా పాపాలు సంఖ్యాపరంగా రెట్టింపు కావు అని తెలియజేస్తుంది.

అయితే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మరొక చోట ఇలా సెలవిచ్చాడు: “వ మయ్ యురిద్ ఫీహి బి ఇల్ హాదిమ్ బిజుల్మిన్ నుజిఖ్ హు మిన్ అజాబిన్ అలీమ్.” ఎవడు హరమ్ ప్రాంతంలో అన్యాయపూర్వకంగా మార్గభ్రష్టతను కోరుకుంటాడో అతనికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపిస్తాము. అంటే మక్కాలో చేసిన పాపానికి వచ్చే శిక్ష అదే పాపాన్ని మక్కా వెలుపల చేసినప్పుడు వచ్చే శిక్ష కంటే మరింత కఠినంగా ఉంటుంది. ఇందులో మక్కాలో పాపాల నుండి దూరంగా ఉండాలని తీవ్రమైన హెచ్చరిక ఉంది. ఈ ఆయత్ ద్వారా తెలిసేది ఏమిటంటే హరమ్ లో చేసిన పాపం అత్యంత ఘోరమైనది. కేవలం పాపం చేయాలనే సంకల్పం లేదా ఉద్దేశం కూడా తీవ్రమైన హెచ్చరికకు కారణమవుతుంది. మరి వాస్తవంగా ఆ పాపాన్ని చేసిన ఆ వ్యక్తి యొక్క పాప భారం ఎంత తీవ్రమై ఉంటుందో ఊహించవచ్చు.

అభిమాన సోదరులారా! ఇక సారాంశం ఏమిటంటే మక్కా లేదా హరమ్ ప్రాంతంలో పాపాల యొక్క తీవ్రత పెరిగిపోతుంది. హరమ్ ప్రాంతంలో పాపం చేయాలనే ఆలోచనకే అల్లాహ్ తీవ్రమైన హెచ్చరిక చేశాడు. అలాగే పవిత్ర మాసాలలో కూడా పాపం చేస్తే దాని తీవ్రత, దాని ప్రభావం పెరిగిపోతుంది ఎక్కువగా ఉంటుంది. కావున మనము ఈ పవిత్ర మాసాలను గౌరవించాలి. పవిత్ర మాసాలను గౌరవించడం అంటే ఏంటి? ప్రతి చిన్న పెద్ద పాపం నుండి అవిధేయత నుండి తప్పుల నుండి దూరంగా ఉండాలి. సదాచారాలు, సత్కార్యాలు, పుణ్యకార్యాలు, మంచి పనులు ఎక్కువగా చేయాలి. దుఆ లు, జిక్ర్, నఫిల్ ఉపవాసాలు, ఖురాన్ పారాయణము వగైరా వగైరా.

“ఫలా తజ్లిమూ ఫీహిన్న అన్ఫుసకుమ్.” ఈ ఆయత్ లోని జుల్మ్ (దౌర్జన్యం) అంటే ఏమిటి? దౌర్జన్యం యొక్క అర్థం ఏమిటంటే ప్రత్యేకంగా ఈ నాలుగు మాసాలలో మీరు అల్లాహ్ అవిధేయతకు దూరంగా ఉండండి. ఎందుకంటే వీటిలో అవిధేయత పాపం ఎన్నో రెట్లు పెరిగిపోతుంది.

హాఫిజ్ ఇబ్నె కసీర్ రహ్మతుల్లాహి అలైహి హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనాన్ని హదీసును ఇలా తెలియజేశారు:

“అల్లాహ్ దౌర్జన్యాన్ని సంవత్సరపు పన్నెండు మాసాల్లోనూ నిషేధించాడు. తదుపరి నాలుగు మాసాలను వాటిలో ప్రత్యేకంగా ఖరారు చేశారు. ఎందుకంటే వీటిలో చెడు, అవిధేయతల పాపం పెరుగుతుంది మరియు మంచి సదాచారణల పుణ్యం కూడా ఎన్నో రెట్లు పెరుగుతుంది.”

ఇమామ్ ఖతాదా ఈ ఆయత్ గురించి వ్యాఖ్యానిస్తూ ఇలా వివరించారు: దౌర్జన్యం పాపం ఎల్లప్పుడూ ఎక్కువగా ఉన్నప్పటికీ, కానీ ప్రత్యేకంగా నిషిద్ధ మాసాలలో దీని పాపం మరియు బరువు ఇతర మాసాల కన్నా ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. తీవ్రత పెరిగిపోతుంది.

దైవదూతల్లో ఈ విధంగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దైవదూతల్లో కొందరిని ప్రత్యేకంగా సందేశహరులుగా చేశాడు. గ్రంథాలలో దివ్య ఖురాన్ ను, యావత్ భూమిలో మసీదులను, అలాగే మాసాల్లో రంజాన్ నెల మరియు నిషిద్ధ మాసాలతో పాటు అనుకున్నట్లే దినాలలో శుక్రవారాన్ని, రాత్రుల్లో లైలతుల్ ఖదర్ ను అల్లాహ్ అనుకున్నట్లే ఏ మాసంలో పాప ఫలాన్ని అధికం చేయాలో మరియు దేనికి గొప్పతనం ప్రసాదించాలో పూర్తిగా అల్లాహ్ ఇష్టం. అంటే ఏ విధంగానైతే అల్లాహ్ మాసాలలో రంజాన్ యొక్క ప్రత్యేకత ఎంచుకున్నాడో ఖురాన్ గురించి, అలాగే పవిత్ర నాలుగు మాసాలు అల్లాహ్ ఎంచుకున్నాడో, దైవదూతల్లో జిబ్రయీల్ ను అల్లాహ్ ఎంచుకున్నాడో ఆ విధంగా ఈ మాసాలలో. అల్లాహ్ తన ఇష్టానుసారం అది పూర్తిగా అతని ఇష్టం. అందుకే అల్లాహ్ దేన్నైతే గొప్పదిగా భావిస్తాడో మీరు కూడా దానిని గొప్పదిగా భావించండి అని ఖతాదా రహ్మతుల్లాహి అలైహి వివరించాడు. అల్లాహ్ దేనికి గొప్పదిగా భావించాడో మనం కూడా దానిని గొప్పదిగా భావించాలి. ఈ వివరం ఇబ్నె కసీర్ భాగం రెండులో ఉంది.

ప్రియ సోదరులారా! సంవత్సరం పొడుగునా ప్రత్యేకించి ఈ నాలుగు మాసాల్లో మనం అల్లాహ్ అవిధేయత నుండి దూరంగా ఉండాలి మరియు పాప కార్యాలను త్యజించాలి. ఎందుకంటే అవిధేయత మరియు పాప కార్యాల మూలంగా హృదయాలకు తుప్పు పడుతుంది. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూరహ్ ముతఫ్ఫిఫీన్ లో సెలవిచ్చాడు:

كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا۟ يَكْسِبُونَ
(కల్లా బల్ రాన అలా ఖులూబిహిమ్ మా కానూ యక్ సిబూన్)
ఎంతమాత్రం కాదు! అసలు వారి హృదయాలకు వారు చేసిన దుష్కార్యాల తుప్పు పట్టింది. (83:14)

మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

“ఇన్నల్ ముఅమిన ఇజా అజ్ నబ జంబన్ కానత్ నుఖ్ తతన్ సౌదా ఫీ ఖల్ బిహి, ఫ ఇన్ తాబ వ నజఅ వస్తఘ్ ఫర సఖల మిన్ హా.” అంటే ఈ హదీసు తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజా లో ఉంది. దానికి అర్థం ఏమిటంటే: విశ్వాసి ఏదైనా దుష్కార్యం పాపం చేసినప్పుడు అతని హృదయంలో ఒక నల్లటి మచ్చ ఏర్పడుతుంది. తదుపరి ఒకవేళ అతను పశ్చాత్తాపం చెంది ఆ దుష్కార్యాన్ని త్యజించి పాపాన్ని వదిలి క్షమించమని అల్లాహ్ ను వేడుకుంటే అతని హృదయాన్ని శుభ్రం చేయడం జరుగుతుంది. ఆ నల్లటి మచ్చ అల్లాహ్ తీసేసి కడిగేస్తాడు హృదయం నుంచి. ఒకవేళ అతను ఒక దుష్కార్యం తర్వాత మరో దుష్కార్యం ఒక పాపం తర్వాత మరో పాపం ఈ విధంగా చేస్తూ పోతూ ఉంటే అతని హృదయంలో నల్లటి మచ్చ పెరుగుతూ పోయి చివరికి పూర్తి హృదయాన్ని ఆక్రమించుకుంటుంది. దీనినే అల్లాహ్ ఖురాన్ లో రాన్ అన్నాడు: “కల్లా బల్ రాన అలా ఖులూబిహిమ్.” హృదయాలకు తుప్పు పట్టడం.

అభిమాన సోదరులారా! ఇక పాపాల ప్రమాదం లేకపోతే ప్రభావం సాధారణంగా ఎప్పుడు చేసినా చాలా కఠినంగా ఉంటుంది. ఉదాహరణకు నేను ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను సారాంశంగా, వివరణకు పోకుండా. పాపాల మూలంగా అల్లాహ్ యొక్క ఆగ్రహానికి గురవుతాము ఎప్పుడు పాపం చేసినా. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “ఇయ్యాక వల్ మాసియ ఫ ఇన్న బిల్ మాసియతి హల్ల సఖతుల్లాహి అజ్జ వజల్ల.” అల్లాహ్ కు అవిధేయత చూపకండి అంటే పాపం చేయకండి. ఎందుకు పాపాల వల్ల అల్లాహ్ ఆగ్రహానికి గురవుతాము. ఈ హదీసు ముస్నద్ అహ్మద్ లో ఉంది.

అలాగే అల్లాహ్ సెలవిచ్చాడు సూరహ్ హజ్ లో: అల్లాహ్ పరాభవం పాలుజేసిన వాడికి ఎవ్వరూ ఆదరించరు. అలాగే పాపాల మూలంగా దాసుడు సైతాన్ బందీ అయిపోతాడు సూరహ్ జుఖ్రుఫ్ ఆయత్ 36:

وَمَن يَعْشُ عَن ذِكْرِ ٱلرَّحْمَٰنِ نُقَيِّضْ لَهُۥ شَيْطَٰنًا فَهُوَ لَهُۥ قَرِينٌ
(వ మయ్ యఅషు అన్ జిఖ్రిర్ రహ్మాని నుఖయ్యిజ్ లహు షైతానన్ ఫహువ లహు ఖరీన్)
కరుణామయుని స్మరణ పట్ల గుడ్డిగా వ్యవహరించే వ్యక్తిపై మేము షైతానును నియమిస్తాము, ఇక వాడు అతనికి సహవాసిగా ఉండిపోతాడు. (43:36)

సైతాన్. అలాగే పాపాల వల్ల మనిషి తన్ను తానే మర్చిపోతాడు సూరహ్ హషర్ ఆయత్ 19:

وَلَا تَكُونُوا۟ كَٱلَّذِينَ نَسُوا۟ ٱللَّهَ فَأَنسَىٰهُمْ أَنفُسَهُمْ ۚ أُو۟لَٰٓئِكَ هُمُ ٱلْفَٰسِقُونَ
(వలా తకూనూ కల్లజీన నసుల్లాహ ఫ అన్సాహుమ్ అన్ఫుసహుమ్ ఉలాయిక హుముల్ ఫాసిఖూన్)
మరియు మీరు అల్లాహ్ ను మరిచిపోయిన వారి మాదిరిగా అయిపోకండి. వారి ఈ విస్మరణ కారణంగా అల్లాహ్ కూడా వారిని తమ ఆత్మలనే మరిచిపోయిన వారిగా చేసేశాడు. అలాంటి వారే పరమ అవిధేయులు. (59:19)

అలాగే పాపాల వల్ల జీవితం దుర్భరమైపోతుంది, మనశ్శాంతిని కోల్పోతాము. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు సూరహ్ తాహా లో:

وَمَنْ أَعْرَضَ عَن ذِكْرِى فَإِنَّ لَهُۥ مَعِيشَةً ضَنكًا وَنَحْشُرُهُۥ يَوْمَ ٱلْقِيَٰمَةِ أَعْمَىٰ
(వ మన్ ఆరజ అన్ జిక్రీ ఫ ఇన్న లహు మఈషతన్ జంకా వ నహ్ శురుహూ యౌమల్ ఖియామతి అమా)
మరియు ఎవడు నా స్మరణ (ఖురాన్) పట్ల వైముఖ్యత చూపుతాడో అతని బ్రతుకు దుర్భరమవుతుంది. మరియు ప్రళయ దినాన మేము అతన్ని గుడ్డివానిగా చేసి లేపుతాము. (20:124)

ప్రపంచంలో శిక్ష ఏమిటి? దుర్భరమైపోతుంది, అశాంతి ఉంటుంది, అలజడి ఉంటుంది, సమస్యలు ఉంటాయి, మనశ్శాంతి ఉండదు, టెన్షన్ లో ఉంటాము ఈ ప్రపంచంలో. పరలోకంలో గుడ్డివానిగా లేపుతాము. అప్పుడు ఆ వ్యక్తి అల్లాహ్ కు అడుగుతాడు:

قَالَ رَبِّ لِمَ حَشَرْتَنِىٓ أَعْمَىٰ وَقَدْ كُنتُ بَصِيرًا
(ఖాల రబ్బి లిమ హషర్ తనీ అమా వ ఖద్ కుంతు బసీరా)
“ప్రభూ! నన్ను గుడ్డివానిగా చేసి లేపారేమిటీ? నాకు చూపు ఉండేదికదా!” అని అతను అంటాడు (20:125)

అప్పుడు అల్లాహ్ సమాధానం ఇస్తాడు:

قَالَ كَذَٰلِكَ أَتَتْكَ ءَايَٰتُنَا فَنَسِيتَهَا ۖ وَكَذَٰلِكَ ٱلْيَوْمَ تُنسَىٰ
(ఖాల కజాలిక అతత్ క ఆయాతునా ఫనసీత హా వ కజాలికల్ యౌమ తున్ సా)

“జరగవలసిన విధంగానే జరిగింది. (ఒకప్పుడు) నీ వద్దకు వచ్చిన మా ఆయతులను (వచనాలను, సూచనలను, మహిమలను) నువ్వు విస్మరించావు. అందుకే ఈనాడు నువ్వు కూడా విస్మరించబడుతున్నావు” అని అనబడుతుంది. (20:126)

ఇది పాపాల ప్రభావం. పాపాల వల్ల ప్రస్తుతం అనుభవించే వరాలు అల్లాహ్ లాక్కుంటాడు. దీనికి ఉదాహరణ ఆదమ్ అలైహిస్సలాం హవ్వా అలైహిస్సలాం స్వర్గంలో ఉన్నారు. దీని వివరణ సూరహ్ బఖరా లో ఉంది ఆయత్ 30, 31, 32. అల్లాహ్ వరాలను అనుభవిస్తూ ఉన్నారు అల్లాహ్ నేమత్ లను సుఖంగా సంతోషంగా హాయిగా టెన్షన్ లేదు ఏమీ లేదు. అక్కడ తప్పు జరిగింది అల్లాహ్ ఆ వరం తీసేసుకున్నాడు భూమిపైన వేసేశాడు. అంటే ఇది ఉదాహరణ. అలాగే ఉహుద్ సంఘటన, ఉహుద్ లో కొంతమంది సహాబాలకి వారు చేసిన ఆ పొరపాటు మూలంగా ఇది అయిపోయింది మనకు తెలిసిన విషయమే. అభిమాన సోదరులారా చెప్పడం ఏమిటంటే పాపాల వల్ల ఉపాధిలో కొరత వస్తుంది. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “వ ఇన్నర్ రజుల ల యుహ్రముర్ రిజ్ ఖ బి ఖతీఅతిన్ యఅ మలుహా.” అంటే మనిషి పాపం వల్ల అతనికి ఇవ్వబోయే ఆ రిజ్క్ కి మహ్రూమ్ అయిపోతాడు. అల్లాహు అక్బర్.

అభిమాన సోదరులారా ఇవి ఎప్పుడు పాపం చేసినా దాని ప్రభావం. మరి ఇటువంటి పాపాలు, ఇటువంటి అన్యాయాలు, ఇటువంటి దౌర్జన్యాలు, ఇటువంటి అవిధేయతలు, ఇటువంటి ఘోరాలు, ఇటువంటి నేరాలు పవిత్ర మాసాలలో చేస్తే దాని తీవ్రత ఎలా ఉంటుంది? మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు నేను పాపాల ప్రభావం ప్రభావాలు కొన్ని చెప్పాను కొన్ని మాత్రమే. పాపం వల్ల రిజ్క్ మహ్రూమ్ అవుతాము. పాపం వల్ల అల్లాహ్ మనకు ఇప్పుడు ఇచ్చిన వరం ఇవ్వబోయే వరం రెండింటికి అల్లాహ్ దూరం చేసేస్తాడు. మనశ్శాంతి ఉండదు, శాంతి తీసేస్తాడు. ఇలాంటివి ఉన్నాయి కదా ఈ లోకంలో కూడా పరలోకంలో కూడా ఇవి ఎప్పుడు పాపం చేసినా. ఇటువంటి పాపాలు పవిత్ర మాసాలలో చేస్తే దాని ప్రభావం, దాని తీవ్రత ఎలా ఉంటుంది? మనం ఊహించుకోగలము.

ఇప్పుడు సుకూన్ అనేది శాంతి అనేది సుఖమైన జీవితం అనేది టెన్షన్ లేని జీవితం అనేది సాధారణంగా లేదు. ఎందుకు? డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా పేదవారు ధనవంతులు, మంచి హోదాలో ఉన్నవారు హోదా లేని ఉద్యోగం లేని వారు – అంటే పేదవారు మిడిల్ క్లాస్ వారు ధనవంతులు అందరూ మనశ్శాంతి కోల్పోయారు. అంటే డబ్బు ఉన్న వారికి శాంతి లేదు, డబ్బు లేని వారికి శాంతి లేదు. ఉద్యోగం ఉన్న వారికి శాంతి లేదు, ఉద్యోగం లేని వారికి శాంతి లేదు. కారణం ఏమిటి? కారణం ఈ పాపాలే.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ నాకు చెప్పడం కంటే ఎక్కువగా మీకు వినడం కంటే ఎక్కువగా ఇస్లాంను అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో ప్రతి ప్రదేశంలో ప్రతి మాసంలో ముఖ్యంగా పవిత్ర మాసాలలో ప్రతి చిన్న పెద్ద పాపం నుండి మనల్ని అల్లాహ్ రక్షించుగాక. ఓ అల్లాహ్ అన్ని మాసాలలో ముఖ్యంగా ఈ పవిత్ర మాసాలలో మమ్మల్ని పాపాలు మరియు అవిధేయతల నుండి కాపాడు. నీ విధేయత మరియు నీ సంతృప్తిని పొందే సత్కార్యాలకు మాకు తౌఫీక్ ప్రసాదించు. మమ్మల్ని నీ సత్ ప్రవర్తన గల దాసులలో చేర్చు. ఆమీన్.

