రమదాన్ లో, నెలసరిలో ఉన్న స్త్రీ ఫజర్ కంటే కొన్ని నిముషాల ముందే పరిశుద్దురాలైతే.. – షేఖ్ ఉసైమీన్

ప్రశ్న-2 : నెలసరిలో ఉన్న స్త్రీ (ఫజర్ కంటే ముందు) పరిశుద్దురాలైంది. ఫజర్ తరువాత స్నానము చేసి నమాజ్ కూడా చేసింది. ఆ రోజు ఉపవాసాన్ని కూడా పూర్తి చేసింది. అయితే ఆమె ఆ రోజు పాటించిన ఉపవాసానికి బదులుగా మరలా ఉపవాసం పాటించాలనే విధి వుందా?’. ఒక సోదరి. 

జవాబు: ‘ఫజర్’ కంటే ఒక్క నిమిషం ముందు నెలసరిలో ఉన్న స్త్రీ పరిశుద్ధురాలైనా తన పరిశుద్ధత గురించి పూర్తిగా నమ్మకం కలిగివుంటే మరింకా అది రమజాన్ మాసమే అయితే ఆమె పై ఆరోజు ఉపవాసాన్ని పాటించడం విధిగా పరిగణించబడుతుంది. కనుక అమె ఆరోజు పాటించే ఉపవాసం శ్రేయస్కరంగానే భావించబడుతుంది. దానికి బదులు (ఖజా) ఉపవాసం పాటించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆమె పరిశుభ్రతలోనే ఉపవాసం (‘సహరి’ చేసింది) పాటించింది. ఆమె ఒకవేళ ‘ఫజర్’ తరువాత స్నానం చేసినా సరే. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. దీనికి ఉదాహరణ ఏమిటంటే పురుషుడు కామక్రియల వల్ల లేదా వీర్యస్ఖలనానికి గురై (‘సహ్రి’ చేసుకుని) ఫజర్ తరువాత స్నానము చేసినా అతని ఉపవాసం శ్రేయస్కరంగానే పరిగణించ బడుతుంది. 

దీనికి సంబంధించిన మరొక విషయయాన్ని ప్రస్తావించ దలచుచున్నాను : అదేమిటంటే, ‘ఆమె ఉపవాసం పూర్తి చేసుకుని ఇఫ్తార్ చేసిన తరువాత, ఇషా కంటే ముందు ఋతుస్రావానికి గురైతే ఆమె ఆ రోజు ఉపవాసం వృధా అయిపోతుందని’ కొందరు స్త్రీలు భావిస్తున్నారు. ఇది ఎంత మాత్రం సరి కాదు. అంతే కాకుండా ఒక వేళ సూర్యాస్తమయం తరువాత ఒక క్షణం తరువాత ఋతస్రావం ప్రారంభమైనా కూడ ఆమె ఉపవాసం పరిపూర్ణమవుతుంది. 

ఈ ఫత్వా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది. లింక్ క్లిక్ చేసి పూర్తి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

ఋతుకాలం – సందేహాలు & సమాధానాలు
మూల రచయిత (అరబీ): షేఖ్ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్ ఉసైమీన్ (రహిమహుల్లాహ్)
తెలుగు అనువాదం: హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి హఫిజహుల్లాహ్
మర్కజ్ దారుల్ బిర్ర్ పబ్లికేషన్స్

రమజాన్ లో ఫజర్ తర్వాత స్త్రీ పరిశుద్ధురాలైతే ఏమి తినకుండా ఉపవాసం ఉండాలా? – షేఖ్ ఉసైమీన్

ప్రశ్న-1: ఒక వేళ స్త్రీ ఫజర్ పిమ్మటే (తరువాత) పరిశుద్ధురాలైతే అన్నపానియాలు మరి ఇతరాత్రా ఆహార వస్తువులు తినకుండా ఆ రోజు ఉపవాసం వుండాలా? మరి ఆమె పాటించే ఆ రోజు ఉపవాసాన్ని లెక్కించబడడం జరుగుతుందా? లేక ఆమె దానికి బదులుగా మరలా ఉపవాసం పాటించవలసి వుంటుందా? 

జవాబు : ఒక వేళ స్త్రీ ఫజర్ పిమ్మటే పరిశుద్ధురాలైతే ఆ రోజు అన్న పానియాలు మరి ఇతరాత్రా ఆహార వస్తువులు తినకుండా వుండటం గురించి ఇస్లామీయ ధార్మిక విద్వాంసుల్లో రెండు అభిప్రాయాలు వున్నాయి. 

1-ఆ రోజు ఆమె ఏమి తినకుండా ఆగిపోవాలి. కాని ఆ రోజు ఉపవాసం లెక్కింపబడదు. దానికి బదులు ఉపవాసం ఉండ వలసి ఉంటుంది.

(ఇమాం అహ్మద్-రహిమహుల్లాహ్ వెల్లడించిన ప్రఖ్యాత అభిప్రాయం) 

2-ఆమెకు ఆ రోజు ఏమి తినకుండా ఉండవలసిన అవసరం లేదు. ఆమె ఆ రోజు ఉపవాసం పాటించడం సరికాదు. ఎందుకంటే ఆ రోజు ఉపవాస ప్రారంభ దశలో ఆమె ఋతుకాలం (సమయం ) లోనే వుంది. అలాంటప్పుడు ఉపవాసం పాటించడం సరికాదు. ఉపవాసమే సరికానప్పుడు అన్న పానియాలకు దూరంగా ఉండటంలో ఎలాంటి ప్రయోజనం లేదు. మరియు ఆ ఆ సమయంలో దాని పవిత్రత, గౌరవాన్ని పాటించవలసిన నిబంధన ఆమెపై లేదు. ఎందుకంటే ఆ రోజు ప్రారంభ దశలో ఆమె ఉపవాసానికి అనర్హురాలు. అంతే కాకుండా ఆ పరిస్థితుల్లో ఆమెపై ఉపవాసం నిషేధించ బడింది. షరీఅత్ ప్రకారం ఉపవాసం గురించి మాకు తెలిసిన విషయం ఏమంటే అల్లాహ్ ఆరాధన సంకల్పంతో ‘ఫజర్’ నుండి సూర్యస్తమయం (మగ్రిబ్) వరకు అన్నపానియాలు, ఇతరాత్రా తినే, త్రాగే వస్తూవుల నుండి ఆగిపోవాలి. 

దీనిలో రెండో అభిప్రాయం మొదటి కంటే ఉత్తమమైనది. ఏదేమైనా ఈ రెండు అభిప్రాయాల వెలుగులో ఆ రోజు ఉపవాసానికి బదులు (ఖజా*) పాటించవలసి వుంటుంది.

[*] ఖజా: ఏదైన నమాజ్ లేక ఉపవాసం లాంటివి వాటి నిర్ణీత సమయం దాటిపోయి నంతరం మరలా దానిని పాటించడాన్ని అంటారు.

ఈ ఫత్వా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది. లింక్ క్లిక్ చేసి పూర్తి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

ఋతుకాలం – సందేహాలు & సమాధానాలు
మూల రచయిత (అరబీ): షేఖ్ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్ ఉసైమీన్ (రహిమహుల్లాహ్)
తెలుగు అనువాదం: హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి హఫిజహుల్లాహ్
మర్కజ్ దారుల్ బిర్ర్ పబ్లికేషన్స్

ఋతు కాలం (బహిష్టు) : సందేహాలు & సమాధానాలు [పుస్తకం]

రుతు కాలం (బహిష్టు) : సందేహాలు & సమాధానాలు [పుస్తకం]

Menses Rulings QA

ఋతుకాలం – సందేహాలు & సమాధానాలు
మూల రచయిత (అరబీ): షేఖ్ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్ ఉసైమీన్ (రహిమహుల్లాహ్)
తెలుగు అనువాదం: హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి హఫిజహుల్లాహ్
మర్కజ్ దారుల్ బిర్ర్ పబ్లికేషన్స్

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[81 పేజీలు] [14 MB] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

స్త్రీ సంస్కరణోద్ధరణకు ఓ గొప్ప కానుక…!

శుచి శుభ్రతల పట్ల ఇతర మతాల కంటే ప్రత్యేకత కల్గియున్నది పవిత్ర ఇస్లామే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించింది నిక్కము. అది ఏమిటంటే : “శుచి శుభ్రత సగవిశ్వాసం”. శుచి(శుద్ధి) అంటే దేహము నుండి సమస్త మలినాలను శుభ్రము చేయుట. అది రెండు విధాలుగా విభజించబడింది.

1.స్వల్ప శుద్ధి.
2. సంపూర్ణ శుద్ధి.

స్వల్ప శుద్ధి : ఇందులో స్త్రీ పురుషులు సమానమే. ఎప్పుడైతే మలమూత్ర ద్వారాల నుండి ఏదైన వెలువడినప్పుడు ముస్లిం అన్న ప్రతి వ్యక్తి శుద్ధిని ఆశ్రయించడం తప్పనిసరి.అదేమిటంటే నమాజ్, ‘తవ్వాఫ్’, మరి పవిత్ర ఖుర్ఆన్ గ్రంధాన్ని తాకటానికి ముందు“వజు” చేయుట, అనగా నిర్దేశించిన అవయవాలను ధర్మాదేశాల ప్రకారం కడుగుట.

సంపూర్ణ శుద్ది : అనేది స్త్రీ పురుషులకు సమానమైనది కాదు. పురుషులకైతేసంభోగానంతరం ఇంకా వీర్యస్ఖలనం జరిగినప్పుడు, స్త్రీలకైతే సంభోగానంతరం, వీర్యస్ఖలనం జరిగినప్పుడు, ఇంకా ఋతుస్రావం, రక్తస్రావం జరిగినప్పుడు, ప్రతి వ్యక్తి స్నానం చేసుకోవాలి(తలంటు పోసుకోవాలి) నమాజుకంటే, ఉపవాసం కంటే, తవ్వాఫ్ కంటే ముందు, మరి పవిత్ర ఖుర్ఆన్ గ్రంథాన్ని తాకటానికి ముందు.

అయితే ఋతుస్రావం, రక్తస్రావం గురించి పరిశుద్ధత పట్ల ప్రత్యేకమైన ఆదేశాలున్నాయి. ఖుర్ఆన్, మరి ప్రవక్త హదీసు (సున్నత్) లో దీని నిమిత్తం సవివరంగా తెల్పబడింది. ధార్మిక విద్వాంసులు, ఇస్లామియా జ్ఞానులు ఈ సందేశాన్ని పూర్తి బాధ్యతతో ప్రజలకు వివరించారు. సమీప కాలంలో గొప్ప ధార్మికజ్ఞానిగా పేరు గాంచిన ప్రముఖ పండితులు ‘ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్-ఉసైమీన్ (రహిమహుల్లాహ్) పాఠాల్లో, ప్రసంగాల్లో మరి వ్యాసాల్లో వీటిని ప్రకటించారు. ఆయా స్త్రీల నుండి ప్రశ్నలు, సందేహాలు ఎదురైనప్పుడు ఆయన సంతృప్తి పరంగా సమాధానాలు ఇచ్చారు. ఇక్కడ ఎన్నుకున్నవి ఇటువంటి 60 ప్రశ్నలే. అవి ఋతుస్రావం, రక్తస్రావం అనే అంశాల్లో అన్ని కోణాలతో కూడుకున్నవి. చిత్తశుద్ధితో తన శుద్ధిని కోరుకునే ప్రతి స్త్రీకి సంతృప్తిగల జ్ఞానము మరిఅవగాహన కోసం రచించబడినవి.

దీనిని ప్రముఖ ధార్మిక తెలుగు అనువాదకులు హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమరి (హఫిజహుల్లాహ్) తెలుగు భాషలో తెలుగువారికై అనువదించారు. ఆయన ద్విభాష (అరబిక్, తెలుగు)ల్లో ప్రావిణ్యంగల వ్యక్తి. ఈ అనువాదం ‘అరబి’ రచనకు సమీకరిస్తూ, తెలుగు వారి సరళంలో సులువైన రీతిలో వ్యాకరణ చేస్తుంది. ప్రముఖ ధార్మిక తెలుగు మాస పత్రిక “వెలుగు కిరణాలు“లో దశలవారిగా దీనిని ప్రచురించటం కూడ జరిగింది. అయితే ఇప్పుడు “డిస్కవర్ ఇస్లాం సెంటర్- బహ్రెయిన్” లో గల తెలుగు విభాగం దీనిని ఒక పుస్తక రూపంలో “మర్కజ్ దారుల్ బిర్-పెడన, ఇండియా” ఆధ్వర్యంలో ప్రచురిస్తుంది. ఈ పుస్తకం ప్రతి ఒక్కరికి పరిపూర్ణంగా ఉపయోగపడాలని అల్లాహ్ ప్రార్ధన(దుఆ) చేయుచున్నాను. ఆమీన్.! ఈ పుస్తకాన్ని కూర్పు చేసిన, మరి అనువదించిన మరి ప్రచురించటంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ఇహపరలోకాల్లో మంచి సత్ఫలితాన్ని ప్రసాదించుగాక.. ఆమీన్!

డా॥ సయీద్ అహ్మద్ ఉమరి మదని.
విద్యా బోధన విభాగ కర్త, అరబి కాలేజి,
మర్కజ్ దారుల్ బిర్-పెడన, ఇండియా

మైలురాయి…!

మానవ సమాజములో కీడుగా భావించే కొన్ని విషయాలలో స్త్రీ కూడా ఒకటి. అందులోనూ ప్రత్యేకించి ఆమె జీవితంలోని ఋతుకాలాన్ని. పూర్వపరాలను ఆశ్రయిస్తే ప్రతి కాలంలోనూ అవలంభించిన విధానం ఇదే. ఋతుకాలాన్ని మైలుగాను, కీడు గాను, చెడుగాను భావించి ప్రతి మంచి, ప్రతి శుభ కార్యాలకు ఆమెని కీడుగానే చూసేవారు

వాస్తవాలు వెలికి తీసినప్పుడు వ్యక్తమౌతున్న విషయం ఏమిటంటే సృష్టికర్త అయిన అల్లాహ్ స్త్రీ (తత్వాన్ని) జాతిని ఈ సహజ గుణము (ఋతుకాలం) తోనే సృష్టించాడు. దీనికి సంబంధించి అనేక ఉపయోగాలు కూడ సూచించాడు.

ఉదా : బాల్యంనుండి యవ్వనంలో అడుగు పెట్టిందని చెప్పటానికి ఇదే గుర్తు, నెలతప్పి గర్భవతిగా మారిందని కూడ ఇదే తొలి గుర్తు, వివాహ సంబంధాలు విడాకుల రూపంలో పురివిప్పినప్పుడు సమస్యనుపరిష్కరించటానికి కేంద్రబిందువుగా ఉపయోగపడేది కూడ ఇదే గుర్తు, కాలధర్మం చెందిన భర్త నుండి విముక్తి పొందటానికి నిర్దేశించబడేది కూడ ఇదే గుర్తు, గర్భంలో పసికందుడు నిరాకారంలో ఉన్నప్పుడు పోషక లవణాలను సేవించటానికి కూడ ఇదే గుర్తు, స్త్రీ స్థితిని శుభ్రం అపరిశుభ్రం అని నిర్ధారించటానికి కూడ ఇదే గుర్తు. మరో అడుగు ముందుకేసినట్లైతే ఆరోగ్యానికి అనారోగ్యానికి కూడ ఇదే గుర్తు. అంతేకాక (అల్లాహ్) సందర్భాను సారం నడుచుకునే విధానాలను కూడా దీని ఆధారంగానే ఉపదేశించాడు.

అయితె చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ ఋతుకాలం మానవ జీవనానికి ఎటువంటి కీడు కాదు, మరి అపశకనము కాదు.

కొందరైతే ఈ సందర్భములో స్త్రీని ఏ కోణం నుంచైన మంచిగా భావించే వారు కాదు, మరి కొందరైతే సేవలతో సరిపెట్టుకొని శుభకార్యాలు పై నీడ పడకుండ చూసేవారు. ‘ఆలోచనలు ఎన్నైతె అపోహాలు అన్ని’ అన్నట్టుగా కాలం సాగిపోసాగింది.

మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వీటన్నిటిని తొలగించి నవశైలిక నందించారు. తమ నడవడికలతో స్త్రీ యొక్క విలువలను కాపాడి ఉన్నత స్థానంలో అమర్చారు. కనుక ప్రతి ఒక్కరు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఆదర్శముగా తీసుకొని తమ ఆధీనములో ఉన్న స్త్రీ జాతిని కీడుగా భావించ కుండ సత్ప్రవర్తనలతో జీవనాన్ని సాగించగలరని కోరుకుంటున్నాము.

అయితె నాడు అల్లుకున్న అపోహాల సాంప్రదాయాల్లో నేడు ముస్లిం సమాజం అజ్ఞాన కారణంగాను, సాంప్రదాయ కారణంగాను ప్రభావితం అయింది. ఇస్లాం ధర్మం ఋతుకాలాన్ని ఎంతో ప్రత్యేకతనిస్తుంది. దేనికంటే దైవారాధనులు చేయటానికి దీనిపై పూర్తిగా పట్టుత్వం కల్గివుండాలి. ఋతుకాలం ఏక్షణంలో తొలగిపోతుందో అదే క్షణంలో ఆరాధన విధులు కూడ విధించబడుతాయి ఉదా: ఋతుకాలంలో వున్నప్పుడు ఉపవాసం వుండటం, నమాజు చదవటం, కాబా గృహానికి తవ్వాఫ్ చేయటం, సంభోగానికి సమీపించటం వంటివి చేయకూడదు, అదే ఏ క్షణంలో ఈ కాలం తొలగిపోతుందో వెంటనే స్నానం చేసి క్రమం ప్రకారంగా అన్నీ చేయవలసి వుంటుంది.

ఇక్కడ ఒక్క ముఖ్యవిషయం ఏమంటే ఇంత సున్నితమైన విషయాన్ని ఇండ్లలో కేవలం ఒక మాట “ఆరోగ్యం సరిగా లేదు” అని చెప్పి అన్నింటి నుండి తప్పించుకుంటారు అంతేకాక రేయింబవళ్లలో ఏ క్షణంలో ఇది తొలిగిపోయినా దానిని సరిగ్గా లెక్కించుకోరు, ఇది మహా పాపం. అల్లాహ్ తన పవిత్ర గ్రంధము ఖుర్ఆన్లో దీని నిమిత్తం క్లుప్తంగా ఆదేశాలిచ్చినప్పటికీ, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీ పరిపూర్ణంగా తెలిపినప్పటికీ కూడ మనము దాని పట్ల జ్ఞానవగాహన పొందకుండా ఇరుగు పొరుగు సాంప్రదాయాలకు లోబడి మన పిల్లలకు కూడ సరైన జ్ఞానం ఇవ్వలేక పోతున్నాము. దీని గురించి ప్రళయంనాడు ప్రశ్నించబోతాము. సాంప్రదాయాలకు తావివ్వకుండ ప్రవక్త గారి ఆదేశాలను పాటించాలి. అవసరపు మెరకు ఇక్కడ కొన్ని హదీసులు ప్రస్తావించడం జరిగింది. (ఇంకా క్లుప్తంగా తెలుసుకోవాలంటే ఆయా హదీసు గ్రంధాలను సంప్రదించ వలసివుంటుంది) . 

ఇస్లామియా ధార్మిక పరిణితి చెందిన విద్యావంతులు షేక్ సాలెహ్ బిన్ ఉసైమీన్ రహిమహుల్లాహ్ తో చర్చించదగిన 60 ప్రశ్నలు సమాధానాలు ఎంతో విలువైనవి కాబట్టి దీనిని తెలుగు వారి ఉపయోగం కోసం అనువదించటంజరిగింది.

అల్లాహ్ మనందరికి వాస్తవాలను తెలుసుకొని పరలోక సాఫల్యం కొరకు తగు ప్రయత్నంచేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక….

ఆమీన్…!

ఇట్లు ..
ధార్మిక సేవకుడు : హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమరి

[పుస్తకం క్రింద చదవండి]

ప్రశ్న-1: ఒక వేళ స్త్రీ ఫజర్ పిమ్మటే (తరువాత) పరిశుద్ధురాలైతే అన్నపానియాలు మరి ఇతరాత్రా ఆహార వస్తువులు తినకుండా ఆ రోజు ఉపవాసం వుండాలా? మరి ఆమె పాటించే ఆ రోజు ఉపవాసాన్ని లెక్కించబడడం జరుగుతుందా? లేక ఆమె దానికి బదులుగా మరలా ఉపవాసం పాటించవలసి వుంటుందా? 

జవాబు : ఒక వేళ స్త్రీ ఫజర్ పిమ్మటే పరిశుద్ధురాలైతే ఆ రోజు అన్న పానియాలు మరి ఇతరాత్రా ఆహార వస్తువులు తినకుండా వుండటం గురించి ఇస్లామీయ ధార్మిక విద్వాంసుల్లో రెండు అభిప్రాయాలు వున్నాయి. 

1-ఆ రోజు ఆమె ఏమి తినకుండా ఆగిపోవాలి. కాని ఆ రోజు ఉపవాసం లెక్కింపబడదు. దానికి బదులు ఉపవాసం ఉండ వలసి ఉంటుంది. (ఇమాం అహ్మద్-రహిమహుల్లాహ్ వెల్లడించిన ప్రఖ్యాత అభిప్రాయం) 

2-ఆమెకు ఆ రోజు ఏమి తినకుండా ఉండవలసిన అవసరం లేదు. ఆమె ఆ రోజు ఉపవాసం పాటించడం సరికాదు. ఎందుకంటే ఆ రోజు ఉపవాస ప్రారంభ దశలో ఆమె ఋతుకాలం (సమయం ) లోనే వుంది. అలాంటప్పుడు ఉపవాసం పాటించడం సరికాదు. ఉపవాసమే సరికానప్పుడు అన్న పానియాలకు దూరంగా ఉండటంలో ఎలాంటి ప్రయోజనం లేదు. మరియు ఆ ఆ సమయంలో దాని పవిత్రత, గౌరవాన్ని పాటించవలసిన నిబంధన ఆమెపై లేదు. ఎందుకంటే ఆ రోజు ప్రారంభ దశలో ఆమె ఉపవాసానికి అనర్హురాలు. అంతే కాకుండా ఆ పరిస్థితుల్లో ఆమెపై ఉపవాసం నిషేధించ బడింది. షరీఅత్ ప్రకారం ఉపవాసం గురించి మాకు తెలిసిన విషయం ఏమంటే అల్లాహ్ ఆరాధన సంకల్పంతో ‘ఫజర్’ నుండి సూర్యస్తమయం (మగ్రిబ్) వరకు అన్నపానియాలు, ఇతరాత్రా తినే, త్రాగే వస్తూవుల నుండి ఆగిపోవాలి. 

దీనిలో రెండో అభిప్రాయం మొదటి కంటే ఉత్తమమైనది. ఏదేమైన ఈ రెండు అభిప్రాయాల వెలుగులో ఆ రోజు ఉపవాసానికి బదులు (ఖజా) పాటించవలసి వుంటుంది. 

ప్రశ్న-2 : నెలసరిలో ఉన్న స్త్రీ (ఫజర్ కంటే ముందు) పరిశుద్దురాలైంది. ఫజర్ తరువాత స్నానము చేసి నమాజ్ కూడా చేసింది. ఆ రోజు ఉపవాసాన్ని కూడా పూర్తి చేసింది. అయితే ఆమె ఆ రోజు పాటించిన ఉపవాసానికి బదులుగా మరలా ఉపవాసం పాటించాలనే విధి వుందా?’. ఒక సోదరి. 

‘ఫజర్’ కంటే ఒక్క నిమిషం ముందు నెలసరిలో ఉన్న స్త్రీ పరిశుద్ధురాలైనా తన పరిశుద్ధత గురించి పూర్తిగా నమ్మకం కలిగివుంటే మరింకా అది రమజాన్ మాసమే అయితే ఆమె పై ఆరోజు ఉపవాసాన్ని పాటించడం విధిగా పరిగణించబడుతుంది. కనుక అమె ఆరోజు పాటించే ఉపవాసం శ్రేయస్కరంగానే భావించబడుతుంది. దానికి బదులు (ఖజా) ఉపవాసం పాటించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆమె పరిశుభ్రతలోనే ఉపవాసం (‘సహరి’ చేసింది) పాటించింది. ఆమె ఒకవేళ ‘ఫజర్’ తరువాత స్నానం చేసినా సరే. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. 

దీనికి ఉదాహరణ ఏమిటంటే పురుషుడు కామక్రియల వల్ల లేదా వీర్యస్ఖలనానికి గురై (‘సహ్రి’ చేసుకుని) ఫజర్ తరువాత స్నానము చేసినా అతని ఉపవాసం శ్రేయస్కరంగానే పరిగణించ బడుతుంది. 

దీనికి సంబంధించిన మరొక విషయయాన్ని ప్రస్తావించ దలచుచున్నాను : అదేమిటంటే, ‘ఆమె ఉపవాసం పూర్తి చేసుకుని ఇఫ్తార్ చేసిన తరువాత, ఇషా కంటే ముందు ఋతుస్రావానికి గురైతే ఆమె ఆ రోజు ఉపవాసం వృధా అయిపోతుందని’ కొందరు స్త్రీలు భావిస్తున్నారు. ఇది ఎంత మాత్రం సరి కాదు. అంతే కాకుండా ఒక వేళ సూర్యాస్తమయం తరువాత ఒక క్షణం తరువాత ఋతస్రావం ప్రారంభమైనా కూడ ఆమె ఉపవాసం పరిపూర్ణమవుతుంది. 

