హదీసులు కూడా కేవలం అల్లాహ్ యొక్క వహీనే! తఖ్రీజ్: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ రహిమహుల్లాహ్, షోబా తహ్రీఖ్ వతాలీఫ్, దారుస్సలామ్, లాహోర్ తెలుగు అనువాదం, సమర్పణ: ఇక్రాముద్దీన్ ముహమ్మద్ పరిశీలన: షేఖ్ నసీరుద్దీన్ జామి’ ఈ మరియు సోదరులు అబ్దుల్ ఖాదిర్ హఫిజహుముల్లాహ్
“హదీసులు కూడా కేవలం అల్లాహ్ యొక్క వహీనే!” అనే ఈ పుస్తకం, ముస్లింల జీవితంలో ఖురాన్తో పాటు దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి హదీసులు (సున్నత్) కూడా అల్లాహ్ చేత అవతరింపబడిన దివ్యజ్ఞానమే (వహీ) అని స్పష్టంగా నిరూపిస్తుంది. ప్రవక్త ధర్మవిషయంలో ఏదీ తన ఇష్టానుసారం చెప్పలేదని, అవన్నీ వహీ ద్వారానే వచ్చాయని ఖురాన్ ఆయతుల ఆధారంగా గ్రంథకర్త వివరించారు. ఖిబ్లా మార్పు, ముగ్గురు వ్యక్తుల పశ్చాత్తాపం, ఉపవాసం, జకాత్ మరియు నమాజు విధానాలు వంటి అనేక విషయాలు ఖురాన్లో ప్రస్తావించబడినప్పటికీ, వాటి పూర్తి వివరాలు కేవలం హదీసులలోనే లభిస్తాయని ఉదాహరణలతో సహా నిరూపించారు. కేవలం ఖురాన్ను మాత్రమే నమ్ముతాము అని చెబుతూ “హదీసులను తిరస్కరించే వారి” (మున్కిరీనె హదీసు) వాదనలను ఖండిస్తూ, హదీసుల ప్రామాణికత లేకుండా దైనందిన ఇస్లామిక్ విధులను ఆచరించడం అసాధ్యమని ఈ పుస్తకం ఉద్ఘాటిస్తుంది.
హదీసు సంకలనం – అబ్దుల్ గఫ్ఫార్ ఉమరీ (హఫిజహుల్లాహ్) [వీడియో] -హదీస్ అంటే అర్ధం? వివరణ -హదీస్ ప్రాముఖ్యత -హదీస్ ప్రస్తావన ఖుర్ఆన్ లో -హదీస్ అవసరం లేదు అన్నవారికి సమాధానం -హదీసులు కంఠస్తం చేసేవారికి శుభవార్త -వహీ ఎన్ని రకాలు?అవి ఏవి? -హదీసుల పట్ల ఉత్సాహం-ఖుర్ఆన్ తో పాటు ఇంకోటి ఇవ్వబడింది అదే హదీస్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు[5] – [మరణానంతర జీవితం – పార్ట్ 46] https://www.youtube.com/watch?v=wYTBaAwO2oE [24 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి వివరించబడింది. వీటిలో ముఖ్యంగా జ్యోతిష్కులను సంప్రదించడం, వారు చెప్పినది నమ్మడం, మరియు అలా చేయడం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలు (40 రోజుల నమాజ్ స్వీకరించబడకపోవడం, ఇస్లాంను తిరస్కరించినట్లు అవ్వడం) వంటివి హదీసుల ఆధారంగా చర్చించబడ్డాయి. అలాగే, మత్తుపానీయం సేవించడం యొక్క పాపం, దాని పర్యవసానాలు, మరియు పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. ఇతరుల హక్కులను కాలరాయడం, వారి ఆస్తులను అన్యాయంగా తీసుకోవడం, మరియు ప్రళయ దినాన “దివాలా తీసిన వ్యక్తి”గా నిలబడటం గురించి హెచ్చరించబడింది. చివరగా, దుష్ప్రవర్తన సత్కార్యాలను ఎలా నాశనం చేస్తుందో, మరియు ఒక ముస్లిం పరువుకు భంగం కలిగించడం ఎంత పెద్ద పాపమో స్పష్టం చేయబడింది.
అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. అల్ హందులిల్లాహి వహ్ద వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బా’ద అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. మనం త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము.
8. జ్యోతిష్కునితో ఏదైనా ప్రశ్న అడగడం
అందులో ఎనిమిదవ విషయం, జ్యోతిషునితో ఏదైనా ప్రశ్న అడగడం.
మహాశయులారా! ఈ రోజుల్లో మన సమాజంలో స్వయంగా వారి భవిష్యత్తు ఏమిటో వారికి తెలియకుండానే ప్రజల భవిష్యత్తు చెప్పడానికి ఫుట్పాత్ల మీద, వేరే కొన్ని ప్రదేశాలలో, మరి కొందరు హై-ఫై ఇంకా సౌకర్యాలతో కూడి ఉన్న స్థలాల్లో ఉన్నవారు ఫలానా రోజు అలా జరుగుతుంది, ఫలానా రోజు అలా జరుగుతుంది, నీ వివాహం తర్వాత ఇలా నీకు లాభం ఉంటుంది, నీ వివాహం తర్వాత నీకు ఇలా నష్టం ఉంటుంది, ఈ వ్యాపారం నీవు ప్రారంభిస్తే నీకు ఇందులో లాభం ఉంటుంది, నీకు ఇందులో నష్టం ఉంటుంది, ఈ విధంగా కొన్ని భవిష్య సూచనలు, కొన్ని విషయాలు చెప్పడం మనం అడపాదడపా వింటూనే ఉన్నాము.
వాటిలో అనేక విషయాలు అబద్ధం, అసత్యం అన్న విషయం మనలోని చాలా మందికి తెలుసు. కానీ అనేకమంది కొన్ని మూఢనమ్మకాలు, మూఢవిశ్వాసాలకు గురియై ఉంటారు. వారిపై ఏదైనా ఆపద, ఏదైనా పరీక్ష వచ్చిపడినప్పుడు, ఇలాంటి వారిని నమ్ముకొని, వారి వద్దకు వెళ్ళి తమ భవిష్యత్తు గురించి వారితో తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఇలా భవిష్యత్తు గురించి వారిని ఏదైనా ప్రశ్నించడం, ఇది మహా పాప కార్యం. ఎంతటి పాప కార్యం అంటే దీనివల్ల మన ఇతర సత్కార్యాలు, ఇతర మంచి విషయాలు అన్నీ నశించిపోతాయి.
“ఎవరైనా జ్యోతిష్కుని వద్దకు వచ్చి వారిని ఏదైనా విషయం అడిగారంటే వారి యొక్క నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు.”
నలభై రోజుల నమాజ్. వారి యొక్క నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు అంటే ఎంత నష్టంలో ఆ మనిషి పడి ఉంటాడో గమనించవచ్చు.
9. జ్యోతిష్కుడు చెప్పిన దానిని నమ్మడం
అలాగే, తొమ్మిదవ విషయం, ఇలాంటి జ్యోతిషుల వద్దకు వచ్చి వారు చెప్పిన విషయాన్ని సత్యంగా నమ్మడం మరీ భయంకరమైన విషయం. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
“ఎవరైతే ఇలాంటి జ్యోతిషుల వద్దకు, భవిష్యత్తు గురించి కొన్ని విషయాలు తెలుపుతాము అని అంటారో, వారి వద్దకు వచ్చి వారు ఏదైనా ఒక మాటను వారు సత్యంగా నమ్మితే, అలాంటి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ యే ధర్మాన్ని అవతరింపజేశాడో దానిని తిరస్కరించినట్లు, దాని పట్ల అవిశ్వాసానికి పాల్పడినట్లు.”
అందుకు మహాశయులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. కేవలం ప్రశ్నించడం ద్వారా నలభై రోజుల నమాజు స్వీకరించబడదు. ఇక వారు చెప్పిన సమాధానాన్ని సత్యంగా భావిస్తే అవిశ్వాసానికి పాల్పడినట్లు అవుతుంది. ఇక అవిశ్వాసం వల్ల మన సత్కార్యాలు ఏ ఒక్కటి కూడా మిగలకుండా ఉండిపోతుంది కదా? చివరికి మన త్రాసు తేలికగా ఉండిపోతుంది.
10. మత్తు సేవించడం
ఇంకా మహాశయులారా, అలాంటి పాప కార్యాల్లో పదవ విషయం, మత్తు సేవించడం. ఈ రోజుల్లో ఎంతమంది మత్తు సేవిస్తూ ఉన్నారు. దీనివల్ల ఎంత పాపాన్ని ఒడిగట్టుకుంటున్నారు. అల్లాహ్ తో భయపడండి. ఆ సృష్టికర్తతో భయపడండి. ప్రళయ దినాన మనకు ఆయన ఇహలోకంలో ఏ ఆరోగ్యం ఇచ్చాడో, ఏ డబ్బు ధనం ఇచ్చాడో వీటన్నిటి గురించి ప్రశ్నిస్తాడు. అప్పుడు మనం ఏం సమాధానం చెప్పుకుందాం?
మన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో ఒకటి, పదవది, మత్తు సేవించడం. దీనికి సంబంధించిన హదీథ్ ఈ విధంగా ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
“ఎవరైతే మత్తు సేవిస్తారో వారి యొక్క నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. అతను తౌబా చేస్తే అల్లాహ్ తౌబా అంగీకరిస్తాడు.”
తౌబా అంటే తెలుసు కదా, అల్లాహ్ తో క్షమాపణ కోరడం, ఇక ఎన్నడూ అలాంటి పాపానికి ఒడిగట్టను అని శపధం చేసుకోవడం మరియు తిరిగి ఆ పాపాన్ని చేయకపోవడం. ఎవరైతే ఇలా మత్తు సేవిస్తారో వారి నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. ఇక ఎవరైతే తౌబా చేస్తారో అల్లాహ్ అతని తౌబాను స్వీకరిస్తాడు.
“మళ్ళీ ఎవరు రెండవసారి మత్తు సేవిస్తాడో, ఇక ఆ తర్వాత తౌబా చేసుకుంటాడో, అల్లాహ్ అతని తౌబా స్వీకరిస్తాడు. మళ్ళీ ఎవరైతే మూడోసారి మత్తు సేవిస్తాడో మరియు మళ్ళీ తౌబా చేస్తాడో, అల్లాహ్ అతని తౌబా మూడవసారి కూడా స్వీకరిస్తాడు. కానీ అతను మళ్ళీ నాలుగోసారి అదే అలవాటుకు పాల్పడ్డాడు, ఆ తర్వాత మళ్ళీ అతను తౌబా చేస్తే, ఇక నాలుగోసారి అల్లాహ్ అతని తౌబాను స్వీకరించడు.“
మొదటిసారి అతను మత్తు సేవిస్తే నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. తౌబా చేస్తే తౌబా స్వీకరించబడుతుంది. రెండవసారి మత్తు సేవిస్తే, రెండవసారి నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. తౌబా చేస్తే తౌబా స్వీకరించబడుతుంది. మళ్ళీ మూడవసారి మత్తు సేవిస్తే నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. మూడవసారి తౌబా చేస్తే అల్లాహ్ తౌబా స్వీకరిస్తాడు. కానీ మళ్ళీ నాలుగోసారి, మళ్ళీ నాలుగోసారి అదే మత్తు సేవించడానికి అలవాటు పడితే, ఇక ఆ తర్వాత తౌబా చేస్తే అల్లాహ్ అతని తౌబా స్వీకరించడు.
నాలుగోసారి మత్తు సేవించడానికి పాల్పడ్డాడు అంటే మళ్ళీ నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. ఇక ఆ తర్వాత తౌబా చేస్తే తౌబా కూడా స్వీకరించబడదు. అంటే మూడుసార్లు అల్లాహ్ మనకు, అలాంటి పాపం చేసిన వారికి అవకాశం ఇచ్చాడు. నాలుగోసారి ఆ పాపానికి ఒడిగడితే అల్లాహ్ ఇక అతని తౌబా కూడా స్వీకరించడు.
ఏం జరుగుద్ది? అతను అదే స్థితిలో చనిపోయాడు అంటే అల్లాహ్ ప్రళయ దినాన అతనికి ఏమిస్తాడు? మహాశయులారా, భయపడండి అల్లాహ్ తో. నాలుగోసారి మళ్ళీ అతడు అలవాటు పడ్డాడు అంటే నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు, తౌబా చేస్తే తౌబా కూడా స్వీకరించబడదు. అల్లాహ్ అతనికి నహరుల్ ఖబాల్, అల్-ఖబాల్ అన్న నది నుండి వచ్చే ద్రవం త్రాగిపిస్తాడు. ఆ ఖబాల్ నది నుండి వచ్చే ద్రవం ఏంటిది, ఎలా ఉంటుంది, ఏమిటి అని అడిగినప్పుడు, అది నరకవాసుల పుండ్ల నుండి కారుతూ వచ్చిన చీము అని చెప్పడం జరిగింది.
ఎప్పుడైనా గమనించారా? మన శరీరంలో ఎక్కడైనా ఏదైనా పుండు ఉంది అంటే స్వయంగా మనం మన శరీరంలోని పుండు నుండి వచ్చే చీమును చూడడం, దాని యొక్క దుర్వాసనను మనం భరించలేం. ఇక నరకవాసుల వారి యొక్క పుండ్ల నుండి కారుతున్న చీము వారికి త్రాగడానికి ఇవ్వడం జరుగుతుంది అంటే ఇకనైనా మత్తు సేవించడాన్ని మానుకుంటారు అని నేను ఆశిస్తున్నాను. ఇలా మానుకునే సద్భాగ్యం అల్లాహ్ ఈ త్రాగే వారందరికీ, మత్తు సేవించే వారందరికీ అల్లాహ్ తౌబా చేసుకునే సద్భాగ్యం ప్రసాదించాలి అని అల్లాహ్ తో వేడుకుంటున్నాను.
11. ప్రజల సొమ్మును కాజేయడం
మహాశయులారా, ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాపాల్లో 11వ విషయం, ప్రజల సొమ్మును కాజేసుకోవడం, ప్రజల సొమ్ము తినివేయడం. ఇది కూడా మహా పాపం.
మహాశయులారా, త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో 11వ విషయం, ఇతరుల సొమ్మును కాజేయడం, వారిపై దౌర్జన్యం చేయడం. దీనికి సంబంధించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీథ్ ఏమిటంటే, ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించారు:
أَتَدْرُونَ مَنِ الْمُفْلِسُ (అతద్రూన మనిల్ ముఫ్లిస్) “ముఫ్లిస్ (దివాలా తీసినవాడు) అంటే ఎవరో మీకు తెలుసా?”
అప్పుడు సహచరులు అన్నారు:
الْمُفْلِسُ فِينَا مَنْ لاَ دِرْهَمَ لَهُ وَلاَ مَتَاعَ (అల్-ముఫ్లిసు ఫీనా మన్ లా దిర్హమ లహు వలా మతా’అ) “ప్రవక్తా, మాలోని బీదవాడు ఎవరంటే ఎవరి వద్దనైతే ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, ప్రపంచ సామాగ్రి ఏమీ లేదో అలాంటి వారు”
అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
నా అనుచర సంఘంలోని బీదవారు ఎవరంటే, ప్రళయ దినాన నమాజ్, జకాత్, ఉపవాసాలు, నమాజ్, జకాత్ (విధిదానాలు), రోజా (ఉపవాసాలు), వీటన్నిటినీ తీసుకుని వస్తాడు.
وَيَأْتِي قَدْ شَتَمَ هَذَا وَقَذَفَ هَذَا وَأَكَلَ مَالَ هَذَا وَسَفَكَ دَمَ هَذَا وَضَرَبَ هَذَا (వ య’తీ ఖద్ షతమ హాదా, వ ఖదఫ హాదా, వ అకల మాల హాదా, వ సఫక దమ హాదా, వ దరబ హాదా)
“ఇంకా ప్రళయ దినాన ఆ వ్యక్తి ఎలా వస్తాడు అంటే, ఎవరినైనా దూషించి, ఎవరిపైనైనా అపనింద వేసి, ఎవరి సొమ్ము అపహరించి, ఎవరినైనా హత్య చేసి, ఎవరినైనా కొట్టి…“
ఈ విధంగా ప్రజలలో ఎందరి పట్ల ఎన్నో రకాల అన్యాయాలకు గురియై ప్రళయ దినాన హాజరవుతాడు. అతని వెంట నమాజ్, విధిదానాలు, ఉపవాసాలు ఉన్నాయి, కానీ ఇలాంటి పాపాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఏం జరుగుద్ది? వారందరూ, ఇతని నుండి ఎవరెవరికి ఏయే అన్యాయం జరిగిందో, వారందరూ హాజరవుతారు మరియు అల్లాహ్ వద్ద ఇతని గురించి షికాయత్ చేసినప్పుడు, ఇతని గురించి అల్లాహ్ వద్ద అడిగినప్పుడు, అల్లాహు త’ఆలా అతని యొక్క సత్కార్యాలన్నీ కూడా వారి వారిపై జరిగిన అన్యాయానికి సమానంగా వారికి ఇచ్చేస్తాడు.
ఆ తర్వాత, ఇతని వద్ద సత్కార్యాలన్నీ కూడా మిగలకుండా అయిపోయినప్పుడు, ఇంకా ఎన్నో కేసులు మిగిలి ఉన్నప్పుడు, వారిపై జరిగిన అన్యాయానికి సమానంగా వారి పాపాలు తీసుకుని ఇతనిపై వేయడం జరుగుతుంది మరియు ఇతన్ని నరకంలో పంపడం జరుగుతుంది. గమనించారా? నమాజులు ఉన్నాయి, ఉపవాసాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో రకాల విధిదానాలు, దానధర్మాలు ఉన్నాయి. కానీ కొట్టడం, తిట్టడం, అపనింద వేయడం, ఈ రకంగా ఎన్నో పాపాలకు గురి అయినందుకు వారందరూ కూడా వచ్చి ఇతనికి వ్యతిరేకంగా అల్లాహ్ వద్ద కేసు పెట్టినప్పుడు, ఇతని సత్కార్యాలన్నీ వారికి ఇవ్వడం జరుగుతుంది. సత్కార్యాలన్నీ ఇచ్చినప్పటికీ ఇంకా కొన్ని కేసులు మిగిలి ఉంటే, వారి యొక్క పాపాలు ఇతనిపై వేయబడి, ఇతన్ని నరకంలో పంపడం జరుగుతుంది. ఎంత నష్టం అవుతుందో కదా? అల్లాహ్ యొక్క ఎంత గొప్ప అనుగ్రహం, ఇలాంటి పరిస్థితులు రానున్నాయి, అందు గురించి ఇహలోకంలోనే జాగ్రత్త పడి అక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి అని మనకు చెప్పడం జరుగుతుంది.