వ ఆఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

సుబ్ హానకల్లాహుమ్మ వ బి హమ్దిక అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ ఫిరుక వ అతూబు ఇలైక్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=46079


లుఖ్మాన్ (అలైహిస్సలాం) ఉపదేశాలు: జీవన విద్య – హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

లుఖ్మాన్ (అలైహిస్సలాం) ఉపదేశాలు: జీవన విద్య
హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/H-0-b8o_u2M [30 నిముషాలు]

ఈ ప్రసంగంలో సురయే లుఖ్మాన్ ఆధారంగా ‘జీవన విద్య’ గురించి వివరించారు. లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి ఇచ్చిన ఎనిమిది ముఖ్యమైన ఉపదేశాలను ఈ క్రింది విధంగా చర్చించారు: అల్లాహ్ పట్ల ఏకత్వాన్ని కలిగి ఉండటం (తౌహీద్), తల్లిదండ్రుల పట్ల గౌరవం మరియు విధేయత చూపడం, అల్లాహ్ యొక్క సర్వవ్యాప్త జ్ఞానాన్ని గుర్తించి తఖ్వాతో జీవించడం, నమాజును నిలబెట్టడం, సమాజంలో మంచిని ప్రబోధించి చెడును నిరోధించడం, కష్ట సమయాల్లో సహనం (సబర్) పాటించడం, అహంకారాన్ని వీడి వినయాన్ని అలవరచుకోవడం మరియు మాట తీరులో, నడకలో మర్యాదను పాటించడం. చివరగా ఈ ఐదు సూత్రాలు—తౌహీద్, నమాజ్, అఖ్లాక్, సబర్, వినయం—మానవ జీవితానికి మరియు సమాజ శ్రేయస్సుకు పునాదులని ఆయన సారాంశం ఇచ్చారు.

అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

إِنَّ الْحَمْدَ لِلَّهِ ، نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ ، وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا ، وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا ، مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ ، وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ.

(ఇన్నల్ హమ్దలిల్లాహి నహ్మదుహు వ నస్తయీనుహు వ నస్తగ్ఫిరుహు, వ నవూజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా, వ మిన్ సయ్యిఆతి ఆ’మాలినా, మన్ యహదిహిల్లాహు ఫలా ముజిల్ల లహు, వ మన్ యుజ్లిల్ ఫలా హాదియ లహు, వ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు.)

అల్లాహుమ్మ సల్లి వసల్లిమ్ వ బారిక్ అలా అబ్దిక వ రసూలిక ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తన అనుగ్రహాలను కురిపించు గాక.

అభిమాన సోదరులారా! ఈ రోజు మనం పరిశీలించబోయే విషయం: లుఖ్మాన్ అలైహిస్సలాం ఉపదేశాలు – జీవన విద్య. మన జీవితాన్ని సన్మార్గంలో నడిపించే అమూల్యమైన మార్గదర్శకత్వం లుఖ్మాన్ అలైహిస్సలాం వారి ఉపదేశాలలో ఉంది. ఖురాన్ లో ఒక సూరా పేరే ‘లుఖ్మాన్’. ఇందులో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి ఇచ్చిన ఉపదేశాలను పేర్కొన్నాడు. కానీ ఆ ఉపదేశాలు కేవలం ఒక తండ్రి సలహాలు కాదు, ఇవి సమగ్ర జీవన విద్య.

అన్నిటికంటే ముఖ్యమైనది తౌహీద్. ఇస్లాం యొక్క మొదటి మరియు అత్యంత ముఖ్యమైన బోధన తౌహీద్. ఇదే విషయం ముస్లిములు మరియు ముష్రికుల మధ్య స్పష్టమైన తేడాను ఏర్పరుస్తుంది. దీనిని నిరాకరించే వ్యక్తి ముష్రిక్ అవుతాడు. అలాంటి వ్యక్తికి లోకంలోనూ, పరలోకంలోనూ అవమానం మరియు అపకీర్తి తప్పదు. ఎందుకంటే షిర్క్ చేయడం అంటే ఒకే ఒక్క దేవుడైన అల్లాహ్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, ఆయన అస్తిత్వాన్ని నిరాకరించడం అవుతుంది. మరోవైపు షిర్క్ చేసే వ్యక్తి తనలాంటి లేదా తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న సృష్టుల ముందు తల వంచి, తనను తాను అవమానించుకుంటాడు మరియు హీన స్థితికి దిగజారుతాడు.

లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి ఇచ్చిన మొదటి హితబోధ, మొదటి నసీహత్ ఇదే తౌహీద్ గురించి, షిర్క్ ఖండన గురించి:

وَإِذْ قَالَ لُقْمَانُ لِابْنِهِ وَهُوَ يَعِظُهُ يَا بُنَيَّ لَا تُشْرِكْ بِاللَّهِ ۖ إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ
(వ ఇజ్ కాల లుఖ్మాను లిబ్నిహీ వహువ యఇజుహు యా బునయ్య లా తుష్రిక్ బిల్లాహి ఇన్నష్షిర్క లజుల్మున్ అజీమ్)

లుఖ్మాన్‌ తన కుమారునికి హితబోధ చేస్తూ ఇలా అన్నాడు: “ఓ నా ముద్దుల పుత్రుడా! అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించకు. నిస్సందేహంగా అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్‌ చేయటం) ఘోరమైన అన్యాయం.”(31:13)

లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి చేసిన మొట్టమొదట ఉపదేశం షిర్క్ నుండి వారించడం. దీనిని బట్టి విదితమయ్యేదేమిటంటే, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎప్పుడు హితోపదేశం చేసినా ప్రధాన స్థానంలో షిర్క్ ఖండన, తౌహీద్ అంగీకారం గురించే అయి ఉండాలి. షిర్క్ నుండి వారించే మాటలు తప్పకుండా చెప్పాలి. తమ పిల్లలలో అల్లాహ్ ఏకత్వాన్ని నూరిపోయాలి.

జీవన విద్యలో మొదటి పాఠం తౌహీద్. ఇది మనం బాగా తెలుసుకోవాలి. విశ్వాసం సరిగ్గా ఉంటే జీవితం సరిగ్గా ఉంటుంది. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “ఎవరైతే షిర్క్ చేయకుండా చనిపోతారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు.” అందుకే మనము చదివే, పఠించే కలిమా – ‘కలిమతుత్ తౌహీద్’ – లా ఇలాహ ఇల్లల్లాహ్ లో మొదటి భాగం ఏమిటి? షిర్క్ ఖండన. రెండవ భాగం తౌహీద్ అంగీకారం ఉంటుంది. నఫీ – ఇస్ బాత్. లా ఇలాహ (దేవుడు లేడు), ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప). అంటే మొదటి భాగం ఏమి ఉంది? షిర్క్ ఖండన ఉంది. రెండవ భాగంలో తౌహీద్ అంగీకారం గురించి ఉంటుంది.

కావున లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి బోధించిన మొదటి విషయం, నసీహత్ చేసిన మొదటి నసీహత్ అది తౌహీద్ గురించి, షిర్క్ ఖండన గురించి ఉంది. ఎందుకంటే ఇది జీవితంలో అన్నిటికంటే ప్రధానమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది. దీనికి మించినది ఏదీ లేదు.

ఇక రెండో విషయానికి వస్తే, తౌహీద్ తర్వాత అమ్మ నాన్న గురించి ఉంటుంది, తల్లిదండ్రుల గురించి ఉంటుంది. ఇస్లాం ధర్మంలో తల్లిదండ్రుల గౌరవానికి అత్యున్నత స్థానం ఉంది. అల్లాహ్ ఆరాధన తర్వాత వెంటనే తల్లిదండ్రుల పట్ల దయ, విధేయతను ఖురాన్ ఆదేశిస్తుంది. లుఖ్మాన్ సూరాలో, ఆయత్ 14 లో ఇలా ఉంటుంది:

وَوَصَّيْنَا الْإِنْسَانَ بِوَالِدَيْهِ حَمَلَتْهُ أُمُّهُ وَهْنًا عَلَىٰ وَهْنٍ وَفِصَالُهُ فِي عَامَيْنِ أَنِ اشْكُرْ لِي وَلِوَالِدَيْكَ إِلَيَّ الْمَصِيرُ

(వ వస్సైనల్ ఇన్ సాన బివాలిదైహి హమలత్ హు ఉమ్ముహు వహ్నన్ అలా వహ్నిన్ వ ఫిసాలుహు ఫీ ఆమైని అనిష్కుర్ లీ వ లివాలిదైక ఇలయ్యల్ మసీర్)

మరి మేము మానవునికి అతని తల్లిదండ్రుల విషయంలో గట్టిగా తాకీదు చేశాము- అతని తల్లి అతన్ని ప్రయాసపై ప్రయాసకు ఓర్చుకుంటూ తన గర్భంలో మోసింది. మరి అతని పాలను విడిపించటానికి రెండు సంవత్సరాలు పట్టింది. (కనుక ఓ మానవుడా!) నువ్వు నాకూ, నీ తల్లిదండ్రులకూ కృతజ్ఞుడవై ఉండు. (ఎట్టకేలకు మీరంతా) మరలి రావలసింది నా వద్దకే.(31:14)

ఈ ఆయతులు తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత, సహనం, దయ చూపాలని స్పష్టంగా బోధిస్తాయి.

మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “అల్లాహ్ సంతృప్తి తల్లిదండ్రుల సంతృప్తిలో ఉంది. అల్లాహ్ అసంతృప్తి తల్లిదండ్రుల అసంతృప్తిలో ఉంది.”

ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ని అడిగాడు: “నా మంచి సహవాసానికి ఎవరు ఎక్కువ అర్హులు?” మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “నీ తల్లి“. అతను మూడు సార్లు అడిగితే, మూడు సార్లు కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీ తల్లి” అని చెప్పారు. నాలుగవ సారి “నీ తండ్రి” అని సమాధానం ఇచ్చారు.

అంటే తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, వారితో మృదువుగా మాట్లాడాలి, వారి అవసరాలు తీర్చాలి, వారి కోసం దుఆ చేయాలి. ఈ విధంగా రెండవ విషయం లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి చేసింది అది తల్లిదండ్రుల గురించి.

ఖురాన్ మరియు హదీసు ప్రకారం తల్లిదండ్రుల గౌరవం ఒక మహత్తర ఇబాదత్. వారిని సంతోషపరచడం ద్వారా అల్లాహ్ సంతోషాన్ని పొందవచ్చు. అందుకే ప్రతి ముస్లిం తన తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం, విధేయతతో ఉండాలి. ఇది రెండవ విషయం. లుఖ్మాన్ అలైహిస్సలాం యొక్క ఉపదేశాల విషయంలో ‘వ వస్సైనల్ ఇన్ సాన బివాలిదైహి’ అని ఉంటుంది.

మొదటిది ఏంటి? తౌహీద్, నమ్మకం, విధేయత, ఆజ్ఞాపాలన. రెండవది ఏమిటి? తల్లిదండ్రుల గురించి. అంటే తల్లి కష్టాలు, తండ్రి పోషణ – ఇది మనకు ఏమి నేర్పుతుంది? కుటుంబ విలువలు సమాజానికి పునాది.

ఇక మూడవ విషయానికి వస్తే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సర్వజ్ఞుడు. బాధ్యతా భావం కలుగుతుంది దీనివల్ల. అంటే లుఖ్మాన్ అలైహిస్సలాం చేసిన మూడవ హితోపదేశం:

يَا بُنَيَّ إِنَّهَا إِن تَكُ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ فَتَكُن فِي صَخْرَةٍ أَوْ فِي السَّمَاوَاتِ أَوْ فِي الْأَرْضِ يَأْتِ بِهَا اللَّهُ ۚ إِنَّ اللَّهَ لَطِيفٌ خَبِيرٌ

(యా బునయ్య ఇన్నహా ఇన్ తకు మిస్ ఖాల హబ్బతిమ్ మిన్ ఖర్దలిన్ ఫతకున్ ఫీ సఖ్రతిన్ అవ్ ఫిస్ సమావాతి అవ్ ఫిల్ అర్జి యాతి బిహల్లాహు ఇన్నల్లాహ లతీఫున్ ఖబీర్)

(లుఖ్మాన్‌ తన కుమారునికి ఇలా బోధపరిచాడు) “నాయనా! ఏదైనా వస్తువు ఆవగింజంత ఉన్నా, అది ఏదైనా రాతి బండలో ఉన్నా, లేక అది ఆకాశాలలో ఉన్నా లేదా భూమిలో ఉన్నా దాన్ని అల్లాహ్‌ తప్పకుండా తీసుకువస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ సూక్ష్మ విషయాలను ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు. (31:16)

అంటే ఒక ఆవగింజంత పని అయినా అల్లాహ్ గమనిస్తాడు. రహస్య జీవితంలో కూడా తఖ్వా కలిగి ఉండాలి అన్న మాట. సమాజంలో ఉన్నా, సమూహంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఏకాంతంలో ఉన్నా ఎలాగైనా సరే, రాత్రి పగలు ఎక్కడైనా సరే అల్లాహ్ గమనిస్తున్నాడు. ఏదీ కూడా అల్లాహ్ తో గోప్యంగా లేదు. ప్రతి విషయం అల్లాహ్ కు తెలుసు. రహస్య జీవితంలో కూడా తఖ్వా కలిగి ఉండాలి అని బోధపడుతుంది మనకు.

ఈ కాలంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉపయోగించేది మొబైల్. కావున అల్లాహ్ చూస్తున్నాడని గుర్తుంచుకోవాలి. హరామ్ కంటెంట్ చూడకూడదు, చెడు చాటింగ్ చేయకూడదు, చెడు సంబంధాలు నివారించాలి. రహస్యంగా చేసిన పాపం కూడా అల్లాహ్ కు చాలా బాగా తెలుసు. ఇది మనలో తఖ్వా పెంచుతుంది ఈ భావన. ఈ హితోపదేశం ఆవగింజంత కూడా అల్లాహ్ కు తెలుసు అంటే నేను ఏది చేసినా, నేను ఏది ఊహించినా అల్లాహ్ ఎరుగుతాడు. అన్ని విషయాలు అల్లాహ్ కు తెలుసు. కావున ఈ భావన కలిగి ఉంటే ఏమవుతుంది? తఖ్వా పెరుగుతుంది, దైవభీతి పెరుగుతుంది.

ఇక నాలుగవ ఉపదేశం లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి చేసిన ఉపదేశం నాలుగవది: నమాజ్ స్థాపన.

يَا بُنَيَّ أَقِمِ الصَّلَاةَ…
(యా బునయ్య అఖిమిస్ సలాత…)

“ఓ నా కుమారా! నమాజును స్థాపించు…” (31:17)

ఇస్లాం ధర్మంలో సలాహ్ (నమాజు) అత్యంత ముఖ్యమైన ఇబాదత్. ఇది ఇస్లాం యొక్క ఐదు స్తంభాలలో ఒక స్తంభం. అర్కానుల్ ఇస్లాం లోని ఒక రుకున్. అల్లాహ్ పై విశ్వాసం తర్వాత అత్యంత ప్రధానమైన కర్తవ్యం అస్సలాహ్.

నమాజ్ గురించి ఖురాన్ లో అనేక చోట్ల ప్రస్తావించబడింది. “నమాజ్ ను స్థాపించండి, జకాత్ ఇవ్వండి” – సూరయే బఖరాలో, సూరయే అన్కబూత్ లో, సూరయే తాహాలో అనేక సూరాలలో ఉంది. నమాజ్ అసభ్య కార్యాల నుండి, చెడు పనుల నుండి నివారిస్తుంది. అంటే ఈ ఆయత్ కి చాలా వివరంగా చెప్పవచ్చు – ‘ఇన్నస్ సలాత తన్ హా అనిల్ ఫహ్ షాయి వల్ మున్ కర్’. నమాజ్, నమాజ్ చేసే వ్యక్తిని చెడు పని నుండి, పాపం నుండి, ఫహ్ షా నుండి, మున్ కర్ నుండి కాపాడుతుంది అని ఇది ఖురాన్ వాక్యం, ఖురాన్ ఆయత్. మరి ఇప్పుడు మనం సమాజంలో గమనిస్తున్నాము – నమాజులు చేస్తున్నాము, పాపాలు చేస్తున్నాము. నమాజులు చేస్తున్నాము, సినిమాలు చూస్తున్నాము. నమాజ్ చేస్తున్నాము, బూతులు మాట్లాడుతున్నాము. నమాజ్ చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు. నమాజులు చేస్తున్నారు, అనేక పాపాలకి పాల్పడుతున్నారు. అంటే మరి అల్లాహ్ వాగ్దానం కదా అది ఖురాన్ లో, ఆయత్ లో ఉంది కదా! ప్రతి ప్రవక్త నమాజ్ గురించి హెచ్చరించారు. మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రాణం పోయే ఆ సమయంలో కూడా ‘అస్సలాత్ అస్సలాత్’ అని చెప్పారు. మరి ఇటువంటి నమాజ్ మరి నమాజ్ చేసే వ్యక్తిని పాపాల నుండి, దుర్మార్గాల నుండి, మోసాల నుండి, చెడు నుండి ఎందుకు కాపాడటం లేదు అంటే – నమాజ్ చేసే రీతిలో, ఏ విధానంలో నమాజ్ చేయాలో, ఏ హక్కులతో నమాజ్ చేయాలో, ఏ రీతిలో నమాజ్ చేయాలో, ఏ భక్తితో, ఏ భావనతో నమాజ్ చేయాలో, ఎటువంటి విశ్వాసంతో నమాజ్ చేయాలో, ఏ విధానంతో నమాజ్ చేయాలో ఆ విధానం లేదు కాబట్టి. “నన్ను స్మరించుటకై నమాజ్ స్థాపించు”. ఈ ఆయతులు నమాజ్ మనిషిని పాపాల నుండి దూరంగా ఉంచి అల్లాహ్ స్మరణలో ఉంచుతుందని తెలియజేస్తాయి.

మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా నమాజ్ గురించి అనేక సందర్భాలలో అనేక విధాలుగా తెలియజేసి ఉన్నారు. “మన మధ్య మరియు కుఫ్ర్ మధ్య తేడా అనేది నమాజ్.” రేపు ప్రళయ దినాన మనిషి నుండి మొదట అడగబడేది నమాజ్ గురించే.

ఈ విధంగా నమాజ్ గురించి చాలా విషయాలు ఉన్నాయి. నమాజ్ వల్ల కలిగే ప్రయోజనాలలో అల్లాహ్ కు దగ్గరవ్వడం, హృదయానికి శాంతి, పాపాల క్షమాపణ, క్రమశిక్షణ మరియు సమయపాలన, సమాజంలో ఐక్యత (జమాత్ నమాజ్ ద్వారా). ఈ విధంగా నమాజ్ గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఖురాన్ మరియు హదీసు ప్రకారం నమాజ్ ముస్లిముల జీవితానికి ఆధారం. ఇది కేవలం ఆచారం కాదు, ఇది అల్లాహ్ తో నేరుగా సంబంధాన్ని బలపరిచే పవిత్రమైన మార్గం. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. నమాజ్ అనేది కేవలం ఆచారం కాదు. ఇది అల్లాహ్ తో నేరుగా సంబంధాన్ని బలపరిచే పవిత్రమైన మార్గం. క్రమంగా ఖుషూ (భక్తి), వినయంతో నమాజ్ ఆచరించడం ద్వారా ఈ లోకంలో శాంతి, పరలోకంలో విజయం లభిస్తాయి.

ఇక ఐదవ హితోపదేశం: మంచి ఆజ్ఞాపన, చెడు నిరోధం – అమర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్ కర్. మంచిని పెంపొందించడం, చెడును నిర్మూలించడం.

…وَأْمُرْ بِالْمَعْرُوفِ وَانْهَ عَنِ الْمُنكَرِ…
(…వ ముర్ బిల్ మ’రూఫి వన్ హ అనిల్ మున్కరి…)

“…మంచిని ఆదేశించు, చెడును వారించు…” (31:17)

అంటే సమాజ బాధ్యత అని అర్థం దీనికి. సమాజ బాధ్యత ప్రతి ముస్లింకి ఉంది. అమర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్ కర్ వలన ఏం జరుగుతుంది? సమాజంలో న్యాయం జరుగుతుంది, సమాజంలో శాంతి ఉంటుంది, సమాజంలో సమానత్వం ఉంటుంది.