ప్ర-3: పచ్చబాలింతరాలు ఒకవేళ నలభై రోజులకు ముందే పరిశుద్ధురాలైతే ఆమెపై ఉపవాసం పాటించడం, నమాజ్ చదవటం విధిగా వుంటుందా? 

జ : ఔను.! పచ్చబాలింతరాలు నలభై రోజులకు ముందే పరిశుద్ధురాలైతే అది కూడా రమజాన్ మాసంలో వుంటే ఆమెపై ఉపవాసం, నమాజ్ పాటించడం విధిగా పరిగణించబడతాయి. ఆమె భర్త ఆమెతో లైంగికంగా పాల్గొనుట కూడా సరైనదే. ఎందుకంటే ఆమె ఇప్పుడు పరిశుద్ధ స్థితిలోనే వుంది. కనుక ఉపవాసం, నమాజ్ ఆమెపై విధిగా పరిగణించబడతాయి. ఆమె తన భర్తతో లైంగికంగా పాల్గొనటానికి ఎలాంటి ఆటంకం లేదు. 

ప్ర -4 : సాధారణంగా స్త్రీ ఋతుస్రావానికి ఏడు లేక ఎనిమిది రోజులుంటాయి. ఒకోక్క సారి సాధారణ రోజుల కంటే ఒకటి రెండు రోజులు ఎక్కువగా వుంటుంది. వాటి గురించి ధార్మిక ఆదేశం ఎలా వుంది? 

సాధారణంగా స్త్రీకి ఋతుస్రావం ఏడు లేక ఎనిమిది రోజులు ఉంటుంది. కాని అప్పుడప్పుడు ఈ కాలం పైబడి (పొడిగి) ఎనిమిది తొమ్మిది లేక పది పదకొండు రోజుల వరకు వుంటే అప్పుడామె ఆస్థితి నుండి పరిశుద్దురాలు కానంత వరకు నమాజ్ చేయరాదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఋతుస్రావానికి ప్రత్యేకించి ఒక పరిమిత  కాలాన్ని నిర్ణయించలేదు. పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

وَيَسْأَلُونَكَ عَنِ الْمَحِيضِ قُلْ هُوَ أَذًى 
వారు మిమ్మల్ని ఋతుస్రావం గురించి ప్రశ్నిస్తున్నారు. (ప్రవక్తా!) మీరు చెప్పండి.! అది అశుద్ధి” (అపరిశుభ్రత). – అల్- బఖర (2: 222) 

కనుక ఎప్పటి వరకు ఋతుస్రావపు రక్తం వుంటుందో ఆ స్త్రీ అదే స్థితిలో వుంటుంది. కాబట్టి ఆమె ప్రరిశుద్ధురాలై స్నానం చేసిన తరువాత నమాజు పాటించవలెను. తరువాత నెలలో ఒక వేళ గత నెల కంటే పరిమిత కాలంతగ్గితే పరిశుద్ధురాలైన వెంటనే స్నానం చేయాలి. ఒక వేళ ఈ నెలలో నెలసరి కాలం గత కాలం కంటే తగ్గివున్నా సరె. సంక్షిప్తం ఏమంటే స్త్రీ నెలసరిలో వున్నంత వరకు నమాజు చదవకూడదు. ఎప్పుడైతే నెలసరి నుండి పరిశుద్ధురాలవుతుందో అప్పుడు నమాజు చదవాలి. 

ప్రశ్న-5 బాలింతురాలు నలభై రోజుల వరకు నమాజ్, ఉపవాసం పాటించకుండా వుండాలా? లేదా దీని గురించి బాలింతురాలి రక్తస్రావం ఆగిపోవటాన్ని పరిగణించటం జరుగుతుందా? అంటే రక్తస్రావం ఆగిన వెంటనే స్నానము చేసి నమాజు మొదలు పెట్టాలా? బాలింతురాలు పరిశుద్దురాలవటానికి (బాలింతురాలి) రక్తస్రావపు కనీస పరిమిత కాలం ఎంత? 

బాలింతరాలి రక్తస్రావానికి నిర్ణీత కాలం అంటు లేదు. రక్తస్రావం జరుగుతున్నంత వరకు ఆమె నమాజ్, ఉపవాసం పాటించకూడదు. ఆమె భర్తకు కూడ లైంగికంగా దగ్గర కాకూడదు. మరియు ఆమె పరిశుద్ధతను గ్రహించినప్పుడు నమాజ్ని, ఉపవాసాన్ని పాటించాలి. మరియు ఆమె తన భర్తకు కూడ లైంగికంగా దగ్గరకావచ్చు. ఒకవేళ నలభై రోజులు పూర్తి కాకున్న సరె. అంతే కాకుండా ఒక వేళ ఆమె బాలింతురాలిగా రక్తస్రావంలో పది లేక ఐదు రోజులు గడిపివున్నా సరే. 

ఏదేమైన ‘బాలింతురాలి రక్తస్రావం’ ఎలాంటి విషయమంటే దానికి సంబంధించిన ఆదేశాలు రక్తస్రావం అవుతుందా లేదా అనే దానిపై ఆధార పడివుంటుంది. కనుక రక్తస్రావం అవుతున్నట్లైతే ఆదేశాలు అమలవుతాయి (విధిగా వుంటాయి). ఎప్పుడైతే ఆమె పరిశుద్ధురాలు అవుతుందో రక్తస్రావానికి సంబంధించిన ఆదేశాలు కూడా తొలగిపోతాయి. కాకపోతే ‘బాలింతురాలి రక్తస్రావం 60 రోజుల తరువాత కూడ అవుతున్న పక్షంలో ఆమెని రక్తస్రావం (నెలసరి) గల స్త్రీ అని పరిగణించటం జరుగుతుంది. కాబట్టి అప్పుడామె కేవలం సాధారణ నెలసరి కాలం ఎంతో అంత వరకు నిరీక్షించిన తరువాత ఆమె స్నానం చేసి నమాజు చేయటం జరుగుతుంది. 

ప్రశ్న-6 స్త్రీకి రమజాన్ మాసంలో పగటి సమయములో కొద్దిపాటి మామూలు రక్తపు చుక్కలు వచ్చాయి. మరి ఈ రక్తపు చుక్కలు మాసమంతా వస్తూనే వున్నాయి. అయినా ఆమె ఉపవాసం కొనసాగిస్తునే ఉంది. అయితే ఆమె ఉపవాసం కొనసాగించడం సరైనదేనా? 

ఔను! ఆమె ఉపవాసం సరైనదె! మరి ఆ రక్తపు చుక్కలు పరిగణించబడవు. ఎందుకంటే అవి నరాల నుండి వస్తాయి. హజ్రత్ అలీ రజియల్లాహు అన్హుతో ఇలా ఉల్లేఖనం ఉంది: ‘అంటే ఈ రక్తపు చుక్కలు (ముక్కు నుండి రక్తం కారి నట్టు చిమ్ముతూ వుంటాయి, కాని అది) నెలసరి కాదు. 

ప్రశ్న-7: నెలసరిగల స్త్రీ, బాలింతురాలు ఒకవేళ ఫజర్ కంటె ముందు పరిశుద్ధురాలైంది. కాని ఫజర్ తరువాత స్నానం చేసింది. అయితే మరి ఆమె ఉపవాసం సరైనదేనా? 

జ: ఆమె ఉపవాసం సమ్మతమైనదే (సరైనదే). నెలసరి స్త్రీ, బాలింతురాలు ఒకవేళ ఫజర్ కంటే ముందు పరిశుద్ధురాలై ఫజర్ తరువాత స్నానం చేస్తుంది. అయితే ఆమె ఉపవాసం సమ్మతమైనదే. ఎందుకంటే ఆమె పరిశుద్ధురాలైన సమయములో ఉపవాసం వుండటానికి అర్హురాలు అయివున్నది. ఆమె ఆ వ్యక్తిలా ఫజర్ సమయంలో వీర్యస్ఖలనానికి గురై ఉపవాసం ఉన్నాడు. కాని పజర్ తరువాత పరిశుద్ధుడయ్యాడు. కాబట్టి  ఆమె ఉపవాసం సరైనదె. ఎందుకంటే పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

الْآنَ بَاشِرُوهُنَّ وَابْتَغُوا مَا كَتَبَ اللَّهُ لَكُمْ ۚ وَكُلُوا وَاشْرَبُوا حَتَّىٰ يَتَبَيَّنَ لَكُمُ الْخَيْطُ الْأَبْيَضُ مِنَ الْخَيْطِ الْأَسْوَدِ مِنَ الْفَجْرِ

“అయితే ఇప్పుడు మీరు మీ (దాంపత్య సుఖాన్ని) అనుభవించండి, మరియు అన్వేషించండి అల్లాహ్ మీకోసం విధిగా వ్రాసియున్న వాటిని. మరి తినండి, త్రాగండి, ఎప్పటి వరకంటే వేకువ జామున పొద్దుటి తెలుపు దారం (రేఖ) నల్లటి దారం (రేఖ)తో (విడిగా) బహిర్గతం అయ్యేవరకు”. (అల్- బఖరహ్ 2:187) 

అయితే వేకువజాము వరకు దాంపత్య సుఖానికి అనుమతించినప్పుడు దానికి తగిన ఉద్దేశం ఏమిటంటే స్నానం ఫజర్ తరువాతే అవుతుంది. 

మరియు హజ్రత్ ఆయిషా రజి అల్లాహు అన్హా హదీసులో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన పవిత్ర భార్యలతో సంభోగించి అపరిశుద్ధ స్థితిలోనే తెల్లవారు జామున లేచినప్పుడు ఉపవాసంతో ఉండేవారు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ తరువాత పరిశుద్ధతకై స్నానం చేసేవారు. 

ప్రశ్న-8: స్త్రీ రక్తాన్ని లేక నెలసరి బాధను గ్రహించింది. కాని సూర్యస్తమయం కంటె ముందు రక్తం రాలేదు. అలాంటప్పుడు ఉపవాసాన్ని పూర్తి చేయవచ్చా? లేదా దానికి బదులుగా (ఖజా) వుండవలసి వుంటుందా? 

ఒకవేళ పరిశుద్ధ స్త్రీ ఉపవాస స్థితిలో నెలసరి రావటాన్ని గమనించింది లేదా దాని బాధని గమనించింది. కాని సూర్యస్తమయం తరువాత నెలసరి వచ్చింది. అలాంటప్పుడు ఆమె పాటించిన ఆ రోజు ఉపవాసం సరైనదే. దానిని మరలా పూర్తి చేయవలసిన అవసరం లేదు. కనుక ఆమె పాటించిన ఆ ఉపవాసం ఫర్జ్ ఉపవాసం అయితే తిరిగి పాటించదు. ఒక వేళ అది నఫిల్ ఉపవాసం అయితే దాని పుణ్యఫలానికి భంగం వాటిల్లదు. ఇన్షా అల్లాహ్. 

ప్రశ్న-9 : ఒక స్త్రీ రక్తాన్ని గ్రహించింది. కాని అది నెలసరా? కాదా? అన్నది పూర్తిగా నిర్ధారించలేక పోయింది. అలాంటప్పుడు ఆరోజు పాటిస్తున్న ఉపవాసం గురించి ఆదేశం ఏమిటి? 

పై పేర్కొనబడిన స్త్రీ పాటిస్తున్న ఆ రోజు ఉపవాసం సరైనది. ఎందుకంటే నెలసరి వుండక పోవటమే అసలు విషయం. ఇది ఎప్పటి వరకంటే ఆమెకు నెలసరి వచ్చిందని పూర్తిగా నమ్మకం కలిగేంత వరకు. 

 ప్ర-10 : కొన్ని సందర్భాల్లో స్త్రీ పగటి సమయంలో రక్తపు అసాధారణమైన  ప్రభావాన్ని లేదా రక్తపు అసాధారణమైన బిందువుల్ని గ్రహిస్తుంది. మరికొన్నిసార్లు ఇలాగే నెలసరి కాలంలో చూస్తుంది. కాని అప్పుడు ఋతుస్రావం ప్రారంభమై ఉండదు. మరి కొన్నిసార్లు నెలసరి కాలం తరువాత రోజుల్లో గ్రహిస్తుంది. అయితే సందేహమేమిటంటే పై పేర్కొన్న రెండు సందర్భాల్లో ఆమె ఉపవాసం గురించి ఆదేశం ఏమిటి? 

దాదాపు ఇలాంటిదే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది. అయితే ఆ ప్రశ్నలో ఒక అంశం ప్రస్తావించబడలేదు. అదేమిటంటే రక్తపు చుక్కలు ఒకవేళ నెలసరి కాలంలో గమనిస్తే, మరియు ఆమె దానిని ఋతుస్రావం అని భావిస్తే అవి ఆమెకు తెలిసిన రోజులైతే అప్పుడు అది ఋతుస్రావం పరిధిలోనే వస్తుంది. స్థితి రెండు 

ప్ర-11 : నెలసరి స్త్రీ, బాలింతురాలు పవిత్ర రమజాన్ మాసంలో పగటి సమయాల్లో (అన్న, పానియాలు) తీసుకోవచ్చా? 

అన్నపానియాలు తీసుకోవచ్చు. నెలసరి స్త్రీ, బాలింతురాలు పవిత్ర రంజాన్ మాసంలో పగటి సమయములో (అన్నపానియాలు) తినవచ్చు. కాకపోతె ఇంట్లో పిల్లలుంటే వారికి కనబడకుండా తినటం ఉత్తమం. ఎందు కంటే దాని వల్ల పిల్లలకు ఎలాంటి సందేహాలు రావు.

ప్ర-12 నెలసరి స్త్రీ, లేదా బాలింతరాలు ఒకవేళ అసర్ సమయంలో పరిశుద్ధురాలు అయితే వారికి ‘అసర్’ నమాజుతో పాటు జొహర్’ నమాజు కూడ పాటించాలా? లేదా అసర్ నమాజ్ మాత్రం పాటించాలా? 

జ : ఈ విషయములో ప్రఖ్యాత అభిప్రాయం ఏమిటంటే పై పేర్కొనబడిన స్త్రీ అసర్ నమాజు మాత్రమే పాటించాలి. ఎందుకంటే అలాంటి స్థితిలో జొహర్ నమాజు తప్పనిసరిగా చదవాలి అని చెప్పడానికి ఎటువంటి ఆధారం లేదు. ఫిఖాహ్ సూత్రాల ప్రకారం ఆధారం లేకపోవడమే అసలు (ఆధారం) విషయం. 

రెండో విషయం ఏమిటంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు : 

“ఎవరైతే సూర్యస్తమయానికి ముందు ‘అసర్’ నమాజ్ లోని ఒక్క రకాత్ పొందినా అతను అసర్ నమాజు పొందినట్లే”.. 

పై హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తి ‘జొహర్’ నమాజ్ కూడా పొందినట్లే అని చెప్పలేదు. ఒకవేళ జొహర్ నమాజు కూడ స్థితిలో విధియై వుంటే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) తప్పకుండా ప్రస్తావించి ఉండేవారు. 

పై పేర్కొనబడిన స్థితిలో స్త్రీ పై ‘జొహర్’ నమాజు విధిగా కాకపోవటానికి మరో కారణం కూడా వుంది. 

అదేమిటంటే ఒకవేళ స్త్రీ ‘జొహర్’ సమయం మించిపోయిన తరువాత నెలసరికి గురైతే దానికి జోహర్ నమాజు మాత్రమే తరువాత (ఖజా) చేయవలసి వుంటంది, అసర్ నమాజు కాదు. 

కొన్ని సందర్భాల్లో ‘జొహర్’, ‘అసర్’ రెండింటిని కలిపి పాటిస్తారు. మరి అలాంటి సమయంలోనూ, ప్రశ్నలో పేర్కొనబడిన సందర్భములో అంతగా వ్యత్యాసం కనబడదు. కనుక కొన్ని హదీసుల ‘ఖియాస్’ (అంచనా)ల దృష్ట్యా పై పేర్కొనబడిన స్త్రీ పై అసర్ నమాజు పాటించడం తప్పని సరి. 

మరి ఇదే విధంగా ఒక వేళ ఆమె’ఇషా’ నమాజ్ సమయం పూర్తికాక ముందే పరిశుద్ధురాలైతే ఆమెకి ‘ఇషా’ నమాజు మాత్రమే చదవవలసి వుంటుంది ‘మగ్రిబ్ నమాజు కాదు. 

ప్ర -13 : గర్భము కోల్పోయిన స్త్రీల స్థితి రెండు విధాలుగా వుంటుంది. గర్భము కోల్పోవటం అనేది పిండము ఏర్పడక ముందు జరుగుతుంది లేదా పిండము ఏర్పడి అందులో రూపు రేఖలు దిద్దుకున్న తరువాత జరుగుతుంది. అయితే సమస్య ఏమిటంటే ఏ రోజైతే ఆమే గర్భము కోల్పోయిందో ఆ రోజుఉపవాసం గురించి ఆదేశం ఏమిటి? మరింకా అటువంటి రోజుల ఉపవాసము సంగతి ఏమిటి? దేనిలోనైతే ఆమె రక్తాన్ని గమనిస్తుందో? 

జ: గర్భములో పిండము ఏర్పడక పోయినట్లైతే ఆ రక్తం బాలింత దశకు సంబంధించిన రక్తం కాదు. కనుక ఆ స్త్రీ నమాజు, ఉపవాసం పాటించాలి. ఆమె ఉపవాసం సరైనదే. ఒకవేళ గర్భములో పిండము ఏర్పడనట్లైతే ఆ రక్తం బాలింతదశానికి సంబంధించిన రక్తమే. కనుక ఆ స్థితిలో నమాజు చదవకూడదు, ఉపవాసం వుండ కూడదు. ఈ విషయంలో విధానం ఏమిటంటే గర్భాశయంలో పిండం ఏర్పడిన తదనంతరం తొలగించటం జరిగితే దాని తరువాత వచ్చే రక్తం బాలింతదశానికి సంబంధించిన రక్తమే. కనుక ఆ సందర్భములో ఆమెకి ఆ అన్ని విషయాలు నిషిద్దంగానే వర్తిస్తాయి ఏవైతే బాలింతురాలికి నిషిద్ధంగా వుంటాయో. ఒకవేళ గర్భాశయంలో పిండం ఏర్పడని సందర్భములో ఆ రక్తం బాలింత దశానికి సంబంధించిన రక్తం కాదు. కాబట్టి ఏవైతే బాలింతురాలికి నిషిద్ధంగా వుంటాయో అవి ఆమె పై నిషిద్ధం కావు. 

ప్ర-14 : గర్భవతికి పవిత్ర రమజాన్ మాసంలో పగటి పూట రక్తం వస్తే దాని ద్వారా ఆమె పాటిస్తున్న ఉపవాసానికి ఏమైన భంగం వాటిల్లుతుందా? 

సాధారణ స్త్రీ ఒక వేళ ఉపవాసం పాటిస్తున్నప్పుడు ఆమెకు ఋతుస్రావపు రక్తం ప్రారంభమైతే ఆమె ఉపవాసానికి భంగం వాటిల్లుతుంది. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిస్తున్నారు : “స్త్రీ నెలసరిలో ఉన్నప్పుడు నమాజు, ఉపవాసం పాటించటం లేదు కదా“. 

అందుకే నెలసరిని ఉపవాసాన్ని భంగము కల్గించే అంశాల్లో ఒకటిగా భావించబడుతుంది. మరి బాలింతురాలి దశలో వచ్చే రక్తం కూడా ఈ ఆదేశానికి సంబంధించినదే. కనుక నెలసరి లేక బాలింతురాలి దశలో వచ్చే రక్తం వల్ల ఉపవాసానికి భంగం వాటిల్లుతుంది. 

ఇక గర్భవతికి పవిత్ర రమజాన్ మాసంలో పగటి పూట రక్తం వచ్చే విషయంలోనైతే అది (రక్తం) ఒక వేళ నెలసరికి సంబంధించిందైతే దాని ఆదేశం సాధారణ స్త్రీ (బాలింతురాలు కాదు) నెలసరిగా పరిగణించ బడుతుంది. అంటే దాని ద్వారా ఉపవాసానికి భంగము ఏర్పడుతుంది. ఒక వేళ నెలసరికి సంబంధించింది కాకపోతే దాని వల్ల ఉపవాసానికి ఎలాంటి ఆటంకం ఏర్పడదు. గర్భవతికి ఏ రక్తస్రావం అవుతుందంటే – ఆమె నెలతప్పి గర్భవతి అయిన కూడ నెలసరి ఆగక క్రమం ప్రకారం నెలసరవుతున్నప్పుడు ప్రఖ్యాత అభిప్రాయం ప్రకారం – అది నెలసరిగానే పరిగణించి దానిపై నెలసరికి సంబంధించిన ఆదేశాలే పాటించబడతాయి. కాగా ఒకవేళ ఆమె రక్తస్రావం ఆగిపోయివుండి మళ్ళీ దాని తరువాత ఆమె రక్తం గమనిస్తే, అది నెలసరికి సంబంధం కానటువంటిదైతే అప్పుడు దాని ద్వారా ఉపవాసం ప్రభావితం కాదు ఎందుకంటే ఆ రక్తం నెలసరిది కాదు. 

ప్ర-1 5 : స్త్రీ ఒకవేళ నెలసరి కాలంలో ఒక రోజు రక్తాన్ని గమనించింది. మరుసటి రోజు పూర్తిగా రక్తం చూడకపోతే అప్పుడు ఆమె ఏమి చేయాలి? 

జ: ఈ సమస్యలో ఉన్న విషయం ఏమిటంటే ఆ స్త్రీ తన నెలసరి కాలంలో చూసిన పరిశుద్ధత గాని (రక్తం) ఆగిపోవటం గాని అది నెలసరి పరిగణంలోకే వస్తుంది. కనుక దానిని పరిశుద్ధతలో పరిగణించటం జరగదు. అందుకే ఆమె ఆ విషయాలకు దూరంగానే వుండాలి, ఏ విషయాలతో నెలసరిగల స్త్రీ దూరంగా ఉంటుందో. కాని కొందరు ధార్మిక విద్వాంసులు తమ అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు : 

‘ఎవరైనా స్త్రీ ఒక రోజు రక్తం చూసి మరో రోజు రక్తం చూడక పోతే అప్పుడు ఆ రక్తం నెలసరిగానే పరిగణింపబడుతుంది. మరి ఏ రోజైతె రక్తం రాలేదో ఆరోజు పరిశుద్దురాలుగా వుంటుంది. ఇలా 15 రోజులు గడిచే వరకు. 15 రోజుల తరువాత అది ఋతుస్రావం క్రింద పరిగణించ బడుతుంది’. ఇదే ఇమాం అహ్మద్ బిన్ హంబల్ (రహిమహు- ల్లాహ్) ప్రఖ్యాత అభిప్రాయం. 

గమనిక: ఒకరోజు రక్తం చూసి మరుసటి రోజు రక్తం చూడనటువంటి స్త్రీ ఋతుకాలాన్ని 15 రోజులుగా నిర్ణయించటం జరుగుతుంది. తరువాత ఏ రోజు రక్తం వస్తుందో ఆ రోజు అపరిశుద్దురాలుగాను మరి ఏ రోజు రక్తం రాదో ఆ రోజు పరిశుద్ధురాలుగాను పరిగణించడం జరుగుతుంది. ఇలా 15 రోజుల వరకు వుంటుంది. ఆ తరువాత కూడ నెలసరి అవుతున్నట్లైతే అది రక్తస్రావంగానే పరిగణించ బడుతుంది. 

రక్తస్రావం : అంటే నెలసరి కాలాన్ని మించి వచ్చే దానిని, మరి బాలింత దశను మించి వచ్చే దానిని రక్తసావ్రం అంటారు. 

ప్ర-16 :నెలసరి చివరి రోజుల్లో పరిశుద్ధతకు ముందు స్త్రీకి రక్తపు మరకలు కానరానప్పుడు ఆమె ఆరోజు ఉపవాసం పాటించవచ్చా? ఎందుకంటే ఇంకా ఆమె తెలుపు నీళ్ళు చూడనే లేదు. అప్పుడు ఆమె ఏమిచేయాలి? 

జ : పై పేర్కొనబడిన స్త్రీకి సాధారణంగా నెలసరి తరువాత తెల్లటి నీళ్ళు కానవచ్చేది కాదు. కొందరు స్త్రీల్లో ఇటువంటి లక్షణం వుండదు. కాబట్టి అలాంటప్పుడు ఆమె ఉపవాసం వుంటుంది. ఒక వేళ ఆమెకు నెలసరి తరువాత తెలుపు నీళ్ళు చూసే అలవాటు వుంటే అప్పడు తెలుపు నీళ్ళు చూసేంత వరకు ఆమె ఉపవాసం వుండరాదు. 

ప్ర- 17 : ఋతుస్రావంలో ఉన్న స్త్రీ, బాలింత దశలో రక్తస్రావం గల స్త్రీ అవసర నిమిత్తం ఉదాహరణకు: విద్యార్థిని లేక ఉపాధ్యాయురాలైనప్పుడు చూసి లేదా చూడకుండా పవిత్ర ఖుర్ఆన్ పారాయణం చేయవచ్చా? 

ఋతుస్రావంలో ఉన్న స్త్రీ, బాలింత దశలో రక్తస్రావం గల అవసర నిమిత్తం ఉదాహరణకు : విధ్యార్ధిని లేక ఉపాధ్యాయురాలైనప్పుడు రాత్రి లేదా పగలు ఏ సమయంలోనైన ఖుర్ఆన్ పారాయణం చేయటం లేదా పదేపదే చదవటంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ పుణ్య సంకల్పముతో ఈ స్థితిలో ఖుర్ఆన్ పారాయణం చేయకపోవటమే మంచిది. ఋతుస్రావం గల స్త్రీ ఖుర్ఆన్ పారాయణం చేయకూడదనేది అనేక ఇస్లామియా ధార్మిక విద్యాసంసులు అభిప్రాయం. 