ఈ విధంగా మహాశయులారా, ఎవరైతే ఇలాంటి అన్యాయాలకు పాల్పడతారో, ఇహలోకంలోనే వారి యొక్క ఆ హక్కు చెల్లించేసేయాలి. మన వద్ద చెల్లించడానికి ఏమీ లేకుంటే, కనీసం వారితో కలిసి, వారితో మాఫీ చేయించుకోవాలి. లేదా అంటే ప్రళయ దినాన ఇలాంటి ఘోరమైన శిక్షకు గురి కావలసి వస్తుంది, ప్రళయ దినాన మన యొక్క త్రాసు అనేది తేలికగా అయిపోతుంది.
తిర్మిజీలోని ఒక హదీథ్ లో ఉంది, ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు:
“అల్లాహ్ ఆ మనిషిని కరుణించు గాక, అతని ద్వారా ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగింది అంటే అతను వారితో క్షమాపణ కోరి లేదా వారికి ఏదైనా ఇచ్చే హక్కు ఉండేది ఉంటే ఇచ్చేసి ఇహలోకంలోనే ఎలాంటి బరువు లేకుండా, ఎలాంటి ఒకరిపై అన్యాయం లేకుండా ఉంటాడో, ఈ విధంగా ప్రళయ దినాన అతను కలుసుకున్నప్పుడు అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలను పొందుతాడు. కానీ ఎవరైతే ఇలా కాకుండా ప్రజల పట్ల అన్యాయాలకు గురి అయి వస్తాడో, ప్రళయ దినాన అల్లాహు త’ఆలా ఇతని పుణ్యాలు ఆ బాధితులకు ఇచ్చేస్తాడు. ఇతని వద్ద పుణ్యాలు లేనిచో, బాధితుల నుండి వారిపై జరిగిన అన్యాయానికి సమానంగా పాపాలు తీసుకుని ఇతనిపై వేయడం జరుగుతుంది.”
అందుగురించి మహాశయులారా, అన్ని స్థితుల్లో అల్లాహ్ తో భయపడుతూ ఉండాలి. ఎక్కడ ఎవరు ఏమీ చూడడం లేదు అని భావించకుండా మనం అన్ని రకాల సత్కార్యాల్లో ముందుకు ఉండాలి. ఎవరిపై కూడా ఎలాంటి అన్యాయం చేయకుండా జాగ్రత్త పడాలి.
ప్రజల పట్ల ఏదైనా అన్యాయం చేయడం, ఇది ఎంత భయంకరమైన పాపమో మన యొక్క సలఫె సాలెహీన్ రహిమహుముల్లాహ్ చాలా మంచి విధంగా గ్రహించేవారు. అందుకే సుఫ్యాన్ అస్-సౌరీ రహమహుల్లాహ్ ఒక సందర్భంలో చెప్పారు:
“నా మధ్య, అల్లాహ్ మధ్య 70 పాపాలు ఉండడం, నాకు, నా మధ్య మరియు నాలాంటి మనుషుల మధ్య ఒక్క పాపం ఉండడం కంటే ఎంతో ఇష్టమైనది. ఎందుకంటే నా మధ్య నా ప్రభువు మధ్య ఉండే పాపాల గురించి నేను డైరెక్ట్ గా క్షమాపణ కోరుకుంటే అది మన్నించడం జరుగుతుంది. కానీ నా మధ్య మరియు నాలాంటి దాసుని మధ్య ఉన్న పాపం అది నేను అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటే క్షమించబడదు. వెళ్ళి అతనితో క్షమాపణ కోరుకోవాలి, లేదా అతనికి ఏదైనా హక్కు ఇచ్చేది ఉంటే తప్పకుండా ఇవ్వాలి.”
ఇక ఇక్కడ ఒక విషయం గమనించండి మీరు కూడా. ఏ ఇస్లాం ధర్మం అయితే ఇతరులకు ఏ బాధ కలిగించకుండా, ఇతరులపై ఏ అన్యాయం చేయకుండా ప్రళయ దినాన హాజరు కావాలి అని నేర్పుతుందో, ఆ ఇస్లాం ధర్మం, ఇస్లాంకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాల్లో ఏయే అభాండాలు మోపడం జరుగుతుందో వాటన్నిటి శిక్షణ ఇస్లాం ఇస్తుంది అని చెప్పగలమా? బుద్ధి జ్ఞానంతో మనం గ్రహిస్తే, సోదరులారా, సోదరీమణులారా, సామాన్య జీవితంలో మామూలీ చిన్నపాటి ఏ అన్యాయానికి కూడా ఇస్లాం మనకు అనుమతి ఇవ్వదు. ఎందుకంటే దీనివల్ల ప్రళయ దినాన మన త్రాసు బరువు తగ్గిపోతుంది అని హెచ్చరించడం జరుగుతుంది.
ఇక యుద్ధ మైదానంలో ఉన్నప్పటికీ కూడా, యుద్ధంలో శత్రువులు మన ముంగట ఉన్న ఉండి, యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా ఏ ఒక్కరి పట్ల అన్యాయంగా ప్రవర్తించకుండా ఉండడానికి కూడా ఇస్లాం మనకు శిక్షణ ఇచ్చి ఉంది.
హజ్రత్ ముఆద్ ఇబ్ను అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖనం ప్రకారం, “మేము ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఒక యుద్ధంలో ఉన్నాము. ఆ యుద్ధంలో ఒక సందర్భంలో ఒకచోట మజిలీ చేయడం అవసరం పడింది. అయితే అప్పుడు ప్రవక్తతో ఉన్న ప్రజల్లో కొంతమంది దారిలో ప్రజలు నడిచేటువంటి దారిలో సైతం తమ యొక్క గుడారాలు వేసుకొని, ప్రజలకు నడవడంలో ఇబ్బంది కలిగే అటువంటి విధంగా ప్రవర్తించడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు.” ఏం చెప్పారు అప్పుడు?
గమనించండి. ఈ రోజుల్లో సిటీలలో ప్రజలు నడిచే దారిని కూడా ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఆ రోజుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధ మైదానంలో ఉన్నారు. ఎడారిలో. కానీ ప్రజలు అడపాదడపా వచ్చిపోయే దారిలో గుడారాలు వేసుకొని, టెంట్ వేసుకొని ప్రజలకు నడవడంలో ఇబ్బంది కలిగే విధంగా ఉండడాన్ని కూడా ఇష్టపడలేదు. అదే సందర్భంలో ఎలాంటి ఆదేశం జారీ చేశారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు: “ఎవరైతే ప్రవక్తతో యుద్ధంలో పాల్గొన్నాము, చాలా పుణ్యాలు మనం పొందుతాము అన్నటువంటి సంతోషంలో పడి ఉన్నారో కానీ దారిలో ఏదైనా గుడారం వేసి, టెంట్ వేసి ప్రజలకు నడిచే దారిలో వారికి ఇబ్బంది కలుగజేస్తున్నారో, అలాంటి వారికి ఆ యుద్ధం యొక్క ఏ పుణ్యమూ లభించదు.” ఏ పుణ్యమూ లభించదు అంటే ఏమిటి? యుద్ధం పాల్గొనే యొక్క గొప్ప పుణ్యం ఏదైతే ఉందో, దానిని ఇలాంటి చిన్నపాటి అన్యాయం అని అనుకుంటారు కావచ్చు, మరికొందరైతే దీనిని ఏ అన్యాయము అని కూడా భావించరు కావచ్చు, అలాంటి విషయాన్ని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహించడం లేదు.
అందుగురించి మహాశయులారా, మనం ప్రజల పట్ల ఉత్తమ రీతిలో ప్రవర్తించాలి. వారిపై మన నుండి ఏ ఒక్క చిన్నపాటి అన్యాయం ఉండకూడదు లేదా అంటే ప్రళయ దినాన మనం చాలా నష్టపోయే వారిలో కలుస్తాము.
12. దుష్ప్రవర్తన
ప్రళయ దినాన మన త్రాసు తేలికగా అయ్యే పాప కార్యాల్లో 12వ విషయం, దుష్ప్రవర్తన.
త్రాసును బరువుగా చేసే సత్కార్యాలలో సత్ప్రవర్తన అని విన్నాము కదా? అయితే త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల్లో దుష్ప్రవర్తన.
దుష్ప్రవర్తనకు సంబంధించిన విషయం మనం ఎప్పుడైతే సత్ప్రవర్తన గురించి విన్నామో, అక్కడ ఒక హదీసు విన్నాము. అదేమిటంటే అల్లాహ్ కు ప్రియమైన వారిలో, ఎవరైతే ప్రజల పట్ల ప్రయోజనకరంగా జీవిస్తారో మరియు అల్లాహ్ కు ఇష్టమైన ప్రియమైన కార్యాల్లో ఒక ముస్లింని సంతోషపెట్టడం, వారిపై ఏదైనా అప్పు ఉంటే అప్పు చెల్లించడంలో సహాయం చేయడం, వారికి ఏదైనా కష్టం ఉంటే ఆ కష్టం తొలగిపోవడంలో వారికి సహాయం చేయడం, ఈ విధంగా ఎన్నో విషయాలు వింటూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు అని కూడా మనం విన్నాము: “నేను నా ఈ మస్జిద్ లో ఏతెకాఫ్ చేయడం కంటే నా యొక్క సోదరుని అవసరాన్ని తీర్చడం నాకు ఎక్కువ ఇష్ట కార్యం.”
ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
వినండి, నిశ్చయంగా దుష్ప్రవర్తన మీ సర్వ సత్కార్యాలను భస్మం చేసేస్తుంది. మీ సర్వ సత్కార్యాల సత్ఫలితాన్ని నశింపజేస్తుంది, ఎలాగైతే వెనిగర్ తేనె యొక్క తీపిని నశింపజేస్తుందో.
ఒకసారి అనుభవించి చూడండి, ఎంత క్వాలిటీ గల, స్వచ్ఛమైన, ఎలాంటి కలుషితం లేకుండా తేనె మీ వద్ద ఉన్నా, అందులో మీరు వెనిగర్ కలిపారంటే, ఆ వెనిగర్ అనేది ఆ తేనెపై ఎంత దుష్ప్రభావం చూపుతుందో, అలాగే మీ దుష్ప్రవర్తన అనేది మీ సర్వ సత్కార్యాలను నశింపజేస్తుంది.
అందు గురించి మహాశయులారా, మనం ఒకరి పట్ల దుష్ప్రవర్తన ప్రవర్తించకూడదు. ప్రతి ఒక్కరితో ఉత్తమంగా ప్రవర్తించే ప్రయత్నం చేయాలి. ఇంట్లో భార్యాభర్తల్లో గాని, తల్లిదండ్రులు పిల్లలతో గాని, పిల్లలు తల్లిదండ్రులతో గాని, పరస్పరం సోదర సోదరీమణులు ఒకరి పట్ల ఒకరు, ఈ విధంగా ఇంటి బయటికి వెళ్ళిన తర్వాత ప్రజల పట్ల కూడా మన వ్యవహారం చాలా ఉత్తమంగా ఉండాలి.
13. ముస్లిం పరువుకు భంగం కలిగించడం
ప్రళయ దినాన మన త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల్లో 13వ విషయం, ముస్లిం యొక్క, ఒక విశ్వాసునిపై ఏదైనా అపనింద వేసి అతన్ని అవమాన పాలు చేయడం.
మహాశయులారా, ఇది చూడడానికి చిన్న విషయం కానీ, మహా భయంకరమైన పాపం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:
“ఒక ముస్లింను అన్యాయంగా, అక్రమంగా అవమానించడం ఇది వడ్డీలో అతి భయంకరమైన భాగం“
అంటే ఏమిటి? వడ్డీ ఎలాగైతే పుణ్యాన్ని నశింపజేస్తుందో, ఆ విధంగా ఒక ముస్లింపై మనం ఏదైనా అపనింద వేసాము, అతన్ని అవమాన పాలు చేసాము అంటే ఈ రకంగా మనకు చాలా నష్టం కలుగుతుంది. ఇది కూడా దుష్ప్రవర్తనలో వచ్చేస్తుంది, సత్ప్రవర్తనకు వ్యతిరేకంగా ఉంటుంది.
అల్లాహు త’ఆలా మనందరికీ కూడా మన త్రాసును బరువు చేసే సత్కార్యాలు చేసే భాగ్యం ప్రసాదించి, త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల నుండి దూరం ఉండే భాగ్యం ప్రసాదించు గాక. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ముస్లింలు దేన్ని తమ గీటురాయిగా తీసుకోవాలి? వక్త: హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్) https://youtu.be/7wdS1-T5Pkg [15 నిముషాలు]
ఈ ప్రసంగంలో, ముస్లింలు తమ జీవితంలోని ప్రతి విషయంలోనూ, ప్రతి సమస్యలోనూ అంతిమ గీటురాయిగా దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన ప్రవక్త ప్రవచనాలను (హదీసులను) మాత్రమే స్వీకరించాలని వక్త నొక్కి చెప్పారు. పూర్వీకుల ఆచారాలు, వ్యక్తిగత కోరికలు లేదా ఇతరుల అభిప్రాయాలు ఈ రెండు మూలాలకు విరుద్ధంగా ఉంటే వాటిని అనుసరించవద్దని హెచ్చరించారు. అల్లాహ్ అవతరింపజేసిన దాని ప్రకారం తీర్పు చేయకపోవడం యొక్క తీవ్రమైన పరిణామాలను వివరించడానికి సూరహ్ మాయిదాలోని వాక్యాలను ఉదహరించారు. అలాంటి చర్యలను అవిశ్వాసం (కుఫ్ర్), దుర్మార్గం (జుల్మ్), మరియు అవిధేయత (ఫిస్ఖ్)గా వర్గీకరించారు. అల్లాహ్ చట్టం కంటే తమ చట్టం గొప్పదని భావించి తీర్పు ఇవ్వడం (పెద్ద కుఫ్ర్) మరియు అల్లాహ్ చట్టం యొక్క ఆధిక్యతను విశ్వసిస్తూనే ప్రాపంచిక కోరికల కారణంగా దానిని ఉల్లంఘించడం (చిన్న కుఫ్ర్) మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేశారు. సమాజంలోని వివాదాలు మరియు తగాదాలకు దైవిక చట్టాన్ని ప్రమాణంగా విడిచిపెట్టడమే కారణమని ఒక హదీసుతో ప్రసంగాన్ని ముగించారు.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బాద్.
అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ముస్లింల గీటురాయి – ఖుర్ఆన్ & హదీసులు
ఈ రోజు మనం ముస్లిములు దేనిని తమ గీటురాయిగా తీసుకోవాలి అనే విషయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ప్రియ వీక్షకులారా, సాధారణంగా మనం మన సమాజంలో చూసేది ఏమిటి? ఏదైనా తీర్పు ఇవ్వాలన్నా, ఏదైనా సమస్యకి పరిష్కారం చూపించాలన్నా, నిర్ణయించాలన్నా, ఈ ఆచారం మా తాత ముత్తాతల నుంచి వస్తా ఉంది, మా అమ్మానాన్న ఇలాగే నేర్పించారు, మా గురువులు ఇలాగే చేసేవారు, అది న్యాయమైనా, అన్యాయమైనా, సత్యమైనా, అసత్యమైనా, ఇది పక్కన పెట్టి, న్యాయం-అన్యాయం, సత్యం-అసత్యం, మంచి విధానం, చెడు విధానం, కరెక్టా కాదా ఇవి పక్కన పెట్టి, ముందు నుంచి వస్తా ఉంది కాబట్టి కొనసాగిస్తున్నారు. కాకపోతే ఇస్లాంలో అలా చెల్లదు.
ముస్లిములు దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు అంటే ప్రామాణికమైన హదీసులను గీటురాయిగా తీసుకోవడం తప్పనిసరి, విధి అని మనం తెలుసుకోవాలి. అమ్మానాన్నతో నేర్చుకోవాలి, కాకపోతే అమ్మానాన్న, తల్లిదండ్రులు దేనిని గీటురాయిగా తీసుకుని నేర్పించారు? గురువులతో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కానీ ఆ గురువులు దేనిని గీటురాయిగా తీసుకుని మనకి నేర్పించారు? విజ్ఞులతో, జ్ఞానులతో, పండితులతో తెలుసుకోవాలి. కాకపోతే వారు దేనిని గీటురాయిగా తీసుకుని మనల్ని నేర్పించారు అనేది ముఖ్యమైన విషయం, తెలుసుకోవలసిన విషయం.
అభిమాన సోదరులారా, ప్రతి విషయంలో, అమ్మానాన్న విషయంలో, భార్యాపిల్లల విషయంలో, ఇరుగుపొరుగు వారి విషయంలో, బంధుమిత్రుల విషయంలో, స్నేహితుల విషయంలో, అనాథల విషయంలో, వితంతువుల విషయంలో, ఇరుగుపొరుగు వారి విషయంలో, అది వ్యాపారమైనా, వ్యవసాయమైనా, ఉద్యోగమైనా, రాజకీయపరమైనా, ఏ రంగంలోనైనా సరే ఒక తీర్పు ఇస్తే, ఒక పరిష్కారం చేస్తే అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశాలు మరియు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానం ప్రకారంగానే ఉండాలి. ఖుర్ఆన్ మరియు హదీసులు మాత్రమే గీటురాయిగా మనం తీసుకోవాలి, చేసుకోవాలి.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరహ్ మాయిదా, ఆయత్ 49లో ఇలా సెలవిచ్చాడు:
“(ఓ ప్రవక్తా!) అల్లాహ్ అవతరింపజేసిన దానికనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి. వాళ్ళ కోరికలను ఎంత మాత్రం అనుసరించకు.” (5:49)
అంటే, నీవు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పంపిన చట్టం ప్రకారం ప్రజల వ్యవహారాలను పరిష్కరించు. ఏదైనా తీర్పు ఇస్తే, ఏదైనా సమస్యకి పరిష్కారం చూపిస్తే అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశం ప్రకారం ఉండాలి, అల్లాహ్ యొక్క చట్ట ప్రకారం ఉండాలి, అల్లాహ్ యొక్క ఆజ్ఞ పరంగా ఉండాలి.
وَلَا تَتَّبِعْ اَهْوَاۤءَهُمْ (వలా తత్తబిఅ అహ్వాఅహుమ్) “వారి కోరికలను ఎంత మాత్రం అనుసరించకు.“
వారు బంధువులని, స్నేహితులని, మిత్రులని, తెలిసిన వారని, లేకపోతే వారు సమాజంలో వారు హోదాలో మంచి హోదాలో, మంచి పొజిషన్లో ఉన్నారని, ఆ ఉద్దేశంతో తీర్పు చేయకూడదు. వారు ఎవ్వరైనా సరే, అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, ఇరుగుపొరుగు వారు, స్నేహితులు, గురువులు, తెలిసిన వారు, తెలియని వారు ఎవ్వరైనా సరే. ధనవంతులు, పేదవారు, ఉన్నవారు, లేనివారు ఎవ్వరైనా సరే అందరికీ ఒకటే ధర్మం, అందరికీ ఒకటే న్యాయం, అందరికీ ఒకటే విధానం.
وَاَنِ احْكُمْ بَيْنَهُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ (వ అనిహ్కుమ్ బైనహుమ్ బిమా అన్జలల్లాహ్) “(ఓ ప్రవక్తా!) అల్లాహ్ అవతరింపజేసిన దానికనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి.”