ఇస్లాం ధర్మంలో వ్యక్తిగత భక్తితో పాటు సామాజిక బాధ్యత, సమాజం పట్ల కర్తవ్యం కూడా అత్యంత ముఖ్యమైనది. ముస్లిం కేవలం తన కోసం మాత్రమే కాకుండా సమాజ మేలు కోసం జీవించాలని ఖురాన్ మరియు హదీసులు బోధిస్తాయి.

ఖురాన్ లో సూరయే మాయిదాలో ఉంది: “నీతి, భయభక్తుల విషయాల్లో పరస్పరం సహకరించండి. పాపం, దుర్మార్గంలో సహకరించవద్దండి.” ‘తఆవనూ అలల్ బిర్రి వత్ తఖ్వా, వ లా తఆవనూ అలల్ ఇస్మి వల్ ఉద్వాన్’. మంచి విషయాలలో, పుణ్యానికి సంబంధించిన విషయాలలో, సత్కార్యాలలో ఒకరికొకరు సహాయంగా, తోడుగా ఉండాలి. పాపంతో కూడిన విషయాలలో సహాయం చేయకూడదు. ఈ విధంగా నిజమైన నీతి అనేది తన సంపదను బంధువులకు, అనాధలకు, నిరుపేదలకు ఇవ్వడం. అలాగే సూరయే ఆలి ఇమ్రాన్ లో ఉంటుంది: “మీరు ఉత్తమ సమాజం, మీరు మంచి పనులను ఆజ్ఞాపించి చెడు పనులను నిరోధిస్తారు.” ఈ ఆయతులు సమాజంలో న్యాయం, దయ, సహాయం, ధర్మం స్థాపించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తాయి.

మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు: “మీలో ఎవరికైనా తన సోదరుడికి ఇష్టమైనదే తనకూ ఇష్టమైతే అతడు నిజమైన విశ్వాసి.” తన కోసం ఏది ఇష్టపడతాడో, సోదరుని కోసం కూడా అదే ఇష్టపడాలి. అటువంటి వ్యక్తే నిజమైన విశ్వాసి.

ప్రజలకు అత్యంత మేలు చేసేవారే ఉత్తములు. ఇంకా మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఎవరు చెడు చూడగలిగితే దానిని చేతితో ఆపాలి. సాధ్యం కాకపోతే మాటతో ఆపాలి. ఇది కూడా సాధ్యం కాకపోతే హృదయంలో అసహ్యించుకోవాలి. ఇది ఈమాన్ లో అత్యంత బలహీనమైన స్థాయి.”

ముస్లిముల సామాజిక కర్తవ్యాలలో జకాత్, సదఖా ఇవ్వడం, పేదలు, అనాధలు, వితంతువులకు సహాయం చేయడం, నిజాయితీతో వ్యాపారం చేయడం, పొరుగువారిని గౌరవించడం, అన్యాయాన్ని వ్యతిరేకించడం, సమాజంలో శాంతి ఐక్యత పెంపొందించడం. ఇవన్నీ అమర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్ కర్ ద్వారా జరుగుతాయి. ఖురాన్ మరియు హదీసు ప్రకారం ప్రతి ముస్లిం వ్యక్తి సమాజానికి మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. సమాజ సేవ కూడా ఒక ఇబాదత్. దయ, న్యాయం, సహకారం, సత్యం – ఇవే ఇస్లాం బోధించే సామాజిక బాధ్యతల మూల సూత్రాలు.

ఇక ఆరవ ఉపదేశం: సబర్, సహనం.

…وَاصْبِرْ عَلَىٰ مَا أَصَابَكَ…
(…వస్ బిర్ అలా మా అసాబక…)

“…మరియు నీపై వచ్చి పడే (కష్టాలను) సహనంతో భరించు…” (31:17)

జీవితం అంటే సమస్యలు, కష్టాలు, బాధలు, రోగాలు, ఇష్టం లేని విషయాలు చాలా వస్తా ఉంటాయి. వాటిలో సహనం వహించాలి. పరీక్షలు ఉంటాయి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పాపాల మూలంగానో లేకపోతే పరీక్ష నిమిత్తమో పరీక్షిస్తాడు. పరీక్షలు అంటే జీవితంలో భాగమే అవి. సబర్ విజయానికి మార్గం. సహనం ఇస్లాం ధర్మంలో అత్యున్నత గుణాలలో ఒకటి. కష్టకాలంలో స్థిరంగా ఉండటం, పాపాల నుండి దూరంగా ఉండటం, అల్లాహ్ పై నమ్మకంతో ఉండటం ఇవన్నీ సబర్ లోని భాగాలు.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ లో ఇలా తెలియజేశాడు: “ఓ విశ్వాసులారా! సహనం మరియు నమాజ్ ద్వారా సహాయం కోరండి. నిజంగా అల్లాహ్ సహనంతో ఉన్నవారితో ఉంటాడు.” ఇంకా సూరయే ఆలి ఇమ్రాన్ లో ఇలా ఉంటుంది: “ఓ విశ్వాసులారా! సహనం పాటించండి, స్థిరంగా ఉండండి.” సూరయే జుమర్ లో ఉంటుంది: “సహనం పాటించే వారి ప్రతిఫలం లెక్క లేనిది.”

ఈ ఆయతులు సబర్ ఉన్న వాడికి అల్లాహ్ ప్రత్యేకత ప్రతిఫలం ఇస్తాడని తెలియజేస్తున్నాయి. ఈ విధంగా సబర్ గురించి చాలా విషయాలు ఖురాన్ మరియు హదీసులో ఉన్నాయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు: “నిజమైన సహనం కష్టం మొదటి దెబ్బలోనే కనిపిస్తుంది.” అంటే సహనం యొక్క రకాలు అనేక రకాలుగా ఉంటాయి: ఆజ్ఞాపాలనలో సబర్ (ఇబాదత్ లో సబర్ – నమాజ్, ఉపవాసం వంటి ఇబాదత్ లో స్థిరంగా ఉండటం), పాపాల నుండి దూరంగా ఉండటంలో సబర్, అలాగే కష్టకాలంలో సహనం (అనారోగ్యం, నష్టం, పరీక్షలు వచ్చినప్పుడు అల్లాహ్ పై నమ్మకం కలిగి ఉండటం). ఖురాన్ మరియు హదీసు ప్రకారం సహనం ఒక విశ్వాసి యొక్క బలమైన ఆయుధం. సబర్ ద్వారా మనం అల్లాహ్ కు దగ్గరవుతాము, ఈ లోకంలో శాంతిని పరలోకంలో విజయాన్ని పొందుతాము.

ఇక ఏడవ ఉపదేశం: అహంకారం, దాన్ని విడిచిపెట్టడం.

وَلَا تُصَعِّرْ خَدَّكَ لِلنَّاسِ وَلَا تَمْشِ فِي الْأَرْضِ مَرَحًا…
(వ లా తుసఇ’ర్ ఖద్దక లిన్నాసి వ లా తమ్ షి ఫిల్ అర్జి మరహన్…)

జనుల ముందు (గర్వంతో) మొహం తిప్పుకొని మాట్లాడకు. భూమిపై నిక్కుతూ నడవకు…” (31:18)

ఓ నా కుమారా! అహంకారం – కిబ్ర్ – ఇస్లాం ధర్మంలో తీవ్రంగా నిషేధించబడిన దోషం. మనిషి తనను తాను గొప్పవాడిగా భావించి ఇతరులను తక్కువగా చూడటం ఇది అల్లాహ్ కు ఇష్టం లేని గుణం. వినయం మాత్రమే విశ్వాసి యొక్క లక్షణం. ప్రజల పట్ల నీ చెంపను తిప్పవద్దు, గర్వంగా చూడవద్దు, భూమిపై అహంకారంగా నడవవద్దు. అల్లాహ్ గర్విష్టులను ఇష్టపడడు అని లుఖ్మాన్ అలైహిస్సలాం బోధించిన విషయం ఇది.

ఇంకా వేరే చోట్ల ఉంది ఖురాన్ లో: “నిస్సందేహంగా అల్లాహ్ అహంకారులను ఇష్టపడడు.” ఇంకో చోట ఇలా ఉంది: “భూమిపై అన్యాయంగా అహంకారం ప్రదర్శించే వారిని నా ఆయతుల నుండి తిప్పివేస్తాము.” ఈ ఆయతులు అహంకారం మనిషిని సత్యం నుండి దూరం చేస్తుందని స్పష్టం చేస్తాయి.

మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా దీని గురించి అనేక సందర్భాలలో అనేక విషయాలు చెప్పారు. “ఎవరి హృదయంలో ఆవగింజంత అహంకారం ఉన్నా అతడు స్వర్గంలో ప్రవేశించడు.” సహాబాలు అడిగారు: “ఓ ప్రవక్తా! ఒక మనిషి తన దుస్తులు చెప్పులు అందంగా ఉండాలని కోరుకోవడం కూడా అహంకారమేనా?” దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానం ఇచ్చారు: “అల్లాహ్ సుందరుడు, సౌందర్యాన్ని ఇష్టపడతాడు. అహంకారం అనేది సత్యాన్ని తిరస్కరించడం మరియు ప్రజలను తక్కువగా చూడడం.” కావున అహంకారం వల్ల కలిగే నష్టాలలో ఒకటి సత్యాన్ని అంగీకరించకపోవడం, అలాగే ఇతరులను తక్కువగా చూడడం, సమాజంలో విభేదాలు ఏర్పరచడం. ఇవన్నీ అల్లాహ్ కోపానికి గురవడం అవుతుంది. దానికి విరుద్ధంగా కిబ్ర్ కి విరుద్ధంగా వినయం – వినయం ఉన్న వారిని అల్లాహ్ ఉన్నత స్థాయికి చేరుస్తాడు. వినయం విశ్వాసిని ప్రజల హృదయాల్లో ప్రియంగా చేస్తుంది. ఇది ప్రవక్తల లక్షణం. ఖురాన్ మరియు హదీసు ప్రకారం అహంకారం ఒక ప్రమాదకరమైన పాపం. మనిషి తన సంపద, జ్ఞానం, స్థానం వల్ల గర్వపడకూడదు. అన్నీ అల్లాహ్ అనుగ్రహమే అని గుర్తించి వినయంతో జీవించడం నిజమైన విశ్వాసి లక్షణం.

అలాగే ఎనిమిదవది: మిత భాషణ. మాట్లాడే తీరు, మాట్లాడే విధానం, బాడీ లాంగ్వేజ్.

وَاقْصِدْ فِي مَشْيِكَ وَاغْضُضْ مِن صَوْتِكَ ۚ إِنَّ أَنكَرَ الْأَصْوَاتِ لَصَوْتُ الْحَمِيرِ
(వక్ సిద్ ఫీ మష్ యిక వగ్ జుజ్ మిన్ సౌతిక ఇన్న అన్ కరల్ అస్వాతి లసౌతుల్ హమీర్)

“నీ నడకలో మధ్యేమార్గం అవలంబించు. నీ కంఠ స్వరాన్ని కాస్త తగ్గించు. నిశ్చయంగా స్వరాలన్నింటిలోకీ అత్యంత కఠోరమైనది గాడిదల స్వరం.” (31:19)

నడకలో మధ్యేమార్గం అవలంబించు. నీ కంఠ స్వరాన్ని కాస్త తగ్గించు. నిశ్చయంగా స్వరాలన్నింటిలోకి అత్యంత కఠోరమైనది గాడిద స్వరం. మిత భాషణ అంటే మన మాటల్లో నియంత్రణ, దయ, నిజాయితీ మరియు మర్యాదతో మాట్లాడటం. ఖురాన్ మరియు హదీసు ప్రకారం మాటల శక్తి సమాజంలో శాంతి మరియు ఐక్యతకు మూలం. నిజమైన ముస్లిం – మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పిన మాట – నిజమైన ముస్లిం వ్యక్తి తన చేతులతో మరియు తన భాషతో ఇతరులకు హాని చేయడు. ‘అల్ ముస్లిము మన్ సలీమల్ ముస్లిమూన మిన్ లిసానిహి వ యదిహి’. ఒక ముస్లిం అనేవాడు తన చేతి ద్వారా, తన బిహేవియర్ ద్వారా, మాటల ద్వారా ఇతరులకు హాని కల్పించడు. అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తే నిజమైన ముస్లిం అని మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు. అలాగే సదా మంచి మాట చెప్పడం కూడా సదఖా. మంచి మాట – అది కూడా సదఖా కిందకు వస్తుందని మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు.

ఖురాన్ మరియు హదీసు ప్రకారం మిత భాషణ ఒక మహత్తర మానవ గుణం. మాటల ద్వారా హాని కలిగించకుండా సమాజంలో శాంతి మరియు ఐక్యతను కొనసాగించడం ప్రతి ముస్లిం యొక్క కర్తవ్యం. మంచి మాటలు వాడటం కూడా ఒక ఇబాదత్ మరియు అది మన వ్యక్తిత్వానికి మెరుగుపరుస్తుంది. అంటే బాడీ లాంగ్వేజ్ కూడా బాగుండాలి.

అభిమాన సోదరులారా! ఈ విధంగా లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి చేసిన ఉపదేశాలు దానికి వివరంగా చెప్పుకుంటూ పోతే చాలా సమయం అవసరం పడుతుంది. క్లుప్తంగా దీని యొక్క సారాంశం లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి ఇచ్చిన ఉపదేశాలలోని సారాంశం ఐదు పదాలలో చెప్పాలంటే:

  1. తౌహీద్ (అల్లాహ్ పట్ల నమ్మకం, విధేయత, ఆజ్ఞాపాలన)
  2. నమాజ్ (క్రమశిక్షణ)
  3. అఖ్లాక్ (వ్యక్తిత్వం)
  4. సహనం (స్థిరత్వం)
  5. వినయం (గొప్పతనం)

ఇదే జీవన విద్య. అంటే మూడు ముక్కల్లో చెప్పాలంటే:

  • అల్లాహ్ తో సంబంధం
  • కుటుంబంతో సంబంధం
  • సమాజంతో సంబంధం

ఇదే కదా ప్రపంచం, ప్రాపంచిక జీవితం. అంటే పూర్తి జీవితం దీంట్లో ఇమిడిపోయింది. ఈ విధంగా జీవితం గడిపితే ప్రపంచంలో, సమాజంలో, కుటుంబంలో, స్నేహితుల్లో, బంధువుల్లో అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లో, అన్ని సమయాల్లో శాంతి ఉంటుంది, న్యాయం ఉంటుంది, భద్రత ఉంటుంది, సమానత్వం ఉంటుంది, హాయిగా జీవితం గడుపుతుంది.

అల్లాహ్ తో సంబంధం ఎలా ఉండాలి, కుటుంబంతో సంబంధం ఎలా ఉండాలి, సమాజంతో సంబంధం ఎలా ఉండాలి. ఇదే ఈ ఉపదేశాలకి సారాంశం, ఇదే జీవన విద్య.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ ఈ విలువలను మన కుటుంబాల్లో ఈ విధంగా అమలు చేసి జీవించే సద్బుద్ధిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ ప్రసాదించు గాక. లుఖ్మాన్ అలైహిస్సలాం కు ఇచ్చిన హిక్మత్ తో హిక్మత్ లో మాకు భాగం ఇవ్వు, ప్రసాదించు గాక. మన పిల్లలను సాలిహీన్లుగా చేయు గాక. మన జీవితాలను ఖురాన్ తో అలంకరించు గాక. ఆమీన్ యా రబ్బిల్ ఆలమీన్.

اللَّهُمَّ اغْفِرْ لِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ وَالْمُسْلِمِينَ وَالْمُسْلِمَاتِ الأَحْيَاءِ مِنْهُمْ وَالأَمْوَاتِ ، اللَّهُمَّ أَصْلِحْ شَبَابَ الْمُسْلِمِينَ وَارْزُقْنَا التَّوْحِيدَ الْخَالِصَ ، وَأَعِنَّا عَلَى إِقَامَةِ الصَّلاةِ وَاجْعَلْنَا مِنَ الصَّابِرِينَ الْمُتَوَاضِعِينَ ، آمِين يَا رَبَّ الْعَالَمِينَ.

వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=46052

హజ్జ్ & ఖుర్బానీ తర్వాత | షేఖ్ రాషిద్ అల్ బిదాహ్ | షేఖ్ నసీరుద్దీన్ జామి’ఈ

హజ్జ్ & ఖుర్బానీ తర్వాత | షేఖ్ రాషిద్ అల్ బిదాహ్ | షేఖ్  నసీరుద్దీన్ జామి’ఈ
https://youtu.be/eHKR0eeKYjA [18 నిముషాలు]

الحمدُ للهِ الذي هدانا لنعمة الإسلام وكفي بها نعمة، والحمد لله أن جعلنا موحدين، لا نسجد للحجر، ولا نعبد البقر. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله ﷺ تسليما كثيرا، أما بعدُ

మనం అల్లాహ్‌కు భయభక్తులు కలిగి ఉండాలి (తక్వాను అవలంబించాలి) మరియు అల్లాహ్ మనకు ఈ పుణ్యకాలాలను చేరుకునే అవకాశం కల్పించినందుకు ఆయనను ఎక్కువగా స్తుతిస్తూ, కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఈ కాలాలలో మంచి కార్యాలకు అనేక రెట్లు ప్రతిఫలం లభిస్తుంది. ఇది అల్లాహ్ యొక్క అనుగ్రహం మరియు మహా వరం. అల్లాహ్ అపారమైన అనుగ్రహాలు కలవాడు.

అల్ హందులిల్లాహ్! అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. ఆయన మనకు తెలిసిన ఆ తొమ్మిది (జిల్ హిజ్జా తొలి తొమ్మిది) పుణ్యదినాలను, ఆ తర్వాత లెక్కించబడే నాలుగు దినాలను (ఈదుల్ అజ్హా రోజు మరియు తష్రీక్ మూడు రోజులు) చేరుకునే అవకాశం కల్పించాడు.

అల్ హందులిల్లాహ్! అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. ఆయన మనకు సహాయం చేసినందువల్ల మనం అరఫా రోజున ఉపవాసం ఉండగలిగాము మరియు ఆ రోజున ఆయనను ప్రార్థించగలిగాము (దుఆ చేయగలిగాము).

అల్ హందులిల్లాహ్! అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. ఆయన మనకు ధనసంపదలో విశాలతను ప్రసాదించినందువల్ల మనం ఖుర్బానీ చేయగలిగాము లేదా హజ్ చేయగలిగాము.

అల్ హందులిల్లాహ్! అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. ఆయన మనకు ముస్లింల రెండు పండుగలను – ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అజ్హాను – చేరుకునే (జరుపుకునే) అవకాశం ఇచ్చాడు.

అల్ హందులిల్లాహ్! అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. ఆయన మనకు రమజాన్‌ను చేరుకునే అవకాశం కల్పించి, భద్రతతో మరియు ఆరోగ్యంతో ఉపవాసాలు పాటించే తౌఫీఖ్ ప్రసాదించాడు. అదే సమయంలో కొందరు భయభ్రాంతులతో రమజాన్‌ను గడిపారు; మరికొందరు అనారోగ్యం లేదా అశక్తత కారణంగా ఉపవాసం ఉండలేకపోయారు. కాబట్టి, ఓ అల్లాహ్! నీవు అనేక అనుగ్రహాలు కురిపిస్తున్నట్లే, మేము కూడా నీకు అపారమైన స్తోత్రాలు అర్పిస్తున్నాము.