గమనిక: అంటే ఎవరికైనా ఖుర్ఆన్ చదివించటం లేదా ఎవరైనా పారాయణం చేసినప్పుడు వినటం అవసరాన్ని బట్టి చేయవచ్చు. కానీ పుణ్య సంకల్పంతో స్వయంగా పారాయణం చేయరాదు. 

ప్ర -18 : ఋతుస్రావం గల స్త్రీ పరిశుద్దురాలైన తరువాత వస్త్రాలు (దుస్తులు) తప్పకుండా మార్చాలా? (ఉన్నదుస్తుల్లో) రక్తంగాని అపరిశుభ్రత గా గాని లేనప్పుడు కూడా దుస్తులు మార్చవలసి వుంటుందా? 

జ: లేదు. అవసరం లేదు. ఎందుకంటే ఋతుస్రావంతో దేహం పరిశుభ్రత కాదు కేవలం ఆ ప్రదేశం మాత్రమే అపరిశుభ్రమవుతుంది దేనినైతే రక్తం తాకుతుందో. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలకు ఇలా ఆదేశించారు : 

దుస్తుల్లో ఋతుస్రావపు రక్తం అంటుకున్నప్పుడు వారు దానిని పరిశుభ్రం చేసుకుని అందులోనే నమాజు చేసుకోవచ్చు”. 

ప్ర -19 : ఒకరు ఇలా ప్రశ్నిస్తున్నారు : ‘ఒక స్త్రీ రక్తస్రావం కారణంగా పవిత్ర రమజాన్ మాసంలో ఏడు రోజుల ఉపవాసాలు పాటించలేదు. రెండవ రమజాన్ వచ్చెవరకు ఆమె ఆ ఉపవాసాల ఖజా (బదులు) కూడ వుండలేదు. అలాగే మళ్ళీ రెండవ రమజాన్లో కూడ ఏడు రోజుల ఉపవాసాలు పాటించలేక పోయింది. ఎందుకంటే ఆమె తన బిడ్డకు పాలు పట్టేది. అనారోగ్యం కారణంగా ఆ ఉపవాసాల ఖజా(బదులు) కూడ వుండలేదు. అయితే ఇప్పుడు మూడవ రమజాన్ సమీపించింది. ఆస్త్రీ ఏమి చేయాలి? జవాబు చెప్పగలరు. అల్లాహు తఆలా మీకు పుణ్యఫలాలు ఇవ్వుగాక! 

జ: పై పేర్కొనబడిన స్త్రీ నిజంగానే అనారోగ్యవంతురాలైతే, ఆమె ఆ ఉపవాసాల ఖజా (బదులు) వుండగలదు. ఎందుకంటే ఆమె సమ్మతమైన కారణం కలిగివుంది. కనుక ఆమె తనలో స్థోమత పొందినప్పుడు ఉపవాసాల ఖజా చేయవలెను. ఒక వేళ రెండవ రమజాన్ దాపరించినా సరే. కాని అకారణం  లేక కుంటి సాకులతో బద్దకము చేస్తే అది మంచిది కాదు. 

ఒక రమజాన్ మాసంలో వదిలేసిన ఉపవాసాలకు ‘ఖజా’ రెండవ రమజాన్ వరకు ఆలస్యము చేయరాదు. (అలా చేయటం ఏమాత్రం మంచిది కాదు). హ॥ ఆయషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు:  “నా ఉపవాసాలు మిగిలిపోయేవి. అయితే నేను ‘షాబాన్’ మాసంలోనే వాటి ‘ఖజా’ను పూర్తిచేసేదాన్ని”. 

అయితే ఆ స్త్రీ తన గురించి ఆలోచించుకోవలసిందేమిటంటే ఒక వేళ తన వద్ద సరైన కారణం లేనప్పుడు ఆమె పాపాత్మురాల వుతుంది. అల్లాహ్ మన్నింపుకై వేడుకుని తనపై మిగిలి వున్న ఉపవాసాల ‘ఖజా’ పాటించడంలో త్వరపడాలి. ఒకవేళ నిజంగానే ఆమెకు సమ్మత కారణం వుంటే అప్పుడు ఆమె ‘ఖజా’ చేయటంలో సంవత్సరము గాని రెండు సంవత్సరాలుగాని ఆలస్యమైన పర్వాలేదు. 

20: కొందరు స్త్రీల పరిస్థితి ఎలా వుంటుందంటే రెండవ రమజాన్ మాసం వచ్చేస్తుంది కాని వారు ఇంత వరకూ గత రమజాన్ – మాసంలో వదిలివేసిన ఉపవాసాల ‘ఖజా’ (బదులు) పూర్తి చేసి వుండరు. ఇలాంటి స్త్రీలపై ఏమి విధిగా వుంటుంది? 

ఇలాంటి స్త్రీల పై విధి ఏమిటంటే వారు ఇలాంటి పొరపాట్లకు అల్లాహ్ మనస్ఫూర్తిగా క్షమాపణ కోరాలి. (రెండవ రమజాన్ అయిన వెంటనే ఉపవాసాల ‘ఖజా పూర్తి చేయాలి). ఎందుకంటే ఏ కారణం లేకుండా ఒక రమజాన్ వదిలేసిన ఉపవాసాలకు ‘ఖజా’ రెండవ రమజాన్ వరకు ఆలస్యము చేయరాదు. విశ్వాసుల మాత హ॥ ఆయషా (రజియల్లాహు అనా) హదీసు ప్రకారం : 

“నా ఉపవాసాలు మిగిలిపోయేవి అయితే నేను ‘షాబాన్ మాసం’లో వాటి ‘ఖజా’ను పూర్తి చేసేదాన్ని”. 

(పై హదీసు ద్వారా ఒక రమజాన్ ఉపవాసాల ‘ఖజా’ రెండవ రమజాన్ తరువాత వరకు ఆలస్యం చేయటం తగదని మనకు బోధ పడుతుంది. కనుక ఇలాంటి స్త్రీలు తమ కర్మ నిమిత్తం అల్లాహ్ సన్నిధిలో మనసారా మన్నింపుకై వేడుకోవాలి. అంతే కాక రెండవ రమజాన్ తరువాత వదిలేసిన ఉపవాసాల ‘ఖజా’ కూడా పూర్తిచేయాలి. 

ప్ర- 21 : ఒక వేళ స్త్రీ మధ్యాహ్నం తరువాత అనగా ఒంటి గంట తరువాత ఋతుస్రావానికి గురైంది. ఇంకా ఆమె ఇంతవరకు ‘జొహర్’ నమాజు పాటించలేదు. అయితే ఆమె పరిశుద్ధురాలైన తరువాత 

ఆ (జొహర్) నమాజు ‘ఖజా’ చేయవలసి వుంటుందా? 

జ : ఈ సమస్యలో ఇస్లామీయా విద్వాంసుల్లో భేదాభిప్రాయాలున్నాయి. కొందరు ఇలా అంటున్నారు: 

పై పేర్కొన్న స్త్రీ పై ఆ నమాజు ‘ఖజా’ తప్పనిసరి (‘వాజిబ్) కాదు. ఎందుకంటే ఆమె ఎటువంటి ఆటంకాలు చేయలేదు. మరి పాపానికీ పాల్పడలేదు. ఎందుకంటే ఆమె ఆ నమాజును దాని చివరి సమయం వరకు ఆలస్యంగా చదవవచ్చు. 

కానీ మరి కొందరు విద్వాంసులైతే ఇలా అంటున్నారు: ఆమె పై ఆ నమాజు ‘ఖజా’ పూర్తి చేయవలసి వుంటుంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించిన ఈ హదీసు అపరిమితమైనది. 

“ఎవరైతే నమాజులోని ఒక రకాతు పొందాడో అతను(పూర్తి) నమాజు పొందాడు (పొందినట్లే)”. 

అయినా జాగ్రత్త గల విషయం ఏమిటంటే ఆమె ఆ నమాజు ‘ఖజా’ పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఒక నమాజు మాత్రమే కదా! దాని ‘ఖజా’ చదువుకోవటానికి స్త్రీకి పెద్దగా ఇబ్బంది గాని కష్టం గాని వుండదు. 

22: గర్భవతి ఒక వేళ ప్రసవించటానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు రక్తాన్ని చూసినట్లైతే దాని కారణంగా ఆమె నమాజు, ఉపవాసం వదిలివేయాలా? (విరమించుకోవాలా?) 

జ: గర్భవతి ఒక వేళ ప్రసవించటానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు రక్తాన్ని చూసింది. పురిటినొప్పులు కూడా గ్రహించింది. అయితే అది బాలింత దశానికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. కనుక దాని కారణంగా ఆమె నమాజు, ఉపవాసం వదిలివేయాలి. కాకపోతే రక్తస్రావంతో పాటు పురిటినొప్పులు రానప్పుడు అది చెడు రక్తంగా నిర్ధారించబడుతుంది. దానికి ఎటువంటి విలువ లేదు. ఇంకా ఈ రక్తం నమాజు మరియు ఉపవాసానికి ఆటంకం కాదు. 

ప్ర-23: అందరితో పాటు ఉపవాసం వుండాలనే నేపంతో నెలసరిని నిర్మూలించె (అరికట్టే) మందులు వాడటం పట్ల మీ అభిప్రాయం ఏమిటి? 

జ: నేనైతే దీనిని గట్టిగా వారిస్తున్నాను. ఎందుకంటే డాక్టర్ల ద్వారా విశ్వసనీయంగా తెలిసిన విషయమేమిటంటే ఈ మందుల వల్ల ఎన్నో దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. కనుక స్త్రీలకు హితబోధన చేసేదేమిటంటే ఇది అల్లాహ్ వారిపై నిర్ణయించిన విధిరాత (గుణం). అందుకే అల్లాహ్ నియమించిన విధిపై స్థిరముగా వుండండి. ధార్మికంగా ఎలాంటి ఆటంకాలు లేనప్పుడు ఉపవాసం వుండండి. మరియు ధర్మపరమైన అటంకాలు ఎదురైనప్పుడు అల్లాహ్ నిర్ణయించిన విధిపై అంగీకార నేపంతో ఉపవాసం వదిలివేయండి. 

ప్ర- 24 : ఒకరు ఇలా ప్రశ్నిస్తున్నారు: ఒక స్త్రీ భర్తతో సంభోగం, నెలసరితో చెయించి పరిశద్ధురాలైన రెండు మాసాల తరువాత చిన్న చిన్న రక్తపు బొట్టులను గ్రహించింది. అయితే ఈ స్థితిలో ఆమె నమాజు, ఉపవాసము పాటించాలా? లేక విడిచిపెట్టాలా? 

నెలసరి మరి సంభోగానికి సంబంధించి స్త్రీలకు అనేక కష్టాలున్నాయి. దానికి ఒక కారణం నెలసరి నిరోధక, గర్భ నిరోధక మాత్రలు వాడటం కూడా వుంది. పూర్వం ఇలాంటి సందేహాలకు తావువుండేది కాదు. ఇది వాస్తవమే! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తరువాత నుంచే కాదు స్త్రీ ఉనికి ఏర్పడినప్పటి నుంచే సందేహాలు వున్నాయి. కానీ సందేహాల తీవ్రత ఎంత పెరిగిందంటే మానవుడు వాటిని పరిష్కరించుటలో అల్లాడిపోవటం అనేది ఎంతో బాధకరమైన (విచిత్రమైన) విషయం. 

కాని ఈ కోవలో సాధారణమైన సూత్రం ఏమిటంటే స్త్రీ పరిశుద్ధు రాలైనప్పుడు నెలసరిలో ఖచ్చితంగా పరిశుద్ధతను గ్రహిస్తే (అంటే మహిళలు గుర్తించే ఆ తెలుపు నీళ్ళు ఆమెకు కానవస్తే) ఆ నీళ్ళు మట్టిరంగులా వున్నా, లేదా పసుపు రంగుకు దగ్గరగా వున్నా, లేదా చుక్కైనా, లేదా చెమ్మైనా ఇవన్నీ నెలసరిలో పరిగణించ బడవు. అందుకే ఆమెకు నమాజు, ఉపవాసానికి ఎలాంటి ఆటంకం లేదు. ఆమె తన భర్తతో లైంగిక వ్యవహారాల్లో కూడ ఆటంకం లేదు. ఎందుకంటే ఇవన్నీ నెలసరికి సంబంధించినవి కావు. దీనికి ఈ వాక్యాలే ఆధారం : 

హ॥ ఉమ్మె అతియా (రజియల్లాహు అన్హా) కథనం “మేము పసుపు రంగుకు వున్న నీళ్ళకు ఎలాంటి దగ్గర వున్న లేదా మట్టి రంగులా ప్రాధాన్యత నిచ్చేవారము కాదు”. (సహీహ్ బుఖారి) 

ఇమామ్ అబూదావూద్ (రహిమహుల్లాహ్) ప్రస్తావించిన వాక్యాల్లో “తుహుర్” (పరిశుద్ధత) అనే పదం ఎక్కువగా వుంది. (అంటే పరిశుద్ధురాలైన తరువాత మేము పసుపు రంగుకు దగ్గరలా వున్నా లేదా మట్టిరంగులా వున్న నీళ్ళకు ఎలాంటి ప్రాధాన్యత నిచ్చేవారము కాదు). ఈ హదీసు ‘సనద్’ (పరంపర) పటిష్ఠమైనది. 

దీన్నిబట్టి మనం ఇలా చెప్పవచ్చు ఏమిటంటే పరిశుద్ధత గురించి నమ్మకం ఏర్పడిన తరువాత ఇలాంటిది ఏదైన వ్యక్తమైనప్పుడు అది స్త్రీకి నష్టం కల్గించదు. ఇంకా ఆమెకి నమాజు, ఉపవాసాలు, భర్తతో లైంగిక వ్యవహారాల నుండి ఎలాంటి ఆటంకం వుండదు. కానీ ఆమెపై విధిగా వున్న విషయం ఏమిటంటే ఆమె పరిశుద్ధతను గ్రహించనంత వరకు తొందర పడకూడదు. ఎందుకంటే కొందరు స్త్రీలు రక్తం నిలిచిన వెంటనే పరిశుద్ధతను గ్రహించకుండానే తొందరపాటుతో స్నానము చేసి పరిశుద్ధులైనట్లు భావిస్తారు. 

ఈ కారణంగానే విశ్వాసుల మాత హ॥ ఆయిషా (రజియల్లాహు అన్హా) వద్దకు ‘సహాబియాత్’ (రజియల్లాహు అన్హుం) ‘కురు’ రక్తంతో తడిసిన దూదిని పంపించేవారు. అయితే ఆమె (ర.అ.హ) వారికి “తెలుపు చూడ నంతవరకు తొందర పడకండి” అని బదులిచ్చేవారు. 

ప్ర -25 : కొందరు స్త్రీలకు ఏకదాటిగా రక్తం వస్తూనే వుంటుంది. మరి కొన్ని సారైతే ఒకటి రెండు రోజుల విరామం తరువాత మళ్ళీయధావిధిగా రావటం మొదలవుతుంది. ఇలాంటప్పుడు వారికి నమాజు, ఉపవాసాలు, ఇతరత్రా ఆరాధనల గురించి ఎలాంటి సూచనలున్నాయి?

జ : ఇస్లామీయా ధార్మిక విద్వాంసుల్లో ఒక పెద్ద వర్గం అభిప్రాయం ఏమిటంటే ఒకవేళ స్త్రీకి ఏదైన ప్రత్యేకమైన నియమం (పరిమిత కాలం) వుంటే దాన్ని పూర్తి చేసి స్నానం చేయాలి. తరువాత నమాజు, ఉపవాసాలు పాటించాలి. అయితే రెండు లేక మూడు రోజుల తరువాత రక్తం చూసినా అది నెలసరి కాదు. ఎందుకంటే ఈ ఇస్లామీయా విద్వాంసుల దృష్టిలో ‘తుహుర్’ (పరిశుద్ధత) కు కనీస వ్యవధి 13 రోజులు వుంది. 

మరి కొందరి అభిప్రాయం ఏమిటంటే : “ఎప్పుడైతె ఆమె రక్తం గ్రహిస్తుందో అప్పడు అది నెలసరిగా పరిగణించబడుతుంది. గ్రహించనప్పుడు పరిశుద్దురాలుగా పరిగణించబడుతుంది. ఒకవేళ రెండు నెలసరిల కాలం మధ్యలో 13 రోజుల వ్యవధి లేకున్న సరె. 

ప్ర -26 : స్త్రీలు పవిత్ర రమజాన్ మాసపు రాత్రుల్లో ఇంటిలో నమాజు చేయుట ఉత్తమమా? లేదా మసీదులో చేయుట ఉత్తమమా? ప్రత్యేకించి మసీదుల్లో హితబోధన, ధార్మిక ప్రసంగ కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్న సందర్భములో? అంతేకాక మసీదులో నమాజు పాటించే స్త్రీలకు మీరు ఏలాంటి హితబోధనలు చేయదలుచుచున్నారు? 

జ: స్త్రీ తన ఇంట్లో నమాజ్ పాటించడమే ఉత్తమం. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించిన హదీసు విశాలమైనది: “స్త్రీలకు వారి ఇల్లు నమాజుకై ఎంతో మేలైనది” 

అంతే కాకుండా దీనికై స్త్రీలు ఇంటి నుండి బయటకు వెళ్ళుట అనేక సందర్భాల్లో క్లిష్టపరిస్థితులతో కూడుకున్న సమస్యే. అందుకే ఆమె ఇంట్లో నమాజు పాటించడం మసీదు వెళ్ళటానికంటే మేలైనది. అయితే హితబోధన, ధార్మిక ప్రసంగాలు వినాలంటే అది కేసెట్ల ద్వారా కూడ వినవచ్చు. ఏ స్త్రీలు నమాజు కొరకు మసీదుకు వెళ్తున్నారో వారికి నా హితోపదేశం ఏమిటంటే వారు ఎలాంటి అలంకరణను వ్యక్తపరచకూడదు. సువాసనలు వెలువడే వస్తువులు (ఫర్ ఫ్యూమ్, సెంటు లాంటివి) వాడరాదు 

ప్ర-27 – స్త్రీ పవిత్ర రమజాన్ మాసంలో ఉపవాసస్థితిలో వంట రుచిని పరీక్షించగలదా? వాటి పట్ల ఆదేశం ఏముంది? 

జ: అత్యవసరమైనప్పుడు పరీక్షించటంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ రుచి పరీక్షించిన తరువాత దానిని ఉమ్మివేయాలి (తినరాదు). 

ప్ర-28: ఒక స్త్రీ గర్భం దాల్చిన తొలిరోజుల్లో యాక్సిడెంట్ కు గురైంది. విపరీతంగా రక్తం పోవడం వల్ల గర్భం పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఉపవాసాలు పూర్తిచేయాలా? లేదా విరమించుకోవాలా? ఒక వేళ ఉపవాసం విరమించుకుంటే ఆమె పాపానికి గురికాదా? 

జ: మా అభిప్రాయం ఏమిటంటే గర్భవతికి నెలసరి రాదు. ఇమామ్ అహ్మద్ (రహ్మతుల్లాహి అలైహ్) వ్యాఖ్యానం ప్రకారం : ‘స్త్రీలకు నెలసరి ఆగితేనే గర్భం గురించి అవగాహన కలుగుతుంది‘. నెలసరి గురించి విద్యావంతులు ఇలా వ్యాఖ్యానిస్తున్నారు : ‘అల్లాహ్ దానిని తల్లి గర్భములో ఉన్న శిశువుకు పోషకాహారంగా మలచాడనే విషయం బోధపడుతుంది. అందుకే గర్భం ఏర్పడినప్పుడు నెలసరి రావటం ఆగిపోతుంది‘. 

కానీ కొంతమంది స్త్రీలకు గర్భం తరువాత కూడ యధా ప్రకారం నెలసరి వస్తూనే వుంటుంది. అటువంటి స్త్రీలకు ఆదేశం ఏమిటంటే వారి నెలసరి అసలైన నెలసరి కాదు. ఎందుకంటే అది గర్భప్రభావం లేకుండా వస్తుంది. ఇలాంటి నెలసరి గల స్త్రీలకు కూడ సాధారణ (గర్భమేతర) నెలసరి స్త్రీలకు వర్తించే ఆదేశాలే వర్తిస్తాయి. వారిని దేని నుండి నివారించబడిందో వాటి నుండి వీరు కూడా దూరంగా వుండాలి. 

సంక్షిప్తంగా గర్భవతికి వచ్చే రక్తం రెండు రకాలు: ఒక రకమైన రక్తంపై నెలసరి ఆదేశాలు వర్తిస్తాయి. అది ఎలాంటిదంటే గర్భం దాల్చిన తరువాత కూడ మునుపటిలాగే రక్తం వస్తుంది. అంటే అది గర్భప్రభావానికి లోను కాదు. కనుక అది నెలసరిగానే పరిగణించబడుతుంది. రెండో రకం రక్తం ఎలాంటిదంటే ఏదైన యాక్సిడెంట్ కారణంగా లేదా ఏదైన బరువు ఎత్తిన కారణంగా లేదా పడిపోయిన కారణంగా అకస్మాత్తుగా వచ్చేది. అయితే ఇది నెలసరి కాదు. నరములోని రక్తం. కనుక ఇది నమాజుకి ఉపవాసానికి అటంకం కల్గించదు. అంతేకాక వీరు పరిశుద్ధులుగా పరిగణించబడతారు. 

యాక్సిడెంట్ కారణంగా గర్భంలోనున్న శిశువు లేద గర్భం కోల్పోవుట జరిగినప్పుడు ధార్మిక విద్యావంతులు రెండు విధాలుగా వ్యాఖ్యానించారు: మొదటి సందర్భం ఏమిటంటే గర్భంలో వున్న శిశువు రూపురేఖలు దాల్చుకొని పడిపోయినప్పుడు దాని తరువాత వచ్చే రక్తాన్ని బాలింతదశకు సంబంధించిన రక్తస్రావంగా పరిగణించబడుతుంది. ఆ రోజుల్లో ఆమె నమాజు, ఉపవాసాలు పాటించరాదు. పరిశుద్దురాలైనంతవరకూ ఆమె భర్త కూడ ఆమెతో లైంగిక వ్యవహారాలకు దూరంగా వుండాలి. రెండవ సందర్భం : ఏమిటంటే గర్భము పడిపోయిన సమయములో లోపల వచ్చే రూపురేఖలు దాల్చుకోవటం జరగలేదు. అలాంటప్పుడు దాని తరువాత రక్తం చెడు రక్తంగా పరిగణించ బడుతుంది. దాని వల్ల నమాజు, ఉపవాసాలు ఇంకా ఇతర విషయాలకు అది ఏమి ఆటంకంకాదు. 

ఇస్లామీయ ధార్మిక విద్వాంసులు ఇలా ప్రస్తావిస్తున్నారు : సృష్టి ఆకారం వ్యక్తం కావటానికి కనీస కాలం 81 రోజులవుతుంది. అబ్దుల్లా బిన్ మసూద్ (రజియల్లాహు అన్హు) కధనం : దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు : ” ప్రతి వ్యక్తి తన తల్లి గర్భములో నలభై రోజుల వరకు వీర్యముగా వుంటాడు. ఇంకా అంతే కాలం వరకు రక్తపు ముద్దగా వుంటాడు. అంతే కాలం వరకు మాసపు ముద్దలా వుంటాడు. అప్పుడు అతని వద్ద దైవదూత పంపబడతాడు. ఆ దైవదూతకు నాలుగు విషయాల గురించి సూచించడం జరుగుతుంది. కనుక ఆ దైవదూత అతని ఆహారము (ఉపాధి), అతని జీవిత కాలం, అతని కర్మము, ఇంకా అతను పుణ్యాత్ముడా లేక పాపిష్ఠుడా అనే విషయాలను వ్రాసివేస్తాడు“. 

కనుక ఈ గడువు కంటే ముందు గర్భంలో శిశువుకు జీవం వ్యక్తం లేదు. అంతేకాక కొందరు జ్ఞానుల అభిప్రాయం ప్రకారం సాధారణంగా 90 రోజుల కంటే ముందు జీవం బయటపడదు.

ప్ర-29: ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది: మూడో నెలలో నా గర్భము పోయింది. పరిశుద్ధులు అయ్యేంతవరకు నేను నమాజు చదవలేదు. నా పై నమాజ్ పాటించుట తప్పనిసరి (వాజిబ్) అని కొందరు చెప్పారు. ఇప్పుడు నేను ఏమిచేయాలి? నాకైతే ఖచ్చితంగా ఆ రోజుల సంఖ్య గుర్తులేదు? 

జ : ధార్మిక విద్వాంసుల అభిప్రాయం ఏమిటంటే స్త్రీ మూడు నెలల గర్భాన్ని కోల్పోయినప్పుడు ఆమె నమాజు చదవదు. ఎందుకంటే ఆమె కోల్పోయిన శిశువు రూపురేఖలు వ్యక్తమైవుంటే ఆ సందర్భములో వచ్చే రక్తం బాలింతదశానికి సంబంధించిన రక్తస్రావం. ఆ స్థితిలో స్త్రీ నమాజు పాటించకూడదు. ధార్మిక విధ్వాంసులు ప్రస్తావన ఏమిటంటే శిశువు రూపురేఖలు 81రోజులు నిండిన తరువాతే వ్యక్తమవుతాయి. అయితే ఈ కాలం మూడు మాసాలకంటే తక్కువగా ఉంది. 

