ధర్మ శాస్త్ర శాసనాలు (Fiqh Islami) (జకాత్ ఆదేశాలు, అన్నపానియాల ఆదేశాలు, వస్త్రాధరణ ఆదేశాలు, వైవాహిక ధర్మాలు) అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హజ్జ్, ఉమ్రా ఆదేశాలు – Rulings of Hajj and Umrah అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
ఇస్లాం మూల స్తంభాలు ఐదున్నవి: అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవడు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట. నమాజు స్థాపించుట. విధి దానము (జకాత్) చెల్లించుట. హజ్ చేయుట. రమజాను నెల ఉపవాసం ఉండుట. (బుఖారి 8, ముస్లిం 16).
దాని ఘనతః అల్లాహ్ సాన్నిధ్యంలో చేర్పించు సత్కార్యాలలో హజ్ అతిగొప్పది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః
ఎవరైతే ఏలాంటి వాంఛలకు లోనవకుండా, దైవ ఆజ్ఞల్ని ఉల్లంఘించకుండా హజ్ చేసి తిరిగి వెళ్తారో, వారు తమ తల్లి గర్భము నుంచి పుట్టినప్పటి స్థతిలో తిరిగి వెళ్తారు. (బుఖారి 1819, ముస్లిం 1350).
హజ్ నిబంధనలు
తెలివిగల, యుక్తవయస్సుకు చేరిన ప్రతి ముస్లింపై హజ్ విధిగా ఉంది. అతను దానికి అర్హుడైనప్పుడు. అంటే తన బాధ్యతలో ఉన్నవారి ఖర్చులు చెల్లించాక, అతని వద్ద మక్కా రాను, పోను పూర్తి ప్రయాణ ఖర్చులు ఉండాలి. ప్రయాణ దారి నిర్భయంగా ఉండాలి. శారీరకంగా ఆరోగ్యవంతుడై యుండాలి. హజ్ చేయుటకు ఆటంకం కలిగించే అంగవైకల్యం మరే శారీరక రోగం ఉండ కూడదు. ఇక స్త్రీ విషయంలో గత నిబంధనలతో పాటు తనతో తన ‘మహ్రమ్’ (వివాహ నిషిద్ధమైన బంధువు) ఉండాలి. అంటే భర్త, లేక ఆమె దగ్గరి మహ్రమ్ లో ఏవరైనా ఒకరు ఉండాలి. ఆమె (తన భర్త చనిపోయినందుకు లేదా విడాకులు పొంది- నందుకు) గడువులో కూడా ఉండ కూడదు. ఎందుకనగా గడువులో ఉన్నవారు ఇంటి బైటికి వెళ్ళుట అల్లాహ్ నిషేధించాడు. ఎవరికి ఇలాంటి ఆటంకాలు ఎదురగునో వారిపై హజ్ విధిగా లేదు.
హజ్ సిద్ధాంతములు
1- హాజి హజ్ కొరకు పయణమయ్యే ముందు హజ్, ఉమ్రా పద్ధతులను తెలుసుకొని ఉండాలి. దానికి సంబంధించిన పుస్తకాలు చదివి లేదా పండితులతో ప్రశ్నించి ఇంకే విధంగానైనా సరే తెలుసుకోవాలి.
2- మేలు విషయాల్లో సహాయపడే మంచి మిత్రుని వెంట వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఒక వేళ ధర్మజ్ఞాని, లేదా ధర్మజ్ఞాన విద్యార్థి తనకు తోడుగా ఉంటే మరీ మంచిది.
3- హజ్ ఉద్దేశం అల్లాహ్ అభీష్టాన్ని, ఆయన సన్నిధానమును పొందుటయే ఉండాలి.
4- వృధా మాటల నుండి నాలుకను కాపాడాలి.
5- ఎవరికీ బాధ కలిగించకుండా ఉండాలి.
6- స్త్రీ పర్ద చేయు విషయంలో, జన సమ్మూహం నుండి దూరముండుటకు అన్ని రకాల ప్రయత్నం చేయాలి.
7- హాజి తనకు తాను అల్లాహ్ ఆరాధనలో ఉన్నట్లు, లోక సంచారములో కాదని భావించాలి. కొందరు హజ్ యాత్రికులు అల్లాహ్ వారికి సన్మార్గము చూపుగాకా! వారు హజ్ యాత్రను వినోద విహారమునకు, ఫోటోలు, వీడియోలు తీయుటకు సదావకాశముగా భావిస్తారు. (ఇది తప్పు).
ఇహ్రామ్
‘ఇహ్రామ్’ హజ్ ఆరాధనలోకి ప్రవేశము. హజ్ లేక ఉమ్రా చేయాలనుకున్న ప్రతి వ్యక్తిపై ‘ఇహ్రామ్’ విధిగా ఉంది. హజ్ లేక ఉమ్రా చేయు వ్యక్తి మక్కా బయటి నుండి వచ్చే వారయితే ప్రవక్త నియమించిన మీఖాతుల్లో ఏ ఒక మీఖాతు నుండైనా ఇహ్రామ్ చేయాలి. ఆ మీఖాతులు ఇవిః
1- ‘జుల్ హులైఫ’: ఇది మదీనకు సమీపంలో ఒక చిన్న పల్లెటూరు. ఇప్పుడు దాని పేరు ‘అబ్ యారె అలీ’. ఇది మదీనవాసుల మీఖాత్. 2- ‘అల్ జుహ్ ఫ’: అది రాబిగ్ సమీపంలో ఒక పల్లెటూరు. ఈ రోజుల్లో రాబిగ్ నుంచే ఇహ్రామ్ చేస్తున్నారు. ఇది సిరీయా వారి మీఖాతు. 3- ‘ఖర్నుల్ మనాజిల్’ (‘అస్సైలుల్ కబీర్’): ఇది తాయిఫ్ కు సమీపాన ఒక ప్రాంతం. ఇది నజ్ద్ వారి మీఖాత్. 4- ‘యలమ్ లమ్’: ఇది యమన్ వారి మీఖాత్. 5- ‘జాతు ఇర్ఖ్’: ఇది ఇరాఖ్ వారి మీఖాత్.
పై మీఖాతులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నియమించారు. అవి మేము తెలిపిన వారి ప్రాంత నివాసుల మరియు వారి తప్ప ఎవరైతే హజ్ లేక ఉమ్రా చేయుటకు వాటి నుండి దాటుతారో వారికి కూడాను. ఇక మక్కా నివాసులు మరియు ‘అహ్లుల్ హిల్ల్’ (మక్కా నగరానికి బయట మరియు మీఖాతు లోపల నివసించువారు) తమ ఇంటి నుండే ఇహ్రామ్ చేయాలి.
ఇహ్రామ్ ధర్మములు
ఇహ్రామ్ కు ముందు చేయవలసిన ధర్మములు:
1- గోర్లు, చంకల మరియు నాభి క్రింది వెంట్రుకలు తీయాలి. మీసాలు కత్తిరించాలి. స్నానం చేసి, సువాసన శరీరానికి పూసుకోవాలి. ఇహ్రామ్ దుస్తులకు పూసుకోవద్దు.
2- కుట్టిన బట్టలు తీసి, ఒక పంచి కట్టుకొని, ఒక దుప్పటి వేసుకోవాలి. స్త్రీ తనకిష్టమైన బట్టలు ధరించవచ్చును. అయితే పూర్తి పర్ద చేయాలి. అలంకరణ ప్రదర్శించకుండా ఉండాలి. పరపురు- షులు ఎదురయ్యే సమయాన ముఖము, అరచేతుల పర్ద కూడా చేయుటకు ప్రయత్నిం- చాలి. చేతుల్లో గ్లౌసులు, ముఖముపై నఖాబ్ వేయ కూడదు.
3- మస్జిద్ కు వెళ్ళి నమాజ్ సమయమయితే జమాఅతుతో నమాజు చేసుకోవాలి. లేనిచో రెండు రకాతులు ‘తహియ్యతుల్ వుజూ’ చేసుకోవచ్చు. ఆ తరువాత ఇహ్రామ్ చేయాలి.
అన్సాకుల్ హజ్ మూడు రకాలు
1- హజ్జె తమత్తుఅ: ముందు ఉమ్రా యొక్క ఇహ్రామ్ మాత్రమే చేయాలి. ఉమ్రా చేసిన తరువాత హలాల్ అయిపోయి, మళ్లీ హజ్ రోజున మక్కాలో తానున్న ప్రాంతము నుండే హజ్ కొరకు ఇహ్రామ్ చెయ్యాలి. మీఖాతులో ఇలా అనాలి. లబ్బైక్ ఉమ్రతన్ ముతమత్తిఅన్ బిహా ఇలల్ హజ్. హజ్జె తమత్తుఅ మిగిత రెండు రకాల కంటే చాలా శ్రేష్ఠమైనది. అది ముఖ్యంగా హాజి హజ్ సమయానికి ముందుగా మక్కాలో వచ్చి ఉంటే. ఇందులో హాజీ ఒక బలిదానము తప్పక ఇవ్వాలి. ఒక వ్యక్తి తరఫున ఒక మేక మరియు ఏడుగురి తరఫున ఒక ఒంటె లేక ఒక ఆవు సరిపోతుంది.
2- ‘హజ్జె ఖిరాన్’: ఒకే సమయంలో ఉమ్రా మరి
హజ్ ఇహ్రామ్ చేయాలి. లబ్బైక్ ఉమ్రతన్ వ హజ్జన్ అనాలి. ముందు ఉమ్రా చేసి (అంటే తావాఫ్, సఈ చేసి, తల వెంట్రుకలు తీయకుండా) అదే ఇహ్రామ్ లో ‘యౌమున్నహర్’ (10వ తేది) వరకు ఉండాలి. ఇలా ఉమ్రా తరువాత హలాల్ గాకుండా హజ్ లో చేరడం అవుతుంది. ఈ రకమైన హజ్ సామాన్యంగా హజ్ ఆరంభానికి అతి సమీపంలో వచ్చినవారు చేస్తారు. ఉమ్రా చేసి హలాల్ అయి మళ్ళీ హజ్ కొరకు ఇహ్రామ్ చేసే సమయం ఉండదు గనక. లేదా బలి జంతువు తమ వెంట తీసుకొచ్చిన వారు చేస్తారు. ఈ హజ్ లో కూడా బలిదానం తప్పనిసరి.
3- ‘హజ్జె ఇఫ్రాద్’: కేవలం హజ్ సంకల్పం మాత్రమే చేయాలి. మీఖాత్ లో లబ్బైక్ హజ్జన్ అనాలి. ఇందులో బలిదానం అవసరం లేదు.
విమానంలో ప్రయాణించువారు మీఖాత్ కు సమాన ప్రాంతం వద్దనే ఇహ్రామ్ చేయాలి. మీఖాత్ ఏర్పాటు కష్టంగా ఉంటే దానికి కొంచెం ముందు కూడా చేయవచ్చును. ఇక మీఖాత్ వద్ద చేసే పనులు; గోళ్ళు తీయడం, స్నానం చేసి, శరీరానికి సువాసన పూసుకోవడం మరియు ఇహ్రామ్ దుస్తులు ధరించడం లాంటివన్నీ విమానంలో లేదా అందులో పయనమయ్యే ముందు పూర్తి చేసుకోవాలి. మీఖాత్ వద్ద లేదా దానికి కొంచెం ముందు చేరుకున్నప్పుడు ఇహ్రాం సంకంల్పం చేయాలి.
ఇహ్రామ్ స్థితిలో ఉన్న వ్యక్తిపై ఇహ్రామ్ కు ముందు యోగ్యమున్న కొన్ని విషయాలు నిషిద్ధం అగును. ఎందుకనగా అతడు ఒక ఆరాధనలో ప్రవేశించాడు. అతనిపై క్రింది విషయాలు నిషిద్ధం:
1- తల వెంట్రుకలు మరియు శరీర వెంట్రుకలు తీయడం నిషిద్ధం. కాని అవసరమున్నప్పుడు మెల్లగా తల గోకుట నేరం కాదు.
2- గోళ్ళు తీయుట నిషిద్ధం. కాని గోరు విరిగినా, నొప్పి ఉన్నా దానిని తీయుట పాపం కాదు.
3- సుగంధం మరియు సువాసన సబ్బుల ఉపయోగం నిషిద్ధం.
4- సంభోగం మరియు దానికి సంబంధించిన విషయాలు నిషిద్ధం. ఉదా: పెళ్ళి చేసుకొనుట, చేయించుట, భార్యభర్తల సరసాలడడం వగైరా.
5- చేతులలో గ్లౌసులు వేసుకొనుట నిషిద్ధం.
6- వేటాడుట నిషిద్ధం.
పై ఆరు విషయాలు స్త్రీ పురుషులందరిపై నిషిద్ధం. ఇక ప్రత్యేకంగా పురుషులపై నిషిద్ధం ఉన్న విషయాలు దిగువ తెలుపబడుతున్నవి.
1- కుట్టిన బట్టలు ధరించడం నిషిద్ధం. కాని అవసరముంటే బెల్ట్, గడియారం మరియు కళ్ళ జోళ్ళు ఉపయోగించవచ్చును.
2- తలకు అంటుకొని ఉండే ఏదైనా వస్తువు ఉపయోగించడం నిషిద్ధం. కాని అంటుకొని ఉండని గొడుగు, వాహణము మరియు గుడారాలు లాంటివి ఉపయోగించడం యోగ్యం.
3- మేజోళ్ళు తొడుగుట నిషిద్ధం. కాని సైండిల్ మరియు చెప్పులు లేనప్పుడు మడమలు కనబడే బూట్లు ఉపయోగించ వచ్చును.
పై నిషిద్ధ కార్యాలు చేసినవాని 3 స్థితులు:
1- అకారణంగా చేసిన వ్యక్తి పాపాత్ముడగును. ఇంకా అతనిపై ‘ఫిద్య’ (ప్రాయశ్చితం) కూడా విధియగును.
2- ఏదైనా అవసరం ఉండి చేసిన వ్యక్తి పాపా- త్ముడు కాడు. కాని ప్రాయశ్చితం చెల్లించాలి.
3- ఏదో కారణంగా -ఉదా: తెలియక, మరచి- పోయి, లేదా ఒకరి ఒత్తిడితో నిస్సహాయుడై- చేసిన వ్యక్తి పాపాత్ముడూ కాడు, అతనిపై ప్రాయశ్చితమూ లేదు.
తవాఫ్
ఇతర మస్జిదుల మాదిరిగా మస్జిదె హరాంలో కూడా కుడి కాలుతో ప్రవేశిస్తూ ఈ దుఆ చదవడం ధర్మం. బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అల్లాహుమ్మగ్ ఫిర్లీ జునూబి వఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక.
بِسْمِ الله وَالصَّلاَةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ الله اللَّهُمَّ اغْفِرْ لِي ذُنُوبِي وَافْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ
కాబా తవాఫ్ చేయుటకు దానివైపున వెళ్ళాలి.
తవాఫ్: అంటే అల్లాహ్ యొక్క ఇబాదత్ ఉద్దేశ్యంతో కాబా చుట్టున ఏడు సార్లు ప్రదక్షిణం చేయుట. అది హజ్రె అస్వద్ నుండి ప్రారంభించి అక్కడే ముగించాలి. మొదటి మూడిట్లో దగ్గర దగ్గర అడుగులు వేసి పరుగెత్తుట ధర్మం. కాని ఎవరికీ ఇబ్బంది కలగించకూడదు. దీనినే ‘రమ్ల్’ అంటారు. పైన కప్పుకున్న దుప్పటిని కుడి భుజము క్రింది నుండి తీసుకొని ఎడమ భుజముపై వేసుకోవాలి. అంటే కుడి భుజము పైన బట్ట ఉండకూడదు. దీనిని ‘ఇజ్తిబాఅ’ అంటారు. ఇవి రెండు (రమ్ల్, ఇజ్తిబాఅ) ఉమ్రా లేక హజ్ ఉద్దేశ్యంతో మక్కా వచ్చి చేసే తొలి తవాఫ్ లో మాత్రమే చేయాలి. కాబా ఎడమ వైపు ఉండాలి. తవాఫ్ వుజూ స్థితిలో చేయుట తప్పనిసరి. ఇక తవాఫ్ ఈ విధంగా చేయాలి:
1- హజ్రె అస్వద్ వద్దకు వెళ్ళి కుడి చేయితో దానిని ముట్టుకొని బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. వీలవుతే దాన్ని చుంబించాలి. చుంబిం- చడం వీలు కాకుంటే దాన్ని చెయ్యితో ముట్టుకొని చెయ్యిని చుంబించాలి. చెయ్యితో ముట్టుకొనుట కూడా సాధ్యపడకుంటే దాని సూటిగా నిలబడి దాని వైపు చెయ్యితో సైగ చేస్తూ బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. కాని చెయ్యిని చుంబించకూడదు. ఇక తవాఫ్ ప్రారంభించాలి. ఇష్టానుసారం, తన భాషలో తన కొరకు, తను కోరినవారి కొరకు దుఆ చేస్తూ లేదా ఖుర్ఆన్ పారయణం చేస్తూ ఉండాలి. ఇచ్చట ప్రత్యేకంగా ఏ దుఆ లేదు.
2- రుక్నె యమాని వద్ద చేరుకున్నాక వీలవుతే దాన్ని ముట్టుకుంటూ అల్లాహు అక్బర్ అనాలి. కాని చెయ్యిని చుంబించకూడదు. వీలు కాకుంటే (తవాఫ్ చేస్తూ ఉండాలి). చెయ్యితో సైగ చేయకూడదు. అల్లాహు అక్బర్ అనకూడదు. ఈ రుక్నె యమాని మరియు హజ్రె అస్వద్ మధ్య ఈ దుఆ చదవాలి: రబ్బనా ఆతినా ఫిద్దున్ యా హసనతౌఁ వఫిల్ ఆఖిరతి హసనతౌఁ వఖినా అజాబన్నార్. (చూడండి సూర బఖర 2:201).
3- హజ్రె అస్వద్ వద్ద చేరుకొని దాన్ని చెయ్యితో ముట్టుకుంటూ, వీలు కాకుంటే దాని వైపు చెయ్యితో సైగ చేస్తూ అల్లాహు అక్బర్ అనాలి.
ఈ విధంగా 7 ప్రదక్షిణాల్లో ఒకటి పూర్తయింది.
4- మిగితవి మొదటి దాని లాగే చేస్తూ, హజ్రె అస్వద్ చేరుకున్నప్పుడల్లా మరియు ఏడవది పూర్త- యిన తరువాత కూడా అల్లాహు అక్బర్ అనాలి.
తవాఫ్ తరువాత:
తవాఫ్ తరువాత మఖామె ఇబ్రాహీం వెనక – అనగా అది తనకు మరియు కాబాకు మధ్యలో ఉన్నట్లుగా- నిలబడి రెండు రకాతుల నమాజు చేయుట ధర్మం. నమాజు చేస్తున్నప్పుడు దుప్పటి రెండు భుజాలపై ఉండుట తప్పనిసరి. ఏ ఒక్క భుజము నగ్నంగా ఉండకుడదు. మొదటి రకాతులో సూరె ఫాతిహా తరువాత ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ రెండవ రకాతులో సూరె ఫాతిహా తరువాత ఖుల్ హువల్లాహు అహద్ చదవాలి. జనసమ్మర్థంలో దాని వెనక నమాజ్ చేయుట సాధ్యపడకుంటే మస్జిదె హరాంలో ఏక్కడైనా చేయవచ్చును.
సఈ
ఇక ‘మస్అ’ (సఫా, మర్వాల మధ్యలో ‘సఈ’ చేసే స్థలం) వైపుకు వెళ్ళి సఫా దగ్గరికి చేరుకుం- టూ “ఇన్నస్సఫా వల్ మర్వత మిన్ షఆఇరిల్లాహ్” చదివాలి. సఫా కొండపై ఎక్కి కాబా దిశలో నిలబడి చేతులు ఎత్తి అల్లాహ్ స్తోత్రము పఠించి, ఈ దుఆ మూడు సార్లు చదవాలి. దాని మధ్యలో రెండు సార్లు తనిష్టానుసారం దుఆ చేసుకోవాలిః లాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లాషరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు యుహ్ యీ వయుమీతు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. లాఇలాహ ఇల్ల- ల్లాహు వహ్ దహూ అంజజ వఅదహూ వనసర అబ్ దహూ వహజమల్ అహ్ జాబ వహ్ దహూ.
ఆ తరువాత సఫా నుండి దిగి మర్వా వైపు నడవాలి. పచ్చరంగు గుర్తులు ఉన్న స్థలంలో శక్తి ప్రకారం పరుగుతీయడం ధర్మం. ఇతరులకు బాధ కలిగించకూడదన్న షరతును మరవవద్దు. ఈ పరుగు పురుషులకే ప్రత్యేకం. స్త్రీలకు దీని అనుమతి లేదు. మర్వా చేరుకొని దానిపై ఎక్కి ఖిబ్లా దిశలో నిలబడి చేతులు ఎత్తి సఫాపై చేసినటువంటి దుఆ చెయ్యాలి. అయితే మన భాషలో మనకిష్టమున్న దుఆ కూడా చేసు కోవాలి. ఇక్కడికి ఏడిట్లో ఒకటి పూర్తయింది. మిగిత ఆరు ఇలాగే పూర్తి చేయాలి. ప్రతీ సారి సఫా మరియు మర్వాల వద్ద దుఆ చేయాలి. పచ్చ రంగు స్తంభాల మధ్య పరుగుతీయాలి. సఈ మధ్యలో దుఆ ఎక్కువగా చేయాలి. ఏడిట్లో ప్రతీ ఒక దానికొక వేరు దుఆ అంటూ ప్రవక్తతో రుజువు లేదు.
హాజి తమత్తుఅ చేయువాడైతే సఈ తర్వాత తల వెంట్రుకలు తీయించుకొని ఉమ్రా ముగించాలి. సాధారణ దుస్తులు ధరించి ఇహ్రామ్ నుండి హలాల్ అవ్వాలి. జిల్ హిజ్జ ఎనిమిదవ రోజున జొహ్ర్ నమాజుకు కొంచెం ముందు తనున్న ప్రాంతం నుండే హజ్ కొరకు ఇహ్రాం చేస్తూ, ఉమ్రా కొరకు ఇహ్రామ్ చేయు సందర్భంలో చేసిన పనులు ఇప్పుడు చేసి హజ్ సంకంల్పం మనుసులో చేసుకొని లబ్బైక్ హజ్జన్ అనాలి. ఆ తరువాత తల్ బియ చదవాలి. కాని ఖిరాన్, ఇఫ్రాద్ చేయువారు సఫా మర్వాల మధ్య సఈ పూర్తి చేసి, వెంట్రుకలు తీయకుండా, ఇహ్రాం స్థితిలోనే ఉండాలి.
జిల్ హిజ్జ ఎనిమిదవ రోజు
ఈ రోజు హాజి మినా వెళ్ళి జొహ్ర్, అస్ర్, మగ్రిబ్, ఇషా మరియు ఫజ్ర్ నమాజులు చేయాలి. ప్రతి నమాజు దాని సమయంలో మరియు నాలుగు రకాతుల నమాజు ఖస్ర్ చేసి రెండు రకాతులు చేయాలి.
తొమ్మిదవ రోజు (అరఫ రోజు)
ఈ రోజు చేయు ధర్మములు ఇవి:
1- సూర్యోదయము తరువాత హాజి అరఫాత్ వెళ్ళి అచ్చట సూర్యాస్తమయం వరకు ఉండాలి. పొద్దు వాలిన తరువాత జొహ్ర్, అస్ర్ కలిపి ఖస్ర్ చేయాలి. నమాజ్ తరువాత అల్లాహ్ స్మరణము, దుఆ మరియు తల్ బియలో నిమగ్నులై, వినయ వినమ్రతతో అల్లాహ్ ను వేడుకుంటూ తన కొరకు మరియు ముస్లిముల కొరకు అల్లాహ్ తో అడుగుతూ తనిష్ట ప్రకారం దుఆ చేసుకోవాలి. చేతులు ఎత్తి దుఆ చేయడం చాలా మంచిది. అరఫాత్ లో నిలవడం హజ్ రుకున్ లలో ఒకటి. ఇచ్చట నిలవనివారి హజ్ కానేకాదు. ఇచ్చట నిలుచు సమయం 9వ జిల్ హిజ్జ సూర్యోదయం నుండి 10వ జిల్ హిజ్జ ఉషోదయం వరకు. ఎవరైతే ఈ పగలు మరియు రాత్రిలో ఏ కొంత సమయం నిలిచినా వారి హజ్ సరియగును. హాజి అరఫాత్ హద్దు లోపల ఉండుట తప్పనిసరి. ఆ రోజున హద్దు లోపల ఉండకుండా బైట ఉన్నవారి హజ్ నెరవేరదు.
2- అరఫ రోజు కచ్చితంగా సూర్యాస్తమయం అయిన పిదప అరఫాత్ నుండి ముజ్ దలిఫా వైపునకు పూర్తి శాంతి, మర్యాదతో ఘనమైన శబ్దముతో తల్ బియ చదువుతూ వెళ్ళాలి.
ముజ్ దలిఫా
ముజ్ దలిఫా చేరుకొని మగ్రిబ్ మరియు ఇషా నమాజులు కలిపి ఖస్ర్ చేయాలి. నమాజు తరువాత తన స్వంత పనులు చేసుకోవచ్చును. అది భోజనం తయారీ, తదితర పనులు. చురుకుదనంతో ఫజ్ర్ నమాజుకు మేల్కొనుటకు తొందరగా పడు కోవడం చాలా మంచిది.
పదవ రోజు (పండుగ రోజు)
1- ఫజ్ర్ నమాజు సమయమయిన వెంటనే నమాజు చేసుకొని అక్కడే కూర్చోని ప్రకాశమాన వరకు అధికంగా జిక్ర్, దుఆలు చేస్తూ ఉండాలి.
2- ఏడు చిన్న రాళ్ళు తీసుకొని సూర్యోదయాని- కి ముందే తల్ బియ చదువుతూ మినా వెళ్ళాలి.
3- జమ్ర అఖబ (జమ్ర కుబ్రా, సామాన్యాంగా ప్రజలు దాన్ని పెద్ద షైతాన్ అంటారు) చేరుకునే వరకు తల్ బియ చదువుతూ ఉండాలి. ఏడు రాళ్ళు, ప్రతి రాయి అల్లాహు అక్బర్ అంటూ ఒక్కొక్కటేసి జమ్ర అఖబపై విసరాలి.
4- రాళ్ళు విసిరిన తరువాత తమత్తుఅ, మరి ఖిరాన్ చేసేవారు ఖుర్బానీ చెయ్యాలి. మరియు అందులో నుంచి వారు స్వయంగా తినడం, ఇతరు లకు దానం చేయడం, బహుకరించడం మంచిది.
5- ఖుర్బానీ తరువాత తల కొరిగించాలి. లేదా కటింగ్ చేయించుకోవాలి. తల కొరిగించడం ఎక్కువ పుణ్యం. స్త్రీలు కూడా తమ తల వెంట్రుకలను వ్రేలు మందము అనగా మూడు సెంటిమీటర్లు కత్తిరించుకోవాలి.
ఇప్పుడు హాజి స్నానం చేసి, సువాసన పూసుకొనుట, దుస్తులు ధరించుట మంచిది. ఎందుకనగా ఇప్పుడు హాజిపై ఇహ్రామ్ వలన నిషిద్ధమున్న; కుట్టిన బట్టలు ధరించడం, సువాసన పూసుకోవడం, గోళ్ళు, వెంట్రుకలు తీయడం లాంటి విషయాలు యోగ్యమగును. కాని భార్యభర్తల సంభోగ నిషిద్ధత కాబా యొక్క తవాఫ్ ముగిసే వరకు ఉండును.
6- కాబా వద్దకు వెళ్ళి తవాఫె హజ్ (తవాఫె ఇఫాజ) చెయ్యాలి. అది ఈ విధంగా: ముందు కాబా చుట్టున ఏడు సార్లు ప్రదక్షిణం చెయ్యాలి. మఖామె ఇబ్రాహీం వద్ద రెండు రకాతుల నమాజు చెయ్యాలి. హజ్జె తమత్తుఅ చేయువారు సఫా మర్వాల మధ్య సఈ చెయ్యాలి. కాని ఖిరాన్ హజ్ లేదా ఇఫ్రాద్ హజ్ చేయువారు తొలి తవాఫ్ తో సఈ చేసియుంటే ఇప్పుడు సఈ చేయవలసిన అవసరం లేదు. అదే హజ్ యొక్క సఈ అగును. అప్పుడు సఈ చేయకున్నట్లయితే ఇప్పుడు తప్పక చేయాలి.
సఈ తరువాత ఇహ్రాం నిషిద్ధతలన్నీ ముగి- స్తాయి. భార్యాభర్తల మధ్య నిషిద్ధత కూడా.
7- హాజీ 11వ, 12వ రాత్రి మినాలో గడపటం తప్పనిసరి. (ఇష్టమున్నవారు 13వ రాత్రి కూడా ఉండవచ్చును). రాత్రి గడపటం అంటే రాత్రి యొక్క అధిక భాగం మినాలో ఉండాలి.
రాళ్ళు విసరడం, ఖుర్బానీ చేయడం, క్షౌరం, తర్వాత తవాఫ్. ఈ నాలుగు పనులు ఇదే క్రమంగా చేయడం సున్నత్. ఒక వేళ ఇందులో వెనకా ముందు జరిగినా ఏమీ అభ్యంతరం లేదు.
పదకుండవ రోజు
ఈ రోజు హాజి రమె జిమార్ (రాళ్లు విసురుట) ఆవశ్యకం. దాని సమయం పొద్దు వాలిన వెంటనే మొదలవుతుంది. అంతకు ముందు విసురుట యోగ్యం లేదు. మరుసటి రోజు ఉషోదయం వరకు దీని సమయం ఉంటుంది. ముందు చిన్న జమరపై, తర్వాత మధ్య దానిపై, ఆ తరువాత అఖబ అంటే పెద్ద దానిపై విసరాలి. క్రింద తెలుపబడే రీతిలో రమె జిమార్ చెయ్యాలి.
1- తన వెంట చిన్న 21 రాళ్ళు (పెద్ద శనగ గింజంత) తీసుకొని ముందు చిన్న జమరపై ఒక్కొక్కటేసి ఏడు రాళ్ళు విసరాలి. ప్రతి రాయితో అల్లాహు అక్బర్ అనాలి. ప్రతి రాయి చిన్న జమర చుట్టున్న హౌజులో పడునట్లు విసిరే ప్రయత్నం చేయాలి. పిదప ఆ జమరకు కొంచం కుడి వైపున జరిగి నిలబడి దీర్ఘంగా దుఆ చేయుట సున్నత్.
2- మధ్యలో నున్న జమర వద్దకు వెళ్ళి ఒక్కొ క్కటేసి ఏడు రాళ్ళు దానిపై విసరాలి. ప్రతి రాయిపై అల్లాహు అక్బర్ అనాలి. దానికి కొంచెం ఎడమ వైపుకు జరిగి దీర్ఘంగా దుఆ చేయాలి.
3- ఆ తరువాత పెద్ద జమర వద్దకు వెళ్ళి ఏడు రాళ్ళు ఒక్కొక్కటేసి విసరాలి. ప్రతి రాయితో అల్లాహు అక్బర్ అనాలి. ఇక అక్కడ ఆగకుండా వెళ్ళిపోవాలి.
పన్నెండవ రోజు
1- ఈ రోజు పదకుండవ రోజు చేసిన తీరు చేయాలి. హాజి 13వ రోజు ఉండాలనుకుంటే చాలా మంచిది. ఆ రోజు 11 మరియు 12వ రోజు చేసినట్లే చేయాలి.
2- 12వ రోజు (మరియు 13వ రోజు ఉన్న వారు ఆ రోజు) రాళ్ళు విసిరిన తరువాత కాబా వద్దకు వెళ్ళి తవాఫె విదాఅ చెయ్యాలి. తర్వాత మఖామె ఇబ్రాహీం వెనక, అక్కడ సాధ్యపడకుంటే ఎక్కడైనా రెండు రకాతులు చెయ్యాలి. బహిష్టు మరియు బాలంత స్త్రీలు ఈ తవాఫ్ చేయకుండా తిరిగి తమ దేశానికి వెళ్ళినా పాపమేమి లేదు.
ఎవరైనా పదవ తారీకున చేయవలసిన తవాఫె ఇఫాజ అప్పుడు చేయకుండా ఇప్పుడు చేసినా ఫరవా లేదు, యోగ్యమే. అదే ఈ తవాఫె విదాఅ కు బదులుగా సరిపోతుంది. అంటే తమ దేశానికి తిరిగి వెళ్ళే ముందు చేసే తవాఫె విదాఅ కు బదులుగా ఈ తవాఫె ఇఫాజ సరిపోతుంది. అయితే ఇలా చేసేవారు తవాఫె విదాఅ సంకల్పం తో కాకుండా, తవాఫె ఇఫాజ సంకల్పం చేసుకోవాలి.
3- ఆ తరువాత హాజి ఆలస్యం చేయకుండా తన సమయాన్ని జిక్ర్, దుఆ మరియు తనకు లాభం చేకూర్చే విషయాల్లో గడుపుతూ మక్కా నుండి వెళ్ళిపోవాలి. అయితే ఎవరైనా ఏదైనా అవసరంగా, ఉదాః తన మిత్రుని కొరకు వేచిస్తూ, లేదా తనకు దారిలో అవసరముండే సామానుల కొనుగోళు వగైరాలకై కొంత సమయం మాత్రమే ఆగుతే పాపం లేదు. కాని దూర దేశాల నుండి వచ్చినవారు హజ్ తరువాత మక్కాలో కొద్ది రోజుల నివాసం చేస్తే వారు మక్కాను వదలి వెళ్ళిపోయే రోజున తవాఫె విదాఅ చేయాలి.
హజ్ యొక్క రుకున్ లు
1- ఇహ్రామ్.
2- అరఫాత్ లో నిలవడం.
3- తవాఫె హజ్.
4- సఫా మర్వా మధ్యలో సఈ.
పై నాలిగిట్లో ఏ ఒక్క రుకున్ వదలినా, తిరిగి దానిని చేయని వరకు హజ్ నెరవేరదు.
హజ్ యొక్క వాజిబులు
1- మీఖాత్ నుండి ఇహ్రాం చేయడం.
2- పగలు వచ్చినవారు సూర్యాస్తమయం వరకు అరఫాత్ లో నిలవడం.
3- ముజ్ దలిఫాలో ఫజ్ర్ తరువాత ప్రకాశ మాన వరకు రాత్రి గడపడం. అయితే వృద్ధు లు, స్త్రీలు అర్థ రాత్రి వరకు ఉండి తరలిపోతే పాపం లేదు.
4- 11, 12, (13) రాత్రులు మినాలో గడపడం.
5- పై మూడు రోజుల్లో రాళ్ళు విసరడం.
6- క్షౌరం చేయించుకోవడం.
7- తవాఫె విదాఅ.
పై ఏడిట్లో ఏ ఒక్క వాజిబ్ వదలినా అతనిపై ‘దమ్’ విధిగా అవుతుంది. అంటే ఒక మేక లేదా ఆవు మరియు ఒంటెలో ఏడవ వంతు బలి ఇచ్చి హరంలోని బీదవారికి దానం చేయాలి.
మస్జిదె నబవి దర్శనం
నమాజ్ చేసే ఉద్దేశ్యంతో మస్జిదె నబవి దర్శనం పుణ్యకార్యం. సహీ హదీసు ప్రకారం అందులో చేసే ఒక నమాజ్ పుణ్యం ఇతర మస్జిదులలో చేసే వెయ్యి నమాజుల కన్నా అతిఉత్తమం. మస్జిదె హరాం మక్కా తప్ప. (అందులో ఒక నమాజు పుణ్యం మస్జిదె నబవిలోని వంద నమాజులకు, ఇతర మస్జిదుల్లోని లక్ష నమాజుల కంటే ఉత్తమం). మస్జిదె నబవి దర్శనం సంవత్నరమెల్లా ఎప్పుడు చేసినా పుణ్యమే. దానికొక ప్రత్యేక సమయమేమి లేదు. అది హజ్ లో ఒక భాగం కూడా ఎంత మాత్రం కాదు. మస్జిదె నబవీలో ఉన్నంత సేపట్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారి ఉత్తమ సహచరులైన అబూ బక్ర్, ఉమర్ రజియల్లాహు అన్హుమాల సమాధుల దర్శనం చేయడం పుణ్యకార్యం. సమాధుల దర్శనం ప్రత్యేకంగా పురుషులకు మాత్రమే, స్త్రీలకు లేదు. మస్జిదె నబవి యొక్క ఏ వస్తువును కూడా ముట్టుకొని శరీరానికి తుడుచుకొనుట, బర్కత్ (శుభం)గా భావించుట, సమాధి యొక్క తవాఫ్ చేయుట, దుఆ సమయాన దాని వైపు ముఖము చేయుట లాంటి పనులు ధర్మానికి విరుద్ధమైనవి గనక యోగ్యం లేవు.
అల్లాహ్ మీ హజ్ మరియు సర్వ సత్కార్యాలు స్వీకరించి, రెట్టింపు పుణ్యాలు ప్రసాదించుగాక!
—
ఉమ్రా విధానం
ప్రతీ ముస్లిం స్త్రీ పురుషునిపై జీవితంలో ఒకసారి ఉమ్రా చేయుట విధిగా ఉంది. అల్లాహ్ ఆదేశం సూర బఖర (2:196)లో ఇలా ఉంది:
అల్లాహ్ కొరకు హజ్, ఉమ్రా పూర్తి చేయండి.
అది సర్వ సత్కార్యాల్లో అతి ఉత్తమమైనది గనక శక్తిగల ముస్లిం మరే మరీ చేస్తూ ఉండుట పుణ్య కార్యం. ‘ముఅతమిర్’ (ఉమ్రా చేయు వ్యక్తి) ఉమ్రా విధుల్లో అన్నిటికి ముందు ఇహ్రామ్ చేయాలి.
ఇహ్రామ్:
అంటే ఉమ్రా ఆరాధనలోకి ప్రవేశం. ముహ్రిమ్ (ఇహ్రామ్ స్థితిలో ఉన్న వ్యక్తి)పై ఇహ్రామ్ కు ముందు యోగ్యమున్న కొన్ని విషయాలు నిషిద్ధమగును. ఎందుకనగా అతడు ఒక ఆరాధన లో ప్రవేశించాడు. ఉమ్రా చేయాలనుకున్న ప్రతి వ్యక్తిపై ‘ఇహ్రామ్’ విధిగా ఉంది. ముఅతమిర్ మక్కా వెలుపలి నుండి వచ్చే వారయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నియమించిన మీఖాతుల్లో ఏ ఒక మీఖాతు నుండైనా ఇహ్రామ్ చెయ్యాలి. ఆ మీఖాతులు ఇవి:
1- ‘జుల్ హులైఫ’: అది మదీనకు సమీపం లో ఒక చిన్న పల్లెటూరు. ఇప్పుడు దాని పేరు ‘అబ్ యారె అలీ’. అది మదీనవాసుల మీఖాతు.
2- ‘అల్ జుహ్ ఫ’: అది రాబిగ్ సమీపంలో ఒక పల్లెటూరు. ఈ రోజుల్లో రాబిగ్ నుంచే ఇహ్రామ్ చేస్తున్నారు. అది సిరీయా వారి మీఖాతు.
3- ‘అస్సైలుల్ కబీర్’: తాయిఫ్ కు సమీపం లో ఒక ప్రాంతం. అది నజ్ద్ వారి మీఖాతు.
4- ‘యలమ్ లమ్’: ఇది యమన్ వారి మీఖాతు.
5- ‘జాతు ఇర్ఖ్’: ఇది ఇరాఖ్ వారి మీఖాత్.
పై మీఖాతులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నియమించారు. అవి మేము తెలిపిన వారి ప్రాంత నివాసుల మరియు వారి తప్ప ఎవరైతే హజ్ లేక ఉమ్రా చేయుటకు వాటి నుండి దాటుతారో వారికి కూడాను. ఇక మక్కా నివాసులు మరియు ‘అహ్లుల్ హిల్ల్’ (మక్కా నగరానికి వెలుపల మరియు మీఖాతు లోపల నివసించువారు) తమ ఇంటి నుండి ఇహ్రామ్ చేయాలి.
ఇహ్రామ్ ధర్మములు
ఇహ్రామ్ కు ముందు చేయవలసిన ధర్మములు:
1- గోర్లు, చంకల మరియు నాభి క్రింది వెంట్రుకలు తీయాలి. మీసాలు కత్తిరించాలి. స్నానం చేసి, సువాసన శరీరానికి పూసుకోవాలి. ఇహ్రామ్ దుస్తులకు పూసుకోవద్దు.
2- కుట్టిన బట్టలు తీసి, ఒక పంచి కట్టుకొని, ఒక దుప్పటి వేసుకోవాలి. స్త్రీ తనకిష్టమైన బట్టలు ధరించవచ్చును. అయితే పూర్తి పర్ద చేయాలి. అలంకరణ ప్రదర్శించకుండా ఉండాలి. పరపురు- షులు ఎదురయ్యే సమయాన ముఖము, అరచేతుల పర్ద కూడా చేయుటకు ప్రయత్నిం- చాలి. చేతుల్లో గ్లౌసులు, ముఖముపై నఖాబ్ వేసుకోకూడదు.
3- మస్జిద్ కు వెళ్ళి నమాజ్ సమయమయితే జమాఅతుతో నమాజు చేసుకోవాలి. లేనిచో రెండు రకాతులు ‘తహియ్యతుల్ వుజూ’ చేసుకోవచ్చు. ఆ తరువాత ఇహ్రామ్ చేయాలి.
విమానంలో ప్రయాణించువారు మీఖాత్ కు సమాన ప్రాంతం వద్దనే ఇహ్రామ్ చేయాలి. మీఖాత్ ఏర్పాటు కష్టంగా ఉంటే దానికి కొంచెం ముందు కూడా చేయవచ్చును. ఇక మీఖాత్ వద్ద చేసే పనులు; గోళ్ళు తీయడం, స్నానం చేసి, శరీరానికి సువాసన పూసుకోవడం మరియు ఇహ్రామ్ దుస్తులు ధరించడం లాంటివన్నీ విమానంలో లేదా అందులో పయనమయ్యే ముందు పూర్తి చేసుకోవాలి. మీఖాత్ వద్ద లేదా దానికి కొంచెం ముందు చేరుకున్నప్పుడు ఇహ్రాం సంకంల్పం చేయాలి.
ఇహ్రమ్ నుండి మొదలుకొని కాబా ప్రదక్షిణం ప్రారంభించే వరకు “తల్ బియ” చదువుతూ ఉండాలి: లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హంద వన్నిఅమత లక వల్ ముల్క, లా షరీక లక.
ఇహ్రామ్ స్థితిలో ఉన్న వ్యక్తిపై ఇహ్రామ్ కు ముందు యోగ్యమున్న కొన్ని విషయాలు నిషిద్ధం అగును. ఎందుకనగా అతడు ఒక ఆరాధనలో ప్రవేశించాడు. అతనిపై క్రింది విషయాలు నిషిద్ధం:
1- తల వెంట్రుకలు మరియు శరీర వెంట్రుకలు తీయడం నిషిద్ధం. కాని అవసరమున్నప్పుడు మెల్లగా తల గోకుట నేరం కాదు.
2- గోళ్ళు తీయుట నిషిద్ధం. కాని గోరు విరిగినా, నొప్పి ఉన్నా దానిని తీయుట పాపం కాదు.
3- సుగంధం మరియు సువాసన సబ్బుల ఉపయోగం నిషిద్ధం.
4- సంభోగం మరియు దానికి సంబంధించిన విషయాలు నిషిద్ధం. ఉదా: పెళ్ళి చేసుకొనుట, చేయించుట, భార్యభర్తల సరసాలడడం వగైరా.
5- చేతులలో గ్లౌసులు వేసుకొనుట నిషిద్ధం.
6- వేటాడుట నిషిద్ధం.
పై ఆరు విషయాలు స్త్రీ పురుషులందరిపై నిషిద్ధం. ఇక ప్రత్యేకంగా పురుషులపై నిషిద్ధం ఉన్న విషయాలు దిగువ తెలుపబడుతున్నవి.
1- కుట్టిన బట్టలు ధరించడం నిషిద్ధం. కాని అవసరముంటే బెల్ట్, గడియారం మరియు కళ్ళ జోళ్ళు ఉపయోగించవచ్చును.
2- తలకు అంటుకొని ఉండే ఏదైనా వస్తువు ఉప- యోగించడం నిషిద్ధం. కాని అంటుకొని ఉండని గొడుగు, వాహణము మరియు గుడారాలు లాంటివి ఉపయోగించడం యోగ్యం.
3- మేజోళ్ళు తొడుగుట నిషిద్ధం. కాని సైండిల్ మరియు చెప్పులు లేనప్పుడు మడమలు కనబడే బూట్లు ఉపయోగించ వచ్చును.
పై నిషిద్ధ కార్యాలు చేసినవాని 3 స్థితులు:
1- అకారణంగా చేసిన వ్యక్తి పాపాత్ముడగును. ఇంకా అతనిపై ‘ఫిద్య’ (ప్రాయశ్చితం) కూడా విధియగును.
2- ఏదైనా అవసరం ఉండి చేసిన వ్యక్తి పాపాత్ముడు కాడు. కాని ప్రాయశ్చితం చెల్లించాలి.
3- ఏదో కారణంగా -ఉదా: తెలియక, మరచి- పోయి, లేదా ఒకరి ఒత్తిడితో నిస్సహాయుడై- చేసిన వ్యక్తి పాపాత్ముడూ కాడు, అతనిపై ప్రాయశ్చితమూ లేదు.
తవాఫ్
ఇతర మస్జిదుల మాదిరిగా మస్జిదె హరాంలో కూడా కుడి కాలుతో ప్రవేశిస్తూ ఈ దుఆ చదవడం ధర్మం. బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అల్లాహుమ్మగ్ ఫిర్లీ జునూబి వఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక.
بِسْمِ الله وَالصَّلاَةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ الله اللَّهُمَّ اغْفِرْلِي ذُنُوبِي وَافْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ
కాబా తవాఫ్ చేయుటకు దానివైపున వెళ్ళాలి.