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చట్టం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశం ఏమిటి? ఆయన యొక్క ఆజ్ఞ ఏమిటి? ఆయన ఏ విధంగా మనకు సెలవిచ్చాడు? మరియు దానికి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విషయంలో ఆయన ప్రవచనం ఏమిటి? ఆయన విధానం ఏమిటి? ఇది మనకు తప్పనిసరి.
ఇదే ఆయత్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చివరి భాగంలో ఇలా సెలవిచ్చాడు:
وَاِنَّ كَثِيْرًا مِّنَ النَّاسِ لَفٰسِقُوْنَ (వ ఇన్న కసీరమ్ మినన్నాసి లఫాసిఖూన్) “ప్రజల్లో చాలా మంది అవిధేయులే ఉంటారు.“(5:49)
ఫాసిఖ్ అంటే అవిధేయుడు, కరప్ట్, దురాచారి. అంటే ప్రజలలో చాలా మంది అల్లాహ్ ఆజ్ఞలకు, ఆదేశాలకు విరుద్ధంగా తీర్పుని ఇస్తున్నారన్నమాట. పట్టించుకోవటం లేదు. నేను ఎవరిని నమ్ముతున్నాను? ఎవరి పట్ల నేను విశ్వాసం కలిగి ఉన్నాను? ఎవరి కలిమా నేను చదువుతున్నాను? ఎవరి విధేయత నేను చూపాలి? ఎవరిని నేను ఆదర్శంగా తీసుకున్నాను? ఇవి కాకుండా, మనోమస్తిష్కాలకు గురై, ప్రపంచ వ్యామోహానికి గురై, ఏదో ఒక కారణంగా అల్లాహ్ ఆదేశాలను, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలను పక్కన పెట్టి, మన కోరికల పరంగా, లేకపోతే వారు బంధువులని, తెలిసిన వారని, ఉన్న వారని, ఏదో ఒక సాకుతో వారికి అనుగుణంగా, వారి కోరికలకు సమానంగా తీర్పు ఇవ్వకూడదు అన్నమాట.
అభిమాన సోదరులారా, ఈ వాక్యంలో అల్లాహ్ ఏం తెలియజేశాడు? ఎవరైతే అల్లాహ్ ఆదేశాలను కాకుండా, అల్లాహ్ చట్టపరంగా కాకుండా, దానికి విరుద్ధంగా తీర్పునిస్తే వారు ఫాసిఖ్, అవిధేయులు, కరప్టెడ్, దురాచారులు అని అల్లాహ్ తెలియజేశాడు. అలాగే, అదే సూరహ్, సూరహ్ మాయిదా వాక్యం 45లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
ఎవరైతే అల్లాహ్ ఆదేశం ప్రకారం, అల్లాహ్ చట్టం ప్రకారం తీర్పు ఇవ్వకపోతే, వారు దుర్మార్గులు. అంటే అల్లాహ్ చట్టం ప్రకారం తీర్పు ఇవ్వని వారే దుర్మార్గులు, దౌర్జన్యులు అని అల్లాహ్ సెలవిచ్చాడు. అంటే, అల్లాహ్ చట్టం ప్రకారం, అల్లాహ్ ఆదేశం ప్రకారం, అనగా ఖుర్ఆన్ మరియు హదీసుల పరంగా తీర్పు ఇవ్వకపోతే, వారు జాలిమీన్, దుర్మార్గులు, దౌర్జన్యపరులు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సెలవిచ్చాడు. అలాగే అదే సూరహ్, ఆయత్ 44 లో ఇలా సెలవిచ్చాడు:
وَمَنْ لَّمْ يَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الْكٰفِرُوْنَ (వమల్లమ్ యహ్కుమ్ బిమా అన్జలల్లాహు ఫ ఉలాఇక హుముల్ కాఫిరూన్) “ఎవరు అల్లాహ్ అవతరింపజేసిన వహీ ప్రకారం తీర్పు చెయ్యరో వారే (కరడుగట్టిన) అవిశ్వాసులు.” (5:44)
అభిమాన సోదరులారా, ఈ విషయం మనం బాగా గమనించాలి. ఒకే సూరహ్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యం 44, అదే సూరహ్ వాక్యం 45, అదే సూరహ్ వాక్యం 49లో, అల్లాహ్ చట్టం ప్రకారం, అల్లాహ్ ఆదేశాల ప్రకారం తీర్పు ఇవ్వకపోతే, ఒక ఆయతులో ఫాసిఖీన్ అన్నాడు, వారు ఫాసిఖులు, దౌర్జన్యపరులు, దురాచారులు అన్నారు. ఇంకో ఆయతులో జాలిమూన్ అన్నాడు, దౌర్జన్యపరులు, దుర్మార్గులు అన్నాడు. ఇంకో ఆయతులో కాఫిరూన్ అన్నాడు, అంటే వారు అవిశ్వాసులు.
అంటే ఇంత గమనించే విషయం ఇది. మనము జీవితానికి సంబంధించిన అది విశ్వాసం అయినా, ఆరాధన అయినా, వ్యాపారం అయినా, వ్యవసాయం అయినా, రాజకీయం అయినా, నడవడిక అయినా, ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే మనము తీర్పు ఇవ్వాలంటే గీటురాయిగా తీసుకోవాలంటే అది అల్లాహ్ ఆదేశం, అంతిమ దైవప్రవక్త యొక్క ప్రవచనం.
అల్లాహ్ చట్టంతో తీర్పు ఇవ్వకపోవటంలోని రకాలు
అభిమాన సోదరులారా, అలా చేయకపోతే ఇస్లాంకు వ్యతిరేకమైన చట్టాలను అమలు చేయడాన్ని ధర్మ సమ్మతంగా భావించడం, ఇస్లాంకు వ్యతిరేకంగా, ఖుర్ఆన్కి వ్యతిరేకంగా, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలకు వ్యతిరేకంగా అమలు చేయడాన్ని ఇది కరెక్టే, సమ్మతమే అని భావించడం కుఫ్ర్ అక్బర్ అవుతుంది. పెద్ద అవిశ్వాసం. అంటే ఆ వ్యక్తి ఇస్లాం నుంచి తొలగిపోతాడు.
ఇబ్నె బాజ్ రహమతుల్లాహి అలైహి ఇలా సెలవిచ్చారు, ఎవరైనా తీర్పు ఇస్తే, అది రెండు రకాలుగా ఉంటుంది అన్నారు.
మొదటి రకం ఏమిటి? (ఇదా హకమ బిగైరి మా అన్జలల్లాహ్) అల్లాహ్ చట్టం ప్రకారం కాకుండా, అల్లాహ్ యొక్క ఆదేశాలకు విరుద్ధంగా తీర్పు ఇస్తే, ఎందుకు ఇస్తున్నాడు ఆ తీర్పు ఆ వ్యక్తి? (యఅతఖిదు హల్ల దాలిక్), అతని ఉద్దేశం ఏమిటి? నేను ఇచ్చే తీర్పు, దీంట్లో పరిష్కారం ఉంది ఆ సమస్యకి. అల్లాహ్ ఆదేశంలో ఆ పరిష్కారం లేదు, నా తీర్పులో ఆ పరిష్కారం ఉంది అని భావించి ఆ తీర్పు ఇస్తే, లేదా (అవ అన్న దాలిక అఫ్దల్), నా తీర్పు, నా నిర్ణయం, నా న్యాయం అల్లాహ్ ఆదేశం కంటే గొప్పది, మేలైనది అని భావిస్తే, (అవ్ అన్నహు యుసావి లిష్షరిఅ), లేకపోతే నా తీర్పు కూడా అల్లాహ్ తీర్పుకి సమానంగానే ఉంది, షరిఅత్కి సమానంగానే ఉంది అనే ఉద్దేశంతో తీర్పు ఇస్తే, (కాన కాఫిరన్ ముర్తద్దన్), ఆ వ్యక్తి కాఫిర్ అయిపోతాడు, ముర్తద్ అయిపోతాడు. అంటే ఇస్లాం నుంచి తొలగిపోతాడు.
ఏ ఉద్దేశంతో? నేను ఇచ్చే న్యాయం తీర్పు, నేను చేసే న్యాయం, నేను అవలంబించే విధానం ఇది అల్లాహ్ ఆదేశం కంటే గొప్పది లేదా దానికి సరైనది, సమానంగా ఉంది అని ఆ ఉద్దేశంతో భావించి తీర్పు ఇస్తే, అటువంటి న్యాయం, అటువంటి తీర్పు, అటువంటి వ్యక్తి ఇస్లాం నుంచి తొలగిపోతారు, కాఫిర్ అవిశ్వాసి అయిపోతారు, ముర్తద్ అయిపోతారు.
రెండో రకమైన తీర్పు ఏమిటి? (అమ్మా ఇదా హకమ బిగైరి మా అన్జలల్లాహ్), అల్లాహ్ చట్టానికి విరుద్ధంగా, అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా తీర్పు ఇస్తున్నాడు, ఉద్దేశం ఏమిటి? (లిహవా), తన కోరికలకి అనుగుణంగా, కోరికలకి బానిసైపోయి ఇస్తున్నాడు, కోరికలను పూర్తి చేసుకోవటానికి. (అవ్ లిమకాసిద్ సయ్యిఅ) చెడు ఉద్దేశం కోసం, చెడు కారణాల కోసం. (అవ్ లితమఇన్), లేకపోతే ఏదో ఒక ఆశించి. (అవ్ లిర్రిశ్వా) లంచం కోసం. నేను అల్లాహ్ యొక్క ఆదేశానికి విరుద్ధంగా తీర్పు ఇస్తే నాకు ఇంత డబ్బు వస్తుంది, లంచం వస్తుంది, ధనం వస్తుంది, ఈ ఉద్దేశంతో తీర్పు ఇస్తే, అంటే అతని మనసులో అతని విశ్వాసం, అతని నమ్మకం ఏమిటి? నా తీర్పు అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా ఉంది, ఇది తప్పే. కాకపోతే నేను ఈ విధంగా తీర్పు ఇస్తే నాకు ప్రపంచపరంగా, ఆర్థికపరంగా నాకు డబ్బు వస్తుంది, ధనం వస్తుంది, నా కోరికలు పూర్తి అవుతాయి అని ఈ దురుద్దేశంతో తీర్పు ఇస్తున్నాడు. మనసులో మాత్రం అల్లాహ్ తీర్పే గొప్పది అని నమ్మకం ఉంది. అటువంటి వ్యక్తి ఘోరమైన పాపాత్ముడు అవుతాడు. దీనిని చిన్న షిర్క్ అంటారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రతి చిన్న, పెద్ద కుఫ్ర్ నుండి, షిర్క్ నుండి రక్షించుగాక, కాపాడుగాక.
అంటే, నా నిర్ణయం, నా తీర్పు అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా ఉన్నా నాదే గొప్పది అని భావించి ఇస్తే, అతను పెద్ద కుఫ్ర్, ముర్తద్ అయిపోతాడు. మనోవాంఛలకు, డబ్బుకి ఆశించి, కోరికలకి లోనై తీర్పు ఇస్తే పాపాత్ముడు అవుతాడు, చిన్న కుఫ్ర్ అవుతుంది, చిన్న అవిశ్వాసం అవుతుంది.
అభిమాన సోదరులారా, చివర్లో ఒక్క హదీస్ చెప్పి నేను నా ఈ మాటని ముగిస్తాను. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “వారి నాయకులు దైవగ్రంథం ప్రకారం తీర్పు చేయకుంటే, అల్లాహ్ అవతరింపజేసిన చట్టాన్ని ఎన్నుకోకుంటే, అల్లాహ్ వారి మధ్యన వివాదాలను, తగాదాలను సృష్టిస్తాడు.” ఈ హదీస్ ఇబ్నె మాజాలో ఉంది.
ఇప్పుడు పూర్తి సమాజంలో, ప్రపంచంలో మన పరిస్థితి ఏమిటి? మనకి అర్థమవుతుంది. మనం ఎందుకు ఈ విధంగా వివాదాలకు గురై ఉన్నాము, తగాదాలకు గురై ఉన్నాము అంటే, మన తీర్పులు, మన వ్యవహారాలు, మనం చేసే విధానము, మనం తీసుకున్న గీటురాయి అది ఖుర్ఆన్ మరియు హదీస్ కాదు. మనం తీసుకున్న గీటురాయి అది అల్లాహ్ ఆదేశాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు కాదు.
ఎప్పుడైతే మనం అల్లాహ్ ఆదేశాల పరంగా తీర్పు ఇవ్వమో, అల్లాహ్ ఆదేశాలను, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలను గీటురాయిగా తీసుకోమో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన మధ్య వివాదాలను, తగాదాలను సృష్టిస్తాడు. అది ఇప్పుడు మనము కళ్ళారా చూస్తున్నాము.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన హదీసులను గీటురాయిగా తీసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ప్రతి విషయంలో, ప్రతి సమస్యలో, ప్రతి సమయంలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క ఆదేశాలను గీటురాయిగా తీసుకొని తీర్పునిచ్చే సద్బుద్ధిని అల్లాహ్ మనందరినీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇహపరలోకాలలో సాఫల్యం ప్రసాదించుగాక.
వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
169 – حديث مَيْمُونَةَ، قَالَتْ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا أَرَادَ أَنْ يُبَاشِرَ امْرَأَةً مِنْ نِسَائِهِ، أَمَرَهَا فَاتَّزَرَتْ وَهِيَ حَائِضٌ __________ أخرجه البخاري في: 6 كتاب الحيض: 5 باب مباشرة الحائض
169. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ మైమూన (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన భార్యలలో ఎవరితోనైనా దేహానికి దేహం ఆనించ దలచుకున్నప్పుడు, * ఆమె బహిష్టు అయి ఉంటే, (లంగోటిలాంటి) లో ఉడుపు కట్టుకోమని ఆమెను ఆదేశించేవారు.
[సహీహ్ బుఖారీ : 6వ ప్రకరణం, – హైజ్, 5వ అధ్యాయం]
* ఇక్కడ మూలభాషలో ‘ముబాషిరత్‘ అనే పదం వచ్చింది. అంటే శరీరంతో శరీరం కలపడం అని అర్థం. అంతేగాని ఇక్కడ సందర్భాన్ని బట్టి లైంగిక సంపర్కం అనే భావం రాదు. ఎందుకంటే దివ్యఖుర్ఆన్ఆ “రుతుస్రావం గురించి ఆజ్ఞ ఏమిటని అడుగుతున్నారు వారు, ఆదొక అపరిశుద్ధావస్థ అనీ, ఆ స్థితిలో భార్యలకు దూరంగా ఉండాలని, వారు (స్నానం చేసి) పరిశుభ్రం కానంత వరకు వారి దగ్గరకు వెళ్ళకూడదని చెప్పెయ్యి” అని ఉంది. (2:222)
2వ అధ్యాయం – ఒకే దుప్పటిలో బహిష్టు స్త్రీతో కలసి పడుకోవడం الاضطجاع مع الحائض في لحاف واحد
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దివ్యఖుర్ఆన్, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసులు, ఉలమాల వ్యాఖ్యానాల వెలుగులో పుస్తకం ద్వారా క్రింది విషయాలను నిరూపించే ప్రయత్నం జరిగింది.
1. వరకట్నం సంతోషంగా ఇచ్చినా, ఆచారంగా ఇచ్చినా, డిమాండ్ చేసి తీసుకున్నా మగవాడికి ఇది హరామ్. ఎందుకంటే ఇది ఒక లంచం, ఇది సామాజిక బ్లాక్ మెయిల్, ఒక బిచ్చం, ఒక ఉపద్రవం. ఇలాంటి పెళ్ళిళ్ళలో పాల్గొనకుండా బాయ్ కాట్ చేయడం ప్రతి ముస్లిమ్ కు ధార్మిక, నైతిక బాధ్యత.
2. వధువు వీడ్కోలు సందర్భంగా వధువు కన్నవాళ్ళపై వీడ్కోలు విందు భోజనాల భారం వేయడం, ఇది సంతోషంగా జరిగినా, డిమాండ్ వల్ల జరిగినా లేక ఆచారం కారణంగా అయినా గాని ఇది నేటి అతి పెద్ద బిద్అత్. ఇది దుబారా ఖర్చు. అవసరం లేకపోయినా సృష్టించిన దుబారా ఖర్చు (ఇస్రాఫ్). ఇది కూడా హరామ్ అవుతుంది. ఇలాంటి విందుల్లో పాల్గొనడం హరామ్ పనులను ప్రోత్సహించడమే అవుతుంది. ఇలాంటి విందుభోజనాలను బాయ్ కాట్ చేయడం గౌరవోన్నతులకు నిదర్శనం.
3. వరుడి తరపు వాళ్ళు వీడ్కోలు రోజునే భోజనాలు చేయించడంలో ఎలాంటి తప్పు లేదని చాలా మంది ఉలమాల అభిప్రాయం. ఈ పద్దతి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సంప్రదాయాల్లో కనబడుతుంది. అరబ్బు ప్రపంచంలోని ఉలమాలు ఈ పద్ధతిని బలపరుస్తున్నారు. వలీమా వీడ్కోలు రోజున కూడా తినిపించవచ్చని అంటారు. ఎందుకంటే వలీమా నిజానికి ఒక ప్రకటన మాత్రమే. అది నికాహ్ జరిగిన తర్వాత ఆ రోజునే చేయవచ్చు. దీనివల్ల లక్షలాది తల్లిదండ్రులపై ఆర్థికభారం తగ్గుతుంది. అనేకమందికి కాలం ,ధనం వ్యర్ధం కాకుండా ఉంటుంది. కొందరు వలీమా చేయడానికి ఒక ప్రత్యేక నిబంధన పూర్తికావడం తప్పనిసరని చెబుతుంటారు. అలాంటి వాళ్ళు వలీమాకు అడ్వాన్సుగా ఆహ్వానాలు ఎలా ఇస్తారు. వలీమాకు ఆహ్వానాలు ఎలా అడ్వాన్సుగా ఇవ్వవచ్చో అదేవిధంగా వలీమా లేదా రిసెప్షన్ కూడా నికాహ్ రోజునే అడ్వాన్సుగా చేయవచ్చు. కాబట్టి నికాహ్ రోజునే వలీమాగా ఒకే విందు జరిగే పెళ్ళిళ్ళను ప్రోత్సహించాలి. పురుషుడు తన ఖర్చుతో భోజనాలు పెట్టించాలి. అంతేకాని వధువు కన్నవాళ్ళపై తన అతిథుల భారం వేయరాదు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
జనం నోళ్లల్లో నానిపోయే చిన్న చిన్న హదీసులను ఏర్చికూర్చి రూపొందించిన చిరుపుస్తకం. ఎంతో వినసొంపుగా ఉండే ఈ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసులు పాఠకుల సంభాషణను సుసంపన్నం చేస్తాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పలుకుల్లోని ఆ లాలిత్యం మన మాటల్లోనూ జాలువారాలని, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పదాల్లోని పదునుతో మన భావాల్లోను పటుత్వం రావాలని – ఆ దివ్య ప్రవచనాల తెలుగు లిపిని రంగురంగుల ఆకర్షణీయమైన నిండు వాల్ పేపర్స్ పై ఎంతో రమణీయంగా తీర్చిదిద్ది రూపొందించిన పుస్తకం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
99. సూరా అజ్ జిల్ జాల్ (భూకంపం) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) https://youtu.be/BaJGDgkkjvc [38 min] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ సూరా మదీనా కాలానికి చెందినది. ఇందులో 8 ఆయతులు ఉన్నాయి. తీర్పుదినం గురించి ఈ సూరా ముఖ్యంగా బోధించింది. ఈ సూరాలో ప్రస్తావనకు వచ్చిన ‘జిల్ జాల్’ (భూకంపం) అన్న పదాన్ని దీనికి పేరుగా పెట్టడం జరిగింది. తీర్పుదినం నాటి భయానక స్థితిని, ఆనాటి ప్రకంపనాలను ఈ సూరా వర్ణించింది. ఆ రోజు భూమి తీవ్రంగా కుదిపివేయ బడుతుంది. భూగర్భంలో ఉన్న సమస్తాన్ని వెళ్ళ గ్రక్కుతుంది. అంటే మృతులను బయటకు వెళ్ళగ్రక్కుతుంది. ప్రజలు ఆ రోజు తమ కర్మలను చూసుకునేందుకు భిన్న పరిస్థితుల్లో తమ ప్రభువు వైపునకు మరలుతారు. శిక్షా లేదా బహుమానాలు పొందుతారు.