అల్ హందులిల్లాహ్! ప్రతి పుణ్యకాలం కోసం కూడా అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. ఎందుకంటే వాటిలో సత్కార్యాలకు అనేక రెట్లు ప్రతిఫలం లభిస్తుంది, హోదా, అంతస్తు ఉన్నతమవుతుంది. మా ప్రభువా! నీవు మాపై కరుణ చూపి మా పశ్చాత్తాపాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నావు. నీవు నీ మహోన్నత గ్రంథం(నిసా 4:27)లో ఇలా ప్రకటించావు:

(وَاللهُ يُرِيدُ أَنْ يَتُوبَ عَلَيْكُمْ).
అల్లాహ్‌ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాలని కోరుతున్నాడు.

అల్ హందులిల్లాహ్! సుమ్మ, అల్ హందులిల్లాహ్! సుమ్మ, అల్ హందులిల్లాహ్! ఎందుకంటే ఆయన మనల్ని తౌహీద్ (ఏకదైవారాధన) మరియు సున్నత్‌పై జీవింపజేశాడు; తౌహీద్ మరియు సున్నత్‌కు ప్రాధాన్యత ఉన్న దేశంలో నివసింపజేశాడు. అందువల్ల మన మస్జిద్‌లలో, మన ఖబ్రస్తాన్ (స్మశానం)లో, లేదా మన హజ్ ఆచరణల్లో సమాధుల పట్ల అతిశయ గౌరవం, ఖబ్రిస్తాన్లలో నిర్మాణాలు, షిర్క్ సంబంధిత ఆచారాలు, బిద్అత్‌లు లేదా పక్షపాత వర్గీయత కనిపించవు.

అల్లాహు తఆలా (హజ్జ్ 22:78)లో ఇలా సెలవిచ్చాడు:

مِّلَّةَ أَبِيكُمْ إِبْرَاهِيمَ ۚ هُوَ سَمَّاكُمُ الْمُسْلِمِينَ مِن قَبْلُ وَفِي هَٰذَا
“(ఈ ధర్మం) మీ తండ్రి ఇబ్రాహీమ్ ధర్మమే. ఆయన (అల్లాహ్) ఇంతకుముందే మీకు ‘ముస్లింలు’ అనే పేరు పెట్టాడు, మరియు ఈ (ఖుర్‌ఆన్)లో కూడా (అదే పేరుతో పిలిచాడు).”

అల్ హందులిల్లాహ్! హజ్ విజయవంతంగా పూర్తయినందుకు కూడా అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. హజ్ ముగిసి ఒక వారం గడిచిన తర్వాత, గర్వంతో కూడిన కృతజ్ఞతతో ఇలా చెప్పవచ్చు: హజ్ యథావిధిగా విజయవంతమైంది. సామాన్య రీతిలో విజయవంతమవడమే కాదు, అల్లాహ్ అనుగ్రహంతో మరెంతో అద్భుతంగా విజయవంతమైనది.

ఎందుకంటే అల్లాహ్ తన పవిత్ర గృహానికి సేవ చేస్తూ, హజ్ నిర్వహణ కొరకు అపారమైన ధనాన్ని మరియు శ్రమను వెచ్చించే వారి కృషిని ఎన్నడూ వృథా చేయడు.

فَإِنَّ ٱللَّهَ لَا يُضِيعُ أَجْرَ ٱلْمُحْسِنِينَ
“నిశ్చయంగా అల్లాహ్ సత్కార్యాలు (మేలు) చేసే వారి ప్రతిఫలాన్ని వృథా చేయడు.” (యూసుఫ్ 12:90)

అందువల్ల, అల్లాహ్ గృహానికి సేవ చేస్తూ, హాజీల సౌకర్యం మరియు భద్రత కోసం కృషి చేసే వారి శ్రమ మరియు సేవలకు అల్లాహ్ తగిన ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదిస్తాడు.

ఓ విశ్వాసులారా! కరుణతో మరియు దృఢత్వంతో కూడిన చేతులు హజ్ వ్యవస్థను నిర్వహిస్తాయన్న విషయం తెలుసా?

కరుణతో కూడిన చేతుల విషయానికి వస్తే, “ఖాదిముల్ హరమైనిష్ షరీఫైన్ అతిథుల కార్యక్రమం” గురించి మీరు విన్నారా? ఈ కార్యక్రమంలో రెండువేల ఐదు వందల మంది హాజీలను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించి, వారి అవసరాలన్నింటినీ చూసుకుంటారు. అంతేకాక, వారి హద్య్ (హజ్ ఖుర్బానీ జంతువు) ఖర్చును కూడా ఖాదిముల్ హరమైనిష్ షరీఫైన్ భరిస్తారు.

అలాగే, హాజీల సేవ మరియు భద్రత కొరకు నాలుగు లక్షల మందికి పైగా సైనిక మరియు పౌర సిబ్బందిని ప్రత్యేకంగా నియమించిన విషయం మీకు తెలుసా?

మషాఇర్ (హజ్ పవిత్ర ప్రదేశాలు) మరియు ప్రవేశ కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య శాఖ సిబ్బంది సంఖ్య యాభై రెండు వేల మందికి చేరిందని మీకు తెలుసా? వీరందరినీ హాజీల ఆరోగ్యం మరియు వైద్య సేవల కోసం ముందు నుండే ఒక నెలపాటు ప్రత్యేకంగా శిక్షణలు ఇవ్వడం జరిగినది.

హజ్ కాలంలో సుమారు మూడు వందల శస్త్రచికిత్సలు నిర్వహించబడ్డాయని మీకు తెలుసా? వాటిలో గుండెకు సంబంధించిన క్యాథెటరైజేషన్ (Catheterization) చికిత్సలు మరియు ఓపెన్-హార్ట్ శస్త్రచికిత్సలు కూడా ఉన్నాయి.

అంతేకాదు, ప్రభుత్వం -అల్లాహ్ దానికి సద్భాగ్యం ప్రసాదించుగాక- హాజీలకు సేవలను మరింత సులభతరం చేయడానికి అత్యాధునిక ఎలక్ట్రానిక్ సాంకేతికతలను వినియోగించిన విషయం మీకు తెలుసా?

రద్దీని నివారించడానికి, హజ్ బృందాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి, అనుమతి లేకుండా ప్రవేశించే వారిని గుర్తించడానికి కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) ను ఉపయోగించింది. అలాగే, మందులను అత్యంత వేగంగా చేరవేయడానికి డ్రోన్లను కూడా వినియోగించింది.

మిలియన్ల సంఖ్యలో ఉన్న జనసమూహాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, హాజీలను అత్యంత క్రమబద్ధంగా మరియు సాఫీగా తరలించడం వంటి అసాధారణ విజయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని సుమారు 165 దేశాల నుండి వచ్చిన హాజీల ప్రశంసల ద్వారా దీనిని వినవచ్చు. వారు ఎటువంటి స్వార్థ ప్రయోజనం ఆశించకుండా ఈ ఏర్పాట్లను ప్రశంసిస్తున్నారు.

కాబట్టి, ఈ యథావిధి విజయానికి అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన హాజీలందరూ భద్రంగా, కృతజ్ఞతతో, ప్రశంసలతో తమ తమ దేశాలకు తిరిగి వెళ్తున్నందుకు కూడా అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు.

ప్రపంచమంతా విమానాశ్రయాలలో, తనిఖీ కేంద్రాలలో మరియు సరిహద్దు ప్రవేశ ద్వారాలలో హాజీలకు అందించిన ఆతిథ్యం, స్వాగతం మరియు వీడ్కోలు కార్యక్రమాలకు సంబంధించిన ఆనందకర దృశ్యాలను, వీడియోలను మరియు ఇంటర్వ్యూలను చూసింది.

అవును, హజ్ విజయవంతమైంది. కాబట్టి మనం ఈ మహత్తర సౌదీ రాజ్యపు సంరక్షణలో ఉన్నందుకు సంతోషించాలి. అల్లాహ్ దాని రాజులకు అపారమైన ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక. ఇస్లాం మరియు హరమైన్ షరీఫైన్ సేవల ద్వారా వారికి గౌరవాన్ని కలిగించుగాక. ఫిత్నాలను రగిలించే వారి చెడు నుండి వారిని రక్షించుగాక.

ఈ ద్వీపకల్పపు గద్ద ‘సఖ్రుల్ జజీరా Sakhrul Jazeera’, ఈ రాజ్య స్థాపకుడు, ఏకీకర్త, తౌహీద్ మరియు సున్నత్‌పై ఈ దేశాన్ని నిర్మించిన మలిక్ అబ్దుల్ అజీజ్ (King Abdulaziz) గారిపై అల్లాహ్ కరుణ కురిపించుగాక.      

الحمدُ للهِ يُعطِينا، ويَشكرُ لنا إن أَعطَينا، والصلاةُ والسلامُ على هادِينَا، أما بعدُ:

ఓ మక్కా నుండి హజ్ పూర్తి చేసి తిరిగి వచ్చిన హాజీలారా! మరియు అల్లాహ్ కొరకు సమృద్ధిగా ఖుర్బానీ చేసిన వారలారా!

కృతజ్ఞతతో పాటు అల్లాహ్ స్మరణ కూడా ఉండాలి. కాబట్టి మీ ప్రభువును ఎక్కువగా స్తుతించండి, ఆయనను ఎక్కువగా స్మరించండి. ఎందుకంటే మన ప్రభువు అయిన అల్లాహ్ (బఖర 2:200)లో ఇలా సెలవిచ్చాడు:

[فَإِذَا قَضَيْتُمْ مَنَاسِكَكُمْ فَاذْكُرُوا اللهَ كَذِكْرِكُمْ آبَاءَكُمْ أَوْ أَشَدَّ ذِكْرًا]

“హజ్‌ క్రియలన్నింటినీ నిర్వర్తించిన తరువాత అల్లాహ్‌ను స్మరించండి. మీ తాతముత్తాతలను జ్ఞాపకం చేసుకున్నట్లే, ఇంకా అంతకంటే అధికంగానే అల్లాహ్‌ను స్మరించండి.”

ఈ ఆయత్ హజ్ చేసిన వారికీ, ఖుర్బానీ చేసిన వారికీ సాధారణంగా వర్తిస్తుంది. ఇక్కడ “مَنَاسِكَكُمْ మనాసికకుమ్” అనే పదం ద్వారా హజ్ ఆచారాలు మరియు ఖుర్బానీ రెండూ ఉద్దేశించబడ్డాయి. (తఫ్సీర్ తబరీ 4/196).

అయితే, ఖర్చు చేయడానికి సామర్థ్యం లేని వారు, అంటే: ఖుర్బానీ చేయడానికి ధనం లేనివారు, హజ్ చేయడానికి మార్గం లేదా అవకాశం లేనివారి విషయానికి వస్తే — అలాంటి వారికి కూడా అల్లాహ్ వారి సత్సంకల్పాల కారణంగా హజ్ చేసినవారికి, ఖుర్బానీ చేసినవారికి ఇచ్చే ప్రతిఫలాల వంటి ప్రతిఫలాలను ప్రసాదించాలని మనం ప్రార్థిస్తున్నాము.

ఓ విశ్వాసులారా! ఎన్నో పుణ్యకాలాలు (మవాసిముల్ ఖైరాత్) ముగిసిన తరువాత కూడా ఇలా చెప్పబడుతుంది:

జిల్ హిజ్జా తొలిదశలో మనం శ్రద్ధగా ఆరాధనలు చేయడంలో అలసత్వం చూపి ఉంటే, జుముఆ (జుమ్మా) మరియు జమాఅత్ నమాజుల కోసం ముందుగానే వెళ్లడం, నడుచుకుంటూ వెళ్లడం వంటి కార్యాలకు ఎంతో గొప్ప ప్రతిఫలం ఉంది. వాటి పుణ్యం తరచూ లభించే అవకాశమూ ఉంది. (కనుక అశ్రద్ధగా ఉండకండి).

అలాగే, అరఫా రోజున ప్రభువు తన దాసులకు అత్యంత సమీపంగా ఉండే ఆ మహోన్నత సమయంలో మనం దుఆ చేయడంలో కొరత చేసి ఉంటే, ఇంకా మన ముందు దుఆల ద్వారాలు తెరిచి ఉన్నాయి; అల్లాహ్ ప్రసాదించే అనుగ్రహం కూడా కొనసాగుతూనే ఉంది. ప్రతి జుముఆ రోజున ఒక “స్వీకరించబడే ప్రత్యేక సమయం” (సాఅతుల్ ఇస్తిజాబా) ఉంటుంది. ఆ సమయంలో ముస్లిం చేసే దుఆ అల్లాహ్ అనుగ్రహంతో స్వీకరించబడుతుంది.

ఆ సమయం గురించి ఒక అభిప్రాయం ఏమిటంటే:

مَا بَيْنَ أَنْ يَجْلِسَ الْإِمَامُ إِلَى أَنْ تُقْضَى الصَّلَاةُ
ఇమామ్ మింబర్‌పై కూర్చున్న సమయం నుండి జుముఆ నమాజు పూర్తయ్యే వరకు ఉన్న సమయం.” (ముస్లిం 853).

మరొక అభిప్రాయం ప్రకారం:

آخِرَ سَاعَةٍ بَعْدَ الْعَصْرِ

అస్ర్ నమాజు తర్వాత సూర్యాస్తమయానికి ముందు ఉండే చివరి ఘడియ.”
(అబూ దావూద్ 1048లో ప్రామాణికమైన (సహీహ్) ఆధారంతో పేర్కొనబడింది.)

కాబట్టి, ఒక పుణ్యకాలం ముగిసిపోయిందని నిరాశ చెందకుండా, అల్లాహ్ మన కోసం తెరిచి ఉంచిన ఇతర సత్కార్యాల ద్వారాలను ఉపయోగించుకోవాలి. ఆయన స్మరణ, దుఆ, జుముఆ మరియు జమాఅత్ నమాజుల ద్వారా నిరంతరం ఆయనకు చేరువ కావడానికి ప్రయత్నించాలి.

فاللهم اجعلنا منَ {الذَّاكِرِينَ اللَّهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ.
ఫల్లాహుమ్మ జఅల్నా మినజ్ జాకిరీనల్లాహ కసీరన్ వజ్ జాకిరాత్.
ఓ అల్లాహ్! నిన్ను ఎక్కువగా స్మరించే పురుషులు మరియు స్త్రీలలో మమ్మల్ని కూడా చేర్చు.

اللهم لكَ الحمدُ كالذي تقولُ وخيرًا مما نقولُ
అల్లాహుమ్మ లకల్ హందు కల్లజీ తఖూలు వ ఖైరమ్ మిమ్మా నఖూల్
ఓ అల్లాహ్! నీవు నీ గురించి చెప్పుకున్న విధంగా, ఇంకా మేము చెప్పే స్తోత్రాల కంటే ఎంతో ఉత్తమమైన స్తోత్రాలన్నీ నీకే చెందుతాయి.

اللهم إنا عاجزونَ عن شُكرِكَ، فنُحيلُ إلى عِلمِكَ وفضلِكَ
అల్లాహుమ్మ ఇన్నా ఆజిజూన అన్ షుక్రిక్, ఫ నుహీలు ఇలా ఇల్మిక వ ఫద్లిక్
ఓ అల్లాహ్! నీ అనుగ్రహాలకు తగిన విధంగా కృతజ్ఞతలు తెలపడానికి మేము అశక్తులము. కాబట్టి మా స్థితిని నీ జ్ఞానానికి మరియు నీ అపార కరుణకు అప్పగిస్తున్నాము.

اللَّهُمَّ وَهَبْتَنَا مَالًا، فَبَذَلْنَا مِنْهُ بِفَضْلِكَ نُسُكًا وَمَنْسَكًا
అల్లాహుమ్మ వహబ్తనా మాలన్, ఫ-బజల్నా మిన్హు బిఫద్లిక నుసుకన్ వ మన్సకా
ఓ అల్లాహ్! నీవు మాకు సంపదను ప్రసాదించావు. నీ అనుగ్రహంతోనే దానిలో కొంత భాగాన్ని ఖుర్బానీ మరియు ఇతర ఆరాధనా కార్యాల కోసం ఖర్చు చేయగలిగాము.

اللَّهُمَّ اكْتُبْنَا فِيمَنْ أُعْتِقَتْ رِقَابُهُمْ، وَكُفِّرَتْ خَطِيئَاتُهُمْ لِسَنَتَيْنِ.
అల్లాహుమ్మక్-తుబ్నా ఫీమన్ ఉతిఖత్ రిఖాబుహుమ్, వ కుఫ్ఫిరత్ ఖతీఆతుహుమ్ లిసనతైన్
ఓ అల్లాహ్! నరకాగ్ని నుండి విముక్తి పొందిన వారిలో మమ్మల్ని చేర్చు. అలాగే రెండు సంవత్సరాల పాపాలు క్షమించబడిన వారిలో కూడా మమ్మల్ని చేర్చు.

اللَّهُمَّ احْفَظْ دِينَنَا وَبِلَادَنَا وَأَدِمْ أَمْنَنَا، وَادْحَرْ أَعْدَاءَنَا، وَأَجِبْ دُعَاءَنَا
అల్లాహుమ్మహ్-ఫజ్ దీననా వ బిలాదనా వ అదిమ్ అమ్ననా, వద్-హర్ అదాఅనా, వ అజిబ్ దుఆఅనా
ఓ అల్లాహ్! మా ధర్మాన్ని, మా దేశాన్ని రక్షించు. మా భద్రతను శాశ్వతంగా కొనసాగించు. మా శత్రువులను ఓడించు మరియు మా ప్రార్థనలను స్వీకరించు.

اللَّهُمَّ وَارْحَمْنَا وَوَالِدِينَا، وَهَبْ لَنَا مِنْ أَزْوَاجِنَا وَذُرِّيَّاتِنَا قُرَّةَ أَعْيُنٍ
అల్లాహుమ్మర్-హమ్నా వ వాలిదీనా, వ హబ్ లనా మిన్ అజ్వాజినా వ జుర్రియ్యాతినా ఖుర్రత అయూన్
ఓ అల్లాహ్! మాపై మరియు మా తల్లిదండ్రులపై కరుణ చూపు. మా భార్యాభర్తలు మరియు మా సంతానం ద్వారా మా కళ్లకు చల్లదనాన్ని, ఆనందాన్ని ప్రసాదించు.

اللَّهُمَّ احْفَظْ وَسَدِّدْ إِمَامَنَا خَادِمَ الْحَرَمَيْنِ الشَّرِيفَيْنِ، الْمَلِكَ سَلْمَانَ بْنَ عَبْدِ الْعَزِيزِ، وَوَلِيَّ عَهْدِهِ الْأَمِينِ الْأَمِيرَ مُحَمَّدَ بْنَ سَلْمَانَ، وَارْزُقْهُمْ بِطَانَةَ الصَّلَاحِ وَالْفَلَاحِ

అల్లాహుమ్మహ్-ఫజ్ వ సద్దిద్ ఇమామనా ఖాదిమల్ హరమైనిష్ షరీఫైన్, అల్ మలిక సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, వ వలియ్య అహ్దిహిల్ అమీన్ అల్ అమీర ముహమ్మద్ బిన్ సల్మాన్, వర్జుఖుమ్ బితానతస్ సలాహి వల్ ఫలాహ్

ఓ అల్లాహ్! రెండు పవిత్ర మస్జిద్‌ల సేవకుడైన కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆల్ సఊద్ గారిని మరియు ఆయన విశ్వసనీయ యువరాజు ముహమ్మద్ బిన్ సల్మాన్ గారిని రక్షించి, వారికి సరైన మార్గదర్శకత్వాన్ని ప్రసాదించు. వారికి ధర్మపరులైన, యోగ్యులైన మరియు విజయాన్ని అందించే సహచరులను కల్పించు.