తవాఫ్: అంటే అల్లాహ్ యొక్క ఇబాదత్ ఉద్దేశ్యంతో కాబా చుట్టున ఏడు సార్లు ప్రదక్షిణం చేయుట. అది హజ్రె అస్వద్ నుండి ప్రారంభించి అక్కడే ముగించాలి. మొదటి మూడిట్లో దగ్గర దగ్గర అడుగులు వేసి పరుగెత్తుట ధర్మం. కాని ఎవరికీ ఇబ్బంది కలగించకూడదు. దీనినే ‘రమ్ల్’ అంటారు. పైన కప్పుకున్న దుప్పటిని కుడి భుజము క్రింది నుండి తీసుకొని ఎడమ భుజముపై వేసుకోవాలి. అంటే కుడి భుజము పైన బట్ట ఉండకూడదు. దీనిని ‘ఇజ్తిబాఅ’ అంటారు. ఇవి రెండు (రమ్ల్, ఇజ్తిబాఅ) ఉమ్రా లేక హజ్ ఉద్దేశ్యంతో మక్కా వచ్చి చేసే తొలి తవాఫ్ లో మాత్రమే చేయాలి. కాబా ఎడమ వైపు ఉండాలి. తవాఫ్ వుజూ స్థితిలో చేయుట తప్పనిసరి. ఇక తవాఫ్ ఈ విధంగా చేయాలి:
1- హజ్రె అస్వద్ వద్దకు వెళ్ళి కుడి చేయితో దానిని ముట్టుకొని బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. వీలవుతే దాన్ని చుంబించాలి. చుంబించడం వీలు కాకుంటే దాన్ని చెయ్యితో ముట్టుకొని చెయ్యిని చుంబించాలి. చెయ్యితో ముట్టుకొనుట కూడా సాధ్యపడకుంటే దాని సూటిగా నిలబడి దాని వైపు చెయ్యితో సైగ చేస్తూ బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. కాని చెయ్యిని చుంబించ- కూడదు. ఇక తవాఫ్ ప్రారంభించాలి. ఇష్టానుసా రం, తన భాషలో తన కొరకు, తను కోరినవారి కొరకు దుఆ చేస్తూ లేదా ఖుర్ఆన్ పారయణం చేస్తూ ఉండాలి. ఇచ్చట ప్రత్యేకంగా ఏ దుఆ లేదు.
2- రుక్నె యమాని వద్ద చేరుకున్నాక వీలవుతే దాన్ని ముట్టుకుంటూ అల్లాహు అక్బర్ అనాలి. కాని చెయ్యిని చుంబించకూడదు. వీలు కాకుంటే (తవాఫ్ చేస్తూ ఉండాలి). చెయ్యితో సైగ చేయకూడదు. అల్లాహు అక్బర్ అనకూడదు. ఈ రుక్నె యమాని మరియు హజ్రె అస్వద్ మధ్య ఈ దుఆ చదవాలి: రబ్బనా ఆతినా ఫిద్దున్ యా హసనతౌఁ వఫిల్ ఆఖిరతి హసనతౌఁ వఖినా అజాబన్నార్.
3- హజ్రె అస్వద్ వద్ద చేరుకొని దాన్ని చెయ్యితో ముట్టుకుంటూ, వీలు కాకుంటే దాని వైపు చెయ్యితో సైగ చేస్తూ అల్లాహు అక్బర్ అనాలి.
ఈ విధంగా ఏడు ప్రదక్షిణాల్లో ఒకటి పూర్తయింది.
4- మిగితవి మొదటి దాని లాగే చేస్తూ, హజ్రె అస్వద్ చేరుకున్నప్పుడల్లా మరియు ఏడవది పూర్త-యిన తరువాత కూడా అల్లాహు అక్బర్ అనాలి.
తవాఫ్ తరువాత
తవాఫ్ తరువాత మఖామె ఇబ్రాహీం వెనక – అనగా అది తనకు మరియు కాబాకు మధ్యలో ఉన్నట్లుగా- నిలబడి రెండు రకాతుల నమాజు చేయుట ధర్మం. నమాజు చేస్తున్నప్పుడు దుప్పటి రెండు భుజాలపై ఉండుట తప్పనిసరి. ఏ ఒక్క భుజము నగ్నంగా ఉండకుడదు. మొదటి రకాతులో సూరె ఫాతిహా తరువాత ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ రెండవ రకాతులో సూరె ఫాతిహా తరువాత ఖుల్ హువల్లాహు అహద్ చదవాలి. జనసమ్మర్థంలో దాని వెనక నమాజ్ చేయుట సాధ్యపడకుంటే మస్జిదె హరాంలో ఏక్కడైనా చేయవచ్చును.
సఈ
ఇక ‘మస్అ’ (సఫా, మర్వాల మధ్యలో ‘సఈ’ చేసే స్థలం) వైపుకు వెళ్ళి సఫా దగ్గరికి చేరుకుంటూ “ఇన్నస్సఫా వల్ మర్వత మిన్ షఆఇరిల్లాహ్” చదివాలి. సఫా కొండపై ఎక్కి కాబా దిశలో నిలబడి చేతులు ఎత్తి అల్లాహ్ స్తోత్రము పఠించి, ఈ దుఆ మూడు సార్లు చదవాలి. దాని మధ్యలో రెండు సార్లు తనిష్టానుసారం దుఆ చేసుకోవాలిః లాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లాషరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు యుహ్ యీ వ యుమీతు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ అంజజ వఅదహూ వనసర అబ్దహూ వహజమల్ అహ్ జాబ వహ్దహూ.
ఆ తరువాత సఫా నుండి దిగి మర్వా వైపు నడవాలి. పచ్చరంగు స్తంభం వద్దకు చేరినప్పుడు శక్తి ప్రకారం పరుగుతీయడం ధర్మం. ఇలా రెండవ పచ్చరంగు స్తంభం వరకు. ఇతరులకు బాధ కలిగించకూడదన్న షరతును మరవవద్దు. ఈ పరుగు పురుషులకే ప్రత్యేకం. స్త్రీలకు దీని అనుమతి లేదు. మర్వా చేరుకొని దానిపై ఎక్కి ఖిబ్లా దిశలో నిలబడి చేతులు ఎత్తి సఫాపై చేసినటువంటి దుఆ చెయ్యాలి. అయితే మన భాషలో మనకిష్టమున్న దుఆ కూడా చేసు కోవాలి. ఇక్కడికి ఏడిట్లో ఒకటి పూర్తయింది. మిగిత ఆరు ఇలాగే పూర్తి చేయాలి. ప్రతీ సారి సఫా మరియు మర్వాల వద్ద దుఆ చేయాలి. పచ్చ రంగు స్తంభాల మధ్య పరుగుతీయాలి. సఈ మధ్యలో దుఆ ఎక్కువగా చేయాలి. ఏడిట్లో ప్రతీ ఒక దానికొక వేరు దుఆ అంటూ ప్రవక్తతో రుజువు లేదు. (సఫా నుండి మర్వా వరకు ఒకటి. మర్వా నుండి సఫా వరకు రెండు పరుగులగును. ఇలా మొదటి పరుగు సఫా నుండి మొదలై ఏడవ పరుగు మర్వాపై ముగియును).
సఈ తురవాత శిరోముండనం చేయించు- కోవాలి. ఇందులో ఎక్కువ పుణ్యం ఉంది. కటింగ్ కూడా చేయించుకోవచ్చు. ఇక ఇహ్రామ్ దుస్తులు తీసి ఉమ్రా ముగించాలి. ఇహ్రామ్ కు సంబంధిం- చిన నిషిద్ధతలు ఇక ముగించాయి.
అర్కానె ఉమ్రా
1- ఇహ్రామ్.
2- తవాఫ్.
3- సఈ.
ఇందులో ఏ ఒక్క రుకున్ వదలినా తిరిగి అది చేయనంత వరకు ఉమ్రా నెరవేరదు.
వాజిబాతె ఉమ్రా
1- మీఖాత్ నుండి ఇహ్రామ్ చేయుట.
2- శిరోముండనం.
వీటిలో ఏ ఒక్కటి వదలినా అతనిపై దమ్ విధి అవుతుంది. అంటే ఒక మేక జిబహ్ చేసి లేదా ఒంటె మరియు ఆవులోని ఏడిట్లో ఒక భాగం హరమ్ లో ఉండే బీదవాళ్ళకు దానం చేయాలి.
అల్లాహ్ మనందరికి ప్రవక్త చూపిన పద్ధతిలో ప్రతి ఆరాధన చేసే భాగ్యం ప్రసాదించుగాక! ఆమీన్
25.34980855.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
అరబ్బుల్లో బహుదైవారాధనే ఒక ప్రసిద్ధిచెందిన ధర్మంగా ఉండింది. సత్య ధర్మానికి వ్యెతిరేకంగా ఉన్న ఈ బహుదైవారాధన (షిర్క్)ను వారు పాటించినందువలన వారి ఆ కాలమును “అజ్ఞానకాలం” అనబడింది. అల్లాహ్ ను గాక, వారు పూజించే దేవతల్లో ప్రసిద్ధి చెందినవిః ‘లాత్’, ‘ఉజ్జా’, ‘మనాత్’, మరియు ‘హుబుల్’. అరబ్బుల మధ్య యూదమతాన్ని, క్రైస్తవ మతాన్ని అవలంబించినవారు మరియు పార్శీలు కూడా ఉండిరి. వారందరి మధ్య కొందరు ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ‘దీనె హనీఫ్’ (బహుదైవారాధనకు అతీతంగా సవ్యమైన ధర్మం)పై స్థిరంగా ఉన్నవారు కూడా ఉండిరి.
ఇక వారి ఆర్థిక జీవతం అంటేః ఎడారివాసుల (అనాగరికుల) పూర్తి ఆధారం పశు సంపద, వాటిని మేపుటయే ఉండింది. నాగరికతలో ఉన్నవారి ఆధారం వ్యవసాయం, వ్యాపారంపై ఉండింది. ఇస్లాం ధర్మ జ్యోతి ప్రకాశించేకి కొంచం ముందు ‘మక్కా’ అరబ్ ద్వీపంలో ఒక పెద్ద వ్యాపార కేద్రంగా పేరుగాంచింది. మదీనా, తాయిఫ్ మరియు ఇతర కొన్ని ప్రాంతాల్లో కూడా నాగరికత ఉండినది.
సామాజిక వ్యవస్థః అన్యాయం విపరీతంగా వ్యాపించి యుండింది. బలహీనులకు ఎలాంటి హక్కు లేకపోవడం, ఆడ బిడ్డలను సజీవ సమాధి చేయడం, మానభంగాలకు పాల్పడడం, బలహీనుల హక్కు బలవంతుడు కాజేయడం, హద్దు లేకుండా భార్యలనుంచుకోవడం, వ్యభిచారం సర్వ సామాన్యమైయుండినది. తుచ్ఛమైన కారణాలపై సంవత్సరాల తరబడి తెగల్లో అంతర్ యుద్ధం జరిగేది. ఒకప్పుడు ఒక తెగకు సంబంధించిన సంతానంలో కూడా ఈ యుద్ధాలు జరిగేవి.
ఇది ఇస్లాంకు ముందు అరబ్ ద్వీపం యొక్క సంక్షిప్త స్వరూపం.
అబ్దుల్ ముత్తలిబ్ -ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తాత- అధిక ధన, సంతానం గలవారని ఖురైష్ అతన్ని చాలా గౌరవించేవారు. ‘అల్లాహ్ పది మగ సంతానం ప్రసాదిస్తే అందులో ఒకరిని దేవతలకు బలిస్తాన’ని అతను మ్రొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. పది మంది మగ సంతానం కలిగారు. అందులో ఒకరు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తండ్రి అబ్దుల్లాహ్. అబ్దుల్ ముత్తలిబ్ తన మ్రొక్కుబడిని పూర్తి చేయదలుచుకున్నపుడు, ఖురైష్ అతని ముందుకు వచ్చి ఇది ప్రజలలో ఒక ఆచారముగా అయిపోతుందన్న భయంతో అతనికి అడ్డుపడి, పది ఒంటెల మరియు అబ్దుల్లాహ్ మధ్య చీటి (పాచిక) వేసి పది ఒంటెలను అబ్దుల్లాహ్ కు బదులుగా బలిదానమివ్వాలి, ఒక వేళ చీటి అబ్దుల్లాహ్ పేరున వస్తే, మళ్ళీ పది ఒంటెలను పెంచాలని ఏకీభవించారు. ఈ విధంగా చీటి వేశారు. కాని ప్రతి సారి అబ్దుల్లాహ పేరే వచ్చేది. పదవసారి అనగ వంద ఒంటెలు ఒకవైపు అబ్దుల్లాహ్ ఒక వైపు ఉండగా ఒంటెల పేరున చీటి వెళ్ళింది. అప్పుడు అబ్దుల్ ముత్తలిబ్ ఒంటెలను బలి ఇచ్చాడు. అబ్దుల్ ముత్తలిబ్ కు మొదటి నుండి ఇతర సంతానముకన్నా అబ్దుల్లాహ్ యే హృదయానికి అతి చేరువుగా ఉండే. అతన్ని చాలా ప్రేమగా చూసుకునేవారు. ప్రత్యేకంగా ఈ బలిదానము యొక్క సంఘటన తర్వాత. అతను పెరిగి, పెండ్లీడుకు చేరిన తర్వాత అతని తండ్రి జుహ్రా కుటుంబానికి చెందిన ఆమిన బిన్తె వహబ్ తో అతని వివాహం చేశాడు. అబ్దుల్లాహ్ వైవాహిక జీవితం గడుపుతూ ఆమిన మూడు నెలల గర్భములో ముహమ్మదును మోస్తుండగా ఒకసారి వ్యాపార బృందముతో సీరియా దేశం వైపు వెళ్ళాడు. తిరిగి వస్తుండగా దారిలోనే ఒక వ్యాదికి గురై మదీనలో నజ్జార్ వంశానికి చెందిన తన మేన మామల వద్ద ఆగిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడే మరణించాడు. అంతిమ క్రియలు అక్కడే జరిగాయి.
ఇటు ఆమిన నెలలు నిండినవి, సోమవారం రోజున ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మించారు. కాని నిర్ణీత తారీకు మరియు నెల ప్రస్తావన రాలేదు. రబీఉల్ అవ్వల్ మాసం తొమ్మిదవ తారీకు అని చెప్పబడింది. అదే నెల 12 అనీ ఉంది. అలాగే రమజాను నెల అని కూడా అనబడింది. తదితర అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కాని అది క్రీ.శ. ప్రకారం 571 సంవత్సరం అన్నది నిజం. అదే సంవత్సరాన్ని ఆముల్ ఫీల్ (ఏనుగుల సంవత్సరం) అని అంటారు.
[1]అనగా ఇస్మాఈల్ అలైహిస్సలాంను వారి తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ ఆజ్ఞతో జిబహ్ చేయబోయాడు. అబ్దుల్ ముత్తలిబ్ తన మ్రొక్కుబడిని పూర్తి చేయుటకు అబ్దుల్లాహ్ ను జిబహ్ చేయబోయాడు. అబ్దుల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తండ్రి అయితే ఇస్మాఈల్ అలైహిస్సలాం తాత ముత్తాతల్లో వస్తారు. ఈ విధంగా ఆయన బలికెక్కిన ఇద్దరి వ్యక్తుల కుమారుడు అని భావం.
సంక్షిప్తంగా ఏనుగుల సంఘటన ఏమిటంటేః యమన్ లో నజ్జాషి అను రాజు యొక్క ప్రతినిధి అబ్రహా హబ్షీ ఉండేవాడు. అరబ్బులందరూ మక్కా నగరంలో ఉన్న పవిత్ర కాబా గృహాన్ని గౌరవిస్తూ, దూర ప్రాంతాల నుండి దాని దర్శనానికి వస్తూ, హజ్ చేస్తున్నది చూసిన అబ్రహా, యమన్ దేశపు రాజధాని ‘సనఆ’ లో ఒక పెద్ద చర్చి నిర్మించాడు. హజ్ కొరకు వచ్చే అరబ్బులందరూ కాబాకు బదులుగా దీని దర్శనానికి రావాలని కోరాడు. అది విన్న బనీ కినాన (అరబ్ వంశాల్లోని ఒక వంశం)లోని ఒక వ్యక్తి రాత్రి సమయంలో అందులో ప్రవేశించి ఆ చర్చి గోడలకు మలినము పూసాడు. ఈ విషయం తెలిసిన అబ్రహా ఆగ్రహముతో మక్కా నగరములోని కాబా గృహాన్ని ధ్వసం చేయాలని పూనుకొని అరవై వేల సైన్యంతో వెళ్ళాడు. సైన్యంలో తన వెంట తొమ్మిది ఏనుగులను తీసుకొని, తాను అన్నిట్లో పెద్ద ఏనుగుపై పయనమయి మక్కా సమీపానికి చేరుకున్నాడు. అక్కడ సైన్యాన్ని సరిచేసుకొని మక్కాలో ప్రవేశించాలన్న ఉద్దేశంతో సిద్ధమయ్యాడు. కాని తను అధిరోహించిన ఏనుగు కాబా వైపునకు ఒక్క అడుగు వేయడానికి సిద్ధం లేనట్లు కూర్చుండి పోయింది. కాబా దిశకు గాకుండా వేరే దిశలో లేపినప్పడు లేచి పరుగెత్తేది. కాని కాబా దిశకు మార్చితే కూర్చుండి పోయేది. వారు ఈ ప్రయత్నాల్లో ఉండగా అల్లాహ్ వారిపై పక్షుల్ని గుంపులు గుంపులుగా పంపాడు. అవి వారిపై గులకరాళ్ళను విసిరాయి. అల్లాహ్ చివరికి వారిని పశువులు తినవేసిన పొట్టు మాదిరిగా చేశాడు. అది ఎలా అంటేః ప్రతి పక్షి వద్ద చణక గింజంత మూడు రాళ్ళుండేవి. ఒకటి వారి చుంచువులో, రెండు వారి కాళ్ళల్లో. అవి ఎవరిపై పడిన వారి అవయవాలు ముక్కలు ముక్కలయి దారి గుండా పడుతూ చివరికి సర్వనాశనమయ్యే- వారు. అల్లాహ్ అబ్రహాపై ఒక వ్యాదిని పంపాడు. దాని కారణంగా అతని వ్రేళ్ళు ఊడిపోయాయి. అతడు సనఆలో చేరుకునే సరికి ఆ రోగం ముదిరిపోయి, తన తడాక చూపింది. అక్కడే వాడు చనిపోయాడు.
ఇటు ఖురైషుల విషయం: అబ్రహ వస్తున్న విషయం విని, వారు భయపడి కొండల్లో, కొనల్లో పరుగెత్తుకు పోయారు. ఆ సైన్యంపై విరుచుకు పడ్డ ఆపదను చూసి అందరూ తృప్తి, శాంతితో తమ తమ ఇండ్లల్లోకి తిరిగి వచ్చేశారు. ఈ సంఘటన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మకు 50 రోజుల ముందు జరిగినది. (అందుకే ఈ సంవత్సరానికి ఆముల్ ఫీల్ అన్న పేరు వచ్చింది).
ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మించిన తరువాత, ఆయన పిన తండ్రి అయిన అబూ లహబ్ యొక్క బానిస సువైబ అను ఆమె ఆయనకు పాలు పట్టింది. ఆమె అంతకు ముందు హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ కు కూడా పాలు పట్టింది. (ఇతను ప్రవక్త పెత్తండ్రి). ఈ విధంగా హంజా ప్రవక్త పాల సంబంధ సోదరుడయ్యాడు.
అరబ్బుల అలవాటేమనగా వారు తమ పసిపిల్లలకు గ్రామీణ వాతవర ణములో ఉంచి అక్కడ పాలు పట్టించేవారు. ఎందుకనగా శారీరకంగా, ఆరోగ్యంగా ఉండుటకు అచ్చట పూర్తి సహాయం లభించేది. ఇలా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరో దాయి వద్దకు చేరుకున్నారు. దాని వివరణ ఇలా ఉందిః ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మించిన రోజుల్లో మక్కాలో ఉన్న శిశువులను పాలు త్రాగించడానికి తీసుకెళ్ళే ఉద్దేశ్యంతో బనీ సఅద్ వారి ఒక బృందం వచ్చింది. ప్రతి స్త్రీ పసిపిల్లలున్న గృహాలను గాలించి, అట్లే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటికి వచ్చి అతను అనాధ, పేదవాడు అని తెలుసుకొని వెను దిరిగింది. అందరి వలే హలీమ సఅదియా కూడా ఆయన్ని స్వీకరించక తిరిగి పోయింది. కాని అనేక గృహాలను గాలించినప్పటికీ, తన వెంట తీసుకెళ్ళడానికి శ్రీమంతుల బాలున్ని పొందలేక పోయింది. ఆమె ఉద్దేశ ప్రకారం, శ్రీమంతుల బాలున్ని పొందుతే, ఆ బాలుని ఇంటివారు పాలు పట్టినందుకు ఇచ్చే పైకం ద్వారా వారి పస్తుల్లో గడుస్తున్న రోజులకు సమాప్తం ఉండవచ్చు, ప్రత్యేకంగా అనావృష్టి వల్ల దారిద్ర్య రేఖకు దిగజారిన వారి జీవితం బాగు పడవచ్చన్న ఆశ ఆమెది. వేరే ఏ మార్గం దొరక్క అదే అనాథ బాలున్ని, వారు ఇచ్చే చిన్న పాటి పారితోషికాన్ని స్వీకరించటానికి తిరిగి ఆమిన (ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తల్లి) ఇంటికి వచ్చింది. హలీమ తన భర్తతో మరీ నిదానంగా నడిచే (పరుగెత్తలేని), బక్కని గాడిద పై మక్కా వచ్చింది. కాని తిరుగు ప్రయాణంలో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను తన ఒడిలో తీసుకున్నాక, అదే గాడిద వేగంగా పరుగెత్తుతూ తోటి సవారీలను వెనుకేసి, తోటి ప్రయాణికులను కూడా ఆశ్చర్యంలో పడవేసింది. హలీమ ఉల్లేఖనం ప్రకారం, ఆమె వద్ద చాలా తక్కువ పాలుండేవి. ముందు నుండే ఆమె వద్ద ఉన్న స్వంత కొడుకు పాలు సరిపడక ఆకలితో ఎప్పుడూ ఏడ్చేవాడు. కాని ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమె పాలు త్రాగడం మొదలు పెట్టిన వెంటనే ఆమె స్తనాలు పాలతో నిండిపోయాయి. బనూ సఅద్ అనే తన ప్రాంతంలో ఉన్న భూములు వర్షము లేక మాడిపోతున్న వేళ, శుభ బాలునికి పాలు పట్టే భాగ్యం పొందాక, అక్కడి భూములు పండాయి. పశువులు అధికమయ్యాయి. వారి స్థితిగతులు కలిమి నుండి లేమి, కష్టము నుండి సుఖములుగా మారాయి.
చూస్తూ చూస్తూ హలీమ రక్షణలో రెండు సంవత్సరాలు గడిచాయి. ఇతరులలో కానరాని అసాధారణ అలవాట్లు ఈ సుపుత్రునిలో చూస్తున్నందు వలన మరియు దూరదృష్టి అతనిలో ఏదో ఒక గొప్ప విషయాన్ని సూచిస్తున్నందు వలన, హలీమాకు మరి కొన్ని రోజులు ఈ బాలున్ని పోషించాలన్న తపన కలిగింది. (రెండు సంవత్సరాల్లో తిరిగి ఆమినకు అప్పజెప్పాలన్న మాటపై) హలీమ ఈ బాలుడ్ని తీసుకొని, అతని తల్లి, తాత దగ్గరికి మక్కా వచ్చింది. కాని అతని మూలంగా ఆమె స్థితిగతుల్లో ఏ మార్పు వచ్చిందో, ఏ శుభం చూసిందో అందుకని మరో రెండేళ్ళు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను తన వద్దే ఉంచుకుంటానని ప్రాధేయపడితే, దానికి ఆమిన ఒప్పుకుంది. అదే అనాథశిశువుడు అయిన ముహమ్మదును మహా సంతోషం, మాహా భాగ్యంతో తీసుకొని హలీమా తమ బనీ సఅద్ ప్రాంతానికి తిరిగి వచ్చింది.
ముహమ్మద్ (ﷺ)కు సుమారు 4 సంవత్సరాల వయస్సు. ఒక రోజు గుడారానికి కొంత దూరాన తమ పాల సంబంధ తమ్ముడు అగు హలీమ సఅదియా కొడుకుతో ఆడుకుంటున్నాడు. హలీమ కొడుకు పరుగెత్తుకుంటూ తల్లి వద్దకు వచ్చాడు. అతని ముఖముపై భయాందోళన చిహ్నాలు స్ఫష్టంగా ఉన్నాయి. “అమ్మా! తొందర వచ్చేసెయి, అదిగో ఖురైషి తమ్మున్ని చూడు, అని అనసాగాడు. హలీమ ముహమ్మద్ (ﷺ) వైపు పరుగులు తీస్తూ అతని గురించి ప్రశ్నించింది. దానికి తన కొడుకు “నేను తెల్లని బట్టల్లో ఇద్దరు వ్యక్తుల్ని చూశాను. వారు ముహమ్మద్ ని మా మధ్య నుండి పక్కకు తీసుకెళ్ళి, పడుకోబెట్టి, అతని ఎద చీల్చి…. అని అంటుండగా హలీమ సంఘటన స్థలానికి చేరుకుంది. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కదల కుండా నిలబడి ఉన్నాడు. రంగు పేలిపోయి ఉంది. ముఖ కవళికల్లో మార్పు వచ్చింది. హలీమా వ్యాకులతతో జరిగిందేమిటని అడిగింది. “నేను క్షేమంగనే ఉన్నాను” అని ముహమ్మద్ ఇలా చెప్పాడుః “తెల్లని దుస్తుల్లో ఇద్దరు మనుషులు వచ్చి నన్ను తీసుకెళ్ళి నా ఎదను చీల్చి, అందులో నుండి గుండెను తీసి, దానిలో ఉన్న ఒక నల్లటి రక్తపు ముద్దను తీసి పారేసి, చల్లని జమ్ జమ్ నీటితో గుండెను కడిగి యధా విధిగా దాని స్థానంలో పెట్టేసి కుట్లువేసి సరిచేసి వెళ్ళిపోయారు. వారు ఇక కనబడలేదు. హలీమా ముహమ్మద్ (ﷺ)ను తీసుకొని తన గుడారంలో వచ్చింది. మరుసటి రోజు తెల్లవారుజామున -ముహమ్మద్ (ﷺ)ను వెంటబెట్టుకొని మక్కా వచ్చేసింది. సమయం కాని సమయంలో వచ్చిన హలీమాను చూసి ఆమిన ఆశ్చర్యానికి గురైంది. ఆమెనే స్వయంగా ఎంతో బతిమిలాడి తీసుకెళ్ళింది కదా. అయితే ఇలా హఠాత్తుగా రావడానికి కారణం ఏమిటని ఆమిన అడిగింది. హలీమా హృదయ పరిచ్ఛేద విషయాన్ని వివరంగా చెప్పింది.
ఒకరోజు ఆమిన తన అనాథ సుపుత్రుడిని తీసుకొని, బనూ నజ్జార్లోని ఆయన మేనమామలను సందర్శించడానికి మదీనకు పయనమయ్యింది. కొద్ది రోజులు అక్కడ ఉండి, తిరిగి వస్తుండగా ‘అబ్వా’ అనే ప్రాంతంలో అసువులు బాసింది. అక్కడే అంతిమ క్రియలు జరిగాయి. ఇలా ఆరు సంవత్సరాల వయసులో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తన కన్నతల్లికీ వీడ్కోలు పలికారు.
ఆయన పోషణ, సంరక్షణ భారం తాత అబ్దుల్ ముత్తలిబ్ పై పడింది. ప్రేమతో ఆయన్ని చూసుకున్నారు. కంటి పాపలా ఆయన్ని కాసారు. ముహమ్మద్ ఎనిమిదవ ఏటలో తాత కూడా పరమపదించారు. అయితే పోతూ పోతూ తన తనయుడైన అబూతాలిబ్ కు ముహమ్మద్ సంరక్షణ భారం అప్పజెప్పి పోయాడు. అబూ తాలిబ్ అధిక సంతానం, తక్కువ సంపాదన గలవారైనప్పటికీ ముహమ్మద్ పోషణ బాధ్యత స్వీకరించారు. అతను, అతని భార్యలిద్దరూ తమ స్వంత సంతానంలాగా ఆయన్ని చూసుకునేవారు. ముహమ్మద్ కు కూడా పినతండ్రి అంటే ఎనలేని ప్రేమ. ఈ వాతవరణంలో ఆయన పెరుగుదల యొక్క తొలి దశ/ మెట్టు మొదలయింది. నిజాయితీగా జీవించ గలిగారు. అందుకే సత్యత, విశ్వసనీయత ఆయనకు మారుపేరుగా నిలిచాయి. “అమీన్” (విశ్వసినీయుడు) వస్తున్నాడు లేదా “సాదిఖ్” (సత్యసంధుడు) వస్తున్నాడు అని అంటే అతను ముహమ్మదే అని అనుకునేవారు ప్రజలు.
యౌవనంలో అడుగుపెడుతూ, జీవిత వ్యవహారాల్లో, ఆర్థిక సంపాదనలో తన కాళ్ళపై నిలబడటానికి ప్రయత్నం మొదలు పెట్టారు. అందుకని కష్టపడడం, సంపాదించడం ఆరంభించారు. చిన్నపాటి పారితోషికానికి బదులుగా ఖురైషుల మేకలు మేపుటకై కాపరిగా పనిచేశారు.
(బాబాయి అబూ తాలిబ్ వర్తకులవడం చేత, అతని వెంట కొన్ని వర్తక పర్యటనలు చేసినందు వల్ల ఆయనకు వాణిజ్యంలో మంచి అనుభవం కలిగింది). అయితే మక్కాలో ఖదీజ బిన్తె ఖువైలిద్ అను ఓ శ్రీమంతురా- లుండేది. ఆమె విధవ కూడాను. ఒకసారి ఆమె తన వర్తక సామాగ్రి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అప్పజెప్పుతూ సీరియా దేశానికి వెళ్ళి వ్యాపారం చేయవలసిందిగా కోరింది. ఈ ప్రయాణంలో మైసర అను బానిస ఆమె వర్తక సామాగ్రికి బాధ్యుడుగా ఆయనతో ఉన్నాడు. ఆయనగారి శుభం, అయన విశ్వసనీయత వల్ల ఇంతకు ముందు ఎన్నడూ లేని అధిక లాభం వచ్చింది. ఖదీజా మైసరను ఈ ఎనలేని లాభాల గురించి అడిగింది. దానికి మైసర “ముహమ్మద్ సామా గ్రిని చూపించే, విక్రయించే బాధ్యత వహించారు. (ఆయన మాటా విధానాన్ని, నిజాయితీ, సచ్చీలతను చూసి) ప్రజలు మీ సామాగ్రిపై విరుచుకు పడేవారు. అందుకే ఏ అన్యాయం లేని ఇంతటి మహాలాభంతో తిరిగి వచ్చాము” అని సమాధానం చెబుతూ ఉంటే ఖదీజ పూర్తి శ్రద్ధగా అతని మాటలు వింటూ ఉండే. ఆమె ముందే కొన్ని విషయాలు ముహమ్మద్ గురించి విని యుండే. అందుకే ఈ మాటలు విని ఆమెకు మరింత అద్భుతమైన ఉత్సాహం కలిగింది. ఇంతటి సుగుణ సంపన్నునితో దాంపత్య జీవితం గడపాలన్న కోరిక ఆమెలో పుట్టింది. ఈ విషయం తెలిపి, ఆయన ఉద్దేశ్యమేంటో తెలుసు కోడానికి తన బంధువులైన ఒకామెను పంపింది. ఆయనకు ఖదీజ సందేశం అందింది, దానికాయన ఒప్పుకున్నారు. అప్పటికీ ఆయనకు పాతికేళ్ళు. పెద్దల సమక్షంలో పెళ్ళయింది. దాంపత్య జీవితంలో ఒకరికొకరు చాలా ఆనందం పొందారు. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖదీజ ధనానికి బాధ్యుడుగా ఉండి వ్యాపారం చేస్తూ, తమ సామర్థ్యాన్ని, దక్షతని నిరూపించుకున్నారు. కొద్ది సంవత్సరాల్లో ఖదీజా –రజియల్లాహు అన్హా-కు సంతానం కూడా కలిగింది. వారిలో జైనబ్, రుఖయ్య, ఉమ్ము కల్సూమ్ మరియు ఫాతిమా అను నలుగురు కూతుళ్ళు. ఖాసిమ్ మరియు అబ్దుల్లాహ్ అను ఇద్దరు కొడుకులు. అయితే కొడుకులిద్దరూ పసితనం లోనే చనిపోయారు. (ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మదీన జీవితంలో మారియా రజియల్లాహు అన్హాతో ఒక కుమారు డయ్యాడు. పేరు ఇబ్రాహీం. ఈ కొడుకు కూడా బాల్యంలోనే మరణించాడు).
జుబైదా వంశానికి చెందిన యమన్ దేశస్తుడు ఒకతను తన సామాగ్రితో మక్కా వచ్చాడు. మక్కాలోని పేరు ప్రఖ్యాతి గల ఆస్ బిన్ వాయిల్ అతని ఆ సామాగ్రిని కొన్నాడు. కాని అతనికి పైకం చెల్లించ లేదు. అతని నుండి తన హక్కు తీసుకొనుటకు జుబైదాకు చెందిన వ్యక్తి ఏ న్యాయశీలుడిని పొందలేక పోయాడు. అందుకు అతను ఓ కొండపై ఎక్కి తన బాధను వెలకక్కాడు. అప్పుడు మక్కాలోని కొన్ని తెగలు లేచి బాధితులకు వారి హక్కు లభించాలని ఏకీభవించారు. దానికి వారు ఓ ఒప్పందం చేసుకున్నారు. అదేమిటంటేః మక్కావాసి అయినా లేదా మక్కాలో వచ్చే ఏ వ్యక్తి అయినా అతనికి ఏదైనా అన్యాయం జరిగిందంటే మనమందరం బాధితునికి తోడుగా నిలబడి అతనికి తన హక్కు లభించే వరకు దౌర్జన్యపరులకు వ్యతిరేకంగా పోరాడాలి. ఖురైషువారు ఈ ఒప్పందాన్ని ‘హిల్ఫుల్ ఫుజూల్’ అని నామకరించారు. అయితే ముహమ్మద్ -సల్లల్లాహు అలైహి వసల్లం- అందులో పాల్గొన్నారు. అప్పుడు ఆయన వయస్సు 20 సంవత్సరాలు.
ముహమ్మద్ –సల్లల్లాహు అలైహి వసల్లం- వయస్సు 35 సంవత్సరాలు ఉండగా ఖురైషువారు కాబా కట్టడాన్ని కొత్తగా నిర్మించాలని ఉద్దేశించారు. ఎందుకనగా అది పాత కాలపు కట్టడం కావడం చేత శిథిలావస్తకు చేరి, దాని గోడలు పగులుబారినవి. అంతకు మునుపే ఎప్పుడో ఓ తూఫాను మక్కాలో వచ్చి వరద తాకిడి మస్జిదె హరాం వరకు చేరి కాబా పునాదులను సయితం పెకిలించింది. అందుకే వారు కాబా యొక్క గౌరవార్థం దాని పునర్నిర్మాణానికి సిద్ధమయ్యారు. అయితే దీని నిర్మాణంలో ధర్మసమ్మతమయిన సంపాదనే ఖర్చు పెట్టాలి అని ఏకీభవించారు. దాని నిర్మాణం మొదలు పెట్టి, హజ్రె అస్వద్ (నల్లరాయి) వద్దకు చేరుకున్నాక, హజ్రె అస్వద్ ను దాని స్థానంలో అమర్చే కీర్తి ఎవరికి దక్కాలన్న విషయంలో విభేదించి సుమారు నాలుగైదు రోజులు గడిసినా వివాదం చల్లారకుండా మరింత వేడెక్కి భయంకర యుద్ధానికే దారి తీసే సందర్భంలో ఓ విషయంపై ఏకీభవించారు. అదేమిటంటే; మస్జిదె హరాంలో రేపటి రోజు అందరికి ముందుగా ప్రవేశించే వ్యక్తిని న్యాయ- నిర్ణేతగా ఎన్నుకుందాము అని. ఆ వ్యక్తి ముహమ్మద్ -సల్లల్లాహు అలైహి వసల్లం- అయి ఉండాలని అల్లాహ్ కోరాడు. వారు ముహమ్మద్ -సల్లల్లాహు అలైహి వసల్లం-ను చూడగానే “ఇతను విశ్వసనీయుడు ముహమ్మద్, ఇతడిని మేము ఇష్టపడ్డాము” అన్న నినాదాలు చేశారు. ఆయన వారి దగ్గరకు వెళ్ళాక వారు విషయాన్ని తెలిపారు. అప్పుడు ఆయన ఓ దుప్పటి తెప్పించారు, అందులో హజ్రె అస్వద్ పెట్టారు. గొడవ చేసిన ప్రతి తెగ నాయకుడిని పిలిచి దుప్పటి ఓ అంచును పట్టుకోవాలని చెప్పారు. అందరూ పట్టుకున్నాక దాన్ని లేపి హజ్రె అస్వద్ పెట్టే చోటకి తీసుకెళ్ళమన్నారు. అందరూ కలసి దాన్ని అక్కడికి చేర్పించాక ఆయనే స్వయంగా హజ్రె అస్వద్ ను దుపట్టిలో నుండి తీసి దాని స్థానంలో అమర్చారు. ఈ వివేకవంతమైన పరిష్కారంతో అందరూ తృప్తి చెందారు.
ఖురైషువారికి ధర్మసంపద కొరత ఏర్పడింది. అందువల్ల ఉత్తరం వైపునుండి ఆరు మూరలు తగ్గించి లోపలికి అని గొడ లేపారు. ఆ వదలిన ప్రాంతాన్నే హిజ్ర్ లేదా హతీమ్ అని అంటారు. కాబా నిర్మాణం పూర్తి అయిన తర్వాత అది సుమారు చతురాస్కారంలో అయింది. వారికి ఇష్టమైన వారే అందులో ప్రవేశించటానికి దాని తలుపును పైకి ఎత్తారు. 15 మూరల ఎత్తు లేసిన తర్వాత ఆరు స్తంభాలపై దాని కప్పు వేశారు.
ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నలబై సంవత్సరాల వయస్సుకు సమీపిస్తున్న కొద్దీ ఆయనలో ఏకాంత ప్రియత్వం పెరగ సాగింది. మక్కాకు తూర్పు దిశలో ఉన్న ఓ కొండ, అందులోని హిరా గుహలో ఉండి ఆయన అల్లాహ్ ఆరాధనలో రేయింబవళ్ళు గడిపేవారు. ఒక రాత్రి, అది రమజాను నెల 21వ రాత్రి, ఆయన అదే గుహలో ఉన్నారు. అప్పటికీ ఆయనకు నలబై సంవత్సరాలు పూర్తి అయినవి. జిబ్రీల్ దైవ దూత ఆయన వద్దకు వచ్చి “చదువు” అని అన్నాడు. నాకు చదవటం రాదన్నారాయన. ఆ దూత ఆయన్ను గట్టిగా కౌగలించుకొని వదిలి చదువు అన్నాడు. అప్పటికీ ఆయన నాకు చదువు రాదు అనే సమాధానమిచ్చారు. అందుకు జిబ్రీల్ రెండు, మూడు సార్లు గట్టిగా అదిమి వదిలారు, ఆ తర్వాత ఇలా చదివాడుః
{(ఓ ప్రవక్తా!) పఠించు, సర్వాన్ని సృష్టించిన నీ ప్రభువు పేరుతో, ఆయన పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో మానవుణ్ణి సృజించాడు. పఠించు, నీప్రభువు పరమ దయాళువు. ఆయన కలం ద్వారా జ్ఞానం నేర్పాడు. మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు}. (అలఖ్ 96: 1-5).
(ఇలా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ప్రవక్త పదవి నొసంగబడినది). కాని ఈ సంఘటన తర్వాత ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హిరా గుహలో ఉండలేక పోయారు, కంపించిన హృద యంతో తిరిగి ఇంటికి వచ్చేశారు. నాకు దుప్పటి కప్పండి, నాకు దుప్పటి కప్పండి అని ఖదీజాతో అన్నారు. కాసేపటికి భయం దూరమయింది. అప్పుడు జరిగిన సంఘటన సతీమణి ఖదీజకు వినిపిస్తూ నాకు నా ప్రాణ భయముంది అన్నారు. అది విని ఖదీజ ధైర్యం చెబుతూ, “ముమ్మాటికి అలా జరగదు. అల్లాహ్ సాక్షిగా! అల్లాహ్ మిమ్మల్ని ఎన్నాటికీ అవమాన పరచడు. మీరు బాంధవ్యం పెంపొందిస్తారు, ఇతరుల భారాన్ని భరిస్తారు, ఏమి లేనివారికి (సంపాదించి) ఇస్తారు. అతిథులను గౌరవిస్తారు, ఆపదల్లో ఉన్నవారికి న్యాయం లభించుటకు సహాయపడతారు”. అని చెప్పింది.
అల్లాహ్ ఆరాధన కొనసాగించడానికి, కొద్ది రోజుల తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి హిరా గుహకి వచ్చారు. ఆరాధన పూర్తి చేసుకొని తిరిగి మక్కా రావడానికి గుహ నుండి దిగి వస్తూ, పల్లపు ప్రాంతంలో ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వినిపించింది. తెలెత్తి చూసే సరికి జిబ్రీల్ భూమ్యాకాశాల మధ్యలో కుర్చీపై కుర్చున్నాడు. అతన్ని చూసి ప్రవక్త భయకంపితులై ఇంటికి వచ్చి నాకు దుప్పటి కప్పండి అని అన్నారు. అప్పుడే కొంత సేపటికీ ఈ వహీ అవతరించింది.
{వస్త్రం కప్పుకొని పడుకున్న ఓ మనిషి! లే, లేచి హెచ్చరించు. నీ పుభువు ఘనతను చాటి చెప్పు. నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో. మాలిన్యానికి దూరంగా ఉండు}. (ముద్దస్సిర్ 74: 1-5).
ఆ తరువాత వహీ ఎడతెగకుండా రావడం మొదలయింది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మ ప్రచారం ఆరంభించిన తొలి సందర్భంలోనే ఆయన గౌరవనీయులైన సతీమణి ఖదీజ రజియల్లాహు అన్హా విశ్వాస ప్రకటనను స్వీకరించింది. అల్లాహ్ మాత్రమే ఏకైక ఆరాధ్యుడని, ఆమె భర్త అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అని సాక్ష్యమిచ్చింది. స్త్రీ పురుషుల్లో మొట్టమొదటిసారిగా ఇస్లాం స్వీకరించినవారు ఈ స్త్రీ మూర్తియే. ఆమె తర్వాత తమ ప్రాణ మిత్రుడైన అబూ బక్ర్ తో ప్రవక్త ఈ విషయం చెప్పినప్పుడు అతను కూడా నిస్సంకోచంగా విశ్వసించి, ఆయన్ను సత్యపరిచాడు. తల్లి మరియు తాత మరణానంతరం ఆయన్ను పోషించి, మంచి విధంగా చూసుకున్న పినతండ్రి అబూ తాలిబ్, అతను చేసిన మేలుకు బదులుగా ప్రవక్త అతని సంతానంలో ఒకడైన అలీని తన వద్ద ఉంచి పోషించసాగారు. అలీ చిన్న వయస్సులో ఉన్నప్పటికీ అతని హృదయం వికసించి తను కూడా విశ్వసించాడు. ఆ తర్వాత ఖదీజ రజి యల్లాహు అన్హా బానిస జైద్ బిన్ హారిస కూడా విశ్వాసుల్లో కలిశాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం ధర్మ ప్రచార కార్యాన్ని గుప్తంగా నిర్వహించసాగారు. అప్పట్లో ఇస్లాం స్వీకరించేవారు తమ ఇస్లాంను రహస్యంగా ఉంచేవారు. ఏ ఒక్కరి విషయం వెల్లడైనా ఖురైషుల నానారకాల శిక్షలకు గురి కావలసి వచ్చేది. విశ్వాసులు ఇస్లాం నుండి తిరిగి అవిశ్వాసులవ్వాలని ఖురైషులు ఇలా చేసేవారు.
ఆ సందర్భంలో ప్రవక్త సహచరులు నమాజు గాని వేరే అల్లాహ్ ఆరాధన గాని ముష్రికులకు తెలియకూడదని మక్కా కనుమల్లో చేసేవారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిగత, రహస్య ప్రచారంలో మూడు సంవత్సరాలు గడిపాక, ఒక రోజు అల్లాహ్ ఈ వహీ పంపాడుః
{కనుక ప్రవక్తా! నీకు ఆజ్ఞాపించబడుతూ ఉండిన విషయాన్ని బహిరంగంగా ఎలుగెత్తి చాటు. షిర్క్ చేసేవారిని ఏ మాత్రం లెక్క చేయకు}. (హిజ్ర్ 15: 94).
ఈ ఆదేశానుసారం ఒక రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సఫా కొండపై ఎక్కి మక్కా వాసులను పిలిచారు. చాలా మంది పోగైనారు. వారి లో ఆయన పినతండ్రి అబూ లహబ్ కూడా ఉన్నాడు. అల్లాహ్, ఆయన ప్రవక్తకు అందరికన్నా ఎక్కువ కఠిన శత్రువుడు ఇతడే. ప్రజలందరు పోగైన తర్వాత “కొండ ఆవల మీ శత్రువులు, మీపై దండెత్తడానికి సిద్ధంగా ఉన్నారని నేనంటే మీరు నమ్ముతారా?”. అని ప్రవక్త అడిగారు. వారందరు “మేము మిమ్మల్ని సత్యసంధులుగా, విశ్వసనీయులుగానే చూశాము కనుక మీరు చెప్పేది ఖచ్చితంగా నమ్ముతాం” అని ఏకంగా అన్నారు. అప్పుడు ప్రవక్త “నేను మిమ్మల్ని మీ ముందు రానున్న భయకరమైన శిక్షల నుండి హెచ్చరిస్తున్నాను” అని చెబుతూ అల్లాహ్ అద్వితీయుని ఆరాధన వైపుకు పిలుస్తూ, విగ్రహారాధనను వదులుకోవాలని బోధించారు. ప్రజల మధ్య నుండి అబూ లహబ్ ఆగ్రహంతో ముందుకు వచ్చి “నీ చేతులు విరుగుగాకా, ఇందుకేనా మమ్మల్ని రప్పించింది అని దూషించ సాగాడు. అటు అల్లాహ్ ఈ సూరా అవతరింపజేశాడు.