ఈ ప్రసంగం ఖురాన్లోని 99వ అధ్యాయం, సూరతుల్ జిల్జాల్ యొక్క వివరణాత్మక వ్యాఖ్యానం (తఫ్సీర్). భూమి తీవ్రంగా ప్రకంపించబడటం, తనలోని శవాలను, నిధులను బయటకు వెళ్లగ్రక్కడం, మానవుడు నిశ్చేష్టుడై “దీనికేమైంది?” అని ప్రశ్నించడం వంటి ప్రళయదినపు భయానక సంఘటనలను వక్త వివరిస్తారు. ఈ సూరా యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దానిని తన నమాజులో పఠించడం, అది సహచరులపై చూపిన గాఢమైన ప్రభావం గురించిన హదీసులను ఉదహరిస్తారు. భూమి స్వయంగా మానవుడు చేసిన ప్రతి చిన్న, పెద్ద కర్మకు సాక్ష్యమిస్తుందని, జవాబుదారీతనం అనే ప్రధాన సందేశాన్ని ఈ సూరా తెలియజేస్తుందని వివరిస్తారు. అణువంత మంచి చేసినా, చెడు చేసినా అది దాని కర్తకు చూపించబడుతుందని, కనుక ఈ జీవితంలో మన కర్మల పట్ల జాగ్రత్త వహించాలని శ్రోతలను హెచ్చరిస్తూ ప్రసంగం ముగుస్తుంది.
السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.)
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ (అవూజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్) శాపగ్రస్తుడైన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ (బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్) అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో (ప్రారంభిస్తున్నాను).
إِذَا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا (ఇదా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా) భూమి చాలా తీవ్రమైన తన ప్రకంపనలతో కంపింపజేయబడినప్పుడు (సూరా అజ్-జిల్జాల్ 99:1)
ఇదా జుల్జిలత్. కంపించ చేయబడినప్పుడు. అల్ అర్ద్, భూమి. మళ్ళీ దాని యొక్క మస్దర్ జిల్జాలహా అని ఏదైతే వచ్చిందో, హా అంటే ఆ భూమి అని దాని వైపునకు సైగ చేయడం జరుగుతుంది. జిల్జాల్ అని వచ్చిన మరోసారి చెప్పబడిన పదానికి తీవ్రమైన రీతిలో. అంటే ఏమిటి? భూమి చాలా తీవ్రమైన తన ప్రకంపనలతో కంపించ చేయబడినప్పుడు.
وَأَخْرَجَتِ الْأَرْضُ أَثْقَالَهَا (వ అఖ్రజతిల్ అర్దు అస్ఖాలహా) మరి భూమి తన బరువులన్నింటినీ తీసి బయట పడవేసినప్పుడు, (సూరా అజ్-జిల్జాల్ 99:2)
వ అఖ్రజత్ బయట పడవేసినప్పుడు. అల్ అర్ద్ ఆ భూమి. దేనిని బయట పడేసినప్పుడు? తనలో ఉన్నటువంటి బరువులన్నింటినీ. మరి భూమి తన బరువులన్నింటినీ తీసి బయట పడవేసినప్పుడు,
وَقَالَ الْإِنسَانُ مَا لَهَا (వ ఖాలల్ ఇన్సాను మాలహా) “అరె! దీనికేమైపోయిందీ?” అని మనిషి (కలవరపడుతూ)అంటాడు. (సూరా అజ్-జిల్జాల్ 99:3)
మనిషి అంటాడు, మాలహా? అరె! దీనికి ఏమైపోయింది?
يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا (యౌమఇదిన్ తుహద్దిసు అఖ్బారహా) ఆ రోజు భూమి తన సంగతులన్నీ వివరిస్తుంది. (సూరా అజ్-జిల్జాల్ 99:4)
యౌమఇదిన్ ఆ రోజు తుహద్దిసు వివరిస్తుంది. అఖ్బారహా. తుహద్దిసు అంటే ఇక్కడ అర్ద్. అరబీలో అర్ద్ స్త్రీలింగం, ఫీమేల్ వర్డ్ గా ఉపయోగించడం జరుగుతుంది. అందుకొరకే తుహద్దిసు వచ్చింది. పురుషలింగం అయితే యుహద్దిసు వచ్చేది. తుహద్దిసు, భూమి వివరిస్తుంది, తెలియజేస్తుంది. అఖ్బారహా తన సంగతులన్నీ, తన సమాచారాలన్నీ.
بِأَنَّ رَبَّكَ أَوْحَىٰ لَهَا (బి అన్న రబ్బక అవ్హాలహా) ఎందుకంటే నీ ప్రభువు దానికి, ఆ మేరకు ఆజ్ఞాపించి ఉంటాడు.(సూరా అజ్-జిల్జాల్ 99:5)
అలా ఎందుకు చేస్తుంది? ఎందుకు వివరిస్తుంది? ఎందుకంటే బి అన్న, ఎందుకంటే రబ్బక నీ ప్రభువు అవ్హాలహా దానికి ఆజ్ఞాపించి ఉంటాడు అలా చేయాలని.
يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ (యౌమఇదిన్ యస్దురున్నాసు అష్తాతల్ లియురవ్ అఅమాలహుమ్) ఆ రోజు జనులు – వారి కర్మలు వారికి చూపబడేందుకుగాను – వేర్వేరు బృందాలుగా తరలి వస్తారు. (సూరా అజ్-జిల్జాల్ 99:6)
యౌమఇదిన్ ఆ రోజు. యస్దురున్నాస్, యస్దురు తరలి వస్తారు, తిరిగి వస్తారు. అన్నాస్ జనులు, ప్రజలు. అష్ తాతా వేరు వేరు బృందాలుగా. లియురవ్ వారికి చూపబడేందుకు అఅమాలహుమ్ వారి యొక్క కర్మలు. ఆ రోజు జనులు వారి కర్మలు వారికి చూపబడేందుకు గాను వేరు వేరు బృందాలుగా తరలి వస్తారు.
فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ (ఫమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరయ్యరహ్) కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. (సూరా అజ్-జిల్జాల్ 99:7)
వమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరయ్యరహ్. కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా. ఫమన్ ఎవడైనా గానీ, ఎవడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. యఅమల్ చేస్తాడో, చేసినా. మిస్ఖాల దర్రహ్ అణువంత. దర్రహ్ చీమల కంటే చిన్నగా, చీమల యొక్క గుడ్లు, చీమల యొక్క పిల్లలు, అంతకంటే మరీ చిన్నది. ఖైరన్ ఏదైనా సత్కార్యం. యరహు దాన్ని అతడు చూసుకుంటాడు. కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు.
وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ (వమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ షర్రయ్యరహ్) మరెవడు అణుమాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. (సూరా అజ్-జిల్జాల్ 99:8)
మరెవరు అణుమాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు.
సూరతుల్ జిల్జాల్ యొక్క ప్రాముఖ్యత
సోదర మహాశయులారా! ఖురాన్ సూరతులలోని క్రమంలో ఈ 99వ సూరత్, సూరతుల్ జిల్జాల్, చాలా ప్రాముఖ్యత గల సూరా. ఈ సూరా యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని సందర్భాల్లో, ఎలాగైతే ముస్నద్ అహ్మద్ లో హదీస్ వచ్చి ఉందో, అబూ ఉమామా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు:
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి కాలంలో కొంచెం బరువు పెరిగారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విత్ర్ చేసిన తర్వాత కూర్చుండి రెండు రకాతులు ఎప్పుడైనా చేసేవారు. ఆ రెండు రకాతులలోని మొదటి రకాతులో సూరే ఫాతిహా తర్వాత ఇదా జుల్జిలతిల్ అర్ద్ చదివేవారు. మరియు రెండవ రకాతులో సూరే ఫాతిహా తర్వాత ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ (قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ) చదివేవారు.
దీని ప్రాముఖ్యతను గమనించడానికి, అబూ దావూద్ లో వచ్చినటువంటి ఒక హదీస్, 816 హదీస్ నెంబర్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రోజు ఫజర్ నమాజులోని రెండు రకాతుల్లో కూడా ఇదే సూరత్ జిల్జాల్. చదివారు.
సోదర మహాశయులారా! ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, సహాబాల యొక్క జీవితాల్లో, ఈ సూరా పట్ల ఎలాంటి ప్రాముఖ్యత ఉండినది, చాలా భయంకరమైన గొప్ప విషయాలు చెప్పుకోవడానికి, సూక్ష్మమైన విషయాల గురించి ప్రస్తావన చేసుకునేటందుకు, ఏ చిన్న, అతి చిన్న, మరీ చిన్న పుణ్య కార్యమైనా చేసుకోవడానికి ముందుకు రావాలని, ఏ చిన్న, ఏ అతి చిన్న, మరీ చిన్న పాపమైనా తప్పకుండా దానితో దూరం ఉండాలని ఈ సూరా ద్వారా గుణపాఠం తెచ్చుకొని ఇతరులకు బోధించేవారు, నేర్పేవారు ఈ సూరా ఆధారంగా.
సోదర మహాశయులారా! ఈ సూరా యొక్క ప్రాముఖ్యత మరొక హదీస్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ఆ హదీసును కొందరు ధర్మవేత్తలు జయీఫ్ (ضَعِيفٌ) అన్నారు కానీ, ముస్నద్ అహ్మద్ ఏదైతే చాలా ఎక్కువ వాల్యూమ్ లో పూర్తి రీసెర్చ్ తో ప్రింట్ అయిందో, 35-40 కంటే ఎక్కువ వాల్యూమ్స్ లో, దాని యొక్క రీసెర్చ్ చేసిన ముహఖ్ఖిఖీన్ (مُحَقِّقِينَ) దానిని బలమైనదిగానే చెప్పారు. ఆ హదీస్ కొంచెం పొడుగ్గా ఉంది, సారాంశం చెబుతున్నాను:
ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో నాకు ఏమైనా సూరా నేర్పండి అని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ సూరాలు అయితే అలిఫ్ లామ్ రా (الر) తో స్టార్ట్ అవుతాయో, ప్రారంభం అవుతాయో, అవి నీవు నేర్చుకో, చదువు. ఆ మనిషి చెప్పాడు, ప్రవక్తా, నన్ను మీరు చూస్తూనే ఉన్నారు, ఎంత వయసు పైబడ్డాను, మరియు నా యొక్క మనసు కూడా, నా హృదయం కూడా అంతగా విషయాన్ని గ్రహించే స్థితిలో ఇప్పుడు లేదు, మరి నా నాలుక కూడా అంత తిరగదు. అయితే ప్రవక్త చెప్పారు, హా మీమ్ (حم) అన్న పదం అక్షరాలతో మొదలయ్యే సూరాలు నేర్చుకో, చదువు. అతడు మళ్ళీ అదే రిపీట్ చేశాడు. మూడోసారి ప్రవక్త చెప్పారు, సరే మంచిది, సబ్బహ, యుసబ్బిహు (سَبَّحَ، يُسَبِّحُ) అన్నటువంటి పదాలతో స్టార్ట్ అయ్యే సూరాలు నేర్చుకో, చదువు. ఆ మనిషి మళ్ళీ అదే మాటను రిపీట్ చేశాడు. అప్పుడు ప్రవక్త చెప్పారు, నీవు ఒక జామిఅ (جَامِعَةٌ) సూరా చదువుకో, నేర్చుకో, గుర్తుంచుకో. జామిఅ అని ఎప్పుడైతే ఈ పదం వస్తుందో, సూరాల విషయంలో ఏదైనా విషయం చెప్పడానికి, అందులో అన్ని రకాల విషయాల గురించి బోధించబడింది అన్నటువంటి భావం కూడా వస్తుంది. అదేమిటి సూరా అంటే, ఇదా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా.
ఆ మనిషి చాలా సంతోషంగా ప్రవక్త వద్ద నుండి తిరిగి వెళ్తూ, అల్లాహ్ యే సత్యంతో మిమ్మల్ని పంపాడో ఆ అల్లాహ్ యొక్క సాక్ష్యంతో చెబుతున్నాను, తప్పకుండా ఈ సూరాను నేను నేర్చుకుంటాను, నేను ఇంతకంటే ఎక్కువగా బహుశా నేర్చుకోలేకపోతాను కావచ్చు కానీ దీనిని అయితే తప్పకుండా నేర్చుకుంటాను అని వెనుతిరిగి పోయాడు అక్కడి నుండి. అతడు వెళ్తున్నది చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, “ఇతడు సాఫల్యం పొందాడు, ఇతడు విజయం పొందాడు“.
సోదర మహాశయులారా! గమనిస్తున్నారా? ఇక మీలో ఎవరెవరికైతే ఈ సూరా రాదో, లేక ఈ సూరా యొక్క భావాన్ని ఇంతవరకు అర్థం చేసుకొని ప్రయత్నం చేయలేదో, ఇక శ్రద్ధగా వినండి, ఆయత్ యొక్క వ్యాఖ్యానాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ ఈ హదీస్ మరియు ఇంతకుముందు తెలుసుకున్న హదీసుల ద్వారా దీని యొక్క ప్రాముఖ్యతను గ్రహించండి. మరియు ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి ఈ సూరా ఖురాన్ లోని సగం సూరా, ఈ సూరా ఖురాన్ లోని నాలుగో వంతుకు సమానం, కానీ అలాంటి హదీసులు సహీ లేవు అని ఎందరో ధర్మవేత్తలు చెప్పి ఉన్నారు.
పరలోక విశ్వాసాన్ని పెంచే సూరా
సోదర మహాశయులారా! ఈ సూరాలో పరలోకం పట్ల మన యొక్క విశ్వాసం పెరిగే రీతిలో, పరలోకానికి సంబంధించిన రెండు సందర్భాలను ప్రస్తావించడం జరిగింది. ఒకటి, మొదటి శంఖు ఊదబడినప్పుడు ఈ విశ్వం అంతా చెల్లాచెదురై నాశనమవుతున్న సందర్భాన్ని, మరొకటి రెండవ శంఖు ఊదబడిన తర్వాత ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తారు, గమ్యస్థానాలు ఏమవుతాయి, పరిస్థితి ఏముంటుంది దాని గురించి చెప్పడం జరిగింది.
సోదర మహాశయులారా! ఇక్కడ మీరు చూస్తున్నట్లు, ఇదా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా. జుల్జిలత్ అని క్రియ రూపంలో ఉన్న ఒక పదాన్ని చెప్పిన వెంటనే మళ్ళీ జిల్జాలహా అని ఫార్మాట్ చేంజ్ చేసి మస్దర్ రూపంలో తీసుకువచ్చి, అల్లాహ్ త’ఆలా చెప్పదలచినది ఏమిటంటే, ఈ ప్రళయ సమయాన ఏ భూకంపం ఏర్పడుతుందో, ఈ మొత్తం భూమిలో ఏ ప్రకంపనలు స్టార్ట్ అవుతాయో, అవి ఏమో చిన్నవి కావు, చాలా భయంకరమైనవి.
గమనించండి ఒక్కసారి మీరు, ఎక్కడో ఇండోనేషియాకు ఎంతో దూరంలో, అది కూడా సముద్రం లోపలని భూమిలో ప్రకంపనలు మొదలౌతే, వాటి యొక్క ప్రభావమే కాదు, నష్టం వేలాది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మన భారతదేశానికి కూడా చేరుకొని, సునామీ అన్న పేరుతో ఈ రోజు కూడా మర్చిపోని స్థితిలో ఉన్నాము కదా. అయితే అది సునామీ అన్నటువంటి పేరు ఏదైతే ఉందో, కేవలం సముద్రాల, సముద్రం యొక్క అలలు, కెరటాలు పెరిగి ఏదో నష్టం జరిగింది కాదు కదా. ఎక్కడ ఇండోనేషియా, ఎక్కడ సముద్రం లోపలి భాగంలో సంభవించిన ప్రకంపన, భూకంపం, అక్కడ భూమి దద్దరిల్లింది. ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో దాని నష్టం ఇంతా అంతా కాదు, కోట్ల కోట్లలో జరిగింది, ప్రాణాలు పోయాయి, ప్రాణ నష్టంతో పాటు ధన నష్టం కూడా జరిగింది. సోదర మహాశయులారా! ఒక్కసారి ఒక్కచోట వచ్చిన ఈ భూకంపం ఎంత దూరం నష్టం చేకూర్చింది, ఇక ప్రళయదినాన్ని గుర్తుంచుకోండి, గుర్తు తెచ్చుకోండి, ఈ మొత్తం భూమిలో ఎక్కడా కూడా ఖాళీ లేకుండా అంతటా ఈ భూకంపం వచ్చినప్పుడు పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో ఆలోచించగలమా మనం?
ఎక్కడైనా ఒకచోట భూకంపం వస్తుంది అంటే రాని చోటకు ప్రజలు పరిగెత్తుతారు. కదా? మరి ఆ రోజు పరిగెత్తడానికి ఎక్కడ స్థలం ఉన్నది? ఎక్కడ స్థలం ఉన్నది? అందుకొరకు సోదర మహాశయులారా! ఖురాన్ ఆయతులను గ్రహించి, గమనించి మన జీవితంలో మార్పు తెచ్చుకునే మనం ప్రయత్నం చేయాలి. లేదా అంటే మన శక్తి ఏం శక్తి? మనం ఏం చేయగలుగుతాము? ఎలాంటి విపత్తులు మనం అడ్డుకోగలుగుతాము?