ఒక వేళ స్త్రీ కోల్పోయిన శిశువు మూడు నెలలు పూర్తిచేసుకుందనే నమ్మకం వుంటే అలాంటప్పుడు వచ్చే రక్తం బాలింత దశకి చెందిన రక్తస్రావం అవుతుంది. ఒక వేళ గర్భం 80 రోజుల కంటే ముందే పడిపోతే అలాంటి సందర్భములో వచ్చే రక్తం చెడు రక్తమే. కానీ దాని మూలంగా ఆమె నమాజు వదలకూడదు.

అయితే పై పేర్కొనబడిన స్త్రీ తన జ్ఞాపకంతో బాగా ఆలోచించాలి. ఒకవేళ ఆమె గర్భం 80 రోజుల పూర్తికాక ముందే పడిపోయివుంటే అప్పుడు ఆమె నమాజుల ఖజా (బదులుగా) చేయాలి. ఒకవేళ వదిలివేసిన నమాజుల సంఖ్య తెలియనప్పుడు అయినంత వరకు అంచనావేసి ఎక్కువ శాతం దేనిపై అవగాహన కుదిరితే దాని ప్రకారం నమాజుల ‘ఖజా’ (బదులుగా) చేయాలి. 

ప్ర-30: ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది: తనపై ఉపవాసాలు విధి (ఫర్జ్) అయినప్పటి నుండి ఆమె రమజాన్ మాసపు ఉపవాసాలు పాటిస్తుంది. కాని వాటిలో మిగిలిపోయిన ఉపవాసాలకు ‘ఖజా’ (బదులు) వుండట్లేదు. ఎందుకంటే ఆమె వదిలిపెట్టిన ఉపవాసాల సంఖ్య ఆమెకు తెలియదు. అయితే ఈ స్థితిలో ఆమెపై ఏది తప్పనిసరి (వాజిబ్) అవుతుంది? 

జ: సాక్షాత్తు ముస్లిముల నుండి ఇలాంటి వాక్యాలు వింటున్నందుకు మాకు చాలా బాధగా వుంది. (ఫర్జ్) ఉపవాసాలు ‘ఖజా’ చేయకపోవడానికి కారణం తెలియక (అవగాహన లేకపోవడం) లేక బద్దకం వలన జరుగుతుంది. అయితే ఈ రెండు కూడా ఇబ్బందికరమైన విషయాలే. తెలియని విషయాలకు వైద్యం జ్ఞానం (అవగాహన) నేర్చుకోవాలి. విద్యావంతులతో తెలుసుకోవాలి. కాని బద్దకానికి వైద్యం ఏమంటే అల్లాహ్ భయ భీతిని అలవర్చుకోవాలి, ఆయన శిక్షకు భయపడాలి, ఆయన ఆజ్ఞల వైపు ముందడుగు వేయాలి. 

పై పేర్కొనబడిన స్త్రీ పై తప్పనిసరి (వాజిబ్) ఏమిటంటే ఆమె తన వల్ల జరిగిన పొరపాటుకు అల్లాహ్ సమక్షంలో మనసారా కోరుతూ పశ్చాత్తాప పడాలి. ఎన్ని రోజుల ఉపవాసాలు మిగిలిపోయాయో తన శక్తి మేరకు అంచనావేసి ‘ఖజా’ చేయాలి. అప్పుడే ఆమె తనపై వున్న విధిని పూర్తి చేసుకోగలదు. అల్లాహ్ వారి క్షమాపణను అంగీకరించుగాక… ఆమీన్

ప్ర- 31: ఒకామె ఇలా ప్రశ్నిస్తుంది …. ‘ఏమంటే నమాజు సమయం ప్రారంభం అయిన తరువాత స్త్రీకి నెలసరి వస్తే దాని గురించి ఆదేశం ఎలా వుంది? ఇంకా పరిశుద్ధురాలు అయిన తరువాత ఆమె పై ఆ నమాజు ఖజా (బదులు) చేయటం (వాజిబ్) తప్పనిసరా? మరి ఇలాగే ఆమె నమాజు చివరి సమయం దాటిపోక ముందే పరిశుద్ధురాలైతే దాని గురించి ఆదేశం ఎలా వుంది?’ 

జ: ఒకటి : నమాజు సమయం ప్రారంభం అయిన తరువాత స్త్రీకి నెలసరి వచ్చినప్పుడు ఆమె ఒకవేళ అప్పుడు వరకు నమాజు పాటించకుండా వుండి వుంటే ఆమె పరిశుద్దురాలైన తరువాత ఆ నమాజుని ‘ఖజా’ చేయాలి. ఎందుకంటే ఆ నమాజు సమయంలో ఆమె నెలసరి కల్గియున్నది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “ఎవరైనా నమాజులోని ఒక ‘రకాత్” పొందినా అతను నమాజు పొందినట్లే.” 

కనుక స్త్రీకి ఏదైన ఒక నమాజులోని ఒక ‘రకాత్’ చదివే సమయం దొరికినప్పుడు ఆమె ఆ నమాజు చదవటానికి ముందే నెలసరికి గురైతె పరిశుద్ధురాలైన తరువాత ఆ నమాజుకి ‘ఖజా’ చేయాలి. 

రెండు : నమాజు సమయం పూర్తి అవ్వక ముందే ఒకవేళ ఆమె నెలసరి నుండి పరిశుద్దురాలైతె ఆమెపై ఆ నమాజు ‘ఖజా’ చేయటం తప్పని సరవుతుంది. ఉదాహరణకు ఒకవేళ సూర్యోదయాని కంటే ముందు కేవలం ఒక రకాత్ చదవగలిగే సమయం వున్నప్పుడు ఆమె నెలసరి నుండి పరిశుద్ధురాలైతె ఫజర్ నమాజు ‘ఖజా’ చేయటం తప్పనిసరి. అలాగే సూర్యస్తమయాని కంటే ముందు కేవలం ఒక ‘రకాత్’ చదవగలిగే సమయం వున్నప్పుడు ఆమె నెలసరి నుండి పరిశుద్ధురాలైతె ‘అస్ర్’ నమాజు ‘ఖజా’ చదవటం తప్పనిసరి. అలాగే అర్థరాత్రి పూర్తి కావటాని కంటే ముందు కేవలం ఒక ‘రకాత్’ చదవగలిగే సమయం వున్నప్పుడు ఆమె నెలసరి నుండి పరిశుద్ధురాలైతె ‘ఇషా’ నమాజు ‘ఖజా’ చదవటం తప్పనిసరి. ఒకవేళ అర్ధరాత్రి తరువాత ఆ స్త్రీ పరిశుద్దురాలైతె ఆమె పై ‘ఇషా’ నమాజు ‘ఖజా’ చదవటం తప్పనిసరి కాదు (అవసరం లేదు). కాకపోతే సమయం అయిన తరువాత ‘ఫజర్’ నమాజు చదవటం ‘వాజిబ్’ (తప్పనిసరి). పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : 

فَإِذَا اطْمَأْنَنتُمْ فَأَقِيمُوا الصَّلَاةَ ۚ إِنَّ الصَّلَاةَ كَانَتْ عَلَى الْمُؤْمِنِينَ كِتَابًا مَّوْقُوتًا

శాంతి కల్గినప్పుడు నమాజు స్థాపించండి, వాస్తవంగా నమాజు విశ్వాసుల పై నిర్ణీతసమయాల్లో విధియయై ఉంది”. (అన్-నిసా 04:103) 

అంటే నమాజు నిర్ణీత సమయాల్లో విధిగా వుంది. కనుక నమాజును నిర్ణీత సమయం నుండి విడదీయటం గాని లేదా నిర్ణీత సమయం కాక ముందే నమాజు చదవటం గాని మానవునికి తగని విషయం. 

32 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది: ‘నాకు నమాజు మధ్యలోనే నెలసరి వచ్చేసింది’ నేను ఏమి చేయను? నెలసరి కాలంలో వదిలిపెట్టిన నమాజుల ‘ఖజా’ చదవాలా? 

జ: నమాజు సమయం మొదలైన అయిన తరువాత స్త్రీకి నెలసరి వస్తే, ఉదాహరణకు: మిట్టమధ్యాహ్నం సూర్యుడు ఒకింత వాలిన అరగంట తరువాత ఆమెకు నెలసరి వస్తే, నెలసరి నుండి పరిశుద్ధురాలైన తరువాత ఏ నమాజు సమయం ఆమెకి చేరుకుందో ఆ నమాజు ‘ఖజా’ చేయాలి. ఎందుకంటే ఆ సమయంలో ఆమె పరిశుద్ధురాలుగా ఉన్నది. పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు: 

إِنَّ الصَّلَاةَ كَانَتْ عَلَى الْمُؤْمِنِينَ كِتَابًا مَوْقُوتًا 

నిస్సందేహంగా నమాజు విశ్వాసుల పై నిర్ణీత సమయాల్లో విధియయైఉంది“. (అన్-నిసా 4:103) 

స్త్రీ పై నెలసరి కాలంలో వదిలిపెట్టిన నమాజుల ఖజా లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: ఇలా జరగట్లేదా? ఏమంటే స్త్రీ నెలసరిలో ఉన్నప్పుడు నమాజు చదవదు ఉపవాసం వుండదు? అంతేకాక ధార్మిక విద్వాంసులందరూ ఏకీభవిస్తున్నది ఏమంటే స్త్రీ నెలసరి కాలంలో వదిలి వేసిన నమాజుల ఖజా చేయనక్కరలేదు. కాని ఆమె నెలసరితో పరిశుద్దు రాలైనప్పుడు ఒక రకాత్ లేదా దానికంటే ఎక్కువ చదవగలిగే  సమయం వుంటే, ఏ నమాజు సమయంలో ఆమె పరిశుద్ధురాలైందో నమాజు ఖజా చేయాల్సి వుంటుంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు : 

“ఎవరైతే సూర్యస్తమయాని కంటే ముందు అన్రి నమాజులోని ఒక రకాత్ పొందినట్లైతే అతను అస్ర్  నమాజు పొందినట్లే” 

కనుక నెలసరి గల స్త్రీ ‘అన్రి’ సమయంలో సూర్యస్తమయానికంటే ముందు ఒక రకాత్ చదవగలిగే సమయం వున్నప్పుడు ఆమె నెలసరితో పరిశుద్ధురాలైతె లేదా సూర్యోదయాని కంటే ముందు కేవలం ఒక రకాత్ చదవగలిగే సమయం వున్నప్పుడు ఆమె నెలసరితో పరిశుద్దురాలైతె, ముందు పేర్కొన్న ప్రకారం ‘అస్రో’ నమాజు, తరువాత పేర్కొన్న ప్రకారం ఫజర్ నమాజు చదవవలసి వుంటుంది. 

ప్ర- 33: ఒకరు ఇలా ప్రశ్నిస్తున్నారు: మా అమ్మగారి వయసు 65 సంవత్సరాలు కావచ్చింది. 19 సంవత్సరాల నుండి వారికి ఏలాంటి సంతానం కలుగలేదు, కాని ఒక మూడు సంవత్సరాల నుండి వారికి రక్తస్రావం జరుగుతుంది. చూడటానికి ఏదో జబ్బులాగానే కనబడుతుంది. అయితే పవిత్ర రమజాన్ మాసం నెల సమీపంలో వుంది. అందుకని దయచేసి ఆమె గురించి తమరు ఎలాంటి ఆదేశాలు లేక హితబోధనలు చేయగలరో తెల్పండి? ఇంకా దయచేసి ఇది కూడ తెలుపగలరు – ఏమంటే ఇటువంటి స్త్రీలు ఏమి చేయవలెను? 

జ: ఇలాంటి స్త్రీ అంటే రక్తస్రావం జరిగే స్త్రీకై ఆదేశం ఏమంటే ప్రస్తావించిన జబ్బు రాకముందు ఆమె నెలసరి కాలం ఎంత వుందో అన్నిరోజులు ఆమె నమాజు మరియు ఉపవాసం వదిలివేయాలి. ఒకవేళ ఆమెకి సాధారణంగా ప్రతి నెల మొదటి 6 రోజులు నెలసరి వస్తూవున్నట్లైతే ప్రతి నెల మొదటి 6 రోజులు ఆమె నమాజు, ఉపవాసం వదిలివేయాలి. ఆ ఆరు రోజులు పూర్తి అయిన తరువాత స్నానం చేసి నమాజు చదవాలి, ఉపవాసం వుండాలి. ఇలాంటి స్త్రీలకు నమాజు చదివే పద్ధతి ఎలాగంటే తమ మర్మాంగాన్ని శుభ్రముగా కడుక్కొని దానిపై ఏదైన గుడ్డ కట్టుకోవాలి. తరువాత ‘వజు’ చేసుకుని నమాజ్ చేయాలి. ఇలా ‘ఫర్జ్’ నమాజు సమయాల్లో ప్రవేశించిన తరువాత చేయాలి. ఇలాగే ‘ఫర్జ్’ నమాజు కాకుండా ‘నఫిల్’ చదవాలన్న కూడ ఇదే విధానాన్ని పాటించాలి. 

పై పేర్కొనబడిన స్థితిలో కష్టము ఇబ్బంది కారణంగా ఇలాంటి స్త్రీ ‘జొహర్’ను ‘అస్ర్’తో, మరి ‘మఘ్రిబ్’ను ‘ఇషా’తో కలిపి చదవవచ్చు. ఎందుకంటే ఆమె ఒక సారి చేసుకున్న (‘వజు’ మరి శుచిశుభ్రతలు) రెండు నమాజులకి ఉపయోగపడాలని. అంటే ఒక సారి చేసిన వజు, శుభ్రతలు ‘జొహర్’ మరియు ‘అస్ర్’కి, ఇంకో సారి ‘మఘ్రిబ్’ మరియు ‘ఇషా’కి. అలాగే ఇంకోసారి చేసేది ‘ఫజర్’కు (ఉపయోగపడుతుంది). ఈ విధంగా ఐదు సార్లకు బదులు మూడుసార్లే సరిపోతుంది. 

ఈ విషయాన్ని మరోసారి వివరిస్తున్నాను. పేర్కొనబడిన స్త్రీ తన మర్మాంగాన్ని శుభ్రముగా కడుక్కొని దానిపై ఏదైన గుడ్డతో పట్టి కట్టుకోవాలి. ఎందుకంటే వచ్చే రక్తం అదుపులో వుండటానికి. తరువాత ‘వజు’ చేసి నమాజ్ చదవాలి. ‘జోహర్’ 4 రకాతులు చదవాలి, అస్ర్  4 రకాతులు చదవాలి, మఘ్రిబ్ 3 రకాతులు చదవాలి, ‘ఇషా’ 4 రకాతులు చదవాలి, ఇంకా 2 రకాతులు ఫజర్ చదవాలి. అంటే ఈ నమాజుల్లో ఆమె ‘ఖస్ర్’ (అంటే ప్రయాణ సమయములో చదివే సగం నమాజు) చేయకూడదు. ఎందుకంటే కొందరు ఇలాంటి భ్రమలో ఉన్నారు. కాకపోతే ఆమెకి సౌక్యరం కల్పించబడింది ఏమంటే ‘జొహర్’, ‘అన్రి’ రెండు నమాజులు కలిపి, ‘మఘ్రిబ్’, ‘ఇషా’ రెండు నమాజులు కలిపి చదవవచ్చు. అంటే ‘జొహర్’ నమాజ్తో ‘అస్ర్’ నమాజుని కలుపుకొని లేదా ‘అస్ర్’ నమాజ్తో ‘జొహర్’ని కలుపుకొని చదవవచ్చు. అలాగే ‘మఘ్రిబ్’ నమాజు’తో ‘ఇషా నమాజు’ని లేదా ‘ఇషా’తో మఘ్రిబ్’ని కలుపుకొని, ‘జమ’ చేసి చదవవచ్చు. దీనిని ‘జమ-తాఖీర్’ లేదా ‘జమ-తఖ్దీమ్’ అని అంటారు). 

ఇంకా అదే ‘వజు’తో ‘నఫిల్ నమాజులు కూడా చదవవచ్చు ఎలాంటి అభ్యతరం లేదు. 

ప్ర-34: ప్రసంగాలు మరియు ఖుత్బా వినటానికి నెలసరిగల స్త్రీ ‘మస్జిద్-హరాం’లో ఆగుట సరైనదేనా? 

జ : నెలసరిగల స్త్రీ ‘మస్జిద్-హరాం’లో గాని లేదా వేరే ఏ మస్జిద్ లోనూ గాని అగుట సరైనది కాదు. కాకపోతే మస్జిద్ నుండి దాటుట (వెళ్ళుట), ఇంకా అవసరాన్ని బట్టి ఏదైనా వస్తువు తీసుకొనుట చేయవచ్చు. ఎలాగంటే “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హ॥ ఆయిషా (రజియల్లాహు అన్హా) ను ‘ ముసల్లా’ (జానిమాజ్: నమాజ్ చేయడానికి ఉపయెగించె చాప) అడిగారు. దానికి ఆమె ఇలా అన్నారు: ‘ముసల్లా’ మసీదులో వుంది. (అప్పుడు ఆమె నెలసరితో వున్నారు) అయితె ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు : ” నీ నెలసరి నీ చేతుల్లో (అంటుకొని) లేదు”. 

కనుక నెలసరిగల స్త్రీకి మసీదులో రక్తము చిమ్మే భయం లేనప్పుడు ఆమెకి మసీదు నుండి వెళ్ళటంలో ఎటువంటి అభ్యతరం లేదు. కాని కూర్చునే ఉద్దేశంతో మసీదులో ప్రవేశించకూడదు. దీనికి ఆధారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘ఈద్’ (పండుగ) నమాజుకై పడుచువాళ్ళకు, స్త్రీలకు, నెలసరిగల స్త్రీలకు ‘ఈద్గాహ్’ వెళ్ళాలని ఆదేశించారు. కాని నెలసరిగల స్త్రీలకు ‘ఈద్గాహ్’ నుండి దూరంగా వుండాలని ఆదేశించారు. ఆ మాటే దీనికి ఆధారం. ఏమంటే, ‘ఖుత్బా’ వినటానికి లేదా ప్రసంగాలు వినటానికై నెలసరిగల స్త్రీ మసీదులో ఆగరాదు. 

స్త్రీ నమాజు కొరకు పాటించవలసిన కొన్ని పరిశుద్ధ ఆదేశాలు 

ప్ర-35 : స్త్రీ యోని నుండి తెల్లటి లేదా పసుపచ్చ రంగులో వెలువడే ద్రవం పరిశుభ్రమేనా? లేదా అపరిశుభ్రమా? ఒకవేళ అది నిరంతరంగా వస్తున్నప్పుడు వజు చేయటం ‘వాజిబ్’ (తప్పనిసరి) అవుతుందా? ఒక వేళ అది క్రమ క్రమంగా వస్తున్నప్పుడు దాని ఆదేశం ఏమిటి? ప్రత్యేకించి విద్యావంతులైన స్త్రీలు ఇది సహజంగా వస్తూవుండే తడి, కాబట్టి దీనికి వజు చేయనవసరం లేదు అని భావిస్తున్నారు. ఇలా భావించవచ్చా? 

జ: అనేక విశ్లేషణలు, విచారణల అనంతరం నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే స్త్రీ యోని నుండి తెల్లటి లేదా పసుపచ్చ రంగులో వెలువడే ద్రవం మూత్రాశయం నుండి కాకుండా గర్భాశయం నుండి వస్తుంటే అది పరిశుభ్రమే. అది పరిశుభ్రమైనప్పటికి కూడా ‘వజు’కి భంగం వాటిల్లుతుంది. ఎందుకంటే ‘వజు’ను భంగపరిచే అంశాలపై ఈ షరతు విధించబడలేదు. అంటే వెలువడే వస్తువు అపరిశుభ్రమై వుండాలని షరతు విధించబడలేదు. 

ఉదాహరణకు గాలి (మలవిసర్జన దారి) నుండి వెలువడుతుంది. అయితే ఆ గాలికి శరీరం, ఆకారం వుండవు. అయినా.. అది ‘వజు’ను భంగపర్చుతుంది. అందుకే స్త్రీ ‘వజు’తో వున్నప్పుడు ఆమె యోని నుండి ఏదైన ద్రవం వెలువడితే ఆమె ‘వజు’ భంగపడుతుంది. ఆమె మరలా ‘వజు’ చేయవలసి వుంటుంది. 

ఈ ద్రవం ఒకవేళ నిరంతరం వెలువడుతుంటే అప్పుడు అది ‘వజు’ ‘కి భంగం కల్గించదు. కానీ ఇటువంటి సందర్భములో ఆ స్త్రీ ఏమిచేయాలంటే నమాజు సమయం అయినప్పుడు ఆమె నమాజు కోసం ‘వజు’ చేసుకొని ఆ ‘వజు’తో ఫర్జ్, సున్నత్, నఫిల్ నమాజులను సలపాలి. ఖుర్ఆన్ పారాయణం చేయదలుచుకుంటే చేయాలి. అలాగే పరిశుద్ధ స్థితిలో ఆమెకు ఏఏ పనులు వర్తిస్తాయో వాటిలో తలుచుకున్నవి చేయవచ్చు. 

ఇస్లామీయ విద్యావంతులు మూత్ర వ్యాధిగ్రస్థుడికి సంబంధించి ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. ఇది గర్భాశయం నుండి వెలువడే ద్రవానికి ఆదేశం, ఈ తడి పరిశుభ్రమే. కాని క్రమ క్రమంగా వచ్చిన పక్షంలో వజుకి భంగం కల్గిస్తుంది. ఒకవేళ నిరంతరంగా వస్తే వజుకి భంగం కలిగించదు. కాకపోతే అలాంటి సందర్భంలో స్త్రీ తప్పనిసరిగా నమాజు సమయం ప్రారంభమైన తరువాత ‘వజు’ చేయాలి. యోనిపై గుడ్డ లేక మరేదైనా కట్టుకోవాలి. ఒకవేళ ఈ ద్రవం క్రమ క్రమంగా వస్తూవుండి నమాజు సమయంలో ఆగిపోతున్నట్లైతే అప్పుడు ఆమె అది ఆగిపోయేంత వరకు నిరీక్షించి నమాజును ఆలస్యం చేయాలి. అలస్యం అంటే నమాజు సమయం దాటిపోయే వరకు నిరీక్షించరాదు. ఒకవేళ నమాజు సమయం దాటిపోయే ప్రమాదం వున్నప్పుడు వజూ చేసుకుని ఆ ద్రవం కారకుండా గుడ్డ లేక మరేదైనా ఏర్పాటు చేసు (కట్టు) కొని నమాజు చదువుకోవాలి. 

అయితే కారే ద్రవం స్వల్పమైనా లేక అధికమైనా రెండింటికి ఒకటే ఆదేశం. ఎందుకంటే యోని నుండి వెలువడే ప్రతీది ఎక్కువైనా తక్కువైనా అది వజు ని భంగపర్చుతుంది. దీనికి భిన్నంగా శరీరములోని వేరే ఏ భాగం నుండైన వెలువడేవి (రక్తం, లేక వాంతు). ఇవి వజుని భంగపరచవు. అవి ఎక్కువైనా తక్కువైనా కూడ. 

అయితే కొందరు స్త్రీలు ఇది సహజమైనది కాబట్టి ‘వజు’కు భంగం వాటిల్లదు’ అనే అభిప్రాయం కలిగివున్నారు. నాకున్న జ్ఞానం మెరకు దీనికి సంబంధించి ఎటువంటి ఆధారము లేదు. కాని ఇబ్నె హజ్మ్ రహ్మతుల్లాహి అలైహి అభిప్రాయం ఒకటుంది. అదేమిటంటే దీనితో వజు భంగం కాదు. అయితే ఆయన ఈ అభిప్రాయానికి సంబంధించి ఏ ఆధారం ప్రస్తావించ లేదు. “కితాబ్ వ సున్నత్” లేదా సహాబాల (అనుచరుల) అభిప్రాయాలతో ఏమైన ఆధారం ఇచ్చివుంటే ఖచ్చితంగా అది పటిష్టమైన ఆధారంగా భావించవచ్చు. 

ఏదేమైనా స్త్రీ ఈ విషయంలో అల్లాహ్ కు భయపడాలి. శుచి శుభ్రతల పట్ల ఎంతో మక్కువ కలిగి వుండాలి. ఎందుకంటే శుభ్రత లేకుండా వంద సార్లు నమాజు చదివినా అది వృధాయే. అల్లాహ్ సమక్షంలో అంగీకార యోగ్యం కాదు. ఈ విషయంలో ఇస్లామీయ విద్వాంసులు ఎంతవరకు అభిప్రాయపడ్డారంటే ఎవరైతే శుచి, శుభ్రత లేకుండా నమాజు చదువుతారో వారు కాఫిర్ (అవిశ్వాసి) అని కూడా చెప్పారు. ఎందుకంటే ఇది అల్లాహ్ పట్ల మరి ఆయన ఆయతుల పట్ల ఎగతాళి చేసినట్లే. 

36 : ఒక స్త్రీకి యోని నుండి ఈ తడి నిరంతరం వస్తుంది. ఆమె ఒకవేళ ఏదైన ఫర్జ్ నమాజుకై వజు చేసిన తరువాత ఆ వజుతో మరో నమాజు సమయం వచ్చే వరకు నఫిల్ నమాజులు చదవవచ్చా? పవిత్ర ఖుర్ఆన్ పారాయణం చేయవచ్చా? 