{అబూ లహబ్ చేతులు విరిగి పోయాయి! అతడు సర్వ నాశనం అయి పోయాడు. అతడి ఆస్తిపాస్తులు, అతడి సంపాదన అంతా అతనికి పనికి రాకుండా పోయింది. చివరికి అతడు తప్పకుండా భగభగమండే అగ్నిలో పడవేయబడతాడు. అంతే కాదు (అతడితో పాటు) అతడి భార్య కూడా అందులో పడవేయబడుతుంది. ఆమె చాడీలు చెబుతూ కలహాలు రేపే స్త్రీ. ఆమె మెడలో బాగా పేనిన ఒక త్రాడు ఉంటుంది}. (లహబ్ 111: 1-5).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మప్రచారం కొనసాగిస్తునే ఉన్నారు. అయితే ఇప్పుడు వారి సమావేశాల్లో నిలబడి బహిరంగంగా వారిని ఇస్లాం వైపుకు పిలవడం, కాబా వద్ద నమాజు చేయడం ఆరంభించారు. ప్రజలు కలుసుకునే ప్రాంతాల్లో, బాజారుల్లోకి వచ్చి ప్రవక్త ఇస్లాం గురించి బోధించే వారు. అందువల్ల ఆయన ఎన్నో సార్లు నా నా రకాల బాధలకు గురయ్యారు. ఆయన్ని విశ్వసించినవారు కూడా అవిశ్వాసుల యాతనలకు బలిఅయ్యే వారు. వారిలో యాసిర్, సుమయ్యా మరియు వారిద్దరి కొడుకు అమ్మార్ (రజియల్లాహు అన్హుమ్)లు ప్రసిద్ధి చెందారు. చివరికి అమ్మార్ తల్లిదండ్రులు ఆ యాతనలను భరించలేక షహీద్ (అమరగతి) అయ్యారు. సుమయ్యా ఇస్లాంలో తొలి షహీద్ గా పేరునొందారు. అలాగే బిలాల్ బిన్ అబీ రిబాహ్ హబషీ రజియల్లాహు అన్హు కూడా ఉమయ్య బిన్ ఖలఫ్ మరియు అబూ జహల్ చేత ఘోరంగా శిక్షించబడ్డారు. వాస్తవానికి బిలాల్, అబూ బక్ర్ పిలుపు, ప్రోత్సహంతో ఇస్లాంలో ప్రవేశించారు. ఈ విషయం బిలాల్ యజమాని ఉమయ్యా బిన్ ఖలఫ్ కు తెలిసింది. అతడు ఆయనపై ఘోరమైన హింసా దౌర్జన్యాలు చేశాడు. ఇవన్నీ ఆయన ఇస్లాం వదలుకోవాలని. కాని ఆయన అతని మాటను ధిక్కరించి, ఇస్లాం ధర్మంపై స్థిరంగా ఉండిపోయారు. ఉమయ్యా బిలాల్ ను సంకెళ్ళలో బంధించి, మండే ఎడారి ఇసుకపై పడవేసి, బరువైన బండ ఆయన ఎదపై పెట్టేవాడు. (అయినప్పటికీ బిలాల్ నిరాకరించేవారు) అందుకు ఆయన మెడలో తాడు కట్టి అగ్ని కుర్పిస్తున్న ఎండలో, మాడు ఇసుకలో ఆయన్ని లాగేవాడు. (ఆ దౌర్జన్యుడు ఇంతటితో తృప్తి పడక) తన మిత్రులతో కలసి ఒకరెనుకొకరు అలసిపోయే వరకు బిలాల్ పై కొరడా దెబ్బల వర్షం కురిపించేవారు. అంతులేని బాధలకు గురయినప్పటికీ నోటితో మాత్రం “అహద్, అహద్” (అల్లాహ్ ఒక్కడే, అల్లాహ్ ఒక్కడే) అనే పదాలే వినవచ్చేవి. ఒకసారి అబూ బక్ర్ తన దారిన వెళుతూ బిలాల్ అనుభవిస్తున్న బాధను చూశారు. అప్పుడే ఉమయ్యాతో సంప్రదించి ఆయన్ని ఖరీదు చేసి అల్లాహ్ కొరకు ఆయనకు స్వేచ్ఛతనిచ్చారు.
ఈ దౌర్జన్యఖాండలు హెచ్చు పెరుగుతన్నందు వల్ల, వారు ఇప్పుడే తమ ఇస్లాంను మరియు వారు రహస్యంగా ఒక చోట కలిసి శిక్షణ పొందుతున్న విషయాల్ని బహిర్గతం చేయవద్దని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలకు ఆదేశించారు. ఇది ఎంతో గొప్ప వివేకం. ఎందుకంటే ఇప్పుడే వారు తమ ఇస్లామును బహిర్గతం చేశారంటే ప్రవక్త వారికి ఇచ్చే శిక్షణ మరియు విద్యకు అవిశ్వాసులు అడ్డు పడుట నిస్సందేహం. అందు వల్ల రెండు వర్గాల మధ్య ఒక పెద్ద ఘర్షణ సంభవించవచ్చు. ముస్లింలు ఇంకా అతి తక్కువ సంఖ్యలో ఉన్నారు గనక ఎక్కువ నష్టం వారికే వాటిల్లవచ్చు. అంతేమిటి బొత్తిగే అంతం కావచ్చు. అందుకే ముస్లిములు తమ ఇస్లాం బహిర్గతం చేయవద్దని ఆదేశించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మంచి ఉపాయం చేశారు. కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాత్రం ధర్మ ప్రచారం, అల్లాహ్ ఆరాధన విరోధుల సమక్షంలో బహిరంగంగా చేసేవారు. వారు ఎన్ని విధాలుగా బాధించినా సహించేవారు.
ఇస్లాం మరియు ముస్లిముల బద్ధశత్రువు, ముష్రికుల నాయకుడు అబూ జహల్ ఓ రోజు కాబా వద్ద ఉన్న ప్రవక్తను దూషించాడు, చాలా బాధ కలిగించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎదురు జవాబూ చెప్పలేదు, ఏ ఒక్కటీ మాట్లాడ లేదు. అప్పుడు ఒక స్త్రీ కూడా ఈ సంఘటనను చూసింది. కొంత సేపటికే షికారు కొరకు మక్కా బైటికి వెళ్ళిన హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ వచ్చాడు. ఆ స్త్రీ తాను చూసిన అబూ జహల్ చేష్టలు, ప్రవక్తను దూషించడమంతా అతనికి తెలియజేసింది. అది విన్న హంజా రజియల్లాహు అన్హు ఆగ్రహోదోగ్రుడై అబూ జహల్ ను వెతుకుతూ వెళ్ళాడు. ఓ చోట కొందరి మధ్య కూర్చుండి ఉండటాన్ని చూశాడు. హఠాత్తుగా అబూ జహల్ పై విరుచుకుపడి ధనుస్సుతో గట్టిగా కొట్టి అతని తలను గాయ పరిచి, ‘నేను ముహమ్మద్ ధర్మంపై ఉండగా నీవు ఆయన్ని దూషిస్తావా?’. హంజా రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరణకు ఇది ఓ సబబుగా అయింది. ఆయన ఇస్లాం స్వీకరణ వల్ల ముస్లిములకు ఓ రకమైన బలం, గౌరవం ప్రాప్తమయింది. ఎలా అనగా ఆయన మక్కావాసుల్లో ఓ ఉన్నత స్థానం, గొప్ప కీర్తి పేరు ప్రతిష్ఠ కలవారు.
ఉమర్ రజియల్లాహు అన్హు గారి ఇస్లాం స్వీకరణ వల్ల కూడా ముస్లిములకు గట్టి బలం, పటిష్టము లభించింది. హంజా రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరణకు మూడు రోజుల తర్వాత ఇతను ఇస్లాం స్వీకరించారు. అది ఎలా అనగాః ఉమర్ రజియల్లాహు అన్హు ఓ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని హతమార్చే ఉద్దేశ్యంతో వెళ్ళాడు. దారిలో ఒక వ్యక్తి కలసి ‘ఎటు వెళ్ళుచున్నావు ఉమర్!’ అని అడిగాడు. దానికి అతడు ‘ముహమ్మద్ -సల్లల్లాహు అలైహి వస్లలం-ను హతమార్చుటకు వెళ్ళుచున్నాను’ అని సమాధానమిచ్చాడు. దానిపై అతడన్నాడుః ‘నీవు ముహమ్మద్ –సల్లల్లాహు అలైహి వసల్లం-ను హతమారుస్తే బనూ హాషిం మరియు బనూ జుహ్రా నిన్ను క్షేమంగా వదులుతారా?’ ఉమర్ అన్నాడుః ‘నీవు నీ తాతముత్తాతల మతాన్ని వదలి కొత్త మతాన్ని స్వీకరించినట్లున్నావు’? అతడన్నాడుః దీనికంటే మరీ విచిత్రమైన విషయం చెప్పాలా ఉమర్! నీ చెల్లి మరియు బావ ఇద్దరూ ఇస్లాం స్వీకరించారు. తాతముత్తాతల మతాన్ని వదిలేశారు’. ఉమర్ అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళి చెల్లిలి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఖబ్బాబ్ బిన్ అరత్త్ రజియల్లాహు అన్హు వారింట్లో ఉన్నాడు. ఖుర్ఆన్ లోని సూర తాహా వ్రాసిఉన్న పత్రం అతని వద్ద ఉంది. అతను వారికి ఆ సురా నేర్పుతున్నాడు. ఉమర్ వస్తున్నది గమనించిన ఖబ్బాబ్ రజియల్లాహు అన్హు ఇంట్లో ఓ మూలకు దాగిపోయాడు. ఉమర్ చెల్లి ఫాతిమా ఆ పత్రాన్ని దాచిపెట్టింది. ఉమర్ ఇంటికి సమీపంలో చేరినప్పుడే ఖబ్బాబ్ రజియల్లాహు అన్హు ఖుర్ఆన్ పారాయణాన్ని విన్నాడు. లోనికి ప్రవేశించిన వెంటనే ‘నేను మీ ఇంట్లో విన్నదేమిటి?’ అని అడిగాడు. ‘ఏమి లేదు, అట్లే మాట్లాడుకుంటూ ఉంటిమి’ అని వారిద్దరు అన్నారు. ఉమర్ అన్నాడుః బహుశా మీరిద్దరు పాత మతాన్ని విడనాడి కొత్త ధర్మం స్వీకరించారు కదూ? బావ చెప్పాడుః ‘ఉమర్! ఒకవేళ సత్వం అన్నది నీ మతంలో కాకుండా వేరే ధర్మంలో ఉంటే ఏమిటి మీ ఆలోచనా?’ దానిపై ఉమర్ అతడ్ని చాలా చితకబాదాడు. అంతలోనే చెల్లి వచ్చి ఉమర్ ను భర్త మీది నుండి పక్కకు జరపబోయింది. ఉమర్ ఆమెను సయితం కొట్టి రక్తసిక్తం చేసేశాడు. ఆమె ముఖం ద్వారా రక్తం కారడం మొదలయింది. అదే కోపంలో ఆమె ఇలా అందిః “అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్”. అంటే సత్య ఆరాధ్యుడు అల్లాహ్ తప్ప ఎవడు కాడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అని సాక్ష్యమిచ్చుచున్నాను.
ఉమర్ రక్తసిక్తమైన చెల్లిని చూసి చాలా సిగ్గు పడ్డాడు. ‘మీ వద్ద ఉన్న పుస్తకం ఏది? ఇవ్వండి’ అని అడిగాడు. చెల్లి చెప్పిందిః ‘నీ అపరిశుద్ధునివి, దీని పరిశుద్ధులు ముట్టుకుంటారు’ లేచి స్నానం చేసుకో’. ఉమర్ లేచి, స్నానం చేసి, పుస్తకం తీసుకొని బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం చదివి ‘చాలా మంచి పేర్లున్నాయి అని చెప్పాడు. మళ్ళి సూర తాహా మొదటి నుండి 14వ ఆయతు (నిశ్చయంగా, నేనే అల్లాహ్ ను! నేను తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు, కావున నన్నే ఆరాధించు మరియు నన్ను స్మరించడానికి నమాజును స్థాపించు) వరకు చదివి, ఈ మాట ఎంత బావుంది మరెంత గౌరవపదంగా ఉంది, ముహమ్మద్ -సల్లల్లాహు అలైహి వసల్లం- ఎక్కుడున్నాడో దారి చూపండి’ అని అన్నాడు.
ఉమర్ యొక్క ఈ మాటను విన్న ఖబ్బాబ్ రజియల్లాహు అన్హు లోపలి నుండి బైటికి వచ్చి “సంతోషించు ఉమర్! “అల్లాహ్ ఉమర్ బిన్ ఖత్తాబ్ లేదా అబూ జహల్ బిన్ హిషామ్ ద్వారా ఇస్లాంను బలపరుచు” అని ప్రవక్త చేసిన దుఆ అంగీకరించబడిందని ఆశిస్తున్నాను’ అని అన్నాడు.
ఆ తర్వాత ఉమర్ -రజియల్లాహు అన్హు- తన కరవాలాన్ని తీసుకొని ప్రవక్త వైపునకు బయలుదేరాడు. తలుపును తట్టాడు. ఒక వ్యక్తి తలుపు సందుల్లో నుండి చూశాడు. ఉమర్ కరవాలం ధరించి ఉండడాన్ని గమనించి, లోపలున్న ప్రజలకు తెలిపాడు. వారు దిగ్భాంతి చెందారు. అప్పుడు ప్రవక్త లోపలి గదిలో ఉన్నారు. అక్కడే దగ్గర ఉన్న హంజా రజియల్లాహు అన్హు ప్రజల గమనించి ఏమిటి సంగతి? అని అడిగాడు. ఉమర్ అని వారన్నారు. అప్పుడు హంజా రజియల్లాహు అన్హు అన్నారుః ‘అతని కొరకు ద్వారం తెరవండి. అతను సదుద్దేశ్యంతో వచ్చాడా అది అతనికి లభించుటకు సహాయపడదాము. ఒకవేళ ఏదైనా దురుద్దేశ్యంతో వచ్చాడా అతని కరవాలంతో అతడ్ని హతమార్చుదాము’. ఉమర్ లోనికి ప్రవేశించి ఇస్లాం స్వీకరించానని చాటి చెప్పాడు. వెంటనే అక్కడ ఉన్నవారందరూ ఏకంగా మరియు పెద్ద శబ్దముతో అల్లాహు అక్బర్ అని అన్నారు. ఆ శబ్దాన్ని మస్జిదె హరాంలో ఉన్నవారు విన్నారు.
సుహైబ్ రూమి రజియల్లాహు అన్హు ఇలా తెలిపారుః ‘ఉమర్ రజియ- ల్లాహు ఇస్లాంలో ప్రవేశించినప్పటి నుండి ఇస్లాం బలంగా, గౌరవంగా ఉంది. దాని వైవు బహిరంగంగా పిలవడం జరిగింది. మేము కాబా వద్ద కూర్చో గలిగాము మరియు దాని ప్రదక్షిణం (తవాఫ్) చేయ గలిగాము’.
అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారుః ‘ఉమర్ రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించినప్పటి నుండి మేము గౌరవంగా జీవించగలిగాము’.
దినదినానికి ఇస్లాంలో ప్రవేశించే వారి సంఖ్యం పెరగడం మరియు ప్రజల్ని ఇస్లాం నుండి నిరోధించడానికి చేసే ప్రయత్నాలు ఫలించక పోవడాన్ని చూసి ముష్రికులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని ఇస్లాం ప్రచారం నుండి అడ్డుకోడానికి వేరే పన్నాగాలు పన్నడం మొదలు పెట్టారు. ఇదే పనిగా, మక్కా నాయకుల్లో ఒకడైన అబుల్ వలీద్ ఉత్బా బిన్ రబీఆ, మస్జిదె హరాంలో ఒంటరిగా కూర్చొని ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాడు. ఇలా మాటను ఆరంభించాడుః సోదర పుత్రుడా! నీవు నీ జాతి వారి వద్దకు ఓ పెద్ద ఆపద తెచ్చి పెట్టావు. దాని కారణంగా ఐక్యంగా ఉన్నవారిలో చీలికలు సృష్టించావు. వారి దేవతలను, వారి ధర్మాన్ని విమర్శించావు. వారి తాతముత్తాతలను అవిశ్వాసులని అన్నావు. అయితే నేను కొన్ని విషయాలు నీ ముందు ఉంచదలిచాను. వాటిలో ఏ కొన్నైనా నీవు స్వీకరిస్తావని ఆశిస్తున్నాను. అందుకు ప్రవక్త “చెప్పండి అబుల్ వలీద్! వింటాను” అని సమాధానం ఇచ్చారు.
నాయనా! నీవు తీసుకొచ్చిన ఈ కొత్త పద్ధతుల ద్వారా ఏదైనా ధనం కూడబెట్టాలని అనుకుంటే మేము నీ కొరకు ధనబండారాలు సమకూరుస్తాము. చివరికి నీవు మాలో అందరికన్నా ఎక్కువ ధనవంతునివి అయిపోతావు. లేదా ఈ పని ద్వారా నీవు గౌరవ, ప్రతిష్ఠలు సంపాదించాలనుకుంటే మేము నిన్ను మా నాయకునిగా ఎన్నుకుంటాము. ఇక ఏ పని కుడా నీ సలహా లేనిది చేయనే చేయము. ఒకవేళ నీవు గొప్ప అధికారాన్ని కోరుకుంటే మేము నిన్ను మాకు రాజుగా ఎన్నుకొని నీకు కిరీటం కడతాం. ఇవేమీ కాకుండా నీవు ఏవైనా దుష్కళలు కంటూ ఉంటే పేరుగాంచిన వైద్యులను రప్పించి నీకు వైద్యం చేస్తాము. నీ బాగుగోలు కొరకు ఎంత ధనమైనా వెచ్చిస్తాము. ఈ విషయాలన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శ్రద్ధగా, నిశబ్దంగా వింటున్నారు. ఉత్బా తన ప్రసంగం ముగించాడు. అప్పుడు ప్రవక్త అడిగారుః నీవు ముగించావా అబుల్ వలీద్? అవును నేను ముగించాను అని అతడన్నాడు. సరే, ఇక నా మాట వింటావా? అని ప్రవక్త అడిగారు. అవును అని అతడన్నాడు.
అప్పుడు ప్రవక్త ﷺ సూర ఫుస్సిలత్ లోని ఈ ఆయతులు పఠించారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పారాయణం చేస్తూ పోతున్నారు. ఉత్బా రెండు అరచేతులు వెనక భూమికి ఆనించి తల భుజము పై పెట్టుకొని గమ్మున వింటు ఉన్నాడు. ప్రవక్తగారు 38వ ఆయతు వరకు పారాయణం చేసి అందులో సజ్దా ఆదేశం ఉండగా పారాయణం నిలిపి వేసి సజ్దా చేశారు. సజ్దా నుండి లేచి, “అబుల్ వలీద్! నీవు ఏదైతే విన్నావో విన్నావు. అదే నా సమాధానం, ఇక నీ ఇష్టం” అని అన్నారు.
ఉత్బా టక్కున లేచి తన మిత్రుల వద్దకు వెళ్ళాడు. ఇతని రాకను చూసినవారు ‘అల్లాహ్ సాక్షిగా! పోయేటప్పుడు ఉన్న అబుల్ వలీద్ ముఖం ఇప్పుడు తిరిగి వస్తున్నప్పుడు లేదు’ అని పరస్పరం అనుకుంటున్నారు. వారి వద్ద కూర్చున్న వెంటనే ఒకడు అడిగాడు, నీ వెనక ఏమి జరిగింది అబుల్ వలీద్! అతడు ఇలా సమాధానమిచ్చాడుః వెనక జరిగినది ఏమిటంటే; అల్లాహ్ సాక్షిగా! నేను విన్నటువంటి మాట ఎన్నడూ వినలేదు. అది చేతబడి కాదు. మంత్రజాలం కాదు. కవిత్వము అసలే కాదు. ఖురైషులారా మీరు నా మాట వినండి. అతడ్ని అతని మానాన వదలండి. అల్లాహ్ సాక్షిగా! అతడు చెప్పిన ఏ మాట నేను విన్నానో అది ఒక సంచలనం సృష్టిస్తుంది. అరబ్బులో ఎవరైనా అతడ్ని హతమారుస్తే మీ పని వేరే వారితో పూర్తి అయిందన్న మాట. ఒక వేళ అతను అరబ్బులను జయించాడంటే అతని రాజ్యం మీ రాజ్యం, అతని గౌరవం మీ గౌరవం, అతని ఉనికి మీ కొరకే ఎక్కువగా అదృష్టవంతగా ఉంటుంది’. అప్పుడు వారన్నారుః అల్లాహ్ సాక్షిగా! ముహమ్మద్ తన నోట నీపై కూడా మంత్రం చేసేశాడు. అతడన్నాడుః ‘ఇది నా అభిప్రాయం, ఇక మీకు ఇష్టమైనది మీరు చేయండి’.
ఎవరి ఇస్లాం విషయం తెలిసేదో వారి పట్ల సామాన్యంగా, బలహీనులయిన ముస్లింల పట్ల ప్రత్యేకంగా పెరుగుతున్న అవిశ్వాసుల హింసా దౌర్జన్యాల కారణంగా, తమ ధర్మాన్ని కాపాడుతూ హబషా వైపు -అక్కడ శాంతిస్థానం లభిస్తుందన్న నమ్మకంతో- (ఆ దేశ రాజు) నజ్జాషీ వద్ద వలసపోవుటకు అనుమతించవలసినదిగా ప్రవక్తతో సహాబాలు (ప్రవక్త అనుయాయులు, సహచరులు) కోరారు. ముఖ్యంగా అనేక మంది ముస్లిములు తమ పట్ల మరియు తమ సంతానం పట్ల ముష్రికులతో భయంగా ఉన్నందు వల్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వలసపోవుటకు వారిని అనుమతించారు. ఇది ప్రవక్త పదవి లభించిన తర్వాత ఐదవ యేట జరిగిన సంఘటన. అప్పుడు సుమారు 70 మంది ముస్లింలు తమ భార్యా పిల్లలతో సహా వలసపోయారు. వారిలో ఉస్మాన్ రజియల్లాహు అన్హు తమ ఇల్లాలు అనగా ప్రవక్త ప్రియ కూతురు రుఖయ్యా రజియల్లాహు అన్హా కూడా ఉన్నారు. అయితే మక్కా అవిశ్వాస ఖురైషులు, ముస్లిములు అక్కడ కూడా ప్రశాంతంగా ఉండకూడదన్న దురుద్దేశంతో నజ్జాషి వద్దకు కొందరిని రాయబారులుగా, కానుకలతో పంపారు. తమ దేశం నుండి పారిపోయి వచ్చిన వారిని తమకు అప్పగించ వలసిందిగా వారు రాజును కోరారు. అంతేకాదు, ముస్లిములపై రాజు మరింత ఆగ్రహించుకోవాలని, ముస్లింలు ఈసా -అలైహిస్సలాం- (యేసు క్రీస్తు) మరియు ఆయన తల్లిని దూషిస్తారని వారిపై అపనింద వేశారు. నజ్జాషీ ఈ విషయంలో ముస్లింలను మందలించాడు. అందుకు వారు ఈసా అలైహిస్సలాం (యేసు క్రీస్తు) గురించి ఖుర్ఆన్ ఏమంటుందనేది స్పష్టపరచి, ఆయన గురించి ఉన్న సత్యాన్ని వెల్లడించారు. తద్వారా ఖుర్ఆనులోని సూరె మర్యం (19వ అధ్యాయం) పారాయణం చేశారు. ఈ వివరాలన్నీ విన్నాక ముస్లింలను గౌరవించి, సత్కరించి వారు తన దేశంలో ప్రశాంతంగా ఉండండని తృప్తినిచ్చి, ఖురైషు రాయబారులను తరిమేశాడు. ముస్లింలను వారికి అప్పగించడం కాని పని అని స్పష్ట పరిచాడు.
ఇదే సంవత్సరంలోని రమజాను మాసంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాబా వద్దకు వెళ్ళి, అక్కడ సమూహమైన ఖురైషుల యదుట సూరె నజ్మ్ (53వ అధ్యాయం) పారాయణం మొదలెట్టారు. వారు ఎల్లప్పుడూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ మాటను వినకూడదని ఇతరులకు బోధ చేసేవారు గనక, స్వయంగా ఎప్పుడూ అల్లాహ్ వచనాలు (ఖుర్ఆన్ ఆయతులను) వినడానికి నోచుకోలేదు, గనక ఎప్పుడైతే ఈ సూరా పారాయణం వారికి హఠాస్తంభవించిందో, ఆకర్శించే శక్తి గల అల్లాహ్ వచనం వారి చెవులకు తట్టిందో, ప్రతీ ఒక్కడూ పూర్తి శ్రద్ధతో వినసాగాడు. దాన్ని వినడం తప్ప మరే ఆలోచనే లేకుండింది. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం {ఫస్జుదూ లిల్లాహి వఅబుదూహ్} ఆయతు చదివారో స్వయంగా సజ్దా చేశారు. వారిలో ఏ ఒక్కడు కూడా తనకు తాను అదుపులో ఉంచుకోలేక సజ్దాలో పడిపోయాడు.
ఇస్లామీయ ప్రచారానికి విరుద్ధంగా ఖురైషులు అనేక పన్నాగాలు పన్నారు. తీవ్రమైన శారీరక బాధ కలిగించుట, హింసించుట, పీడించుట. బెదిరించుట, జడిపించుట. ప్రేరేపించుట. ఆశలు చూపుట, పురిగొల్పుట. ఇలా నానా రకాల అఘాయిత్యాలు జరిపారు. అయినా ఇవన్నీ విశ్వాసులకు ఇస్లాం ధర్మంపై మరింత స్థిరత్వాన్ని కలిగిస్తూ, విశ్వాసుల సంఖ్యలో హెచ్చింపే అవసాగింది.
ఖురైషులు ఇస్లాంను అణచడానికి సరికొత్త ఉపయాలు ఆలోచించేవారు. ఇప్పుడు మరో రకమైన ఎత్తుగడకై తమ మెదడుకు పదను పెట్టి ఓ నిర్ణయానికి వచ్చారుః ముస్లిములు మరియు బనీ హాషింలతో సంపూర్ణ సంఘ బహిష్కరణకై ఒక ఒప్పందం వ్రాసి, అందరూ దానిపై సంతకాలు చేసి, దాన్ని కాబాలో వేలాడగట్టారు. అంటే వారితో వ్యాపార లావాదేవీలు చేయరాదు, వివాహ సంబంధాలు, పెళ్ళి పేరంటాలు పెట్టుకోరాదు. అన్నపానియాల సరఫరా చేయరాదు. ఏలాంటి సహాయ సహకారాలు అందించరాదు. అప్పుడు ముస్లింలు గత్యంతరం లేక మక్కా నగరాన్ని విడిచి పెట్టి సమీపములో ఉన్న ఒక కనుమలో శరణు తీసుకున్నారు. దానినే షిఅబె అబీ తాలిబ్ (అబూ తాలిబ్ కనుమ) అంటారు. అక్కడ ముస్లిములు ఎంతో కష్టభూయిష్టమైన జీవితం గడిపారు. నానారకాలుగా ఆకలి బాధలకు గురయ్యారు. ధనవంతులు చాలా ధనం ఖర్చు పెట్టారు. ఖదీజ రజియల్లహు అన్హా తన పూర్తి ఆస్తిని ఖర్చు చేసింది. ఆ సందర్భంలో వ్యాదులు ప్రభలిపోయాయి. అందువల్ల చాలా మంది చస్తూ చస్తూ బ్రతికారు. అయినా ముస్లింలు మరియు బనీ హాషిం ఎంతో సహనం, స్థయిర్యంతో మూడు సంవత్సరాలు గడిపారు. ఏ ఒక్కరూ సత్య ధర్మం నుండి వెనుదిరగ లేదు. చివరికి ఖురైషులోని కొందరు పెద్దలు -బనీ హాషింలోని కొందరితో వారికి దగ్గరి సంబంధం ఉండింది- వారు ముందుకు వచ్చి, ఇక ఈ ఒప్పందం చెల్లబోదు, దాన్ని చింపేయ్యాల్సిందే అని ఖురైష్ నాయకుల ముందు తేల్చి చెప్పారు. అందువల్ల ఆ ఒప్పంద పత్రాన్ని తెప్పించి చూసె సరికి దాన్ని చెదలు తినియుంది. బిస్మికల్లా హుమ్మ అని అల్లాహ్ పేరు తప్ప ఏమీ మిగల లేదు. ఈ విధంగా ముస్లింములు, బనీ హాషిం క్లిష్ట సమయం గడిపి, మక్కా తిరిగి వచ్చారు.
కాని ఖురైషులు దౌర్జన్య వైఖరిలో ఏ మార్పు రాలేదు; ముస్లిముల మరియు ఇస్లాంకు వ్యతిరేకంగా పోరాడడం, ప్రజల్ని ప్రవక్త వద్దకు రాకుండా చేయడం, ఖుర్ఆన్ వినడం నుండి ఆపడం లాంటివి. అంతే కాదు అరబ్ నలువైపుల నుండి ఎవరు వచ్చినా, ఎక్కడా వారు ప్రవక్తతో కలసి ఇస్లాం స్వీకరిస్తారో అని భయపడేవారు. ఇలాంటి ఓ సంఘటన స్వయంగా తుఫైల్ బిన్ అమ్ర్ దౌసీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః అతను తన జాతిలో పేరుగల నమ్మదగిన నాయకుడు. ఒకసారి మక్కా వచ్చాడు. కొందరు ఖురైషు పెద్దలు అతని వద్దకు వచ్చి ముహమ్మద్ – ﷺ – గురించి అతడ్ని బెదిరిస్తూ అతని మాటలు వినబోకండి, అతని దగ్గరికే వెళ్ళకండి, చేతబడి లాంటి మాటలు అతనివి. వాటి వల్ల తండ్రి కొడుకుల మధ్య, సోదరుల మధ్య, భార్యభర్తల మధ్య చీలికలు ఏర్పడుతాయి అని ఆరోపించారు. తుఫైల్ అంటాడుః అల్లాహ్ సాక్షిగా! మాటిమాటికి వారు చెప్పడం వల్ల, నేను అతనితో మాట్లాడనని మరియు అతని ఏ మాటను విన అని నిశ్చయించుకున్నాను. అయినా పోతూ పోతూ ఏదైనా మాట చెవులో పడుతుందేమో అని ముందే చెవులలో దూది పెట్టుకున్నాను.
ఆ తర్వాత మస్జిదె హరాంకు వెళ్ళాను. ప్రవక్త కాబా వద్ద నమాజులో ఖుర్ఆన్ పారాయణం చేస్తున్నారు. నేను దాని కొంత భాగం వినాలని అల్లాహ్ కూడా నిశ్చయించినట్లుంది. అయితే కొంత మేరకు విన్నాను. అప్పుడు నా మనుసులో నేను అనుకున్నాను; నేను ఓ కవిని, తెలివిగలవాడిని, మంచిని చెడు నుండి వేరుగా గుర్తించగలను. ఈ మనిషి మాట వినకుండా నన్ను అడ్డుకునేది ఏమిటని? అతడు ఏదైనా మంచి విషయం చెప్పాడా అంగీకరిస్తాను. చెడు చెప్పినట్లయితే వదిలేస్తాను. ఆయన అక్కడ ఉన్నంత సేపు నేను అక్కడే ఉండి, ఆయన తమ ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు నేను ఆయన వెనక వెనకే వెళ్ళాను. ఆయన ఇంట్లో ప్రవేశించాక తర్వాత నేనూ ప్రవేశించాను. అక్కడ ఆయనతో ఇలా విన్నవించుకున్నానుః ముహమ్మద్! -సల్లల్లాహు అలైహి వసల్లం- మీ జాతివారు మీ గురించి నన్ను చాలా భయపెట్టించారు. చివరికి నేను మీ మాట వినకూడదని చెవులలో దూది పెట్టుకున్నాను. అయితే అల్లాహ్ మాత్రం నేను వినాలని నిర్ణయించాడు. అందుకు చాలా మంచి మాటలు విన్నాను. మీ విషయం ఏమిటో మీరే స్వయంగా చెబుతే బావుంటుంది. అప్పుడు ఆయన ఇస్లాం గురించి నాకు తెలిపాడు. ఖుర్ఆన్ పారాయణం చేసి వినిపించారు. అల్లాహ్ సాక్షిగా! దాని కంటే ఉత్తమమైన మాట గాని మరియు న్యాయమైన విషయం గాని నేను ఎప్పుడూ వినలేదు. అప్పుడే నేను ఇస్లాం స్వీకరించాను. సత్యం యొక్క సాక్ష్యం పలికాను.
ఆ తర్వాత తుఫైల్ తమ జాతివారి వద్దకు వెళ్ళి వారిని ఇస్లాం వైపునకు ఆహ్వానించి, దాని గురించి వివరాలు ఇవ్వగలిగారు. దాని ఫలితంగా వారి కుటుంబికులు ఇస్లాం స్వీకరించారు. తర్వాత వారి జాతివారిలో కూడా ఇస్లాం ప్రచారం చాలా మంచి విధంగా జరిగింది.
ప్రవక్త బాబాయి అబూ తాలిబ్ పూర్తి శరీరంలో తీవ్రమైన వ్యాది సోకింది. అతడు మంచం పట్టాడు. కొద్ది రోజుల్లో సక్రాత్ (మరణవేధన)కు గురయ్యాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని తలకడన కూర్చున్నారు. చివరి గడియలో మరణానికి ముందు అతను “లాఇలాహ ఇల్లల్లాహ్” అని పలికితే బావుండునని ఆశిస్తున్నారు. కాని అతని చుట్టూ ఉన్న అతని దుష్ట స్నేహితులు, ప్రత్యేకంగా వారి నాయకుడు అబూ జహల్, వారందరూ లాఇలాహ ఇల్లల్లాహ్ చదవనిస్తలేరు. నిరాకరించడమే కాకుండా, “ఏమీ నీవు నీ తాత ముత్తాతల ధర్మాన్ని విడనాడుతావా? అబ్దుల్ ముత్తలిబ్ మతాన్ని త్యజిస్తావా? అని నిందిస్తున్నారు. చివరికి అబూ తాలిబ్ షిర్క్ పై చని పోయాడు. అవిశ్వాసుడై మరణించినందుకు ప్రవక్త దుఃఖం అధికమైంది. ప్రవక్త ఈ బాధ నుండి కోలుకోక ముందే సుమారు రెండు నెలలకే ఆయన ప్రియమైన పవిత్ర సతీమణి ఖదీజ రజియల్లాహు అన్హా పరమపదించారు. అందువల్ల ప్రవక్త అమితంగా దుఃఖించారు. పరోక్షంగా సహాయం అందిస్తూ వచ్చిన అబూ తాలిబ్ మరియు జీవితాంతం తన కష్టాల్లో పాలుపంచుకొని, ప్రోత్సహించే సతీమణి ఖదీజాల మరణానంతరం అవిశ్వాసుల అఘాయిత్యాలు ప్రవక్తపై మరింత ఎక్కువయ్యాయి. (అయినా ప్రవక్త ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ధర్మ ప్రచారంలో నిమగ్నులయ్యారు).
ప్రవక్త పిలుపును అంగీకరించిన వారిలో అనేకులు బడుగువర్గానికి సంబంధించినవారు మరియ బానిసలు ఉండిరి. సామాన్యంగా ప్రతి కాలంలో ప్రవక్తల పిలుపును అంగీకరించేవారు వీరే ఉండేవారు. ఎందకనగా ఎవరినైనా అనుసరించడం వారికి కష్టతరమేమీ కాదు. కాని పెద్దలుగా చెలామణి అయినవారిని మరియు హోదా అంతస్తులు గలవారిని గర్వం, ఈర్ష్య, హోదాఅంతస్తుల ప్రేమ వైగారాలు సత్యం, ధర్మం పట్ల విధేయతకు అడ్డుగా ఉంటాయి మరియు ఇతరులకు అనుసరులుగా ఉండేందుకు ఆటంకం కలిగిస్తాయి.
ఇస్లాం ప్రచారాన్ని అడ్డుకొనుటకు ముష్రికులు వివిధ పద్ధతులు అనుసరించారు. ఇస్లాం వ్యాప్తిని ఓ హద్దులో ఉంచుటకు విభిన్న మార్గాలు అవలంబించారు. ప్రజల్ని సత్యధర్మం నుండి ఆపడానికి శతవిధాల ప్రయత్నించారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇవిః
1. బెదిరింపులుః ఖురైషు నాయకులు కొందరు ప్రవక్తగారి పెదనాన్న అబూ తాలిబ్ వద్దకు వచ్చి ‘ముహమ్మద్ మాకు చాలా బాధ కలిగిస్తున్నాడు, మా దైవాలను విమర్శిస్తున్నాడు. మీరు అతడ్ని ఈ చేష్టల నుండి ఆపండి’ అని అన్నారు. అతను ప్రవక్తను రప్పించి, “నాయనా! నీవు వారికి బాధ కలిగిస్తున్నావని, వారి దైవాలను విమర్శిస్తున్నావని నీ చిన్నాన్న కొడుకులు అంటున్నారు. దీనిని మాకనుకోరాదు నాన్న”. దీనికి సమాధానంగా ప్రవక్త సూర్యుని వైపు సైగ చేసి దీని ఏదైనా ఒక జ్వాలను నా చేతిలో పెట్టినా నేను వీరి కొరకు నా ప్రచార కార్యక్రమాన్ని విడనాడ లేను. అప్పుడు అబూ తాలిబ్ చెప్పాడః నా కొడుకు అబద్ధం పలుకలేదు. అతడ్ని అతని మానన వదలండి.
2. అపనిందలుః ప్రవక్త పిచ్చివాడని, చేతబడి చేయువాడని, అబద్ధం పలికేవాడని మరియు పాతకాలపునాటి కట్టుకథలు తెచ్చువాడని అపనిందలు మోపారు. (వీటి సాక్ష్యాధారాలు ఖుర్ఆన్ లోనే ఉన్నాయి).
3. ఎగతాళి చేయడం, పరిహసించడం మరియు నవ్వడం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహచరులతో ఎగతాళి చేసేవారు, మరియు వారి దగ్గరి నుండి దాటినప్పుడు పరిహసించేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల కించపరిచే మాటలు మాట్లాడేవారు. బలహీన వర్గానికి సంబంధించిన వారితో ఎప్పుడైనా ప్రవక్తను చూసినట్లైతే వీరేనా ఇతని అనుచరులు అని హేళన చేసేవారు.
4. ప్రవక్త బోధనలను వికృతంరూపమివ్వడం, సందేహాలు లేపడం, అసత్య వదంతుల వ్యాపింపజేయడం: ఖుర్ఆన్ కేవలం కొన్ని కట్టుకథల పుస్తకం మాత్రమే అని ఆరోపించేవారు. ఒక మనిషి ఇతనికి నేర్పుతున్నాడని ఆరోపించేవారు.
5. చితకబాదడం: ప్రవక్తను మరియు సహచరులను సత్యధర్మం నుండి ఆపడానికి పై ప్రయత్నాలు ఫలించనందు వల్ల శారీరక ఇబ్బందులు కలిగించే వారు. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్ర్ లో నమాజ్ చేస్తుండగా ఉఖ్బా బిన్ అబీ ముఈత్ వచ్చాడు. తన వద్ద ఉన్న దుప్పటిని ప్రవక్త మెడలో వేసి గొంతును మెలివేశాడు. అందువల్ల ఆయన గొంతు బాగా బిగుసుకు పోయింది. అంతలో అబూ బక్ర్ రజియల్లాహు అన్హు పరుగెత్తుకుంటూ వచ్చి ఉఖబా భూజాన్ని పట్టి తోసేసారు. మళ్ళీ ఖుర్ఆనులోని ఈ ఆయతు చదివారుః {ఒక వ్యక్తి తన ప్రభువు అల్లాహ్ అని అన్నంత మాత్రాన మీరు అతణ్ణి హతమారుస్తారా?}.
ఒక రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాబా వద్ద నమాజు చేస్తున్నారు. అబూ జహల్, వాని మిత్రులు కాబా ప్రాంగణంలో కూర్చొని యున్నారు. అబూ జహల్ మాట్లాడుతూః ఫలానా ఇంట్లో ఈ రోజు ఒంటె ను కోశారు, ఎవరు పోయి దాని పొట్ట, జీర్ణాశయం మరియు ప్రేగులను తీసుకువచ్చి, ముహమ్మద్ సజ్దాలో పోయినప్పుడు అతని వీపు మీద వేస్తాడు అని పురిగోల్పాడు. వారిలోని పరమ దుర్మార్గుడొకడు (ఉఖ్బా బిన్ అబూ ముఈత్) దిగ్గున లేచాడు. దాన్ని తీసుకొచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలో పోగానే ఆయన భుజాల మధ్య వీపుపై పెట్టేశాడు. ఇక అవిశ్వాసులు ఒకరిపై ఒకరు పడిపోతూ విరగబడి నవ్వసాగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలోనే ఉండిపోయారు. తల పైకి లేపలేక పోయారు. చివరికి ఆయన కూతురు ఫాతిమా రజియల్లాహు అన్హా వచ్చింది. వీపుపై నుండి దాన్ని తొలగించింది.
ఒక రోజు అబూ జహల్ అన్నాడుః ముహమ్మద్ ను నేను నమాజు చేస్తూ చూశానా (అతను సజ్దాలో పోయినప్పుడు) అతని మెడ మీద కాలు పెట్టి తొక్కుతాను అతని మూతి మీద మట్టి విసురుతాను. వాడనుకున్నట్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేయుటకు వచ్చారు. వచ్చిరాగానే నమాజు మొదలుపెట్టారు. మెడను కాలుతో తొక్కాలని నిశ్చయించుకున్నవాడు, తన మీద చేయబడుతున్న దాడి నుండి తన్నుతాను కాపాడుకొంటున్నట్లు రెండు చేతులు మీదికి ఎత్తి టక్కున వెనక్కి తిరగాడు. నీకెమయింది అబుల్ హకం అని వారు అడుగుతే నాకు మరియు ముహమ్మదుకు మధ్య ఒక అగ్ని కందకము ఉండినది. (నేను ఏ కొంచం ముందుకు వెళ్ళినా దానికి ఆహుతి అయి పోయేవాణ్ణి అని చెప్పాడు).
6. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులను బాధించడం: ప్రవక్త సల్లల్లాహ అలైహి వసల్లం సహచరులను బాధ కలిగించే, వారిని కఠినంగా శిక్షించేవారు. కొందరు బలహీన బానిసలను త్రాళ్ళతో కట్టి మండే ఎండలో వదిలేసేవారు. ఇంకెన్నో విధాలుగా పీడించేవారు.
అమ్మార్ రజియల్లాహు అన్హు మరియు అతని తల్లదండ్రిని నానారకాలుగా శిక్షించారు. చివరికి అతని తల్లిని ఘోరమైన విధంగా హత్య చేశారు. అతని తండ్రి కూడా అనేక రకాల శిక్షలను భరించలేక ప్రాణం కోల్పోయాడు. వారు ఖబ్బాబ్ బిన్ అరత్త్ రజియల్లాహు అన్హు యొక్క వెంట్రుకలు పట్టి లాగేవారు. అతని మెడను వడిబెట్టేవారు. మండుటెండలో దగదగ మండే పెద్ద బండపై పరుండబెట్టి దాని వెడిని భరించక కదలకుండా ఛాతిపై మరో పెద్ద బండ పెట్టేవారు. అలాగే ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించినప్పుడు అతనిపై కూడా దౌర్జన్యం చేసి అతని హత్యాయత్నం చేశారు.
ముస్లిముల పట్ల ఖురైషుల తలబిరుసుతనం, హింసా దౌర్జన్యాలు, వారిని అణచివేసే ప్రయత్నాలు మితిమీరుతున్నందు వల్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాయిఫ్ ప్రయాణం చేస్తే బావుంటుందని ఆలోచించారు. అల్లాహ్ వారికి ఇస్లాం భాగ్యం ప్రసాదించవచ్చు. అయితే తాయిఫ్ ప్రయాణం సులభమేమీ కాదు. తాయిఫ్ చుట్టూ ఎత్తయినా పర్వతాలు, వాటి మధ్యలో చిక్కు దారిన ప్రయాణించడం చాలా కష్టం. అయినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాహసించి అక్కడికి చేరుకున్నారు. తాయిఫ్ వాసుల ఎదురుకోలు, వారి సమాధానం మంచి విధంగా లేకుండింది. వారు ఆయన మాటను ఆలకించకనే తరిమివేశారు. అంతే కాదు, తుంటరి కుర్రగాళ్ళను ప్రేరేపించారు, ప్రవక్త తిరిగి వెళ్తున్నప్పుడు వారు ఆయనపై రాళ్ళు రువ్వారు. దాని వల్ల ఆయన ఒళ్ళంతా రక్తసిక్తమయి, అది పాదరక్షల్లో నిలిచిపోయి చెప్పులు తీయడం కష్టమైంది. ప్రవక్తగారు కుంగిపోయి, దుఃఖిస్తూ(1) తిరిగి మక్కా వెళ్తుండగా జిబ్రీల్ అలైహిస్సలాం, పర్వతాల దూతతో ఎదురయి, ” మీ ఇష్ట ప్రకారం అతనికి ఆదేశించుటకు అల్లాహ్ మీ వైపు పర్వతాల దూతను పంపాడు” అని చెప్పాడు.
అప్పుడు పర్వతాల దూత మాట్లాడుతూః “ఓ ముహమ్మద్! నీవు ఇష్టపడితే (మక్కాను ఆవరించుకొని ఉన్న) ఈ రెండు కొండల్ని వారిపై పడవేస్తాను” అని చెప్పాడు. కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “వద్దు, వీరుగాకున్నా వీరి సంతానంలో కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించి ఆయనతో ఎవరినీ సాటి కల్పించని వారిని అల్లాహ్ పుట్టిస్తాడని నాకు ఆశవుంది”.