ఆ రోజు, వ అఖ్రజతిల్ అర్దు అస్ఖాలహా. భూమి తన యొక్క బరువులన్నింటినీ. ఇక్కడ బరువులు అంటే ఒకటి కాదు రెండు కాదు, అనేక విషయాల ప్రస్తావన ఉంది. ఒకటి, ఇక్కడ ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని చివరి మానవుని వరకు ఎవరు ఎక్కడ ఎలా చనిపోయారో, వారిని కాల్చడం జరిగినా, వారిని పూడ్చడం జరిగినా, వారు ఏదైనా జంతువుకి ఆహుతి అయిపోయినా, ఏదైనా అగ్నికి ఆహుతి అయిపోయినా, ఏదైనా జంతు మృగ జీవికి ఒక నివాలా అయిపోయినా, ఏ పరిస్థితిలో చనిపోయినా వారిని సమాధి చేయబడినా, చేయబడకపోయినా అంతా కూడా తిరిగి వచ్చేది మట్టి వైపునకే. 77వ సూరా సూరతుల్ ముర్సలాత్ లో వచ్చిన ఒక ఆయత్ ను గమనించండి,
أَلَمْ نَجْعَلِ الْأَرْضَ كِفَاتًا أَحْيَاءً وَأَمْوَاتًا (అలం నజ్అలిల్ అర్ద కిఫాతా అహ్యాఅవ్ వ అమ్ వాతా.) మేము ఈ భూమిని వారి యొక్క జీవుల కొరకు మరియు చనిపోయిన వారి కొరకు అందరి కొరకు సరిపోయేదిగా చేసి ఉంచాము.
గమనించండి, ఈ ఆయత్ లో ఇంకా వేరే ఎన్నో బోధనలు ఉన్నాయి వేరే సందర్భంలో. కానీ చెప్పే ఉద్దేశ్యం ఏమిటి, తిరస్కరించిన వారైనా, నమ్మిన వారైనా, విశ్వాసులైనా, అవిశ్వాసులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా, అందరూ కూడా ఈ భూమిలోకి ఏదైతే పోయారో ఏ రీతిలోనైనా వెలికి వస్తారు. తప్పకుండా బయటికి వస్తారు. సూరతుల్ ఇన్షికాఖ్ (سُورَةُ الْإِنْشِقَاقِ) లో చదవండి, ముతఫ్ఫిఫీన్ (مُطَفِّفِينَ) తర్వాత సూరత్,
وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ (వ అల్ఖత్ మా ఫీహా వ తఖల్లత్.) ఇక బరువులన్నింటినీ తీసివేస్తుంది బయటికి అని రెండవ భావం, ఈ భూమిలో ఎక్కడెక్కడ ఏ ఖజానాలు ఉన్నాయో, ఏ కోశాగారాలు ఉన్నాయో, ఏ ఏ రకమైన ధాతువులు ఉన్నాయో, వెండి బంగారం రూపులోనైనా, ఇంకా వేరే ఏ రీతిలోనైనా అంతా కూడా బయటికి వచ్చి పడుతుంది. మనిషి ఎటు నడిచినా గానీ బంగారం, వెండి అంతకంటే ఇంకా విలువైనది వేరే ఎంతో సామాగ్రి అతను కళ్ళతో చూస్తాడు. సహీ ముస్లిం లోని ఒక హదీస్ శ్రద్ధగా వినండి, అల్లాహు అక్బర్.
تَقِيءُ الْأَرْضُ أَفْلَاذَ كَبِدِهَا أَمْثَالَ الْأُسْطُوَانِ مِنَ الذَّهَبِ وَالْفِضَّةِ (తఫిల్ అర్దు అఫ్లాద కబిదిహా అమ్సాలల్ ఉస్తువాన్ మిన దహబి వల్ ఫిద్దా.) ప్రళయదినాన ఈ భూమి తనలో ఉన్నటువంటి ఖజానాలన్నిటినీ బయటికి పడేస్తుంది.పెద్ద పెద్ద గుట్టలు, పర్వతాల మాదిరిగా మనిషి కళ్ళ ముందు వెండి బంగారాలు పడి ఉంటాయి.
అప్పుడు ఒక హంతకుడు వస్తాడు, అయ్యో, ఈ బంగారం వెండి కొరకే కదా నేను ఫలానా వ్యక్తిని చంపి ఈ ధన ఆశలో ఒకరి ప్రాణం తీసుకున్నాను, ఇప్పుడు ఇంతగా నా కళ్ళ ముందు ఉంది కానీ నాకు ఏ ప్రయోజనం చేకూర్చదు ఇది, దీనిని తీసుకొని ఏ లాభం పొందలేను. మరొక వ్యక్తి వస్తాడు, అయ్యో, నేను ఈ డబ్బు ధన ఆశలో బంధుత్వాలను తెంచాను, నా యొక్క సంబంధాలను పాడు చేసుకున్నాను, నేను ఈ యొక్క డబ్బు ధన ఆశలో ఎందరి నా దగ్గర వారిని దూరం చేసుకున్నాను, అయ్యో అని వాపోతాడు. కానీ అది అతనికి ఏ ప్రయోజనం చేకూర్చదు. దొంగ వస్తాడు, అతడు ఇదంతా చూసి, అయ్యో, దీని గురించేనా నా యొక్క చేతులు నరికి వేయబడినవి, ఈ రోజు తీసుకుందాం అంటే కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తర్వాత వారి కళ్ళ ముందు ఉంటుంది కానీ ఎవరు దానిని ముట్టరు, ఏమీ తీసుకోలేరు.
ఇదంతా కూడా ఇంత స్పష్టంగా వివరంగా మనకు చెప్పబడినప్పుడు, ఈ రోజుల్లో మనం నా తాత భూమి నా అయ్యకు దొరకలేదు, ఇక ఇప్పుడు నేను ఇంత అధికారంలో వచ్చిన కదా, నా చిన్నాయనలకు, నా పెదనాయనలకు అందరికీ ఇక నేను జైల్లో వేస్తాను, వారి సంతానాలనే వేస్తాను, వారి యొక్క వంశమే గుర్తుంచుకోవాలి అన్నటువంటి పన్నాగలు పన్ని, ఏ ఏ ప్రయత్నాలు చేస్తారో, దౌర్జన్యాలు చేసి ఒకరి భూమిని ఏదైతే ఆక్రమించుకుంటారో, ఏ ఏ రీతిలో చివరికి ఒక మాట ఇక్కడ చెప్పవచ్చు కదా, కట్నకానుకల రూపంలో అమ్మాయిల తల్లిదండ్రులపై దౌర్జన్యాలు చేసి ఏ ఏ సొమ్ము లూటీ చేస్తున్నారో, ఈ సూరత్ యొక్క వ్యాఖ్యానంలో వచ్చిన హదీస్ ద్వారా గుణపాఠం నేర్చుకోవాలి.
భూమి తన బరువులన్నింటినీ తీసి బయట పడేసినప్పుడు, మనిషి, అయ్యో, అరె దీనికి ఏమైపోయింది, ఇది ఇలా ఎందుకు చేస్తుంది? అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. మనిషి ఇలా మొత్తుకుంటాడు కానీ ఏమీ లాభం.
మరొక వ్యాఖ్యానం, బరువులన్నీ తీసి బయట పడేసినప్పుడు అన్న దానికి ధర్మవేత్తలు, ఖురాన్ వ్యాఖ్యానకర్తలు తెలిపారు, అదేమిటంటే, ఆ రోజు మనిషి ఏ ఏ విషయాలను నమ్మకపోయేదో ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు, ఆ సత్యాలు వాస్తవాలన్నీ కూడా అతని కళ్ల ముందుకు వచ్చేస్తాయి. అప్పుడు అతను ఆ విషయాలన్నింటినీ, వేటినైతే ప్రవక్తలు, ప్రవక్తల యొక్క నాయబులు, వారి యొక్క మార్గంపై ఉన్నటువంటి దాయిలు, ప్రచారకులు ఏ సత్యాలు ఖురాన్ హదీస్ ఆధారంగా తెలిపినప్పటికీ తిరస్కరించేవారో, నమ్మకుండా ఉండేవారో వారికి ఆ వాస్తవాలన్నీ కూడా ముందుకు వచ్చేస్తాయి. సోదర మహాశయులారా! ఈ సందర్భంలో మనిషి చాలా బాధగా అంటాడు, అయ్యో ఇదేమైపోయింది, ఇది ఎలా ఎందుకు జరుగుతుంది, మరియు ఈ సందర్భం అనేది ఖురాన్ లో ఇంకా వేరే సూరాలలో కూడా చెప్పడం జరిగినది. ఉదాహరణకు సూరత్ యాసీన్ చదువుతారు కదా, ఎంత మన దౌర్భాగ్యం గమనించండి, సూర యాసీన్,
لِّيُنذِرَ مَن كَانَ حَيًّا (లియున్దిర మన్ కాన హయ్యా) బ్రతికి ఉన్న వారి కొరకు ఇదిగో హెచ్చరిక అని అల్లాహ్ అదే సూరాలో చెబుతున్నాడు.
బ్రతికి ఉన్న వారు చదివి గుణపాఠం నేర్చుకోవడం లేదు, చనిపోయిన వారి మీద చదువుతున్నారు, వారు వినడానికి కూడా ఏ శక్తి వారిలో లేదు. అదే సూరత్ యాసీన్ లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు,
هَٰذَا مَا وَعَدَ الرَّحْمَٰنُ وَصَدَقَ الْمُرْسَلُونَ (హాదా మా వఅదర్ రహ్మాను వ సదఖల్ ముర్సలూన్.) అప్పుడు వారి కళ్లు తెరిచినట్లు అవుతాయి, వారి కళ్ల మీద ఉన్నటువంటి ముసుగు తొలగిపోయినట్లు ఏర్పడుతుంది, అప్పుడు అంటారు అయ్యో, మమ్మల్ని మా సమాధుల నుండి ఎక్కడైతే హాయిగా పడుకొని ఉంటిమో, ఎవరు లేపేశారు మమ్మల్ని? రహ్మాన్ చేసిన వాగ్దానం ఇదే కదా అది. ప్రవక్తలు చెప్పుకుంటూ వచ్చినటువంటి విషయాలు ఇప్పుడు నిజంగానే జరుగుతున్నాయి, అవే కదా ఇవి. కానీ అప్పుడు మనిషి వాటన్నిటినీ సత్యంగా నమ్మితే ఏ లాభం ఉండదు.
భూమి తన సంగతులను వివరిస్తుంది
సోదర మహాశయులారా! ఇదా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా, ఇదా దీనిని అరబీ గ్రామర్ ప్రకారంగా ఒక షర్తియా పదం అంటారు, దాని యొక్క సమాధానం నాలుగో ఆయత్ లో అల్లాహ్ ఇస్తున్నాడు, యౌమఇదిన్ తుహద్దిసు అఖ్బారహా. అల్లాహు అక్బర్. ఆయత్ నెంబర్ రెండులో చూశారు మీరు, తన బరువులన్నింటినీ వెలికి తీస్తుంది అని.
ఇక ఆయత్ నెంబర్ నాలుగులో ఉన్న విచిత్రం గమనించండి, ఆ రోజు భూమి తన సంగతులన్నీ వివరిస్తుంది. ఏమిటి ఆ సంగతులు? ఏమిటి ఆ సంగతులు? అల్లాహు అక్బర్. అల్లాహ్ త’ఆలా మనిషిని పుట్టించినప్పటి నుండి కాదు అంతకు ముందు నుండి ఈ భూమి ఉంది. ప్రళయం వరకు ఎక్కడెక్కడ ఏమి జరిగినదో అదంతా కూడా ఈ భూమి అంతా వివరిస్తూ ఉంటుంది. అల్లాహు అక్బర్.
హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం వస్తుంది. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఈ సూరతుల్ జిల్జాల్ తిలావత్ చేశారు. సూరత్ జిల్జాల్ తిలావత్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ ఆయత్ నెంబర్ నాలుగు వరకు చేరుకున్నారో, మీకు తెలుసా దాని యొక్క సమాచారాలన్నీ కూడా ఏమిటి? మీకు తెలుసా దాని యొక్క సంగతులన్నీ ఏమిటి? అది ఏం వివరిస్తుంది? ఆ సమయంలో సహాబాలు సామాన్యంగా జవాబు ఇచ్చినట్లుగానే ఇచ్చారు, అల్లాహ్ మరియు ప్రవక్తకే తెలుసు. అప్పుడు ప్రవక్త తెలిపారు,
فَإِنَّ أَخْبَارَهَا أَنْ تَشْهَدَ عَلَى كُلِّ عَبْدٍ وَأَمَةٍ (ఫఇన్న అఖ్బారహా అన్ తష్హద అలా కుల్లి అబ్దివ్ వ అమతిన్.) ప్రతి మానవుడు పురుషుడు అయినా, స్త్రీ అయినా భూమిలోని ఏ చోట ఉండి ఏ పని చేశాడో దాని గురించి ఆ భూమి వివరిస్తుంది. ఫలానా వ్యక్తి ఇక్కడ ఉండి ఇలాంటి పని చేశాడు, ఇక్కడ ఉండి ఇలాంటి పని చేశాడు. అందుకొరకే రబీఆ ఉల్లేఖించిన ఒక ఉల్లేఖనంలో తబరానీ కబీర్ లో వచ్చింది,
تَحَفَّظُوا مِنَ الْأَرْضِ، فَإِنَّهَا أُمُّكُمْ (తహఫ్ఫదూ మినల్ అర్ద్, ఫఇన్నహా ఉమ్ముకుమ్.) మీరు చాలా జాగ్రత్తగా ఉండి మీ యొక్క ఈ భూమి నుండి.ఎందుకంటే ఇది మీ యొక్క తల్లి లాంటిది. మీరు ఈ భూమిపై నివసిస్తున్నారు, దీని లోకే వెళ్ళేవారు ఉన్నారు.
وَإِنَّهُ لَيْسَ مِنْ أَحَدٍ عَامِلٌ عَلَيْهَا خَيْرًا أَوْ شَرًّا إِلَّا وَهِيَ مُخْبِرَةٌ بِهِ (వఇన్నహూ లైస మిన్ అహదిన్ ఫాయిలున్ అలైహా ఖైరన్ అవ్ షర్రన్ ఇల్లా వహియ ముఖ్బిరా.) గుర్తుంచుకోండి, గుర్తుంచుకోండి, ఈ భూమి దీనిపై మీరు ఎక్కడ ఉండి ఏ పని చేసినా, మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా ఆ భూమి రేపటి రోజు తప్పకుండా చెప్పనున్నది.
ఈ రెండు హదీసులు ప్రామాణికతలో కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ, ఒకటి మరొకటికి మంచి సపోర్ట్ ఇస్తుంది అని ధర్మవేత్తలు అంటారు. అందుకొరకే వీటిని ప్రస్తావించడం జరిగింది.
సోదర మహాశయులారా! ఇక్కడ మనం భయపడవలసిన విషయం ఏమిటంటే, ఈ భూమిలోని ఏ చోట ఉండి మనం ఏ పని చేస్తున్నామో, అది మన గురించి సాక్ష్యం పలుకుతుంది. వేరే కొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది, హజరత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా, ఇంకా వేరే సహాబాల ద్వారా రుజువైనటువంటి కొన్ని హదీసుల ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే, మనిషి ఎప్పుడూ కూడా ఏ చిన్న సత్కార్యాన్ని విలువ లేకుండా భావించకూడదు. ఇది ఏమవుసరం అన్నట్లుగా భావించకూడదు. అలాగే ఏ పెద్ద సత్కార్యాన్ని కూడా చేయడంలో వెనక ఉండకూడదు. అలాగే ఏ పాప కార్యం పట్ల కూడా ఇది ఎంత నష్టం చేకూరుస్తుంది అన్నటువంటి ధోరణిలో ఉండకూడదు.
ఈ ఆయతుల ద్వారా మనకు బోధపడుతుంది, మనం ఏ సత్కార్యాలు చేసినా, ఏ పాప కార్యాలు చేసినా వాటి గురించి సాక్ష్యాధారాలు తయారవుతూ పోతూ ఉన్నాయి. ఆ రోజు మనం మన నోటితో ఏ విషయాన్ని తిరస్కరించినా, స్వయం మన యొక్క శరీరం నుండే మనకు దానికి వ్యతిరేకంగా సాక్ష్యాలు వచ్చేస్తాయి. అందుకొరకు అల్లాహ్ తో భయపడుతూ ఉండాలి.
మరియు ఆ తర్వాత ఆయత్ నెంబర్ ఆరులో గమనించండి, ఆయత్ నెంబర్ ఐదులో, ఇదంతా కూడా అల్లాహ్ యొక్క అనుమతితో, అల్లాహ్ యొక్క ఆజ్ఞతోనే భూమి చేస్తుంది. గమనించండి, భూమి యొక్క సృష్టికర్త అల్లాహ్ మరియు అల్లాహ్ త’ఆలా ఆజ్ఞ ప్రకారమే అది మసులుకుంటుంది. అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో ఒక చోట చెబుతున్నాడు, భూమి మరియు ఆకాశం ఈ రెండిటికీ అల్లాహ్ త’ఆలా మీకు ఇష్టమైనా లేకపోయినా మీరు విధేయులుగానే రావాలి అని అంటే వారు,
أَتَيْنَا طَائِعِينَ (అతైనా తాయిఈన్) మేము ఓ అల్లాహ్ నీకు విధేయులుగా హాజరయ్యాము అని చెప్పారు.
ఖురాన్ లోని ఆయత్ భావం. ఇంతటి విధేయత ఈ భూమి ఆకాశాలు పాటిస్తూ, ఎక్కడ ఏం మనం చేశామో అవన్నీ వివరిస్తున్నప్పుడు, మనం ఇంకా ఎంత అశ్రద్ధగా ఉంటాము? ఇంకా ఎన్ని రోజులు ఈ అశ్రద్ధ, ఏమరుపాటులో ఉంటాము?