జ : పై పేర్కొనబడిన స్త్రీ ఏదైన ఫర్జ్ నమాజుకై దాని తొలి సమయంలో వజు చేసి ఆ వజుతో మరో ఫర్జ్ నమాజు సమయం వచ్చే వరకు ఎన్ని ‘నఫిల్ నమాజులైన, ఎన్ని ఫర్జ్ నమాజులైన చదువుకోవచ్చు. ఖుర్ఆన్ పారాయణమూ చేసుకోవచ్చు. 

ప్ర -37 : పై పేర్కొనబడిన స్త్రీ ‘ఫజర్’ ‘వజు’తో ‘ఛాష్త్’ నమాజు పాటించుట సరైనదేనా? 

జ : సరైనది కాదు. ఎందుకంటే ‘ఛాష్త్’ నమాజు సమయం ఒక నిర్ణీత సమయం. అందుకే ఆ సమయం వచ్చిన తరువాత వజూ చేయడం తప్పనిసరి. ఎందుకంటే పై పేర్కొనబడిన స్త్రీ రక్తస్రావం గల స్త్రీ ఆదేశంలో వుంది. రక్తస్రావం గల స్త్రీకి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి నమాజుకు ‘వజు’ చేయాలని ఆదేశించారు. 

ఛాష్త్ నమాజ్ :సూర్యోదయం తరువాత పాటించే నమాజు
కితాబ్-వ- సున్నత్ : పవిత్ర ఖుర్ఆన్, హదీసులను అంటారు. 

ప్ర -38 : పై ప్రస్తావించబడిన స్త్రీ ఇషా ‘వజు’తో అర్ధరాత్రి దాటిన తరువాత ‘తహజ్జుద్’ (రాత్రి నమాజు) నమాజు పాటించవచ్చా? తెలుపగలరు. 

జ : పాటించకూడదు. ఈ విషయంలో రెండు అభిప్రాయాలున్నాయి 

ఒక అభిప్రాయం : అర్ధరాత్రి దాటిన తరువాత ఆమె మరలా (కొత్తగా) ‘వజు’ చేయుట ‘వాజిబ్’ (తప్పనిసరి). 
రెండవ అభిప్రాయం : కొత్తగా వజు చేయుట(వాజిబ్) కాదు కాబట్టి పాటించవచ్చు). 

అయితే రెండవ అభిప్రాయమే ఉత్తమమైనది. 

ప్ర -39 : ‘ఇషా’ నమాజు సమయం ఎప్పటి వరకు ఉంటుంది? దానిని ఎలా తెలుసుకోవాలి? 

జ: ‘ఇషా’ నమాజ్ చివరి సమయం అర్ధరాత్రి వరకు వుంటుంది. దానిని తెలుసుకునే విధానం ఏమిటంటే సూర్యాస్తమయం నుండి ‘ఫజర్ ‘ వరకు మధ్యలోగల సమయాన్ని రెండు భాగాలు చేయాలి. తొలి భాగం పూర్తి అయిన వెంటనే ‘ఇషా’ నమాజు సమయం అయిపోతుంది. ఇంకా రెండో భాగంలో ఉన్న రాత్రి సమయం ‘ఇషా’ సమయం కాదు, ‘ఇషా’ మరియు ‘ఫజర్’ నమాజుల మధ్యలో ఒక విభజనరేఖ సమయంగా పరిగణించబడుతుంది. 

ప్ర – 40: పైన ప్రస్తావించిన విషయంలో ఒక స్త్రీకి యోని నుండి ద్రవం (తడి) క్రమక్రమంగా వస్తున్న సందర్భములో ఆమె నమాజుకై ‘వజు’ చేసింది, ‘వజు’ చేసుకున్న తరువాత నమాజు చదవటం ప్రారంభించటానికి ముందే మళ్ళీ అదే పరిస్థితి పునరావృతమైంది. ఆమె ఏమి చేయాలి? 

జ: ఇలాంటి పరిస్థితిలో ఆమె ఈ తడి ఆగి పోయేంతవరకు నిరీక్షించాలి. ఆ తరువాత ‘వజు’ చేసుకుని నమాజ్ సలపాలి. ఒకవేళ పరిస్థితి అర్ధం కానప్పుడు అంటే ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు ఆగిపోతుందో అర్ధం కానప్పుడు నమాజు సమయం వచ్చిన తరువాత వజు చేసి నమాజు చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితిల్లో ఆమెపై ఎలాంటి దోషముండదు. (ఇన్షా-అల్లాహ్) 

ప్ర-41: పై పేర్కొనబడిన ‘తడి’ (ద్రవం) శరీరానికి లేదా వస్త్రాలకు అంటుకుంటే దాని ఆదేశం ఏమిటి? 

జ: ఈ తడి ప్రరిశుభ్రమైన సందర్భములో ఏమి చేయన వసరంలేదు. అదే అపరిశుభ్రమైతే అంటే మూత్రాశయం నుండి వస్తే దానిని కడిగివేయటం తప్పనిసరి. 

ప్ర -42 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది : ఒక స్త్రీ యోని నుండి తెల్లటి లేదా పసుపచ్చ ద్రవం వెలువడి నప్పుడు ఆ స్త్రీ ఎలా ‘వజూ’ చేయాలి? సాధారణంగా ‘వజూ’లో శుభ్రపరచుకునే అవయవాలనే శుభ్ర పరచు కుంటే సరిపోతుందా? 

జ: సరిపోతుంది. ఆ వెలువడే ద్రవం పరిశుభ్రమైనదైతే సాధారణ ‘వజు’ అవయవాలను శుభ్ర పరచుకుంటే సరిపోతుంది. అంటే అది మూత్రాశయం నుండి కాకుండా గర్భాశయం నుండి వెలువడి వుండాలి. 

43: దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ‘సహాబియాత్ ‘ లు ధార్మిక విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువ మక్కువ చూపేవారు. అయితే పైన ప్రస్తావించబడిన (తడితో  వజూకు భంగం వాటిల్లుతుందనే) విషయానికి ఆధారంగా ఏ ఒక్క హదీసు ఉల్లేఖించబడలేదు, ఎందుకు? 

జ: ఈ విషయంపై ఒక హదీసు కూడా ఉండకపోవడానికి కారణం ఏమిటంటే ఈ పరిస్థితి (తడి రావడం) ప్రతి స్త్రీకి సంబంధించినదికాదు. ప్రతి స్త్రీకి రాదు. 

ప్ర -44: ఏ స్త్రీ అయినా పై ప్రస్తావించబడిన సమస్యకు ధార్మిక ఆదేశం తెలియక ‘వజు’ చేయడం లేదు. అలాంటి స్త్రీ ఏమి చేయాలి? 

జ: స్త్రీ తప్పనిసరిగా అల్లాహ్ మన్నింపుకై వేడుకోవాలి. మరియు ఇస్లామియ ధార్మిక విద్వాంసులతో ఈ సమస్యను చర్చించి పరిష్కారాన్ని పొందాలి. 

ప్ర-45: పై పేర్కొనబడిన సమస్యలో ‘వజు’ చేయవలసిన అవసరం లేదనే అభిప్రాయాన్ని కొందరు మీ (షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్-ఉసైమిన్) అభిప్రాయంగా చెబుతున్నారు. ఇది సత్యమా? 

జ: ఎవరైతే ఈ అభిప్రాయాన్ని నాపై మొపుతున్నారో వారు సత్యవంతులు కాదు. వారు నా అభిప్రాయం “ప్రస్తావించబడిన ‘తడి’ పరిశుభ్రమైనది” అనే దానితో అలా భావించి అది ‘వజు’ని భంగపరిచేది  కాదు అని తెలుపుతున్నారు. (వాస్తవానికి అది ‘వజు’ను భంగపరిచేదే)

ప్ర – 46 : సాధారణంగా స్త్రీకి నెలసరి రావటానికి దాదాపు ఒక రోజు ముందు మాసిన నీళ్ళు వెలువడతాయి. అయితే దాని ఆదేశం ఏమిటి? ఈ నీళ్ళు అప్పుడప్పుడు సన్నదారం రూపంలో నలుపు లేదా దట్టమైన ఎరుపు రంగులో వుంటాయి. ఒకవేళ ఈ నీళ్ళు నెలసరి తరువాత వస్తే దాని ఆదేశం ఏమిటి? 

జ : ఈ నీళ్ళు నెలసరికి తొలి సంకేతాలుగా వుంటే అవి కూడా నెలసరి గానే పరిగణించబడతాయి. దాన్ని ఎలా తెలుసుకోవాలంటే.. సాధారణంగా బహిష్టు సమయంలో స్త్రీలు లోనయ్యే ఆ బాధ, కుదుపు ద్వారా తెలుసుకోవచ్చు. 

బహిష్టు తరువాత మాసిన నీళ్ళు వచ్చినప్పుడు స్త్రీకి పరిశుభ్రత కొరకు వేచి చూడవలసి వుంటుంది. ఎందుకంటే నెలసరితో వెంటనే కలిసి వచ్చే నీళ్ళు కూడ నెలసరె అవుతుంది. హ॥ ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపేవారు : 

మీరు తొందర పడకండి! తెలుపు చూసేంతవరకు నిరీక్షించండి“. 

బహిష్టు స్త్రీలకు సంబంధించిన హజ్, ఉమ్రాహ్ ఆదేశాలు

ప్ర-47: బహిష్టు స్త్రీ ‘ఇహ్రామ్’ కట్టుకున్న తరువాత రెండు రకాతులు నమాజు ఎలా చదవాలి? బహిష్టు స్త్రీ మెల్లగా ఖుర్ఆన్ ఆయతుల పారాయణం చేయవచ్చా? 

జ : ముందు మనం రెండు విషయాలు తెలుసుకుందాం. 

ఒకటి: ‘ఇహ్రామ్’ కు సంబంధించి ప్రత్యేక నమాజ్ అంటూ లేదు. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ కు ప్రత్యేక ‘ఇహ్రామ్’ నమాజు గురించి ఆదేశంగా లేక చేసినట్లు లేక దృవీకరించినట్లు ఆధారాలు లేవు. 

రెండు: ఏ స్త్రీ అయితే ఇహ్రం కట్టుకోవటానికి ముందే ఋతుస్రావానికి గురువుతుందో ఆమె అదే స్థితిలో ‘ఇహ్రామ్’ కట్టుకోవచ్చు. 

హ॥ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) సతీమణి అస్మా బిన్తె ఉమైస్ (రజియల్లాహు అన్హా) మక్కా మార్గంలో ‘జుల్ హులైఫా’ ప్రదేశంలో రక్తస్రావానికి గురైయ్యారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెని “స్నానం చేసి తన యోనిపై గుడ్డ కట్టుకుని ‘ఇహ్రామ్’ కట్టుకోవాలని” ఆదేశించారు. 

అయితే ఋతుస్రావంగల స్త్రీకి కూడా ఆదేశం ఇదే. ఇక వారు పరిశుభ్రమయ్యేంత వరకు ‘ఇహ్రామ్’ నిబంధనల్లోనే ఉండాలి. పరిశుద్ధులైన తరువాత కాబా గృహాన్ని (తవాఫ్ చేయాలి) దర్శించాలి. అలాగే ‘సఫా’, ‘మర్వా’ నడుమ ‘సయీ’ (వేగంగా నడవటం) చేయాలి. 

ఇక ఋతుస్రావంగల స్త్రీ ఖుర్ఆన్ పారాయణం చేయవచ్చా..? అనే ప్రశ్నకు సమాధానం ఏమిటంటే అవసరం మేరకు, ముఖ్య కారణంతో పారాయణం చేయవచ్చు. కానీ కేవలం అల్లాహ్ ఆరాధన నిమిత్తం లేక అల్లాహ్ సన్నిధిలో పుణ్యాలు పొందటానికైతే ఆ స్థితిలో చదవకపోవటమే మంచిది. 

గమనిక: అవసరం మేరకు, ముఖ్యకారణం అంటే పిల్లలకు బోధించేటప్పుడు, ఎవరైన చదువుతుంటే తప్పులు దిద్దటం, అలాగే రోజువారి ఖుర్ఆన్ ఆయతులు వస్తే దుఆ పరంగా చదవటంలో ఎలాంటి దోషం లేదు. 

ప్ర-48 : ఒక స్త్రీ హజ్ కొరకు ప్రయాణించింది. ప్రయాణంలో 5వ రోజు ఆమె ఋతుస్రావానికి గురైంది. ‘మీఖాత్’ వద్దకు చేరి ఆమె స్నానం చేసి ‘ఇహ్రామ్’ కట్టుకుంది. ఆమె ఇంకా ఋతుస్రావ స్థితి నుండి పరిశుద్దురాలు కాలేదు. మక్కా చేరుకున్న తరువాత ఆమె ‘హరం” బయటే నిలిచింది (వెలుపలే ఆగింది). ‘హజ్’, ‘ఉమ్రాహ్’కు సంబంధించి ఆమె ఏ ఒక్క పని కూడ చేయలేదు. రెండు రోజులు ఆమె “మినా” (ప్రదేశం)లో కూడ గడిపింది. తరువాత ఆమె నెలసరి నుండి పరిశుద్ధురాలై స్నానం చేసింది. పరిశుద్ధ స్థితిలో ‘ఉమ్రాహ్ ‘కు సంబంధించి అన్ని కార్యాలు, నియమాలు పూర్తి చేసింది. దాని తరువాత మళ్ళీ ఆమె ‘హజ్’ కొరకు ‘తవాఫ్ – ఇఫాజా’ చేస్తుండగా ఆమెకు మళ్ళీ రక్తస్రావం జరిగింది. సిగ్గుతో ఆమె తమ సంరక్షకులకు చెప్పలేదు. అదే స్థితిలో హజ్ విధానాలను పూర్తిచేసి, స్వస్థలానికి చేరుకున్న తరువాత ఆ విషయాన్ని తన సంరక్షకులకు తెలియపరిచింది. అయితే ఇప్పుడు ఆమెకు ఎలాంటి ఆదేశం వర్తిస్తుంది? 

జ: పై పేర్కొన్న సమస్యకి పరిష్కారం ఏమిటంటే ఆమె తవాఫె – ఇఫాజా’ (తవాఫ్) చేస్తుండగా వచ్చిన రక్తం ఒకవేళ నెలసరి రక్తమైతే (దాన్ని ఆమె రక్తపు స్థితి, బాధతో పసిగట్టగలుగుతుంది) అప్పుడు ఆమె చేసిన ‘తవాఫె  ఇఫాజా’ సరైనది కాదు. ఆమె తప్పకుండా మరలా మక్కా వెళ్ళి ‘తవాఫె-ఇఫాజా’ పూర్తి చేయాలి. ‘మీఖాత్’ నుండి ‘ఉమ్రాహ్’ ‘ఇహ్రాం’ కట్టి ‘తవాఫ్ ‘, ‘సయీ’తో సహా ‘ఉమ్రాహ్’ చేయాలి. ‘ఖస్ర్ ‘ చేసి దాని తరువాత ‘తవాఫె  ఇఫాజా’ చేయాలి.

అయితే ఒక వేళ ‘తవాఫె-ఇఫాజా’ చేస్తున్న మధ్యలో వచ్చే రక్తం సహజంగా నెలసరిది కాకుండా జన ప్రవాహం కారణంగా లేదా భయం కారణంగా లేదా మరే కారణంగా ఉన్నప్పుడు ఆమె ‘తవాఫె  – ఇఫాజా’ ‘తవాఫ్ ‘కు పరిశుద్ధత షరతుగా భావించని వారి పద్ధతి ప్రకారం సరైనదే. 

మొదటి విషయంలో : ఆమెకు రెండో సారి మక్కా రావటం అసాధ్యమైనప్పుడు, అంటే ఇతర దేశస్థురాలైనప్పుడు ఆమె ‘హజ్’ సరైనదె. ఎందుకంటే ఆమె ఏదైతే చేసిందో అంతకు మించి చేసే శక్తి, అవకాశం ఆమెకు లేదు. 

ప్ర-49 : ఒక స్త్రీ ఉమ్రాహ్ ఇహ్రాం కట్టుకుంది. ‘మక్కా’ చేరే సరికి ఆమెకు నెలసరి మొదలైంది. ఆమెతో పాటు వున్న ‘మహ్రమ్’ కి వెంటనే తిరుగు ప్రయాణం చేయవలసి వుంది. అక్కడ కొన్ని రోజులు ఉండే సౌకర్యం లేదు. పైగా ఆమె అక్కడ ఉండటానికి మక్కా నగరంలో ఆమెకు బంధువు లెవరూ లేరు. ఇలాంటి సందర్భంలో ఆమె ఏమి చేయాలి? 

జ.) పై పేర్కొనబడిన స్త్రీ ఒక వేళ అదే ప్రాంతానికి (సౌది అరేబియా) కి చెందినదైతే ఆమె తన ‘మహ్రమ్ ‘ (సంరక్షకుడి) తో తిరిగి వెళ్ళిపోవాలి. ‘ఇహ్రాం’ స్థితిలోనే వుండి, పరిశుద్ధురాలైన తరువాత రెండవ సారి మక్కా నగరానికి రావాలి. ఎందుకంటే ఆమెకు రెండవ సారి రావటం సులువైనదే. ఇందులో ఆమెకు ఎలాంటి అడ్డంకులు లేవు. పాస్పోర్టు కూడ అవసరంలేదు. 

కాని ఒకవేళ ఇతర దేశాల నుండి వచ్చివున్నవారైతే ఆమెకు రెండోసారి ప్రయాణం కష్టమైనప్పుడు ఆమె గుడ్డ కట్టుకోవాలి. మరి ‘తవాఫ్ , సయీ’ చేసి ‘ఖస్ర్’ చేసుకొని అదే ప్రయాణంలో తన ‘ఉమ్రాహ్’ పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ‘తవాఫ్’ చేయుట ఒక అత్యవసరమైన ఆదేశంగా భావించబడుతుంది. కనుక అవసరాన్ని బట్టి కొన్ని నిషేధిత అంశాలు కూడా ‘ముబాహ్’ (అనివార్యం) గా పరిగణించ బడతాయి. 

ప్ర – 50 :ఒక స్త్రీకి నిర్దేశించబడిన హజ్ రోజుల్లో నెలసరి ప్రారంభమైంది. ఆమె గురించి ఆదేశం ఏమిటి? ఈ హజ్ ఆమెకై పరిపూర్ణమవుతుందా? 

జ : ఆమె ఎప్పుడు నెలసరికి గురైందనేది తెలియకుండానే ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వటం అసాధ్యం. ఎందుకంటే హజ్ లో కొన్ని కార్యాలు వున్నాయి. వాటికి నెలసరి ఎలాంటి ఆటంకం కల్గించదు. మరి కొన్ని ఉన్నాయి వాటిని నెలసరిలో చేయకూడదు. కనుక ‘తవాఫ్’ పరిశుభ్రత లేనిదే అసాధ్యం (చేయరాదు). ఇది కాకుండా ఇతరత్రా హజ్ కార్యాలు ఋతుస్రావంలో ఉండి కూడా చేసుకోవచ్చు. 

ప్ర- 51 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది: ‘నేను గత సంవత్సరం హజ్ చేశాను. అయితే హజ్ కి సంబంధించి అన్ని కార్యాలు చేశాను. కాని ‘ధార్మిక ఆటంకం’ వల్ల “తవాఫ్ – ఇఫాజా”, “తవాఫె-విదాత్” చేయలేకపోయాను. ఆ తరువాత ఏదో ఒక రోజు మక్కాకు వచ్చి “తవాఫె-ఇఫాజా”, “తవాఫె-విదాత్” చేసుకోవాలనుకుని నా స్వస్థలం మదీనాకు తిరిగి వెళ్ళిపోయాను. దాని గురించి సరైన ధార్మిక అవగాహన లేనందువల్ల అన్నింటి నుండి ‘హలాల్’ కూడా అయిపోయాను. ‘ఇస్లామ్’ స్థితిలో ఏ ఏ విషయాలకు దూరంగా (‘హరాం’ అవుతాయో) ఉండాలో వాటికి దూరంగా ఉండలేదు. ఈ విషయమై (మక్కా తిరిగి రావటం, తవాఫ్  చేయటం గురించి)కొందరిని సంప్రదించినప్పుడు వారు ఇలా సమాధానమిచ్చారు: ‘మీరు చేసిన ‘తవాఫ్ ‘ సరైనది కాదు. ఎందుకంటే మీరు మీ ‘హజ్’ను వృధా చేసుకున్నారు. కనుక వచ్చే సంవత్సరము మరో సారి ‘హజ్’ చేయాలి. అంతే కాకుండా దానితో పాటు ఒక ఆవు, లేదా ఒక ఒంటే ఫిద్యహ్’ (పరిహారం)గా ‘జిబహ్’ చేయవలసి వుంటుంది’. సందేహం ఏమిటంటే పై ప్రస్తావించబడిన సమాధానం వ్యాధి సరైనదేనా? లేదా నా సమస్యకు వేరే పరిష్కారం ఏమైనా వుందా? నిజంగా నా ‘హజ్’ వృధాయిపోయిందా? నా పై రెండో సారి హజ్ చేయటం ‘వాజిబ్’ (తప్పని సరా)? ఇప్పుడు నేను ఏమి చేయాలో తెల్పండి. అల్లాహ్ మీకు శుభాలు కలుగ చేయుగాక.! 

జ :నేడు మన సమాజంలో ఇది కూడా ఒక సమస్యగా మారిపోయింది. ప్రజలు జ్ఞానం లేకుండా ‘ఫత్వా’ ఇస్తున్నారు. పై పేర్కొనబడిన విధంగానైతే మీరు మక్కా వెళ్ళి కేవలం ‘తవాఫ్-ఇఫాజా’ మాత్రం చేయటం వాజిబ్ (తప్పనిసరి) అవుతుంది. 

మక్కా నుండి బయలుదేరినప్పుడు మీరు నెలసరితో వున్నారు. కాబట్టి మీపై తవాఫ్-విదాత్ వాజిబ్ (తప్పనిసరి) కాదు. ఎందుకంటే ఋతుస్రావం గల స్త్రీ పై తవాఫ్-విదాత్ లేదు. 

హ॥ ఇబ్నె అబ్బాస్ (రజియల్లాహు అన్ను) ఉల్లేఖించిన ఒక హదీసులో ఇలా ఉంది : 

ప్రజలకు ఈ ఆజ్ఞ ఇవ్వబడింది ఏమంటే బైతుల్లా (కాబా గృహము) తవాఫ్(కాబా ప్రదక్షిణం) వారి చివరి కార్యం కావాలని, అయితే నెలసరిగల స్త్రీ నుండి అది తప్పించబడింది“. 

అబుదావూద్ హదీసు గ్రంథంలో ఇలా ఉల్లేఖించబడి వుంది: 

“బైతుల్లాహ్ లో ప్రజల (యాత్రికుల) చివరి కార్యం తవాఫ్  కావాలి”

హ॥ ‘సుఫియా’ (రజియల్లాహు అన్హా ) తవాఫె -ఇఫాజా చేసుకున్నారు (దాని తర్వాతే ఆమెకు నెలసరి ప్రారంభమైంది) అనే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిసినప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు : “అయితే బయలుదేరండి!” 

ఈ హదీసు ఆధారం ఏమంటే నెలసరి గల స్త్రీ పై ‘తవాఫె -విదాత్’ లేదు. కాని ‘తవాఫె -ఇఫాజా’ తప్పని సరి. 

ఇక మీరు అన్నింటి నుండి ‘హలాల్’ అయిపోయినదాని గురించి ఏమిటంటే ఇది (ధార్మిక జ్ఞానము లేనందున) తెలియనందున జరిగిన విషయం. కనుక ఇది మీకు ఎలాంటి నష్టం కల్గించదు. ఎందుకంటే ఎవరైనా తెలియకుండా ‘ఇహ్రాం’ స్థితిలో నివారించబడిన ఏదైన కార్యానికి పాల్పడితే దానికి ఎలాంటి పరిహారం లేదు. పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

رَبَّنَا لَا تُؤَاخِذْنَا إِنْ نَسِينَا أَوْ أَخْطَأْنَا 

“ ఓ మా ప్రభువా! మేము మరచిపోయినా, లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు”.(బఖరా 2:286) 

దాసుడు ఇలా అడిగినప్పుడు అల్లాహ్ దానిని అంగీకరించి సమాధానంగా ఇలా సెలవిచ్చాడు: 

وَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ فِيمَا أَخْطَأْتُمْ بِهِ وَلَكِنْ مَا تَعَمَّدَتْ قُلُوبُكُمْ 

“మరుపు వల్ల మీ చేత ఏదైన (తప్పు) జరిగిపోతే దాని పాపం మీపై ఉండదు. అయితే హృదయ పూర్వకంగా చేసిన పక్షంలో అది పాపమే“. (33: అల్ అహ్ జాబ్ :5) 

కనుక జాగ్రత్త పడవలసినవన్నీ దేనినైతే అల్లాహ్ మహ్రమ్ కై వారించాడో ఒకవేళ తెలియకుండా లేదా మరచిపోయి వాటిని చేస్తే లేదా మరో దారి లేని పరిస్థితిలో పాల్పడితే అలాంటి పరిస్థితుల్లో అతని పై ఎలాంటి దోషం లేదు. కానీ ఆ స్థితి మారిపోయినప్పుడు దాని నుండి దూరమవ్వట తప్పనిసరవుతుంది. 