[1] వారి దుష్పవర్తన వల్ల కాదు, ఇస్లాం స్వీకరించనందుకు
ముష్రికుల వ్యెతిరేకత, పోరాటాల్లో ఒక రకం; ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను లొంగదీయాలన్న ఉద్దేశ్యంతో మహిమలు కోరడం. అనేకసార్లు వారు మహిమలు చూపమని కోరారు. అయితే ఒకసారి చంద్రుణ్ణి రెండు ముక్కలుగా చేసి చూపించాలని కోరారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ తో వేడుకున్నారు. అల్లాహ్ వారికి ఈ మహిమ చూపించాడు. ఖురైషులు చంద్రుని రెండు ముక్కల్ని వేరు వేరుగా చూశారు. చాలా సేపటి వరకు చూశారు. అయినా ఇస్లాం స్వీకరించలేదు. ముహమ్మద్ – సల్లల్లాహు అలైహి వసల్లం- మాపై మంత్రం చేశాడని వదంతి లేపారు. వారిలోని ఒక మనిషి వారికి ఇలా చెప్పాడుః ముహమ్మద్ మంత్రం చేసియుంటే అందరిపై చేయలేడు కదా, అయితే వేచించండి, ఏదైనా బిడారము వస్తే వారిని అడగవచ్చు, అంతలోనే ఒక బిడారము వచ్చింది. వారిని ప్రశ్నించారు. అవును మేము చూశామని వారు చెప్పారు. అయినా ఖురైషులు మొండివైఖరి అవలంభించి తమ అవిశ్వాసంపైనే ఉండిపోయారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పెదనాన్న అబూ తాలిబ్ మరియు పవిత్ర సతీమణి ఖదీజ రజియల్లాహు అన్హాల మరణం, తాయిఫ్ నుండి తిరుగు ప్రయాణంలో జరిగిన సంఘటన, ఆ తరువాత ఖురైషుల హింసాదౌర్జన్యాల హెచ్చింపు ఇవన్నీ ఒకటెనుకొకటి సంభవించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేక రకాల బాధలు అనుభవిస్తున్న సందర్భంలో అల్లాహ్ వైపు నుండి ఆయన మనసుకు నెమ్మది, తృప్తి, శాంతి ప్రసాదించబడే రోజు ఆసన్నమయింది. ఆ రోజు రాత్రి ప్రవక్త ﷺ నిద్రిస్తున్న
[1] మక్కా నుండి బైతుల్ మఖ్దిస్ వరకు ప్రయాణాన్ని “ఇస్రా” అని, అక్కడి నుండి గగన ప్రయాణాన్ని “మేరాజ్” అని అంటారు.
వేళ జిబ్రీల్ అలైహిస్సలాం “బురాఖ్” తీసుకొని వచ్చారు. దాని పోలిక గుఱ్ఱం లాంటిది. దానికి రెండు రెక్కలు. మెరుపు లాంటి దాని వేగం. దానిపై ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను సవారి చేయించుకొని ఫాలస్తీనా దేశంలో బైతుల్ మఖ్దిస్ వెళ్ళారు. అక్కడి నుండి గగన ప్రయాణము చేసి పోషకుడైన అల్లాహ్ యొక్క చాలా నిదర్శనాలు చూశారు. అక్కడే ఐదు పూటల నమాజు విధి అయ్యింది. అదే రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశాంత హృదయంతో, దృఢ విశ్వాసంతో తిరిగి వచ్చారు. ఈ విషయాన్నే అల్లాహ్ ఇలా తెలిపాడుః
{కొన్ని నిదర్శనాలు చూపటానికి తన దాసుణ్ణి ఒక రాత్రి మస్జిదె హరాం నుండి మస్జిదె అఖ్సా వద్దకు తీసుకుపోయిన ఆయన పరిశుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభవంతం చేశాము. నిజానికి ఆయనే అన్నీ వినేవాడూ, అన్నీ చూసేవాడునూ}. (బనీ ఇస్రాయీల్ 17: 1).
ఉదయం కాబా వద్దకు వచ్చి, రాత్రి జరిగిన సంఘటన ప్రజల ముందు చెప్పగా అవిశ్వాసులు పరిహసించి, ఘోరంగా తిరస్కరించారు. కొందరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను లొంగదీయాలనే ఉద్దేశంతో బైతుల్ మఖ్దిస్ గురించి వర్ణించవలసినదిగా కోరారు. ప్రవక్త దానిలోని ఒక్కొక్క వస్తువును గురించి వివరించారు. ఇంతటి సూక్ష్మమైన వర్ణనతో ముష్రికులు తృప్తి చెందక మరో నిదర్శన అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నేను దారిలో ఒక బిడారాన్ని చూశాను. అది మక్కా వైపు వస్తుంద”ని చెప్పి, వారి ఒంటెల సంఖ్య, వారు ఇక్కడికి చేరుకునే సమయంతో సహా అన్ని వివరాలిచ్చారు. ప్రవక్త మాట / సూచన నూటికి నూరు పాల్లు నిజం అయింది. కాని అవిశ్వాసులు సత్యపరిచేకి బదులుగా, సత్యతిరస్కారం, తలబిరుసుతనంలోనే ఉండిపొయ్యారు.
ఇస్రా మరియు మేరాజ్ తరువాత రోజు జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త వద్దకు వచ్చి, ఐదు నమాజుల విధానం, వాటి సమయాలు తెలియజేశారు. అంతకు ముందు ఉదయం రెండు రకాతులు, సాయంకాలం రెండు రకాతుల నమాజు మాత్రమే ఉండినది.
ఖురైషుల పోరు రోజురోజుకు పెర్గుతూ పోతుంది. వారు సత్యం నుండి దూరమే అవుతున్నారు. ఆ సమయాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇతర ప్రాంతాల నుండి మక్కా వచ్చేవారికి ఇస్లాం ధర్మాన్ని తెలుపడంపై ఎక్కువ దృష్టి సారించారు. వారి నివాసాల్లో, వారు మజిలి చేసే చోట వారితో కలసి క్లుప్తంగా ఇస్లాం గురించి వివరించేవారు. ప్రవక్త పిన తండ్రి అబూ లహబ్ ఆయన -ﷺ- వెంట తిరుగుతూ ఆయన గురించి, ఆయన ప్రచారం గురించి ప్రజల్ని బెదిరించేవాడు.
ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీన నుండి వచ్చి మజిలి చేసిన కొందరితో కలిసి వారిని అల్లాహ్ వైపు పిలిచారు. వారు ఆయన మాటలను శ్రద్ధగా విని, ఆయన్ను విశ్వసించి, అనుసరిస్తామని వారు ఏకీభవించారు. అయితే ఒక ప్రవక్త రానున్నాడు, అతని ఆగమన కాలం సమీపించిందని వారు ఇంతకు ముందే యూదులతో వినేవారు. ఎప్పుడైతే ప్రవక్త వారికి ఇస్లాం బోధ చేశారో, యూదులు చెప్పే మాట గుర్తొచ్చి, ఆ ప్రవక్త ఈయనే అని తెలుసుకొని, ఈయన్ని విశ్వసించడంలో యూదులు మనకంటే ముందంజం వేయకూడదని వారు పరస్పరం అనుకొని తొందరగా విశ్వసించారు. వారు ఆరుగురు. ఆ తరువాత సంవత్సరం పన్నెండు మంది ప్రవక్తతో కలసి ఇస్లాం ధర్మ జ్ఞానం నేర్చుకున్నారు. వారు తిరిగి మదీన వెళ్ళేటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్అబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు అన్హును వారితో పంపారు. అతను వారికి ఖుర్ఆన్ నేర్పాలని మరియు ఇస్లాం ధర్మాదేశాలు బోధించాలని. అతను అక్కడి సమాజంపై మంచి ప్రభావం వేయగలిగారు. అంటే మదీనవాసులు అతని ప్రచారం పట్ల ఆకర్శితులయ్యే విధంగా అతను అక్కడ ఉండి ఇస్లాం బోధించగలిగారు. ఒక సంవంత్సరం తర్వాత అతను మక్కా వచ్చేటప్పుడు తన వెంట 72 మంది పురుషులు, ఇద్దరు స్త్రీలు వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిశారు. అల్లాహ్ ధర్మ సహాయానికి ఎల్లవేళల్లో సిద్ధమేనని వారు శపథం చేసి తిరిగి మదీన వెళ్ళిపోయారు.
మదీన పట్టణం ఇస్లాం మరియు ముస్లింలకు మంచి ఆశ్రయం, శాంతి స్థానంగా అయ్యింది. అక్కడికి మక్కా పీడిత ముస్లిముల హిజ్రత్(1) మొద లయ్యింది. ముస్లిములను హిజ్రత్ చేయనివ్వకూడదని ఖురైషు గట్టి పట్టు పట్టారు. హిజ్రత్ చేయబూనిన కొందరు ముస్లిములు నానా రకాల హింసా దౌర్జన్యాలకు గురయ్యారు. అందుకు ముస్లిములు రహస్యంగా హిజ్రత్ చేసేవారు. అబూ బక్ర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు ప్రవక్తతో అనుమతి కోరినప్పుడల్లా “తొందరపడకు, బహుశా అల్లాహ్ నీకొక ప్రయాణమిత్రుడు నొసంగవచ్చును” అని చెప్పేవారు. చివరికి చాలా మంది ముస్లిములు హిజ్రత్ చేశారు.
ముస్లిములు ఈ విధంగా హిజ్రత్ చేసి, మదీనలో వెళ్ళి స్థానం ఏర్పరుచుకుంటున్న విషయాన్ని చూసి ఖురైషులకు పిచ్చెక్కి పోయింది. అంతే కాదు, ముహమ్మద్ -ﷺ- ప్రతిష్ఠ, ఆయన ప్రచారం దినదినానికి వృద్ధి చెందుతున్నది చూసి వారు భయం చెందారు. అందుకని వారందరూ
1 హిజ్రత్ అంటే వలసపోవుట. అంటే తన స్వగ్రామంలో ఇస్లాం ధర్మ ప్రకారం జీవితం గడపడం కష్టతరమైతే, దాన్ని వదిలి వేరే ప్రాంతానికి ప్రయాణమగుట.
కలసి సమాలోచన చేసి ప్రవక్తను హతమార్చాలని ఏకీభవించారు. అబూ జహల్ ఇలా చెప్పాడుః మనం ప్రతి తెగ నుండి శక్తివంతుడైన ఒక యువకునికి కరవాలం ఇవ్వాలి. వారందరూ ముహమ్మదును ముట్టడించి, అందరు ఒకేసారి దాడి చేసి సంహరించాలి. అప్పుడు అతని హత్యానేరం అన్ని తెగలపై పడుతుంది. బనీ హాషిం అందరితో పగతీర్చుకొనుటకు సాహసించలేరు అని పథకం వేశారు. వారి ఈ పథకం, దురాలోచన గురించి అల్లాహ్ ప్రవక్తకు తెలియ జేశాడు. అల్లాహ్ అనుమతిని అనుసరించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూ బక్ర్ రజియల్లాహు అన్హుతో హిజ్రత్ కొరకు సిద్ధమయ్యారు. అలీ రజియల్లాహు అన్హును పిలిచి, ఈ రాత్రి నీవు నా పడకపై నిద్రించు, (నీకు ఏ నష్టమూ కలగదు). చూసే వారికి నేనే నిద్రిస్తున్నానన్న భ్రమ కలుగుతుంది అని చెప్పారు.
అవిశ్వాసులు తమ పథకం ప్రకారం, ప్రవక్త ఇంటిని చుట్టుముట్టారు. అలీ రజియల్లాహు అన్హును నిద్రిస్తున్నది చూసి ముహమ్మద్ -సల్లల్లాహు అలైహి వసల్లం- అని భ్రమపడ్డారు. ఆయన బైటికి వచ్చిన వెంటనే ఒకే దాడిలో హత్య చేయాలని ఆయన రాక కొరకు ఎదిరి చూస్తున్నారు. వారు ముట్టడించి కాపుకాస్తున్న వేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మధ్య నుండి వెళ్ళారు. వారి తలలపై మన్ను విసురుతూ అక్కడి నుండి వెళ్ళారు. అల్లాహ్ వారి చూపులను పట్టుకున్నాడు. ప్రవక్త వారి ముందు నుండి దాటింది వారు గ్రహించలేక పోయారు. అక్కడి నుండి ప్రవక్త అబూ బక్ర్ రజియల్లాహు అన్హు వద్దకెళ్ళి, ఇద్దరూ కలసి సుమారు ఐదు మైళ్ళ దూరంలో ఉన్న సౌర్ గుహలో దాగి పోయారు. అటు ఖురైషు శక్తిశాలి యువకులు తెల్లారే వరకు నిరీక్షిస్తునే ఉండిపోయారు. తెల్లారిన తర్వాత ప్రవక్త పడక నుండి అలీ రజియల్లాహు అన్హు లేచి, వీరి చేతిలో చిక్కాడు. ప్రవక్త గురించి అడిగారు. అలీ రజియల్లాహు అన్హు ఏమీ చెప్ప లేదు. అతన్ని పట్టి లాగారు, కొట్టారు, కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు ఖురైషులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను వెతకడానికి అన్ని దిక్కులా అన్వేషీలను పంపారు. ఆయన్ని జీవనిర్జీవ ఏ స్థితిలో పట్టు కొచ్చినా, అతనికి 100 ఒంటెల బహుమాణం అని ప్రకటించారు. కొందరు అన్వేషీలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన మిత్రుడు ఉన్న గుహ వద్దకు చేరుకున్నారు. వారిలో ఏ ఒక్కడైనా వంగి తన పాదాల్ని చూసుకున్నా, వారిద్దర్ని చూసేవాడు. అందుకు అబూ బక్ర్ రజియల్లాహు అన్హు (ప్రవక్త పట్ల) కంగారు పడ్డారు. కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా ధైర్యం చెప్పారుః “అబూ బక్ర్! ఏ ఇద్దరికి తోడుగా మూడోవాడు అల్లాహ్ ఉన్నాడో వారి గురించి నీకు రందేమిటి. దిగులు పడకు అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు”. వాస్తవంగా వారు ఆ ఇద్దరిని చూడలేదు కూడా. మూడు రోజుల వరకు అదే గుహలో ఉండి, మదీనాకు బయలుదేరారు. దూర ప్రయాణం, మండే ఎండలో ప్రయాణం సాగుతూ రెండవ రోజు సాయంకాలం ఒక గుడారం నుండి వెళ్ళుచుండగా అక్కడ ఉమ్మె మఅబద్ పేరుగల స్త్రీ ఉండెను. నీ వద్ద తిను త్రాగటకు ఏమై నా ఉందా అని ఆమెతో అడిగారు. నా వద్ద ఏమీ లేదు. ఆ మూలన బలహీన మేక ఉంది. మందతో పాటు నడవలేకపోతుంది. దానిలో పేరుకు మాత్రం పాలు కూడా లేవు అని చెప్పింది. పిదప ఆమె అనుమతి మేరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ మేక వద్దకు వెళ్ళి దాని పొదుగును చెయితో తాకగానే అందులో పాలు వచ్చేశాయి. పెద్ద పాత్ర నిండ పాలు పితికారు. ఉమ్మె మఅబద్ మరీ ఆశ్చర్యంగా ఒక వైపు నిలుచుండి బిత్తర పోయింది. ఆ పాలు అందరూ కడుపు నిండా త్రాగారు. మరో సారి పాత్ర నిండా పితికి, ఉమ్మె మఅబద్ వద్ద వదిలి, ప్రయణమయ్యారు.
మదీనవాసులు ప్రతీ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఎదిరి చూస్తూ మదీన బైటికి వచ్చేవారు. ప్రవక్త మదీన చేరుకునే రోజు సంతోషం తో, స్వాగతం పలుకుతూ వచ్చారు. మదీన ప్రవేశంలో ఉన్న ఖుబాలో మజిలి చేశారు. అక్కడ నాలుగు రోజులున్నారు. మస్జిదె ఖుబా పునాది పెట్టారు. ఇది ఇస్లాంలో మొట్టిమొదటి మస్జిద్. ఐదవ రోజు మదీన వైపు బయలుదేరారు. అన్సారులో అనేక మంది ప్రవక్త ఆతిథ్య భాగ్యం తనకే దక్కాలని చాలా ప్రయత్నం చేసేవారు. అందుకని ప్రవక్త ఒంటె కళ్ళాన్ని పట్టుకునేవారు. అయితే ప్రవక్త వారికి ధన్యావాదాలు తెలుపుతూ, వద లండి! దానికి అల్లాహ్ ఆజ్ఞ అయిన చోటనే కూర్చుంటుంది అని చెప్పే వారు. అది అల్లాహ్ ఆజ్ఞ అయిన చోట కూర్చుంది. కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దిగలేదు. మళ్ళీ లేచీ కొంత దూరం నడిచింది. తిరిగి వచ్చి మొదటి ప్రాంతంలోనే కూర్చుంది. అప్పుడు ప్రవక్త దిగారు. అదే ప్రస్తుతం మస్జిదె నబవి ఉన్న చోటు. ప్రవక్త అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లా హు అన్హు వద్ద ఆతిథ్యం స్వీకరించారు. అటు అలీ రజియల్లాహు అన్హు ప్రవక్త వెళ్ళాక మూడు రోజులు మక్కాలో ఉండి, ఆ మధ్యలో ప్రవక్త వద్ద ఉన్న అమానతులు హక్కుదారులకు చెల్లించి మదీనకూ బయలు దేరాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుబాలో ఉండగా అక్కడికి వచ్చి కలుసుకున్నాడు.
ఒంటె కూర్చున్న స్థలాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాని యజమానుల నుండి ఖరీదు చేసి అక్కడ మస్జిద్ నిర్మించారు. ముహాజి రీన్ మరియు అన్సారుల(1) మధ్య సోదర బాంధవ్యం ఏర్పరిచారు. ఒక్కో ముహాజిరును ఒక్కో అన్సారుతో కలిపి ఇతడు నీ సోదరుడు తన సొమ్ము లో కూడా నీ భాగమని తెలిపారు. ముహాజిరులు అన్సారులు కలసి పని చేసుకోవడం మొదలెట్టారు. వారి మధ్య సోదర బాంధవ్యం మరీ గట్టిపడింది.
[1] మదీనకు వలస వచ్చిన వారిని ముహాజిరీన్ అంటారు. వారి సహాయం చేసిన మదీన వాసులను అన్సార్ అంటారు.
మదీనాలో ఇస్లాం విస్తృతం కావడం మొదలయింది. కొందరు యూదులు ఇస్లాం స్వీకరించారు. వారిలో ఒకరు అబ్దుల్లాహ్ బిన్ సలాం రజియల్లాహు అన్హు. ఇతను వారిలో ఒక పెద్ద పండితుడు. మరియు వారి పెద్ద నాయకుల్లో ఒకరు.
ముస్లిములు మక్కా నగరాన్ని వదలి వెళ్ళినప్పటికీ వారికి వ్యతిరేకంగా ముష్రికుల విరోధం, పోరాటం సమాప్తం కాలేదు. ఖురైషులకు మదీన యూదులతో ముందు నుండే సంబంధం ఉండెను. అయితే వారు దాన్ని ఉపయోగించి ముస్లిముల
మధ్యగల ఐక్యతను భంగం కలిగించాలని, తృప్తిగా ఉండనివ్వకుండా మనోవ్యదకు గురి చేయాలని యూదులను ప్రేరేపించేవారు. అంతే కాదు, వారు స్వయంగా ముస్లిములను బెదిరిస్తూ, అంతమొందిస్తామని హెచ్చరించేవారు. ఈ విధంగా ముస్లిములకు ముప్పు ఇరువైపులా చుట్టుముట్టింది. అంటే మదీన లోపల ఉన్నవారితో మరియు బైటి నుండి
ఖురైషులతో. సమస్య ఎంత గంభీరమైనదంటే సహాబాలు ఆయుధాలు తమ వెంట ఉంచుకొని రాత్రిళ్ళు గడిపేవారు. ఈ భయాందోళన సందర్భంలోనే అల్లాహ్ యుద్ధానికి అనుమ తించాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గస్తీ దళాల్ని తయారు చేసి పంప సాగారు. వారు చుట్టు ప్రక్కల్లో శత్రువులపై దృష్టి ఉంచేవారు. ఒక్కోసారి వారి వ్యాపార బృంధాలను అడ్డుకునేవారు. వీటి ఉద్దేశం: ముస్లిములు అశక్తులు కారు అని తెలియజేయుటకు, వారిపై ఒత్తిడి చేయుటకు, ఇలా వారు సంధికి దిగి వచ్చి, ముస్లిములు స్వేచ్ఛగా ఇస్లాంపై ఆచరిస్తూ, దాని ప్రచారం చేసుకోవడంలో వారు అడ్డు పడకూడదని. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టుప్రక్కలో ఉన్న తెగలవారితో ఒప్పందం, ఒడంబడికలు కుదుర్చుకున్నారు.
ముస్లిములు మక్కాలో ఉన్నప్పుడు ముష్రికులు వారిని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసి చివరికి తమ స్వస్థలాన్ని వదలి వలస వెళ్ళే స్థితికి తీసుకొచ్చారు (అన్న విషయం తెలిసినదే). అందువల్ల వారు తమ జన్మస్థలాన్ని, తమ ధనాన్ని మరియు తమవారిని వదలి మదీనా వచ్చారు. అప్పుడు ముష్రికులు వారి ధనాన్ని ఆక్రమించుకున్నారు. అంతేకాదు ఇటు మదీనా వాసులపై దొంగ దాడులు చేస్తూ తృప్తిగా ఉండకుడాం చేయసాగారు.
అందుకే ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సీరియా నుండి వస్తున్న ఖురైషు వాణిజ్య బృందాన్ని అడ్డుకొని, వారిని అదుపులో మరియు భయంలో ఉంచాలని నిశ్చయించి, 313 మంది సహాబాలతో కలసి వెళ్ళారు. అప్పుడు వారి వద్ద రెండు గుఱ్ఱాలు, 70 ఒంటెలు మాత్రమే ఉన్నాయి. ఖురైషు బృందంలో 1000 ఒంటెలున్నాయి. 40 మంది ఉన్నారు. అబూ సుఫ్యాన్ వారికి నాయకత్వం వహిస్తున్నాడు. కాని మస్లిములు అడ్డుకునే విషయాన్ని అబూ సుఫ్యాన్ గ్రహించి, ఈ వార్త మక్కా పంపుతూ, వారితో సహాయం కోరాడు. అంతే కాదు, అతడు తన బృందంతో ప్రధాన రహదారిని వదిలేసి వేరే దొడ్డిదారి గుండా వెళ్ళిపోయాడు. ముస్లిములు వారిని పట్టుకోలేక పోయారు. అటు వార్త తెలిసిన మక్కా ఖురైషులు, 1000 యుద్ధవీరులతో పెద్ద సైన్యం తయారు చేసుకొని బయలుదేరారు. వీరు దారిలో ఉండగానే అబూ సుఫ్యాన్ రాయబారి వచ్చి, వాణిజ్య బృందం ముస్లిముల నుండి తప్పించుకొని, క్షేమంగా చేరుకోనుంది. మీరు తిరిగి మక్కా వచ్చేసెయ్యండి అని చెప్పాడు. కాని అబూ జహల్ నిరాకరించాడు. తిరిగి మక్కా పోవడానికి ఒప్పుకోలేదు. ప్రయాణం ముందుకు సాగిస్తూ బద్ర్ వైపు వెళ్ళాడు.
ఖురైషు సైన్యం బయలుదేరిన విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిసిన తర్వాత తమ సహచరులతో సమాలోచన చేశారు. అందరూ అవిశ్వాసులతో పోరాడుటకు సిద్ధమేనని ఏకీభవించారు. రెండవ హిజ్రి శకం, రమజాను మాసములోని ఒక రోజు రెండు సైన్యాలు పోరాటానికి దిగాయి. ఇరువురి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ముస్లింలు విజయం పొందారు. వీరిలో 14 మంది సహాబాలు షహీదు (అమరవీరు) లయ్యారు. ముష్రికుల్లో 70 మంది వధించబడగా, మరో 70 మంది ఖైదీలయ్యారు.
ఈ యుద్ధ సందర్భంలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూతురు, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు సతీమణి రుఖయ్యా రజియల్లాహు అన్హా మరణించారు. అందుకే ఉస్మాన్ రజియల్లాహు ఈ యుద్ధం లో పాల్గొన లేకపో యాడు. ప్రవక్త ఆదేశమేరకు అతను తన అనారోగ్యంగా ఉన్న భార్య సేవలో మదీనలోనే ఉండిపోయాడు. ఈ యుద్ధం తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ రెండవ కూతురు ఉమ్మె కుల్సూమ్ రజియల్లాహు అన్హా వివాహం ఉస్మాన్ రజియ ల్లాహు అన్హుతో చేశారు. అందుకే అతను జిన్నూరైన్ అన్న బిరుదు పొందాడు. అంటే రెండు కాంతులు గలవాడు అని.
బద్ర్ యుద్ధంలో ముస్లిములు అల్లాహ్ సహాయంతో విజయం సాధించి, ముష్రికుఖైదీలతో మరియు విజయధనంతో సంతోషంగా తిరిగి మదీన వచ్చారు. ఖైదీల్లో కొందరు పరిహారం చెల్లించి విడుదలయ్యారు. మరి కొందరు ఏ పరిహారం లేకుండానే విడుదలయ్యారు. ఇంకొందరి పరిహారం; ముస్లిం పిలవాళ్ళకు చదువు నేర్పడం నిర్ణయమయింది. వారు ఇలా విడుదలయ్యారు.
ఈ యుద్ధంలో ముష్రికుల పేరుగాంచిన నాయకులు, ఇస్లాం బద్ధశత్రువులు హతమయ్యారు. వారిలో అబూ జహల్, ఉమయ్య బిన్ ఖల్ఫ్, ఉత్బా బిన్ రబీఆ మరియు షైబా బిన్ రబీఆ వైగారాలు.
బద్ర్ యుద్ధంలో ముష్రికులు ఓడిపోయిన తర్వాత, ఒకరోజు ఉమైర్ బిన్ వహబ్, సఫ్వాన్ బిన్ ఉమయ్యతో ఓ సమావేశం జరిపాడు. ఉమైర్ బిన్ వహబ్ ఖురైష్ లోని షైతానుల్లో ఒకడు. ప్రవక్తను, ఆయన సహచరుల్ని చాలా బాధ కలిగించేవాడు. అతని కొడుకు వహబ్ బద్ర్ యుద్ధంలో ముస్లిముల చేతిలో బంధిగా అయిపోయాడు.
మాట సందర్భంలో సఫ్వాన్ ముష్రికుల హతుల గురించి ప్రస్తావిస్తూ ‘అల్లాహ్ సాక్షిగా! వారి తర్వాత జీవితంలో ఏ సుఖం లేదు’ అని అన్నాడు. అప్పుడు ఉమైర్ అన్నాడుః ‘నిజం! అల్లాహ్ సాక్షిగా! నా మీద అప్పు ఉంది. దాన్ని తేర్చడానికి నా వద్ద ఏమీ లేదు. ఇంకా పిల్లలున్నారు, వారిని చూసేవాడు ఉండడు అని భయం ఉంది. ఈ ఆటంకాలు గనక లేకుంటే ముహమ్మద్ వరకు చేరుకొని అతని హత్య చేసేవాడ్ని నేను’.
సఫ్వాన్ ఈ అవకాశాన్ని అదృష్టంగా భావించి, ‘నీ అప్పు బాధ్యత నేను తీసుకుంటాను. నీ సంతానాన్ని వారున్నంత వరకు నా సంతానంగా చూసుకుంటాను’ అని అన్నాడు. ఉమైర్ అన్నాడుః అట్లైతే ఈ విషయం నీవు, నేను తప్ప మరే వ్యక్తికీ తెలియకూడదు. అతడన్నాడుః సరే.
ఇక ఉమైర్ అక్కడి నుండి వెళ్ళి తన కరవాలానికి విషముతో సానం పట్టి మదీనకు పయనమయ్యాడు. అక్కడికి చేరుకొని, మస్జిదె నబవి బయట తన ఒంటెను కూర్చోబెడుతున్న, కరవాలం ధరించి ఉన్న ఉమైర్ ను, పరస్పరం సంభాషించుకుంటున్న ముస్లిముల ఓ గుంపు మధ్యలో ఉన్న ఉమర్ రజియల్లాహు అన్హు పసిగట్టి, ‘ఇదిగో అల్లాహ్ యొక్క కరడుగట్టిన శత్రువు ఉమైర్ బిన్ వహబ్ ఏదో కీడు పూనుకొనే వస్తున్నాడు’ అని అన్నాడు.ఉమర్ వెంటనే ప్రవక్త వద్దకు వెళ్ళి ‘దైవప్రవక్తా! ఇదిగో అల్లాహ్ యొక్క శత్రువు ఉమైర్ బిన్ వహబ్ కరవాలం ధరించి వచ్చాడు’ అని తెలియజేశాడు. ప్రవక్త చెప్పారుః “అతడ్ని రానివ్వు”.
ఉమర్ అతడ్ని ప్రవక్త వద్దకు ప్రవేశింపజేశాడు. ఉమర్ అతడ్ని గట్టిగా పట్టుకున్నది చూసిన ప్రవక్త “ఉమర్ అతడ్ని వదలు” అని ఆదేశించి, “నా దగ్గరికి రా ఉమైర్” అని పిలిచారు. అతడు దగ్గరికయ్యాక, “ఏ ఉద్దేశ్యంతో వచ్చావు ఉమైర్?” అని అడిగారు. ‘మీ చేతికి చిక్కిన మా ఖైదీల గురించి వచ్చాను. వారి పట్ల ఉత్తమ రీతిలో ప్రవర్తించండి’ అని చెప్పాడు. “నీవు ఎందు గురించి వచ్చావో నిజం చెప్పు” అని ప్రవక్త కోరారు. అయినా అతడు ‘ఏమీ లేదు, వారి గురించే వచ్చాను’ అని చెప్పాడు.
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం చెప్పారుః “కాదు, (అంటే నీవు చెప్పేది నిజం కాదు). నీవు మరియు సఫ్వాన్ బిన్ ఉమయ్య ఓ చోట కూర్చొని బద్ర్ హతులను గుర్తు చేశారు. అప్పుడు నీవు అన్నావుః నాకు గనక అప్పు మరియు నా సంతాన భయం లేకుంటే నేను ముహమ్మద్ ను హతమార్చేవాడిని, అప్పుడు సఫ్వాన్ బిన్ ఉమయ్య నీ అప్పు మరియు నీ సంతాన బాధ్యత తీసుకున్నాడు. దీనికి బదులుగా నీవు నన్ను హతమార్చాలని అని. కాని నీకు మరియు నీ ఈ ఉద్దేశ్యానికి మధ్య అల్లాహ్ అడ్డు పడ్డాడు”.
ప్రవక్త నోట ఈ మాట విన్న వెంటనే ఉమైర్ “అష్ హదు అన్నక రసూలుల్లాహ్” (నిస్సందేహంగా మీరు అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను) అని పలికి, ప్రవక్తా! మీకు ఆకాశం నుండి వచ్చే విషయాలను మరియు మీపై అవతరింపజేయబడే వహీ (దివ్యావిష్కృతి)ని మేము తిరస్కరించేవారము. అయితే ఈ (మీ హత్యాయత్న) విషయం మాట్లాడుకునేటప్పుడు నేను మరియు సఫ్వాన్ తప్ప మరెవ్వరూ లేరు. అల్లాహ్ సాక్షిగా! ఈ విషయం మీకు అల్లాహ్ తప్ప మరెవ్వరూ తెలుపలేదు. అల్లాహ్ కే సర్వ స్తోత్రములు, అతడు నాకు సన్మార్గం చూపాడు. అందుకని ఇక్కడికి తీసుకొచ్చాడు’ అని సత్య సాక్ష్యం పలికాడు.
అప్పుడు ప్రవక్త చెప్పారుః “మీ సోదరునికి ధర్మ విషయాలు నేర్పండి, ఖుర్ఆన్ నేర్పించండి. అతని ఖైదీని విడుదల చెయ్యండి”. సహచరులు అలాగే చేశారు. ఆ తర్వాత ఉమైర్ అన్నాడుః ‘ప్రవక్తా! ఇస్లాంకు వ్యతిరేకంగా పోరాడడంలో తీవ్ర ప్రయత్నం చేశాను. అల్లాహ్ ధర్మంపై ఉన్నవారికి చాలా బాధ కలిగించాను. మీరు గనక అనుమతిస్తే మక్కా వెళ్ళి వారిని అల్లాహ్ మరియు అల్లాహ్ సత్య ప్రవక్త మరియు ఇస్లాం వైపునకు పిలుస్తానని కోరుతున్నాను. అల్లాహ్ వారికి కూడా సన్మార్గం చూపవచ్చు’.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి అనుమతి ఇచ్చాడు.
ఉమైర్ మదీన వెళ్ళిన తర్వాత సఫ్వాన్ ప్రజలకు ఇలా చెప్పేవాడుః ‘సంతోషించండి, బద్ర్ సంఘటనను మరిపించే ఓ శుభవార్త రానుంది’. అటునుండి వచ్చే బాటసారులను ఉమైర్ గురించి ఏదైనా వార్త ఉందా? అని అడిగేవాడు. అయితే ఒకసారి ఓ బాటసారి వచ్చి అతను ఇస్లాం స్వీకరించిన వార్త వినిపించాడు. ఈ వార్త విని అతనితో మాట్లడనని మరియు అతనికి ఎప్పుడూ ఏ లాభమూ చేకూర్చనని ప్రమాణం చేశాడు. అటు ఉమైర్ మక్కా చేరుకున్న తర్వాత అక్కడే ఉండి ప్రజల్ని ఇస్లాం వైపునకు పిలవడం మొదలెట్టాడు. అల్ హందులిల్లాహ్ అతని ద్వారా చాలా మంది ఇస్లాం స్వీకరించారు.
మరో సంఘటనః మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరులతో ఓ ప్రయాణం నుండి తిరిగి వస్తుండగా ఒక ప్రాంతంలో బస చేశారు. ప్రతి ఒక్కడు ఏదైనా చెట్టు నీడ గురించి వెతికి అక్కడ నిద్రించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఓ చెట్టు క్రింద మకాం వేశారు. దాని ఒక కొమ్మకు తమ కరవాలాన్ని వ్రేలాడదీసి, నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రవక్త నిద్ర ఉన్న సందర్భంలో ముందు నుండే గోప్యంగా వెంటాడుతున్న ఓ అవిశ్వాసుడు గుట్టచప్పుడు కాకుండా వచ్చాడు. నిద్రలో ఉన్న ప్రవక్త తలాపిన నిలబడ్డాడు. ప్రవక్త కరవాలాన్ని తీశాడు. దానిని ఒరలో నుండి బైటికి తీసి, ప్రవక్త తలపై దాన్ని లేపాడు. ‘ముహమ్మద్, ఇక నా నుండి నిన్ను అడ్డుకునేవాడెవడు?’ అని అన్నాడు. అప్పుడే ప్రవక్త కళ్ళు తెరచి చూసే సరికి నగ్న ఖడ్గం పైకి ఎత్తి ఉన్న వ్యక్తిపై దృష్టి పడింది. అయినా ఎంతో నెమ్మదిగా అతని ప్రశ్నకు సమాధానం ఇస్తూ, “అల్లాహ్” అని అన్నారు. అంతలోనే అతనిలో వనుకుడు మొదలయింది. ఖడ్గం అతని చేతి నుండి క్రింద పడిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖడ్గం తమ చేతులో తీసుకొని, నా నుండి నిన్ను ఎవరు అడ్డుకోగలడు? అని అడిగారు. అతడు తికమక చూస్తూ ఏమనలేక ‘ఎవడు లేడు’ అని అన్నాడు. అయినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడ్ని మన్నించారు. ఆ తర్వాత అతడు ఇస్లాం స్వీకరించాడు. మళ్ళీ తన జాతిలోకి వెళ్ళి ఇస్లాం ప్రచారం చేశాడు.
బద్ర్ యుద్ధం తర్వాత ఒక సంవత్సరానికి, మస్లిముల మరియు అవి- శ్వాసుల మధ్య ఈ యుద్ధం జరిగింది. బద్ర్ యుద్ధంలో ఓటమికి పాలైన అవిశ్వాసులు, ముస్లిములతో ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించు- కున్నారు. అందుకే ఈ సారి 3000 సైనికులతో బయలుదేరారు. వారితో పోరాడడానికి ముస్లిముల వైపు నుండి 700 మంది పాల్గొన్నారు. ప్రారంభ దశలో ముస్లిములే గెలుపొందారు. అవిశ్వాసులు మక్కా దారి పట్టారు. కాని వెంటనే మళ్ళీ తిరిగి వచ్చారు. కొండ వెనుక వైపు నుండి వచ్చి, ముస్లిములపై విరుచుకు పడ్డారు. ఇలా ఎందుకు జరిగిందంటేః అదే కొండపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొందరు విలుకాండ్రులను నియమించారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఆ స్థానాన్ని వదలకూడదని వారికి నొక్కి చెప్పారు. కాని వారు ముస్లిములు గెలుపొందినది, ముష్రికులు పారిపోవునది చూసి (యుద్ధం ముగిసిందన్న భ్రమలో పడి) విజయప్రాప్తి కోసం పరుగెత్తుకొచ్చారు. అందువల్ల ఆ స్థలం ఖాలీ అయిపోయింది. ఖురైషులకు మంచి అవకాశం లభించింది. కొండ వెనక నుండి తిరిగి దాని శిఖరంపై వచ్చి అక్కడి నుండి ముస్లిములపై దాడి చేశారు. అందుకే ఈ సారి ముష్రికులు గెలుపొందారు. ఈ యుద్ధంలో 70 మంది ముస్లిములు అమరవీరులయ్యారు. వారిలో ఒకరుః హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రజియల్లాహు అన్హు. ముష్రికుల వైపు నుండి 22 మంది చంపబడ్డారు.
ఉహద్ యుద్ధం తర్వాత కొద్ది రోజులకు మదీన యూదులు మక్కా వెళ్ళి ఖురైషుల్ని కలుసుకొని మీరు గనక మదీనా పై దాడి చేసి, ముస్లిములతో యుద్ధం చేస్తే ఈ సారి మేము (లోపల నుండి) మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వాగ్ధానం చేశారు. ఖురైషులు సంతోషంతో దీన్ని ఒప్పుకున్నారు. ఖురైషులు ఒప్పుకున్నాక ఇతర తెగవాళ్ళను కూడా పురికొలిపారు. వారు కూడా ఒప్పుకున్నారు. అరబ్బు దేశమంతటి నుండి యూదులు, ముష్రికులందరూ ఏకమై భారీ ఎత్తున మదీనా పై దండ యాత్రకు బయలుదేరారు. సుమారు పది వేల మంది సైనికులు మదీనా చుట్టు ప్రక్కన పోగు అయ్యారు.
శత్రువుల కదలిక గురించి ప్రవక్తకు వార్తలు అందుతున్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలతో సలహా కోరారు. అప్పుడు ఈరాన్ దేశస్తుడైన సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఖందకం త్రవ్వాలని సలహా ఇచ్చారు. మదీన రెండు వైపులా ఖర్జూరపు తోటలు, ఒక వైపు కొండ ఉండగా మరో వైపు ఏమీ అడ్డుగా లేనందు వల్ల అదే వైపు ఖందకం త్రవ్వడం ప్రారంభించారు. ముస్లిములందరూ ఇందులో పాల్గొని అతి తొందరగా దాన్ని పూర్తి చేశారు. ముష్రికులు ఖందకానికి ఆవల ఒక నెల వరకు ఉండిపోయారు. మదీనలో చొరబడటానికి ఏ సంధు దొరకలేదు. ఆ కందకాన్ని దాటలేక పోయారు. అల్లాహ్ అవిశ్వాసులపై ఒకసారి తీవ్రమైన గాలిదుమారాన్ని పంపాడు. దాని వల్ల వారి గుడారాలు ఎగిరిపోయాయి. వారిలో అల్లకల్లోలం చెలరేగి భయం జనించింది. క్షణం పాటు ఆగకుండా పారిపోవడంలోనే క్షేమం ఉంది అనుకొని పరిగెత్తారు. ఈ విధంగా అల్లాహ్ ఒక్కడే దాడి చేయుటకు వచ్చిన సైన్యాలను పరాజయానికి గురి చేసి, ముస్లిములకు సహాయ పడ్డాడు.
ముష్రికుల సైన్యాలు దారి పట్టిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “ఈ సంవత్సరం తర్వాత ఖురైష్ మీపై దాడి చేయరు. కాని మీరు వారి మీద దాడి చేస్తారు”. వాస్తవంగా ప్రవక్త చెప్పినట్లు ఖురైషు వైపు నుండి ఇదే చివరి దాడి అయ్యింది. (ఆ తర్వాత వారు ఎప్పుడు ముస్లింపై దాడి చేయుటకు సాహసించలేదు).
కందకం త్రవ్వే సందర్భంలో ముస్లిములు ఘోరమైన ఆకలికి గురి అయ్యారు. ఆకలి భరించలేక కడుపుపై రాళ్ళు కట్టుకోవలసి వచ్చింది. అప్పుడు జాబిన్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు కనీసం ప్రాణం కాపాడేంత పరిమాణంలోనైనా ప్రవక్తకు ఏదైనా తినిపించాలని కోరుకొని తన వద్ద ఉన్న ఓ చిన్న మేక పిల్లను కోశాడు. మాంసం తయారు చేసి భార్యకు ఇస్తూ దీని కూర వండి, అతితక్కవగా ఉన్న బార్లీ గింజల పిండితో రొట్టెలు చేసి పెట్టమని చెప్పాడు. వంట తయ్యారు అయ్యాక ప్రవక్త వద్దకు వెళ్ళి ‘మీకు మరో ఒక్కరికి లేదా ఇద్దరికి మాత్రమే సరిపడేంత భోజనం ఉంది’ అని తెలియజేశాడు. అప్పుడు ప్రవక్త “ఎక్కువగా ఉంది, మంచిగా ఉంది” అని కందకంలో పాల్గొన్న వారందరినీ పిలిచారు. మరియు స్వయంగా మాంసం ముక్కలు మరియు రొట్టెలు వడ్డించారు. అందరూ కడుపు నిండా తిన్నారు. అయినా ఆ భోజనం ఎవరి చేయి పెట్టనట్లుగా మిగిలింది. అప్పుడు వారు సుమారు వెయ్యి మంది ఉండిరి. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మహిమల్లో ఒకటి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ముస్లిములు మదీనకు వలస వచ్చినప్పటి నుండి, వారిని ఎన్నటికీ తిరిగి మక్కా రానివ్వకూడదని, మస్జిదె హరాం దర్శనం చేయనివ్వద్దని దృఢంగా ముష్రికులు నిశ్చయించుకున్నారు.
కాని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులు మక్కాకు పయనం కావాలని హిజ్రి శకం ఆరవ ఏట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిశ్చయించారు. వెళ్ళడానికి జిల్ ఖాద నెల నిర్ణయమయింది. అది గౌరవపదమైన నెల అని, అందరూ దాన్ని గౌరవిస్తారనీ. ఉమ్రా ఉద్దేశ్యంతో బయలుదేరారు. యుద్ధ ఆదేశం ఏ మాత్రం లేకుండినది. 1400 మంది సహాబాలు ఇహ్రామ్ దుస్తులు ధరించి, బలివ్వడానికి ఒంటెలు తమ వెంట తీసుకెళ్ళారు. వాస్తవానికి వీరు కాబా దర్శనానికి, దానిని గౌరవార్థమే బయలుదేరారన్న నమ్మకం చూసేవారికి కలగలాని, ఖురైషువారు వీరిని మక్కాలో ప్రవేశం నుండి నిరోధించుటకు ఊహించనూ వద్దని ఆయుధాలు కూడా ధరించలేదు. కేవలం ప్రయానికులు తమ ఖడ్గఒరలో ఉంచుకునే ఆయుధం తప్ప.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖస్వా పేరుగల తమ ఒంటెపై పయనమయ్యారు. సహచరులు ఆయన వెనక ఉన్నారు. మదీనవాసుల మీఖాత్ జుల్ హులైఫా చేరుకున్నాక, అందరూ బిగ్గరగా తల్బియా చదువుతూ ఉమ్రా యొక్క ఇహ్రామ్ సంకల్పం చేశారు. వాస్తవానికి కాబా దర్శన హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంది. దాని దర్శనం మరియు ప్రదక్షిణం నుండి నిరోధించే హక్కు అప్పటి ఆచారం (దస్తూర్, ఖానూన్) ప్రకారం కూడా ఖురైషుకు ఏ మాత్రం లేదు. వారి శత్రువైనా సరే, అతడు కాబా గౌరవ ఉద్దేశ్యంతో వస్తే అతడ్ని ఆపవద్దు.
కాని ముస్లిములు మక్కా ఉద్దేశ్యంతో బయలుదేరారని విన్న వెంటనే ముష్రికులు యుద్ధానికై సిద్ధమయ్యారు. వారికి ఎంత కష్టతరమైన సరే ప్రవక్తను మక్కాలో రానివ్వకూడదని దృఢంగా నిర్ణయించుకున్నారు. వారి ఈ చేష్ట, వారు ముస్లిముల పట్ల శత్రుత్వంగా, దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నా- రనడానికి మరియు వారికి లభించవలసిన హక్కుల నుండి వారిని దూరం చేస్తున్నారు అనడానిక గొప్ప నిదర్శనం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బిడారం నడుస్తూ నడుస్తూ మక్కాకు సమీపములో చేరుకుంది. కాని ఖురైషువారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల్ని మక్కాలో ప్రవేశించకుండా, కాబా ప్రదక్షిణం చేయకుండా నిరోధిస్తునే ఉన్నారు.
ప్రవక్తతో సంధి చేసుకొని ఏదో ఓ కొలికికి రావాలని రాయబార వ్యవహారాలు మొదలయ్యాయి. ఇరు పక్షాల్లో (అంటే ముస్లిముల మరియు మక్కాలోని ముష్రికుల మధ్య) అనేక రాయబార బృందాలు వస్తూ పోయాయి. ఈ మధ్యలో ఖురైష్ యువకుల్లో నలబై మంది హఠాత్తుగా ముస్లిములపై విరుచుకుపడి వారిలో కొందరిని చంపుదాము అని అనుకున్నారు. కాని ముస్లిములు వారిని పట్టుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం వద్దకు తీసుకువచ్చారు. అయితే ప్రవక్త వారితో ఏ ప్రతికార చర్యకు పాల్పడకుండా వారిని వారి దారిన వదిలేసి వారిని మన్నించారు.