اللَّهُمَّ وَاجْزِهِمْ عَلَى خِدْمَةِ الْحَرَمَيْنِ وَرَاحَةِ الْحُجَّاجِ، وَاجْزِ جُنُودَنَا وَمُنَظِّمِي الْحَجِّ عَلَى مَسَاعِيهِمْ مَعَ ضُيُوفِ الرَّحْمَنِ

అల్లాహుమ్మజ్-జిహిమ్ అలా ఖిద్మతిల్ హరమైన్ వ రాహతిల్ హుజ్జాజ్, వజ్-జి జునూదనా వ మునజ్జిమిల్ హజ్జి అలా మసాఈహిమ్ మఅ దుయూఫిర్ రహ్మాన్

ఓ అల్లాహ్! హరమైన్ సేవకై మరియు హాజీల సౌకర్యార్థం కృషి చేస్తున్న వారికి ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించు. అలాగే అల్లాహ్ అతిథులైన హాజీల సేవలో శ్రమిస్తున్న మా సైనికులకు మరియు హజ్ నిర్వాహకులకు కూడా తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించు.

اللهم صلِ وسلمْ على عبدِكَ ورسولِكَ محمدٍ
అల్లాహుమ్మ సల్లి వ సల్లిమ్ అలా అబ్దిక వ రసూలిక ముహమ్మద్
ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ పై నీ కరుణలను, శాంతిని మరియు ఆశీర్వాదాలను కురిపించు.

ఖతీబ్: షేఖ్ రాషిద్ బిన్ అబ్దుర్ రహ్మాన్ అల్ బిదాహ్. (అరబీ భాష)
అనువాదకులు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ హఫిజహుల్లాహ్ .
స్థలం: జామె షేఖ్ ఇబ్ను ఉసైమీన్ జుల్ఫీ, సఊది అరేబియ

ఒకే ప్రయాణంలో అనేక ఉమ్రాలు చేసేవారికి – షేఖ్ అబ్దుర్రజ్జాఖ్ అల్-బద్ర్

To Those Who Perform Multiple Umrahs in One Journey
Shaykh Abdurrazzaq al-Badr [Video|Ar-En Subtitles]
https://youtu.be/40fnJJgrRBg [ 7 min]

ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా, హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఇతర భార్యల వలె ‘తమత్తు‘ (Tamattu’) ఉద్దేశ్యంతో మొదట ఉమ్రా కోసం ఇహ్రామ్ కట్టారు. అయితే ప్రయాణ సమయంలో ఆమెకు రుతుస్రావం మొదలైంది. దాంతో గుస్ల్ (స్నానం) ఆచరించి, హజ్ కోసం ఇహ్రామ్ కట్టాల్సిందిగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమెకు సూచించారు. ఆమె ‘దుల్-హులైఫా’ వద్ద సంకల్పించిన ఉమ్రా ఆమె హజ్‌లో కలిసిపోవడం వల్ల, ఆమె ఒక ‘ఖారిన్‘ (Qarin – ఉమ్రా మరియు హజ్ కలిపి చేసేవారు) అయ్యారు. ఆమె ఉమ్రా హజ్‌లోనే కలిసిపోయినందున, హజ్ పూర్తయిన తర్వాత ఇతర భార్యల వలె తాను కూడా ప్రత్యేకంగా ఒక ఉమ్రా చేస్తానని ఆమె ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అనుమతి అడిగారు. అప్పుడు ఆమె ఉమ్రా కోసం ఇహ్రామ్ కట్టడానికి వీలుగా, హరమ్ సరిహద్దుల వెలుపల ఉన్న ‘అల్-తన్ఈమ్’ ప్రాంతానికి ఆమె సోదరునితో కలిసి వెళ్లాలని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సూచించారు.

ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉమ్రా చేయాలని కోరినప్పుడు, ఆమె ఇహ్రామ్ కట్టడానికి వీలుగా పవిత్ర హరమ్ సరిహద్దులకు ఆవల ఉన్న ప్రదేశానికి ఆమెను తీసుకువెళ్లమని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమె సోదరుడు అబ్దుర్రహ్మాన్‌ను ఆదేశించారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి: ఆమె సోదరుడు అబ్దుర్రహ్మాన్ ఆమెకు తోడుగా వెళ్లి, తవాఫ్, సయీలలో ఆమెకు సహాయపడి, ఆ తర్వాత ఆమెతో పాటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు తిరిగి వచ్చారు. కానీ, ఆయన స్వయంగా ఇహ్రామ్ కట్టలేదు. పుణ్యకార్యాలు చేయాలనే బలమైన ఆసక్తి ఉన్నప్పటికీ, ఈ విషయం గురించి విన్న సహచరులు (సహాబా) (రదియల్లాహు అన్హుమ్) ఎవరూ కూడా, నేటి కాలంలో పదేపదే ఉమ్రా చేసే కొందరి వలె “హజ్ తర్వాత మరో ఉమ్రా చేయడానికి ఇదొక మంచి అవకాశం” అని భావించలేదు. అసలు సహచరులు (రదియల్లాహు అన్హుమ్) ఇలా పదేపదే ఉమ్రాలు చేసేవారే కాదు.

ఈ సంఘటన ద్వారా మనకొక విషయం స్పష్టమవుతోంది: సత్కార్యాలు చేయడంలో మనకంటే సహచరులకే (రదియల్లాహు అన్హా)ఎక్కువ ఆసక్తి ఉండేది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుమతితో ఆయిషా (రదియల్లాహు అన్హా)ఉమ్రాకు వెళ్లినప్పుడు, ఆమె సోదరుడు అబ్దుర్రహ్మాన్ ఆమెతో పాటు వెళ్లినా ఇహ్రామ్ కట్టలేదు. “ఎలాగూ వెళ్తున్నాను కదా, నేనూ ఒక ఉమ్రా చేసేస్తాను” అని ఆయన అనుకోలేదు. అలాగే, అక్కడ వేచి ఉన్న ఇతర సహచరులు కూడా “మనం ఎలాగూ ఇక్కడే ఉన్నాం కదా, మనమూ ఉమ్రా చేద్దాం” అని అనలేదు. నేడు కొందరు తమకోసం లేదా తమ తల్లిదండ్రులు, బంధువుల తరపున చేస్తున్నట్లుగా వారిలో ఎవరూ పదేపదే ఉమ్రా చేయలేదు. కాబట్టి, కొంతమంది యాత్రికులు హజ్ పూర్తయ్యాక రెండు, మూడు లేదా నాలుగుసార్లు పదేపదే ఉమ్రాలు చేయడం, ప్రతి ఉమ్రాకూ జుట్టును కొద్దికొద్దిగా కత్తిరించడం లాంటి ఆచరణలకు ఇస్లాంలో ఎలాంటి ఆధారం లేదు. ఒక వ్యక్తి ఒక ఉమ్రా కోసం తలలో సగం గుండు చేయించుకున్నాడని, మరో ఉమ్రా కోసం మిగిలిన సగం గుండు చేయించుకున్నాడని కూడా కొన్ని కథనాలు ఉన్నాయి—కానీ వాటి ప్రామాణికత సందేహాస్పదమే.

సరైన అవగాహన లేకపోవడం, అజ్ఞానంతో వ్యవహరించడం వల్ల హజ్ సమయంలో అనేక వింతైన, అసాధారణమైన ఆచరణలు మనకు కనిపిస్తుంటాయి. షేక్ (ఇబ్న్ బాజ్) (రహిమహుల్లాహ్) జీవించి ఉన్న కాలంలో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుంది. నేను ఒకసారి ఆయన వద్దకు వెళ్లినప్పుడు, నన్ను కలిసి సందేహం అడిగిన ఒక యాత్రికుడి గురించి షేక్ గారికి వివరించాలని కొందరు పండితులు నాతో అన్నారు. నేను మదీనాలోని మీఖాత్‌లో ఉన్నప్పుడు ఒక యాత్రికుడు నా వద్దకు వచ్చి, “నాకు సహజంగానే బట్టతల ఉంది, పైగా నేను ఎప్పుడూ గడ్డం కూడా గీసుకుంటాను” అని చెప్పాడు. అతను ఇంకా ఇలా అన్నాడు: “నేను అల్-మర్వాకు చేరుకుని ఉమ్రా పూర్తి చేసేసరికి నా తలపై జుట్టు ఏమీ లేదు. అప్పుడు నాకు ఒక వ్యక్తి కనిపించి, ‘నీ తల మీద జుట్టు లేదు కదా, ఇప్పుడు నువ్వు ఇహ్రామ్ నుండి ఎలా బయటపడతావు? వెళ్లి నీ మీసాలు గీసుకో‘ అని సలహా ఇచ్చాడు. దాంతో నేను మంగలి వద్దకు వెళ్లి నా మీసాలు గీసుకుని, తద్వారా ఇహ్రామ్ నుండి బయటపడ్డాను” అని చెప్పాడు. కొందరు పండితుల సూచన మేరకు ఈ విషయాన్ని నేను షేక్ ఇబ్న్ బాజ్‌తో ప్రస్తావించగా, ఆయన తీవ్ర ఆవేదన, కోపం వ్యక్తపరిచారు. సరైన జ్ఞానం లేకుండా యాత్రికులకు ఫత్వాలు (మతపరమైన తీర్పులు) ఇవ్వడానికి కొందరు చూపే సాహసమే ఆయన కోపానికి కారణం.

దీనికి సంబంధించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించిన ఒక హదీసు ఉంది: 

مَنْ أُرْشِدَ إِلَى غَيْرِ رُشْدٍ فَإِنَّمَا إِثْمُهُ عَلَى مَنْ أَرْشَدَهُ 
(ఎవరైనా మార్గభ్రష్టత్వం వైపు దారిచూపితే, దాని పాపం దారిచూపిన వారిపైనే పడుతుంది.)

కాబట్టి, సరైన జ్ఞానం లేకుండా “ఫలానా విధంగా చేయండి” అని సలహా ఇచ్చే వ్యక్తి, అల్లాహ్ పేరుతో తప్పుగా మాట్లాడినందుకు పాపభారాన్ని మూటగట్టుకుంటాడు. కొందరు వ్యక్తులు, సుబహానల్లాహ్ (అల్లాహ్ ఎంతో పవిత్రుడు), ఇలాంటి పరిస్థితుల్లో కేవలం భావోద్వేగాలకు లోనై “ఏమీ పర్వాలేదులే” అంటూ తప్పుడు సమాధానాలు ఇస్తుంటారు. ఇతరుల పట్ల దయ చూపడానికి ముందు, ఒకరు తమ పట్ల తాము దయ కలిగి ఉండాలి. ఇతరులపై జాలి చూపించే ముందు మీపై మీరు జాలి చూపించుకోండి—అంటే, జ్ఞానం లేకుండా అల్లాహ్ గురించి మాట్లాడి పాపాల్లో పడవద్దు. ఫత్వా (మతపరమైన తీర్పు) అనేది భావోద్వేగాలపై కాకుండా, పరిపూర్ణమైన జ్ఞానం, స్పష్టమైన అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. ఒకరికి సరైన జ్ఞానం ఉంటేనే వారు తీర్పు ఇవ్వాలి; లేదంటే, ఆ విషయమై జ్ఞానం ఉన్న పండితులను సంప్రదించమని ఇతరులకు సూచించాలి.

ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉమ్రా: హజ్రత్ ఆయిషా ఉమ్రా ఉద్దేశ్యంతో వెళ్ళినప్పుడు రుతుస్రావం మొదలవడంతో, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సూచన మేరకు ఆమె హజ్ మరియు ఉమ్రా రెండింటినీ కలిపి (ఖారిన్) చేశారు.

అల్-తన్ఈమ్ ప్రయాణం: హజ్ పూర్తయిన తర్వాత ఆమె కోరిక మేరకు, ప్రత్యేకంగా ఉమ్రా చేయడానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుమతించారు. ఇహ్రామ్ కట్టడం కోసం ఆమెను తన సోదరుడు అబ్దుర్రహ్మాన్‌తో కలిసి ‘అల్-తన్ఈమ్’ ప్రాంతానికి పంపారు.

పదేపదే ఉమ్రాలు చేయకపోవడం: ఆయిషా (రదియల్లాహు అన్హా) కి తోడుగా వెళ్లిన ఆమె సోదరుడు అబ్దుర్రహ్మాన్ (రదియల్లాహు అన్హు) స్వయంగా ఉమ్రా చేయలేదు. దీనిని బట్టి ఒకే ప్రయాణంలో పదేపదే ఉమ్రాలు చేసే ఆచారం సహాబాలలో (ప్రవక్త అనుచరులలో) లేదని స్పష్టమవుతుంది.

ఆధారం లేని ఆచరణలు: హజ్ తర్వాత రెండు మూడు సార్లు పదేపదే ఉమ్రాలు చేయడం, ప్రతి ఉమ్రాకు కొద్దికొద్దిగా జుట్టు కత్తిరించడం లాంటి నేటికాలపు ఆచరణలకు ఇస్లాంలో ఎలాంటి ఆధారం లేదు.

అజ్ఞానం వల్ల తప్పులు: సరైన జ్ఞానం లేకపోవడం వల్ల కొందరు వింతైన పనులు చేస్తుంటారు. ఉదాహరణకు, బట్టతల ఉన్న ఒక వ్యక్తి ఉమ్రా పూర్తి చేశాక ఇహ్రామ్ నుండి బయటపడటానికి మీసాలు గీసుకోమని ఒకరు తప్పుడు సలహా ఇచ్చారు.

జ్ఞానం లేకుండా ఫత్వా ఇవ్వరాదు: ఈ సంఘటన విన్న షేక్ ఇబ్న్ బాజ్, సరైన జ్ఞానం లేకుండా మతపరమైన తీర్పులు (ఫత్వాలు) ఇచ్చే వారి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తప్పుదారి పట్టిస్తే పాపం: హదీసు ప్రకారం, ఒకరికి మతపరంగా తప్పుడు మార్గం చూపితే దాని పాపం ఆ సలహా ఇచ్చిన వారిపైనే పడుతుంది. కాబట్టి, అవగాహన లేకుండా కేవలం భావోద్వేగాలతో ఫత్వాలు ఇవ్వకూడదు.

ఉమ్రహ్ మెయిన్ పేజీ :
https://teluguislam.net/umrah/

అయ్యాముత్ తష్రీఖ్ (హజ్జ్ మాసంలోని తష్రీఖ్ దినాల) ఘనత

అయ్యాముత్ తష్రీఖ్ ఘనత
కూర్పు: ముహమ్మద్ నసీర్పద్దీన్ జామిఈ

[పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి]


అయ్యాముత్ తష్రీఖ్ అనగా ఇస్లామీయ క్యాలెండర్ లోని 12వ నెల అయిన జుల్ హిజ్జా యొక్క 11, 12 మరియు 13 తేదీలు. ఇవి ఖుర్బానీ, అల్లాహ్ స్మరణ, తక్బీరాత్ మరియు అల్లాహ్ అనుగ్రహాలపై కృతజ్ఞత తెలిపే రోజులు. ఈ రోజులకు ఇస్లాంలో గొప్ప మహిమ ఉంది.

అల్లాహు తఆలా ఇలా సెలవిచ్చాడు:

وَاذْكُرُوا اللَّهَ فِي أَيَّامٍ مَعْدُودَاتٍ
గణించదగిన ఆ దినాలలో (తష్రీఖ్ దినాలలో) అల్లాహ్ ను స్మరించండి (సూరహ్ అల్-బఖరా: 203).

ముఫస్సిరీన్లలో (ఖుర్ఆన్ వ్యాఖ్యానకర్తలలో) ముఖ్యంగా అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా మరియు జుమ్హూర్ ఉలమా అభిప్రాయం ప్రకారం “అయ్యామిన్ మఅదూదాత్” అనగా అయ్యామె తష్రీఖ్.

అల్లాహు తఆలా ఇలా సెలవిచ్చాడు:

لِيَشْهَدُوا مَنَافِعَ لَهُمْ وَيَذْكُرُوا اسْمَ اللَّهِ فِي أَيَّامٍ مَعْلُومَاتٍ
వారు తమ ప్రయోజనాలు పొందటానికి (హజ్ కు) రావాలి. ఆ నిర్ణీత దినాలలో అల్లాహ్ నామాన్ని స్మరించాలి. (సూరహ్ అల్-హజ్: 28).

అధిక ముఫస్సిరీన్ల ప్రకారం “అయ్యామిమ్ మఅలూమాత్” అంటే జుల్ హిజ్జా మొదటి పది రోజులు; “అయ్యామిమ్ మఅదూదాత్” అంటే అయ్యాముత్ తష్రీఖ్. ఇక్కడ ఖుర్బానీ ప్రస్తావన వచ్చింది గనక, ఈ ఖుర్బానీ ఎన్ని రోజులు చేయవచ్చు అన్నది కూడా స్పష్టంగా తెలుసుకుందాం.

అయితే పండుగ రోజు (10వ జిల్ హిజ్జా) మరియు ఆ తర్వాత మూడు రోజులు, మొత్తం నాలుగు రోజులు ఖుర్బానీ చేయవచ్చు. దీనికి మొదటి ఆధారం ప్రవక్తవారి ఈ హదీసు «كُلُّ أَيَّامِ التَّشْرِيقِ ذَبْحٌ» అయ్యాముత్ తష్రీఖ్ యొక్క అన్ని రోజులు జిబహ్ చేయవచ్చును అంటే ఖుర్బానీ ఇవ్వవచ్చును. (ముస్నద్ అహ్మద్ 1651, సహీహ్ 2476).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు:

«إِنَّ يَوْمَ عَرَفَةَ وَيَوْمَ النَّحْرِ وَأَيَّامَ التَّشْرِيقِ عِيدُنَا أَهْلَ الْإِسْلَامِ ، وَهِيَ أَيَّامُ أَكْلٍ وَشُرْبٍ»
నిశ్చయంగా అరఫా రోజు, నహ్ర ఖుర్బానీ రోజు మరియు అయ్యాముత్ తష్రీఖ్ ముస్లింల పండుగ రోజులు మరియు తినే త్రాగే రోజులు. (అబూ దావూద్ 2419. చివరి పదాలు ముస్లిం 1141లోనివి).

ఇమాం ఇబ్నె తైమియా, ఇమాం ఇబ్నె ఖయ్యిమ్, ఇమాం షౌకానీ, షేఖ్ బిన్ బాజ్ మరియు షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లాహ్ ఈ మాటనే బలపరిచారు, మరియు రాజిహ్ అని చెప్పారు. సూర బఖరలోని 203వ ఆయతు ద్వారా కూడా ఈ మాట గ్రహించడం జరిగినది. (వివరాలు ఆ ఆయతు వ్యాఖ్యానం మరియు హదీసుల్లో చూడవచ్చు).

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

أَيَّامُ التَّشْرِيقِ أَيَّامُ أَكْلٍ وَشُرْبٍ وَذِكْرِ اللَّهِ
అయ్యాముత్ తష్రీక్ అనేవి తినే, త్రాగే మరియు అల్లాహ్ స్మరణ చేసే రోజులు. (ముస్లిం: 1141).

ఈ హదీస్ స్పష్టంగా తెలియజేస్తుంది: ఈ రోజుల్లో అల్లాహ్ అనుగ్రహాలపై సంతోషం వ్యక్తం చేయడం షరియత్ లో సమ్మతం.

విశ్వాసులారా! లెక్కలేనన్ని సత్కార్యాలలో ఏదైనా సత్కార్యం గురించి అధికంగా చేయండి అని అల్లాహ్ చెప్పి ఉన్నాడా అంటే, అవును జిక్ర్ గురించి చెప్పి ఉన్నాడు. శ్రద్ధ వహించండి సురతుల్ జుముఅలోని ఈ ఆయత్:

﴿ وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَّعَلَّكُمْ تُفْلِحُونَ ﴾ [الجمعة ١٠]
ఎక్కువగా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి.