ప్ర-52 : బాలింతదశకు చెందిన రక్తస్రావం గల స్త్రీకి ఒక వేళ ‘తర్వియహ్’ రోజు (జిల్ హిజ్జ 8వ తేది) రక్తస్రావం మొదలైయింది. కాని ఆమె ‘తవాఫ్’, ‘సయీ’ తప్ప ‘హజ్’కు సంబంధించిన అన్నీ పనులు పూర్తిచేసుకుంది. అయితే పది రోజుల తరువాత ఆమె తొలిదశగా పరిశుద్ధురాలైనట్లు భావించింది. అప్పుడు ఆమె స్వయంగా పరిశుద్ధురాలుగా నిర్ధారించుకుని మిగిలిన పనులు అంటే ‘తవాఫె ఇఫాజా’ చేసుకోవచ్చా? 

జ: పై పేర్కొనబడిన స్త్రీకి పరిశుద్ధతపై పూర్తిగా విశ్వాసము కలగనంత వరకు ఆమె స్నానము చేసి తవాఫ్  చేయరాదు. ఎందుకంటే ప్రశ్నలో ప్రస్తావించిన తీరులో ‘తొలిదశ’తో ఆమె ఇంకా పూర్తిగా పరిశుద్ధతకు నోచుకోలేదన్న విషయం వ్యక్తమవుతుంది. కనుక ఆమె పూర్తిగా పరిశుద్ధతను గ్రహించిన తరువాతే స్నానము చేసి ‘తవాఫ్’, ‘సయీ’ చేయాలి. ఒక వే ‘తవాఫ్ ‘ కంటే ముందు ‘సయీ’ చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ‘హజ్జతుల్-వదాత్’ సందర్భములో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ‘ఎవరైన ముందు ‘సయీ’ చేసుకుంటే? అని సంప్రదించినప్పుడు .. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఎలాంటి దోషం లేదు” అని సమాధానమిచ్చారు. 

ప్ర- 53 : ఒక స్త్రీ నెలసరి స్థితిలో “సైల్” ప్రదేశం నుండి హజ్ ‘ఇహ్రాం” కట్టుకుంది. మక్కా వెళ్ళిన తరువాత ఏదో అవసరం పై ‘జిద్దాహ్’ ‘వెళ్ళింది. ‘జిద్దాహ్’ లోనే నెలసరి నుండి పరిశుద్దురాలైంది. స్నానం చేసి తలదువ్వుకుని తరువాత తన ‘హజ్’ను పూర్తిచేసుకుంది. అయితే ఆమె ‘హజ్’ సరైనదేనా? ఆమెపై ఇంకేమైన బాధ్యత వుంటుందా? 

జ : పై ప్రస్తావించబడిన స్త్రీ ‘హజ్’ సరైనదే. ఆమె పై ఎలాంటి బాధ్యత లేదు. 

ప్ర – 54 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది: ‘నేను ఉమ్రాహ్ చేయటానికి బయలుదేరాను. ‘మీఖాత్’ చేరుకున్నప్పుడు నేను నెలసరితో వున్నాను కనుక నేను ‘ఇహ్రామ్’ కట్టుకోలేదు. పరిశుద్ధురాలైనంత వరకు మక్కాలోనే ఉన్నాను. తరువాత మక్కానుండి ‘ఇహ్రామ్’ కట్టుకున్నాను. అయితే ఇది సరైనదేనా? నా పై ఏమి వాజిబ్ వుంది? 

జ : పై పేర్కొనబడిన పద్ధతి సరైనది కాదు. ఏ స్త్రీ అయితే ఉమ్రాహ్ సంకల్పం కలిగివుందో ఆమెకు ‘ఇహ్రామ్’ లేకుండా ‘మీఖాత్’ నుండి ముందుకు వెళ్ళటం సరైనది కాదు. ఒకవేళ ఆమె నెలసరితో వున్నా సరే. నెలసరి స్థితిలోనే ఆమె ‘ఇహ్రామ్’ కట్టుకోవాలి. ఆమె కట్టుకునే ఈ ఇహ్రామ్ సరైనదే. 

దీనికి ఆధారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘హజ్జతుల్-వదా (అంతిమ హజ్) సంకల్పంతో ‘జుల్ హులైఫా’ ప్రాంతములో వున్నప్పుడు హ॥ అబూ-బక్ర్ సిద్దీఖ్ (రజియల్లాహు అన్హు) సతీమణి ‘అస్మా బిన్తె ఉమైస్’ (రజియల్లాహు అన్హా) కు ఒక శిశువు జన్మించింది. అప్పుడు ‘అస్మా’ (రజియల్లాహు అన్హా) ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియపరచి ఈ పరిస్థితిలో తాను ఏమి చేయాలి? అని కబురు పంపారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు : 

“స్నానం చేసి (యోనిపై) గుడ్డ కట్టుకోవాలి. తరువాత ‘ఇహ్రామ్’ వేసుకోవాలి”. 

నెలసరి రక్తం కూడ రక్తస్రావం (బాలింతదశ) ఆదేశాల పరిధిలోనే వస్తుంది. కనుక నెలసరిగల స్త్రీకి మా సూచనేమిటంటే ‘ఆమె ‘హజ్’ లేదా ‘ఉమ్రాహ్’ సంకల్పముతో ‘మీఖాత్’ ప్రదేశము నుండి వెళ్ళినప్పుడు స్నానము చేసి యోని పై గుడ్డ కట్టుకోవాలి. తరువాత ‘హజ్’ లేదా ‘ఉమ్రాహ్’ ‘ఇహ్రామ్’ కట్టుకోవాలి. కాకపోతే ‘ఇహ్రామ్’ కట్టుకొని పవిత్ర మక్కా చేరుకున్న తరువాత పరిశుద్ధురాలైనంత వరకు ‘మస్జిదే-హరామ్’లో ప్రవేశించ కూడదు. కాబా గృహానికి ప్రదక్షిణం చేయరాదు. ఎందుకంటే హ॥ ఆయిషా (రజియల్లాహు అన్హా)కు ‘ఉమ్రాహ్’  మధ్యలోనే ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు (నెలసరి వచ్చినప్పుడు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు  ఇలా సూచించారు: 

హాజీలు చేసినట్టే నీవు కూడ చేయ్యి. కాకపోతే పరిశుద్ధురాలైనంత వరకు కాబా గృహాన్ని ‘తవాఫ్ ‘ చేయకు”. (సహీహ్ బుఖారి, సహీహ్ ముస్లిం) 

‘సహీహ్ బుఖారి’లోని మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది : హ॥ ఆయిషా (రజియల్లాహు అన్హా ) ఇలా తెలిపారు : 

“ఆమె పరిశుద్ధు రాలైనప్పుడు కాబా గృహానికి ప్రదక్షిణం చేశారు. ‘సఫా-మర్వా’ మధ్య ‘సయీ’ కూడా చేశారు”. 

పై ఉల్లేఖనాల ద్వారా తెలిసేదేమిటంటే స్త్రీ నెలసరి కాలంలోనే ‘హజ్’ లేదా ‘ఉమ్రాహ్’ ‘ఇహ్రామ్ కట్టుకోవాలి. లేదా ‘తవాఫ్ ‘ చేయటానికి ముందే నెలసరి ప్రారంభమైనప్పుడు పరిశుద్ధురాలై స్నానం చేయనంత వరకు ‘తవాఫ్ ‘ మరి ‘సయీ’ చేయకూడదు. ఒకవేళ ఆమె పరిశుద్ధ స్థితిలో ‘తవాఫ్ ‘ చేసింది, దాని తరువాత ఆమెకు నెలసరి ప్రారంభమైనప్పుడు ఆమె అదే పరిస్థితిలో తన ‘ఉమ్రహ్ ను పూర్తిచేస్తుంది. ‘సయీ’ చేస్తుంది, తల వెంట్రుకలు కత్రిస్తుంది. ఎందుకంటే సఫా’, ‘మర్వా’ మధ్య ‘సయీ చేయటానికి పరిశుభ్రత అనే షరతు విధించబడలేదు. 

ప్ర – 55: ఒకరు ఇలా ప్రశ్నిస్తున్నారు: ‘నేను నా భార్యతో ‘యమ్ బ’ పట్టణం నుండి ‘ఉమ్రహ్’ కొరకు వచ్చాను. జిద్దాహ్  చేరుకున్నప్పుడు నా భార్యకు ఋతుస్రావం మొదలైంది. కనుక నేను ఒకణ్ణి ‘ఉమ్రహ్’ చేసుకున్నాను. అయితే ఇప్పుడు నా భార్యకు ఎలాంటి ఆదేశాలు వుంటాయి? 

జ: ఇలాంటి పరిస్థితిల్లో మీ భార్య సమస్యకు పరిష్కారం ఏమిటంటే ఆమె పరిశుద్ధురాలైనంత వరకు నిరీక్షించి ఆ తరువాత తన ‘ఉమ్రహ్’ పూర్తి చేయాలి. ఎందుకంటే విశ్వాసులు మాతృమూర్తి హ॥ సఫియ (రదియల్లాహు అన్హా) కు నెలసరి మొదలైనప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి సల్లం) ఇలా అన్నారు: “ఏమిటి మాకు ఈమె ప్రయాణం నుండి ఆపేస్తుందా?” ప్రజలు ఇలా అన్నారు : ఓ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమె ‘తవాఫె -ఇఫాజా’ అయితే చేసుకున్నది. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “అయితె బయలుదేరుదాం“. 

పై హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన “ఏమిటి మాకు ఈమె ప్రయాణం నుండి ఆపేస్తుందా?” మాట ఆధారంగా స్త్రీకి ఒకవేళ ‘తవాఫె -ఇఫాజా’ కంటే ముందు నెలసరి వస్తే ఆమె పరిశుద్ధురాలైనంత వరకు నిరీక్షించి దాని తరువాత ‘తవ్వా ఫె-ఇఫాజా చేయటం తప్పనిసరి ‘వాజిబ్’గా గుర్తించబడుతుంది. 

అలాగే ‘తవాఫె-ఉమ్రహ్’ కూడ ”తవాఫె-ఇఫాజా’ ఆదేశంలోనే వుంది. ఎందుకంటే అది ”ఉమ్రహ్ ‘కు మూల సూత్రం. కనుక ‘ఉమ్రహ్’ చేయదలుచుకునే స్త్రీ ఒకవేళ ‘తవాఫె-ఉమ్రహ్’ కంటే ముందే నెలసరికి గురైతే పరిశుద్ధత కలిగేవరకు నిరీక్షించి దాని తరువాత ‘తవాఫ్ ‘ చేయాలి. 

ప్ర – 56 : ‘మస్ఆ’ (సయీ చేసే ప్రాంతం) ‘హరం’ (కాబా చుట్టుప్రక్కల కొంత భాగాన్ని అల్లాహ్ పవిత్ర స్థలంగా నిర్దేశించాడు. అందులో ఎలాంటి రక్తపాతాలు, అపవిత్ర కలాపాలకు పాల్పడరాదు. దానిని ‘హరం’ అంటారు) లో భాగమేనా? నెలసరిగల స్త్రీ ‘మస్ఆ’లో ప్రవేశించ గలుగుతుందా? ‘మస్ఆ’ నుండి ‘హరం’లో ప్రవేశించటానికి ‘తహియ్యతుల్ మస్జిద్’ (మసీదులో ప్రవేశించగానే చదివే నమాజు చదువుట ‘వాజిబా’ (తప్పనిసరా)? 

జ: అందరికీ సుపరిచితమైన విషయం ఏమిటంటే ‘మస్ఆ’ (సయీ చేసే ప్రాంతం) ‘హరం’లో భాగం కాదు. ఈ కారణంతోనే దానికి ‘మస్జిదె హరాం’కి మధ్య ఒక చిన్న గోడ నిర్మించబడింది. మస్ఆ ‘హరం’ వెలుపల వుండటమే ప్రజలకు మేలు అని భావించడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒకవేళ దీన్ని ‘హరం’లో భాగమేనని నిర్ధారిస్తే అప్పుడు ‘తవాఫ్ ‘, ‘సయీ’ చేస్తున్న సమయంలో నెలసరికి గురైయ్యే స్త్రీని కూడా ‘సయీ’ చేయకుండా వారించడం జరిగేది. 

ఈ విషయంలో నా అభిప్రాయం (‘ఫత్వా’) ఏమిటంటే ఒకవేళ స్త్రీ ‘తవాఫ్ ‘ చేసుకున్న తరువాత ‘సయీ’ చేయటానికి ముందు నెలసరికి గురైతే అప్పుడు ఆమె అదే స్థితిలో ‘సయీ’ చేయవచ్చు. ఎందుకంటే ‘మస్ ఆ’ (సయీ చేసే ప్రాంతం) ‘హరం’తో వేరుగా వుంది. 

ఇక ‘తహియ్యతుల్-మస్జిద్’ విషయానికి వస్తే.. ఎవరైన ‘తవాఫ్ ‘ చేసిన తరువాత ‘సయీ’ చేసి, మళ్ళీ ‘మస్జిద్ హరాం’లో రావాలనుకున్నప్పుడు అతనికి  ‘తహియ్యతుల్ మస్జిద్’ చదవవలసి వుంటుంది. ఒకవేళ చదవక పోయినా పర్వాలేదు. కాని అల్లాహ్ ప్రసాదించిన ఈ మహత్తర అవకాశాన్ని వినియోగించుకుంటూ, అక్కడ నమాజు చేయుటలో ఉన్న గొప్పతనాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు రకాతుల (తహయ్యతుల్ మస్జిద్) చదువుకోవడమే ఉత్తమమైన కార్యం. 

ప్ర – 57 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది : నేను హజ్ చేశాను. హజ్ లో ఉన్నప్పుడే ఋతుస్రావం ప్రారంభమైంది. సిగ్గు, బిడియం కారణంగా ఎవరికీ చెప్పలేకపోయాను. అదే పరిస్థితిలో ‘హరం’లో కూడ ప్రవేశించాను, నమాజు చదివాను, ‘తవాఫ్ ‘, ‘సయీ’ కూడా చేశాను. అయితే ఇప్పుడు నేను ఏమిచేయాలి? ఒకమాట ఏమిటంటే (బాలింత దశ ) రక్తస్రావం తరువాత నెలసరి వచ్చింది.? 

జ : నెలసరి, రక్తస్రావంగల స్త్రీ నమాజు ఆ స్థితిలో చేయరాదు. అది మక్కాలో నైనా స్వగ్రామంలో నైనా, మరెక్కడైనా సరే. ఎందుకంటే మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్త్రీ గురించి ఇలా అన్నారు: “ఏమిటి ఇలా లేదా (వాస్తవం కాదా)? ఏమంటే స్త్రీ నెలసరితో వున్నప్పుడు నమాజు చదవదు మరి ఉపవాసం పాటించదు.” 

యావత్తు ముస్లిములు ఏకీభవించేది ఏమిటంటే నెలసరి గల స్త్రీ నమాజు చదవకూడదు, ఉపవాసం వుండకూడదు. కనుక పై పేర్కొనబడిన స్త్రీ అల్లాహ్ క్షమాపణ కోరుతూ తనతో జరిగిన ఈ తప్పుకి పశ్చాతాపపడాలి. 

ఇక ఈ స్థితిలో ‘తవాఫ్ ‘ చేసే విషయమైతే ఇలా తవాఫ్  చేయుట కూడా సరికాదు. కాని ‘సయీ’ చేయవచ్చు. ఎందుకంటే ఈ విషయంలో ప్రఖ్యాత అభిప్రాయం ఏమిటంటే ‘హజ్’ సందర్భములో తవాఫ్  కంటే ముందు’సయీ’ చేసుకోవచ్చు. కనుక ఆమె రెండోసారి ‘తవాఫ్ ‘ చేయవలసి వుంటుంది. ఎందుకంటే ‘తవాఫ్-ఇఫాజా’ ‘హజ్’ మూల సూత్రాల్లో ఒకటి. అది లేకుండా ‘హలాల్’ కాలేరు (సమ్మత్వాన్ని పొందలేరు). అందుకని ఆ ఒకవేళ వివాహిత అయితే ‘తవాఫ్ ‘ చేయనంత వరకు తన భర్తతో లైంగికంగా దగ్గరకాకూడదు. ఒకవేళ అవివాహితురాలైతే ‘తవాఫ్ ‘ చేయనంత వరకు ‘నికాహ్’ (వివాహం చేసుకోకూడదు. 

ప్ర – 58: స్త్రీకి ‘అరఫహ్’ రోజున ఋతుస్రావం మొదలైతే ఏమిచేయాలి? 

జ: స్త్రీకి ‘అరఫహ్’ రోజున ఋతుస్రావం మొదలైతే ఇతర హాజీల్లా ఆమె కూడ హజ్జ్ లోని  కార్యాలన్ని పూర్తి చేయాలి. కాకపోతే ‘బైతుల్లాహ్’ (కాబాగృహం) తవాఫ్ ‘ చేయరాదు. పరిశుద్ధులయ్యేంత వరకు నిరీక్షించి, పరిశుద్ధులైన తరువాత ‘బైతుల్లాహ్ ‘ (కాబా గృహం) ‘తవాఫ్  చేయాలి. 

ప్ర – 59: ఒకవేళ స్త్రీ ‘జమరయె-ఉఖ్బహ్’ పై రాళ్ళు రవ్వినంతరం – ‘తవాఫ్-ఇఫాజా’ కంటే ముందు ఋతుస్రావానికి గురైంది. ఆమె, ఆ ఒక బృందముతో కలిసి ఉన్నారు. ఆమె ప్రయాణం తరువాత తిరిగి మక్కాకు రావటం కష్టం లేక అసాధ్యం. అప్పుడు ఆమె ఏమిచేయాలి? 

జ: పై ప్రస్తావించబడిన స్త్రీ మళ్ళీ ‘మక్కా’కు రావటం అసాధ్యమైనప్పుడు అవసర నిమిత్తం ఆమె తన యోనిపై గుడ్డ కట్టుకుని ‘తవాఫ్’ చేసుకోవాలి. అలాగే మిగితా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితిలో ఆమెపై ఎటువంటి పరిహారం వాజిబ్ కాదు. 

ప్ర – 60 : రక్తస్రావం గల స్త్రీ ఒకవేళ 40 రోజులకు ముందే పరిశుద్ధురాలైతే ఆమె ‘హజ్’ సరైనదేనా? ఒక వేళ పరిశుద్ధతను గ్రహించకపోతే ఏమిచేయాలి? గమనించవలసిన విషయం ఏమంటే ఆమె ‘హజ్’కై సంకల్పం చేసి వుంది? 

జ : రక్తస్రావం గల స్త్రీ ఒకవేళ 40 రోజులకు ముందే పరిశుద్దురాలైనప్పుడు స్నానముచేసి నమాజు చదువుకోవాలి. పరిశుద్ధ స్త్రీలు చేసే కార్యాలన్నీ చేయాలి. చివరికి ‘బైతుల్లాహ్’ (కాబాగృహం) ‘తవాఫ్ ‘ కూడ చేయాలి. ఎందుకంటే రక్తస్రావం కనీస కాలానికి ఎలాంటి పరిమితం లేదు. సంకల్పం సరైనదే. కాకపోతే పరిశుద్ధురాలైనంత వరకు ఆమె ‘బైతుల్లాహ్’ పై పేర్కొనబడిన స్త్రీ పరిశుద్ధతను చూడనప్పుడు ఆమె ‘హజ్’ (కాబా గృహం) ‘తవాఫ్’ చేయకూడదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఋతుస్రావంలో గల స్త్రీని బైతుల్లాహ్ (కాబాగృహం) తవాఫ్ ‘ నుండి వారించారు. 

ఈ విషయంలో రక్తస్రావం గల స్త్రీ కూడ నెలసరి గల స్త్రీ ఆదేశంలోనే వుంటుంది

నోట్స్:

  • ఇహ్రామ్ : కాబా దర్శనానికి వెళ్ళేటప్పుడు కట్టుకునే ప్రత్యేక వస్త్రాలు. కానీ స్త్రీలకు ప్రత్యేక వస్త్రాలంటు లేవు. కేవలం పరిమిత కాలంలో తమకు తాముగా ధర్మపరమైన నిబంధనలకు లోబడి ఉండాలి
  • మీఖాత్: పవిత్రం కాబా గృహానికి చుట్టూ నిర్ణయించబడిన పరిధిలో ప్రవేశించడానికి కేటాయించ బడిన పవిత్ర స్థలము ‘హరం’
  • ‘తహియ్యతుల్-మస్జిద్‘ : మసీదులో ప్రవేశించినప్పుడు, మసీదును దర్శించినప్పుడు పాటించ వలసిన రెండు రకాతులను అంటారు. 
  • మస్జిదే హరాం : కాబా చుట్టు నిర్మించబడి వున్న మసీదు. దీనిలో ఒక నమాజు లక్ష నమాజుల పుణ్యంతో సమానం.
  • తవాఫ్  : పవిత్ర ‘కాబా’ గృహానికి ప్రదక్షిణ చేయడం. 
  • తవాఫ్ – ఇఫాజా: ‘జిల్-హిజ్జహ్’ పదో తేది రోజు చేసే ‘కాబా’ ప్రదక్షణం 
  • ఖస్ర్ : తలవెంట్రుకలు కొద్దిగా కత్రించుట. 
  • సయీ : సఫా, మర్వా అనే కొండప్రాంతాల నడుమ వేగంగా నడవడానిని అంటారు. ఇది హజ్, ఉమ్రాహ్ మూలాల్లో ఒకటి. 
  • మహ్రమ్: ఆమెతో వివాహానికి ఆస్కారం లేని వ్యక్తి ఉదాహరణకు : తండ్రి, కుమారుడు, సోదరుడు, మావయ్య లాంటి వారు

బహిష్టు స్త్రీలకు సంబంధించిన హజ్, ఉమ్రాహ్ ఆదేశాలు – షేక్ ఇబ్న్ ఉసైమీన్

పుస్తకం నుండి: ఋతుకాలం – సందేహాలు & సమాధానాలు
మూల రచయిత (అరబీ): షేఖ్ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్ ఉసైమీన్ (రహిమహుల్లాహ్)
తెలుగు అనువాదం: హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి హఫిజహుల్లాహ్

మర్కజ్ దారుల్ బిర్ర్ పబ్లికేషన్స్

ప్ర-47: బహిష్టు స్త్రీ ‘ఇహ్రామ్’ కట్టుకున్న తరువాత రెండు రకాతులు నమాజు ఎలా చదవాలి? బహిష్టు స్త్రీ మెల్లగా ఖుర్ఆన్ ఆయతుల పారాయణం చేయవచ్చా? 

జ : ముందు మనం రెండు విషయాలు తెలుసుకుందాం. 

ఒకటి: ‘ఇహ్రామ్’ కు సంబంధించి ప్రత్యేక నమాజ్ అంటూ లేదు. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ కు ప్రత్యేక ‘ఇహ్రామ్’ నమాజు గురించి ఆదేశంగా లేక చేసినట్లు లేక దృవీకరించినట్లు ఆధారాలు లేవు. 

రెండు: ఏ స్త్రీ అయితే ఇహ్రం కట్టుకోవటానికి ముందే ఋతుస్రావానికి గురువుతుందో ఆమె అదే స్థితిలో ‘ఇహ్రామ్’ కట్టుకోవచ్చు. 

హ॥ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) సతీమణి అస్మా బిన్తె ఉమైస్ (రజియల్లాహు అన్హా) మక్కా మార్గంలో ‘జుల్ హులైఫా’ ప్రదేశంలో రక్తస్రావానికి గురైయ్యారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెని “స్నానం చేసి తన యోనిపై గుడ్డ కట్టుకుని ‘ఇహ్రామ్’ కట్టుకోవాలని” ఆదేశించారు. 

అయితే ఋతుస్రావంగల స్త్రీకి కూడా ఆదేశం ఇదే. ఇక వారు పరిశుభ్రమయ్యేంత వరకు ‘ఇహ్రామ్’ నిబంధనల్లోనే ఉండాలి. పరిశుద్ధులైన తరువాత కాబా గృహాన్ని (తవాఫ్ చేయాలి) దర్శించాలి. అలాగే ‘సఫా’, ‘మర్వా’ నడుమ ‘సయీ’ (వేగంగా నడవటం) చేయాలి. 

ఇక ఋతుస్రావంగల స్త్రీ ఖుర్ఆన్ పారాయణం చేయవచ్చా..? అనే ప్రశ్నకు సమాధానం ఏమిటంటే అవసరం మేరకు, ముఖ్య కారణంతో పారాయణం చేయవచ్చు. కానీ కేవలం అల్లాహ్ ఆరాధన నిమిత్తం లేక అల్లాహ్ సన్నిధిలో పుణ్యాలు పొందటానికైతే ఆ స్థితిలో చదవకపోవటమే మంచిది. 

గమనిక: అవసరం మేరకు, ముఖ్యకారణం అంటే పిల్లలకు బోధించేటప్పుడు, ఎవరైన చదువుతుంటే తప్పులు దిద్దటం, అలాగే రోజువారి ఖుర్ఆన్ ఆయతులు వస్తే దుఆ పరంగా చదవటంలో ఎలాంటి దోషం లేదు. 