ఆ తర్వాత ప్రవక్త -ﷺ- ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హుని రాయబారిగా ఖురైష్ నాయకుల వద్దకు పంపి, మేము యుద్ధానికి కాదు వచ్చింది. కేవలం అల్లాహ్ గృహ దర్శనం, దాని గౌరవార్థం వచ్చాము అని తెలియజేశారు. ఉస్మాన్ మరియు ఖురైషుల మధ్య సంధి కుదరలేదు. అంతే గాకుండా వారు ఉస్మాన్ ని పోనివ్వకుండా తమ వద్దే నిర్బంధించారు. అందువల్ల ఉస్మాన్ హత్యకు గురయ్యాడు అన్న పుకారు పుట్టింది. ప్రవక్త -ﷺ-కు ఈ విషయం తెలిసిన వెంటనే “ఉస్మాన్ హత్యకు ప్రతీకారం తీర్చుకోకుండా ఇక్కడి నుండి కదిలేది లేదు” అని స్పష్టం చేసి, దీనికై ఎవరు సిద్ధంగా ఉన్నారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరితో శపథం తీసుకున్నారు. అప్పుడు తమ ఒక చేతిని ఉస్మాన్ చేతిగా పరిగణించి తమ రెండవ చేయిని దానిపై కొట్టి శపథం చేశారు. ఈ శపథం “బైఅతుర్ రిజ్వాన్” అన్న పేరు పొందింది. ఓ చెట్టు క్రింద జరిగింది. ప్రవక్తగారు సహచరులతో చేసిన శపథం ఇలా ఉండిందిః ఉస్మాన్ కు వాస్తవంగా ఏదైనా కీడు జరిగింది అని తెలిస్తే గనక మీలో ఏ ఒక్కరూ పారిపోకుండా ముష్రికులతో పోరాడనిదే ఈ స్థలాన్ని వదలేది లేదు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిసిన వార్త ఏమిటంటే ఉస్మాన్ క్షేమంగానే ఉన్నారు. హత్య చేయబడలేదు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిములతో యుద్ధానికి సిద్ధమన్నట్లు శపథం చేశారని తెలిసిన వెంటనే సుహైల్ బిన్ అమ్ర్ ను దౌత్యవేత్తగా పంపారు. అతను ప్రవక్తతో కూర్చుండి; ముస్లిములు ఈ సారి తిరిగి వెళ్ళిపోవాలని మరియు వచ్చే సంవత్సరం ఎప్పుడైనా రావచ్చనే విషయంపై సంధి కుదిర్చే ప్రయత్నం చేశాడు. సంధి కుదిరింది. ప్రవక్త కూడా సంధి ఒప్పంద నిబంధనలను అంగీకరించారు. ఈ నిబంధనలు బాహ్యంగా ముష్రికుల పక్షంలో వారికి మాత్రమే అనుకూలమైనవిగా ఉండెను. అందుకే ముస్లిములు మండిపడ్డారు. వారి దృష్టిలో అవి అన్యాయం, దౌర్జన్యంతో కూడి ఉన్న నిబంధనలని. ముష్రికులకు అనుకూలమైనవిగా ఉన్నాయని అనిపించింది. కాని ప్రవక్త సంధి కుదరాలనే కోరేవారు. ఎందకుంటే ఇస్లాం ప్రశాంత వాతవరణంలో వ్యాపిస్తూ ఉంటే అనేక మంది ఇస్లాంలో ప్రవేశించవచ్చు అన్న విషయం ప్రవక్తకు తెలుసు. వాస్తవానికి జరిగింది కూడా ఇదే. ఈ యుద్ధవిరమణ కాలంలో ఇస్లాం విస్తృతంగా వ్యాపించింది.
అంతే కాదు, వాస్తవానికి ముస్లిముల మరియు ఖురైష్ ల మధ్య జరిగిన ఈ యుద్ధవిరమణ సంధి ఇస్లాం మరియు ముస్లిముల పాలిట గొప్ప సహాయంగా నిలిచింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవజ్యోతితో చూస్తూ ఉన్నారని కుడా ఈ సంఘటన గొప్ప నిదర్శనంగా నిలిచింది. ఎలా అనగ నిబంధనలన్నిటీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంగీకరిస్తూ పోయారు. అదే సందర్భంలో కొందరి సహచరులకు అవి బాహ్యంగా ముష్రికులకు అనుకూలంగా కనబడినవి.
హిజ్రి శకం ఎనిమిదవ ఏట (ముష్రిక్కులు తాము చేసిన వాగ్దానానికి వ్యెతిరేకం వహించినందుకు) మక్కాపై దాడి చేసి, జయించాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిర్ణయించారు. రమజాన్ 10వ తారీకున 10 వేల వీరులతో బయలుదేరారు. ఏలాంటి పోరాటం, రక్తపాతం లేకుండా మక్కాలో ప్రవేశించారు. ఈ ప్రవేశం చారిత్రకమైనది. చెప్పుకోదగ్గది. ఖురైషులు తమ ఇష్టానుసారం లొంగిపోయారు. అల్లాహ్ ముస్లిములకు సహాయపడ్డాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదె హరాం వెళ్ళి కాబా యొక్క తవాఫ్ చేసి, కాబా లోపల, వెలుపల, పైన ఉన్న విగ్రహాల న్నిటిని తొలగించి దాని లోపల రెండు రకాతుల నమాజు చేశారు. తర్వాత కాబా గడపపై వచ్చి నిలుచున్నారు. ఖురైషులు గడప ముందు నిలబడి, ప్రవక్త వారి గురించి ఏ తీర్పు ఇస్తారు అని వేచిస్తున్నారు. ప్రవక్త గంభీర స్వరంతో “ఓ ఖురైషులారా! నేను మీ పట్ల ఎలా ప్రవర్తిస్తానని భావిస్తున్నారు” అని అడిగారు. వారందరూ ఏక శబ్ధమై “మేలు చేస్తారనే భావిస్తున్నాము. ఎందుకంటే మీరు మంచి సోదరులు, మంచి సోదరుని సుపుత్రులు” అని సమాధానమిచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “పోండి, మీరందరికి స్వేచ్ఛ ప్రసాదించబడుతుంది” అని ప్రకటించారు. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన్ను, తన సహచరుల్ని బాధించి, నానా రకాలుగా హింసించి, స్వదేశం నుండి తరిమిన శత్రువుల్ని ఈ రోజు క్షమిస్తూ, మన్నిస్తూ ఒక గొప్ప ఉదాహరణ / ఆదర్శం నిలిపారు.
మక్కా విజయం తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావన మరియు ఇస్లాం ధర్మ ప్రచారం నలువైపులా వ్యాపించింది. ఇక సుదూర ప్రాంతాల నుండి బృందాలు వచ్చి ఇస్లాం స్వీకరించ సాగాయి.
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టుప్రక్క దేశాల రాజులకు ఇస్లాం పిలుపునిస్తూ, ఉత్తరాలు వ్రాయించి పంపారు. వారిలో కొందరు ఇస్లాం స్వీకరించారు. మరి కొందరు ఇస్లాం స్వీకరించలేదు కాని ఉత్తమరీతి లో ఉత్తరాన్ని తీసుకొని మంచి విధంగా సమాధానమిచ్చారు. కాని ఈరాన్ రాజైన ఖుస్రౌ (Khosrau) ప్రవక్త పత్రాన్ని చూసి కోపానికి గురై దాన్ని చింపేశాడు. ప్రవక్తకు ఈ విషయం తెలిసింది. పిమ్మట ఆయన ఇలా శపించారుః “అల్లాహ్! అతని రాజ్యాన్ని కూడా నీవు చించేసెయి”. ఈ శాపనానికి ఏమంత ఎక్కువ సమయం గడువక ముందే అతని కొడుకు స్వయంగా తండ్రిని చంపేసి, రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు.
మిస్ర్ (Egypt) రాజు ముఖౌఖిస్ ఇస్లాం స్వీకరించలేదు. కాని ప్రవక్త రాయబారితో ఉత్తమ రీతిలో ప్రవర్తించి, అతనితో ప్రవక్త కొరకు కానుకలు పంపాడు. అలాగే రోమన్ రాజు కూడా ప్రవక్త రాయబారికి మంచి ఆతిథ్యం ఇచ్చి మంచి విధంగా ప్రవర్తించాడు.
బహ్రైన్ రాజు ముంజిర్ బిన్ సావీ ప్రవక్త పత్రాన్ని ప్రజలందరికీ విని పించాడు. వారిలో కొందరు విశ్వసించారు మరి కొందరు తిరస్కరించారు.
హిజ్రి శకం 10వ ఏట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ చేశారు.
ఆయన చేసిన ఏకైక హజ్ ఇదే. ఆయనతో పాటు లక్షకు పైగా సహచరులు హజ్ చేశారు. ఆయన హజ్ పూర్తి చేసుకొని మదీన తిరిగి వచ్చారు.
హజ్ నుండి వచ్చాక సుమారు రెండున్నర మాసాలకు ప్రవక్తకు అస్వస్థత అలుముకొన్నది. దిన దినానికి అది పెరగ సాగింది. నమాజు కూడ చేయించడం కష్టమయిపోయింది. అప్పుడు అబూ బక్ర్ ను నమాజు చేయించాలని ఆదేశించారు.
హిజ్రి పదకొండవ శకం, నెల రబీఉల్ అవ్వల్, 12వ తారీకు సోమవారం రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరమోన్నతుడైన అల్లాహ్ వద్దకు చేరుకున్నారు. మొత్తం 63 సంవత్సరాలు జీవించారు. ప్రవక్త మరణ వార్త సహచరులకు అందగా వారికి సృహ తప్పినట్లయింది. నమ్మశక్యం కాక పోయింది. అప్పుడు అబూ బక్ర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు నిలబడి ప్రసం గించారుః వారిని శాంతపరుస్తూ, ప్రశాంత స్థితి నెలకొల్పుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరి లాంటి ఒక మానవుడే, అందిరికి వచ్చి నటువంటి చావు ఆయనకు వచ్చింది అని స్పష్టపరిచారు. అప్పుడు సహచరులు తేరుకొని, శాంత పడ్డారు. ఆ తర్వాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు స్నానం చేయించి, కఫన్ దుస్తులు ధరియింపజేసి, ఆయిషా రజియల్లాహు అన్హా గదిలో ఖననం చేశారు.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త పదవికి ముందు 40 సం. ఆ తర్వాత 13 సం. మక్కాలో, 10 సం. మదీనలో గడిపారు.
సహచరులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని అధికంగా ప్రేమించేవారు. వారు తమ ఆత్మలకంటే, సంతానం కంటే మరియు తమ ఆధీనంలో ఉన్నవాటికంటే ఎక్కువగా ప్రవక్తను ప్రేమించేవారు. ఆయన ఆధారంగానే అల్లాహ్ వారిని అవిశ్వాస చీకట్ల నుండి ఇస్లాం కాంతిలో తీసుకొచ్చాడు. ప్రవక్త పట్ల సహచరుల ప్రేమను తెలిపే అనేక సంఘటనలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ముష్రికుల చేతిలో బందీ అయిన ఖుబైబ్ బిన్ అదీ రజియల్లాహు అన్హు అను గొప్ప సహచరుని వద్ద ఖురైష్ గుమిగూడారు. వారిలో అగ్ర నాయకుడైన అబూ సుఫ్యాన్ (అప్పటికి ఇస్లాం స్వీకరించలేదు) ‘నీకు బదులుగా నీ ఈ స్థానంలో ముహమ్మద్ ఉండి అతడ్ని మేము హతమార్చుదుము. నీవు నీ ఇంట్లో ఉంటే బావుండునని భావిస్తున్నావా’ అని అడిగాడు. ఖుబైబ్ అన్నాడుః ‘లేదు, అల్లాహ్ సాక్షిగా! ముహమ్మద్ ప్రవక్త ఇక్కడ కాదు, తాను ఉన్న స్థానంలో ఉండగా ఆయనకు ముళ్ళు కుచ్చి అవస్త కలుగుతుండగా నేను నా ఇంట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు’.
ఉహద్ యుద్ధంలో ప్రవక్త చనిపోయారన్న వదంతి వ్యాపించింది. అప్పుడే ఒక స్త్రీ వచ్చింది. ఆమె తండ్రి చనిపోయాడని, తర్వాత కొడుకు, ఆ తర్వాత భర్త ఇంకా ఆ పిదప సోదరుడు కూడా చంపబడ్డారు అని తెలుపబడింది. అయినా ఆమె అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా? “ప్రవక్త పరిస్తితి ఎలా ఉంది? అని. ఆయన క్షేమంగనే ఉన్నారని ఆమెకు సమాధానం దొరికినా ‘ప్రవక్తను నాకు చూపించండి’ అని కోరింది. ప్రవక్త వద్దకు వచ్చాక ఆయన దుస్తుల ఓ అంచును పట్టి ‘అల్లాహ్ ప్రవక్తా! నా తల్లిదండ్రులను మీకు అర్పింతును గాక! మీరు క్షేమంగా ఉన్న తర్వాత నాకు ఏ రందీ లేదు’. అని అంది.
ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి, ‘ప్రవక్తా! నేను నా కంటే ఎక్కువ, నా భార్యపిల్లల కంటే ఎక్కువ మిమ్మల్ని ప్రేమిస్తాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు మీరు గుర్తుకు వస్తే మీ వద్దకు వచ్చి మిమ్మల్ని చూడనిదే తృప్తి కలగదు. అయితే నేను నా చావును మరియు మీ చావును గుర్తు చేసుకున్నప్పుడు మీరు ప్రవక్తలతో స్వర్గంలోని ఉన్నత స్థానంలో ఉంటారని నేను ఒక వేళ స్వర్గంలో ప్రవేశించినా మిమ్మల్ని చూడలేననే ఆవేధనే నన్ను కుమిలివేస్తుంది’ అని వాపోయాడు. అప్పుడు ప్రవక్త చెప్పారుః “నీవు ప్రేమించేవారితో నీవు ఉంటావు”.
మీరు ప్రవక్తను ఎలా ప్రేమించేవారని అలీ రజియల్లాహు అన్హును ప్రశ్నించినప్పుడు, ‘అల్లాహ్ సాక్షిగా! ఆయన మాకు మా ధనసంతానం కంటే, మా తల్లదండ్రుల కంటే అంతే కాదు దాహంగా ఉన్నప్పుడే లభించే చల్లని నీటి కంటే ఎక్కువ ప్రేమ గలవారు’ అని సమాధానమిచ్చారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివిధ సంస్కృతుల, విభిన్న విశ్వాసాల మరియు భిన్న జాతులవారితో హృదయపూర్వకంగా సంతోషంతో మరియు వారి సంస్కృతులలో ఏ జోక్యం చేసుకోకుండా వారితో సహజీవనం చేశారు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కాని కొన్నిటిని క్రింద ప్రస్తావిస్తున్నాము.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనకు వచ్చినప్పటి నుండీ అక్కడున్న యూదులతో ఎంతో శాంతివంతమైన జీవితం గడిపారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లామీయ నైతిక విధానాన్ని వారి పట్ల అవలంభించేవారు. అందుకే ఆయన వారి రోగులను పరామర్శించేవారు, ఆయన పొరుగులో ఉన్న యూదుడు పెట్టే అనేక ఇబ్బందులను సహించేవారు. యూదుని శవాన్ని తీసుకువెళ్ళుచుండగా చూసి నిలబడేవారు. ఒకసారి ఓ యూదుని శవం వెళ్ళుచుండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడ్డారు. ఇది యూదుని శవం కదా? అని సహచరులు అన్నారు. (అంటే యూదుని శవానికై మీరు ఎందుకు నిలబడ్డారు?) ప్రవక్త చెప్పారుః “అతను మనిషి కాడా?”.
ఆయన -ﷺ- మదీన వచ్చినప్పటి నుండి యూదులతో ఏ శత్రుత్వం లేకుండా ఉండే ప్రయత్నం చేసేవారు. అంతే కాదు ఆయన ఓ ఒప్పందంపై సంతకం చేశారు. దాని ద్వారా ఆయన ఇతరులతో ఎంత సామరస్యంగా జీవితం గడపడానికి కోరుకునేవారో తెలుస్తుంది.
ఇస్లామీయ రాజ్యం విస్తృతం అయినప్పుడు క్రిస్టియన్ అరబ్బు వంశాల కూటములు కొన్ని ఉండేవి. ప్రత్యేకంగా నజ్రాన్ లో. ప్రవక్త వారితో అతి ఉత్తమ రీతిలో ప్రవర్తించేవారు. ఇస్లామీయ ప్రభుత్వ ఛాయలో వారికి సంపూర్ణ శాంతియుతమైన జీవనం లభించాలని, వారి ధార్మిక విషయాల్లో వారికి స్వేచ్ఛ లభించాలని మరియు ఇతర రంగాల్లో కూడా వారికి స్వేచ్ఛా స్వతంత్రం లభించాలని వారితో ఒప్పందాలు చేశారు.
నజ్రాన్ వాసులతో జరిగిన ఒప్పందంలో ఇలా ఉంది. నజ్రాన్ మరియు దాని చుట్టుప్రక్కలో ఉన్నవారికి; వారు అక్కడ ఉన్నా, బైట ఉన్న వారి ధన, ప్రాణ, ధరిత్రి, ధర్మంలో అల్లాహ్ రక్షణ మరియు అల్లాహ్ యొక్క సందేశకర్త అయిన ప్రవక్త ముహమ్మద్ పూచి ఉంది. ఇంతే గాకుండా ఈ ఒప్పందంలో నజ్రాన్ క్రైస్తవుల సర్వ హక్కుల బాధ్యత, మరియు వారి శాంతిసౌఖ్యాలకు హాని కలిగే ఏ కార్యానికి పాల్పడేది లేదని కూడా ఉంది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేత వెలువడిన మదీన దస్తావీజులోని ఒప్పందాల ఓ భాగంలో: మదీనాలోని ముస్లిమేతరులు ముస్లింలవంటి నాగరికులే (సిటిజన్), ముస్లిములకు ఉన్నటువంటి హక్కులే వారికి ఉన్నాయి, ముస్లిములపై ఉన్నటువంటి విధులే వారిపై ఉన్నాయని ఉంది.
ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత వ్యవహారం మునాఫిఖుల(కపటుల)తో; ఆయనకు పేర్లతో సహా వారి గుర్తింపు ఉన్నప్పటికీ మరియు వారు ముస్లిముల మధ్య న్యూనతభావాన్ని సృష్టిస్తున్నారని, ముస్లిములను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిసినప్పటికీ, ప్రవక్తగారు వారితో సహజీవితం గడపడాన్ని నిరాకరిస్తున్నట్లు చూడలేము. ఆయన వారితో కలసి ఉండేవారు. వారితో వ్యవహారాలు చేసేవారు. వారితో వినేవారు. శక్తి ఉన్నప్పటికీ వారికి వ్యతిరేకంగా బలప్రయోగం చేయలేదు. పౌరులకు సంబంధించిన ఏ ఒక హక్కు వారికి లేకుండా ఎన్నడూ ప్రవర్తించలేదు. ముస్లిముల మాదిరిగా వారు సర్వ నివాస హక్కులు పొందుతున్నారు. సామాజిక సమస్యల్లో ప్రవక్త వారికి తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే అనుమతి ఇచ్చేవారు. బైతుల్ మాల్ నుండి వారికి లభించవలసిన వాట నొసంగేవారు.
ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇతర మతస్థులతో ఏలాంటి కల్మషం, అసహ్యత లేకుండా ప్రేమశాంతియుతమైన జీవితం గడిపేవారు. అంతే కాదు, తమ వాచకర్మ, నోట ప్రవర్తన ద్వారా కూడా ఇతరులతో స్వేచ్ఛ, శాంతియతమైన జీవితం గడపాలని ప్రోత్సహించేవారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేక సందర్భాల్లో ముస్లిముల మధ్య సోదరబాంధవ్యం, వారి మధ్య గట్టి సంబంధం ఉండుట విధిగా ఉంది అని తాకీదు చేశారు. పరస్పర కపటం, ద్వేషం, భిన్నత్వం, చీలికలు అనైక్యతలు ఉంచుకొనుట నుండి వారించారు. మరియు వారి మధ్య చీలికలకు, ద్వేష మరియు దూరాలకు దారి తీసే ప్రతీ దాని నుండి హెచ్చరించారు. ముస్లిం అవసరాన్ని తీర్చడానికి, అతని సహాయానికి, అతని మేలు, మద్దతుకు ఎల్లవేళల్లో సిద్ధంగా ఉండాలని ప్రోత్సహించారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలను, ప్రవచనాలను అంతేకాదు, ఆయన ఆచరణలపై శ్రద్ధ వహిస్తే వాటిలో ముస్లిముల మధ్య ప్రేమరాగాల్ని వ్యాపించే బహిరంగ పిలుపు ద్యోతకమవుతుంది. ఇదిగో ఆయన విశ్వాసపరమైన ప్రేమను ఎలా స్వర్గానికి దారి అని తెలుపారో చూడండిః
“మీరు విశ్వాసులు కానంత వరకు స్వర్గంలో చేరరు, మరి పరస్పరం ప్రేమించుకోనంత వరకు విశ్వాసులు కాజాలరు. నేను మీకో విషయం తెలుపనా? అది గనక మీరు చేస్తే మీలో పరస్పరం ప్రేమానురాగాలు కుదురుతాయి; మీరు సలాంను విస్తృతం చేయండి”.
ఆయన -ﷺ- ముస్లిముల మధ్యలో ఎల్లప్పుడూ ప్రేమ విత్తనాలు నాటే మరియు కరుణ, వాత్సల్యం పెంచే ప్రయత్నం చేసేవారు. ప్రజల హృదయాల్లో ప్రేమ పునాదులను గట్టిగా నాటే అధిక కాంక్ష గలవారు. అందుకే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః
“ఇద్దరు వ్యక్తులు కేవలం అల్లాహ్ కొరకు పరస్పరం ప్రేమించుకున్నట్లయితే వారిలో ఎవరు ఇతరుని పట్ల ఎక్కువ ప్రేమ కలిగి ఉంటాడో అతడిని అల్లాహ్ అధికంగా ప్రేమిస్తాడు.
ఇంతే కాదు, ఇతరులను ప్రేమించడం, వారి కొరకు మంచిని ప్రేమించడంలోనే విశ్వాస గ్యారంటీ ఉందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టపరిచారుః
“తన కొరకు ఇష్టపడినదే తన సోదరుని కొరకు ఇష్టపడనంత వరకు మీలో ఎవరు విశ్వాసులు కాజాలరు”.
ప్రవక్త -ﷺ- ఇలా చెప్పారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “పరస్పరం కానుకలు పంపించుకుంటూ ఉండండి, అందువల్ల ప్రేమలు పెరుగుతూ ఉంటాయి”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానికి కావలసిన మార్గాలు, సాధనాలు కూడా నేర్పారు; మెతక హృదయులు అయి ఉండుట. ఇతరుల ప్రేమ భావాల్ని గ్రహించేగుణం దానిలో కలగవేయుట.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పొట్టిగా గాని లేదా పొడుగ్గా గాని కాకుండా మధ్యరకమైన ఎత్తులో ఉండిరి. విస్తరించిన భుజాలు. సరితూగిన అవయవాలు. విశాలవక్షస్తుడు. చంద్రబింబం లాంటి అందమైన ముఖం. సుర్మా పెట్టుకున్నటువంటి కళ్ళు. సన్నటి ముక్కు. అందమైన మూతి. సాంద్రమైన గడ్డం.
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు కథనం, అంబర్ గ్రిస్ (ambergris) మరియు కస్తూరి లేదా ఇంకేదైనా సువాసనగల పదార్థం, ద్రవ్యాల సువాసన ప్రవక్త సువాసన కంటే ఎక్కవ ఉన్నది నేను ఎన్నడూ చూడలేదు/ ఆఘ్రాణించేలదు. ప్రవక్త చెయ్యి కంటే ఎక్కువ సున్నితమైన వస్తవును ఎప్పుడూ నేను ముట్టుకోలేదు.
ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా, మందహాసంగా ఉండేవారు. తక్కువ సంభాషించేవారు. మధుర స్వరం గలవారు. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఆయన గురించి ఇలా చెప్పాడుః ఆయన అందరిలో అందమైన వారు. అందరికన్నా ఎక్కువ దాతృత్వ గుణం గలవారు, మరియు అందరి కన్నా గొప్ప శూరుడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికన్నా శూరులు, బలశాలి. అలీ బిన్ అబూ తాలిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః యుద్ధం చెలరేగి ఒకరిపై ఒకరు విరుచుకుపడేటప్పుడు మేము ప్రవక్త వెనక ఉండేవారము.
ఆయన అందరికన్నా ఎక్కువ ఉదారులు, ఔదార్యము ఉన్నవారు. ఆయన్ను ఏదైనా అడుగుతే ఎప్పుడూ లేదు, కాదు అనలేదు.
అందరికన్నా ఎక్కువ ఓర్పు, సహనం గలవారు. ఎప్పుడూ తమ స్వంత విషయంలో ఎవరితో ప్రతీకారం కోరలేదు. ఎవరినీ కోపగించలేదు. కాని అల్లాహ్ నిషిద్ధతాల పట్ల జోక్యం చేసుకున్నవాడిని అల్లాహ్ కొరకు శిక్షించేవారు.
ఆయన దృష్టిలో దూరపు – దగ్గరివారు, బలహీనులు – బలలవంతులు అనే తారతమ్యము లేదు. హక్కులో అందరూ సమానం. మరింత తాకీదు చేస్తూ ఇలా చెప్పారుః “ఏ ఒకరికి మరొకరిపై ఆధిక్యత, ఘనత లేదు. కేవలం తఖ్వా (అల్లాహ్ భయభీతి) తప్ప. మానవులందరూ సమానులే. గత కాలల్లో గతించిన జాతుల్లో దొంగతనం చేసే వ్యక్తి ఉన్నత వంశీయు డవుతే శిక్షించకుండానే వదిలేసేవారు. అదే బడుగు వర్గం వాడయితే శిక్షించేవారు. అందుకే వారు నాశనం అయ్యారు. వినండి! “ముహమ్మద్ కూతురు ఫాతిమ గనక దొంగతనం చేస్తే నేను ఆమె చేతుల్ని నరికేసేవాన్ని”.
ఎప్పుడూ ఏ భోజనానికి వంక పెట్ట లేదు. ఇష్టముంటే తినేవారు. లేదా వదిలేవారు. ఒక్కోసారి నెల రెండు నెలల వరకు ఇంటి పొయ్యిలో మంటే ఉండకపోయేది. ఆ రోజుల్లో ఖర్జూరం మరియు నీళ్ళే వారి ఆహారంగా ఉండేది. ఒక్కోసారి ఆకలితో కడుపుపై రాళ్ళు కట్టుకునేవారు.
చెప్పుల మరమ్మతు చేసుకునేవారు. దుస్తులు చినిగిన చోట కుట్లు వేసుకునేవారు. ఇంటి పనుల్లో ఇల్లాలికి సహకరించేవారు. వ్యాదిగ్రస్తుల్ని పరామర్శించేవారు.
పేదరికం వల్ల పేదలను చిన్న చూపుచూసేవారు కారు. రాజ్యాధికారం వల్ల రాజులతో భయపడేవారు కారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గుఱ్ఱం, ఒంటె, గాడిద మరియు కంచర గాడిదలపై ప్రయాణం చేసేవారు.
ఎన్ని బాధలు, కష్టాలు వచ్చినా అందరికన్నా ఎక్కువ మందహాసంతో ఉండేవారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపేవారు. సువాసనను ప్రేమించే వారు. దుర్వాసనను అసహ్యించుకునేవారు. సర్వ సద్గుణాలను, ఉత్తమ చేష్టలను అల్లాహ్ ఆయనలో సమకూర్చాడు.
అల్లాహ్ ఆయనకు నొసంగిన విద్యా జ్ఞానం ముందువారిలో, వెనుక వారిలో ఎవ్వరికీ నొసంగ లేదు. ఆయన నిరక్షరాస్యులు. చదవలేరు, వ్రాయ లేరు. మానవుల్లో ఎవరూ ఆయనకు గురువు కారు. దివ్యగ్రంథం ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి వచ్చినది. దాని గురించి అల్లాహ్ ఇలా ఆదేశించాడుః
{ఇలా అను ఓ ప్రవక్తా! ఒకవేళ మానవులూ జిన్నాతులూ అందరూ కలసి ఈ ఖుర్ఆను వంటిదానిని దేనినయినా తీసుకువచ్చే ప్రయత్నం చేసినప్పటికీ తీసుకురాలేరు. వారందరూ ఒకరికొకరు సహాయులు అయినప్పటికినీ}. (బనీ ఇస్రాఈల్ 7: 88).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిన్నపటి నుండి చదవడం, వ్రాయడం నేర్చుకోకుండా నిరక్షరాస్యులవడం తిరస్కారుల అపోహాలకు ఒక అడ్డు కట్టుగా నిలిచింది. ఈ గ్రంథాన్ని ముహమ్మద్ – సల్లల్లాహు అలైహి వసల్లం- స్వయంగా వ్రాసారు, లేదా ఇతరులతో నేర్చుకున్నారు, లేదా పూర్వ గ్రంథాల నుండి చదివి వినిపిస్తున్నాడన్న అపోహాలు వారు లేపుతూ ఉంటారు. నిరక్షరాస్య మనిషి ఎలా ఇలా చేయగలడు? అందుకని వాస్తవంగా ఇది అల్లాహ్ వైపు నుండి అవతరించినదే.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు లభించిన మహిమల్లో అతి గొప్పది దివ్య గ్రంథం ఖుర్ఆన్. ఇది ప్రళయం వరకూ మహిమగా నిలిచి ఉంది. అది భాషాప్రావీణులను, వాక్పుతులను అశక్తతకు గురి చేసింది. ఖుర్ఆన్ లో ఉన్నటువంటి పది సూరాలు, లేదా ఒక సూరా, లేదా కనీసం ఒక్క ఆయతైనా తేగలరా అని అల్లాహ్ అందరితో ఛాలెంజ్ చేశాడు. ముష్రికులు స్వయంగా తమ అసమర్థత, అశక్తతను ఒప్పుకున్నారు.
ఆయన మహిమల్లోః ఒకసారి ముష్రికులు మహత్యము చూపించమని కోరారు. ప్రవక్త అల్లాహ్ తో దుఆ చేశారు. చంద్రుణ్ణి రెండు వేరు వేరు ముక్కల్లో వారికి చూపించబడింది. (దీని వివరం పైన చదివారు).
కంకర రాళ్ళు ఆయన చేతులో సుబ్ హానల్లాహ్ పఠించాయి. అవే రాళ్ళు అబూ బక్ర్ చేతులో, తర్వాత ఉమర్ చేతులో, ఆ తర్వాత ఉస్మాన్ చేతులో పెట్టారు. అప్పుడు కూడా అవి తస్బీహ్ పఠించాయి.
ఎన్నో సార్లు ఆయన వ్రేళ్ళ నుండి నీళ్ళ ఊటలు ప్రవహించాయి.
ప్రవక్త భోజనం చేసేటప్పుడు ఆ భోజనం కూడా తస్బీహ్ పఠిస్తున్నది సహచరులు వినేవారు.
రాళ్ళు, చెట్లు ఆయనకు సలాం చేసేవి.
ఒక యూదురాళు ప్రవక్తను చంపే ఉద్దేశ్యంతో మేక మాంసంలోని దండచెయి భాగంలో విషం కలిపి బహుమానంగా పంపింది. ఆ మాంసపు దండచెయి మాట్లాడింది.
ఒక గ్రామీణుడు ఏదైనా మహిమ చూపించండి అని కోరినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చెట్టును ఆదేశించగా అది దగ్గరికి వచ్చింది. మరోసారి ఆదేశించగా తన మొదటి స్థానానికి తిరిగి వెళ్ళింది.
ఏ మాత్రం పాలు లేని మేక పొదుగును చెయితో తాకగానే పాలు వచ్చేశాయి. దాని పాలు పితికి స్వయంగా త్రాగి, అబూ బక్ర్ కు త్రాపించారు.
అలీ బిన్ అబూ తాలిబ్ రజియల్లాహు అన్హు కళ్ళల్లో అవస్త ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఉమ్మిని అతని కళ్ళల్లో పెట్టగా అప్పడికప్పుడే సంపూర్ణ స్వస్థత కలిగింది.
ఒక సహచరుని కాలు గాయపడంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని కాలును చెయితో తుడిసారు. వెంటనే అది నయం అయ్యింది.
ప్రవక్త -ﷺ- అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు కొరకు దీర్ఘాయుష్మంతుడుగను, అధిక ధన సంతానం గలవాడవాడిగను మరియు అల్లాహ్ వారికి శుభం (బర్కత్) ప్రసాదించాలని దుఆ చేశారు. అలాగే ఆయనకు 120 మంది సంతానం కలిగారు. ఖర్జూరపు తోటలన్నీ ఏడాదికి ఒక్కసారే ఫలిస్తాయి. కాని ఆయన ఖర్జూరపు తోట ఏడాదికి రెండు సార్లు పండేది. ఇంకా ఆయన 120 సంవత్సరాలు జీవించారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా రోజు మెంబర్ పై ఖుత్బా ఇస్తుండగా ఒక వ్యక్తి వచ్చి, అనావృష్టి దాపురించింది మీరు వర్షం కొరకు దుఆ చేయండని కోరగా, రెండు చేతులెత్తి దుఆ చేశారు. ఎక్కడా లేని మేఘాలన్నీ పర్వతాల మాదిరిగా ఒక చోట చేరి, వారం రోజుల పాటు కుండ పోత వర్షం కురిసింది. మరో జుమా రోజు ఖుత్బా సందర్భంలో వర్షం వల్ల నష్టం చేకూరుతుందని విన్నవించుకోగా రెండు చేతులెత్తి దుఆ చేశారు. అప్పటికప్పుడే వర్షం నిలిచింది. ప్రజలందరూ ఎండలో నడచి వెళ్ళారు.
ఖందక యుద్ధంలో పాల్గొన్న వెయ్యి మంది వీరులందరికీ సుమారు మూడు కిలోల యవధాన్యాల రొట్టెలు మరియు ఒక చిన్న మేక మాంసం తో ప్రవక్త వడ్డించారు. అందరూ కడుపు నిండా తృప్తికరంగా తిని వెళ్ళారు. అయినా రొట్టెలు మరియు మాంసంలో ఏ కొదవ ఏర్పడలేదు.
అదే యద్ధంలో బషీర్ బిన్ సఅద్ కూతురు తన తండ్రి మరియు మామ కొరకు తీసుకొచ్చిన కొన్ని ఖర్జూరపు పండ్లు వీరులందరికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తినిపించారు.
అబూ హురైరా రజియల్లాహు అన్హు వద్ద ఉన్న ఒకరి భోజనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పూర్తి సైన్యానికి తినిపించారు.
హిజ్రత్ కు వెళ్ళే రాత్రి ఆయన్ను (సల్లల్లాహు అలైహి వసల్లం) హత్య చేయుటకు వేచిస్తున్న వంద మంది ఖురైషుల పై దుమ్ము విసురుతూ వారి ముందు నుండి వెళ్ళి పోయారు. వారు ఆయన్ని చూడలేకపోయారు.
హిజ్రత్ ప్రయాణంలో సురాఖా బిన్ మాలిక్ ఆయన్ను చంపడానికి వెంటాడుతూ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని శపించారు. అందుకు అతని గుఱ్ఱం కాళ్ళు మోకాళ్ళ వరకు భూమిలో దిగిపోయాయి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరులతో పరిహసించే వారు, తమ ఇల్లాలితో వినోదంగా, ఉల్లాసంగా గడిపేవారు. చిన్నారులతో ఆనందంగా ఉండేవారు. వారి కొరకు సమయం కెటాయించేవారు. వారి వయసు, బుద్ధిజ్ఞానాలకు తగిన రీతిలో వారితో ప్రవర్తించేవారు. తమ సేవకుడైన అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హుతో కూడా ఒకప్పుడు పరిహసిస్తూ “ఓ రెండు చెవులవాడా” అని అనేవారు.
ఒక వ్యక్తి వచ్చి ప్రవక్తా! నాకొక సవారి ఇవ్వండని అడిగాడు. ప్రవక్త పరిహాసంగా “మేము నీకు ఒంటె పిల్లనిస్తాము” అని అన్నారు. నేను ఒంటె పిల్లను తీసుకొని ఏమి చేయాలి? అని ఆశ్చర్యంగా అడిగాడతను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ప్రతి ఒంటె, పిల్లనే కంటుంది కదా” అని నగుమోహంతో అన్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల ముందు ఎల్లప్పుడూ మంద హాసంతో, నగుమోహంతో ఉండేవారు. వారి నుండి మంచి మాటే వినేవారు. జరీర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: నేను ఇస్లాం స్వీకరించినప్పటి నుండీ, ప్రవక్త వద్దకు ఎప్పుడు వచ్చినా ఆయన రావద్దని చెప్పలేదు. నేను ఎప్పుడు చూసినా చిరునవ్వే ఉండేది. ఒకసారి “ప్రవక్తా! నేను గుఱ్ఱంపై స్థిరంగా కూర్చోలేకపోతాను అని” విన్నవించు కున్నాను. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా రొమ్ము మీద కొట్టాడు. మళ్ళీ ఇలా దుఆ చేశారుః “అల్లాహ్ ఇతన్ని స్థిరంగా కూర్చోబెట్టు. ఇతడ్ని మార్గదర్శిగా, సన్మార్గగామిగా చెయ్యి”. ఆ తర్వాత నేను ఎప్పుడూ గుఱ్ఱం మీది నుంచి పడలేదు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ బంధువులతో కూడా పరిహసించే వారు. ఒకసారి ప్రవక్త తమ కూతురు ఫాతిమా రజియల్లాహు అన్హా ఇంటికి వెళ్ళారు. అక్కడ హజ్రత్ అలీ రజియ్లలాహు అన్హు కన్పించక పోవడంతో. ఆయన ఎక్కడి వెళ్ళాడమ్మా! అని కూతుర్ని అడిగారు. దానికి ఫాతిమ రజియల్లాహు అన్హా సమాధానమిస్తూ “మా ఇద్దరి మధ్య చిన్న తగాద ఏర్పడింది. అందుకు ఆయన నాపై కోపగించుకొని, అలిగి వెళ్ళిపోయారు” అని అంది. ప్రవక్త అక్కడి నుండి మస్జిదుకు వచ్చారు. అతను అందులో పడుకొని ఉన్నారు. ఆయన మీది నుండి దుప్పటి తొలిగి పోయింది. ఆయన శరీరానికి మట్టి అంటుకొని ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన శరీరానికి అంటుకొని ఉన్న మట్టిని తూడుస్తూ “అబూ తురాబ్ (మట్టివాడా)! లే అబూ తురాబ్! లే” అని అన్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణులకు, కూతుళ్ళకు ప్రవక్త ఉత్తమ సద్గుణాల్లో ఓ గొప్ప వంతు ఉండింది. ఒక్కోసారి ప్రవక్త తమ సతీమణి ఆయిషా రజియల్లాహు అన్హాతో పరుగు పందెం పెట్టేవారు. ఆమె తన స్నేహితురాళ్ళతో ఆడుకుంటే వద్దనేవారు కాదు. స్వయంగా ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించారుః “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎదుట నా స్నేహితురాళ్ళతో కలసి ఆడుకునేదాన్ని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లోకి రాగానే ఆ బాలికలు భయపడి దాక్కునేవారు. అయితే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నా దగ్గరకు పంపేవారు. నేను వారితో మళ్ళీ ఆడుకునేదాన్ని”.
బాలలతో అనురాగంగా కలిగి యుండి, వారిని ప్రేమగా చూసుకుంటూ ఒక్కోసారి వారితో ఆటలాడేవారు. షద్దాద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇషా నమాజులో తమ వెంట హసన్ లేదా హుసైన్ ను తీసుకొచ్చారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ముందుకు వెళ్ళి అబ్బాయిని కూర్చోబెట్టారు. అల్లాహు అక్బ్రర్ అని నమాజునారంభించారు. సజ్దాలో వెళ్ళి, చాలా ఆలస్యం అయినప్పటికీ లేవలేదు. నాకు అనుమానం కలిగి కొంచం తల లేపి చూశాను. ఆ అబ్బాయి ఆయన వీపుపై ఉన్నాడు. నేను మళ్ళీ సజ్దాలో ఉండిపోయాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు ముగించిన తర్వాత సహచరులుః ‘ప్రవక్తా! మీరు దీర్ఘంగా సజ్దా చేసినందుకు ఏదైనా సంఘటన జరిగిందా లేదా మీపై దివ్యవాణి (వహీ) అవతరణ జరుగుతుందా అని భావించాము’ అని అడిగారు. అందుకు ప్రవక్త చెప్పారుః “ఇవన్నీ ఏమి కాదు, విషయం ఏమిటంటేః అబ్బాయి నా వీపుపై ఎక్కాడు. అతను కోరిక తీరక ముందే తొందరగా లేవడం నాకు బావ్యమనిపించలేదు. అనసు రజియల్లాహు అన్హు ఉల్లేఖనంలో ఉందిః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలందరిలోకెల్లా ఉత్తమ గుణం గలవారు. నాకో చిన్న తమ్ముడు ఉండేవాడు. అతని పేరు ఉమైర్. ప్రవక్త ప్రేమతో, అతని తృప్తి కొరకు ఇలా అనేవారుః “ఉమైర్ నీ నుఘైర్ ఎలా ఉంది”. నుఘైర్ అంటే బుర్ర పిట్ట. అతను దానితో ఆడుకునేవాడు.
ఇంటివారితో ప్రవక్త వ్యవహారంలో సర్వ సద్గుణాలు ఏకమయ్యాయి. ఆయన చాలా వినయనమ్రతతో మెదిలేవారు. తమ చెప్పులు స్వయంగా కుట్టుకునేవారు. అవసరమున్న చోట బట్టలకు మాసికలేసుకునేవారు. ఎప్పుడూ భోజనానికి వంకలు పెట్టేవారు కారు. ఇష్టముంటే తినే, లేదా వదిలేసేవారు. స్త్రీ జాతిని ఒక మనిషిగా గౌరవించేవారు. అంతే కాదు, తల్లి, భార్య, కూతురు, చెల్లి రూపాల్లో వివిధ గౌరవాలు ప్రసాదించేవారు. ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడుః నా సేవా సద్వర్తనలకు అందరికన్నా ఎక్కువ అర్హులేవరు అని. దానికి ఆయన “నీ తల్లి” అని చెప్పారు. మళ్ళీ ఎవరు అన్న ప్రశ్నకు “నీ తల్లి” అని చెప్పారు. మళ్ళీ ఎవరు అన్న ప్రశ్నకు “నీ తల్లి” అనే జవాబిచ్చారు. నాల్గవ సారి అడిగినప్పుడు “నీ తండ్రి” అని చెప్పారు. మరొసారి ఇలా చెప్పారుః “ఏ వ్యక్తి తన తల్లిదండ్రిలో ఒకరిని లేదా ఇద్దరిని పొంది, వారి సేవా చేసుకోకుండా నరకంలో ప్రవేశిస్తాడో అల్లాహ్ అతన్ని తన కరుణకు దూరమే ఉంచుగాకా!”.
ఆయన సతీమణి ఏదైనా పాత్ర నుండి త్రాగినప్పుడు, ఆయన ఆ పాత్ర తీసుకొని ఆమె ఎక్కడ తన మూతి పెట్టిందో అక్కడే తమ మూతి పెట్టి త్రాగేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారుః “మీలో మంచివారు తమ ఇల్లాలి పట్ల మంచి విధంగా మెలిగేవారు. నేను నా ఇల్లాలి పట్ల మీ అందరికన్నా మంచి విధంగా వ్యవహిరించేవాణ్ణి”.
(ఈనాడు మనం మన భార్యలతో ఉత్తమ రీతిలో వ్యవహరించి ఉంటే మరియు మన ఇల్లాలులు ప్రవక్త సతీమణుల లాంటి సద్గుణాలు అవలంబించి ఉంటే మన జీవితాలు సుఖశాంతులతో నిండి ఉండేవి. మనందరికి అల్లాహ్ ఈ భాగ్యం ప్రసాదించుగాక! ఆమీన్).
ఇక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి కరుణ గుణం: ఆయన ఇలా ప్రవచించారుః “కరుణించేవారిని కరుణామయుడైన అల్లాహ్ కరుణిస్తాడు. మీరు భువిలో ఉన్నవారిపై కరుణ చూపండి. దివిలో ఉన్నవాడు మీపై కరుణ చూపుతాడు”. ప్రవక్తలో ఈ గొప్ప గుణం అధిక భాగంలో ఉండింది. చిన్నలు, పెద్దలు, దగ్గరివారు, దూరపువారు అందరితో గల ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వ్యవహారాల్లో ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆయన కరుణ, వాత్సల్యపు నిదర్శనం ఒకటిః ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చిన్న పిలవాళ్ళ ఏడుపు విని సామూహిక నమాజు దీర్ఘంగా కాకుండా, సంక్షిప్తముగా చేయించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారని అబూ ఖతాదా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నేను నమాజు కొరకు నిలబడినప్పుడు దీర్ఘంగా చేయించాలని అనుకుంటాను, కాని పసి పిల్లవాని ఏడుపు విని నేను సంక్షిప్తంగా చేయిస్తాను. తన తల్లికి అతని వల్ల ఇబ్బంది కలగ కూడదని”.