పైన ఉన్న ఆయతు అనువాదం ఇంతేనా, కాదు. అల్లాహ్ మరో శుభవార్త ఇచ్చాడు. అదే: మీరు సాఫల్యం పొందవచ్చు. అల్లాహు అక్బర్! మనం అల్లాహ్ ను ఎక్కువగా, అధికంగా స్మరిస్తూ ఉంటే సాఫల్యం లభించేది మనకే.

﴿ وَالذَّاكِرِينَ اللَّهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ أَعَدَّ اللَّهُ لَهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا ﴾
అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు – స్మరించే స్త్రీలు – వీరందరి కోసం అల్లాహ్ (విస్తృతమైన) మన్నింపును, గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు. (అహ్జాబ్ 33:35).

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఆదేశించారు:

لَا تَصُومُوا هَذِهِ الْأَيَّامَ
(అయ్యాముత్ తష్రీక్ లో) ఉపవాసం పాటించకండి. (సహీహ్ 3573).

అందువల్ల సాధారణ ముస్లింలకు 11, 12, 13 జుల్ హిజ్జా రోజుల్లో ఉపవాసం పాటించడం యోగ్యం కాదు. అయితే హజ్ తముత్తు లేదా ఖిరాన్ చేసిన హాజీలకు ఖుర్బానీ చేయలేని పరిస్థితిలో ఉపవాసం పాటించే అనుమతి ఉంది.

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

إِنَّ أَعْظَمَ الْأَيَّامِ عِنْدَ اللَّهِ يَوْمُ النَّحْرِ، ثُمَّ يَوْمُ الْقَرِّ
అల్లాహ్ వద్ద అత్యంత గొప్ప రోజు యౌమున్ నహర్ (10వ జుల్ హిజ్జా), తరువాత యౌముల్ ఖర్ర్ (11వ జుల్ హిజ్జా). (అబూ దావూద్: 1765.

ఇమామ్ అల్బానీ రహిమహుల్లాహ్ దీనిని సహీహ్ అన్నారు.) “యౌముల్ ఖర్ర్” అనగా అయ్యాముత్ తష్రీక్ మొదటి రోజు; ఈ రోజున హుజ్జాజ్ మినా లో నివసిస్తారు.

وَاذْكُرُوا اللَّهَ فِي أَيَّامٍ مَعْدُودَاتٍ
“గణించదగిన ఆ దినాలలో (తష్రీఖ్ దినాలలో) అల్లాహ్ ను స్మరించండి ” (సూరహ్ అల్-బఖరా: 203)

ఈ ఆయత్ ఆధారంగా సహాబాయె కిరామ్ రజియల్లాహు అన్హుమ్ అయ్యాముత్ తష్రీఖ్ రోజుల్లో గట్టిగా (బిగ్గరగా) తక్బీరాత్ పలికేవారు.

[1] హజ్రత్ ఇబ్ను ఉమర్ మరియు హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హుమా మార్కెట్ లోకి వెళ్లి తక్బీర్ పలికేవారు; వారిని విని ప్రజలు కూడా తక్బీర్లు పలికేవారు. (బుఖారీ, కితాబుల్ ఈదైన్, బాబ్ ఫజ్జుల్ అమల్ ఫీ అయ్యామిత్ తష్రీక్).

[2] హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు మినా లో తన గుడారంలో గట్టిగా తక్బీర్ పలికేవారు; అది మినాలోని మస్జిదె ఖైఫ్ లో ఉన్నవారికి వినబడేది, అప్పుడు వారు తక్బీర్ పలికేవారు. ఇలా మొత్తం మస్జిద్ తక్బీర్లతో మారుమ్రోగేది, తరువాత బజార్ల వరకు ఆ ధ్వని వినిపించేది. (బుఖారీ, కితాబుల్ ఈదైన్).

సహాబాయె కిరామ్ నుండి భిన్నమైన పదాలు మనకు లభించాయి. ప్రసిద్ధ పదాలు ఇవి:

الله أكبر الله أكبر لا إله إلا الله، والله أكبر الله أكبر ولله الحمد
(అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, వల్లాహు అక్బర్ , అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్ )

  1. అధికంగా జిక్ర్ చేయడం – తక్బీర్, తహ్లీల్, తహ్మీద్, తస్బీహ్, దురూద్ షరీఫ్.
  2. నమాజ్ ల తర్వాత తక్బీరాత్. (దీనినే తక్బీరె ముఖయ్యద్ అంటారు). ఉమ్మత్ యొక్క ఫుఖహా అభిప్రాయం ప్రకారం ఫర్జ్ నమాజ్ ల తరువాత తక్బీరాత్ పలకడం మష్రూ.
  3. ఖుర్బానీ మాంసం తినడం మరియు పంచడం.
  4. సంతోషం మరియు కృతజ్ఞత వ్యక్తం చేయడం.

ఈ రోజులు ఇబాదత్ తో పాటు ఆనందానికి కూడా సంబంధించినవి. ఇస్లాం సన్యాసాన్ని కాదు, షుక్ర్ మరియు జిక్ర్ తో కూడిన సమతుల్య జీవనాన్ని బోధిస్తుంది.

గౌరవనీయులైన ముస్లిములారా!

ఇమాం ఇబ్ను రజబ్ రహిమహుల్లాహ్ ఈ రోజుల గురించి తెలిపిన ఆణిముత్యాలు కొన్ని ఇలా ఉన్నాయి.

[1] అయ్యాముత్ తష్రీఖ్ లో విశ్వాసుల కొరకు శారీరక అనుగ్రహం మరియు మానసిక అనుగ్రహం రెండూ ఏకంగా లభిస్తాయి. శారీరక అనుగ్రహాలంటే తిను, త్రాగుట మరియు హృదయ అనుగ్రహాలంటే జిక్ర్ మరియు షుక్ర్.

فَأَيَّامُ التَّشْرِيقِ يَجْتَمِعُ فِيهَا لِلْمُؤْمِنِينَ نَعِيمُ أَبْدَانِهِمْ بِالْأَكْلِ وَالشُّرْبِ، وَنَعِيمُ قُلُوبِهِمْ بِالذِّكْرِ وَالشُّكْرِ.

[2] పండుగ రోజులలో తినడం, త్రాగడం అనేవి కేవలం ఆనందం కోసం మాత్రమే కాదు; వాటివల్ల మనకు శక్తి వచ్చి, ఆ శక్తితో అల్లాహ్ ను స్మరించడం మరియు ఆయన ఆజ్ఞలను పాటించడం. ఇదే నిజమైన కృతజ్ఞత. కానీ ఎవరు ఆ వరాలను పాపాలకు ఉపయోగిస్తారో, వారు అల్లాహ్ ఇచ్చిన అనుగ్రహం పట్ల కృతఘ్నత చూపినవారవుతారు. అలాంటి వారు ఆ అనుగ్రహాన్ని కోల్పోయే పరిస్థితికి చేరుకుంటారు.

أَنَّ الْأَكْلَ فِي أَيَّامِ الْأَعْيَادِ وَالشُّرْبِ إِنَّمَا يُسْتَعَانُ بِهِ عَلَى ذِكْرِ اللَّهِ تَعَالَى وَطَاعَتِهِ … فَمَنِ اسْتَعَانَ بِنِعَمِ اللَّهِ عَلَى مَعَاصِيهِ فَقَدْ كَفَرَ نِعْمَةَ اللَّهِ وَبَدَّلَهَا كُفْرًا، وَهُوَ جَدِيرٌ أَنْ تُسْلَبَ مِنْهُ

[3] మరో చోట చెప్పారు: ఈ రోజుల్లో మనం ఏ జంతువులను ఖుర్బానీ చేస్తామో అవి స్వయంగా అల్లాహ్ ను ఆరాధిస్తాయి, ఆయనకు విధేయులుగా ఉంటాయి. అయితే వాటి మాంసం తినడం ద్వారా మనలో విశ్వాసం పెరిగి, అల్లాహ్ ఆరాధన మరింత ఎక్కువగా చేసే బుద్ధి, ఎల్లవేళల్లో ఆయనకు విధేయులుగా ఉండే బుద్ధి కలగాలి. (ఇక్కడ అరబీ ఇవ్వలేకపోయాము మరీ సంక్షిప్తంగా చేసి అనువదించాము గనక).

[4] ఈ లోక జీవితం అంతా హజ్ యాత్ర రోజుల్లాంటిదే ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మోమిన్ (విశ్వాసి) అల్లాహ్ నిషేధించిన కోరికలు, పాపాల నుండి దూరంగా ఉండాలి; ఇది ఇహ్రామ్ లో ఉన్న హజ్ యాత్రికుడిలా ఉంటుంది.

ఎవరు తమ జీవిత ప్రయాణంలో సహనంతో ఉండి, తమ కోరికలను అదుపులో పెట్టుకుంటారో, వారు జీవిత యాత్ర ముగిసినప్పుడు తమ ఆశల గమ్యాన్ని చేరుకుంటారు. అప్పుడు వారు తమ బాధ్యతను పూర్తి చేసి, అల్లాహ్ కు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినవారవుతారు. ఆ తర్వాత వారి రోజులు అన్నీ మినా రోజుల్లా మారిపోతాయి — ఆనందం, తినడం, త్రాగడం, మరియు అల్లాహ్ స్మరణతో నిండిన రోజులుగా.

كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا أَسْلَفْتُمْ فِي الْأَيَّامِ الْخَالِيَةِ
గత కాలంలో మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తినండి, త్రాగండి” (అని వారితో అనబడుతుంది)“. (అల్ హాఖ్ఖహ్ 69:24).

فَإِنَّ الدُّنْيَا كُلَّهَا أَيَّامُ سَفَرٍ كَأَيَّامِ الْحَجِّ، وَهُوَ زَمَانُ إِحْرَامِ الْمُؤْمِنِ عَمَّا حُرِّمَ عَلَيْهِ مِنَ الشَّهَوَاتِ، فَمَنْ صَبَرَ فِي مُدَّةِ سَفَرِهِ عَلَى إِحْرَامِهِ وَكَفَّ عَنِ الْهَوَى، فَإِذَا انْتَهَى سَفَرُ عُمْرِهِ وَوَصَلَ إِلَى مِنَى الْمُنَى، فَقَدْ قَضَى تَفَثَهُ وَوَفَّى نَذْرَهُ، فَصَارَتْ أَيَّامُهُ كُلَّهَا كَأَيَّامِ مِنًى، أَيَّامَ أَكْلٍ وَشُرْبٍ وَذِكْرِ اللَّهِ عَزَّ وَجَلَّ. كما قال تعالى: كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا أَسْلَفْتُمْ فِي الْأَيَّامِ الْخَالِيَةِ

  1. అల్లాహ్ జిక్ర్ — మన నాలుక ఎల్లప్పుడూ తక్బీర్లతో తడిసి ఉండాలి.
  2. అల్లాహ్ అనుగ్రహాలపై షుక్ర్ — తినే, త్రాగే ప్రతి విషయంలో అల్లాహ్ ను స్మరించాలి.
  3. ఉమ్మత్ ఐక్యత — ప్రపంచవ్యాప్తంగా ముస్లింలంతా ఒకే జిక్ర్ మరియు ఒకే నినాదంతో ఏకమవ్వాలి.

سبحان ربك رب العزة عما يصفون وسالم على المرسلين والحمد لله رب العالمين

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధిని సందర్శించేవారికి ముఖ్యమైన సూచనలు – షేఖ్ అబ్దుర్రజ్జాఖ్ అల్-బద్ర్

Important notices for the visitor of the grave of the Prophet ﷺ
Shaykh Abdurrazzaq al-Badr [Video|Ar-En Subtitles]
https://youtu.be/ZJp6AFAGrWU [38 minutes]
https://abdurrahman.org/?p=435632

Explanation of The book Clarification and explanation of many issues related to Hajj, Umrah, and visitation in light of the Qur’an and the Sunnah by Shaykh Abdul-Aziz bin Abdullah bin Baz rahimahullah

సర్వ స్తోత్రాలు సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), వారి కుటుంబ సభ్యులు మరియు సహచరులందరిపై అల్లాహ్ శాంతి, శుభాలు వర్షించుగాక.

(اللَّهُمَّ اغْفِرْ لَنَا وَلِشَيْخِنَا وَلِجَمِيعِ الْمُسْلِمِينَ)
ఓ అల్లాహ్! మమ్మల్ని, మా షేఖ్ ను, అలాగే ముస్లింలందరినీ క్షమించు.

సుప్రసిద్ధ పండితులు ఇమామ్ అబ్దుల్ అజీజ్ ఇబ్న్ అబ్దుల్లాహ్ ఇబ్న్ బాజ్ (అల్లాహ్ వారిని కరుణించుగాక) ‘ఖురాన్, సున్నత్‌ల వెలుగులో హజ్, ఉమ్రా మరియు జియారత్‌కు సంబంధించిన పలు సమస్యల స్పష్టీకరణ మరియు వివరణ’ అనే తమ గ్రంథంలో ఈ విధంగా పేర్కొన్నారు:

అబ్దుల్-నబీ, గులామ్ అహ్మద్, గులామ్ ముస్తఫా వంటి పేర్లు ఉపయోగించడం నిషేధించబడినది

అల్లాహ్ సృష్టించిన ఏ ప్రాణినీ, అల్లాహ్ దాసులలో ఎవరినీ ఆయనకు (అల్లాహ్‌కు) కాకుండా ఇతరులకు దాసులుగా/బానిసలుగా చేయడం ఎవరికీ అనుమతించబడదు. అందువల్ల, ఎవరికైనా ‘అబ్దుల్-ఫదీల్, అబ్దుల్-నబీ, అబ్దుల్-రసూల్, అబ్ద్ అలీ, అబ్దుల్-హుసైన్, అబ్దుల్-జహ్రా, గులామ్ అహ్మద్, గులామ్ ముస్తఫా’ అని పేరు పెట్టడం లేదా ఒక సృష్టిని మరొక సృష్టికి దాసునిగా సూచించే ఏ ఇతర పేరునైనా పెట్టడం అనుమతించబడదు.

ఎందుకంటే ఇటువంటి పేర్లు భక్తులు మరియు ప్రముఖ వ్యక్తుల పట్ల మితిమీరిన భక్తిని/గౌరవాన్ని కలిగి ఉంటాయి, తద్వారా ఇది అల్లాహ్ (ఆయన మహోన్నతుడు) హక్కుల పట్ల అగౌరవానికి దారితీస్తుంది మరియు షిర్క్ (దైవత్వంలో లేదా ఆరాధనలో అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించడం) మరియు అతిక్రమణకు సాధనంగా మారుతుంది.

అంతేకాకుండా, అల్లాహ్ (ఆయన మహోన్నతుడు) కు కాకుండా ఇతరులకు ప్రజలను దాసులుగా సూచించే పేర్లను ఉపయోగించడాన్ని నిషేధించే విషయంలో పండితుల ఏకాభిప్రాయం ఉందని ఇబ్న్ హజ్మ్ ఉల్లేఖించారు.

శాశ్వత పండిత పరిశోధన మరియు ఫత్వా కమిటీ (సౌదీ అరేబియా)
(Permanent Committee for Scholarly Research and Ifta’)
అధ్యక్షుడు: ‘అబ్దుల్-అజీజ్ ఇబ్న్ అబ్దుల్లాహ్ ఇబ్న్ బాజ్
సభ్యులు: ‘అబ్దుల్లాహ్ ఇబ్న్ కవూద్, ‘అబ్దుల్లాహ్ ఇబ్న్ గుదయ్యన్, ‘అబ్దుల్-రజ్జాక్ అఫీఫీ

https://abdurrahman.org/2011/05/17/prohibition-of-using-names-like-abdul-naby-ghulam-ahmad-ghulam-mustafa/

బిదత్ వర్గాలు: జమాఅత్ అల్-ఇఖ్వాన్ అల్-ముస్లిమూన్ (Muslim Brotherhood) గురించి పది అంశాలు – షేక్ అహ్మద్ బిన్ యహ్యా అన్-నజ్మీ

ఇఖ్వాన్ అల్-ముస్లిమూన్ నిర్వచనం:

వీరు హసన్ అల్-బన్నా అనుచరులు. వారి విధానం (మన్హజ్) గురించి గమనించవలసిన అనేక అంశాలు ఉన్నాయి, వాటిలో అతి ముఖ్యమైనవి ఈ క్రిందివి:

[1] ఇస్లాంలో అత్యంత ముఖ్యమైన విషయమైన తౌహీద్ అల్-ఇబాదహ్ [1] కు వీరు ప్రాముఖ్యత ఇవ్వరు. ఇది లేకుండా ఏ వ్యక్తి ఇస్లాం కూడా చెల్లుబాటు కాదు.

[2] ప్రజలు పెద్ద షిర్క్ (బహుదేవతారాధన) చేస్తున్నప్పుడు, అల్లాహ్‌ను కాకుండా ఇతరులను ప్రార్థిస్తున్నప్పుడు, సమాధుల చుట్టూ తవాఫ్ (ప్రదక్షిణలు) చేస్తున్నప్పుడు, సమాధులలో ఉన్న మృతులకు మొక్కులు చెల్లిస్తున్నప్పుడు మరియు వారి పేర్లతో బలులు ఇస్తున్నప్పుడు వారు మౌనంగా ఉండి ఆమోదిస్తారు.

[3] ఈ విధాన స్థాపకుడు ఒక సూఫీ. అతనికి సూఫీయిజంతో ఎంత సంబంధం ఉందంటే, అతను అబ్దుల్-వహ్హాబ్ అల్-ఖుసాఫీకి, అతని ఖుసాఫీ షాద్-లీ తరీకా (మార్గం) అనుసరించడానికి బైఅత్ (విధేయత ప్రమాణం) చేశాడు.

[4] వారిలో బిదఅత్‌లు (నూతన ఆచారాలు) ఉండటం మరియు వాటి ద్వారా అల్లాహ్‌ను ఆరాధించడం జరుగుతుంది – ఎంతవరకు అంటే, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ జిక్ర్ (స్మరణ) సభలకు హాజరవుతారని మరియు వారు గతంలో చేసిన పాపాలను ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) క్షమిస్తారని ఈ విధాన స్థాపకుడు అంగీకరించాడు. ఇది అతని ఈ మాటల్లో కనిపిస్తుంది:

“లోకాలకు ఏ కాంతితో అయితే ఆయన కనిపించాడో ఆ వ్యక్తిని (ప్రవక్తను) అల్లాహ్ ఆశీర్వదించుగాక,
ఆయన సూర్యచంద్రులను మించిపోయాడు.
ఈ హబీబ్ (అనగా ముహమ్మద్) తన ప్రియమైన వారితో సమావేశమయ్యాడు.
మరియు వారు గతంలో చేసిన పాపాలన్నింటినీ క్షమించాడు.”

[5] వారు ఖిలాఫత్ (ఇస్లామిక్ పాలన) స్థాపనకు పిలుపునిస్తారు మరియు ఇది ఒక బిదఅత్ (నూతన కల్పన). ఎందుకంటే ప్రవక్తలు మరియు వారి అనుచరులకు తౌహీద్ (ఏకదైవారాధన) వైపు పిలవడం మినహా మరే బాధ్యత అప్పగించబడలేదు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: “మరియు నిశ్చయంగా మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను పంపాము, (తన ప్రజలతో ఇలా చెప్పమని): ‘అల్లాహ్‌ను ఆరాధించండి మరియు తాగూత్ (మిథ్యా దైవాల)కు దూరంగా ఉండండి.’” [సూరా అన్-నహ్ల్: 36]

[6] వారికి వలా మరియు బరా (విధేయత మరియు నిరాకరణ) లేకపోవడం లేదా అది చాలా బలహీనంగా ఉండటం జరుగుతుంది. సున్నీలు మరియు షియాల మధ్య సామీప్యాన్ని తీసుకురావాలన్న వారి పిలుపులో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మరియు వారి స్థాపకుడు ఇలా చెప్పినట్లు ఉటంకించబడింది: “మనం అంగీకరించే విషయాలలో ఒకరికొకరు సహకరించుకుంటాము మరియు మనం విభేదించే విషయాలలో ఒకరినొకరు క్షమించుకుంటాము.”