ప్ర-48 : ఒక స్త్రీ హజ్ కొరకు ప్రయాణించింది. ప్రయాణంలో 5వ రోజు ఆమె ఋతుస్రావానికి గురైంది. ‘మీఖాత్’ వద్దకు చేరి ఆమె స్నానం చేసి ‘ఇహ్రామ్’ కట్టుకుంది. ఆమె ఇంకా ఋతుస్రావ స్థితి నుండి పరిశుద్దురాలు కాలేదు. మక్కా చేరుకున్న తరువాత ఆమె ‘హరం” బయటే నిలిచింది (వెలుపలే ఆగింది). ‘హజ్’, ‘ఉమ్రాహ్’కు సంబంధించి ఆమె ఏ ఒక్క పని కూడ చేయలేదు. రెండు రోజులు ఆమె “మినా” (ప్రదేశం)లో కూడ గడిపింది. తరువాత ఆమె నెలసరి నుండి పరిశుద్ధురాలై స్నానం చేసింది. పరిశుద్ధ స్థితిలో ‘ఉమ్రాహ్ ‘కు సంబంధించి అన్ని కార్యాలు, నియమాలు పూర్తి చేసింది. దాని తరువాత మళ్ళీ ఆమె ‘హజ్’ కొరకు ‘తవాఫ్ – ఇఫాజా’ చేస్తుండగా ఆమెకు మళ్ళీ రక్తస్రావం జరిగింది. సిగ్గుతో ఆమె తమ సంరక్షకులకు చెప్పలేదు. అదే స్థితిలో హజ్ విధానాలను పూర్తిచేసి, స్వస్థలానికి చేరుకున్న తరువాత ఆ విషయాన్ని తన సంరక్షకులకు తెలియపరిచింది. అయితే ఇప్పుడు ఆమెకు ఎలాంటి ఆదేశం వర్తిస్తుంది?

జ: పై పేర్కొన్న సమస్యకి పరిష్కారం ఏమిటంటే ఆమె తవాఫె – ఇఫాజా’ (తవాఫ్) చేస్తుండగా వచ్చిన రక్తం ఒకవేళ నెలసరి రక్తమైతే (దాన్ని ఆమె రక్తపు స్థితి, బాధతో పసిగట్టగలుగుతుంది) అప్పుడు ఆమె చేసిన ‘తవాఫె  ఇఫాజా’ సరైనది కాదు. ఆమె తప్పకుండా మరలా మక్కా వెళ్ళి ‘తవాఫె-ఇఫాజా’ పూర్తి చేయాలి. ‘మీఖాత్’ నుండి ‘ఉమ్రాహ్’ ‘ఇహ్రాం’ కట్టి ‘తవాఫ్ ‘, ‘సయీ’తో సహా ‘ఉమ్రాహ్’ చేయాలి. ‘ఖస్ర్ ‘ చేసి దాని తరువాత ‘తవాఫె  ఇఫాజా’ చేయాలి.

అయితే ఒక వేళ ‘తవాఫె-ఇఫాజా’ చేస్తున్న మధ్యలో వచ్చే రక్తం సహజంగా నెలసరిది కాకుండా జన ప్రవాహం కారణంగా లేదా భయం కారణంగా లేదా మరే కారణంగా ఉన్నప్పుడు ఆమె ‘తవాఫె  – ఇఫాజా’ ‘తవాఫ్ ‘కు పరిశుద్ధత షరతుగా భావించని వారి పద్ధతి ప్రకారం సరైనదే. 

మొదటి విషయంలో : ఆమెకు రెండో సారి మక్కా రావటం అసాధ్యమైనప్పుడు, అంటే ఇతర దేశస్థురాలైనప్పుడు ఆమె ‘హజ్’ సరైనదె. ఎందుకంటే ఆమె ఏదైతే చేసిందో అంతకు మించి చేసే శక్తి, అవకాశం ఆమెకు లేదు. 

ప్ర-49 : ఒక స్త్రీ ఉమ్రాహ్ ఇహ్రాం కట్టుకుంది. ‘మక్కా’ చేరే సరికి ఆమెకు నెలసరి మొదలైంది. ఆమెతో పాటు వున్న ‘మహ్రమ్’ కి వెంటనే తిరుగు ప్రయాణం చేయవలసి వుంది. అక్కడ కొన్ని రోజులు ఉండే సౌకర్యం లేదు. పైగా ఆమె అక్కడ ఉండటానికి మక్కా నగరంలో ఆమెకు బంధువు లెవరూ లేరు. ఇలాంటి సందర్భంలో ఆమె ఏమి చేయాలి? 

జ.) పై పేర్కొనబడిన స్త్రీ ఒక వేళ అదే ప్రాంతానికి (సౌది అరేబియా) కి చెందినదైతే ఆమె తన ‘మహ్రమ్ ‘ (సంరక్షకుడి) తో తిరిగి వెళ్ళిపోవాలి. ‘ఇహ్రాం’ స్థితిలోనే వుండి, పరిశుద్ధురాలైన తరువాత రెండవ సారి మక్కా నగరానికి రావాలి. ఎందుకంటే ఆమెకు రెండవ సారి రావటం సులువైనదే. ఇందులో ఆమెకు ఎలాంటి అడ్డంకులు లేవు. పాస్పోర్టు కూడ అవసరంలేదు. 

కాని ఒకవేళ ఇతర దేశాల నుండి వచ్చివున్నవారైతే ఆమెకు రెండోసారి ప్రయాణం కష్టమైనప్పుడు ఆమె గుడ్డ కట్టుకోవాలి. మరి ‘తవాఫ్ , సయీ’ చేసి ‘ఖస్ర్’ చేసుకొని అదే ప్రయాణంలో తన ‘ఉమ్రాహ్’ పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ‘తవాఫ్’ చేయుట ఒక అత్యవసరమైన ఆదేశంగా భావించబడుతుంది. కనుక అవసరాన్ని బట్టి కొన్ని నిషేధిత అంశాలు కూడా ‘ముబాహ్’ (అనివార్యం) గా పరిగణించ బడతాయి. 

ప్ర – 50 :ఒక స్త్రీకి నిర్దేశించబడిన హజ్ రోజుల్లో నెలసరి ప్రారంభమైంది. ఆమె గురించి ఆదేశం ఏమిటి? ఈ హజ్ ఆమెకై పరిపూర్ణమవుతుందా? 

జ : ఆమె ఎప్పుడు నెలసరికి గురైందనేది తెలియకుండానే ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వటం అసాధ్యం. ఎందుకంటే హజ్ లో కొన్ని కార్యాలు వున్నాయి. వాటికి నెలసరి ఎలాంటి ఆటంకం కల్గించదు. మరి కొన్ని ఉన్నాయి వాటిని నెలసరిలో చేయకూడదు. కనుక ‘తవాఫ్’ పరిశుభ్రత లేనిదే అసాధ్యం (చేయరాదు). ఇది కాకుండా ఇతరత్రా హజ్ కార్యాలు ఋతుస్రావంలో ఉండి కూడా చేసుకోవచ్చు. 

ప్ర- 51 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది: ‘నేను గత సంవత్సరం హజ్ చేశాను. అయితే హజ్ కి సంబంధించి అన్ని కార్యాలు చేశాను. కాని ‘ధార్మిక ఆటంకం’ వల్ల “తవాఫ్ – ఇఫాజా”, “తవాఫె-విదాత్” చేయలేకపోయాను. ఆ తరువాత ఏదో ఒక రోజు మక్కాకు వచ్చి “తవాఫె-ఇఫాజా”, “తవాఫె-విదాత్” చేసుకోవాలనుకుని నా స్వస్థలం మదీనాకు తిరిగి వెళ్ళిపోయాను. దాని గురించి సరైన ధార్మిక అవగాహన లేనందువల్ల అన్నింటి నుండి ‘హలాల్’ కూడా అయిపోయాను. ‘ఇస్లామ్’ స్థితిలో ఏ ఏ విషయాలకు దూరంగా (‘హరాం’ అవుతాయో) ఉండాలో వాటికి దూరంగా ఉండలేదు. ఈ విషయమై (మక్కా తిరిగి రావటం, తవాఫ్  చేయటం గురించి)కొందరిని సంప్రదించినప్పుడు వారు ఇలా సమాధానమిచ్చారు: ‘మీరు చేసిన ‘తవాఫ్ ‘ సరైనది కాదు. ఎందుకంటే మీరు మీ ‘హజ్’ను వృధా చేసుకున్నారు. కనుక వచ్చే సంవత్సరము మరో సారి ‘హజ్’ చేయాలి. అంతే కాకుండా దానితో పాటు ఒక ఆవు, లేదా ఒక ఒంటే ఫిద్యహ్’ (పరిహారం)గా ‘జిబహ్’ చేయవలసి వుంటుంది’. సందేహం ఏమిటంటే పై ప్రస్తావించబడిన సమాధానం వ్యాధి సరైనదేనా? లేదా నా సమస్యకు వేరే పరిష్కారం ఏమైనా వుందా? నిజంగా నా ‘హజ్’ వృధాయిపోయిందా? నా పై రెండో సారి హజ్ చేయటం ‘వాజిబ్’ (తప్పని సరా)? ఇప్పుడు నేను ఏమి చేయాలో తెల్పండి. అల్లాహ్ మీకు శుభాలు కలుగ చేయుగాక.! 

జ :నేడు మన సమాజంలో ఇది కూడా ఒక సమస్యగా మారిపోయింది. ప్రజలు జ్ఞానం లేకుండా ‘ఫత్వా’ ఇస్తున్నారు. పై పేర్కొనబడిన విధంగానైతే మీరు మక్కా వెళ్ళి కేవలం ‘తవాఫ్-ఇఫాజా’ మాత్రం చేయటం వాజిబ్ (తప్పనిసరి) అవుతుంది. 

మక్కా నుండి బయలుదేరినప్పుడు మీరు నెలసరితో వున్నారు. కాబట్టి మీపై తవాఫ్-విదాత్ వాజిబ్ (తప్పనిసరి) కాదు. ఎందుకంటే ఋతుస్రావం గల స్త్రీ పై తవాఫ్-విదాత్ లేదు. 

హ॥ ఇబ్నె అబ్బాస్ (రజియల్లాహు అన్ను) ఉల్లేఖించిన ఒక హదీసులో ఇలా ఉంది : 

ప్రజలకు ఈ ఆజ్ఞ ఇవ్వబడింది ఏమంటే బైతుల్లా (కాబా గృహము) తవాఫ్(కాబా ప్రదక్షిణం) వారి చివరి కార్యం కావాలని, అయితే నెలసరిగల స్త్రీ నుండి అది తప్పించబడింది“. 

అబుదావూద్ హదీసు గ్రంథంలో ఇలా ఉల్లేఖించబడి వుంది: 

“బైతుల్లాహ్ లో ప్రజల (యాత్రికుల) చివరి కార్యం తవాఫ్  కావాలి”

హ॥ ‘సుఫియా’ (రజియల్లాహు అన్హా ) తవాఫె -ఇఫాజా చేసుకున్నారు (దాని తర్వాతే ఆమెకు నెలసరి ప్రారంభమైంది) అనే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిసినప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు : “అయితే బయలుదేరండి!” 

ఈ హదీసు ఆధారం ఏమంటే నెలసరి గల స్త్రీ పై ‘తవాఫె -విదాత్’ లేదు. కాని ‘తవాఫె -ఇఫాజా’ తప్పని సరి. 

ఇక మీరు అన్నింటి నుండి ‘హలాల్’ అయిపోయినదాని గురించి ఏమిటంటే ఇది (ధార్మిక జ్ఞానము లేనందున) తెలియనందున జరిగిన విషయం. కనుక ఇది మీకు ఎలాంటి నష్టం కల్గించదు. ఎందుకంటే ఎవరైనా తెలియకుండా ‘ఇహ్రాం’ స్థితిలో నివారించబడిన ఏదైన కార్యానికి పాల్పడితే దానికి ఎలాంటి పరిహారం లేదు. పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

رَبَّنَا لَا تُؤَاخِذْنَا إِنْ نَسِينَا أَوْ أَخْطَأْنَا 

“ ఓ మా ప్రభువా! మేము మరచిపోయినా, లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు”.(బఖరా 2:286) 

దాసుడు ఇలా అడిగినప్పుడు అల్లాహ్ దానిని అంగీకరించి సమాధానంగా ఇలా సెలవిచ్చాడు: 

وَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ فِيمَا أَخْطَأْتُمْ بِهِ وَلَكِنْ مَا تَعَمَّدَتْ قُلُوبُكُمْ 

“మరుపు వల్ల మీ చేత ఏదైన (తప్పు) జరిగిపోతే దాని పాపం మీపై ఉండదు. అయితే హృదయ పూర్వకంగా చేసిన పక్షంలో అది పాపమే“. (33: అల్ అహ్ జాబ్ :5) 

కనుక జాగ్రత్త పడవలసినవన్నీ దేనినైతే అల్లాహ్ మహ్రమ్ కై వారించాడో ఒకవేళ తెలియకుండా లేదా మరచిపోయి వాటిని చేస్తే లేదా మరో దారి లేని పరిస్థితిలో పాల్పడితే అలాంటి పరిస్థితుల్లో అతని పై ఎలాంటి దోషం లేదు. కానీ ఆ స్థితి మారిపోయినప్పుడు దాని నుండి దూరమవ్వట తప్పనిసరవుతుంది. 

ప్ర-52 : బాలింతదశకు చెందిన రక్తస్రావం గల స్త్రీకి ఒక వేళ ‘తర్వియహ్’ రోజు (జిల్ హిజ్జ 8వ తేది) రక్తస్రావం మొదలైయింది. కాని ఆమె ‘తవాఫ్’, ‘సయీ’ తప్ప ‘హజ్’కు సంబంధించిన అన్నీ పనులు పూర్తిచేసుకుంది. అయితే పది రోజుల తరువాత ఆమె తొలిదశగా పరిశుద్ధురాలైనట్లు భావించింది. అప్పుడు ఆమె స్వయంగా పరిశుద్ధురాలుగా నిర్ధారించుకుని మిగిలిన పనులు అంటే ‘తవాఫె ఇఫాజా’ చేసుకోవచ్చా? 

జ: పై పేర్కొనబడిన స్త్రీకి పరిశుద్ధతపై పూర్తిగా విశ్వాసము కలగనంత వరకు ఆమె స్నానము చేసి తవాఫ్  చేయరాదు. ఎందుకంటే ప్రశ్నలో ప్రస్తావించిన తీరులో ‘తొలిదశ’తో ఆమె ఇంకా పూర్తిగా పరిశుద్ధతకు నోచుకోలేదన్న విషయం వ్యక్తమవుతుంది. కనుక ఆమె పూర్తిగా పరిశుద్ధతను గ్రహించిన తరువాతే స్నానము చేసి ‘తవాఫ్’, ‘సయీ’ చేయాలి. ఒక వే ‘తవాఫ్ ‘ కంటే ముందు ‘సయీ’ చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ‘హజ్జతుల్-వదాత్’ సందర్భములో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ‘ఎవరైన ముందు ‘సయీ’ చేసుకుంటే? అని సంప్రదించినప్పుడు .. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఎలాంటి దోషం లేదు” అని సమాధానమిచ్చారు. 

ప్ర- 53 : ఒక స్త్రీ నెలసరి స్థితిలో “సైల్” ప్రదేశం నుండి హజ్ ‘ఇహ్రాం” కట్టుకుంది. మక్కా వెళ్ళిన తరువాత ఏదో అవసరం పై ‘జిద్దాహ్’ ‘వెళ్ళింది. ‘జిద్దాహ్’ లోనే నెలసరి నుండి పరిశుద్దురాలైంది. స్నానం చేసి తలదువ్వుకుని తరువాత తన ‘హజ్’ను పూర్తిచేసుకుంది. అయితే ఆమె ‘హజ్’ సరైనదేనా? ఆమెపై ఇంకేమైన బాధ్యత వుంటుందా? 

జ : పై ప్రస్తావించబడిన స్త్రీ ‘హజ్’ సరైనదే. ఆమె పై ఎలాంటి బాధ్యత లేదు. 

ప్ర – 54 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది: ‘నేను ఉమ్రాహ్ చేయటానికి బయలుదేరాను. ‘మీఖాత్’ చేరుకున్నప్పుడు నేను నెలసరితో వున్నాను కనుక నేను ‘ఇహ్రామ్’ కట్టుకోలేదు. పరిశుద్ధురాలైనంత వరకు మక్కాలోనే ఉన్నాను. తరువాత మక్కానుండి ‘ఇహ్రామ్’ కట్టుకున్నాను. అయితే ఇది సరైనదేనా? నా పై ఏమి వాజిబ్ వుంది? 

జ : పై పేర్కొనబడిన పద్ధతి సరైనది కాదు. ఏ స్త్రీ అయితే ఉమ్రాహ్ సంకల్పం కలిగివుందో ఆమెకు ‘ఇహ్రామ్’ లేకుండా ‘మీఖాత్’ నుండి ముందుకు వెళ్ళటం సరైనది కాదు. ఒకవేళ ఆమె నెలసరితో వున్నా సరే. నెలసరి స్థితిలోనే ఆమె ‘ఇహ్రామ్’ కట్టుకోవాలి. ఆమె కట్టుకునే ఈ ఇహ్రామ్ సరైనదే. 

దీనికి ఆధారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘హజ్జతుల్-వదా (అంతిమ హజ్) సంకల్పంతో ‘జుల్ హులైఫా’ ప్రాంతములో వున్నప్పుడు హ॥ అబూ-బక్ర్ సిద్దీఖ్ (రజియల్లాహు అన్హు) సతీమణి ‘అస్మా బిన్తె ఉమైస్’ (రజియల్లాహు అన్హా) కు ఒక శిశువు జన్మించింది. అప్పుడు ‘అస్మా’ (రజియల్లాహు అన్హా) ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియపరచి ఈ పరిస్థితిలో తాను ఏమి చేయాలి? అని కబురు పంపారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు : 

“స్నానం చేసి (యోనిపై) గుడ్డ కట్టుకోవాలి. తరువాత ‘ఇహ్రామ్’ వేసుకోవాలి”. 

నెలసరి రక్తం కూడ రక్తస్రావం (బాలింతదశ) ఆదేశాల పరిధిలోనే వస్తుంది. కనుక నెలసరిగల స్త్రీకి మా సూచనేమిటంటే ‘ఆమె ‘హజ్’ లేదా ‘ఉమ్రాహ్’ సంకల్పముతో ‘మీఖాత్’ ప్రదేశము నుండి వెళ్ళినప్పుడు స్నానము చేసి యోని పై గుడ్డ కట్టుకోవాలి. తరువాత ‘హజ్’ లేదా ‘ఉమ్రాహ్’ ‘ఇహ్రామ్’ కట్టుకోవాలి. కాకపోతే ‘ఇహ్రామ్’ కట్టుకొని పవిత్ర మక్కా చేరుకున్న తరువాత పరిశుద్ధురాలైనంత వరకు ‘మస్జిదే-హరామ్’లో ప్రవేశించ కూడదు. కాబా గృహానికి ప్రదక్షిణం చేయరాదు. ఎందుకంటే హ॥ ఆయిషా (రజియల్లాహు అన్హా)కు ‘ఉమ్రాహ్’  మధ్యలోనే ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు (నెలసరి వచ్చినప్పుడు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు  ఇలా సూచించారు: 

హాజీలు చేసినట్టే నీవు కూడ చేయ్యి. కాకపోతే పరిశుద్ధురాలైనంత వరకు కాబా గృహాన్ని ‘తవాఫ్ ‘ చేయకు”. (సహీహ్ బుఖారి, సహీహ్ ముస్లిం) 

‘సహీహ్ బుఖారి’లోని మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది : హ॥ ఆయిషా (రజియల్లాహు అన్హా ) ఇలా తెలిపారు : 

“ఆమె పరిశుద్ధు రాలైనప్పుడు కాబా గృహానికి ప్రదక్షిణం చేశారు. ‘సఫా-మర్వా’ మధ్య ‘సయీ’ కూడా చేశారు”. 

పై ఉల్లేఖనాల ద్వారా తెలిసేదేమిటంటే స్త్రీ నెలసరి కాలంలోనే ‘హజ్’ లేదా ‘ఉమ్రాహ్’ ‘ఇహ్రామ్ కట్టుకోవాలి. లేదా ‘తవాఫ్ ‘ చేయటానికి ముందే నెలసరి ప్రారంభమైనప్పుడు పరిశుద్ధురాలై స్నానం చేయనంత వరకు ‘తవాఫ్ ‘ మరి ‘సయీ’ చేయకూడదు. ఒకవేళ ఆమె పరిశుద్ధ స్థితిలో ‘తవాఫ్ ‘ చేసింది, దాని తరువాత ఆమెకు నెలసరి ప్రారంభమైనప్పుడు ఆమె అదే పరిస్థితిలో తన ‘ఉమ్రహ్ ను పూర్తిచేస్తుంది. ‘సయీ’ చేస్తుంది, తల వెంట్రుకలు కత్రిస్తుంది. ఎందుకంటే సఫా’, ‘మర్వా’ మధ్య ‘సయీ చేయటానికి పరిశుభ్రత అనే షరతు విధించబడలేదు. 

ప్ర – 55: ఒకరు ఇలా ప్రశ్నిస్తున్నారు: ‘నేను నా భార్యతో ‘యమ్ బ’ పట్టణం నుండి ‘ఉమ్రహ్’ కొరకు వచ్చాను. జిద్దాహ్  చేరుకున్నప్పుడు నా భార్యకు ఋతుస్రావం మొదలైంది. కనుక నేను ఒకణ్ణి ‘ఉమ్రహ్’ చేసుకున్నాను. అయితే ఇప్పుడు నా భార్యకు ఎలాంటి ఆదేశాలు వుంటాయి? 

జ: ఇలాంటి పరిస్థితిల్లో మీ భార్య సమస్యకు పరిష్కారం ఏమిటంటే ఆమె పరిశుద్ధురాలైనంత వరకు నిరీక్షించి ఆ తరువాత తన ‘ఉమ్రహ్’ పూర్తి చేయాలి. ఎందుకంటే విశ్వాసులు మాతృమూర్తి హ॥ సఫియ (రదియల్లాహు అన్హా) కు నెలసరి మొదలైనప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి సల్లం) ఇలా అన్నారు: “ఏమిటి మాకు ఈమె ప్రయాణం నుండి ఆపేస్తుందా?” ప్రజలు ఇలా అన్నారు : ఓ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమె ‘తవాఫె -ఇఫాజా’ అయితే చేసుకున్నది. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “అయితె బయలుదేరుదాం“. 

పై హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన “ఏమిటి మాకు ఈమె ప్రయాణం నుండి ఆపేస్తుందా?” మాట ఆధారంగా స్త్రీకి ఒకవేళ ‘తవాఫె -ఇఫాజా’ కంటే ముందు నెలసరి వస్తే ఆమె పరిశుద్ధురాలైనంత వరకు నిరీక్షించి దాని తరువాత ‘తవ్వా ఫె-ఇఫాజా చేయటం తప్పనిసరి ‘వాజిబ్’గా గుర్తించబడుతుంది. 

అలాగే ‘తవాఫె-ఉమ్రహ్’ కూడ ”తవాఫె-ఇఫాజా’ ఆదేశంలోనే వుంది. ఎందుకంటే అది ”ఉమ్రహ్ ‘కు మూల సూత్రం. కనుక ‘ఉమ్రహ్’ చేయదలుచుకునే స్త్రీ ఒకవేళ ‘తవాఫె-ఉమ్రహ్’ కంటే ముందే నెలసరికి గురైతే పరిశుద్ధత కలిగేవరకు నిరీక్షించి దాని తరువాత ‘తవాఫ్ ‘ చేయాలి. 

ప్ర – 56 : ‘మస్ఆ’ (సయీ చేసే ప్రాంతం) ‘హరం’ (కాబా చుట్టుప్రక్కల కొంత భాగాన్ని అల్లాహ్ పవిత్ర స్థలంగా నిర్దేశించాడు. అందులో ఎలాంటి రక్తపాతాలు, అపవిత్ర కలాపాలకు పాల్పడరాదు. దానిని ‘హరం’ అంటారు) లో భాగమేనా? నెలసరిగల స్త్రీ ‘మస్ఆ’లో ప్రవేశించ గలుగుతుందా? ‘మస్ఆ’ నుండి ‘హరం’లో ప్రవేశించటానికి ‘తహియ్యతుల్ మస్జిద్’ (మసీదులో ప్రవేశించగానే చదివే నమాజు చదువుట ‘వాజిబా’ (తప్పనిసరా)? 

జ: అందరికీ సుపరిచితమైన విషయం ఏమిటంటే ‘మస్ఆ’ (సయీ చేసే ప్రాంతం) ‘హరం’లో భాగం కాదు. ఈ కారణంతోనే దానికి ‘మస్జిదె హరాం’కి మధ్య ఒక చిన్న గోడ నిర్మించబడింది. మస్ఆ ‘హరం’ వెలుపల వుండటమే ప్రజలకు మేలు అని భావించడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒకవేళ దీన్ని ‘హరం’లో భాగమేనని నిర్ధారిస్తే అప్పుడు ‘తవాఫ్ ‘, ‘సయీ’ చేస్తున్న సమయంలో నెలసరికి గురైయ్యే స్త్రీని కూడా ‘సయీ’ చేయకుండా వారించడం జరిగేది. 

ఈ విషయంలో నా అభిప్రాయం (‘ఫత్వా’) ఏమిటంటే ఒకవేళ స్త్రీ ‘తవాఫ్ ‘ చేసుకున్న తరువాత ‘సయీ’ చేయటానికి ముందు నెలసరికి గురైతే అప్పుడు ఆమె అదే స్థితిలో ‘సయీ’ చేయవచ్చు. ఎందుకంటే ‘మస్ ఆ’ (సయీ చేసే ప్రాంతం) ‘హరం’తో వేరుగా వుంది. 