తమ అనుచర సంఘం పట్ల ఆయన కరుణ, మరియు వారు అల్లాహ్ ధర్మంలో చేరాలన్న కాంక్ష యొక్క నిదర్శనం: ఒక యూద పిలవాడు వ్యాదిగ్రస్తుడయ్యాడు. అతడు ప్రవక్త సేవ చేసేవాడు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని పరామర్శ కొరకు బయలుదేరి, అతని తలకడన కూర్చున్నారు. కొంత సేపటికి, “అబ్బాయీ! ఇస్లాం స్వీకరించు” అని చెప్పారుః అతడు తన తలాపునే నిలుచున్న తండ్రి వైపు చూశాడు. అబుల్ ఖాసిం (ప్రవక్త విశేషనామం, కునియత్) మాట విను అని అతని తండ్రి చెప్పాడు. ఆ అబ్బాయి అప్పుడే ఇస్లాం స్వీకరించాడు. మరి కొంత సేపటికే చనిపోయాడు. ప్రవక్త అతని వద్ద నుండి వెళ్తూ ఇలా అన్నారుః “ఇతన్ని అగ్ని నుండి కాపాడిన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు”.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓపిక గురించి ఏమి చెప్పగలం?!! వాస్తవానికి ఆయన పూర్తి జీవితమే ఓపిక, సహనాలతో, శ్రమ, కష్టాలతో కూడియుంది. ఆయనపై తొలి వహీ (దివ్యవాణి) అవతరించినప్పటి నుండి అంతిమ శ్వాస వరకు ఆయన ఓపిక, సహనాలతోనే జీవితం గడిపారు. ఈ (ఇస్లాం ప్రచార) మార్గంలో ఆయన ఏమేమి ఏదురుకోబోతున్నారో ప్రవక్త అయిన మొదటి క్షణం, మొదటిసారి దైవదూతను కలుసుకున్న తర్వాత నుండే స్వభావికంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేయబడింది. అప్పుడు ఖదీజా రజియల్లాహు అన్హా ఆయన్ను వరఖా బిన్ నౌఫల్ వద్దకు తీసుకెళ్ళింది. వరఖా చెప్పాడుః నీ జాతి వారు నిన్ను నీ దేశం నుండి బహిష్కరించినప్పుడు నేను బ్రతికుంటే ఎంత బావుండేది. అప్పుడు ప్రవక్త ఆశ్చర్యంగా అడిగారుః “ఏమీ నా జాతివారు నన్ను దేశం నుండి బహిష్కరిస్తారా”. అతడన్నాడుః అవును. నీవు తెచ్చినటువంటి సందేశం తెచ్చిన ప్రతీవారూ తరిమివేయబడ్డారు. అయితే ఇలా ముందు నుండే కష్టాలను, బాధలను, కుట్రలను మరియు శత్రుత్వాన్ని భరించే అలవాటు తనకు తాను అలవర్చుకున్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఓపిక, సహనాలు స్పష్టంగా ఏర్పడే చిత్రాల్లో; ఎల్లప్పుడూ ఆయనతో ఎగితాళి చేయడం, ఆయనను పరిహసించడం. ఆయన అల్లాహ్ సందేశం ప్రజలకు అందజేస్తున్నప్పుడు, మక్కాలో తమ జాతి, వంశం వారి వైపున భరించిన శారీరక చిత్రహింసలు. అందులో ఒక సంఘటన సహీ బుఖారిలో ఇలా వచ్చి ఉందిః ప్రవక్తపై ముష్రికులు పెట్టిన చిత్రహింసల్లో ఘోరాతిఘోరమైనదేమిటి? అని ఉర్వా బిన్ జుబైర్, అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ ని అడిగాడు. అతడు చెప్పాడుః ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్ర్(6)లో నమాజు చేస్తుండగా ఉఖ్బా బిన్ అబూ ముఈత్ వచ్చాడు. తన వద్ద ఉన్న దుప్పటిని ప్రవక్త మెడలో వేసి గొంతును మెలివేశాడు. అందువల్ల ఆయన గొంతు బాగా బిగుసుకు పోయింది. అంతలో అబూ బక్ర్ రజియల్లాహు అన్హు పరుగెత్తుకుంటూ వచ్చి ఉఖబా భూజాన్ని పట్టి తోసేసారు. మళ్ళీ ఖుర్ఆనులోని ఈ ఆయతు చదివారుః
{ఒక వ్యక్తి తన ప్రభువు అల్లాహ్ అని అన్నంత మాత్రాన మీరు అతణ్ణి హతమారుస్తారా?}. (ఘాఫిర్ 28)
ఒక రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాబా వద్ద నమాజు చేస్తున్నారు. అబూ జహల్, వాని మిత్రులు కాబా ప్రాంగణంలో కూర్చొని యున్నారు. అబూ జహల్ మాట్లాడుతూః ఫలానా ఇంట్లో ఈ రోజు ఒంటె ను కోశారు, ఎవరు పోయి దాని పొట్ట, జీర్ణాశయం మరియు ప్రేగులను తీసుకువచ్చి, ముహమ్మద్ సజ్దాలో పోయినప్పుడు అతని వీపు మీద వేస్తాడు అని పురిగోల్పాడు. వారిలోని పరమ దుర్మార్గుడొకడు (ఉఖ్బా బిన్ అబూ ముఈత్) దిగ్గున లేచాడు. దాన్ని తీసుకొచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలో పోగానే ఆయన భుజాల మధ్య వీపుపై పెట్టేశాడు. ఇక అవిశ్వాసులు ఒకరిపై ఒకరు పడిపోతూ విరగబడి నవ్వసాగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలోనే ఉండిపోయారు. తల పైకి లేపలేక పోయారు. చివరికి ఆయన కూతురు ఫాతిమా రజియల్లాహు అన్హా వచ్చింది. వీపుపై నుండి దాన్ని తొలగించింది.
వీటి కంటే మరీ ఘోరమైనది మానసిక బాధ. ఇందుకు కూడా వారు వెనక ఉండలేదు. అందుకే ఆయన ఇచ్చే సందేశాన్ని నిరాకరిస్తూ, తిరస్కరిస్తూ ఆయన పై అపనిందలు మోపేవారు, ఆయన జ్యోతిష్యుడు, పిచ్చివాడు, మాంత్రికుడు అని పేర్లు పెట్టేవారు, ఆయన తీసుకువచ్చిన ఆయతులు పూర్వకాలపు కట్టుకథలు అని అనేవారు. ఒకసారి అబూ జహల్ ఇలా అన్నాడుః “ఓ అల్లాహ్! నీ వద్ద నుండి వచ్చిన సత్యం, ధర్మం ఇదేనయితే ఆకాశం నుండి మాపై రాళ్ళ వర్షం కురిపించు. లేదా బాధకర మైన శిక్ష పంపించు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజల్ని ఇస్లాం వైపునకు ఆహ్వానించుటకు వారి సమూహాల్లో, బజారుల్లో వెళ్ళినప్పుడు పినతండ్రి అబూ లహబ్ వెనకనే వచ్చి, ఇతను అబద్ధికుడు. ఇతని మాటను మీరు నిజపరచవద్దు అని చెప్పేవాడు. అతని భార్య ఉమ్మె జమీల్ ముళ్ళ కంప ఏరుకొచ్చి ప్రవక్త నడిచే దారిలో వేస్తుండేది. బాధాలు, కష్టాలు పరా కాష్ఠకు చేరిన వేళ ఒకటుంది. అది ప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం మరియు ఆయన్ను విశ్వసించినవారు మూడు సంవత్సరాల వరకు షిఅబె అబూ తాలిబ్ లో బంధీలుగా అయిన వేళ. ఆ రోజుల్లో ఆకలిని భరించలేక ఆకులు తిన వలసి వచ్చేది. ఇంకా ఆయన తమ పవిత్ర సతీమణిఖదీజ రజియల్లాహు అన్హాను కోల్పోయిన సంద ర్భంలో మరింత బాధకు గురి అయ్యారు. ఆమె కష్టరోజుల్లో తృప్తినిస్తూ, తగిన సహాయసహకారాలు అందించేది. ఆ తర్వాత ఆయనకు అండదండగా నిలిచిన, ఆయన్ను పోషించిన పినతండ్రి మరణం, అతను అవిశ్వాస స్థితిలో చనిపోవడం ప్రవక్తను మరింత కుదిపి వేసింది. ఆయన్ను సంహరించే ఖురైషుల యత్నాలు విఫలమయ్యాయి. ప్రవక్త స్వదేశం వదిలేసి
1 అది కాబా గృహానికి ఆనుకొనియున్న స్థలం. సుమారు ఏడు ఫిట్ల గోడ ఎత్తి యుంటుంది. ఖురైషుల వద్ద హలాల్ సంపద సరిపోనందుకు దాన్ని కాబా గృహంలో కలుపుకో లేకపోయారు. అయితే అది కాబాలోని భాగమే.
పరదేశానికి వలసపోయారు. మదీనాలో ఓపిక, సహనాల మరో క్రొత్త కాలం, శ్రమ, ప్రయాస, కష్టాలతో కూడిన జీవితం మొదలయింది. చివరికి ఆకలిగొన్నారు. బీదవారయ్యారు. తమ కడుపుపై రాళ్ళు కట్టు కొన్నారు. ఒకసారి ప్రవక్త -ﷺ- ఇలా చెప్పారుః “అల్లాహ్ విషయంలో నేను బెదిరింపబడినంత మరెవరూ బెదిరింప బడలేదు. అల్లాహ్ విష యంలో నేను గురి అయిన చిత్రహింసలకు మరెవరూ గురికాలేదు. 30 రేయింబవళ్ళు గడిసినా మా పరిస్థితి ఎలా ఉండిందంటే నా వద్ద, మరియు బిలాల్ (రజియల్లాహు అన్హు) వద్ద ఒక ప్రాణి తినగల ఏ వస్తువూ లేకుండింది. కేవలం బిలాల్ చంకలో దాచిపెట్టినంత ఓ వస్తువు మాత్రం”.
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మానవ గౌరవాల్లో కూడా శత్రు- వులు జోక్యం చేసుకున్నారు. మునాఫిఖుల మరియు అజ్ఞాన అరబ్బుల తరఫున ఎన్నో రకాల బాధలకు గురి అయ్యారు. సహీ బుఖారిలో అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విజయధనం పంపిణి చేశారు. అన్సారులోని ఒక వ్యక్తి “అల్లాహ్ సాక్షిగా! ముహమ్మద్ ఈ రకమైన పంపిణి ద్వారా అల్లాహ్ సంతృష్టి కోరలేదు” అని అన్నాడు. ఇబ్ను మస్ఊద్ రజియల్లాహు అన్హు ఈ విషయం ప్రవక్తకు తెలిపారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “అల్లాహ్, ప్రవక్త మూసాను కరుగించుగాకా! ఆయన ఇంతకంటే ఎక్కువ బాధలకు గురయ్యారు. అయినా ఓపిక వహించారు”.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓరిమి కనబరచిన సందర్భాల్లో ఒకటి ఆయన సంతానం చనిపోయిన రోజు. ఆయనకు ఏడుగురు సంతానం. కొద్ది సంవత్సరాల్లో ఒకరెనుకొకరు మరణించారు. కేవలం ఫాతిమ రజియల్లాహు అన్హా మిగిలారు. అయినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనస్తాపం చెందలేదు. అలసటకు గురి కాలేదు, కాని ఓరిమి కనబరచారు. ఆయన కుమారులైన ఇబ్రాహీం చనిపోయిన రోజు ఆయన ఇలా తెలిపారుః “కళ్ళు తప్పకుండా అశ్రుపూరితలవుతాయి. మనస్సు కూడా బాధపడుతుంది. అయితే మా ప్రభువుకు ప్రీతికరమైన మాటలే నా నోట వెలువడుతాయి. ఇబ్రాహీమా! నీ ఎడబాటు మమ్మల్ని శోకసముద్రంలో ముంచేసింది”.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓర్పు, సహనం కేవలం కష్టాల, ఆపదల పైనే కాదు, అల్లాహ్ ఆయనకు ఇచ్చే ఆదేశాల విధేయతలో కూడా ఉండింది. అల్లాహ్ ఆరాధన, విధేయతలో ఆయన కఠోరమైన శ్రమపడేవారు. ఎక్కువ సేపు నమాజులో నిలబడినందుకు ఒక్కోసారి కాళ్ళు వాచిపోయేవి. ఉపవాసాలు, అల్లాహ్ స్మరణలు ఇతర ఆరాధనలు చాలా చేసేవారు. మీరెందుకు ఇంత శ్రమ పడుతున్నారని అడిగినప్పుడు, “నేను అల్లాహ్ కృతజ్ఞత చేసే దాసుణ్ణి కాకూడదా” అని అనేవారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎల్లవేళల్లో అల్లాహ్ ఆరాధన, ధ్యానం మరియు ఆలోచనలో ఉండేవారు. ఆయనకు ఏదైనా చింత, రంది కలిగినప్పుడు లేదా ఏదైనా ఆపద ఎదురైనప్పుడు బిలాల్ ను పిలిచి “నమాజుకు పిలుపునిచ్చి మాకు విలాసం, ఉల్లాసం కలుగజేయు బిలాల్” అని అనేవారు.
ఆయన రాత్రి తహజ్జుద్ చేస్తూ చాలా దీర్ఘంగా ఖియాం చేసేవారు. చివరికి పాదాలు వాపు ఎక్కేవి. ఖుర్ఆన్ చదువుతూ కొన్ని ఆయతులు మరీమరీ చదివేవారు. నమాజు స్థితిలో ఎక్కువగా ఎడ్వడం వల్ల గడ్డం తడి అయ్యేది. ఆయన సతీమణి ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారుః ప్రవక్తా! మీపై మీరు ఎందుకు ఇంతగా కష్టం తెచ్చుకుంటున్నారు. అల్లాహ్ మీ పూర్వపు మరియు వెనకటి పాపాలన్నియూ మన్నించాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పేవారుః “నేను ఆయనకు కృతజ్ఞుడైన దాసుడ్ని కాకూడదా?” రాత్రి అధిక శాతం అల్లాహ్ తో వేడుకోలులో, ఖుర్ఆన్ పారాయణంలో, దుఃఖిస్తూ గడిపేవారు.
అలాగే ఉపవాస విషయానికి వస్తే ప్రయాణంలోనైనా, నివాసంలోనైనా, చలికాలంలోనైనా, ఎండకాలంలోనైనా ఎక్కువగా ఉపవాసాలుండేవారు. మేము ఒకసారి విపరీతమైన ఎండలో ఉన్నాము. ఆరాధనలకు అర్హుడైన అల్లాహ్ సాక్షిగా! ఎండతాపాన్ని భరించలేక మా తలపై చేతులను పెట్టు- కుంటూ ఉంటిమి. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఇబ్ను రవాహ రజియల్లాహు అన్హు, వీరిద్దరు తప్ప ఎవరు ఉపవాసముండలేదు.
దానదర్మాలు విషయం హద్దు లేకుండా దాతృత గుణం గలవారు. ఆయన వద్ద ఉన్న ప్రతీది దానం చేసేవారు. పేదరికానికి భయపడకుండా ఖర్చు చేసేవారు. ఎప్పుడు ఏ ఒక్క యాచకున్ని లేదనలేదు. ఎప్పుడు ఎవరు ఏది అడిగినా ఏమీ ఇవ్వకుండా వట్టి చేతుల్తో పంపేవారు కాదు. అతనికి సహాపడేవారు. ఆయన సహచరులు అనేవారుః ప్రవక్తను ఎప్పుడు ఏ విషయం అడిగినా ఆయన దానిని కాదనలేదు.
జుహ్ద్ అన్న పదం ఏదైనా వస్తువును త్యజించడం అన్న భావంలో వస్తుంది. ఈ నిర్వచనం వాస్తవ రూపంలో ఎవరిపై ఫిట్ అవుతుందంటే; ఐహిక సుఖాలనూ, భోగభాగ్యాలనూ పొంది అఇష్టంగా వాటిని వదులుకొనుట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికన్నా ఎక్కువ జుహ్ద్ గలవారు. ప్రపంచం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ఉన్నప్పటికీ, ఆయన సర్వ సృష్టిలో అల్లాహ్ కు అతి ప్రియులు అయినప్పటికీ, అల్లాహ్ తలిచితే ఆయన కోరుకున్నంత ధనం, వరాలు ఆయనకు ప్రసాదించేవాడు. అయినప్పటికీ ఆయన అందరికన్నా తక్కువ ప్రపంచ వ్యామోహం గలవారు. ఎంత లభించిందో అంతలోనే సరిపుచ్చుకునేవారు. శ్రమతో కూడిన జీవితం పట్ల సంతృప్తి పడేవారు.
ఇమాం ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ తన తఫ్సీరులో ఖైసమ ఉల్లేఖన ప్రస్తావించారుః “నీవు కోరితే ఇంతకు ముందు ఏ ప్రవక్తకు లభించనంత భూ కోశాలు, వాటి బీగములు ప్రసాదిస్తాము. ఇవన్నీ నీ తర్వాత ఎవరికీ దొరకవు. ఇవన్నీ నీకు లభించినప్పుడు అల్లాహ్ వద్ద నీకు గల గౌరవ స్థానాల్లో ఏ కొరతా కలగదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చెప్పబడింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “ఇవన్ని యూ నా కొరకు పరలోకంలో ఉండనీవండి”. (సూర అల్ ఫుర్ఖాన్ 25:10).
ఇక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం, ఆయన ఆర్థిక విషయం మరీ విచిత్రమైనది. అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారుః మదీనలో ఒకసారి నేను ప్రవక్త వెంట రాతినేల మీద నడుస్తూ ఉండగా మాకు ఎదురుగా ఉహద్ పర్వతం వచ్చింది. అప్పుడు ప్రవక్త చెప్పారుః “అబూ జర్ర్! నా దగ్గర ఉహద్ పర్వతమంత బంగారం ఉండి, మూడు రాత్రులు గడిచినంత కాలంలో అప్పు తీర్చడానికి ఉంచుకునే దీనార్ తప్ప ఆ బంగారంలో ఒక దీనార్ కూడా నా దగ్గర ఉండిపోవడం నాకిష్టం లేదు. నేనా సంపదను అల్లాహ్ దాసుల కోసం ఇలా అలా ఖర్చు చేస్తాను అని కుడి, ఎడమ, వెనకా సైగ చేశారు”. మరో సందర్భంలో ఇలా అన్నారుః “నాకు ఈ ప్రపంచంతో ఏమిటి ప్రేమ/ సంబంధం? నేను ఈ లోకంలో ఒక బాటసారి లాంటి వాడిని, ప్రయాణిస్తూ, ఓ చెట్టు క్రింద మజిలి చేసి కొంత సేపట్లో అలసట దూరమయ్యాక ఆ స్థలాన్ని వదలి వెళ్ళిపోతాడు”.
తిండి విషయం, నెల, రెండు నెలలు ఒక్కోసారి మూడు నెలలు గడిసేవి, అయినా ఇంటి పోయిలో మంటనే ఉండకపోయేది. అప్పుడు వారి ఆహార పదార్థం ఖర్జూరం మరియు నీళ్ళు మాత్రమే ఉండేవి. ఒక్కోసారి దినమంతా తిండి లేక మెలికలు పడేవారు. అయినా కడుపు నింపుకోటానికి ఏమీ దొరక్క పోయేది. అధిక శాతం ఆయన యవధాన్యాల రొట్టె తినేవారు. ఆయన ఎప్పుడైనా పలచని రొట్టెలు తిన్న ప్రస్తావనే రాలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సేవకుడైన అనస్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారుః ప్రవక్త గారు అతిథులున్న సందర్భంలో తప్ప పగలు, సాయం కాలం రెండు పూటల భోజనం రొట్టె మరియు మాంసంతో ఎప్పుడూ తినలేదు.
ఆయన దుస్తుల విషయం కూడా పైన పేర్కొనబడిన స్థితికి భిన్నంగా ఏమీ లేకుండింది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం బట్టల విషయంలో ఆడంబరం కనబరచేవారు కారు ఇందులో కూడా జుహ్ద్ పాటించేవారని స్వయంగా సహచరులు సాక్ష్యం పలికారు. ఎక్కువ దరగల బట్టలు ధరించే శక్తి ఉన్నప్పటికీ అలా ధరించలేదు. ఆయన వస్త్రాల గురించి ప్రస్తావిస్తూ ఒక సహచరుడు ఇలా చెప్పాడుః నేనో విషయం మాట్లాడుటకు ప్రవక్త వద్దకు వచ్చాను. ఆయన కూర్చుండి ఉన్నారు. ఆయన మందమైన కాటన్ లుంగీ కట్టుకొని ఉన్నారు.
అబూ బుర్దా రజియల్లాహు అన్హు ఒకసారి విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు అన్హా వద్దకు వెళ్ళారు. ఆమె మాసిక వేసియున్న కంబళి మరియు మందమైన లుంగీ చూపిస్తూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోకం వీడిపోయేటప్పుడు ఈ రెండు బట్టలు ధరించి ఉండిరి అని చెప్పారు. అనస్ రజియల్లాహు అన్హు చెప్పారుః నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో నడిచేవాణ్ణి ఆయనపై నజ్రాన్ లో తయారైనా మందపు అంచుల శాలువ ఉండేది.
ప్రపంచాన్ని వీడి పోయేటప్పుడు ఏ డబ్బు (దిర్హమ్, దినార్), బానిస, బానిసరాళు మరే వస్తువూ విడిచిపోలేదు. కేవలం ఒక తెల్లటి కంచర గాడిద, ఆయుధం మరియు దానం చేసియున్న ఒక భూమి తప్ప. ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారుః “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయిన రోజు నా అల్మారాలో ఏదైనా ప్రాణి తినగల ఓ వస్తువు అంటూ లేకుండింది. కేవలం కొన్ని బార్లీ గింజలు (యవ ధాన్యాలు) తప్ప. ప్రవక్త చనిపోయినప్పుడు ఆయన ఒక కవచం యవ ధాన్యాలకు బదులుగా ఒక యూదుని వద్ద కుదువకు ఉండినది.
న్యాయ విషయానికొస్తే, ఆయన తమ ప్రభువు పట్ల న్యాయంగా వ్యవహరించేవారు. తమ ఆత్మ పట్ల న్యాయంగా ప్రవర్తించేవారు. తమ సతీమణులతో న్యాయంగా జీవించేవారు. దగ్గరివారు, దూరపువారు, స్నేహితులు, తన వాళ్ళు, విరోధులు చివరికి గర్వంగల శత్రువులతో కూడా ఆయన న్యాయాన్ని పాటించేవారు. ఎవరైనా ఆయన్ను ఉపేక్షించినా, ఆయన హక్కును కొందరు అర్థం చేసుకోకున్నంత మాత్రానా ఆయన న్యాయాన్ని వదులుకునేవారు కారు. ఆయన ఎక్కడా, ఏ స్థితిలో ఉన్నా న్యాయం ఆయనకు తోడుగా ఉండేది. ఆయన సహచరుల మధ్య తార తమ్యాలను అసహ్యించుకునేవారు. అందరి పట్ల సమానత్వం, న్యాయాన్ని కోరేవారు. ఆయన స్వయంగా వారిలాగా కష్టాన్ని భరించే వారు. అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారుః బద్ర్ యుధ్ధం రోజున ఒంటెలు తక్కువ ఉండడం వల్ల ప్రతి ముగ్రురికి ఒక ఒంటె వచ్చింది. అయితే అబూ లుబాబ మరియు అలీ బిన్ అబూ తాలిబ్ తో మూడువారో ప్రవక్త ఉండిరి. నడిచే వంతు ప్రవక్తది వచ్చినప్పుడు ప్రవక్తా! మీరు స్వారీ చేయండి మేము నడిచి వెళ్తాము అంటే వినిపించు కునేవారు కారు. ఆయన ఇలా చెప్పేవారుః “మీరు నా కంటే ఎక్కువ శక్తి గలవారు కారు. నేను కూడా మీలాగ పుణ్యం సంపాదించుకోవాలని అనుకునేవాణ్ణి”.
ఒకసారి ఉసైది బిన్ హూజైర్ రజియల్లాహు అన్హు తన జాతివారితో జోకులేసుకుంటూ నవ్వుతుండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన నడుములో పుల్ల గుచ్చారు. వెంటనే ఉసైద్ అన్నాడుః ప్రవక్తా! మీరు నాకు నొప్పి కలిగించారు. నేను మీతో ప్రతీకారం తీర్చుకోదలుచు కున్నాను. ప్రవక్త చెప్పారుః సరే తీర్చుకో. ఉసైద్ అన్నాడుః ఇప్పుడు మీ శరీరంపై చొక్కా ఉంది. మీరు నాకు పుల్ల గుచ్చినప్పుడు నాపై చొక్కా లేకుండింది. అప్పుడు ప్రవక్త తమ నడుము నుండి చొక్కా లేపారు. ఇదే అదృష్టం అనుకున్న ఉసైద్ నడుము మరియు పక్కల మధ్య ముద్దించు కోసాగాడు. మళ్ళీ చెప్పాడుః నేను కోరింది ఇదే ప్రవక్తా!
అల్లాహ్ యొక్క హద్దులను అతిక్రమించుట, లేదా న్యాయంగా ప్రజల్లో వాటిని అమలు పరుచుటలో ఏ మాత్రం జాప్యం చేయుట ఇష్టపడేవారు కారు. అపరాధి ఆయన దగ్గరివాడు, బంధువుడైన సరే. మఖ్జూమియ వంశానికి చెందిన ఒక స్త్రీ దొంగతనం చేసినప్పుడు ఆమెపై అల్లాహ్ విధించిన హద్దు చెల్లవద్దని ఉసామా రజియల్లాహు అన్హును సిఫారసు కొరకు ప్రవక్త వద్దకు పంపారు. ప్రవక్త అతని సిఫారసు అంగీకరించలేదు. అప్పుడు ఈ ప్రఖ్యాతిగాంచిన నుడివి పలికారుః “ఓ ప్రజలారా! మీకంటే ముందు గతించిన వారు వినాశనానికి గురి అయ్యే కారణం ఏమిటంటే వారిలో దొంగతనం చేసే వ్యక్తి ఉన్నత వంశీయడవుతే అతన్ని శిక్షించ కుండానే వదిలేసేవారు. అదే బడుగు వర్గం వాడయితే శిక్షించేవారు. అల్లాహ్ సాక్షిగా! “ముహమ్మద్ కూతురు ఫాతిమ గనక దొంగతనం చేస్తే నేను ఆమె చేతుల్ని నరికేవాన్ని”.
కొందరు తత్వవేత్తలు, ఇస్లాం స్టడీ చేసిన పాశ్చాత్య నిపుణులు (orientalists) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఇచ్చిన స్టేట్ మెంట్స్ క్రింద తెలుపుతున్నాము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గొప్పతనాన్ని, ఆయన ప్రవక్తపదవిని, ఆయన ఉత్తమ గుణాలను వారు ఒప్పుకున్న విషయాల్ని స్పష్టం చేస్తున్నాము. కొందరు ఇస్లామీయ విరోధులు, శత్రువులు చేస్తున్న దుష్ప్రచారానికి, పక్షపాతానికి ఈ ఇస్లాం ధర్మం దూరంగా ఉంది అని వారు తెలిపిన ఇస్లాం ధర్మ వాస్తవికతలను మీ ముందుంచుతున్నాము. (అయితే ఇస్లాంగానీ, ప్రవక్తగానీ వారి ప్రశంసలకు, సాక్ష్యాలకు ఆధారపడిలేరు. మరి ఇవి తెలిపే కారణం ఏమిటంటే; ఇస్లాంను అర్థం చేసుకోకుండా, దానిని చెడుగా భావించేవారు, వారి వంశం, లేదా వారి లాంటి మతాలపై ఉన్నవారిలో కొందరు ఇస్లాంను చదివి ఎలా అర్థం చేసుకున్నారో అదే విధంగా ఇస్లాం అధ్యాయనం చేసి, న్యాయంపై ఉండాలన్నదే మా ఉద్దేశం).
జోర్జ్ బర్నార్డ్ షా(*) తన రచన “ముహమ్మద్”లో (బ్రిటిష్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని కాల్చేసింది) ఇలా వ్రాశాడుః “ఈ నాటి సమాజానికి ముహ మ్మద్ లాంటి మేధావి అవసరం చాలా ఉంది. ఈ ప్రవక్త ఎల్లప్పుడూ తన ధర్మాన్ని గౌరవ స్థానంలో ఉంచాడు. ఆయన తీసుకొచ్చిన ధర్మం ఇతర నాగరికతలను అంతమొందించే అంతటి శక్తి గలది. శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండునది. నా జాతి వాళ్ళల్లో చాలా మంది స్పష్టమైన నిదర్శనంతో ఈ ధర్మంలో ప్రవేశిస్తున్నది నేను చూస్తున్నాను. సమీపం లోనే ఈ ధర్మం యూరపు ఖండంలో విశాలమైన చోటు చేసుకుంటుంది”.
ఇంకా ఇలా వ్రాశాడుః “అజ్ఞానం, దానిపై పక్షపాతం వల్ల మధ్య శతాబ్థి (Middle Ages) లోని క్రైస్తవ మత పెద్దలు ముహమ్మద్ తీసుకొచ్చిన ధర్మాన్ని అంధవికారంగా చిత్రీకరించి, అది క్రైస్తవ మతానికి శత్రువు అని ప్రచారం చేశారు. కాని నేను ఈ వ్యక్తి (ముహమ్మద్) గురించిచదివాను. అతను వర్ణాతీతమైన, అపరూపమైన వ్యక్తి. ఆయన క్రైస్తవమతానికి శత్రువు ఎంత మాత్రం కారు. ఆయన్ను మానవ జాతి సంరక్షకుడని పిలవడం తప్పనిసరి. నా దృష్టిలో ఆయన గనక నేటి ప్రపంచ పగ్గాలు తన చేతిలో తీసుకుంటే మన సమస్యల పరిష్కార భాగ్యం ఆయనకు లభిస్తుంది. నిజమైన శాంతి, సుఖాలు ప్రాప్తమవుతాయి. అవి పొందడానికే మానవులు పరితపిస్తున్నారు.
(*) నోట్: George Bernard Shaw. జననం 26/7/1856. మరణం 2/11/1950. జన్మ స్థలం Ireland.
థోమస్ కార్లైల్(**) తన ప్రఖ్యాతిగంచిన రచన “On Heroes, HeroWorship, and the Heroic in History”లో ఇలా వ్రాశాడుః “ముహమ్మద్ కుయుక్తుడు, మోసగాడు, అసత్యరూపి మరియు అతని ధర్మం కేవలం బూటకపు, బుద్ధి హీన విషయాల పుట్ట అన్న ప్రస్తుత మన వ్యూహం, మరియు ఇలాంటి వ్యూహాలను వినడం నేటి విద్యాజ్ఞాన యుగంలో మన కొరకే సిగ్గు చేటు. ఇలాంటి మూఢ, సిగ్గుచేటు విషయాలు ప్రభలకుండా పోరాడడం మన విధి. ఈ ప్రవక్త అందజేసిన సందేశం 12 వందల సంవత్సరాల నుండి రెండు వందల మిలియన్లకంటే ఎక్కువ మంది కొరకు ప్రకాశ వంతంగా ఉంది. ఈ సందేశాన్ని విశ్వసించి, దాని ప్రకారం తమ జీవితా లను మలచుకొని దానిపై చనిపోయిన ప్రజలు అసంఖ్యాకులు. ఇంతటి గొప్ప వాస్తవం అబద్ధం, బూటకం అని భావించగలమా?”.
(**) నోట్: Thomas Carlyle జననం 4/12/1795 స్కాట్ ల్యాండ్ లోని Ecclefechan గ్రామంలో. మరణం 5/2/1881 లండన్ లో ప్రఖ్యాతి గాంచిన చరిత్ర కారుడు, సాహిత్యపరుడు.
మన ఇండియా తత్వవేత్త రామ క్రిష్ణా రావు ఇలా చెప్పారుః “అరబ్ ద్వీపంలో ముహమ్మద్ ప్రకాశమయినప్పుడు అది ఓ ఎడారి ప్రాంతం. అప్పటి ప్రపంచ దేశాల్లో నామమాత్రం గుర్తింపు లేని ప్రాంతం అది. కాని కొత్త సంస్కృతి, సభ్యతను ఏర్పరిచారు. మరియు కొత్త రాజ్యాన్ని నిర్మించారు. అది మొరాకో నుండి ఇండియా ద్వీపకల్పం వరకు విస్తరించింది. అంతే కాదు ఆయన ఆసియా, ఆఫ్రికా మరియు యూరప్ ఖండాల్లోని జీవనశైలి, విచారణా విధానాల్లో గొప్ప మార్పు తేగలిగాడు.
కెనడాకు చెందిన ఓరియంటలిస్ట్ జ్వీమర్ (S.M. Zweimer) ఇలా వ్రాశాడుః “నిశ్చయంగా ముహమ్మద్ ధార్మిక నాయకుల్లో అతి గొప్పవారు.
ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఆయన శక్తివంతుడైన సంస్కరణకర్త, అనర్గళ వాగ్ధాటి, ధైర్యంగల అతిసాహసి, సువిచారం చేయు గొప్ప మేధావి అని అనడమే సమంజసం. ఈ సద్గుణాలకు విరుద్ధమైన విషయాలు ఆయనకు అంకితం చేయుట ఎంత మాత్రం తగదు, యోగ్యం కాదు. ఆయన తీసుకొచ్చిన ఈ ఖుర్ఆను మరియు ఆయన చరిత్ర ఇవి రెండూ ఆయన సద్గుణాలకు సాక్ష్యం చెబుతున్నాయి.
సర్ విలియమ్ యోయిర్ (Sir William Muir) ఇలా చెప్పాడుః “ముహమ్మద్ -ముస్లిముల ప్రవక్త- చిన్నప్పటి నుండే అమీన్ అన్న బిరుదు పొందారు. ఆయన ఉత్తమ నడవడిక, మంచి ప్రవర్తనను బట్టి ఆయన నగరవాసులందరూ ఏకంగా ఇచ్చిన బిరుదు ఇది. ఏదీ ఎట్లయినా, ముహమ్మదు వర్ణాతీతమైన శిఖరానికి ఎదిగి యున్నారు. ఏ వ్యక్తి ఆయన గురించి వర్ణించగలడు. ఆయన్ను ఎరగనివాడే ఆయన గౌరవస్థానాన్ని ఎరగడు. ఆయన గురించి ఎక్కువగా తెలిసినవాడు ఆయన గొప్ప చరిత్రను నిశితంగా పరిశీలించినవాడు. ఈ చరిత్రనే ముహమ్మదును ప్రవక్తల్లో మొదటి స్థానంలో మరియు విశ్వమేధావుల్లో ఉన్నతునిగా చేసింది.
ఇంకా ఇలా అన్నాడుః “ముహమ్మద్ తన స్పష్టమైన మాట, సులభ మైన ధర్మం ద్వారా సుప్రసిద్ధులయ్యారు. మేధావుల మేధను దిగ్ర్భమలో పడవేసిన పనులు ఆయన పూర్తి చేశారు. అతి తక్కువ వ్యవధిలో అందరినీ జాగరూక పరచిన, అప్రమత్తం చేసిన, నశించిపోయిన సద్గుణాల్లో జీవం పోసిన, గౌరవ మర్యాదల ప్రతిష్ఠను చాటి చెప్పిన ఇస్లాం యొక్క ప్రవక్త ముహమ్మద్ లాంటి సంస్కరణకర్త చరిత్రలో ఎవ్వరూ మనకు కనబడరు.
గొప్ప నవలారచయిత, తత్వవేత్త రష్యాకు చెందిన లియో టోల్స్ టాయ్(#) ఇలా చెప్పాడుః “ముహమ్మద్ విఖ్యాతి, కీర్తి గౌరవానికి ఇది ఒక్క విషయం సరిపోతుందిః ఆయన అతి నీచమైన, రక్తపాతాలు సృష్టించే జాతిని, సమాజాన్ని దుర్గుణాల రాక్షసి పంజాల నుండి విడిపించారు. వారి ముందు అభివృద్ధి, పురోగతి మార్గాలు తెరిచారు. ముహమ్మద్ ధర్మశాస్త్రం కొంత కాలంలో విశ్వమంతటిపై రాజ్యమేలుతుంది. ఎందుకనగా ఆ ధర్మానికి బుద్ధిజ్ఞానాలతో మరియు మేధ వివేకాలతో పొందిక, సామరస్యం ఉంది.
(#) నోట్: Leo Tolstoy Nikolayevich. జననం 9/9/1828 మరణం 20/11/1910 జన్మ స్థలం Tula Oblast, Russia. ప్రపంచపు గొప్ప నవలా రచయితల్లో ఒకడితను. తత్వవేత్త కూడా.
ఆస్ట్రియా దేశస్తుడైన షుబ్రుక్ చెప్పాడుః ముహమ్మద్ లాంటి వ్యక్తి వైపు తనకు తాను అంకితం చేసుకోవడంలో మానవజాతి గర్వపడుతుంది. ఎందుకనగా ఆయన చదువరులు కానప్పటికీ కొద్ది శతాబ్ధాల క్రితం ఒక చట్టం తేగలిగారు. మనం ఐరోపాకు చెందిన వాళ్ళం గనక దాని శిఖరానికి చేరుకున్నామంటే మహా అదృష్టవంతులమవుతాము.
మహాప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వసల్లం యొక్క సంపూర్ణ జీవిత చరిత్ర పరిశీలన దృష్టితో చదివి ఆయన అనుకరణ భాగ్యం అల్లాహ్ సర్వమానవాలికి ప్రసాదించుగాక! ఆమీన్!!!
25.34980855.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ముస్లిం వనిత (Muslim Woman) అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
ఇస్లాం ధర్మంలో స్త్రీలకున్న హక్కులను గురించి చర్చించే ముందు ఇతర మతాల్లో స్త్రీలకున్న హక్కులు, వాటి వ్యవహారం స్త్రీల పట్ల ఎలా ఉంది అనేది వివరించడం చాలా ముఖ్యం.
గ్రీకుల వద్ద స్త్రీ అమ్మబడేది మరియు కొనబడేది. ఆమెకు ఏ హక్కూ లేకుండింది. సర్వ హక్కులు పురుషునికే ఉండినవి. ఆస్తిలో వారసత్వం లేకుండా తన స్వంత సొమ్ములో ఖర్చు పెట్టే హక్కు కూడా లేకుండింది. ప్రఖ్యాతి గాంచిన అచ్చటి తత్వవేత్త సుఖరాత్ (Socrates the philosopher 469-399BC) ఇలా అన్నాడు. “స్త్రీ జాతి ఉనికి ప్రపంచం యొక్క అధోగతి మరియు క్షీణత్వానికి ఒక మూల కారణం. స్త్రీ ఒక విషమాలిన చెట్టు తీరు, చూపుకు ఎంతో అందంగా ఉంటుంది కాని పక్షులు దాన్ని తిన్న వెంటనే చనిపోతాయి”.
రోమన్లు స్త్రీకి ఆత్మయే లేదనేవారు. వారి వద్ద స్త్రీకి ఏలాంటి విలువ, హక్కు లేకుండింది. “స్త్రీకి ఆత్మ లేదు” అనడం వారి నినాదంగా ఉండింది. అందుకే వారిని స్థంబాలకు బంధించి కాగిన నూనె వారి దేహాలపై పోసి వారిని బాధించేవారు. ఇంతకంటే ఘోరంగా నిర్దోషులైన స్త్రీలను గుఱ్ఱపు తోకతో కట్టి వారు చనిపోయెంత వరకు గుఱ్ఱాన్ని పరిగెత్తించేవారు.
మన భారత దేశంలో మరో అడుగు ముందుకు వేసి భర్త చనిపోతే భార్యను కూడా సతీసహగమనం చేయించేవారు.
చైనీయులు స్త్రీ యొక్క ఉదాహరణ ధన సంపాదనను మరియు మంచితనాన్ని నశింపజేసే నీటితో ఇచ్చేవారు. భార్యని అమ్మడం ఒక హక్కుగా భావించేవారు. అదే విధంగా సజీవంగా దహనం చేయుట ఒక హక్కుగా భావించేవారు.
హవ్వా, ఆదమును కవ్వించి చెట్టు నుంచి పండు తినిపించిందని యూదులు స్త్రీ జాతినే శపించబడినదిగా భావించేవారు. స్త్రీ బహిష్టు రాలయినపుడు తనుండే గృహము, తను ముట్టుకునే ప్రతి వస్తువు కూడా అపరిశుభ్రమవుతుందని భావించేవారు. తనకు సోదరులుంటే తన తండ్రి ఆస్తిలో వచ్చే భాగం తనకు ఇచ్చేవారు కారు.
క్రైస్తవులు స్త్రీని షైతాన్ (దయ్యం, పిశాచం) యొక్క ద్వారముగా భావించేవారు. ఒక క్రైస్తవ పండితుడు స్త్రీ విషయంలో ఇలా ప్రస్తావించాడు: “స్త్రీ మానవ పోలిక గలది కాదు”. బోనావెన్తూర్ (Saint Bonaventure 1217 – 1274) ఇలా చెప్పాడు: “మీరు స్త్రీని చూసి మానవుడే కాదు. కౄర జంతువని కూడా అనుకోకండి. మీరు చూసేది షైతాన్ మరియు వినేది కేవలం పాము ఈలలు”.
ఇంగ్లీషు వారి చట్టం “Common law” ప్రకారమయితే గత అర్ద శతాబ్దంలో స్త్రీ పౌరుల తరగతులోని ఏ తరగతిలో కూడా లెక్కించబడక పోయేది. మరియు స్త్రీకి స్వంతగా ఏ హక్కు లేకుండింది. చివరికి తను ధరించే దుస్తులు కూడా తన అధికారంలో లేకుండినవి. క్రీ.శ. 1567న స్కాట్ల్యాండ్ పార్లమెంటులో ఏ చిన్న అధికారం కూడా స్త్రీకి ఇవ్వకూడదన్న ఆదేశం జారి చేశారు. హెన్రి8th (Henry VIII) పరిపాలనలో బ్రిటిష్ పార్లమెంటు స్త్రీ అపరిశుభ్రత గలది గనుక బైబిల్ చదవకూడదని చట్టం జారి చేసింది. 1586వ సంవత్సరం ఫ్రాన్సులో ఒక సమ్మేళనం ఏర్పాటు చేసి స్త్రీ మనిషేనా, లేదా అని చర్చించి చివరికి మనిషే కాని పురుషుని సేవ కొరకు పుట్టించబడిందన్న నిర్ణయానికి వచ్చారు. క్రీ.శ. 1805 వరకు బ్రిటిషు చట్టం “భర్త తన భార్యను అమ్ముట యోగ్యమే” అని యుండింది. మరియు వారు భార్య యొక్క ధర ఆరు పెన్సులు (6pence ie Half Schillng) నిర్ణయించారు.
అరబ్బులు ఇస్లాంకు ముందు స్త్రీని చాలా నీచంగా చూసేవారు. ఏ స్థాయి లేకుండా, ఆస్తిలో హక్కు లేకుండా ఉండింది. అనేక అరబ్బులు తమ బిడ్డలను సజీవంగా దహనం చేసేవారు.
స్త్రీ జాతి భరించే ఈ అన్యాయాన్ని తొలగించుటకు, స్త్రీ పురుషులు ఒకటే మరియు పురుషులకున్న విధంగా వారికి హక్కులున్నవి అని చాటి చెప్పుటకు ఇస్లాం ధర్మం వచ్చింది. ఇదే విషయాన్ని దివ్య గ్రంథం ఖుర్ఆన్ లో సృష్టికర్త అయిన అల్లాహ్ ఇలా తెలిపాడు:
{మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి, ఒకే స్త్రీ నుండి సృష్టించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసు కునేందుకు మిమ్మల్ని జాతులుగానూ, తెగలుగానూ చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు}. (హుజురాత్ 49: 13).
{మంచి పనులు చేసేవారు పురుషులైనా, స్త్రీలైనా వారు గనక విశ్వాసులైతే స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవ్వంత అన్యాయం కూడా జరగదు}. (నిసా 4: 124). మరో చోట దివ్య ఖుర్ఆన్ ఇలా తెలుపుతుందిః
ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ఇలా ప్రశ్నించాడు, ‘నా సద్వ ర్తనలకు, సేవలకు అందరికంటే ఎక్కువ హక్కు గలవారెవరు?’ అని, “నీ తల్లి” అని చెప్పారు ప్రవక్త. అతను ‘మళ్ళీ ఎవరు’ అని అడిగాడు. దానికి ప్రవక్త “నీ తల్లి” అని చెప్పారు. ‘మళ్ళీ ఎవరు’ అని అడగ్గా “నీ తల్లి” అని చెప్పారు. మళ్ళీ ఎవరు అని అడిగినప్పుడు “నీ తండ్రి” అని ప్రవక్త బదులిచ్చారు. (బుఖారి 5971, ముస్లిం 2548).
ఇస్లాం స్త్రీ గురించి ఏమంటుందనే దానికి ఇది ఒక సంక్షిప్త విషయం. మరీ వివరానికి తరువాతి పేజీలు చదవండి.
స్త్రీ యొక్క సామాన్య హక్కులు
స్త్రీకు కొన్ని సామాన్య హక్కులున్నవి. వాటిని స్వయంగా స్త్రీలు తెలుసుకొనుట మరియు పురుషులు వాటిని వారి కొరకు అంగీకరించుట ఎంతయినా అవసరం. స్త్రీలు తమ ఈ హక్కలను తమిష్టానుసారం వినియొగించుకోవచ్చును.
సంక్షిప్తంగా ఆ హక్కులు ఇవి
1- స్వామ్యం (Ownership): బిల్డింగ్, పంటలు, పొలాలు, ఫ్యాక్టరీలు, తోటలు, బంగారం, వెండి మరియు అన్ని రకాల పశువులు. వీటన్నిట్లో స్త్రీ తను కోరినవి తన యాజమాన్యంలో ఉంచుకో వచ్చును. స్త్రీ భార్య, తల్లి, బిడ్డ మరియు చెల్లి, ఇలా ఏ రూపములో ఉన్నా, పై విషయాలు తన అధికారంలో ఉండ వచ్చును.
2- వివాహ హక్కు, భర్తను ఎన్నుకునే హక్కు. భర్తతో జీవితం గడపడంలో నష్టం ఏర్పడినపుడు వివాహ బంధాన్ని తెంచుకొని, విడాకులు కోరే హక్కు. ఇది స్త్రీ యొక్క ప్రత్యేక హక్కు అనడంలో ఏ సందేహం లేదు.
3- విద్యః తనపై విధిగా ఉన్న విషయాలను నేర్చుకునే హక్కు. ఉదాః అల్లాహ్ గురించి, తన ప్రార్థనలు మరియు వాటిని చేసే విధానం తెలుసుకొనుట తనపై విధిగా ఉన్న హక్కులు. తను ఎలాంటి ప్రవర్తన అవలంభించాలి, ఏలాంటి సంస్కారం, సభ్యత పాటించాలి అనే విషయాలు తెలుసుకొనుట ప్రతి స్త్రీ హక్కు. అల్లాహ్ ఆదేశం:
“విద్యనభ్యసించడం ప్రతి ముస్లింపై విధిగా యుంది”. (ఇబ్ను మాజ 224).
4- దానధర్మం: తన స్వంత ధనము నుంచి తను కోరుకున్నట్లు తనపైగాని, ఇతరులపై గానిః వారు తన భర్త అయినా, సంతానమ యినా, తండ్రి లేక తల్లి అయినా ఖర్చు చేయవచ్చును. హద్దుకు మించి, వ్యర్థమైన ఖర్చు చేయ కూడదు. (చేసినచో, దాన్ని నిరోధించడం ఆమె బాధ్యుని విధి). ఖర్చు చేయడంలో పురుషుని కున్నంత అధికారం స్త్రీలకూ ఉంది.