[7] వారు తౌహీద్ ప్రజలను మరియు సలఫీ మార్గానికి కట్టుబడి ఉన్నవారిని ద్వేషిస్తారు మరియు అసహ్యించుకుంటారు. సౌదీ రాజ్యం గురించి వారు మాట్లాడే మాటల్లో ఇది స్పష్టమవుతుంది. ఆ రాజ్యం తౌహీద్ పునాదిగా స్థాపించబడింది మరియు దాని పాఠశాలలు, విద్యాసంస్థలు మరియు విశ్వవిద్యాలయాలలో తౌహీద్‌ను బోధిస్తుంది. అంతేకాకుండా, జమీల్ అర్-రహ్మాన్ అల్-అఫ్ఘానీ కేవలం తౌహీద్ వైపు పిలిచినందుకు, తౌహీద్ బోధించే పాఠశాలలను కలిగి ఉన్నందుకే అతన్ని వారు చంపడంలో కూడా ఇది స్పష్టమైంది.

[8] వారు నాయకుల (పాలకుల) తప్పులను వెతుకుతారు మరియు వారి లోపాలను – అవి నిజమైనా లేదా అబద్ధమైనా – బహిర్గతం చేస్తారు. యువత దృష్టిలో నాయకులను అసహ్యులుగా చూపించడానికి మరియు వారి పట్ల యువత హృదయాల్లో ద్వేషాన్ని నింపడానికి వారు వీటిని వ్యాప్తి చేస్తారు.

[9] వారు తమను తాము ఆపాదించుకునే పార్టీ పట్ల హేయమైన పక్షపాత వైఖరిని కలిగి ఉంటారు. కాబట్టి వారు ఈ పార్టీ ఆధారంగానే స్నేహాన్ని కనబరుస్తారు మరియు ఈ పార్టీ ఆధారంగానే శత్రుత్వాన్ని ప్రదర్శిస్తారు.

[10] స్థాపకుడు నిర్దేశించిన పది షరతుల ప్రకారం ఇఖ్వానీ మన్హజ్ (విధానం) కోసం పని చేయడానికి వారు తమ విధేయతా ప్రమాణాన్ని (బైఅత్) ఇస్తారు. ఇంకా ఆందోళన కలిగించే ఇతర విషయాలు కూడా ఉన్నాయి, బహుశా వాటిని తర్వాత సమయంలో చర్చించవచ్చు.

[1] అనువాదకుని గమనిక: ఇది అల్లాహ్‌కు చేసే ఆరాధనలో ఆయన ఏకత్వానికి (ఒక్కడే అనడానికి) సంబంధించిన తౌహీద్ వర్గం. అనగా, మనం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధిస్తాము, మరెవరినీ ఆరాధించము అని దీని అర్థం.

Translated from English:
https://abdurrahman.org/2016/05/27/ten-points-about-jamaaat-ul-ikhwaan-al-muslimoon/

Posted from al-ibaanah eBook: Modern Day Deviant Groups – Shaikh Ahmad bin Yahyaa An-Najmee

ఈ వ్యాసంలో రచయిత, హసన్ అల్-బన్నా స్థాపించిన ‘ఇఖ్వాన్ అల్-ముస్లిమూన్’ (ముస్లిం బ్రదర్‌హుడ్) వర్గం యొక్క విధానంలోని (మన్హజ్ లోని) ప్రధాన లోపాలను విమర్శిస్తూ పది ముఖ్యమైన అంశాలను వివరించారు. వాటి సారాంశం క్రింది విధంగా ఉంది:

తౌహీద్ పట్ల నిర్లక్ష్యం & షిర్క్‌ను సహించడం: ఇస్లాంలో అత్యంత ముఖ్యమైన ‘తౌహీద్ అల్-ఇబాదహ్’ (కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించడం)కు వీరు ప్రాముఖ్యత ఇవ్వరు. ప్రజలు సమాధులను పూజించడం, మృతులను ప్రార్థించడం వంటి మహా షిర్క్ (బహుదేవతారాధన) చేస్తున్నా మౌనంగా ఆమోదిస్తారు.

సూఫీ ప్రభావం మరియు బిదఅత్ (నూతన ఆచారాలు): ఈ వర్గ స్థాపకుడికి సూఫీలతో సంబంధాలు ఉన్నాయి. వీరు తమ జిక్ర్ సభలకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా హాజరై తమ పాపాలను క్షమిస్తారని నమ్మడం వంటి తీవ్రమైన నూతన కల్పనలకు (బిదఅత్ లకు) పాల్పడతారు.

ఖిలాఫత్ స్థాపన అనే రాజకీయ లక్ష్యం: ప్రవక్తలు ప్రజలను కేవలం తౌహీద్ వైపు మాత్రమే పిలిచారు, కానీ వీరు మాత్రం రాజకీయ అధికారం (ఖిలాఫత్) కోసం పనిచేస్తారు. రచయిత దీనిని ఒక బిదఅత్‌గా పేర్కొన్నారు.

‘వలా మరియు బరా’ లోపం: ఇస్లామిక్ సిద్ధాంతమైన ‘వలా మరియు బరా’ (సత్యం పట్ల విధేయత, అసత్యం పట్ల నిరాకరణ) వీరికి లేదు. మౌలిక సిద్ధాంతాలలో తేడాలున్నా సున్నీలు మరియు షియాలను ఏకం చేయడానికి వీరు ప్రయత్నిస్తారు.

తౌహీద్ అనుచరుల పట్ల ద్వేషం (సలఫీ మన్హజ్ వ్యతిరేకత): సలఫీ మార్గంలో నడిచేవారిని, తౌహీద్‌ను బోధించేవారిని వీరు తీవ్రంగా ద్వేషిస్తారు. తౌహీద్‌ను ప్రచారం చేస్తున్నాడన్న ఒకే ఒక కారణంతో జమీల్ అర్-రహ్మాన్‌ను చంపడం మరియు సౌదీ రాజ్యం పట్ల వారికున్న వ్యతిరేకత దీనికి ఉదాహరణలు.

పాలకులపై తిరుగుబాటు ధోరణి: ముస్లిం పాలకుల తప్పులను వెతికి పట్టుకుని, వాటిని యువతలో ప్రచారం చేసి, పాలకులపై యువత హృదయాల్లో ద్వేషాన్ని మరియు విరోధాన్ని నింపుతారు.

గుడ్డి పక్షపాతం మరియు బైఅత్ (ప్రమాణం): ఇస్లాం కంటే తమ పార్టీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తమ పార్టీ ఆధారంగానే ఇతరులతో స్నేహం లేదా శత్రుత్వం నెరపుతారు. తమ ఇఖ్వానీ మన్హజ్ కోసం ప్రత్యేకంగా విధేయతా ప్రమాణం (బైఅత్) చేయించుకుంటారు.

ముగింపు: స్థూలంగా చెప్పాలంటే, ‘ఇఖ్వాన్ అల్-ముస్లిమూన్’ వర్గం ఇస్లాం యొక్క మూల సిద్ధాంతాలైన తౌహీద్ మరియు సున్నత్‌లకు బదులుగా రాజకీయ లక్ష్యాలకు, పార్టీ పక్షపాతానికి, మరియు బిదఅత్‌లకు ప్రాధాన్యత ఇస్తుందని షేక్ అహ్మద్ బిన్ యహ్యా అన్-నజ్మీ ఈ వ్యాసంలో స్పష్టం చేశారు.

ఖవారీజుల గురించి ఒక సంక్షిప్త పరిచయం – షేక్ సాలిహ్ అల్-ఫౌజాన్

రచయిత: షేక్ సాలిహ్ అల్-ఫౌజాన్
మూలం: లమ్హా అన్-ఇల్-ఫిరఖ్-ఇద్-దాలహ్ (పేజీలు. 31-37), షబ్బాబ్ అర్-రాజిహీ గారి నోట్స్ తో.
Lamha ‘an-il-Firaq-id-Daalah (pg. 31-37) w/ notes by Shabbaab Ar-Raajihee
ప్రచురణ: Al-Ibaanah.com
https://abdurrahman.org/?p=21054

ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) గారి ఖిలాఫత్ (పాలనా) చివరి రోజుల్లో పాలకుడిపై తిరుగుబాటు (ఖురూజ్) చేసిన వారే ఖవారీజులు. వారి తిరుగుబాటు కారణంగా ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) హత్యకు గురయ్యారు.

ఆ తర్వాత అలీ (రదియల్లాహు అన్హు) ఖిలాఫత్ కాలంలో వారి చెడు మరింత పెరిగింది. వారు ఆయనను అవిశ్వాసి (కాఫిర్) గా ప్రకటిస్తూ ఆయనపై తిరుగుబాటు చేశారు. అంతేకాక, ప్రవక్త అనుచరులైన సహాబాలు వారి (తప్పుడు) విశ్వాసాలతో ఏకీభవించనందుకు, సహాబాలను కూడా వారు అవిశ్వాసులు (కాఫిర్లు) గా తీర్మానించారు. కాబట్టి తమ అభిప్రాయాలను వ్యతిరేకించే వారందరినీ వారు అవిశ్వాసులుగా పరిగణించారు. ఫలితంగా, సృష్టిలో అత్యుత్తమమైన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరులైన సహాబాలనే వారు అవిశ్వాసులుగా ప్రకటించారు. ఇదెందుకు? ఎందుకంటే వారి మార్గభ్రష్టత్వం మరియు కుఫ్ర్ (అవిశ్వాస) విధానాలతో సహాబాలు ఏకీభవించలేదు.

ఖవారీజ్ ల విశ్వాసాలు (అఖీదా): వారు సున్నత్ మరియు జమాఅత్‌కు కట్టుబడి ఉండరు, అలాగే నాయకుడికి (అమీర్ కు) విధేయత చూపరు. దానికి బదులుగా, ఆయనపై తిరుగుబాటు చేయడాన్ని, ఆయన పట్ల విధేయతను విచ్ఛిన్నం చేయడాన్ని వారు ధర్మంలోని భాగంగా భావిస్తారు [1]. ఇది విధేయత చూపాలని ఆజ్ఞాపించిన అల్లాహ్ ప్రవక్త సలహాకు మరియు అల్లాహ్ తన గ్రంథంలో ఆజ్ఞాపించిన దానికి పూర్తి విరుద్ధం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ وَأُولِي الْأَمْرِ مِنكُمْ
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు విధేయత చూపండి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపండి. మరియు మీలోని అధికారులకు కూడా. .” [సూరా అన్-నిసా: 59]

కాబట్టి పాలకుడికి విధేయత చూపడాన్ని అల్లాహ్ ఇస్లాం ధర్మంలో ఒక భాగంగా చేశాడు. మరియు అల్లాహ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా పాలకుడికి విధేయత చూపడాన్ని ధర్మంలో భాగంగా చేశారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా అన్నారు:

«أُوصِيكُمْ بِتَقْوَى اللَّهِ وَالسَّمْعِ وَالطَّاعَةِ وَإِنْ عَبْدًا حَبَشِيًّا، فَإِنَّهُ مَنْ يَعِشْ مِنْكُمْ بَعْدِي فَسَيَرَى اخْتِلَافًا كَثِيرًا»

“మీరు అల్లాహ్ పట్ల భయభక్తులు (తఖ్వా) కలిగి ఉండాలని మరియు (నాయకుడి మాట) విని, విధేయత చూపాలని నేను మీకు ఉపదేశిస్తున్నాను, ఒక బానిస మీపై నాయకుడిగా నియమించబడినప్పటికీ సరే. ఎందుకంటే మీలో జీవించి ఉన్నవారు (ముందు ముందు) ఎన్నో విభేదాలను చూస్తారు…[2]

కాబట్టి ముస్లిం పాలకుడికి విధేయత చూపడం అనేది (ఇస్లాం) ధర్మంలోని భాగం. కానీ ఖవారీజులు ఇలా అంటారు: “లేదు, ఈ విధేయతకు మేము అతీతులం (మాకు స్వేచ్ఛ ఉంది).” ఈనాటి తిరుగుబాటు మరియు అల్లర్ల మార్గం కూడా ఇదే!

కాబట్టి ఖవారీజులు అంటే ముస్లింల ఐక్య సమూహంలో (జమాఅత్ లో) చీలికను తీసుకురావడానికి మరియు నాయకులపై తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించేవారు – ఇలా చేయడంలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల స్పష్టమైన అవిధేయత ఉంది. అలాగే, మహా పాపం (కబీరా పాపం) చేసిన ముస్లింను వారు అవిశ్వాసి (కాఫిర్) గా పరిగణిస్తారు.

కాబట్టి, వ్యభిచారి, దొంగ, మద్యం సేవించేవాడు – ఇలా మహా పాపాలు చేసే వారందరినీ వారు కాఫిర్లుగా తీర్మానిస్తారు. దీనికి భిన్నంగా, అహ్లుస్-సున్నహ్ వల్-జమాఅత్ వారు అలాంటి వ్యక్తిని “తక్కువ ఈమాన్ కలిగిన ముస్లిం[3] గా భావిస్తారు మరియు అతనిని “ధర్మంలో పాపాత్ముడు (ఫాసిఖ్/ఆసీ)” అని పిలుస్తారు. కాబట్టి అతను తన ఈమాన్ వల్ల ఒక “విశ్వాసి (ముమిన్)”, అలాగే తన మహా పాపం వల్ల ఒక “పాపాత్ముడు”. ఎందుకంటే షిర్క్ (అల్లాహ్ కు సాటి కల్పించడం) మరియు ఇస్లాంను భంగపరిచే స్పష్టమైన విషయాలు (నవాఖిజ్ అల్-ఇస్లాం) తప్ప మరొకటి ఏదీ ఒక వ్యక్తిని ఇస్లాం పరిధి నుండి బయటకు పంపవు. షిర్క్ కంటే తక్కువ స్థాయి పాపాలు, అవి మహా పాపాలైనప్పటికీ, ఒక వ్యక్తిని ఈమాన్ పరిధి నుండి బహిష్కరించడానికి కారణం కావు. అల్లాహ్ ఇలా అంటున్నాడు:

﴿إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ﴾
నిశ్చయంగా అల్లాహ్, తనకు సాటి కల్పించటాన్ని (షిర్క్‌ను) క్షమించడు. ఇది తప్ప ఇతర పాపాలను తాను కోరిన వారికి క్షమిస్తాడు.” [సూరా అన్-నిసా: 48, 116]

కానీ ఖవారీజులు ఇలా అంటారు: “మహా పాపం చేసినవాడు కాఫిర్ (అవిశ్వాసి), అతను క్షమించబడడు మరియు అతను నరకాగ్నిలో శాశ్వతంగా ఉండిపోతాడు.” ఇది ఖురాన్‌లో స్పష్టంగా చెప్పబడిన దానికి విరుద్ధం. దీనికి కారణం వారికి ధర్మం పట్ల సరైన అవగాహన (ఫిఖ్హ్/సమజ్) లేకపోవడమే.

వారు ఈ తప్పుడు విశ్వాసాలలో పడటానికి ప్రధాన కారణం వారి జ్ఞానలేమి (ఇల్మ్ లేకపోవడం) అని గమనించండి. ఎందుకంటే వారు ఆరాధనలు (ఇబాదత్), నమాజ్, ఉపవాసం మరియు ఖురాన్ పారాయణంలో చాలా తీవ్రంగా (ముందు) ఉంటారు. మరియు వారికి ధర్మం పట్ల బలమైన ఆవేశం (రోషం) ఉంటుంది, కానీ వారికి సరైన జ్ఞానం ఉండదు – ఇదే అసలు సమస్య.

కాబట్టి భయభక్తులు (తఖ్వా) మరియు ఆరాధనల్లో తీవ్రంగా కృషి చేయడం అనేది ధర్మ పరిజ్ఞానం మరియు సరైన అవగాహనతో కూడి ఉండాలి. అందువల్లే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సహాబాలకు వారిని (ఖవారీజులను) ఈ విధంగా వర్ణించారు: ప్రవక్త అనుచరులైన సహాబాలు ఖవారీజుల నమాజును చూసి తమ నమాజును తక్కువగా భావిస్తారని మరియు వారి ఆరాధనను చూసి తమ ఆరాధనను తక్కువగా భావిస్తారని చెప్పారు. ఆ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:

«يَمْرُقُونَ مِنَ الدِّينِ كَمَا يَمْرُقُ السَّهْمُ مِنَ الرَّمِيَّةِ»

వేటాడిన జంతువు శరీరం గుండా బాణం ఎలాగైతే దూసుకుపోతుందో, వారు (ఖవారీజులు) ధర్మం నుండి అలా బయటికి వెళ్లిపోతారు[4] – వారి ఆరాధనలు, వారి భక్తి మరియు వారు రాత్రి పూట చేసే తహజ్జుద్ నమాజ్ ఉన్నప్పటికీ సరే.

కాబట్టి వారి కృషి సరైన పునాదిపై మరియు ప్రామాణికమైన జ్ఞానంపై ఆధారపడి లేకపోవడం వల్ల, అది వారికీ మరియు ఈ ఉమ్మత్ (సమాజం) కీ ఒక మార్గభ్రష్టత్వంగా, ఒక జాడ్యంగా మరియు తీవ్రమైన కీడుగా మారింది.

అంతేకాకుండా, ఖవారీజుల చరిత్రలో వారు ఏ ఒక్క రోజైనా అవిశ్వాసులతో (కాఫిర్లతో) పోరాడినట్లు ఎక్కడా దాఖలాలు లేవు! బదులుగా, వారు కేవలం ముస్లింలతో మాత్రమే పోరాడుతారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా సెలవిచ్చినట్లు:

«يَقْتُلُونَ أَهْلَ الإِسْلاَمِ وَيَدَعُونَ أَهْلَ الأَوْثَانِ»
మరియు వారు ఇస్లాం ప్రజలను చంపి, విగ్రహారాధకులను వదిలివేస్తారు.” [5]

కాబట్టి ఖవారీజుల చరిత్రలో వారు ఏనాడైనా కాఫిర్లు మరియు ముష్రిక్కులతో పోరాడినట్లు మనకు తెలియదు. వారు ఎల్లప్పుడూ ముస్లింలతోనే పోరాడుతూ వస్తున్నారు. వారే ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ను చంపారు, వారే అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ను చంపారు. వారే జుబైర్ ఇబ్నుల్-అవ్వామ్ ను మరియు అత్యుత్తమ సహాబాలను చంపారు. మరియు వారు ముస్లింలను చంపడం నేటికీ ఆపలేదు.