మన కర్మలు మనకు చూపబడతాయి
ఆ తర్వాత అల్లాహ్ త’ఆలా ఆయత్ నెంబర్ ఆరులో తెలియజేస్తున్నాడు,
يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ (యౌమఇదిన్ యస్దురున్నాసు అష్ తాతల్ లియురవ్ అఅమాలహుమ్) “ఆ రోజు జనులు – వారి కర్మలు వారికి చూపబడేందుకుగాను – వేర్వేరు బృందాలుగా తరలి వస్తారు.“
యస్దుర్ (يَصْدُرُ) అని ఏదైతే ఇక్కడ చెప్పడం జరిగిందో, తరలి రావడం, తిరిగి రావడం. సమాధుల నుండి మైదానే మెహషర్ లో లెక్క తీర్పు గురించి మరియు అక్కడ ఎన్నో సంఘటనలు, ఎన్నో ఘట్టాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ రెండవ తిరుగు ఏ గమ్యస్థానం ఉంటుందో ఎవరికి, స్వర్గం నరకం రూపంలో అటువైపున అని. మరియు ఇక్కడ ఏదైతే అష్ తాతా (أَشْتَاتًا), వేరు వేరు బృందాలుగా అని చెప్పడం జరిగిందో దానికి ఖురాన్ లోని ఇంకా ఎన్నో ఆయతులు కూడా సాక్ష్యాధారంగా ఉన్నాయి. దీని యొక్క భావంలో ఎన్నో విషయాలు వస్తాయి. ఒకటి ఏమిటి, అవిశ్వాసులు ఒక బృందం, విశ్వాసులు ఒక బృందం. ఈ విధంగా కూడా చెప్పడం జరిగింది. మరొక భావం ఇక్కడ, ప్రతి ప్రవక్త వారి యొక్క అనుచరుల ప్రకారంగా వేరు వేరు బృందాలు. మరొక భావం ఇందులో, ప్రతి ప్రవక్తతో వారిలో కొందరు విశ్వసించేవారు, మరికొందరు విశ్వసించని వారు. ఈ విధంగా ఖురాన్ లో ఎన్నో సందర్భాల్లో మనకు ఈ విషయాలు తెలుస్తాయి,
وَيَوْمَ نَحْشُرُ مِن كُلِّ أُمَّةٍ فَوْجًا مِّمَّن يُكَذِّبُ بِآيَاتِنَا فَهُمْ يُوزَعُونَ (వయౌమ నహ్షురు మిన్ కుల్లి ఉమ్మతిన్ ఫౌజన్ మిమ్మన్ యుకద్దిబు బి ఆయాతినా ఫహుమ్ యూజఊన్) “ఆ రోజు మేము ప్రతి మానవ సమాజం నుంచి, మా ఆయతులను ధిక్కరించే ఒక్కొక్క సమూహాన్ని చుట్టుముట్టి మరీ తెస్తాము. ఆ తరువాత వారంతా వర్గీకరించబడతారు.” (27:83)
సూరతున్ నహల్ లో, అలాగే ఇంకా వేరే సూరాలలో కూడా ఈ భావం ఉంది. కానీ మళ్ళీ ఇక్కడ మరోసారి మీరు గమనించండి, లియురవ్ అఅమాలహుమ్. ఈ పదం, ఈ పదం ఏదైతే లియురవ్ అఅమాలహుమ్ అని ఉందో మనల్ని కంపించి వేయాలి, మనలో భయాన్ని పుట్టించాలి. ఎందుకు? ఏం చెప్పడం జరుగుతుంది, వారి యొక్క కర్మలు వారికి చూపించడానికి. అల్లాహు అక్బర్.
సోదర మహాశయులారా! ఎలాగైతే కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా సీక్రెట్ సీసీటీవీలు, కెమెరాలు ఉంటాయి. ఇక్కడ మనల్ని ఎవరు చూడటం లేదు అని ఏదో నేరానికి పాల్పడతాము. కానీ పట్టుబడిన తర్వాత ఎప్పుడైతే ఆ సీసీ ఫొటేజ్ లను మన ముందు స్పష్టంగా ఒక స్క్రీన్ లో చూపించడం జరుగుతుందో, మనం ఆ ప్రాంతంలో ఎటు నుండి వస్తున్నాము, ఎలా వస్తున్నాము, ఏ ఏ ఆయుధాలతో, ఏ ఏ సాధనాలతో వస్తున్నాము, ఎలా లూటీ, దోపిడీ ఇంకా వేరే నేరాలకు పాల్పడుతున్నాము అదంతా మన కళ్ళారా మనం చూసుకుంటూ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఈ లోకంలో ఒక్కసారి గమనించండి. ఇది ఏదో ఒక్కసారి చేసినటువంటి పొరపాటు, అది ఏదో రికార్డ్ అయిపోయింది, కానీ దాని గురించి విని మనం కొన్ని సందర్భాల్లో సిగ్గుకు గురి అవుతాము, ఎంతో సందర్భాల్లో ఛీ ఇలాంటి పనులు ఎందుకు చేయాలి అని అనుకుంటాము.
కానీ ఇక్కడ గమనించండి, అటువైపున భూమి సాక్ష్యం పలుకుతుంది, భూమి అంతా కూడా తెలియజేస్తుంది, మళ్ళీ అల్లాహ్ వద్దకు హాజరవుతున్నాము, అక్కడ ఈ ఫొటో, సీసీటీవీలలో మొత్తం రికార్డ్ అయినటువంటి మన పూర్తి జీవితం యొక్క ఫ్లాష్ బ్యాక్ రికార్డ్ వీడియో మొత్తం బయటికి వస్తుంది, అప్పుడు మనం ఎక్కడ తల దాచుకుంటాము? అప్పుడు మనం ఎక్కడ అల్లాహ్ యొక్క శిక్షల నుండి పారిపోతాము? ఏదైనా అవకాశం ఉందా?
లియురవ్ అఅమాలహుమ్, వారికి వారి కర్మలన్నీ చూపడం జరుగుతుంది అంటే దైవదూతలు రాసుకున్నటువంటి ఆ దఫ్తర్లు, రిజిస్టర్లు ఓపెన్ చేసి చూపిస్తారు అనే ఒక్కటే భావంలో మీరు ఉండకండి. ఆ చూపించడం అనేది మనకు, మనం ఇక్కడ లోకంలో ఏ రీతిలో మనం మసులుకుంటూ ఉంటామో ఆ ప్రకారంగా అక్కడ మనతో పరిస్థితి జరుగుతుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం చేసిన తప్పులను ఒప్పుకొని అల్లాహ్ తో ఆ సమయంలో కూడా ఒకవేళ ఇహలోకంలో విశ్వాసంగా ఉండి కొన్ని పొరపాట్లు జరిగితే, తౌహీద్ పై ఉండి వేరే కొన్ని పాపాలు జరిగితే బహుశా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనల్ని మన్నించేస్తాడు అన్నటువంటి ఆశ ఉంచవచ్చు కూడా. అవును, ఒక హదీస్ ద్వారా కూడా ఈ భావం మనకు కనబడుతుంది. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పి ఉన్నారు కూడా, మీలో ప్రతి ఒక్కడు ఎన్ని పాపాలు చేసినా గానీ విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవాలి, తౌబా ఇస్తిగ్ఫార్ లాంటివి చేసుకుంటూ ఉండాలి, కానీ దానితో పాటు ఏంటి, ఏ పాపం జరిగినప్పటికీ అల్లాహ్ పట్ల సదుద్దేశంతో ఉండాలి. అల్లాహ్ నా విశ్వాసాన్ని స్వీకరించి, నా పుణ్యాలను స్వీకరించి, నా పాపాలను మన్నిస్తాడు అని. కానీ ఆ ఉద్దేశం ప్రకారంగా తన యొక్క విశ్వాసం, ఆచరణ కూడా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ అలా ప్రయత్నం చేయకుండా కేవలం బూటకపు అబద్ధపు ఆశలను పెట్టుకొని మనం చెడును చెడుగా భావించి ఛీ అన్నట్లుగా మన మనసులో లేకుంటే ఈ పశ్చాత్తాపం, ఈ ఆశ అనేది మనకు ఏ ప్రయోజనం చేకూర్చదు.
ఆ తర్వాత ఆయత్ నెంబర్ ఏడు మరియు ఎనిమిది, ఇది కూడా చాలా భయంకరమైన విషయం ఇందులో ఉంది. ఏమిటంటే, ఎక్కడ ఏ లోకంలో ఏ చాటున, ఏ గుహలో, ఏ రీతిలో ఎక్కడ ఉండి కూడా రవ్వంత, అణువంత, ఏ చిన్న పుణ్య కార్యం చేసినా అది మనం చూసుకుంటాము. మరియు ఇహలోకంలో ఏ చెడు చేసినా దాన్ని కూడా పరలోకంలో చూసుకుంటాము. ఈ భావంలో కూడా ఖురాన్ లో ఎన్నో ఆయతులు ఉన్నాయి,
وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا ۗ وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا (వవజదూ మా అమిలూ హాదిరా వలా యద్లిము రబ్బుక అహదా.) అల్లాహ్ త’ఆలా మీరు చేసిన పూర్తి మీ యొక్క జీవితమంతా ఏ ఏ కార్యాల్లో గడిసిందో దాన్నంతా కూడా హాజరు పరుస్తాడు, అల్లాహ్ ఎవరిపైనా కూడా ఏ కొంచెం అన్యాయం చేయడు.
సహీ బుఖారీలో వచ్చినటువంటి ఒక ఉల్లేఖనం ద్వారా మనం చాలా భయకంపితులైపోవాలి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో విషయాలు తెలియజేస్తూ, గుర్రం గురించి నేను నిన్నటి క్లాస్ లో ఏదైతే ఒక హదీస్ సంక్షిప్త భావం చెప్పానో అది ఒకరి కొరకు అజ్ర్ (أَجْرٌ) ఉంటే మరొకరి కొరకు సిత్ర్ (سِتْرٌ) మరియు ఇంకో వారికి అది పాపంగా ఉంటుంది, మూడు రకాల విషయాలు, రకాల గుర్రాలు ఉన్నాయి అని. ఆ హదీస్ వివరించిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఒక సహాబీ అడిగారు, ప్రవక్తా, ఈ గుర్రం గురించి అయితే బాగానే చెప్పారు, మరి ఈ గాడిదల గురించి ఏంటి ప్రస్తావన అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏంటో గమనించండి,
مَا أُنْزِلَ فِيهَا شَيْءٌ إِلَّا هَذِهِ الْآيَةُ الْفَاذَّةُ الْجَامِعَةُ (మా ఉన్జిల ఫీహా షైఅన్ ఇల్లా హాదిహిల్ ఆయతిల్ ఫాద్దతిల్ జామిఆ.) మీరు అడిగిన ప్రశ్నకు నా వైపు నుండి నాకు ఏ సమాధానం లేదు, అల్లాహ్ ఏదైతే అవతరింపజేస్తూ ఉంటాడో, వహీ చేస్తూ ఉంటాడో దాని ప్రకారంగా నేను మీకు చెబుతూ ఉంటాను, ఇప్పుడు మీరు దీని గురించి ఏదైతే అడిగారో ఇక్కడ గుర్తుంచుకోండి, ప్రత్యేకంగా దీని గురించి నాకైతే ఏమీ ఆదేశం రాలేదు, ఏ వహీ రాలేదు, కానీ ఒక జామిఅ ఆయత్, ఒక విచిత్రమైన, ఒక యునీక్ లాంటి ఆయత్ అది మీరు గుర్తుంచుకోండి,
فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ (ఫమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరయ్యరహ్, వమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ షర్రయ్యరహ్) “కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. మరెవడు అణుమాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు.”
సోదర మహాశయులారా! ఫరజ్దఖ్ అని ఒక చాలా ప్రఖ్యాతి గాంచిన కవి. అయితే ఆ కవి యొక్క బాబాయి ప్రవక్త సల్లల్లాهُ అలైహి వసల్లం వద్దకు వచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని ముందు ఈ సూరా చదువుతూ, ఫమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరయ్యరహ్, వమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ షర్రయ్యరహ్ అని తిలావత్ చేశారు. ఆ మనిషి, అతడు కూడా అరబ్, అరబీ భాష పట్ల మంచి అవగాహన. విన్న వెంటనే ఏమన్నాడు, చాలు చాలు చాలు, ఇక మీరు ఆపండి. ఈ విషయమే నాకు సరిపోయింది, మనం గుణపాఠం తెచ్చుకోవడానికి, జీవితంలో ఒక మార్పు తెచ్చుకోవడానికి, ఇక బహుశా దీని తర్వాత ఏది వినే అవసరం ఉండదు అని చెప్పుకొచ్చాడు.
అంటే ఏంటి, మనం ఏదైతే ఇహలోకంలో పుణ్యం చేస్తామో, పరలోకంలో దాని గురించి మనకు తప్పకుండా ప్రతిఫలం లభించడమే కాదు, ఆ పుణ్య కార్యాన్ని కూడా మనం చూస్తాము వీడియో రూపంలో. మరియు ఎక్కడైతే ఏ పాపాలు చేస్తామో వాటిని కూడా వీడియో రూపంలో చూస్తాము. అలాంటి సందర్భంలో మన పరిస్థితి ఏముంటుందో, భయపడాలి అల్లాహ్ తో.
అందుకొరకే సోదర మహాశయులారా! సమయం కూడా కావస్తుంది గనుక, ఈ విధంగా హదీస్ గ్రంథాల్లో ఒక సూరాకు సంబంధించి, ఆ సూరాలోని కొన్ని ఆయతులకు సంబంధించి ఏ ఏ హదీసులు వస్తాయో, వాటిలో ఏ ఏ గుణపాఠాలు ఉంటాయో వాటి ద్వారా మనం మంచి బోధ నేర్చుకొని మన జీవితంలో మార్పు తెచ్చుకోవాలి. పరలోకం పట్ల విశ్వాసం మనది చాలా బలంగా ఉండాలి మరియు ఇహలోకంలోనే మనం మార్పు తెచ్చుకొని పుణ్యాల వైపునకు రావాలి లేదా అంటే చాలా నష్టంలో ఉంటాము.
అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఖురాన్ ను శ్రద్ధగా చదివి అర్థం చేసుకుంటూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక.
آمِينَ وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ. وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (ఆమీన్ వ ఆఖిరు దఅవాన అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1- ఇల్లు కొనే ముందు పొరుగు వారిని చూడండి అని ఎందుకు అనబడింది ? 2- పొరుగు వారు చెడ్డ వారు కాకుండా ఉండేలా చూడమని ప్రవక్త (స) అల్లాహ్ తో చేసిన దువా ఏమిటి ? 3- కూర వండేటప్పుడు కొద్దిగా నీళ్ళు ఎక్కువగా పోసి వండండి అని ప్రవక్త (స) ఆజ్ఞాపించారు కారణం ఏమిటి ? 4- నమాజులు, ఉపవాసాలు ఆచరించి దాన ధర్మాలు చేసినా ఒక మహిళ నరకానికి వెళ్ళింది కారణం తెలుసా ? 5- తమ పొరుగు వారు ఆకలితో ఉన్నారని తెలిసి కూడా పట్టించుకోని వారికి ఏమవుతుంది ? 6- పొరుగింటి మహిళతో వ్యభిచారం చేస్తే ఎంత పాపము మూటగట్టుకుంటారో తెలుసా ? 7- పొరుగింటిలో దోంగతనం చేస్తే ఎంత పాపము మూటగట్టుకుంటారో తెలుసా ? 8- అల్లాహ్ సాక్షిగా ఆ వ్యక్తి విశ్వాసి కాజాలడు అంటూ ప్రవక్త (స) మూడు సార్లు ప్రమాణం చేసి ఎవరి గురించి చెప్పారు ? 9- పొరుగు వారిని ఇబ్బంది పెట్టిన వ్యక్తి స్వర్గానికి వెళ్ళగలడా ? 10- పొరుగు వారు ఆస్తిలో హక్కుదారులుగా నిర్ణయించబడుతారేమో అని ప్రవక్త (స) కు అనుమానం ఎందుకు కలిగింది ?
ఈ ప్రసంగంలో, ఇరుగుపొరుగు వారి హక్కుల గురించి ఇస్లామీయ బోధనలు వివరించబడ్డాయి. మంచి పొరుగువారు దొరకడం అల్లాహ్ యొక్క అనుగ్రహం మరియు సౌభాగ్యానికి నిదర్శనమని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనల ద్వారా స్పష్టం చేయబడింది. ఇస్లాం పొరుగువారితో, వారు ఏ మతానికి చెందినవారైనా సరే, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, వారికి కానుకలు ఇచ్చుకోవాలని, వండిన దానిలో వారికి కూడా భాగం ఇవ్వాలని, మరియు వారి అవసరాలకు సహాయపడాలని ఆదేశిస్తుంది. దీనికి విరుద్ధంగా, మాటల ద్వారా గానీ చేతల ద్వారా గానీ పొరుగువారికి హాని కలిగించడం, వారి ప్రాణానికి, మానానికి, ధనానికి నష్టం వాటిల్లేలా చేయడం మహా పాపమని, అలాంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడని ప్రవక్త వారు తీవ్రంగా హెచ్చరించారు. పొరుగువారి ఆకలిని తెలిసి కూడా పట్టించుకోని వాడు విశ్వాసి కాజాలడని కూడా ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియా ఇవల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
సోదర సోదరీమణులారా! మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ఇరుగుపొరుగు వారి హక్కులు
ఈనాటి ప్రసంగంలో మనం ఇరుగుపొరుగు వారి హక్కుల గురించి తెలుసుకోబోతున్నాం. చూడండి, మనమంతా నలుగురిలో ఒకరిలాగా జీవిస్తూ ఉన్నాం. ఆ ప్రకారంగా మనము ఆలోచిస్తే, ప్రతి మనిషి నలుగురి మధ్య జీవించడానికి ఇష్టపడతాడు, ఏకాంతంలో ఒంటరిగా అందరికంటే పక్కగా దూరంగా నివసించడానికి ఇష్టపడడు. కాబట్టి మనలోని ప్రతి ఒక్కరికీ ఇరుగుపొరుగు వారు ఉన్నారు, మనము కూడా వేరే వారికి ఇరుగుపొరుగు వారిగా ఉంటూ ఉన్నాము.
మంచి పొరుగువారి ప్రాముఖ్యత
అయితే మిత్రులారా, పొరుగువారు మంచివారు అయ్యి ఉండటం చాలా ముఖ్యమైన విషయం. అందుకే పెద్దపెద్ద గురువులు, పండితులు, ఎవరైనా ఇల్లు కొనాలనుకుంటున్నారు అని వారితో సలహాలు అడిగినప్పుడు,
اُطْلُبِ الْجَارَ قَبْلَ الدَّارِ (ఉత్లుబిల్ జార్ కబ్లద్దార్) ఇంటి కంటే ముందు ఇరుగు పొరుగు వారిని వెతకండి అని సలహా ఇచ్చేవారు. అర్థం ఏమిటంటే ఇల్లు కొనే ముందు పొరుగు వారు ఎలాంటి వారో చూసుకొని, తెలుసుకొని తర్వాత కొనండి అని చెప్పేవారు. అలా ఎందుకు చెప్పేవారంటే, పొరుగు వారు మంచివారు అయితే వారు మీకు అన్ని విధాలా సహాయపడతారు, మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది, ధార్మిక విషయాలలో కూడా వారు మీకు దోహదపడతారు, సహాయపడతారు.
అయితే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా, పొరుగువారు మంచివారు దొరికిపోవటం ఇది సౌభాగ్యానికి నిదర్శనం అని తెలియపరిచి ఉన్నారు. మనం చూచినట్లయితే, అహ్మద్ గ్రంథంలోని ప్రామాణికమైన ఉల్లేఖనంలో ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు.
مِنْ سَعَادَةِ الْمَرْءِ الْجَارُ الصَّالِحُ (మిన్ సఆదతిల్ మర్ఇ అల్ జారుస్ సాలిహు) ఒక వ్యక్తి యొక్క సౌభాగ్యానికి నిదర్శనమేమిటంటే, అతనికి మంచి పొరుగువారు దొరకడం.