5- ప్రేమించే, అసహ్యించే హక్కుః సద్గుణముగల స్త్రీలను ప్రేమించి, వారి ఇంటికి వెళ్ళడం, వారికి బహుమానంగా ఏదైనా పంపడం, వారితో కలం స్నేహం చేయడం, వారి క్షేమసమాచారాలు తెలుసు కోవడం, వారి బాధల సమయాన వారిని పరామర్శించడం. (భార్య తన భర్త, ఇతర స్త్రీలు తమ బాధ్యుల అనుమతితో చెయ్యాలి). మరియు దుర్గుణం గలవారిని అసహ్యించి, అల్లాహ్ సంతృష్టి కొరకు వారితో దూరముండటం.
6- వాంగ్మూలం: తన స్వంత ధనం నుంచి తన జీవితములోనే మూడవ వంతు ధనము గురించి తను కోరినవారికి వసియ్యత్ (వాజ్మూలం) చేయ వచ్చును. తను చనిపోయిన తరువాత ఆమె ఆ వసియ్యత్ ను ఏలాంటి అభ్యంతరం లేకుండా జారి చేయించ వచ్చును. ఎందుకనగా వసియ్యత్ ప్రతి ఒక్కరి స్వంత విషయం. పురుషులకున్న విధంగానే స్త్రీలకు కూడా ఆ హక్కుంది. ప్రతి ఒక్కరు అల్లాహ్ నుంచి సత్ఫలితం కోరుట చాలా ముఖ్యం. కాని ఈ వసియ్యత్ మొత్తం ఆస్తిలో మూడిట్లో ఒక వంతుకన్న ఎక్కువ ఉండకూడదు.
7- దుస్తులు ధరించడంలో తినిష్టానుసారం పట్టు బట్టలు, బంగారము ధరించవచ్చును. ఇవి రెండూ పురుషులపై నిషిద్ధము. కాని ధరించి కూడా నగ్నంగా ఉన్నట్లనిపించే దుస్తులు ధరించ కూడదు. అంటే శరీర సగభాగం లేక నాల్గవ భాగం మాత్రమే దరించుట, లేక తలను, మెడను మరియు వదను కొంగుతో, పైటతో కప్పియుంచక పోవుట. ఈ స్థితిలో కేవలం తన భర్త ఎదుట మాత్రం ఉండవచ్చును.
8- భర్త కొరకు సింగారం చేయుట, సుర్మా, కాటిక పెట్టుకొనుట, ఇతర
యోగ్యమైన వస్తువులతో సింగారించుకొనుట, భర్త ఇష్టపడే మంచి దుస్తులు ధరించుట యోగ్యమే. కాని అవిశ్వాస స్త్రీలు మరియు వేశ్యలు ధరించే డ్రెస్సులు ధరించక, సందేహాత్మక వస్త్రాల నుండి దూరముండుటయే మంచిది.
9- తినే త్రాగే విషయాల్లో తమకు నచ్చినది తినత్రాగ వచ్చును. పురుషులకు వేరు స్త్రీలకు వేరు అని ఏమీ లేదు. పురుషులకు యోగ్య- మున్నదే స్త్రీలకు ఉంది. పురుషులకు నిషిద్ధమున్నదే స్త్రీలకు నిషిద్ధమున్నది. అల్లాహ్ (సూరె ఆరాఫ్ 7: 31)లో ఈ విధంగా బోధించాడుః
స్త్రీ యొక్క ప్రత్యేక హక్కుల్లో ఆమె పట్ల ఆమె భర్తపై ఉన్న హక్కులు. ఇవి తన భర్త హక్కులు ఆమెపై ఉన్న విధంగనే ఉన్నవి. ఉదాః అల్లాహ్ మరియు ప్రవక్త అవిధేయతకు గురి చేయని భర్త ఆజ్ఞలు పాటించడం. అతనికి భోజనాలు వండి పెట్టడం. పడకను బాగుంచడం. సంతానాన్ని పోషించి, మంచి శిక్షణ ఇవ్వడం. అతని ధన, మానమును కాపాడడం. తన మానాన్ని కాపాడుతూ, యోగ్యమైన అలంకరణ వస్తువులను ఉపయోగించి అతని కొరకు సింగారించుకొనడం. ఇవి స్త్రీపై ఉన్న తన భర్త హక్కులు.
ఒక స్త్రీ పట్ల తన భర్తపై ఉన్న హక్కుల్లో అల్లాహ్ ఆదేశాను సారం సంక్షిప్తంగా కొన్ని హక్కులు క్రింద తెలుసుకుందాము.
{మగవారికి మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా మగవారిపై ఉన్నాయి}. (బఖర 2: 228).
ప్రతి విశ్వాసిని తన ఈ హక్కులను గుర్తెరిగి ఏలాంటి సిగ్గు పడక మరియు భయపడకుండా తన హక్కులను పొందాలని మేము ఇచ్చట పేర్కొన్నాము. భర్త ఆమెకి ఈ హక్కులను పూర్తిగా ఇవ్వడం అతనిపై విధిగా ఉంది. ఒక వేళ ఆమె స్వయంగా తన ఈ హక్కులను వదులుకుంటే పర్వాలేదు.
భర్తపై ఉన్న భార్య హక్కులు ఇవి
1- కలిమిలోనైనా, లేమిలోనైనా భార్య యొక్క పోషణ, వస్త్ర, చికిత్స మరియు గృహ వసతులు మొదలగునవి తను ఏర్పాటు చేయాలి.
2- ఆమె ధన, ప్రాణ, మానములను మరియు ఆమె ధర్మాన్ని కాపాడాలి. పురుషునికి స్త్రీపై అధికారమివ్వబడింది గనుకు అధికారి విధి ఏమనగా తనకు దేనిపై అధికారమివ్వబడిందో దాన్ని రక్షించటం, కనిపెట్టి ఉండటం.
3- ధర్మానికి సంబంధించిన విషయాలను ఆమెకు నేర్పే బాధ్యత భర్తది. అతనిలో నేర్పే శక్తి లేకుంటే, స్త్రీల విద్య బోధన ప్రత్యేక సమావేశాల్లోః మస్జిదులో లేక బడిలో వెళ్ళి నేర్చుకొనుటకు అను మతివ్వాలి. అచ్చట ఉపద్రవం లేకుండా శాంతి ఉండాలి. ఇద్దరిలో ఏ ఒక్కరికి కూడా ఏలాంటి నష్టం కలిగే భయం ఉండకూడదు.
4- భార్యతో సద్వర్తనతో మెలగాలి. అల్లాహ్ ఆదేశం ఇలా ఉందిః {వారితో సద్భావంతో జీవితం గడపండి}. (నిసా 4: 19). సద్వర్తనతో మెలిగి మంచి విధంగా సంసారం చేయుట అనగా భార్యతో కాపురం చేయుట ఒక హక్కు. దాన్ని పూర్తి చెయ్యాలి. ఆమెను దూషించి, తిట్టి బాధ కలిగించరాదు. ఏలాంటి భయం లేని భారాన్ని ఆమెకు అప్పగించరాదు. మాట మరియు తన ప్రవర్తన ద్వారా మంచిగా వ్యవహరించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహహి వసల్లం ఇలా చెప్పారుః “మీలో మంచివారు ఎవరయ్యా అంటే తమ భార్యల పట్ల మంచితనముతో మెలిగేవారే. నేను నా భార్యల పట్ల మంచిగా మెలిగేవాణ్ణి. (తిర్మిజి 3895).
పర్ద
కుటుంబ జీవితం విఛ్ఛిన్నం కాకుండా, అధోగతి వైపునకు పోకుండా సురక్షితంగా ఉండాలని ఇస్లాం చాలా ప్రోత్సహించింది. మనిషి సుఖంగా ఉండి, సమాజం పరిశుద్ధంగా ఉండుటకు, దాన్ని మంచి సభ్యత, మంచి గుణాల యొక్క బలమైన అడ్డుతో రక్షణ కల్పించి కాపాడింది. ఈ గుణాలను పాటిస్తే భావోద్రేకాలు ఉద్భ వించవు. మనోవాంఛలకు తావు ఉండదు. ఉపద్రవాలకు తావు ఇచ్చే కోరికల్ని కూడా ఆపుటకు అడ్డు ఖాయం చేసి స్త్రీ పురుషులు తమ కంటి చూపులను క్రిందికి జేసుకోవాలని ఆదేశించింది.
స్త్రీ యొక్క గౌరవానికి, తన మానము యొక్క అవమానము కాకుండా బధ్రంగా ఉండుటకు, నీచ మనస్సు గలవారు మరియు అల్లకల్లోలం సృష్టించేవారు ఆమె నుంచి దూరముండటకు, గౌరవ మర్యాదల విలువ తెలియని మూర్ఖుల నుంచి బధ్రంగా ఉండుటకు, విషపూరితమైన చూపులకు కారణమగు ఉపద్రవాలను అడ్డుకొనుటకు, స్వయంగా స్త్రీ గౌరవము, తన మానము యొక్క భద్రతకు అల్లాహ్ “పర్ద” యొక్క ఆజ్ఞ ఇచ్చాడు.
ముఖము, రెండు అర చేతులు తప్ప పూర్తి శరీరము కానరాకుండా “పర్ద” చేయుట విధి అనీ, పరపురుషుల ఎదుట తన అలంకరణను, వంపుసొంపులను బహిరంగ పర్చకూడదనీ ధర్మ వేత్తలు ఏకీభవించారు. రెండు అర చేతులు మరియు ముఖం విషయంలో ధర్మవేత్తలు బేధాబిప్రాయంలో పడి రెండు గ్రూపులయ్యారు. ప్రతి ఒక్కరి వద్ద తమ అభిప్రాయం ప్రకారం ఆధారాలున్నవి. “పర్ద” ధరించుట విధి అని, దాని హద్దును గూర్చి అనేక ఆధారాలు గలవు. ప్రతి ఒక్కరూ వాటి నుంచే ఆధారము తీసుకున్నారు. తమ అభిప్రాయానికి వ్యెతిరేకమున్న ఆధారాలకు ఎన్నో హేతువులు (కారణాలు) చెప్పారు. అల్లాహ్ ఆదేశాలు ఇలా ఉన్నవిః
{ప్రవక్త భార్యలను మీరు ఏదైనా అడగవలసి ఉంటే తెరచాటున ఉండి అడగండి. ఇది మీ హృదయాల మరియు వారి హృదయాల పరిశుద్ధత కొరకు ఎంతో సముచితమైన పద్దతి}. (33: అహ్ జాబ్: 53).
{ఓ ప్రవక్తా! నీ భార్యలకు, నీ కూతుళ్ళకు, విశ్వాసుల స్త్రీలకు తమ దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడ తీసుకోమని చెప్పు. వారు గుర్తింప బడటానికీ, వేధింపబడకుండా ఉండేందుకు ఇది ఎంతో సముచితమైన పద్దతి, అల్లాహ్ క్షమించేవాడు కరుణించు వాడునూ}. (33: అహ్ జాబ్: 59).
{ఓ ప్రవక్తా! విశ్వసించిన మహిళలకు ఇలా చెప్పుః తమ చూపులను కాపాడుకోండి అని, తమ మర్మాంగాలను రక్షించుకోండి అని, తమ అలంకరణను ప్రదర్శించవద్దని – దానంతట అదే కనిపించేది తప్ప – తమ వక్షః స్థలాలను ఓణి అంచులతో కప్పుకోవాలని, వారు తమ అలంకరణను వీరి ముందు తప్ప మరెవరి ముందు ప్రదర్శించ కూడదనిః భర్త ….}. (24: నూర్ :31).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర భార్య ఆయిషా సిద్దీఖా రజియల్లాహు అన్హా ఇలా చెబుతున్నారుః “స్త్రీలు దుప్పట్లు కప్పుకొని వచ్చి ప్రవక్త వెనక ఫజ్ర్ నమాజు చేసేవారు. నమాజైన తర్వాత వారు తిరిగి ఇండ్లకు పోతుండగా చీకటి కారణంగా గుర్తింప బడేవారు కారు”. (సునన్ నసాయి). ఫాతిమ బిన్తె మున్జిర్ రహిమహుల్లాహ్ చెప్పారుః “మేము ఇహ్రాం (హజ్ లేక ఉమ్రా) స్థితిలో ఉండగా మా కొంగులను ముఖముపై వ్రేలాడ తీసుకునే వారిమి. అప్పుడు అస్మా బిన్తె అబీ బక్ర్ రజియల్లాహు అన్హా మాతో ఉన్నారు. (ముఅత్త ఇమాం మాలిక్. హజ్/ తఖ్మీరుల్ ముహ్రిమి వజ్ హహు). ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః “వలసవచ్చిన (ముహాజిర్) మహిళలను అల్లాహ్ కరుణించుగాకా! మొదటి సారి {తమ వక్షః స్థలాలను ఓణి అంచులతో కప్పుకోవాలని} దివ్య ఖుర్ఆన్ ఆయతు అవతరించినపుడు తమ దుప్పట్లను చింపుకొని కప్పుకున్నారు”. (బుఖారిః 4758).
ఇవే గాకా ఇంకా అనేక ఆధారాలున్నవి. పైన తెలిపిన ప్రకారం ఏ బేధాబిప్రాయాలు ఉన్నా, అందరు కూడా అనారోగ్య స్థితిలో డాక్టరు వద్దకు వెళ్ళుట లాంటి అగత్య పరిస్థితిలో స్త్రీ తమ ముఖ ముపై ఉండే ముసుగును తెరువ వచ్చనీ, ఉపద్రవాలు జనించే ఆస్కారమున్నపుడు తెరవ కూడదని ఏకీభవించారు. ఎవరయితే ముఖానికి “పర్ద” వర్తించదని అన్నారో వారు సయితం ఉపద్రవాలు జనించే భయమున్నపుడు “పర్ద” చేయాలని ఒప్పుకుంటారు. ఈ రోజుల్లో భక్తులు, పుణ్యాత్ములు అరుదై ఎటు చూసినా సంక్షోభం వ్యాపించియుంది. నీచులు, దుర్మార్గులు అనేకమైపోయారు. ఈ సమయాల్లో “పర్ద” ప్రాముఖ్యత చాలా ఉంది.
అదే విధంగా కుటుంబమూ, దాని గౌరవ మర్యాదలూ, నీతినడవడికలూ బధ్రంగా ఉండుట కొరకు కూడా స్త్రీ పరుషుల విశృంఖలత (కలయిక)ను ఇస్లాం నిషేధిస్తుంది. ఉపద్రవముల, సంక్షోభముల ద్వారాలను మూసి వేయాలని ప్రోత్సహిస్తుంది. స్త్రీ బయటకు వెళ్ళుట, పురుషుల్లో కలసి విచ్చలవిడిగా తిరుగుట, ముఖముపై “పర్ద” లేకుండా ఉండుట వలన భావోద్రేకాలు ఉద్భవించును. పాపాల కారణాలు అతి సులువై, పాపము చేయుట మరీ సులభమగును. అల్లాహ్ ఇలా ఆదేశించాడుః
{ప్రవక్త భార్యలను మీరు ఏదైనా అడగవలసి ఉంటే తెరచాటున ఉండి అడగండి. ఇది మీ హృదయాల మరియు వారి హృదయాల పరిశుద్ధత కొరకు ఎంతో సముచితమైన పద్దతి}. (33: అహ్ జాబ్: 53).
ప్రవక్త స్త్రీ పురుషుల కలయికను చాలా కఠినంగా వారించారు. అంతేకాదు ఈ కలయికనూ ప్రార్థన సమయాల్లో, ఆ ప్రాంతాల్లో కూడా ఉండకూడదని తాకీదు చేశారు.
స్త్రీకి పురుషులున్న చోట పోవుట చాలా అవసరముండీ, తన ఈ అవసరానికి సహాయపడువారెవరూ లేనియడల లేక స్వయంగా తనకు లేదా తనబిడ్డలకు వారి పోషణ ఖర్చులు తెచ్చువారు లేనియడల, ఈ విధమైన మరేతర అవసరమునకై పోదలుచు కుంటే పోవచ్చు, కాని ధర్మశాస్త్ర హద్దుబాట్లను గుర్తుంచుకొని ఇస్లామీయ “యూనీఫాం”లో అనగా పూర్తి “పర్ద”తో తన అలంకరణ ప్రదేశాలను బహిర్గతం చేయకుండా పురుషుల కలయిక (ఇఖ్తిలాత్) నుంచి దూరముండి తన అవసరాలను తీర్చుకోవాలి.
నీతి గుణాల, కుటుంబముల సంరక్షణ కొరకు ఇస్లాం ఇచ్చిన మరో ఆదేశమేమనగా ఏ స్త్రీ కూడా పరపురుషులతో ఒంటరిగా ఉండకూడదు. అతని భర్త లేక అతని “మహ్రమ్” (వివాహ నిషిద్ధ బంధువు) లేకుండానే పరపరుషునితో ఒంటరిగా ఉండుటను ప్రవక్త చాలా గట్టిగా వారించారు. ఎందుకనగా షైతాన్ ఈ ఒంటరితనములో మనసులను చెడగొట్టి, అశ్లీల కార్యాలు చేయించే ప్రయత్నంలో ఉంటాడు.
“హైజ్”, “నిఫాసు”ల ధర్మములు
“హైజ్” (బహిష్టు) కాలము, దాని గడువుః
స్త్రీలకు ప్రతి నెలా జరిగే రక్తస్రావాన్ని హైజ్ అంటారు.
1- వయస్సు: ఎక్కువ శాతం 12 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సులో హైజ్ వస్తుంది. ఈ పరిస్థితి ఆరోగ్యము, వాతవరణము మరియు ప్రాంతాన్ని బట్టి ముందుగాని తరువాత గాని కావచ్చు.
2- కాలపరిమితి: కనీసం ఒక రోజు. గరిష్ఠ కాలపరిమితి 15 రోజులు.
గర్భిణి యొక్క బహిష్టుః సామాన్యంగా గర్భం నిలిచిన తరువాత రక్త స్రావముండదు. గర్భిణీ ప్రసవవేదనతో ప్రసవించడానికి రెండు మూడు రోజుల ముందు రక్తము చూసినచో అది “నిఫాస్” అగును. ఒకవేళ ప్రసవ వేదన లేనిచో అది “నిఫాస్” కాదు, బహిష్టు కాదు. ఇస్తిహాజా అగును. దీని ఆదేశాలు క్రింది పంక్తుల్లో వస్తున్నాయి.
అసాధారణ బహిష్టు
అసాధారణ బహిష్టు రకాలు
1- ఎక్కువ లేక తక్కువ. ఉదాః ఒక స్త్రీ యొక్క (బహిష్టు కాలం) సాధారణంగా ఆరు రోజులు. కాని ఒక సారి ఏడు రోజులు కావచ్చును. ఏడు రోజుల అలవాటుండి ఆరు రోజులకే పరిశుద్ధం కావచ్చు.
2- వెనక లేక ముందు. ఉదాః నెలారంభంలో అలవాటుండి నెలాఖరులో కావచ్చు. నెలాఖరులో అలవాటుండి నెలారంభంలోనే కావచ్చు. వెనక లేక ముందు అయినా, ఎక్కువ లేక తక్కువ రోజులు అయినా, ఎప్పుడు రక్తస్రావం అవుతూ చూసిందో అప్పుడే బహిష్టు, ఎప్పుడు ఆగి పోతుందో అప్పుడే పరిశుభ్రమయినట్లు.
3- బహిష్టు రోజుల మధ్యలో లేదా చివరిలో పరిశుభ్రతకు కొంచం ముందు పసుపు రంగు తీరు లేదా ఎరుపు రంగు కలసిన చీము తీరు రక్తము చూచినచో అది బహిష్టు రక్తస్రావమే అగును. బహిష్టు స్త్రీలకు వర్తించే ఆదేశము ఆ స్త్రీకి వర్తించును. ఒకవేళ పరిశుభ్రత పొందిన తరువాత అలా వస్తే అది బహిష్టు రక్తస్రావము కాదు.
4- ఒక రోజు రక్తస్రావముండడము మరో రోజు ఉండక పోవడం. ఇది రెండు రకాలుగా కావచ్చు.
అ- ఇది ఎల్లపుడూ ఉన్నచో “ముస్తహాజ” కావచ్చును. “ముస్తహాజా”లకు వర్తించే ఆదేశాలే ఆమెకు వర్తించును.
ఆ- ఎల్లపుడూ కాకుండా, ఎప్పుడయినా ఒకసారి జరిగి, ఆ తరువాత పరిశుభ్రం కావచ్చు. ఎవరికయినా రక్తస్రావం జరుగుతూ ఒక రోజుకన్నా తక్కువ సమయంలో ఆగిపోతే అది పరిశుద్ధత కాదు. పరిశుద్ధత ఒక రోజుకన్నా తక్కువ సమయంలో ఆగినందుకు కాదు. కాని ఇంతక ముందు జరిగిన దాన్ని బట్టి చివరి రోజుల్లో ఏ విధంగా ఆగిపోయిందో అది గుర్తుంచుకున్నా లేదా తెల్లటి ద్రవం వచ్చినా (తెల్ల బట్ట అయినా) ఆగిపోతుందన్న సూచనలు.
5- రక్తస్రావం మాత్రం కనబడడము లేదు కాని బహిష్టు రోజుల మధ్య లేక పరిశుద్ధమగుటకు కొంచెం ముందు తడిగా ఉన్నట్లు గ్రహించినచో అది బహిష్టు. ఒకవేళ పరిశుద్ధ అయిన తరువాత ఉంటే అది బహిష్టు కాదు.
బహిష్టు యొక్క ధర్మములు
1- నమాజ్: బహిష్టు స్త్రీ పై ఫర్జ్, సున్నత్, నఫిల్ అన్ని విధాల నమాజులు నిషిద్ధం. చేసినా అది నెవరవేరదు. కాని కనీసం ఒక రకాత్ చేయునంత సమయం దాని మొదట్లో లేక చివరిలో లభించినచో ఆ నమాజు తప్పక చేయవలెను. మొదటి దానికి ఉదాహరణః సూర్యాస్తమయం అయ్యాక మగ్రిబ్ యొక్క ఒక రకాత్ చేయునంత సమయం దాటాక బహిష్టు అయినచో, ఆమె పరిశుద్ధ అయిన తర్వాత ఆ మగ్రిబ్ నమాజు ‘ఖజా’ చేయ వలెను. ఎందు కనగా ఆ నమాజు యొక్క ఒక్క రకాతు చేయునంత సమయం పొందిన పిదపనే బహిష్టు అయింది. ఇక చివరి దానికి ఉదాహరణః సూర్యోదయానికి ముందు ఒక రకాత్ మాత్రమే చేయునంత సమయం ఉన్నపుడు పరిశుద్ధమయితే, (స్నానం చేశాక) ఆ ఫజ్ర్ నమాజ్ ‘ఖజా’ చేయాలి. ఎందుకనగా రక్తస్రావం ఆగిన తరువాత ఆమె ఒక్క రకాత్ చేయునంత సమయం పొందినది.
ఇక జిక్ర్, తక్బీర్, తస్బీహ్, అల్ హందులిల్లాహ్, తినుత్రాగినప్పుడు బిస్మిల్లాహ్ అనడం హదీసు మరియు ధర్మ విషయాలు చదవడం, దుఆ మరియు దుఆపై ఆమీన్ అనడం, ఖుర్ఆన్ పారాయణం వినడం, చూస్తూ నోటితో కాకుండా గ్రహించి చదవడం, తెరిచియున్న ఖుర్ఆనులో లేదా బ్లాక్ బోర్డ్ పై వ్రాసియున్న దాన్ని చూస్తూ మనస్సులో చదవడం నేరం కాదు. యోగ్యమే. ఏదైనా ముఖ్య అవసరం: టీచర్గా ఉన్నపుడు లేదా పరీక్ష సమయాల్లో చదవడం, చదివించడం తప్ప ఇతర సమయాల్లో నోటితో చదవకపోవడం మంచిది.
2- రోజా (ఉపవాసము): ఫర్జ్, నఫిల్ అన్ని విధాల రోజాలు నిషేధం. కాని ఫర్జ్ రోజాలు తరువాత ఖజా (పూర్తి) చేయాలి. రోజా స్థితిలో బహిష్టు అవుతే ఆ రోజా కాదు. అది సూర్యాస్తమయముకు కొన్ని నిమిషాల ముందైనా సరే. అది ఫర్జ్ రోజా అయి ఉంటే ఇతర రోజుల్లో పూర్తి చేయాలి. సూర్యాస్తమయమునకు కొద్ది క్షణాల ముందు రక్తస్రావం అయినట్లు అనిపించి, అలాకాకుండా సూర్యాస్తమయము తరువాతనే అయితే ఆ రోజా పూర్తయినట్లే. ఉషోదయం అయిన కొద్ది క్షణాల తరువాత పరిశుద్ధమయితే ఆ దినము యొక్క రోజా ఉండరాదు. అదే ఉషోదయానికి కొద్ది క్షణాలు ముందు అయితే రోజా ఉండాలి. స్నానం ఉషోదయం తరువాత చేసినా అభ్యంతరం లేదు.
3- కాబా యొక్క తవాఫ్ (ప్రదక్షిణం): అది నఫిలైనా, ఫర్జ్ అయినా అన్నీ నిషిద్ధం. హజ్ సమయంలో తవాఫ్ తప్ప ఇతర కార్యక్ర మాలుః సఫా మర్వా సఈ, అరఫాత్ మైదానంలో నిలవడం, ముజ్దలిఫా, మినాలో రాత్రులు గడపడం, జమ్రాతులపై రాళ్ళు రువ్వడం మొదలగునవన్నీ పూర్తి చేయాలి. ఇవి నిషిద్ధం కావు. పరిశుద్ధ స్థితిలో తవాఫ్ చేసిన వెంటనే లేక సఫా మర్వా సఈ మధ్యలో బహిష్టు ప్రారంభమయితే ఆ హజ్ లో ఏలాంటి లోపముండదు.
4- బహిష్టు స్త్రీ మస్జిదులో నిలువ కూడదు. అది నిషిద్ధం.
5- సంభోగం: భార్య రజస్సుగా ఉన్నపుడు భర్త ఆమెతో సంభోగించడం నిషిద్ధం. భర్త సంభోగాన్ని కోరుతూ వచ్చినా భార్య అంగీకరించడం కూడా నిషిద్ధం. పురుషుని కొరకు అతని భార్య ఈ స్థితిలో ఉన్నపుడు ఆమెతో సంభోగం తప్ప ముద్దులాట మరియు కౌగలించుకొనుట లాంటి విషయాలన్నీ అల్లాహ్ అనుమతించాడు.
6- విడాకులుః భార్య రజస్సుగా ఉన్నపుడు విడాకులివ్వడం నిషిద్ధం. ఆమె ఆ స్థితిలో ఉన్నపుడు విడాకులిచ్చినా అతడు అల్లాహ్, ఆయన ప్రవక్త యొక్క అవిధేయుడయి ఒక నిషిద్ధ కార్యాన్ని చేసినవాడవుతాడు. కనుక అతడు విడాకులను ఉపసంహరించుకొని ఆమె పరిశుద్ధురాలయిన తరువాత విడాకు లివ్వాలి. అప్పుడు కూడా ఇవ్వకుండా మరోసారి బహిష్టు తరువాత పరిశుద్ధురాలయ్యాక ఇష్టముంటే ఉంచుకొనడం లేకుంటే విడాకులివ్వడం మంచిది.
7- స్నానం చేయడం విధిగా ఉందిః పరిశుద్ధురాలయిన తరువాత సంపూ- ర్ణంగా తలంటు స్నానం చేయుట విధి. తల వెంట్రుకలు కట్టి (జెడ వేసి) ఉన్నచో వాటిలో నీళ్ళు చేరని భయమున్నచో అవి విప్పి అందులో నీళ్ళు చేర్పించవలెను. నమాజు సమయం దాటక ముందు పరిశుద్ధమయినచో ఆ సమయంలో ఆ నమాజును పొందుటకు స్నానం చేయడంలో తొందర పడుట కూడా విధిగా ఉంది. ప్రయాణంలో ఉండి నీళ్ళు లేనిచో, లేదా దాని ఉపయోగములో ఏ విధమైనా హాని కలిగే భయమున్నచో, లేక అనారోగ్యం వల్ల హాని కలిగే భయమున్నచో స్నానానికి బదులుగా “తయమ్ముం”([1]) చేయవలెను. తరువాత నీళ్ళు లభించిన లేక ఏ కారణమయితే అడ్డగించిందో అది తొలిగిపోయిన తరువాత స్నానం చేయవలెను.
“ఇస్తిహాజ”, దాని ఆదేశాలు
ఎప్పుడూ ఆగకుండా, ఆగినా నెలలో కేవలం రెండు మూడు రోజులు మాత్రమే ఆగి ప్రతి రోజు అవుతూ ఉండే రక్తస్రావమును “ఇస్తిహాజ” అంటారు. కొందరు 15 రోజులకంటే అధికంగా వస్తే అది “ఇస్తిహాజ” అని అన్నారు.
ముస్తహాజ యొక్క మూడు స్థితులుః
(ఇస్తిహాజలో ఉన్న స్త్రీని ముస్తహాజ అంటారు).
1- ఇస్తిహాజకు ముందు బహిష్టు యొక్క కాలపరిమితి ఎన్ని రోజు లనేది గుర్తుండవచ్చు. ఆ మొదటి కాలపరిమితి ప్రకారం అన్ని రోజులు బహిష్టు రోజులని లెక్కించాలి. అప్పుడు బహిష్టు ఆదేశాలే ఆమెకు వర్తించును. మిగితా రోజులు ఇస్తిహాజ రోజులుగా లెక్కించాలి. అప్పుడు ఆమె ముస్తహాజ స్త్రీలకు సంబంధించిన ఆదేశాలను పాటించాలి. దీని యొక్క ఉదాహరణః ఒక స్త్రీకి ప్రతి నెలారంభంలో ఆరు రోజులు బహిష్టు వచ్చేది. కాని ఒకసారి ఆ కాలం దాటినప్పటికీ ఆగలేదు. అలాంటపుడు ఆ నెల మొదటి ఆరు రోజులు బహిష్టు రోజులుగానూ ఆ తరువాతవి ఇస్తిహాజ రోజులుగానూ లెక్కించ వలెను. ఆరు రోజుల తరువాత స్నానం చేసి నమాజు కూడా చేయాలి. అప్పుడు రక్తస్రావం జరుగుతూ ఉన్నా పరవాలేదు.
2- మొదటిసారి బహిష్టు అయి, ఆగకుండా ఇస్తిహాజ జరుగుతూ ఉంటే బహిష్టు రోజుల గడువు తెలిసే వీలు లేకుంటే అలాంటప్పుడు బహిష్టు రక్తము మరియు ఇస్తిహాజ రక్తములో భేదమును తెలుసుకోవాలి. బహిష్టు రక్తము ఎక్కువ ఎర్రగా ఉంటుంది కాబట్టి నలుపుగా లేక దుర్వాసనగా లేక చిక్కగా ఏర్పడును. ఈ మూడిట్లో ఏ ఒక్క విధంగానున్నా అప్పుడు బహిష్టు ఆదేశాల్ని పాటించాలి. ఎప్పుడయితే ఇవి మారునో అప్పటి నుండి ఇస్తిహాజ ఆదేశాలు పాటించాలి. దాని ఉదాహరణః ఒక స్త్రీకి రక్త స్రావం ప్రారంభమయి ఆగడము లేదు. అలాంటపుడు తేడా/వ్యత్యాసం ఉందా లేదా గమనించవలెను. ఉదాహరణః పది రోజులు నలుపుగా తరువాత ఎరుపుగా లేక పది రోజులు చిక్కగా తరువాత పలుచగా లేక పది రోజులు బహిష్టు వాసన తరువాత ఎలాంటి వాసన లేదు. అలాంటపుడు మొదటి (అండర్ లైన్లోని) మూడు గుణాలుంటే ఆమె బహిష్టురాళు. ఆ మూడు గుణాలు లేకుంటే ఆమె ముస్తహాజ.
3- రక్త స్రావం ప్రారంభమైనప్పటి నుంచే ఆగకుండా ఉంది. బహిష్టు గడువు తెలియదు. అంతే గాకుండా ఒకే విధంగా ఉండి భేదము కూడా ఏర్పడడము లేదు, లేక అది బహిష్టు అన్న ఖచ్చితమైన నిర్ణయానికి రాకుండా సందిగ్ధంలో పడవేసే విషయాలున్నప్పుడు తన దగ్గరి బంధుత్వంలో ఉన్న స్త్రీల అలవాటు ప్రకారం మొదటి నుంచే ఆరు లేక ఏడు రోజులు బహిష్టు రోజులుగా లెక్కించి, మిగిలనవి ఇస్తిహాజగా లెక్కించవలెను.
ఇస్తిహాజ ధర్మములు
ముస్తహాజ మరియు పరిశుద్ధ స్త్రీలో ఈ చిన్న భేదము తప్ప మరేమి లేదు.
1- ముస్తహాజా ప్రతి నమాజుకు వుజూ చేయాలి.
2- వుజూ చేసే ముందు రక్త మరకలను కడిగి రహస్యాంగాన్ని దూదితో గట్టిగా బంధించాలి.
నిఫాసు, దాని ధర్మములు
ప్రసవ కారణంగా గర్భ కోశము నుంచి స్రవించు రక్తాన్ని నిఫాసు అంటారు. అది ప్రసవముతోనైనా, లేక తరువాత ప్రారంభమైనా, లేక ప్రసవావస్థతో ప్రసవానికి రెండు మూడు రోజుల ముందైనా సరే. అలాంటి స్త్రీ రక్తస్రావం ఆగిపోయినప్పుడే పరిశుద్ధమగును. (కొందరు స్త్రీలు నలబై రోజులకు ముందే రక్తస్రావం నిలిచినప్పటికీ స్నానం చేసి పరిశుద్ధులు కారు. నమాజు ఇతర ప్రార్థనలు చేయరు. నలబై రోజుల వరకు వేచిస్తారు. ఇది తప్పు. ఎప్పుడు పరిశుద్ధురాలయినదో అప్పటి నుండే నమాజులు…… మొదలెట్టాలి). రక్తస్రావం నిలువకుండా నలబై రోజులకు పైగా ఉంటే, నలబై రోజుల తరువాత స్నానం చేయవలెను. “నిఫాసు” కాల పరిమితి నలబై రోజులకంటే ఎక్కువ ఉండదు. నలబై రోజులకు ఎక్కువ అయితే అది బహిష్టు కావచ్చును. (లేదా ఇస్తిహాజా కావచ్చు). ఒకవేళ బహిష్టు అయితే, ఆ నిర్ణిత రోజులు ముగిసి పరిశుద్ధమయిన తరువాత స్నానం చేయవలెను.
పిండము మానవ రూపము దాల్చిన తరువాత జన్మిస్తెనే “నిఫాసు” అనబడును. మానవ రూపం దాల్చక ముందే గర్భము పడిపోయి రక్తస్రావం జరిగితే అది నిఫాసు కాదు. అది ఒక నరము నుంచి స్రవించు రక్తము మాత్రమే. అప్పుడు ముస్తహాజకు వర్తించే ఆదేశమే ఆమెకు వర్తించును. మానవ రూపము ఏర్పడుటకు కనీస కాలం గర్భము నిలిచినప్పటి నుండి ఎనభై (80) రోజులు. గరిష్ఠ కాలం తొంబై (90) రోజులు అవుతుంది.
నిఫాసు ధర్మములు కూడా బహిష్టు గురించి తెలిపిన ధర్మములే.
బహిష్టు మరియు కాన్పులను ఆపడం
స్త్రీ బహిష్టు కాకుండా ఏదయినా ఉపయోగించదలుచుకుంటే ఈ రెండు షరతులతో ఉపయోగించవచ్చును.
1- ఏలాంటి నష్ట భయముండకూడదు. నష్ట భయమున్నచో అది ధర్మసమ్మతం కాదు.
2- భార్య తన భర్త అనుమతితో ఉపయోగించాలి.
బహిష్టు కావడానికి ఏదయినా ఉపయోగించ దలుచుకంటే ఈ రెండు షరతులతో ఉపయోగించవచ్చును.
1- భర్త అనుమతితో ఉపయోగించాలి.
2- నమాజు, రోజా లాంటి విధిగా ఉన్న ఆరాధనలు పాటించని ఉద్దేశంగా ఉపయోగించకూడదు.
గర్భం నిలువకుండా (కుటుంబ నియంత్రణ కొరకు) ఏదైనా ఉపయోగించదలుచుకుంటే ఈ రెండు షరతులను పాటించాలి.
1- కుటుంబ నియంత్రణ ఉద్దేశంగా చేయుట యోగ్యం లేదు.
2- ఒక నిర్ణీత కాలపరిమితి వరకు అనగా గర్భము వెంటనే గర్భము నిలిచి స్త్రీ ఆరోగ్యానికి హాని కలిగే భయముంటె మాత్రమే. అది కూడా భర్త అనుమతితో. ఇంకా దీని వల్ల ఆమె ఆరోగ్యానికి ఏదైనా హాని కలిగే భయం ఉంటే కూడా చేయించకూడదు.
[1]1) దాని విధానం ఇదిః ఒక సారి రెండు చేతులు భూమిపై కొట్టి ముఖముపై ఒకసారి మరియు మణికట్ల వరకు చేతులపై ఒకసారి తుడుచుకోవాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్లామీయ సంస్కారాలు – ఆదేశాలు (Adaab in Islam) అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
విషయ సూచిక: – ఇఖ్లాస్ – షిర్క్ భయంకరం మరియు తౌహీద్ ఘనత – రియా (ప్రదర్శనా బుద్ధి) చిన్న షిర్క్ – దుఆ – విద్య – మంచిని భోధించడం – చెడును ఖండించడం – మంచిని ఆజ్ఞాపించే, చెడును ఖండించే పద్ధతులు – తల్లిదండ్రుల సేవ – సద్వర్తన – సౌమ్యం, మృదు వైఖరి – కరుణ
– జుల్మ్ (అన్యాయం,దౌర్జన్యం) నిషిద్దం – ముస్లింను వధించడం నిషిద్దం – ముస్లిం పై మరొక ముస్లిం హక్కులు – ఇరుగు పొరుగు వారి హక్కులు – నాలుక భయంకరాలు – పరోక్షనింద నిషిద్దం – సత్యం ఘనత, అసత్యం నుండి హెచ్చరిక – తౌబా (పశ్చాత్తాపం) – తౌబా నియమాలు – సలాం – భోజనం చేయు పద్ధతులు – మలమూత్ర విసర్జన పద్ధతులు – తుమ్ము, ఆవలింపు – కుక్కను పెంచడం – అల్లాహ్ యెక్క జిక్ర్ (స్మరణ)
కొన్ని దుఆలు : – పడుకొనే ముందు – నిద్ర నుండి మేల్కొని – వాహనం ఎక్కినపుడు – గమ్యస్థానం చేరుకున్నప్పుడు – ఉజూకు ముందు – ఉజూ తర్వాత – ఇంటి నుండి వెళ్ళినప్పుడు – ఇంట్లో ప్రవేశించినప్పుడు – ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) పై దరూద్ – ఉదయం – సాయంకాలం – స్నేహం – ఓపిక, సహనం
[పూర్తి పుస్తకం క్రింద చదవండి]
1. ఇఖ్లాస్
అల్లాహ్ ఆదేశాలుః
{వారు అల్లాహ్ కు దాస్యం చెయ్యాలని, పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని మాత్రమే ఆదేశించటం జరిగింది}. (బయ్యినహ్ 98: 5).
{నేను మాత్రం నా ధర్మాన్ని అల్లాహ్ కే ప్రత్యేకించి, ఆయనకు మాత్రమే దాస్యం చేస్తాను అని చెప్పండి}. (జుమర్ 39: 14).
{ప్రవక్తా! ప్రజలను ఇలా హెచ్చరించుః మీ మనస్సులలో ఉన్నదంతా మీరు దాచినా లేక బహిర్గతం చేసినా అల్లాహ్ కు తెలుసు}. (ఆలె ఇమ్రాన్ 3: 29).
{భూమ్యాకాశాలలో ఏ వస్తువూ అల్లాహ్ కు గోప్యంగా లేదు}. (ఆలె ఇమ్రాన్ 3: 5).
“కర్మలు మనో సంకల్పంపై ఆధారపడి ఉంటాయి. ఎవరు ఏ సంకల్పం చేస్తారో వారికి అదే ప్రాప్తమవుతుంది”. ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం. (బుఖారి 1, ముస్లిం 1907).
“ఎక్కడ ఉన్నా అల్లాహ్ తో భయపడు. పాపము జరిగిన వెంటనే పుణ్యము చెయ్యి. అందువలన పాపము తుడ్చుక పోవును. ప్రజల ఎడల సద్వర్తనతో మెలుగు”. అబూ జర్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం. (తిర్మిజి 1987).
విశేషాలుః
1- సత్కార్యాల అంగీకరణకు చిత్తశుద్ధి వైఖరి, సంకల్పశుద్ధి చాలా ముఖ్యము. పుణ్యఫలితాల రెట్టింపు కూడా దానిపై ఆధారపడి ఉంది.
2- అల్లాహ్ షిర్క్ కు చాలా అతీతుడు. ఆయన ప్రసన్నత పొందడానికి మాత్రం చేయబడిన సత్కార్యాన్ని తప్ప దేనినీ అంగీకరించడు. ఒక హదీసులో అల్లాహ్ ఇలా చెప్పినట్లు ప్రవక్త e తెలిపారుః
“ఇతర సహవర్తులకంటే అధికంగా నేనే షిర్క్ కు అతీతుణ్ణి, ఎవరైనా ఒక పని చేసి, అందులో నాతో ఇతరుల్ని సాటి కల్పుతాడో నేను అతడ్ని, అతని షిర్క్ ను స్వీకరించను”. అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం. (ముస్లిం 2985).
3- భూమ్యాకాశాల్లో ఏ వస్తువూ అల్లాహ్ కు మరుగు లేదు గనక ఎల్లప్పుడూ ఆయనతో భయపడాలి. ప్రతీ క్షణం ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు.
2. షిర్క్ భయంకరము మరియు తౌహీద్ ఘనత
అల్లాహ్ ఆదేశాలుః
{ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేర్చటం పరమదుర్మార్గం}. (లుఖ్మాన్ 31: 13).
{అల్లాహ్ క్షమించనిది కేవలం షిర్క్ మాత్రమే. అది తప్ప ఏ పాపాన్ని అయినా ఆయన తాను ఇష్టపడిన వారికొరకు క్షమిస్తాడు}. (నిసా 4: 48).
{నీ వద్దకూ, నీకు పూర్వం గతించిన ప్రవక్తల వద్దకూ ఇలా వహీ పంపబడింది. “ఒకవేళ మీరు షిర్కు (బహుదైవారాధన) చేస్తే, మీ కర్మలన్నీ వ్యర్థమైపోతాయి; మీరు నష్టానికి గురి అవుతారు.”}. (జుమర్ 39: 65).
{నేను మానవులను, జిన్నాతులను కేవలం నన్ను ఆరాధించుటకే పుట్టించాను}. (జారియాత్ 51: 56).
{మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరిక చేశాముః “అల్లాహ్ ను ఆరాధించండి. మిథ్యాదైవాల ఆరాధనకు దూరంగా ఉండండి”}. (నహ్ల్ 16: 36).
“ఏ వ్యక్తి అల్లాహ్ కు సహవర్తులు కల్పించకుండా అల్లాహ్ ను కలుసు కుంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఏ వ్యక్తి అల్లాహ్ కు సహవర్తులు కల్పించి కలుసుకుంటాడో అతడు అగ్నిలో ప్రవేశిస్తాడు”. జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ ఉల్లేఖనం. (ముస్లిం 93).
“వినాశనానికి గురి చేసే ఏడు విషయాల నుండి దూరముండండి” అని ప్రవక్త బోధించగా, అవేమిటి? ప్రవక్తా అని సహచరులు అడగగా, “అల్లాహ్ తో సాటి కల్పించడం” అని ప్రవక్త బదులిచ్చారు. అబూ హురైర ఉల్లేఖనం. (బుఖారి 2767, ముస్లిం 89).
ముఆజ్ బిన్ జబల్ ఉల్లేఖనం ప్రకారం, నేను ప్రవక్త వెనక గాడిదపై కూర్చోని ఉన్నాను. దాన్ని ఉఫైర్ అని అనేవారు. ఒకసారి ఆయన “ఓ మఆజ్! అల్లాహ్ కు దాసులపై ఉన్న హక్కు ఏమిటో మరియు అల్లాహ్ ను ఆరాధించే దాసులకు అల్లాహ్ పై ఉన్న హక్కు ఏమిటో నీకు తెలుసా? అని అడిగారు. ‘అల్లాహ్ కు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు’ అని నేను బదులిచ్చాను. దానికి ప్రవక్త మహానీయులు ఇలా సెలవిచ్చారుః “అల్లాహ్ కు దాసులపై ఉన్న హక్కు ఏమిటంటే; వారు ఆయన్నే ఆరాధించాలి. ఈ ఆరాధనలో ఆయనకు మరెవ్వరినీ భాగస్వామిగా నిలబెట్టవద్దు. మరియు దాసులకు అల్లాహ్ పై ఉన్న హక్కు ఏమిటంటే ఆయన వారిని శిక్షించకుండా ఉండాలి. (ముస్లిం 30, బుఖారి 2856).
విశేషాలుః
1- షిర్క్ చాలా ఘోరమైన పాపం. తౌబా చేయనిదే ఇతర పాపాల తీరు అల్లాహ్ తనిష్టముతో క్షమించడు. తప్పనిసరిగా తౌబా చేయాలి.
2- షిర్క్ పై చనిపోయినవాని సత్కార్యాలు వ్యర్థమగును. మరియు అతడు శాశ్వతంగా నరకములో ఉండుటకు అది కారణమగును.
3- తౌహీద్ ఘనత ఎలా ఉంది చూడండి, అల్లాహ్ జిన్నాతులను, మానవులను దాని కొరకే పుట్టించాడు. మరియు నరకము నుండి రక్షింపబడి స్వర్గములో ప్రవేశించడానికి అది గొప్ప కారణము.
3. రియా (ప్రదర్శనాబుద్ధి) చిన్న షిర్క్
అల్లాహ్ ఆదేశం:
{తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహించేవారు, ప్రదర్శనా బుద్ధితో వ్యవహరించేవారు, వాడుకునే మామూలు వస్తువులను (ప్రజలకు) ఇవ్వటానికి వెనుకాడేవారు సర్వనాశనమవుతారు}. (మాఊన్ 107: 4-7).