ఇదంతా అల్లాహ్ ధర్మం పట్ల వారికి ఉన్న అజ్ఞానం వల్లే. అయినప్పటికీ, వారికి భయభక్తులు మరియు ఆరాధనా భావం ఉన్నాయి, కానీ ఇవి ప్రామాణికమైన జ్ఞానంపై ఆధారపడి లేనందున, అది వారికి ఒక వ్యాధిగా మారింది. అందుకనే గొప్ప పండితుడైన ఇబ్న్ అల్-ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) వారిని వర్ణిస్తూ ఇలా అన్నారు:

«وَلَهُم نُصُوصٌ قَصَّرُوا فِي فَهْمِهَا *** فَأُتُوا مِنَ التَّقْصِيرِ فِي العِرْفَانِ»
వారి వద్ద ఆధారాలు (నుసూస్) ఉన్నాయి, కానీ వాటిని అర్థం చేసుకోవడంలో వారు విఫలమయ్యారు.
కాబట్టి వారికి పరిమితమైన (తక్కువ) జ్ఞానమే ఇవ్వబడింది
.” [6]

కాబట్టి వారు ఖురాన్ మరియు సున్నత్ వాక్యాలను ఆధారాలుగా ఉపయోగిస్తారు కానీ వాటిని వారు అర్థం చేసుకోరు. పాపాలు చేసిన వారిని శిక్షిస్తామనే హెచ్చరికలు ఉన్న వాక్యాలను వారు ఆధారాలుగా చూపుతారు, కానీ వాటి నిజమైన అర్థాలను వారు గ్రహించరు. వారు ఆ వాక్యాలను, షిర్క్ కంటే తక్కువ పాపాలు చేసిన వారికి క్షమాపణ మరియు పశ్చాత్తాపాన్ని (తౌబా) స్వీకరిస్తామనే వాగ్దానం ఉన్న ఇతర వాక్యాలతో కలిపి చూడరు. కాబట్టి వారు గ్రంథంలోని ఒక భాగాన్ని అంగీకరిస్తారు మరియు మరొక భాగాన్ని వదిలివేస్తారు – ఇదంతా వారి అజ్ఞానం వల్లే.

కాబట్టి ధర్మం పట్ల మితిమీరిన ప్రేమ మరియు ఉత్సాహం (జజ్బా) ఉండటం మాత్రమే సరిపోదు. అవి అల్లాహ్ ధర్మం గురించిన ఇల్మ్ (జ్ఞానం) మరియు అవగాహనపై ఆధారపడి ఉండాలి. అప్పుడే ఆ జ్ఞానం నుండి వారు మార్గనిర్దేశం పొందుతారు మరియు విషయాలను వాటి సరైన స్థానంలో ఉంచుతారు.

కాబట్టి ధర్మం పట్ల ప్రేమ మరియు ఉత్సాహం ఉండటం మంచిదే, కానీ వాటికి ఖురాన్ మరియు సున్నత్ అనుసరణ ద్వారా సరైన దిశానిర్దేశం చేయబడాలి.

ధర్మంలో అత్యున్నత స్థానం ఉన్నవారు మరియు ముస్లింల పట్ల అత్యంత చిత్తశుద్ధి కలిగినవారు సహాబాలే. అయినప్పటికీ, ఖవారీజుల వల్ల ఉన్న ప్రమాదం మరియు చెడు వలన సహాబాలు వారితో పోరాడారు.

అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) నహ్రవాన్ యుద్ధంలో వారిని అత్యంత తీవ్రంగా వధించేంతగా వారితో పోరాడారు. ఇలా చేయడం ద్వారా, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపిన శుభవార్తను సాకారం చేశారు. ఎందుకంటే, వారిని చంపిన వారికి పుణ్యం మరియు స్వర్గం లభిస్తుందని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శుభవార్త ఇచ్చారు. కాబట్టి అలీ బిన్ అబీ తాలిబ్ వారిని చంపిన వ్యక్తి – అందువలన ఆయన అల్లాహ్ ప్రవక్త నుండి ఈ శుభవార్తను పొందారు.[7] ముస్లింలకు వారి కీడు జరగకుండా అడ్డుకోవడానికే ఆయన వారిని వధించారు.

ప్రతి తరంలోనూ, ముస్లింలకు ఈ దుష్ట విధానం (మన్హజ్) ఉనికి గురించి తెలిస్తే, మొదటగా వారిని అల్లాహ్ మార్గం వైపుకు పిలవడం మరియు వారికి అవగాహన కల్పించడం ద్వారా దానిని నయం చేయడానికి ప్రయత్నించడం విధి (వాజిబ్). కానీ వారు దీనిని అంగీకరించకపోతే, వారి చెడును నిరోధించడానికి (అధికారంలో ఉన్న ముస్లిం పాలకుడి నేతృత్వంలో) ముస్లింలు వారితో పోరాడాలి.

అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) తన సోదరుడు (Cousin), ఉమ్మత్ యొక్క గొప్ప పండితుడు (హబ్ర్) మరియు ఖురాన్ వ్యాఖ్యాత (తుర్జుమానుల్ ఖురాన్) అయిన అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమ) ను వారి వద్దకు పంపారు. ఆయన వారితో చర్చలు (మునాజరా) జరిపారు, దాంతో వారిలోని ఆరు వేల మంది పశ్చాత్తాపపడి (తౌబా చేసుకొని) తిరిగి వచ్చారు, కానీ చాలా మంది పశ్చాత్తాపపడకుండా అలాగే ఉండిపోయారు. అప్పుడు అమీర్-ఉల్-ముమినీన్, అలీ బిన్ అబీ తాలిబ్, మిగిలిన సహాబాలతో కలిసి వారితో పోరాడారు. ముస్లింలకు వారి కీడు మరియు హాని కలగకుండా నిరోధించడానికే ఈ పోరాటం జరిగింది.

ఇది అల్-ఖవారీజ్ అని పిలువబడే వర్గం (ఫిర్ఖా) మరియు వారి విశ్వాసాల గురించిన వివరణ.

[1] మన కాలంలో, పాపకార్యం కాని విషయాల్లో పాలకులకు విని, విధేయత చూపాలని విశ్వసించే వారిని బహుశా ప్రభుత్వ ఏజెంట్లుగా లేదా అమాయకులుగా ముద్రవేస్తున్నారు! అందుకనే ఈ ఖవారీజులు మింబర్ల పైనుండి మరియు వారి సమావేశాలలో పాలకులపై దాడి చేయడం మరియు వారి తప్పులను బహిరంగంగా ఎత్తిచూపడం మీరు చూస్తారు. కానీ అల్లాహ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

«مَنْ أَرَادَ أَنْ يَنْصَحَ لِسُلْطَانٍ بِأَمْرٍ فَلا يُبْدِ لَهُ عَلانِيَةً، وَلَكِنْ لِيَأْخُذْ بِيَدِهِ فَيَخْلُ بِهِ، فَإِنْ قَبِلَ مِنْهُ فَذَاكَ، وَإِنْ كَانَ لَمْ يَقْبَلْ كَانَ قَدْ أَدَّى الَّذِي عَلَيْهِ»

“ఎవరైనా అధికారికి (సుల్తాన్ కు) ఒక విషయంపై సలహా ఇవ్వాలనుకుంటే, అతను దానిని బహిరంగంగా వెల్లడించకూడదు, బదులుగా అతని చేతిని పట్టుకుని ఏకాంతంలోకి వెళ్ళాలి. అతను దానిని (సలహాను) అంగీకరిస్తే అతనికి ప్రతిఫలం ఉంటుంది, ఒకవేళ అతను అంగీకరించకపోతే, సలహా ఇచ్చినవాడు తన బాధ్యతను నెరవేర్చినవాడవుతాడు.”

ఇయ్యాద్ బిన్ గనమ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన ద్వారా అహ్మద్ (3/404) నమోదు చేశారు. ఇబ్న్ అబీ ఆసిమ్ కూడా దీనిని తన ‘అస్-సున్నహ్’ (2/522) గ్రంథంలో నమోదు చేశారు.

అధికారి (పాలకుడు) వీరిలో ఎవరినైనా బహిరంగ సభల్లో మాట్లాడకుండా నిషేధించినప్పుడు, వారు ఏకమై నిరసన ప్రదర్శనలు (demonstrations) చేస్తారు. ఒకరిని మాట్లాడకుండా అడ్డుకోవడం లేదా జైలులో పెట్టడం అనేది తిరుగుబాటును సమర్థిస్తుందని వారి అజ్ఞానంతో వారు భావిస్తారు! సహీహ్ ముస్లిం (1855) లోని ఔఫ్ బిన్ మాలిక్ అల్-అష్జఈ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనలోని ప్రవక్త ప్రవచనం వారు వినలేదా?:

«لا، مَا أَقَامُوا فِيكُمُ الصَّلاةَ»
“…లేదు, వారు నమాజును స్థాపిస్తున్నంత కాలం (మీరు వారిపై తిరుగుబాటు చేయకండి).”

ఇంకా సహీహ్ బుఖారీ, ముస్లింలలో ఉన్న ఉబాదా బిన్ అస్-సామిత్ (రదియల్లాహు అన్హు) హదీసులో, ప్రవక్త ఇలా అన్నారు:

«إِلَّا أَنْ تَرَوْا كُفْرًا بَوَاحًا، عِنْدَكُمْ مِنَ اللَّهِ فِيهِ بُرْهَانٌ»
…మీరు స్పష్టమైన మరియు బహిరంగ అవిశ్వాసాన్ని (కుఫ్ర-ఎ-బవాహ్) చూస్తే తప్ప, అప్పుడు మాత్రమే మీ వద్ద అల్లాహ్ ముందు సమర్పించడానికి స్పష్టమైన ఆధారం ఉంటుంది.”

అణచివేసే పాలకులపై పోరాడేందుకు అనుమతి కోరుతూ సహాబాలు ప్రవక్తను అడిగిన ప్రశ్నకు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇచ్చిన సమాధానం ఇది.

ఇమామ్ అహ్మద్ జైలులో ఎంతకాలం ఉన్నారో వీరికి తెలియదా? మరియు షేక్-ఉల్-ఇస్లాం ఇబ్న్ తైమియ్య ఎక్కడ మరణించారు?! ఖురాన్ సృష్టించబడినదని చెప్పనందుకు ఇమామ్ అహ్మద్ చాలా సంవత్సరాలు జైలులో ఉండి కొరడా దెబ్బలు తినలేదా? మరి అప్పుడు ఆయన ప్రజలను ఖలీఫాపై తిరుగుబాటు చేయమని ఎందుకు ఆదేశించలేదు? షేక్-ఉల్-ఇస్లాం (ఇబ్న్ తైమియ్య) రెండు సంవత్సరాలకు పైగా జైలులో ఉండి అక్కడే మరణించారని వారికి తెలియదా? ఆయన ప్రజలను నాయకుడిపై తిరుగుబాటు చేయమని ఎందుకు ఆదేశించలేదు? అంతకుమించి, ఈ పండితులు సద్గుణాలు మరియు జ్ఞానం పరంగా అత్యున్నత స్థానంలో ఉన్నారు, మరి వారి కంటే తక్కువ స్థాయి ఉన్నవారి సంగతేంటి??? యువత పండితులను (ఉలమాలను) విడిచిపెట్టి, వారి పుస్తకాలను మర్చిపోయి, ఆధునిక కాలపు మేధావులు, కవులు మరియు ఇస్లామిక్ రచయితల నుండి తమ జ్ఞానాన్ని తీసుకోవడం ప్రారంభించిన తర్వాతే ఈ భావజాలాలు మరియు చర్యలు మనకు వ్యాపించాయి! వ లా హౌల వ లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్!

[2] అహ్మద్, ఇబ్న్ మాజా, అత్-తిర్మిజీ, అల్-హాకిమ్ మరియు ఇతరులు ఉల్లేఖించిన సహీహ్ (ప్రామాణిక) హదీసు [అనువాదకునిచే సంక్షిప్తం చేయబడినది].

[3] వారు ఒక పాపాన్ని చిన్నదిగా భావించి (ఇస్తిఖ్ఫాఫ్) చేసినప్పటికీ, దానిని ధర్మసమ్మతంగా (ఇస్తిహ్లాల్ / హలాల్) చేయనంత కాలం వారు కాఫిర్లు కారు. కానీ వారిలో కొందరు చెప్పేది దీనికి విరుద్ధం: “ఒక పాపాన్ని తేలికగా భావించి చేసే వ్యక్తి, ఇస్లాం నుండి బయటికి వెళ్ళేంత అవిశ్వాసానికి పాల్పడతాడు” అని అంటారు. మన షేక్, షేక్ అబ్దుల్-అజీజ్ ఇబ్న్ అబ్దిల్లాహ్ బిన్ బాజ్ గారిని 1415 హిజ్రీలో తాయిఫ్ లో అడిగినప్పుడు, ఈ వాక్యమే ఖవారీజుల విశ్వాసాల యొక్క సారాంశం అని ఆయన చెప్పారు.

[4] అహ్మద్, ముస్లిం, అల్-బుఖారీ మరియు ఇతరులు అనేక మంది సహాబాల ద్వారా ఉల్లేఖించిన సుదీర్ఘ హదీసులోని భాగం [అనువాదకునిచే సంక్షిప్తం చేయబడినది].

[5] అహ్మద్, ముస్లిం, అల్-బుఖారీ మరియు ఇతరులు ఉల్లేఖించిన సుదీర్ఘ హదీసులోని భాగం [అనువాదకునిచే సంక్షిప్తం చేయబడినది].

[6] ఇబ్న్ అల్-ఖయ్యిమ్ రచించిన అన్-నూనియ్య (పేజీ. 97).

[7] అల్-బుఖారీ తన సహీహ్ (6930) లో, ముస్లిం తన సహీహ్ (1066) లో, అహ్మద్ తన ముస్నద్ (1/113) లో, ఇబ్న్ అబీ ఆసిమ్ తన అస్-సున్నహ్ (914) లో మరియు అబ్దుల్లాహ్ బిన్ అల్-ఇమామ్ అహ్మద్ తన అస్-సున్నహ్ (1487) లో నమోదు చేశారు: అలీ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా అన్నారు:

«سَيَخْرُجُ قَوْمٌ فِي آخِرِ الزَّمَانِ حُدَثَاءُ الأَسْنَانِ، سُفَهَاءُ الأَحْلاَمِ، يَقُولُونَ مِنْ خَيْرِ قَوْلِ الْبَرِيَّةِ، لاَ يُجَاوِزُ إِيمَانُهُمْ حَنَاجِرَهُمْ، يَمْرُقُونَ مِنَ الدِّينِ كَمَا يَمْرُقُ السَّهْمُ مِنَ الرَّمِيَّةِ، فَأَيْنَمَا لَقِيتُمُوهُمْ فَاقْتُلُوهُمْ، فَإِنَّ فِي قَتْلِهِمْ أَجْرًا لِمَنْ قَتَلَهُمْ يَوْمَ الْقِيَامَةِ»

“నేను అల్లాహ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అనడం విన్నాను: ‘చివరి రోజుల్లో, వయస్సులో చిన్నవారైన మరియు మూర్ఖపు ఆలోచనలు ఉన్న ఒక సమూహం ఉద్భవిస్తుంది. వారు సృష్టిలోనే అత్యుత్తమమైన మాటలతో మాట్లాడతారు. కానీ వారి ఈమాన్ (విశ్వాసం) వారి గొంతులను దాటదు. కాబట్టి మీరు వారిని ఎక్కడ ఎదుర్కొన్నా, వారిని చంపండి (ఇస్లామిక్ ప్రభుత్వ నేతృత్వంలో), ఎందుకంటే వారిని చంపిన వారికి తీర్పు దినాన ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది.'”

ఖవారీజులు మరియు వారి సంకేతాల గురించిన హదీసును ఉల్లేఖించిన తరువాత, అబూ సయీద్ అల్-ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “అల్లాహ్ ప్రవక్త అనుచరులలో ఇరవై లేదా ఇరవై కంటే ఎక్కువ మంది సహాబాలు, వారిని చంపే బాధ్యతను అలీ చేపట్టారని నాకు వివరించారు.” అహ్మద్ తన ముస్నద్ (3/33) లో మరియు ఆయన కుమారుడు అబ్దుల్లాహ్ తన అస్-సున్నహ్ (1512) లో ఉల్లేఖించారు.

ఉత్పత్తి మరియు తిరుగుబాటు: ఖవారీజులు ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) మరియు అలీ (రదియల్లాహు అన్హు) గారి కాలంలో ముస్లిం పాలకులపై తిరుగుబాటు చేయడం ద్వారా ఉద్భవించారు. వారు తమ అభిప్రాయాలతో ఏకీభవించని అత్యుత్తమ సహాబాలను సైతం అవిశ్వాసులుగా (కాఫిర్లుగా) ప్రకటించారు.

పాలకులకు అవిధేయత: అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పాలకులకు విధేయత చూపాలని ఆజ్ఞాపించినప్పటికీ, ఖవారీజులు పాలకులపై తిరుగుబాటు చేయడాన్ని మరియు వారిని వ్యతిరేకించడాన్ని ధర్మంలోని భాగంగా భావిస్తారు.

మహా పాపాలకు కాఫిర్లుగా తీర్మానించడం: వ్యభిచారం, దొంగతనం లాంటి మహా పాపాలు (కబీరా పాపాలు) చేసిన ముస్లింలను ఖవారీజులు ఇస్లాం నుండి బహిష్కరించి, వారిని కాఫిర్లుగా మరియు శాశ్వత నరకవాసులుగా పరిగణిస్తారు.

అహ్లుస్-సున్నహ్ వల్-జమాఅత్ విశ్వాసం: అహ్లుస్-సున్నహ్ విధానం ప్రకారం షిర్క్ (అల్లాహ్ కు సాటి కల్పించడం) మరియు ఇస్లాంను భంగపరిచే ఇతర స్పష్టమైన విషయాలు (నవాఖిజ్ అల్-ఇస్లాం) తప్ప, మరే ఇతర మహా పాపాలు (వ్యభిచారం, దొంగతనం, మద్యం సేవించడం వంటివి) ఒక వ్యక్తిని ఇస్లాం పరిధి నుండి బయటకు పంపవు (ఒకవేళ ఆ పాపాలను వారు ధర్మసమ్మతంగా/హలాల్ గా భావిస్తే తప్ప). షిర్క్ మరియు కుఫ్ర కంటే తక్కువ స్థాయి పాపాలు చేసిన వ్యక్తి “తక్కువ ఈమాన్ కలిగిన ముస్లిం” మరియు “ధర్మంలో పాపాత్ముడు” అవుతాడే తప్ప కాఫిర్ కాడు.

అజ్ఞానం మరియు అతిభక్తి: ఖవారీజులు నమాజు, ఉపవాసాలు మరియు ఖురాన్ పారాయణంలో చాలా ముందుంటారు. కానీ వారికి ధర్మం పట్ల సరైన జ్ఞానం (ఇల్మ్) మరియు అవగాహన (ఫిఖ్హ్) ఉండవు. జ్ఞానం లేని వారి అతి ఉత్సాహమే వారి మార్గభ్రష్టత్వానికి కారణం.

ఆధారాల దుర్వినియోగం: వారు ఖురాన్ మరియు హదీసులను చదివినప్పటికీ వాటి నిజమైన అర్థాన్ని గ్రహించరు. కేవలం పాపాలకు విధించే శిక్షల వాక్యాలను మాత్రమే తీసుకుని, అల్లాహ్ యొక్క క్షమాపణకు సంబంధించిన వాక్యాలను విడిచిపెడతారు.

ముస్లింల పట్ల క్రూరత్వం: చరిత్రలో ఖవారీజులు ఏనాడూ కాఫిర్లతో పోరాడలేదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందుగానే హెచ్చరించినట్లు, వారు కేవలం ముస్లింలను మాత్రమే వధిస్తారు.

సహాబాల చర్య: అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) మొదట అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ ద్వారా వారికి ధర్మాన్ని బోధించారు. అప్పటికి వినకుండా ముస్లింలకు హాని చేస్తున్న వారిపై నహ్రవాన్ యుద్ధంలో పోరాడి వారిని అంతమొందించారు.

మన బాధ్యత: ఇలాంటి మార్గభ్రష్ట భావజాలం ఉన్నవారికి ముందుగా సరైన జ్ఞానాన్ని బోధించి అవగాహన కల్పించాలి. వారు వినకపోతే, వారి కీడు నుండి ముస్లిం సమాజాన్ని రక్షించడానికి (ఇస్లామిక్ పాలకుడి నేతృత్వంలో) వారితో పోరాడటం బాధ్యత.