ఇక ‘తహియ్యతుల్-మస్జిద్’ విషయానికి వస్తే.. ఎవరైన ‘తవాఫ్ ‘ చేసిన తరువాత ‘సయీ’ చేసి, మళ్ళీ ‘మస్జిద్ హరాం’లో రావాలనుకున్నప్పుడు అతనికి  ‘తహియ్యతుల్ మస్జిద్’ చదవవలసి వుంటుంది. ఒకవేళ చదవక పోయినా పర్వాలేదు. కాని అల్లాహ్ ప్రసాదించిన ఈ మహత్తర అవకాశాన్ని వినియోగించుకుంటూ, అక్కడ నమాజు చేయుటలో ఉన్న గొప్పతనాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు రకాతుల (తహయ్యతుల్ మస్జిద్) చదువుకోవడమే ఉత్తమమైన కార్యం. 

ప్ర – 57 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది : నేను హజ్ చేశాను. హజ్ లో ఉన్నప్పుడే ఋతుస్రావం ప్రారంభమైంది. సిగ్గు, బిడియం కారణంగా ఎవరికీ చెప్పలేకపోయాను. అదే పరిస్థితిలో ‘హరం’లో కూడ ప్రవేశించాను, నమాజు చదివాను, ‘తవాఫ్ ‘, ‘సయీ’ కూడా చేశాను. అయితే ఇప్పుడు నేను ఏమిచేయాలి? ఒకమాట ఏమిటంటే (బాలింత దశ ) రక్తస్రావం తరువాత నెలసరి వచ్చింది.? 

జ : నెలసరి, రక్తస్రావంగల స్త్రీ నమాజు ఆ స్థితిలో చేయరాదు. అది మక్కాలో నైనా స్వగ్రామంలో నైనా, మరెక్కడైనా సరే. ఎందుకంటే మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్త్రీ గురించి ఇలా అన్నారు: “ఏమిటి ఇలా లేదా (వాస్తవం కాదా)? ఏమంటే స్త్రీ నెలసరితో వున్నప్పుడు నమాజు చదవదు మరి ఉపవాసం పాటించదు.” 

యావత్తు ముస్లిములు ఏకీభవించేది ఏమిటంటే నెలసరి గల స్త్రీ నమాజు చదవకూడదు, ఉపవాసం వుండకూడదు. కనుక పై పేర్కొనబడిన స్త్రీ అల్లాహ్ క్షమాపణ కోరుతూ తనతో జరిగిన ఈ తప్పుకి పశ్చాతాపపడాలి. 

ఇక ఈ స్థితిలో ‘తవాఫ్ ‘ చేసే విషయమైతే ఇలా తవాఫ్  చేయుట కూడా సరికాదు. కాని ‘సయీ’ చేయవచ్చు. ఎందుకంటే ఈ విషయంలో ప్రఖ్యాత అభిప్రాయం ఏమిటంటే ‘హజ్’ సందర్భములో తవాఫ్  కంటే ముందు’సయీ’ చేసుకోవచ్చు. కనుక ఆమె రెండోసారి ‘తవాఫ్ ‘ చేయవలసి వుంటుంది. ఎందుకంటే ‘తవాఫ్-ఇఫాజా’ ‘హజ్’ మూల సూత్రాల్లో ఒకటి. అది లేకుండా ‘హలాల్’ కాలేరు (సమ్మత్వాన్ని పొందలేరు). అందుకని ఆ ఒకవేళ వివాహిత అయితే ‘తవాఫ్ ‘ చేయనంత వరకు తన భర్తతో లైంగికంగా దగ్గరకాకూడదు. ఒకవేళ అవివాహితురాలైతే ‘తవాఫ్ ‘ చేయనంత వరకు ‘నికాహ్’ (వివాహం చేసుకోకూడదు. 

ప్ర – 58: స్త్రీకి ‘అరఫహ్’ రోజున ఋతుస్రావం మొదలైతే ఏమిచేయాలి? 

జ: స్త్రీకి ‘అరఫహ్’ రోజున ఋతుస్రావం మొదలైతే ఇతర హాజీల్లా ఆమె కూడ హజ్జ్ లోని  కార్యాలన్ని పూర్తి చేయాలి. కాకపోతే ‘బైతుల్లాహ్’ (కాబాగృహం) తవాఫ్ ‘ చేయరాదు. పరిశుద్ధులయ్యేంత వరకు నిరీక్షించి, పరిశుద్ధులైన తరువాత ‘బైతుల్లాహ్ ‘ (కాబా గృహం) ‘తవాఫ్  చేయాలి. 

ప్ర – 59: ఒకవేళ స్త్రీ ‘జమరయె-ఉఖ్బహ్’ పై రాళ్ళు రవ్వినంతరం – ‘తవాఫ్-ఇఫాజా’ కంటే ముందు ఋతుస్రావానికి గురైంది. ఆమె, ఆ ఒక బృందముతో కలిసి ఉన్నారు. ఆమె ప్రయాణం తరువాత తిరిగి మక్కాకు రావటం కష్టం లేక అసాధ్యం. అప్పుడు ఆమె ఏమిచేయాలి? 

జ: పై ప్రస్తావించబడిన స్త్రీ మళ్ళీ ‘మక్కా’కు రావటం అసాధ్యమైనప్పుడు అవసర నిమిత్తం ఆమె తన యోనిపై గుడ్డ కట్టుకుని ‘తవాఫ్’ చేసుకోవాలి. అలాగే మిగితా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితిలో ఆమెపై ఎటువంటి పరిహారం వాజిబ్ కాదు. 

ప్ర – 60 : రక్తస్రావం గల స్త్రీ ఒకవేళ 40 రోజులకు ముందే పరిశుద్ధురాలైతే ఆమె ‘హజ్’ సరైనదేనా? ఒక వేళ పరిశుద్ధతను గ్రహించకపోతే ఏమిచేయాలి? గమనించవలసిన విషయం ఏమంటే ఆమె ‘హజ్’కై సంకల్పం చేసి వుంది? 

జ : రక్తస్రావం గల స్త్రీ ఒకవేళ 40 రోజులకు ముందే పరిశుద్దురాలైనప్పుడు స్నానముచేసి నమాజు చదువుకోవాలి. పరిశుద్ధ స్త్రీలు చేసే కార్యాలన్నీ చేయాలి. చివరికి ‘బైతుల్లాహ్’ (కాబాగృహం) ‘తవాఫ్ ‘ కూడ చేయాలి. ఎందుకంటే రక్తస్రావం కనీస కాలానికి ఎలాంటి పరిమితం లేదు. సంకల్పం సరైనదే. కాకపోతే పరిశుద్ధురాలైనంత వరకు ఆమె ‘బైతుల్లాహ్’ పై పేర్కొనబడిన స్త్రీ పరిశుద్ధతను చూడనప్పుడు ఆమె ‘హజ్’ (కాబా గృహం) ‘తవాఫ్’ చేయకూడదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఋతుస్రావంలో గల స్త్రీని బైతుల్లాహ్ (కాబాగృహం) తవాఫ్ ‘ నుండి వారించారు. 

ఈ విషయంలో రక్తస్రావం గల స్త్రీ కూడ నెలసరి గల స్త్రీ ఆదేశంలోనే వుంటుంది

నోట్స్:

  • ఇహ్రామ్ : కాబా దర్శనానికి వెళ్ళేటప్పుడు కట్టుకునే ప్రత్యేక వస్త్రాలు. కానీ స్త్రీలకు ప్రత్యేక వస్త్రాలంటు లేవు. కేవలం పరిమిత కాలంలో తమకు తాముగా ధర్మపరమైన నిబంధనలకు లోబడి ఉండాలి
  • మీఖాత్: పవిత్రం కాబా గృహానికి చుట్టూ నిర్ణయించబడిన పరిధిలో ప్రవేశించడానికి కేటాయించ బడిన పవిత్ర స్థలము ‘హరం’
  • ‘తహియ్యతుల్-మస్జిద్‘ : మసీదులో ప్రవేశించినప్పుడు, మసీదును దర్శించినప్పుడు పాటించ వలసిన రెండు రకాతులను అంటారు. 
  • మస్జిదే హరాం : కాబా చుట్టు నిర్మించబడి వున్న మసీదు. దీనిలో ఒక నమాజు లక్ష నమాజుల పుణ్యంతో సమానం.
  • తవాఫ్  : పవిత్ర ‘కాబా’ గృహానికి ప్రదక్షిణ చేయడం. 
  • తవాఫ్ – ఇఫాజా: ‘జిల్-హిజ్జహ్’ పదో తేది రోజు చేసే ‘కాబా’ ప్రదక్షణం 
  • ఖస్ర్ : తలవెంట్రుకలు కొద్దిగా కత్రించుట. 
  • సయీ : సఫా, మర్వా అనే కొండప్రాంతాల నడుమ వేగంగా నడవడానిని అంటారు. ఇది హజ్, ఉమ్రాహ్ మూలాల్లో ఒకటి. 
  • మహ్రమ్: ఆమెతో వివాహానికి ఆస్కారం లేని వ్యక్తి ఉదాహరణకు : తండ్రి, కుమారుడు, సోదరుడు, మావయ్య లాంటి వారు

బహిష్టు మరియు బాలింత స్త్రీలు మస్జిద్లో ధర్మ విద్య నేర్చుకొనుటకు ఖురాన్ క్లాసులలో పాల్గొనవచ్చా?

బహిష్టు మరియు బాలింత స్త్రీలు మస్జిద్లో ధర్మ విద్య నేర్చుకొనుటకు ఖురాన్ క్లాసులలో పాల్గొనవచ్చా?
https://youtu.be/EBFz1Z_TW9g [3 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

బహిష్టు రక్తం ఆగిపోయిన తర్వాత స్నానం చేశాక మళ్లీ రక్తం లేదా అలాంటిది ఏదైనా కనబడితే తప్పనిసరిగా స్నానం చేయాలా?

బహిష్టు రక్తం ఆగిపోయిన తర్వాత స్నానం చేశాక మళ్లీ రక్తం లేదా అలాంటిది ఏదైనా కనబడితే తప్పనిసరిగా స్నానం చేయాలా?
https://youtu.be/-AbDqH0dEKk [ 4 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఇతర ముఖ్యమైన లింకులు:

నెలసరి (Menses) ఆగిపోయిందని ఖచ్చితంగా ఎలా తెలుసుకోవాలి? [వీడియో]

బిస్మిల్లాహ్

[2:24 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

బహిష్టు, బాలింత స్త్రీలు:

స్త్రీలు తమ ఋతుస్రావము మరియు బాలింత గడువులో ఉన్నప్పుడు నమాజ్, ఉపవాసాలు పాటించకూడదు. హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

«إِذَا أَقْبَلَتِ الحَيْضَةُ، فَدَعِي الصَّلاَةَ، وَإِذَا أَدْبَرَتْ، فَاغْسِلِي عَنْكِ الدَّمَ وَصَلِّي»

“నీవు ఋతువు గడువు దినాల్లో నమాజ్ చేయడం మానేయి. ఋతు స్రావం ముగిసాక నీ వొంటి మీది రక్తాన్ని కడిగి (తలంటు స్నానం చేసి) నమాజ్ చేస్తూ ఉండు”. (బుఖారి 331, ముస్లిం 333).

తప్పి పోయిన నమాజులు తిరిగి చేయకూడదు. కాని తప్పి పోయిన ఉపవాసాలు మాత్రం పూర్తి చేయాలి. అలాగే వీరు కాబా ప్రదక్షిణం (తవాఫ్) కూడా చేయకూడదు. ఈ గడువులో భర్త తన భార్యతో సంభోగించడం కూడా నిషిధ్ధం. అయితే రమించడం తప్ప పరస్పరం ఏ రకమైన ఆనందం పొందినా తప్పు లేదు. ఈ స్థితిలో స్త్రీ ఖుర్ఆనును తాక వద్దు.

రక్త స్రావం ఆగిన తరవాత స్నానం చేయడం విధిగా ఉంది([1]). స్నానం తర్వాత వారి గడువులో నిశిద్ధంగా ఉన్నవన్నీ ధర్మ సమ్మతం అవుతాయి.

నమాజ్ సమయం ప్రవేశించిన తరువాత, ఆ నమాజ్ చేయక ముందే ఏ స్త్రీకైనా ఋతు స్రావం మొదలవుతే, లేదా ప్రసవిస్తే ఆమె పరిశుద్ధురా- లయిన తరువాత ఆ నమాజును తిరిగి చేయాలి. (ఉదా: జొహ్ర్ నమాజ్ వేళ ఆరంభమయింది పగలు పన్నెండు గంటల నలబై నిమిషాలకు, ఒక స్త్రీ ఒకటింటి వరకు కూడా  జొహ్ర్ నమాజ్ చేసుకోలేక పోయింది. అప్పుడే ఋతు స్రావం మొదలయింది, లేదా ప్రసవించింది. అలాంప్పుడు ఆ స్త్రీ పరిశుద్ధురాలయిన తరువాత జొహ్ర్ నమాజ్ చేయాలి). ఒక రకాతు మాత్రమే చేయునంత సమయం ఉన్నప్పుడు పరిశుద్ధుమైన స్త్రీ గుస్ల్ చేసిన తరువాత ఆ నమాజ్ చేసుకోవాలి. ఒక వేళ అది అస్ర్ లేదా ఇషా నమాజ్ అయితే అస్ర్ తో పాటు జొహ్ర్, మగ్రిబ్ తో పాటు ఇషా కూడా చేయుట అభిలషణీయం. ఉదాః సూర్యాస్తమయానికి ఒక రకాత్ చేయునంత ముందు పరిశుద్ధమైతే అస్ర్ నమాజ్ మాత్రం తప్పక చేయాలి. అయితే జొహ్ర్ కూడా ఖజా చేస్తే మంచిది. అర్థ రాత్రికి కొంచెం ముందు పరిశుద్ధురాలయితే ఇషా మాత్రం చేయవలసిందే, అయితే మగ్రిబ్ కూడా చేయడం మంచిది.


[1]  కొందరు బాలింత స్త్రీలు 15, లేదా 20, 25 రోజుల్లో రక్త స్రావం నిలిచిపోయినా 40 రోజుల తరువాతే గుస్ల్ చేస్తారు. ఆ తరువాతే నమాజు ఆరంభిస్తారు. వారు ఇలా చేసేది చాలా ఘోరమైన తప్పు. ఎప్పుడు రక్త స్రావం నిలిచినదో అప్పుడే గుస్ల్ చేయాలి. నమాజు మొదలెట్టాలి.

హైజ్ (ముట్టు, బహిష్టు), నిఫాస్ (పురిటి రక్తం)

ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) – పార్ట్ 8: బహిష్టు & పురిటి రక్తం ఆదేశాలు & ప్రశ్నోత్తరాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[44:53 నిముషాలు]
హైజ్ వ నిఫాస్ (బహిష్టు & పురిటి రక్తం) ఆదేశాలు & ప్రశ్నోత్తరాలు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

బహిష్టు, బాలింత స్త్రీలు:

స్త్రీలు తమ ఋతుస్రావము మరియు బాలింత గడువులో ఉన్నప్పుడు నమాజ్, ఉపవాసాలు పాటించకూడదు. హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

«إِذَا أَقْبَلَتِ الحَيْضَةُ، فَدَعِي الصَّلاَةَ، وَإِذَا أَدْبَرَتْ، فَاغْسِلِي عَنْكِ الدَّمَ وَصَلِّي»

“నీవు ఋతువు గడువు దినాల్లో నమాజ్ చేయడం మానేయి. ఋతు స్రావం ముగిసాక నీ వొంటి మీది రక్తాన్ని కడిగి (తలంటు స్నానం చేసి) నమాజ్ చేస్తూ ఉండు”. (బుఖారి 331, ముస్లిం 333).

తప్పి పోయిన నమాజులు తిరిగి చేయకూడదు. కాని తప్పి పోయిన ఉపవాసాలు మాత్రం పూర్తి చేయాలి. అలాగే వీరు కాబా ప్రదక్షిణం (తవాఫ్) కూడా చేయకూడదు. ఈ గడువులో భర్త తన భార్యతో సంభోగించడం కూడా నిషిధ్ధం. అయితే రమించడం తప్ప పరస్పరం ఏ రకమైన ఆనందం పొందినా తప్పు లేదు. ఈ స్థితిలో స్త్రీ ఖుర్ఆనును తాక వద్దు.

రక్త స్రావం ఆగిన తరవాత స్నానం చేయడం విధిగా ఉంది([1]). స్నానం తర్వాత వారి గడువులో నిశిద్ధంగా ఉన్నవన్నీ ధర్మ సమ్మతం అవుతాయి.

నమాజ్ సమయం ప్రవేశించిన తరువాత, ఆ నమాజ్ చేయక ముందే ఏ స్త్రీకైనా ఋతు స్రావం మొదలవుతే, లేదా ప్రసవిస్తే ఆమె పరిశుద్ధురా- లయిన తరువాత ఆ నమాజును తిరిగి చేయాలి. (ఉదా: జొహ్ర్ నమాజ్ వేళ ఆరంభమయింది పగలు పన్నెండు గంటల నలబై నిమిషాలకు, ఒక స్త్రీ ఒకటింటి వరకు కూడా  జొహ్ర్ నమాజ్ చేసుకోలేక పోయింది. అప్పుడే ఋతు స్రావం మొదలయింది, లేదా ప్రసవించింది. అలాంప్పుడు ఆ స్త్రీ పరిశుద్ధురాలయిన తరువాత జొహ్ర్ నమాజ్ చేయాలి). ఒక రకాతు మాత్రమే చేయునంత సమయం ఉన్నప్పుడు పరిశుద్ధుమైన స్త్రీ గుస్ల్ చేసిన తరువాత ఆ నమాజ్ చేసుకోవాలి. ఒక వేళ అది అస్ర్ లేదా ఇషా నమాజ్ అయితే అస్ర్ తో పాటు జొహ్ర్, మగ్రిబ్ తో పాటు ఇషా కూడా చేయుట అభిలషణీయం. ఉదాః సూర్యాస్తమయానికి ఒక రకాత్ చేయునంత ముందు పరిశుద్ధమైతే అస్ర్ నమాజ్ మాత్రం తప్పక చేయాలి. అయితే జొహ్ర్ కూడా ఖజా చేస్తే మంచిది. అర్థ రాత్రికి కొంచెం ముందు పరిశుద్ధురాలయితే ఇషా మాత్రం చేయవలసిందే, అయితే మగ్రిబ్ కూడా చేయడం మంచిది.


[1]  కొందరు బాలింత స్త్రీలు 15, లేదా 20, 25 రోజుల్లో రక్త స్రావం నిలిచిపోయినా 40 రోజుల తరువాతే గుస్ల్ చేస్తారు. ఆ తరువాతే నమాజు ఆరంభిస్తారు. వారు ఇలా చేసేది చాలా ఘోరమైన తప్పు. ఎప్పుడు రక్త స్రావం నిలిచినదో అప్పుడే గుస్ల్ చేయాలి. నమాజు మొదలెట్టాలి.

ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

హైజ్ (ముట్టు, బహిష్టు), నిఫాస్ (పురిటి రక్తం)

శుచీశుభ్రత: నాల్గవ పాఠం: హైజ్ (బహిష్టు), నిఫాస్ (పురిటి రక్తం) [వీడియో]

బిస్మిల్లాహ్హైజ్ (బహిష్టు), నిఫాస్ (పురిటి రక్తం) الحيض والنفس

[11 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


హైజ్ అంటే ప్రసవం జరగకుండా, ఏ రోగంతో కాకుండా ఆరోగ్య స్థితిలో నిర్ణీత రోజుల్లో గర్భాశయం నుండి వెలువడే రక్తం. నలుపు రంగు, దుర్వాసన ఉంటుంది.

నిఫాస్ అంటే ప్రసవించినందుకు గర్భాశయం నుండి వెలువడే రక్తం.

స్త్రీలు తమ ఋతుస్రావము మరియు బాలంత గడువులో ఉన్నప్పుడు నమాజు, ఉపవాసాలు పాటించకూడదు. హజ్రత్ ఆయిష రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

إِذَا أَقْبَلَتِ الْحَيْضَةُ فَدَعِي الصَّلَاةَ وَإِذَا أَدْبَرَتْ فَاغْسِلِي عَنْكِ الدَّمَ وَصَلِّي {صحيح البخاري 331، صحيح مسلم 333}.

“నీవు ఋతువు రోజుల్లో ఉన్నప్పుడు నమాజు చేయడం మానేయి. ఋతు స్రావం ముగిసాక రక్తాన్ని కడిగి, తలంటు స్నానం చేసి నమాజు చేస్తూ ఉండు”. (బుఖారి 331, ముస్లిం 333).

ఈ రోజుల్లో చేయని నమాజులు తిరిగి చేయకూడదు.కాని ఈ రోజుల్లో తప్పిపోయిన ఉపవాసాలు మాత్రం పూర్తి చేయాలి.అలాగే వీరు కాబా ప్రదక్షిణం (తవాఫ్) కూడా చేయకూడదు. ఈ రోజుల్లో భర్త తన భార్యతో సంభోగించడం కూడా నిషిధ్ధం. అయితే రమించడం తప్ప పరస్పరం ఏ రకమైన ఆనందం పొందినా తప్పు లేదు. ఈ స్థితిలో స్త్రీ ఖుర్ఆనును ముట్టుకోవద్దు.

నమాజు సమయం ప్రవేశించిన తరువాత, ఆ నమాజు చేయక ముందే ఏ స్త్రీకైనా ఋతు స్రావం మొదలవుతే, లేదా ప్రసవిస్తే ఆమె పరిశుద్ధురాలయిన తరువాత ఆ నమాజును తిరిగి చేయాలి. (ఉదాహరణకు: జొహ్ర్ నమాజు వేళ ఆరంభమయింది పగలు పన్నెండు గంటల నలబై నిమిషాలకు, ఒక స్త్రీ ఒకటింటి వరకు కూడా జొహ్ర్ నమాజు చేసుకోలేక పోయింది. ఒకటింటికి ఋతు స్రావం మొదలయింది, లేదా ప్రసవించింది. అలాంటప్పుడు ఆ స్త్రీ పరిశుద్ధురాలయిన తరువాత జొహ్ర్ నమాజు చేయాలి).

ఒక రకాతు మాత్రమే చేయునంత సమయం ఉన్నప్పుడు పరిశుద్ధుమైన స్త్రీ గుస్ల్ చేసిన తరువాత ఆ నమాజు చేసుకోవాలి. ఉదాహరణకు: ఇషా నమాజు సమయం రాత్రి 11 గం.లకు సమాప్తమవుతుందనుకుందాము, ఒక స్త్రీ 11 గం.కంటే కొంచెం ముందు పరిశుద్ధురాలైతే ఆమె స్నానం చేసిన తర్వాత ఇషా నమాజు చేసుకోవాలి.

ఉపవాస స్థితిలో సూర్యాస్తమయానికి (ఇఫ్తార్ కి) కొన్ని క్షణాల మందైనా ఎవరికైనా ఋతుస్రావం లేదా ప్రసవం జరిగితే ఆ ఉపవాసం లెక్కలోకి రాదు, ఒకవేళ అది రమజాను ఉపవాసం లాంటి విధి ఉపవాసమయితే పరిశుద్ధురాలయిన తర్వాత దానికి బదులుగా మరో ఉపవాసం ఉండడం విధిగా ఉంది.

ఫజ్ర్ సమయం ప్రవేశించే వరకు స్త్రీ బహిష్టులో ఉంటే ఆ రోజు ఉపవాసం ఉండడం ధర్మం కాదు, ఒక వేళ ఆమె ఫజ్ర్ ప్రవేశించిన కొన్ని క్షణాల ముందు పరిశుద్ధురాలయినా సరే. అదే ఫజ్ర్ ప్రవేశించిన కొద్ది క్షణాల ముందు పరిశుద్ధరాలయితే ఉపవాసం ఉండాలి. స్నానం ఉషోదయం తరువాత చేసినా అభ్యంతరం లేదు.

అలాగే జునుబీ (అంటే సంభోగం లేదా స్వప్నస్ఖలనం వల్ల అశుద్ధ స్థితిలో ఉన్న వ్యక్తి) ఫజ్ర్ కు కొంచెం ముందు ఉపవాసం నియ్యత్ చేసుకొని ఫజ్ర్ తర్వాత స్నానం చేసినా అతని ఉపవాసం సరియగును.

బహిష్టు, బాలంత స్త్రీలు జిక్ర్, తక్బీర్, తస్బీహ్ చేయుట, అల్ హందులిల్లాహ్ పలుకుట, దుఆ చేయుట మరియు తినుత్రాగినప్పుడు బిస్మిల్లాహ్ అనుట యోగ్యమే. అలాగే హదీస్, ఫిఖ్హ్ చదువుట, ఖుర్ఆన్ పారాయణం వినుట లాంటివేవీ నిషిద్ధం కావు. అలాగే ఖుర్ఆనును ముట్టుకోకుండా తనకు కంఠస్తమున్నదానిలో నుండి పారాయణం చేయవచ్చును.

రక్త స్రావం ఆగిన తరవాత స్నానం చేయడం విధిగా ఉంది(*). స్నానం తర్వాత వారి ఈ గడువులో నిశిద్ధంగా ఉన్నవన్నీ ధర్మ సమ్మతమవుతాయి. ఉదా: నమాజు, ఉపవాసాలు, ఖుర్ఆన్ ను ముట్టుకోవడం లాంటివి.

(*) కొందరు బాలంతలు 15, లేదా 20, 25 రోజుల్లో రక్త స్రావం నిలిచిపోయినా 40 రోజుల తరువాతే గుస్ల్ చేస్తారు. ఆ తరువాతే నమాజు ఆరంభిస్తారు. వారు ఇలా చేసేది చాలా ఘోరమైన తప్పు. ఎప్పుడు రక్త స్రావం నిలిచినదో అప్పుడే గుస్ల్ చేయాలి. నమాజు మొదలెట్టాలి. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు


ఇతరములుతహారా