అంటే మనిషి యొక్క సౌభాగ్యానికి నిదర్శనమైన విషయం ఏమిటంటే, అతనికి మంచి పొరుగు వారు దొరికిపోతారు. అల్లాహు అక్బర్! మంచి పొరుగు వారు దొరకటం, అతని అదృష్టానికి నిదర్శనం, అతను అదృష్టవంతుడు అలాంటి మంచి వారు దొరికిపోతే అని ఈ ఉల్లేఖనం ద్వారా మనకు తెలియజేయడం జరిగింది.
అయితే దీనికి విరుద్ధమైన విషయాన్ని మనం చూచినట్లయితే, ఒకవేళ పొరుగువారు మంచివారు కాదు అంటే, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, వారు తలనొప్పిగా మారిపోతారు. పొరుగువారు మంచివారు కాకపోయినప్పుడు వారు మనకోసము తలనొప్పిగా మారిపోతారు. చాలా సందర్భాలలో చూసిన విషయం ఏమిటంటే, పొరుగు వారి పోరు తట్టుకోలేక ప్రజలు ఇల్లు వదిలేస్తారు లేదంటే అమ్మేస్తారు కూడా.
ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చెడ్డ పొరుగు వారు ఉండకూడదు అని అల్లాహ్ శరణు కోరుకుంటూ ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రార్థించేవారు అని సహీ అత్తర్గీబ్ గ్రంథంలోని ప్రామాణికమైన ఉల్లేఖనంలో ఈ విధంగా ఉంది.
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ جَارِ السُّوءِ فِي دَارِ الْمُقَامَةِ (అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ జారిస్సూయి ఫీ దారిల్ ముకామా) ఓ అల్లాహ్! నేను నివాసముండే ప్రదేశంలో చెడ్డ పొరుగు వాని కీడు నుండి నేను నీ శరణు కోరుకుంటున్నాను.
నేను నివాసం ఉండే ప్రదేశంలో చెడ్డ వారి కీడు నుండి ఓ అల్లాహ్ నేను, చెడ్డ పొరుగు వారి కీడు నుండి ఓ అల్లాహ్ నేను నీ శరణు కోరుకుంటున్నాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ తో ప్రార్థన చేస్తూ ఉండేవారు. దీన్నిబట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, చెడ్డవారు పొరుగువారుగా ఉండకూడదు. పొరుగువారు చెడ్డవారు ఉండకూడదు అని ప్రవక్త వారు సైతము అల్లాహ్ తో శరణు కోరుకుంటున్నారంటే, చెడ్డ పొరుగు వారి వల్ల ఎంత ప్రమాదం ఉంటుందో మనము గ్రహించవచ్చు.
పొరుగువారితో మన ప్రవర్తన
అయితే మిత్రులారా, మనం ఎలాగైతే మన పొరుగువారు మంచివారు ఉండాలని కోరుకుంటామో, మన పొరుగువారు చెడ్డవారు ఉండకూడదు అని కోరుకుంటామో, స్వయంగా మనము కూడా పొరుగు వారి కోసము మంచి వాళ్ళులాగా మారిపోవాలి.
రండి ఇన్షా అల్లాహ్, పొరుగువారి పట్ల, వారి శ్రేయము మరియు వారి మంచి పట్ల ఇస్లాం ఎలాంటి బోధనలు చేసి ఉందో ఇన్షా అల్లాహ్ ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం పొరుగువారితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని ఇస్లాం మనకు ఆదేశిస్తూ ఉంది. పొరుగువారు, వారు ఎవరైనా సరే, మన సమీప బంధువులైనా సరే, దూరపు బంధువులైనా సరే, అపరిచితులైనా సరే, ఇతర మతస్తులైనా సరే, అందరితో మనము మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.
ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పదేపదే తెలియజేస్తూ ఉండేవారు.
مَا زَالَ جِبْرِيلُ يُوصِينِي بِالْجَارِ حَتَّى ظَنَنْتُ أَنَّهُ سَيُوَرِّثُهُ (మాజాల జిబ్రీలు యూసీనీ బిల్ జార్ హత్తా జనన్తు అన్నహు సయువర్రిసుహు) జిబ్రీల్ అలైహిస్సలాం నా వద్దకు వచ్చి పదేపదే పొరుగువారి గురించి ఎంతగా బోధించారంటే, బహుశా భవిష్యత్తులో పొరుగువారికి ఆస్తిలో వారసులుగా నిర్ణయించేస్తారేమో అన్న ఆలోచన నాకు కలిగింది.
జిబ్రీల్ అలైహిస్సలాం దైవదూత నా వద్దకు వచ్చి పదేపదే, ఎక్కువగా పొరుగు వారి గురించి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని బోధిస్తూ ఉండేవారు. ఆయన ఎంతగా నన్ను బోధించారంటే, భవిష్యత్తులో బహుశా పొరుగు వారికి ఆస్తిలో భాగస్తులుగా, వారసులుగా నిర్ణయించేస్తారేమోనన్న ఆలోచన నాకు కలిగింది అని ప్రవక్త వారు తెలియజేశారు. అంటే, పొరుగువారికి ఆస్తిలో భాగస్తులుగా, వారసులుగా నిర్ణయించేస్తారేమోనన్న భావన వచ్చేటట్లుగా బోధించారు అంటే, పొరుగువారితో మనం ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉండాలని అల్లాహ్ మరియు ప్రవక్త వారు మనకు బోధిస్తున్నారు అన్న విషయాన్ని మనము గమనించాలి.
అలాగే, పొరుగువారితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని చెప్పడానికి మరొక ఉదాహరణ చూడండి. అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు తాలా అన్హు వారు ఒకరోజు ఇంట్లో ఒక పొట్టేలు కోయించారు. సేవకుడు పొట్టేలు కోస్తూ ఉన్నాడు, మాంసము భాగాలు చేస్తూ ఉన్నాడు. అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారు సేవకునితో ఏమంటున్నారంటే, మా పొరుగులో ఉంటున్న యూదునికి కూడా ఈ మాంసంలో నుంచి ఒక భాగము చేరవేయించండి. ఒకసారి చెప్పి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వచ్చారు, ఏమయ్యా నేను చెప్పిన మాట మరవకు, తప్పనిసరిగా పొరుగువారిలో ఉన్న మా ఆ యూద సోదరునికి ఈ మాంసంలోని భాగము చేరవేర్చు అని మళ్లీ చెప్పి వెళ్లారు. మళ్లీ కొద్దిసేపటి తర్వాత వచ్చారు, మళ్లీ చెప్తున్నారు. అలా పదేపదే వచ్చి చెబుతూ ఉంటే అక్కడ ఉన్న వారిలో ఒకరు ఏమన్నారంటే అయ్యా, ఆయన ముస్లిం కాదు కదా, యూదుడు, వేరే మతస్తుడు కదా, మరి ఆయన గురించి మీరు ఇంతగా తాకీదు చేస్తున్నారు ఎందుకు అని అడిగేశారు. అల్లాహు అక్బర్.
ఆ మాట అడగగానే వెంటనే అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారు ఏమంటున్నారంటే, అయ్యా నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఈ ఉల్లేఖనము విని ఉన్నాను. జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పదేపదే పొరుగువారితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఆదేశిస్తూ వెళ్లారు. ఎంతగా ఆదేశించారంటే ప్రవక్త వారికి అనుమానం కలిగింది, భవిష్యత్తులో జిబ్రీల్ అలైహిస్సలాం ఏమైనా పొరుగు వారికి తమ ఆస్తిలో వాటాదారులుగా, భాగస్తులుగా, వారసులుగా నిర్ణయించేస్తారేమోనని నాకు అనుమానం కలిగిందని ప్రవక్త వారు తెలియజేశారు. ఆ ప్రకారంగా పొరుగువారితో మనము ఎంతగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలన్న విషయం అక్కడ బోధపడింది, నేను స్వయంగా ప్రవక్త వారి నోట ఆ మాట విని ఉన్నాను కాబట్టి ఒక పొరుగు వానిగా నేను మన పొరుగులో ఉంటున్న యూద సోదరునితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, ఇది నాకు ఇస్లాం ఆదేశిస్తున్న విషయము కాబట్టి, తప్పనిసరిగా మీరు ఆ మాంసంలోని భాగము వారికి చేరవేయండి అని తెలియపరిచారు. అల్లాహు అక్బర్.
పొరుగువారు ఎవరైనా సరే వారితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పటానికి ఈ సంఘటన గొప్ప ఉదాహరణగా నిలిచిపోయింది. అలాగే పొరుగువారితో మనము ముఖ్యంగా సత్ప్రవర్తనతో పాటు వారి పట్ల ప్రేమ పెంచుకోవడానికి వారికి కానుకలు కూడా ఇచ్చుకుంటూ ఉండాలి అని ఇస్లాం బోధించింది. చూడండి, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియ సతీమణి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద వెళ్లి ప్రశ్నిస్తూ ఉన్నారు.
يَا رَسُولَ اللَّهِ، إِنَّ لِي جَارَيْنِ، فَإِلَى أَيِّهِمَا أُهْدِي؟ (యా రసూలల్లాహ్, ఇన్నలీ జారైని ఫ ఇలా అయ్యిహిమా అహదీ) ఓ దైవ ప్రవక్తా! నాకు ఇద్దరు పొరుగువారు ఉన్నారు, నేను వారిలో ఎవరికి కానుక ఇవ్వాలి?
ఓ దైవ ప్రవక్తా, పొరుగు వారితో కానుకలు ఇచ్చుకుంటూ ఉండాలి, వారితో మంచి ప్రవర్తన కలిగి ఉండటానికి, ప్రేమ అభిమానాలు పెరగటానికి, కానుకలు ఇచ్చుకోవాలి అని చెప్పారు కదా, అయితే నాకు ఇద్దరు పొరుగువారు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరికి ముందుగా నేను ఈ కానుక అందజేయాలి అని ప్రశ్నించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానమిస్తూ తెలియజేస్తూ ఉన్నారు.
قَالَ: “إِلَى أَقْرَبِهِمَا مِنْكِ بَابًا” (కాల: ఇలా అక్ రబి హిమా మిన్కి బాబన్) ఆయన (ప్రవక్త) ఇలా అన్నారు: “నీ ఇంటి గుమ్మానికి వారిలో ఎవరి ఇల్లు దగ్గరగా ఉందో (వారికి ఇవ్వు)”.
బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం అండి. ప్రవక్త వారంటున్నారు, మీ గుమ్మానికి ఏ పొరుగువారి ఇల్లు దగ్గరగా ఉందో ముందు వారికి కానుక చేరవేయండి, ఆ తర్వాత ఇతరులకు కూడా చేరవేయండి అని దాని అర్థం. చూశారా? కాబట్టి పొరుగువారితో ప్రేమ అభిమానాలు పెంచుకోవటము కోసము, వారికి కానుకలు కూడా ఇచ్చుకుంటూ ఉండండి అని ఇస్లాం మనకు బోధించింది మిత్రులారా.
అలాగే, మనం మన ఇంటిలో అప్పుడప్పుడు మంచి మంచి వంటకాలు చేసుకుంటూ ఉంటాం. అయితే ఇస్లాం ఏమంటుందంటే, మీరు మీ ఇంటిలో మంచి వంటలు చేసుకుంటున్నప్పుడు కొంచెం ఎక్కువగా చేయండి, ఆ వంటలో పొరుగువారి భాగాన్ని విస్మరించకండి అని చెబుతుంది. చూడండి అబూజర్ రజియల్లాహు అన్హు వారికి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశిస్తూ ఉన్నారు. ఏమని ఆదేశిస్తున్నారో చూడండి. ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం.
يَا أَبَا ذَرٍّ، إِذَا طَبَخْتَ مَرَقَةً فَأَكْثِرْ مَاءَهَا وَتَعَاهَدْ جِيرَانَكَ (యా అబాజర్, ఇజా తబఖ్త మరకతన్ ఫ అక్సిర్ మాఅహా వ తఆహద్ జీరానక్) ఓ అబూజర్! నీవు నీ ఇంటిలో కూర వండేటప్పుడు, అందులో నీరు కొంచెం ఎక్కువగా వేయి మరియు నీ పొరుగువారిని పట్టించుకో (వారికి కూడా పంపు).
అల్లాహు అక్బర్. అబూజర్ రజియల్లాహు అన్హు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశిస్తున్నారు, ఓ అబూజర్, నీవు నీ ఇంటిలో కూర వండేటప్పుడు అందులో నీరు కొంచెం ఎక్కువగా వేయి. ఏ ఉద్దేశంతో ఎక్కువ వెయ్యమంటున్నారు? మీ పొరుగువారికి ఆ కూరలోని కొద్ది భాగము చేరవేర్చట కొరకు అందులో కొద్దిగా నీరు ఎక్కువ వెయ్యి అంటున్నారు. అల్లాహు అక్బర్.
చూశారా? దీన్నిబట్టి ధార్మిక పండితులు ఏమంటున్నారంటే, మన ఇంట్లో ఏదైనా మంచి వంటకము మనము చేస్తున్నాము అంటే, అందులో మన పొరుగువారికి కూడా చేరవార్చవలసి ఉంది అన్న ఆలోచనతో మనము వంట చేయాలి, ఆ వంట వండిన తర్వాత అందులో కొద్ది భాగము పొరుగువారికి చేరవేయాలి అని చెప్పారు.
అంతేకాదండి. చాలా గట్టిగా తాకీదు చేయబడి ఉంది పొరుగు వారి గురించి. ఈ హదీస్ వింటే ఇన్షా అల్లాహ్ ఆ విషయం అర్థమవుతుంది. చాలా ముఖ్యమైన విషయం జాగ్రత్తగా వినండి ప్రవక్త వారు తెలియజేస్తున్నారు.
مَا آمَنَ بِي مَنْ بَاتَ شَبْعَانًا وَجَارُهُ جَائِعٌ إِلَى جَنْبِهِ وَهُوَ يَعْلَمُ بِهِ (మా ఆమన బీ మన్ బాత షబ్ఆన వ జారుహు జాయిఉన్ ఇలా జంబిహి వహువ యఅలము బిహి) తన పొరుగువాడు ఆకలితో ఉన్నాడని తెలిసి కూడా, తాను మాత్రం కడుపు నిండా తిని నిద్రించే వ్యక్తి నన్ను విశ్వసించిన వాడు కాడు.
సహీ అల్ జామిఅ గ్రంథంలోని ఉల్లేఖనం. ప్రామాణికమైన ఉల్లేఖనం అండి. ప్రవక్త వారు ఏమంటున్నారు, ఆ వ్యక్తి నా మీద విశ్వాసం తీసుకొని రాలేదు. ఎవరి గురించి అంటున్నారు చూడండి. ఎవరైతే తాను మాత్రం కడుపునిండా భుజించాడు కానీ అతని పొరుగువాడు ఆకలితో పడుకుంటున్నాడు అన్న విషయాన్ని తెలిసి కూడా, అతని ఆకలి దూరం చేయకుండా, అతనికి అన్నం పెట్టకుండా, తాను మాత్రం కడుపునిండా తిని పడుకున్నాడు అంటే, ఆ వ్యక్తి విశ్వాసి కాడు, అతడు నా మీద విశ్వాసమే తీసుకొని రాలేదు అని ప్రవక్త వారు అన్నారు. అల్లాహు అక్బర్.
పొరుగువారు ఆకలితో ఉన్నారు, వారింట పొయ్యి వెలగనే లేదు అన్న విషయాన్ని మన దృష్టికి వచ్చిన తర్వాత కూడా మనము వారికి అన్నము చేర్చి, ఆహారము చేర్చి, వారి ఆకలి తీర్చకుండా మనం మాత్రమే కడుపునిండా భుజించి వారిని పట్టించుకోకుండా వదిలేసి అలాగే పడుకుంటే, మనం విశ్వాసులమే కాము, ప్రవక్త వారి మీద మనం విశ్వాసం తీసుకునే రాలేదు అని అంత గట్టిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పేశారంటే, పొరుగువారితో మనం ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, వారి పట్ల మనము ఎంత శ్రద్ధ తీసుకోవాలి మనము ఇక్కడ తెలుసుకోవాలి మిత్రులారా. అలాగే, గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే, పొరుగువారు ముస్లింలు అయి ఉంటే, వారు ఆకలితో పడుకొని ఉంటే వారి పట్ల శ్రద్ధ తీసుకోండి అని చెప్పట్లేదు. పొరుగువారు ఎవరైనా సరే, బంధువులైనా సరే, మతస్తులైనా సరే, ఇతరులైనా సరే వారు ఆకలితో ఉన్నారని తెలిస్తే, పరాయి మతస్తులైనా సరే ఆకలితో ఉన్నారు మన పొరుగువారని తెలిస్తే, వెంటనే మనము మన వద్ద ఉన్న ఆహారంలో నుంచి కొద్ది భాగము వారికి చేర్చాలి, వారి ఆకలి తీర్చాలి, పొరుగువారిగా మా మీద ఆ హక్కు ఉంది. అలా చేయకపోతే మనము ఆ హక్కును విస్మరించినట్లు అవుతాము, ప్రవక్త వారు చెప్పినట్లుగా మనం విశ్వాసులమే కాము. కాబట్టి మిత్రులారా పొరుగువారి పట్ల మనము శ్రద్ధ తీసుకోవలసి ఉంది అన్న విషయము ఇక్కడ మనకు బోధపడుతుంది.
అలాగే, పొరుగువారి కోసము వారి సహాయము కోసము మనము ఎల్లప్పుడూ మన ద్వారాలు తెరిచి ఉంచాలి. అంటే అర్థం ఏమిటి? పొరుగువారు చిన్న చిన్న విషయాల కోసము మన ఇంటికి వస్తూ ఉంటారు. ఎప్పుడైనా నీళ్లు కావాలని వస్తారు, ఎప్పుడైనా నూనె కావాలని వస్తారు, ఎప్పుడైనా ఉప్పు కావాలని వస్తారు, ఇంకొక్కటి ఏదైనా కావాలి ఇంకొకటి ఏదైనా కావాలి అని వస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి మా ఇంటికి వచ్చేస్తున్నారు ఏమిటి అని విసుక్కోకూడదు. అల్లాహు అక్బర్. విసుక్కోకూడదు, సంతోషంగా వారు వచ్చి అడిగితే మన ఇంటిలో ఉన్న ఆ పదార్థము వారికి సంతోషంగా అందజేయాలి. ఒక పొరుగువారిగా మనము ఆ విషయాన్ని సంతోషంగా భావించాలి గానీ విసుక్కోకూడదు అని ఇస్లాం మనకు బోధిస్తుంది.
చూడండి, పూర్వం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారి గురించి, ఆయన పొరుగు వారి కోసము దీనార్ దిర్హమ్ లు బాగా ఖర్చు పెట్టేసేవారు, వారికి ఇచ్చేస్తూ ఉండేవారు. చూసిన వారిలో కొందరు ఆయనతో ప్రశ్నించారు, ఏమయ్యా మీరు పొరుగువారి కోసము ఆ లెక్క లేకుండా హద్దు లేకుండా ఖర్చు పెట్టేస్తున్నారు ఏమిటి? ఏంటిది అని అడిగేశారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, మనం మన పొరుగువారితో సంబంధాలు ఏర్పరచుకోవడం ముఖ్యం. వారితో మాకు సంబంధం ముఖ్యమైనది, దీనార్ దిర్హం మాకు ముఖ్యమైనది కాదు అని చెప్పారు. అల్లాహు అక్బర్.
అయితే మిత్రులారా, నేడు ఈ రోజుల్లో మనం నివసిస్తున్నాము కదా, మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనము గుండె మీద చెయ్యి పెట్టుకొని ఆత్మ విమర్శ చేసుకోవలసి ఉంది. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా బాధాకరమైన విషయం చెబుతున్నాను, అల్లాహ్ మన్నించు గాక. మనం ఎలా జీవిస్తున్నాము, మన స్వభావం ఎలా ఉంది అంటే, మనకు దీనార్ దిర్హం ముఖ్యమైపోయాయి పొరుగు వారికంటే, మన సోదరులకంటే కూడా. మాకు దీనార్ దొరికితే చాలు, దిర్హం దొరికితే చాలు, పొరుగు వారు మనకు దూరమైపోయినా పర్వాలేదు, పొరుగు వారితో కావాలంటే మనము తెగతెంపులు చేసుకుంటాము గానీ దీనార్ దిర్హం ని మాత్రం వదులుకోము అన్నట్టుగా జీవించేస్తున్నాం. కానీ ప్రవక్త వారి శిష్యులు, పొరుగువారితో మనకు సంబంధాలు కావాలి, దీనార్ దిర్హం పోయినా పర్వాలేదు అని వారు ఆ విధంగా కోరుకునేవారు, అదే వారికి మాకీ తేడా.
అయితే మిత్రులారా, పరివర్తన రావలసిన అవసరం ఉంది. చూడండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
كَمْ مِنْ جَارٍ مُتَعَلِّقٍ بِجَارِهِ يَوْمَ الْقِيَامَةِ (కమ్ మిన్ జారిన్ ముతఅల్లికిన్ బిజారిహి యౌమల్ ఖియామ) ప్రళయ దినం రోజు చాలా మంది పొరుగువారు తమ పొరుగువారి గురించి అల్లాహ్ వద్ద ఫిర్యాదు చేస్తారు.
ప్రళయ దినం రోజు పొరుగువారిలో చాలామంది తమ పొరుగు వారి గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వద్ద ప్రశ్నిస్తారు, అల్లాహ్ తో అడుగుతారు. ఏమని? షికాయత్ చేస్తారు.
يَا رَبِّ هَذَا أَغْلَقَ بَابَهُ دُونِي فَمَنَعَ مَعْرُوفَهُ (యా రబ్, హాజా అగ్లక బాబహు దూనీ ఫ మనఅ మారూఫహు) ఓ నా ప్రభూ! ఇతను (నా పొరుగువాడు) నా కోసం తన ఇంటి తలుపు మూసుకున్నాడు మరియు తన సహాయాన్ని నిరాకరించాడు.
ఇతను నా పొరుగువాడు, ప్రపంచంలో ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాల కోసం వెళ్తూ ఉంటే, అతను నాకు ఇవ్వకుండా తమ వాకిలి మూసుకునేవాడు ఓ అల్లాహ్ అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముందర పొరుగువారి గురించి షికాయత్ చేస్తారు పొరుగువారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించి ఉన్నారు. అల్ అదబుల్ ముఫ్రద్ గ్రంథంలోని ప్రామాణికమైన ఉల్లేఖనం ఇది. కాబట్టి మిత్రులారా పొరుగువారు చిన్న చిన్న విషయాల కోసము వస్తూ ఉంటే మనం సంతోషంగా వారికి అందజేయాలి, పుణ్యకార్యంలాగా భావించాలి. మన హక్కు అని అర్థం చేసుకోవాలి గానీ వారు వస్తూ ఉంటే అడుగుతూ ఉంటే విసుక్కోకూడదు, ఇది ఇస్లాం మనకు బోధిస్తుంది మిత్రులారా.
పొరుగువారికి హాని కలిగించడం – ఒక మహా పాపం
అలాగే, పొరుగువారితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, వారికి కానుకలు ఇవ్వాలి, వారి కోసము మన ఇంటిలో వండిన వంటలు కొన్ని చేరవేయాలి. అలాగే చిన్న చిన్న విషయాల కోసం వారు వస్తుంటే విసుక్కోకూడదు. అలాగే మన తరఫు నుంచి, మన మాటల నుండి, మన చేష్టల నుండి పొరుగువారికి హాని కలగకుండా కష్టము, నష్టము వాటిల్లకుండా మనము జాగ్రత్త పడాలి.
చూడండి, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు.
مَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ فَلَا يُؤْذِ جَارَهُ (మన్ కాన యు’మిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ ఫలా యు’జీ జారహు) ఎవరైతే అల్లాహ్ పట్ల మరియు ప్రళయ దినం పట్ల విశ్వాసం కలిగి ఉన్నారో, వారు తమ పొరుగువారికి ఎలాంటి హాని కలిగించరాదు.
బుఖారీ, ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం. ప్రవక్త వారు అంటున్నారు, ఎవరైతే పరలోకం పట్ల విశ్వసిస్తున్నారో, అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగి ఉన్నారో, వారు తమ పొరుగువారికి ఎలాంటి హాని కలిగించరాదు. పొరుగువారికి హాని కలిగించరాదు. అల్లాహ్ మీద మనకు విశ్వాసం ఉంది, పరలోకం పట్ల మనకు విశ్వాసము ఉంది అంటే, పొరుగు వారికి హాని కలిగించరాదు. మరొక ఉల్లేఖనంలో ప్రవక్త వారు మూడుసార్లు ఈ విధంగా తెలియజేశారు.
وَاللَّهِ لَا يُؤْمِنُ، وَاللَّهِ لَا يُؤْمِنُ، وَاللَّهِ لَا يُؤْمِنُ (వల్లాహి లా యు’మిన్, వల్లాహి లా యు’మిన్, వల్లాహి లా యు’మిన్) అల్లాహ్ పై శపథం! అతను విశ్వాసి కాడు. అల్లాహ్ పై శపథం! అతను విశ్వాసి కాడు. అల్లాహ్ పై శపథం! అతను విశ్వాసి కాడు.
ఆ వ్యక్తి విశ్వాసి కాజాలడు, ఆ వ్యక్తి విశ్వాసి కాజాలడు, ఆ వ్యక్తి విశ్వాసి కాజాలడు. ఎవరు? ఆ వ్యక్తి విశ్వాసి కాజాలడు అంటున్నారు కదా ఆ వ్యక్తి ఎవరు ఓ దైవ ప్రవక్తా అంటే ప్రవక్త వారు అన్నారు.
مَنْ لَا يَأْمَنُ جَارُهُ بَوَائِقَهُ (మల్లా య’మను జారుహు బవాయిఖహు) ఎవరి కీడు నుండి అయితే అతని పొరుగువాడు సురక్షితంగా లేడో (అతను విశ్వాసి కాడు).
ఎవరి కీడు నుండి అతని పొరుగువాడు సురక్షితంగా లేడో, అలాంటి వ్యక్తి విశ్వాసి కాజాలడు అన్నారు. అంటే మన కీడు నుండి మన పొరుగువారు సురక్షితంగా లేరు, మనవల్ల మన పొరుగు వారికి నష్టం వాటిల్లుతుంది అంటే, బాధ కలుగుతూ ఉంది అంటే, మనము విశ్వాసులమే కాము అని ఆ ఉల్లేఖనం యొక్క అర్థం మిత్రులారా. అలాగే, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూటిగా హెచ్చరించి ఉన్నారు.
لا يَدْخُلُ الْجَنَّةَ مَنْ لا يَأْمَنُ جَارُهُ بَوَائِقَهُ (లా యద్ఖులుల్ జన్నత మల్లా య’మను జారుహు బవాయిఖహు) ఎవరి కీడు నుండి అయితే అతని పొరుగువాడు సురక్షితంగా లేడో, ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడు.
ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం. ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడు. ఎవరి కీడు నుండి అయితే అతని పొరుగు వారు సురక్షితంగా లేరో. అంటే, పొరుగు వారికి ఇబ్బంది పెడుతున్న వ్యక్తి, పొరుగు వారికి నష్టం కలిగిస్తున్న వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడు అని సూటిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసేసి ఉన్నారు.
దీనికి ఉదాహరణగా మనం చూచినట్లయితే, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఇద్దరు మహిళల గురించి ప్రశ్నించడం జరిగింది. మొదటి మహిళ ఎవరంటే, ఓ దైవ ప్రవక్తా ఒక మహిళ ఉన్నారు. ఆవిడ ఫర్జ్ ఇబాదత్ లు, విధి ఇబాదత్ లు మాత్రమే చేస్తూ ఉన్నారు. ఎక్కువగా నఫిల్ ఇబాదత్ లు ఏమీ చేయట్లేదు. కాకపోతే, వారి మాటల నుండి, వారి చేష్టల నుండి పొరుగు వారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. అల్లాహు అక్బర్, గమనించాల్సిన విషయం. ఎక్కువగా నఫిల్ ఆరాధనలు ఏమీ చేయట్లేదు ఆవిడ. ఫర్జ్ ఇబాదత్ లు చేసుకుంటూ ఉన్నారు, ఫర్జ్ ఇబాదత్ లతో పాటు పొరుగువారికి నష్టం వాటిల్లకుండా బాధ కలగకుండా జాగ్రత్త పడుతున్నారు. అలాంటి మహిళ గురించి మీరేమంటారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
ఆవిడ స్వర్గానికి చేరుకుంటారు అని చెప్పారు. ఇక మరొక మహిళ గురించి ప్రశ్నించడం జరిగింది. ఓ దైవ ప్రవక్తా, మరొక మహిళ ఉన్నారు, ఆవిడ ఫర్జ్ ఇబాదత్ లతో పాటు, విధి ఆరాధనలతో పాటు, నఫిల్ ఇబాదత్ లు, తహజ్జుద్ నమాజులు కూడా బాగా ఆచరిస్తూ ఉన్నారు. కాకపోతే ఆవిడ తమ మాటల నుండి పొరుగువారికి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆవిడ గురించి మీరేమంటారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
لا خَيْرَ فِيهَا، هِيَ مِنْ أَهْلِ النَّارِ (లా ఖైర ఫీహా, హియ మిన్ అహ్లిన్నార్) ఆవిడలో ఎలాంటి మంచితనము లేదు, ఆవిడ నరకవాసులలో ఒకరు.
అల్లాహు అక్బర్. దీన్నిబట్టి మనకు అర్థమైన విషయం ఏమిటండి? దీన్నిబట్టి మనకు అర్థమైన విషయం ఏమిటంటే, మనం మన వరకు నమాజులు ఆచరించుకుంటూ ఉన్నాము, ఫర్జ్ ఇబాదత్ లు చేసుకుంటున్నాము అంటే మనము స్వర్గానికి చేరిపోము. మనం పొరుగువారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడినప్పుడే మనము స్వర్గానికి చేరుకుంటాము. అంటే ఆరాధనలలో మనం ఎలాగైతే పర్ఫెక్ట్ గా ఉంటామో, వ్యవహారాలలో కూడా పొరుగు వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా వ్యవహారాలలో కూడా మనము పర్ఫెక్ట్ గా ఉండాలి. అప్పుడే స్వర్గానికి చేరుకుంటాము అని ఈ ఉదాహరణ ద్వారా మనకు అర్థమయ్యింది మిత్రులారా.
అలాగే పొరుగువారి ప్రాణానికి, పొరుగువారి మానానికి, పొరుగువారి ధనానికి మన నుండి ఎలాంటి హాని వాటిల్లకూడదు. ఇది కూడా ఇస్లాం మనకు చాలా గట్టిగా తాకీదు చేస్తుంది. మనవల్ల మన పొరుగువారి ప్రాణం పోతుంది అన్న భయం వారికి కలుగుతుందంటే మనలో విశ్వాసం లేదు. మనవల్ల మన పొరుగు వారి మానానికి భంగం వాటిల్లే ప్రమాదము ఉంది అంటే మనం విశ్వాసులము కాదు. మనం మన పొరుగు వారి ధనం దోచుకునే వాళ్ళము అంటే మనం విశ్వాసులము కాము.
చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రశ్నించడం జరిగింది. ఓ దైవ ప్రవక్తా, పెద్ద నేరము ఏది, పెద్ద పాపము ఏది అల్లాహ్ వద్ద అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
أَنْ تَجْعَلَ لِلَّهِ نِدًّا وَهُوَ خَلَقَكَ (అన్ తజ్అల లిల్లాహి నిద్దన్ వహువ ఖలకక్) నిన్ను పుట్టించిన అల్లాహ్ ను వదిలి ఇతరులను నువ్వు ఆరాధించటం ఇది అల్లాహ్ వద్ద పెద్ద నేరము, పెద్ద పాపము అని అన్నారు.
ఆ వ్యక్తి మళ్ళీ ప్రశ్నించాడు, ఓ దైవ ప్రవక్తా ఆ తర్వాత పెద్దది ఏది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
أَنْ تَقْتُلَ وَلَدَكَ مَخَافَةَ أَنْ يَطْعَمَ مَعَكَ (అన్ తక్తుల వలదక మఖాఫత అన్ యత్అమ మఅక్) ఉపాధి ఇచ్చేవాడు అల్లాహ్ యే అయినప్పటికినీ, నీవు బిడ్డలు పుడితే వారు నీతోపాటు కూర్చొని తింటారు అన్న భయంతో నీవు వారిని హతమార్చటం, అంటే భ్రూణహత్యలు చేయటము ఇది పెద్ద నేరము అల్లాహ్ వద్ద అని చెప్పారు.
ఆ వ్యక్తి మళ్ళీ ప్రశ్నించాడు, ఓ దైవ ప్రవక్తా ఆ తర్వాత పెద్ద నేరము ఏది అంటే, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
أَنْ تُزَانِيَ حَلِيلَةَ جَارِكَ (అన్ తుజానియ హలీలత జారిక) నీ పొరుగువారి భార్యతో నీవు వ్యభిచారము చేయటం అల్లాహ్ వద్ద పెద్ద నేరం అన్నారు.
బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం అండి ఇది. కాబట్టి పొరుగువారి మానానికి భంగం వాటిల్లింది మా వల్ల అంటే మేము పెద్ద నేరానికి పాల్పడ్డాము అన్న విషయము. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీరు వ్యభిచారం గురించి ఏమంటారు, దొంగతనం గురించి ఏమంటారు?
مَا تَقُولُونَ فِي الزِّنَا؟ مَا تَقُولُونَ فِي السَّرِقَةِ؟ (మా తఖూలూన ఫిజ్జినా? మా తఖూలూన ఫిస్సర్కా?) వ్యభిచారం గురించి మీరేమంటారు? దొంగతనం గురించి మీరేమంటారు?
వ్యభిచారం గురించి మీరేమంటారు, దొంగతనం గురించి మీరేమంటారు అంటే, సహాబాలు, శిష్యులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, ఓ దైవ ప్రవక్తా, వ్యభిచారం చేయడము ఇది హరాం, నిషేధం. అల్లాహ్ మరియు ప్రవక్త ఇద్దరూ దానిని నిషేధం అని మనకు తెలియపరిచి ఉన్నారు. దొంగతనం చేయటం హరాం, నిషేధం. అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దొంగతనం చేయడం హరాం, నిషేధం అని మనకు తెలియపరిచి ఉన్నారు అని సమాధానం ఇచ్చారు. అంటే వ్యభిచారం చేయటం, దొంగతనం చేయటం దీని గురించి మీరేమంటారు అంటే అది హరాము, నిషేధము, అల్లాహ్ మరియు ప్రవక్త నిషేధం చేశారు అని సహాబాలు సమాధానం ఇచ్చినప్పుడు, ప్రవక్త వారు ఏమంటున్నారో చూడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
لأَنْ يَزْنِيَ الرَّجُلُ بِعَشْرِ نِسْوَةٍ أَيْسَرُ عَلَيْهِ مِنْ أَنْ يَزْنِيَ بِامْرَأَةِ جَارِهِ (లఅన్ యజ్నియర్ రజులు బి అషరి నిస్వతిన్ ఐసరు అలైహి మిన్ అన్ యజ్నియ బిమ్ రఅతి జారిహి) ఒక వ్యక్తి వేరే పది మంది మహిళలతో వ్యభిచారం చేయటం కంటే, తన పొరుగువారి భార్యతో వ్యభిచారం చేయటం పెద్ద పాపం.
మరియు
وَلأَنْ يَسْرِقَ الرَّجُلُ مِنْ عَشَرَةِ أَبْيَاتٍ أَيْسَرُ عَلَيْهِ مِنْ أَنْ يَسْرِقَ مِنْ بَيْتِ جَارِهِ (వ లఅన్ యస్రికర్ రజులు మిన్ అషరతి అబ్యాతిన్ ఐసరు అలైహి మిన్ అన్ యస్రిక మిన్ బైతి జారిహి) ఒక వ్యక్తి వేరే పది ఇళ్లలో దొంగతనం చేయటం కంటే, తన పొరుగువారి ఇంట్లో దొంగతనం చేయటం పెద్ద పాపం.
అని ప్రవక్త వారు తెలియజేశారు. అల్లాహు అక్బర్. వేరేచోట పది ఇళ్లల్లో దోచుకోవటం కంటే పొరుగు వారి ఇంటిలో దొంగతనం చేయటం పెద్ద నేరం అవుతుంది. వేరేచోట పది మంది మహిళల వద్ద వ్యభిచారం చేయటం కంటే కూడా, పొరుగువారి ఇంటిలో ఉన్న మహిళతో వ్యభిచారం చేయటం పెద్ద నేరం అయిపోతుంది అని ఈ ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పష్టంగా మనకు తెలియపరిచి ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మన నుండి మన పొరుగువారి ప్రాణానికి నష్టం వాటిల్లకూడదు, మన నుండి మన పొరుగువారి ధనానికి నష్టం వాటిల్లకూడదు, మన నుండి మన పొరుగువారి మానానికి కూడా భంగము వాటిల్లకూడదు. అలా జాగ్రత్త పడాలి అని ఇస్లాం మనకు బోధిస్తుంది. అలాగే జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, పొరుగువారు ఇతర మతస్తులైనా సరే, వారి మానానికి గానీ, వారి ప్రాణానికి గానీ, వారి ధనానికి గానీ మన తరఫు నుంచి ఎలాంటి ధోకా ఉండకూడదు. అప్పుడే మనము నిజమైన విశ్వాసులమవుతాము అని మనము గుర్తించాలి, తెలియజేసుకోవాలి మిత్రులారా.
ఇప్పటివరకు పొరుగువారితో మనము ఏ విధంగా జీవించుకోవాలి, పొరుగువారి పట్ల ఏ విధంగా మనము శ్రద్ధ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అన్న విషయాలు బోధపడ్డాయి. నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ అన్న విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
క్రింది లింకులు దర్శించి ఇరుగు పొరుగు వారి హక్కుల గురుంచి మరింత జ్ఞానం సంపాదించండి:
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.