“ఏలాంటి సందేహము లేనట్టి తీర్పు దినాన అల్లాహ్ పూర్వీకులను, వెనకటి వారిని సమూహ పరిచినప్పుడు, ఒక చాటింపు చేయువాడు ఇలా చాటింపు చేస్తాడుః ఎవడు తను చేసిన సత్కార్యములలో అల్లాహ్ తో ఇతరులను సాటి కల్పించాడో, అతడు పుణ్యఫలితాన్ని వారితోనే పొందాలి. అల్లాహ్ ఇతర సహవర్తులకంటే అధికంగా షిర్క్ కు అతీతుడు”. అబూ సఅద్ బిన్ ఫజాల అన్సారి ఉల్లేఖనం. (తిర్మిజి 3154, ఇబ్ను మాజ 4203).
“మేము మసీహుద్దజ్జాల్ విషయము చర్చించుకోగా ప్రవక్త ﷺ వచ్చి, మసీహుద్దజ్జాల్ కంటే భయంకరమైన విషయము తెలుపనా?” అని ప్రశ్నిస్తే, తప్పక తెలుపండని మేము విన్నవించుకోగా, “గుప్తమైన షిర్క్” అదేమనగాః ఒక వ్యక్తి నమాజు చేయుటకు నిలబడతాడు, అయితే చూసేవారు మెచ్చుకోవాలని అలంకరిస్తూ నమాజు చేస్తాడు. (అలా స్తుతించబడటానికి, చూచినవారు మెచ్చుకోవాలనే ఉద్దేశముతో నమాజు చేయడం గుప్తమైన షిర్క్) అని ప్రవక్త ﷺ విశదపరిచారు. అబూ సఈద్ ఖుద్రీ ఉల్లేఖనం. (ఇబ్ను మాజ 4204).
విశేషాలుః
1- ప్రదర్శనాబుద్ధి చాలా భయంకరమైనది, దాని గురించి చాలా కఠినంగా హెచ్చరించబడింది. ఈ దుర్గుణముగలవారికి కఠిన శిక్ష ఉంది.
2- ఒక వ్యక్తి ప్రదర్శనాబుధ్ధికి గురి అవుతాడు కాని అది అతనికి తెలియకపోవచ్చు.
3- ప్రదర్శనాబుధ్ధితో కూడిన పనులు అంగీకరింపబడవు, రద్దు చేయబడతాయి.
4. దుఆ
అల్లాహ్ ఆదేశాలుః
{నీ ప్రభువు ఇలా అంటున్నాడుః “నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను”}. (మోమిన్ 40: 60).
{నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే, నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును వింటాను, సమాధానం పలుకుతాను అనీ ఓ ప్రవక్తా నీవు వారికి తెలుపు}. (బఖర 2: 186).
“ఎవరైనా ముస్లిం ఏదైనా దుఆ చేసినప్పుడు అల్లాహ్ అతనికి దానికి బదులుగా మూడిట్లో ఏదైనా ఒకటి ప్రసాదిస్తాడు. – కాని పాపం మరియు బంధుత్వ తెగతెంపులు కోరవద్దు -. 1. దుఆలో కోరుకున్నది వెంటనే లభించవచ్చు. లేదా 2. ప్రళయం వరకు దాన్ని అతని కొరకు భద్రపరుస్తాడు. లేదా 3. దానికి తగిన పరిమాణంలో అతనిపై ఉన్న ఏదైనా ఆపదను దూరం చేస్తాడు”. అప్పుడు సహచరులన్నారుః అలాంటప్పుడు మేము దుఆ అధికంగా చేస్తాము అని, దానికి బదులుగా ప్రవక్త ﷺ చెప్పారుః “అల్లాహ్ కూడా అధికంగా ప్రసాదించేవాడున్నాడు” అని. (అహ్మద్ 3/18).
“ముస్లిం వ్యక్తి యొక్క దుఆ తన దూరమున్న సోదరుని పట్ల అంగీకరింప బడును. అప్పుడు అతని తలకడన ఒక దైవదూత ఉంటాడు, ఆ వ్యక్తి తన సోదరుని కొరకు దుఆ చేసినపుడల్లా ఆ దూత ఆమీన్ అంటూ నీకు కూడా ఈ మేలు కలుగుగాకా అని దీవిస్తాడు”. అబుద్దర్దా ఉల్లేఖనం. (ముస్లిం 2733).
విశేషాలుః
1- దుఆ ఆరాధన. కాబట్టి అల్లాహ్ దప్ప ఇతరులతో దుఆ చేయరాదు. అల్లాహ్ తో వేడుకునేవాటిని ఇతరులతో వేడుకునేవాడు షిర్క్ చేసినవాడవుతాడు. దుఆ స్థానం చాలా గొప్పదన్న విషయం తెలుసుకో! ఎలా అనగా ప్రవక్త దాన్ని ఆరాధన అని అన్నారు. అనగా ఆరాధన యొక్క గొప్ప అంశము.
2- దుఆ శబ్దముతో గాకుండా మెల్లగా చేయడం మంచిది. తక్కువ పదములో ఎక్కువ భావం గల దుఆ చేయుట చాలా మంచిది.
3- ఏ మనిషి కూడా తనకు తాను, తన సంపద మరియు సంతానాన్ని శపించవద్దు.
4- ముస్లిం సోదరుల గురించి వారి వెనక దుఆ చెయ్యడం పుణ్యకార్యం.
5- కోరినది లభించడమే దుఆ అంగీకరించబడినట్లు కాదు. అతనికి ఎదురయ్యే కీడు ఆ దుఆ ద్వారా దూరము కావచ్చు. లేదా పరలోక దినము వరకు భద్రపరచి ఆ దుఆకన్నా ఎక్కువ ప్రయోజనకరమైన ఫలితము లభించవచ్చును.
6- నిషిద్ధ సంపాదన యొక్క తిండి మరియు వస్త్రములు ధరించడము దుఆ అంగీకారాణికి ఆటంకముగా ఉండును.
5. విద్య
అల్లాహ్ ఆదేశాలుః
{వీరిని అడుగు, తెలిసిన వారూ, తెలియని వారూ ఇద్దరూ ఎప్పుడైనా సమానులు కాగలరా?}. (జుమర్ 39: 9).
{మీలో విశ్వసించినవారికి, జ్ఞానం ప్రసాదించబడిన వారికి అల్లాహ్ ఉన్నత స్థానాలు ప్రసాదిస్తాడు}. (ముజాదల 58: 11).
{ఇలా ప్రార్థించు, “ఓ ప్రభువా! నాకు మరింత జ్ఞానం ప్రసాదించు”}. (తాహా 20: 11).
{అల్లాహ్ దాసులలో జ్ఞానులు మాత్రమే ఆయనకు భయపడతారు}. (ఫాతిర్ 35: 28).
“విద్య నేర్పించువారికి, దానిపై ఆచరించేవారంత పుణ్యం లభించును. అయితే ఆచరించేవారి పుణ్యాల్లో ఏ మాత్రం కొరత జరగదు”. ముఆజ్ బిన్ అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం. (ఇబ్నుమాజ 240).
“మనిషి చనిపోయినప్పుడు అతని ఆచరణ అంతమయిపోతుంది. అయితే మూడు రకాల ఆచరణలు మటుకు అంతం కావు. వాటి పుణ్యఫలం మనిషి చనిపోయిన తరువాత కూడా అతనికి లభిస్తునే ఉంటుంది. ఒకటిః సదఖయే జారియా. రెండుః ప్రజలకు ఉపయోగపడుతున్న జ్ఞానం. మూడుః అతని కోసం దుఆ చేసే ఉత్తమ సంతానం”. అబూ హురైర ఉల్లేఖనం. (ముస్లిం 1631).
“అల్లాహ్ సాక్షిగా! నీ మార్గదర్శముతో ఒక వ్యక్తైనా రుజుమార్గాన్ని పొందినచో అది నీకు ఎర్ర ఒంటెలకన్నా చాలా ఉత్తమమం”. సహల్ బిన్ సఅద్ ఉల్లేఖనం. (బుఖారి 3701, ముస్లిం 2406).
“నా ఏ ఒక విషయం మీకు తెలిసినా అది ఇతరులకు బోధించండి”. అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ ఉల్లేఖనం. (బుఖారి 3461).
విశేషాలుః
పై ఆయతుల మరియు హదీసుల్లో ఈ క్రింది విషయాలు తెలుస్తున్నవి.
1- విద్య మరియు విద్వాంసుల ఘనత. ధర్మజ్ఞానం లభించడం అల్లాహ్ మేలు కోరాడని భావం. ధర్మ జ్ఞానము నేర్చుకొనుట స్వర్గ ప్రవేశానికొక మార్గం.
2- విద్య నేర్పడం, మంచిని బోధించడం మరియు విద్యను వ్యాపింపజేయడం అది కొంచమైనా, అందులో చాలా పుణ్యముంది. మరియు చనిపోయిన తరువాత కూడా పుణ్యం లభిస్తూ ఉంటుంది.
3- ధర్మ విద్య నేర్చుకొనుట నఫిల్ (అధిక) ప్రార్థనలకన్నా గొప్పది.
4- సంతానము నైతికంగా మంచివారగుటకు ధార్మిక శిక్షణ ఇవ్వాలి.
6. మంచిని బోధించడం – చెడును ఖండించడం
అల్లాహ్ ఆదేశాలుః
{మీరు సర్వమతస్థులకన్న శ్రేష్ఠులు. మీరు ప్రజల మేలు కొరకు ఏర్పడితిరి. మీరు మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు నుండి ఆపుతారు. అల్లాహ్ ను విశ్వసిస్తారు}. (ఆలె ఇమ్రాన్ 3 : 110).
{మీలో మంచి వైపునకు పిలిచేవారూ, మేలు చెయ్యండి అని ఆజ్ఞాపించేవారూ, చెడు నుండి వారించేవారూ కొందరు తప్పకుండా ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యం పొందుతారు}. (ఆలె ఇమ్రాన్ 3: 104).
“మీలోనెవరైనా చెడు చూసినచో చేతి శక్తితో దాని రూపు మార్పాలి. ఆ శక్తి లేనిచో హితబోధ చేసి ఆపాలి. ఆ శక్తి కూడా లేనిచో మనుసులో చెడు భావించి దూరముండాలి. ఇది విశ్వాసము యొక్క చివరి మెట్టు”. అబూ సఈద్ ఖుద్రీ ఉల్లేఖనం. (ముస్లిం 49).
“ఎవరి ఆధీనములో నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. మీరు తప్పనిసరిగా మంచిని ఆజ్ఞాపిస్తూ, చెడును ఖండిస్తూ ఉండాలి. అలా చేయక పోయినట్లయితే త్వరలో అల్లాహ్ మీపైకి భయంకరమైన శిక్షను పంపిస్తాడు. అప్పుడు మీరు అతన్ని వేడుకుంటే మీ వేడుకోలు అంగీకరింపబడవు”. హూజైఫా ఉల్లేఖనం. (తిర్మిజి 2169).
“ఎవరు అత్యచారున్ని చూస్తూ ఉండి, అతని చేతుల్ని స్వాధీనం చేయకున్నట్లయితే (అతన్ని అత్యాచారం నుండి ఆపకున్నట్లయితే) సమీపంలోనే అల్లాహ్ వారందరిపై తన వైపు నుండి విపత్తును కురియ జేస్తాడు”. అబూ బక్ర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం. (తిర్మిజి 2168).
2- చెడును చూచినవారు, తమ శక్తి ప్రకారం దాని రూపు మాపడం తప్పనిసరి.
3- చేయి ద్వారా చెడును నిర్మూలించుట దాని శక్తి గలవారికే సాధ్యం. ఉదాః తండ్రి లేదా (నగర, రాష్ట్ర, దేశ, విద్యాలయ తదితర) అధికారులు లాంటి వారు.
4- చెడును మనసులో అసహ్యించుకొనడమనగా దాని నుండి దూరముండుట.
5- మంచిని ఆజ్ఞాపించటం, చెడును నివారించటం మానుకొనుట, దుఆల అనంగీకారానికి మరియు అల్లాహ్ వైపున విపత్తుకు కారణమవుతుంది.
7. మంచిని బోధించే, చెడును ఖండించే పద్ధతులు
అల్లాహ్ ఆదేశాలుః
{నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వానించు, వివేకంతో చక్కని హితబోధతో. ప్రజలతో ఉత్తమోత్తమైన రీతిలో వాదించు}. (నహ్ల్ 16: 125).
{(ప్రవక్తా!) అల్లాహ్ యొక్క అనంత కరుణ వల్లనే నీవు వారిపట్ల మృదు స్వభావుడవయ్యావు. నీవే గనక కర్కశుడవు, కఠిన హృదయుడవు అయినట్లయితే వారందరూ నీ చుట్టు పక్కల నుండి దూరంగా పోయేవారు}. (ఆలె ఇమ్రాన్ 3: 159).
“మృదు వైఖరి గుణం లేనివాడు సర్వ మేళ్ళను, శుభాలను కోల్పోయినట్లే”. ఉల్లేఖనం: జరీర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు. (ముస్లిం 2592).
విశేషాలుః
1- ఇస్లాం ప్రచారం, మంచిని ఆజ్ఞాపించడం మరియు చెడును నివారించడంలో మృదువైఖరి, వివేకమును పాటించాలని ప్రోత్సహించబడింది.
2- సర్వ కార్యాల్లో మృదువైఖరి అవలంబించాలని ప్రోత్సహించడబడింది, ఎందుకంటే అది నోచుకోనివాడు సర్వ మేళ్ళను కోల్పోయినట్లే.
8. తల్లిదండ్రుల సేవ
అల్లాహ్ ఆదేశాలుః
{తన తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగమని మేము మానవునికి ఉపదేశించాము}. (అన్ కబూత్ 29: 8).
{నీ ప్రభువు ఇలా నిర్ణయం చేశాడు. మీరు కేవలం ఆయన్నుతప్ప మరెవరినీ ఆరాధించకండి. తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించండి. ఒకవేళ మీవద్ద వారిలో ఒకరు గాని ఇద్దరుగాని ముసలివారై ఉంటే, వారిముందు విసుగ్గా ‘ఛీ’ అని కూడా అనకండి. వారిని కసరుకుంటూ సమాధానం ఇవ్వకండి. వారితో మర్యాదగా మాట్లాడండి}. (17: 23).
{మానవుడు తన తల్లిదండ్రుల హక్కును గుర్తించాలని స్వయంగా మేమే అతనికి నిర్దేశించాము. అతని తల్లి బలహీనతపై బలహీనతను సహించి అతనిని తన కడుపున మోసింది. అతను పాలు విడిచి పెట్టటానికి రెండు సంవత్సరాలు పట్టింది. (అందుకే మేము అతనికి ఇలా బోధించాము) “నాకు కృతజ్ఞుడవై ఉండు, నీ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపు}. (లుఖ్మాన్, 31:14).
అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా ప్రశ్నించానుః ‘అల్లాహ్ కు అన్నిటికంటే ఎక్కువ ప్రియమైన ఆచరణ ఏది?’ అని. “నమాజు దాని సమయంలో చేయడం” అని ఆయన సమాధానమిచ్చారు. ‘ఆ తరువాత ఆచరణ ఏది’ అని అడిగాను. “తల్లిదండ్రుల పట్ల సద్వర్తనతో మెలగడం” అని చెప్పారు. ‘ఆ తరువాత ఏది’ అని నేను మళ్ళీ ప్రశ్నించాను. “అల్లాహ్ మార్గంలో పోరాడడం” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. (బుఖారి 527, ముస్లిం 85).
అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి, ‘ప్రవక్తా! నా సేవ, సద్వర్తనలకు అందరికంటే ఎక్కువ హక్కుగలవారెవరు?’ అని అడిగాడు. “నీ తల్లి” అని చెప్పారు ప్రవక్త ﷺ. ‘ఆ తరువాత ఎవరూ?’ అంటే “నీ తల్లి” అనే చెప్పారు ప్రవక్త ﷺ. తిరిగి అతను ‘ఆ తరువాత ఎవరూ?’ అని అడిగాడు. “నీ తల్లి” అనే జవాబిచ్చారు ప్రవక్త ﷺ. ‘ఆ తరువాత ఎవరూ’ అని మళ్ళీ అడిగాడతను. దానికి ప్రవక్త ﷺ చెప్పారుః “నీ తండ్రి” అని. (బుఖారి 5971, ముస్లిం 2548).
విశేషాలుః
1- తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలు చూపాలని, వారికి విధేయులయి ఉండాలని మరియు వారితో ఎల్లప్పుడూ సద్వర్తనతో మెలుగుతూ, ఉపకారం చేస్తూ ఉండే కాంక్ష ఉంచాలని ఇస్లాం ఆదేశిస్తుంది.
2- నియమిత కాలములో నమాజు తరువాత, తల్లిదండ్రుల సేవయే అల్లాహ్ కు అత్యంత ప్రియమైన ఆచరణ.
3- వారి అవిధేయత, వారితో కఠోరంగా, కర్కశంగా మాట్లాడుట మరియు వారిని ఊఁ లేక ఛీ అని అనుట నుండి కఠినంగా హెచ్చరించబడింది.
4- తల్లి పట్ల ఉపకారం, విధేయత హక్కు తండ్రి కన్నా ఎక్కువ ఉందని తెలుపబడింది.
ప్రజల స్వర్గ ప్రవేశానికి ఏ ఆచరణలు అధికంగా కారణమవుతాయి? అని వచ్చిన ప్రశ్నకు ప్రవక్త ﷺ ఇలా సమాధానమిచ్చారుః “అల్లాహ్ భయబీతి (తఖ్వా) మరియు సద్వర్తన”. ఉల్లేఖనం: అబూ హురైర ÷. (తిర్మిజిః 2004).
“సద్వర్తనగల విశ్వాసులే వారిలో సంపూర్ణ విశ్వాసం గలవారు. తమ ఇల్లాలి పట్ల సద్వర్తనతో మెలిగేవారే మీలో చాలా మంచివారు”. ఉల్లేఖనం: అబూ హురైర÷ . (తిర్మిజి 1162).
“నైతిక గుణాల వల్ల ఒక విశ్వాసునికి ఉపవాసమున్న వాని మరియు రాత్రి వేళ తహజ్జుద్ నమాజ్ సలుపు వారంత స్థానం లభిస్తుంది”. ఉల్లేఖనం: ఆయిష రజియల్లాహు అన్హా. (అబూ దావూద్ 4798).
విశేషాలుః
1- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతి ఉత్తమ గుణముగలవారని తెలిసింది.
2- సద్వర్తన ఘనత, దాని స్థానం తెలిసింది. స్వర్గ ప్రవేశానికి, ఉన్నత స్థానానికి ఏ సత్కార్యాలు అధికంగా కారణమవుతాయో అందులో ఒకటి సద్వర్తన. ప్రళయదినాన కర్మలు తూకం చేయబడతాయి. ఒక ముస్లిం త్రాసులో అతి భారముగల క్రియ అల్లాహ్ భీతి, మరియు సద్వర్తన ఉంటాయి.
3- మంచి మాట మాట్లాడాలని, మంచి పనులే చేయాలని ఇస్లాం ప్రోత్సహిస్తుంది.
4- సద్భావంతో జీవితం గడుపుకునే భార్యభర్తల ప్రాముఖ్యత.
5- సత్కార్యాలతో విశ్వాసం పెరుగుతుంది. దుష్కార్యాలతో విశ్వాసం తరుగుతుంది.
10. సౌమ్యం, మృదువైఖరి
అల్లాహ్ ఆదేశం:
{(ప్రవక్తా!) అల్లాహ్ యొక్క అనంత కరుణ వల్లనే నీవు వారిపట్ల మృదు స్వభావుడవు అయ్యావు. నీవే గనక కర్కశుడవు, కఠిన హృదయుడవు అయినట్లయితే వారందరూ నీ చుట్టు పక్కల నుండి దూరంగా పోయేవారు}. (ఆలె ఇమ్రాన్, 3:159).
మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్ ఖైస్ తెగ ప్రతినిధి వర్గనాయకుడైన అషజ్జ్ ను సంబోధించి ఇలా అన్నారుః “నీలో రెండు సద్గుణాలున్నాయి. అవి అల్లాహ్ కు ఎంతో ఇష్టమయినవి. అవిః సహనం, సౌమ్యం”. ఉల్లేఖనం: ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు. (ముస్లిం 17).
అల్లాహ్ ఈ విధంగా బోధించినట్లు మాహానీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారుః “నా దాసులారా! నేను దౌర్జన్యాన్ని నిషేధిస్తున్నాను. మీరు కూడా ఒకరిపై నొకరు దౌర్జన్యం చేయడం నిషిద్ధం అని భావించండి, అలాగే ఆచరించండి”. ఉల్లేఖనం: అబూ జర్ర్ రజియల్లాహు అన్హు. (ముస్లిం 2577).
“ఎవనిపై తన సోదరుడ్ని అవమానపరచిన లేదా మరే విధమైన అన్యాయము ఉన్నచో, దిర్హమ్ వ దీనార్ (డబ్బు, ధనం) చెల్లని ఆ (ప్రళయ) దినం రాకా ముందే క్షమాపణ కోరి లేదా వారి హక్కు ఇచ్చేసి) తొలిగిపోవాలి. లేదా ఆ రోజున బాధితుని వద్ద పుణ్యాలున్నచో తను ఎంత అన్యాయము చేశాడో అన్ని పుణ్యాలు తీసుకొనబడును. అతని వద్ద పుణ్యాలు లేనిచో పీడితుని పాపాలు తీసుకొని అతనిపై వేయబడును”. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు. (బుఖారి 2449).
విశేషావలుః
1- దౌర్జన్యం నిషిద్ధం కనుక భయపడి ఉండాలి.
2- అత్యచారికి ఇహపర లోకాల్లో కఠిన శిక్ష గలుగును.
3- పీడితుని అర్తనాదన అత్యాచారి పట్ల స్వీకరించబడుతుంది.
13. ముస్లిమును వధించడం నిషిద్ధం
అల్లాహ్ ఆదేశాలుః
{ఉద్దేశ్యపూర్వకంగా ఒక విశ్వాసిని చంపేవానికి ప్రతిఫలం నరకం. అందులో అతడు సదా ఉంటాడు. అతనిపై అల్లాహ్ ఆగ్రహం, శాపం అవతరిస్తాయి. అల్లాహ్ అతడి కొరకు కఠినమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు}. (నిసా 4: 93).
ప్రవక్త ﷺ ప్రవచనాలుః
عَنْ عَبْدِ الله ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (أَوَّلُ مَا يُقْضَى بَيْنَ النَّاسِ يَوْمَ الْقِيَامَةِ فِي الدِّمَاءِ).
“ప్రళయదినాన రక్తాలు చిందించిన వారిపట్ల మొదటి తీర్పు జరుగును”. అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం. (ముస్లిం 1678, బుఖారి 6533).
“అల్లాహ్ యందు ఒక విశ్వాసున్ని సంహరించటం కన్నా ప్రపంచనాశనము చాలా సులభం”. ఉల్లేఖనం: అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా. (నసాయి 3922, తిర్మిజి 1395).
విశేషాలుః
1- ముస్లింను వధించటం చాలా ఘోర పాపం. అల్లాహ్ వద్ద ముస్లిం విలువ చాలా గొప్పది.
2- రక్తాలు చిందించటం ఘోర పాపం. కాబట్టి మొదటి తీర్పు దాని గూర్చే అగును.
3- వధించిన వానిని ఇహలోకములో వధింపబడును. మరియు పరలోకము నందు అతడు శాశ్వతంగా నరకములో ఉండును.
“విశ్వాసి మరొక విశ్వాసితో కలసి ఒక కట్టడంలా రూపొందుతాడు. దాని ఒక భాగం మరొక భాగానికి బలం చేకూర్చుతుంది”. ఉల్లేఖనం: అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు. (బుఖారి 2446, ముస్లిం 2585).
“ఒక ముస్లిం మరొక ముస్లింకు సోదరుడు. అతనికి ద్రోహం చేయకూడదు. అతనితో అసత్య వ్యవహారం చేయకూడదు. అసహాయంగా ఉండకూడదు. ఒక ముస్లిం మరొక ముస్లింని అవమాన పరుచుట, వధించుట మరియు అతని సొమ్మును కాజేయుట నిషిద్ధం. ‘తఖ్వా’ (అల్లాహ్ భయభీతి) ఇక్కడ ఉంది (అని ప్రవక్త ఛాతి వైపు సైగ చేశారు). ఒక ముస్లింని హీనపరచడం దుష్ ప్రవర్తన గల వ్యక్తి చిహ్నం”. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు. (తిర్మిజి 1927. దీని భావం ముస్లిం 2564లో ఉంది).
“ఎవరయితే ఒక ముస్లింపై ఆసన్నమయిన కష్టాన్ని దూరం చేస్తారో, అతనికి ప్రళయదినాన ఎదురయ్యే కష్టాన్ని అల్లాహ్ దూరం చేస్తాడు. ఎవరయితే ఋణగ్రస్తునికి వీలైనంత వ్యవదిస్తాడో అల్లాహ్ ఇహపరలోకాల్లో అతనికి సౌలభ్యం కలుగ జేస్తాడు. ఎవరయితే ముస్లిం యొక్క లోటుపాట్లను మరుగు పరుస్తాడో అల్లాహ్ ప్రళయదినాన అతని తప్పిదాలను కప్పిపుచ్చుతాడు. తన సోదరుని సహాయములో ఉన్నవారికి అల్లాహ్ సహాయపడతాడు”. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు. (ముస్లిం 2699).
విశేషాలుః
1- విశ్వాసులు పరస్పర సహోదరులు. రాజు, బంటు, చిన్న, పెద్ద ఎవరైనా సరే.
2- ముస్లిములు పరస్పరం చేదోడువాదోడుగా ఉండాలని, అక్కరగల వారికి ధర్మప్రకారంగా సహాయపడాలని చాలా ప్రోత్సహించబడింది.
3- నిస్సహాయంగా ఉన్నవారికి సహాయపడుట ఘనతగల విషయం, చాలా పుణ్యం.
15. ఇరుగు పొరుగు వారి హక్కులు
అల్లాహ్ ఆదేశం:
{మీరంతా అల్లాహ్ కు దాస్యం చెయ్యండి. ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా చేయకండి. తల్లిదండ్రుల ఎడల సద్భావంతో మెలగండి. బంధువులూ, అనాధలూ, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులయిన పొరుగువారు, ప్రక్కనున్న మిత్రులు, బాటసారులు వీరందరి పట్ల మంచిగా వ్యవహరించండి}. (నిసా 4: 36).
ఒక సారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః “అల్లాహ్ సాక్షిగా అతను విశ్వాసి కాడు, అల్లాహ్ సాక్షిగా అతను విశ్వాసి కాడు, అల్లాహ్ సాక్షిగా అతను విశ్వాసి కాడు”. ఎవరు ప్రవక్తా అని అడగ్గా, “ఎవరి పొరుగు వారికయితే వారు పెట్టే కష్టాల వల్ల అశాంతి కలుగుతుందో వారు” అని ప్రవచించారు ప్రవక్త. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు. (బుఖారి 6016).
“అల్లాహ్ మరియు ప్రళయదినంపై విశ్వాసమున్నవారు పొరుగు వారికి కష్ట పెట్టకూడదు. ఎవరయితే అల్లాహ్ ను పరలోక దినాన్ని విశ్వసిస్తారో, వారు తమ అతిథిని ఆదరించి సత్కరించాలి. అల్లాహ్ మరియు పరలోక దినాన్ని విశ్వసించువారు మంచి మాట మాట్లాడాలి లేదా మౌనం వహించాలి”. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు. (బుఖారి 6018, ముస్లిం 47).
విశేషాలుః
1- పొరుగువారికి ఉపకారం చేస్తూ ఉండాలి. కష్టపెట్ట కూడదని ప్రోత్సహిస్తూ చాలా తాకీదు చేయబడింది.
2- ఉత్తమ విశ్వాసముగల మానవుడు, పొరుగువారితో సద్వర్తనతో మెలిగి, కష్టపెట్టకుండా ఉన్నవాడు. (ఆ పొరుగు వారు ముస్లిమేతరులైనప్పటికీ).
16. నాలుక భయంకరాలు
అల్లాహ్ ఆదేశాలుః
{అతని నోటి నుండి వెడలే ప్రతి మాటనూ వ్రాయటానికి అనుక్షణం ఒక పరిశీలకుడు సిద్ధంగా ఉంటాడు}. (ఖాఫ్ 50: 18).
{మీకు తెలియని విషయం వెంట పడకండి. నిశ్చయంగా కళ్ళూ, చెవులూ, మనస్సూ అన్నింటి విషయంలోనూ విచారణ జరుగుతుంది}. (బనీ ఇస్రాయీల్ 17: 36).
‘ప్రవక్తా! ఉత్తమ విశ్వాసులెవరు?’ అని నేనడగ్గా, “ఎవరి నాలుక మరియు చెయ్యి ద్వారా ఇతర ముస్లిములు శాంతి పొందుతారో అతడే” అని మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బదులిచ్చారు. ఉల్లేఖనం: అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు. (ముస్లిం 42, బుఖారి 11).
“ఎవరైతే తమ పెదాల మధ్య ఉన్న దాన్ని, ఊరువుల మధ్య ఉన్న దాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటారో వారికి స్వర్గం లభింపజేసే పూచీ నాది”. ఉల్లేఖనం: సహల్ బిన్ సఅద్ రజియల్లాహు అన్హు. (బుఖారి 6474).
“దాసుడు ఆలోచించక, గ్రహించక పలికే మాటకు బదులుగా నరకు కూపములో పడతాడు. తూర్పు పడమర మధ్య ఉన్నంత దూరం దాని లోతు ఉంటుంది”. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు. (బుఖారి 6477, ముస్లిం 2988).
విశేషాలుః
1- నాలుక భయంకరాల నుండి జాగ్రత్త ఉండాలి. అనాలోచనతో ఉచ్చరించిన మాటల ద్వారా మానవుడు నరకములో చేరుకుంటాడు. మరియు ఇదే నాలుక ఉపయోగము అధర్మంగా ఉంటే నరక ప్రవేశానికి కారణము. మరియు ధర్మంగా ఉంటే స్వర్గప్రవేశానికి కారణమగును. అనేక మంది పాపానికి గురి అయ్యే కారణము అనవసరంగా నిర్లక్ష్యంగా మాట్లాడడమే.
2- మాట్లాడే ప్రతి మాట మరియు ప్రతి చిన్న పని గురించి కూడా విచారణ జరగనున్నది. (మనిషి అవయవాలలో) నాలుక మరియు మర్మాంగము చాలా భయంకరమైనవి.
17. పరోక్షనింద నిషిద్ధం
అల్లాహ్ ఆదేశం:
{మీలో ఎవరూ ఎవరినీ పరోక్షంగా నిందించరాదు. మీలో ఎవరైనా మీ మృతసోదరుని మాంసం తినటానికి ఇష్టపడతారా? చూడండి, మీరే స్వయంగా దీనిని అసహ్యించుకుంటారు}. (హుజురాత్ 49: 12).
ఒక సారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు, “పరోక్షనింద అంటేమిటో మీకు తెలుసా?” అని. ‘అల్లాహ్, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు’ అన్నారు అక్కడున్నవారు. అప్పుడు ప్రవక్త చెప్పారుః “పరోక్ష నింద అంటే మీరు మీ సోదరుని ప్రస్తావన అతనికి నచ్చని విధంగా చేయడం అన్న మాట. దానికి వారు, ‘అయితే నేను చెప్పే విషయం నా సోదరునిలో వాస్తవంగా ఉన్నప్పటికీ అది పరోక్షనిందే అవుతుందా?’ అని ఆశ్చర్యంగా అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నీవు చెప్పే విషయం అతనిలో ఉన్నదయితెనే అది పరోక్షనింద అవుతుంది. అతనిలో లేని విషయాన్ని నీవు చెప్పినట్లయితే అది అపనింద అవుతుంది” అని విశదీకరించారు. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు. (ముస్లిం 2589).
నేనొకసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ‘సఫియలో ఉన్న ఈ లోపాలే చాలు, ఆమె పొట్టిది’ అని అన్నాను. దానికి ప్రవక్త ﷺ “ఆయిషా! నీవు పలికిన మాట ఎంత మలినమైనదంటే, దాన్ని సముద్రములో రంగరిస్తే సముద్రమంతా కలుషితమైపోతుంది” అని బాధతో అన్నారు. ఉల్లేఖనం: ఆయిషా రజియల్లాహు అన్హా. (అబూదావూద్ 4875, తిర్మిజి 2502).
“ఒక ముస్లిం మరొక ముస్లింని అవమాన పరుచుట, వధించుట మరియు అతని సొమ్ము కాజేయుట నిషిద్ధం”. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు. (తిర్మిజి 1927. దీని భావం ముస్లింలో ఉంది).
“తన సోదరుని పరువు కాపాడుటకు ప్రయత్నించే వానిని ప్రళయదినాన అల్లాహ్ నరకం నుండి కాపాడతాడు”. అబూ దర్దా ఉల్లేఖనం. (తిర్మిజి 1931).
విశేషాలుః
1- పరోక్షనింద నిషిద్ధం. అది ఘోర పాపము. మరియు పరోక్షనిందుతునికి కఠినమైన శిక్ష గలదు.
2- ఒకరి ప్రస్తావన అతని వెనక అతను నచ్చని విధంగా చేయుటయే పరోక్షనింద. అది నిషిద్ధం. వాస్తవంగా అది అతనిలో ఉన్నప్పటికైనా.
3- పరోక్షనింద చేయువానిని అలా చేయకుండా ఆపుట విధి. పరోక్షనింద విషయాలు వినుట కూడా నిషిద్ధం. ముస్లిం సోదరుని పరువు కాపాడుటకు పోరాడించువాని ఘనత చాలా ఉంది. అల్లాహ్ అతన్ని నరకము నుండి కాపాడతాడు.
4- పరోక్షనింద మాటల ద్వారా మరియు సైగల ద్వార కూడా అవుతుంది.
18. సత్యం ఘనత, అసత్యం నుండి హెచ్చరిక
అల్లాహ్ ఆదేశాలుః
{అల్లాహ్ ఆయతులను విశ్వసించనివారే అబద్ధాలను కల్పిస్తున్నారు. అసలు వారే అసత్యవాదులు}. (నహ్ల్ 16: 105).
{విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి. సత్యవంతులకు తోడ్పండి}. (తౌబా 9: 119).
{వారు తాము అల్లాహ్ కు చేసిన ప్రమాణాన్ని నెరవేర్చటంలో తమ నిజాయితీని నిరూపించుకొని ఉంటే, అది వారికే శ్రేయస్కరమైనదిగా ఉండేది}. (ముహమ్మద్ 47: 21).
నేను ప్రవక్తతో (నేర్చుకొని) జ్ఞాపకముంచుకున్న విషయం: “సందేహమున్న దాన్ని వదిలేసి, లేని దానిని తీసుకో. సత్యంలో శాంతి ఉంది. అసత్యంలో సందేహం” అని హసన్ బిన్ అలీ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు. (తిర్మిజి 2518).
“నిశ్చయంగా సత్యం పుణ్యానికి మరియు పుణ్యం స్వర్గానికి దారి చూపుతుంది. ఒక వ్యక్తి సత్యాన్ని పాటిస్తూ, సత్యంగా జీవిస్తూ సత్యవంతుల్లో కలుస్తాడు. నిశ్చయంగా అబద్ధం పాపానికి, పాపం నరకానికి దారి చూపుతుంది. ఒక వ్యక్తి అబద్ధమాడుతూ, అసత్యజీవితం గడుపుతూ అసత్యవంతుల్లో లిఖించబడతాడు”. ఉల్లేఖనం: అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు. (బుఖారి 6094, ముస్లిం 2607).
“ఏ వ్యక్తిలో ఈ నాలుగు గుణాలుంటాయో అతను అసలైన మునాఫిఖ్. ఒక వేళ అతనిలో వీటిలోని ఒక్క గుణం ఉన్నా అతను దాన్ని వదలనంత వరకు అతనిలో నిఫాఖ్ కు సంబంధించిన ఒక గుణం ఉన్నట్లే. ఆ నాలుగు గుణాలు ఇవిః అతన్ని నమ్మి ఏదయినా అమానతు అప్పగించినప్పుడు అతను దాన్ని కాజేస్తాడు. నోరు విప్పితే అబద్ధము పలుకుతాడు. మాటిస్తే దాన్ని నిలబెట్టుకోడు. ఎవరితోనయినా వాదులాట జరిగితే అన్యాయానికి దిగుతాడు”. ఉల్లేఖనం: అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా. (బుఖారి 34, ముస్లిం 58).
విశేషాలుః
1- అసత్యం నుండి హెచ్చరించబడింది. అసత్యం వంచకుల గుణం. ప్రజల మధ్య అసత్యాన్ని ప్రభలింపజేసేవారికి కఠిన శిక్ష గలదు.
2- అసత్యం పాపానికి గురి చేస్తుంది. అది నరక ప్రవేశానికి కారణమవుతుంది.
3- సత్యం ఘనత చాలా ఉంది. ప్రతి విషయంలో దాన్ని పాటించాలని ప్రోత్సహించబడింది.
4- అబద్ధం ‘నిఫాఖ్’ (వైరం) గుణాల్లో ఒకటి.
19 ‘తౌబా’ (పశ్చాత్తాపం)
అల్లాహ్ ఆదేశాలుః
{విశ్వసించిన ప్రజలారా! మీరంతా కలసి అల్లాహ్ వైపునకు మరలి క్షమాభిక్షను వేడుకోండి. మీకు సాఫల్యం కలగవచ్చు}. (నూర్ 24: 31).
{విశ్వాసులారా! చిత్తశుద్ధితో కూడిన పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపునకు మరలండి}. (తహ్రీమ్ 66: 8).
“ప్రజలారా! (మీ పాపాల మన్నింపుకై) మీరు అల్లాహ్ పట్ల తౌబా చేయండి. నేను ఒక రోజులో 100 సార్లు తౌబా చేస్తూ ఉంటాను”. ఉల్లేఖనం: అగర్ బిన్ యసార్ రజియల్లాహు అన్హు. (ముస్లిం 2702).
“నీళ్ళు పచ్చిక లభించని ఎడారిలో ఒంటె తప్పిపోయిన వ్యక్తి (దాన్ని పొందిన తర్వాత ఎంత సంతొషిస్తాడో) అంతకంటే ఎక్కువ తౌబా చేయు వ్యక్తితో అల్లాహ్ సంతొషిస్తాడు”. ఉల్లేఖనం: అనస్ రజియల్లాహు అన్హు. (బుఖారి 6309, ముస్లిం 2747).
“ప్రతి ఆదము కుమారుడు అపరాధుడే, అయితే అత్యధికంగా అల్లాహ్ వైపుకు మరలి క్షమాపణకై అర్థించేవారే మేలైన అపరాధులు”. ఉల్లేఖనం: అనస్ రజియల్లాహు అన్హు. (తిర్మిజి 2499).
“పగలు పాపము చేసిన వ్యక్తి రాత్రి వేళ అతని వైపుకు మరలతాడని అల్లాహ్ రాత్రి వేళ తన చెయ్యి చాపుతాడు. రాత్రి పాపము చేసిన వ్యక్తి పగలు తన వైపుకు మరలతాడని అల్లాహ్ పగలు తన చెయ్యి చాపుతాడు. ఇలా సూర్యుడు పశ్చిమాన ఉదయించే వరకు జరుగుతూ ఉంటుంది”. ఉల్లేఖనం: అబూ మూసా అష్అరి రజియల్లాహు అన్హు. (ముస్లిం 2759).
విశేషాలుః
1- సర్వ పాపాల నుండి అవి ఎంత ఘోరమయినా, నిరాశ చెందకుండా ఎల్లప్పుడూ తౌబా చేస్తూ ఉండాలి. అది మానవుని శ్రేయస్సుకూ, మోక్షానికీ ముఖ్య కారణం.
2- అల్లాహ్ కారుణ్యం చాలా అధికమైనది. అందుకు తౌబా ఘనత చాలా ఉంది. మరియు తౌబా చేయువానితో అల్లాహ్ చాలా సంతోషిస్తాడు.
3- అపరాధాలు ఆదము కుమారునితో జరుగుతూ ఉంటాయి. అందుకే పశ్చాత్తాపముతో క్షమాపణ వేడుకుంటూ ఉండాలి.
తౌబా నియమాలుః
1- తౌబా షరతుల్లో ఒకటిః శ్వాస చెదరక ముందు, ప్రాణం గొంతులో రాక ముందే చెయ్యాలి.
2- పడమర దిశ నుండి సూర్యోదయము కాకముందే తౌబా చెయ్యాలి. ఆ తరువాత ఏమీ లాభముండదు.
3- స్వచ్ఛంగా తౌబా చేసి కూడా మళ్ళీ అదే పని చేయువాని మొదటి తౌబా అంగీకరించబడుతుంది. కాని మళ్ళీ తౌబా చెయ్యాలి.
4- చేసిన తప్పు విడనాడి పశ్చాత్తాప పడి తౌబా చేసిన తరువాత తిరిగి అదే పాపం చేయకుండా స్థిరంగా ఉంటానని దృఢ సంకల్పం చేసుకోవాలి.
20. సలాం
అల్లాహ్ ఆదేశం:
{విశ్వసించిన ప్రజలారా! మీ ఇళ్ళల్లోకి తప్ప ఇతరుల ఇళ్ళల్లోకి ప్రవేశించకండి. ఇంటి వారి అంగీకారం పొందనంత వరకు, ఇంటి వారికి సలామ్ చేయనంత వరకు}. (నూర్ 24: 27).
“మీరేదయినా సమావేశంలో ప్రవేశించినప్పుడు సలాం చేయండి. కూర్చోవాలను కుంటే కూర్చోండి. మళ్ళీ అక్కడి నుండి తిరిగి వస్తున్నప్పుడు కూడా సలాం చేయండి. (గుర్తుంచుకోండి!) మొదటి సారి చేసే సలాం, వెళ్ళేటప్పుడు చేసే సలాం కన్నా అధిక పుణ్యఫలానికి పాత్రమయింది కాదు”. (అనగా తిరిగి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సలాం చేయాలి). ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు. (అబూ దావూద్ 5208, తిర్మిజి 2849).
విశేషాలుః
1- సలాం యొక్క ఘనత. అది ప్రేమాభిమానాలు పెంచుకొని స్వర్గ ప్రవేశానికి మంచి కారణం.
2- పరిచయం ఉన్నవారు లేనివారు, అందరికీ సలాం చేయాలి. కేవలం పరిచయం ఉన్నవారికే కాదు.
3- సలాం కొరకు ధర్మమైన పదాలుః “అస్సలాము అలైకుం” మరియు “వరహ్మతుల్లాహి” అనడం పుణ్యం. మరియు “వబరకాతుహు” కూడా అధిక పుణ్యం గలది. జవాబులో ఇవే పదాలు మరియు దీనికంటే (ధర్మమైన) మంచి పదాలు పలకాలి.
4- అవిశ్వాసులకు ముందు సలాం చేయకూడదు. వారు సలాం చేస్తే “వఅలైకుం” మాత్రమే అనాలి.
5- విశ్వాసులు అవిశ్వాసులు ఒకే చోట సమావేశమై ఉంటే సలాం చేయవచ్చును.
6- కొద్ది క్షణాలు కలిసి వీడిపోయిన గాని సలాం చేసి కలుసుకోవాలి. సలాం చేసి విడిపోవాలి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఇలా ఉపదేశించారుః “బిస్మిల్లాహ్ అంటూ కుడి చెయితో (పళ్ళములో) నీ దగ్గర ఉన్నదే తిను”. ఉల్లేఖనం: ఉమర్ బిన్ అబీ సలమహ్. (బుఖారి 5376, ముస్లిం 2022).
“మీలోనెవరు కూడా ఎడమ చెయితో తినత్రాగ కూడదు. ఎడమ చెయితో తినుట త్రాగుట షైతాన్ అలవాటు”. ఉల్లేఖనం: అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా. (ముస్లిం 2020).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరుగు దొడ్డికి వెళ్ళేటప్పుడు ఈ దుఆ పఠించేవారుః అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ ఖుబుసి వల్ ఖబాఇసి. (భావం: అల్లాహ్ షైతాన్ స్త్రీ పురుష దుష్ట శక్తుల బారి నుండి రక్షణ కొరకు నీ శరణు వేడుకుంటున్నాను). ఉల్లేఖనం: అనస్ రజియల్లాహు అన్హు. (బుఖారి 142, ముస్లిం 375).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలిచిన నీళ్ళల్లో మూత్రం చేయుట నివారించారని జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్లిం 281).
విశేషాలుః
1- ముస్లిం మలమూత్ర విసర్జనకు వెళ్ళునపుడు మరియు తిరిగి వచ్చునపుడు పైన తెలిపిన దుఆలు పఠించుట ప్రవక్త సాంప్రదాయం.
2- కాలకృత్యాలు తీర్చుకొనుటకు యడారిలో వెళ్ళినప్పుడు ప్రజల చూపులకు దూరంగా పోవాలి. ఖిబ్లా దిశలో వీపు గాని ముఖం గాని పెట్టి కూర్చోరాదు. నాలుగు గోడల మధ్యలో కూర్చున్నప్పుడు ఖిబ్లా దిశలో ఉంటే ఏమీ పాపం లేదు.
3- మలమూత్రపు తుంపరలు శరీరం, దుస్తులపై పడకుండా జాగ్రత్తగా ఉండాలి. వెంటనే పరిశుభ్రత తప్పనిసరిగా చేసుకోవాలి.
4- ఇస్లాం ఎంత సంపూర్ణమైన ధర్మం చూడండి. మలమూత్ర విసర్జన పద్ధతుల గురించి కూడా మంచి శిక్షణ ఇచ్చింది. మానవ అవసరాలకు తగిన ఏ విషయాన్ని కూడా వివరించక ఉండలేదు.
“అల్లాహ్ తుమ్ముతో ఇష్టపడతాడు. ఆవలింపును అసహ్యించు కుంటాడు. గనక మీలో ఎవరైనా తుమ్మినచో అల్ హందులిల్లాహ్ అనాలి. ఇది విన్న ప్రతి ముస్లింపై యర్ హముకల్లాహ్ అని బదులివ్వడం తప్పనిసరి హక్కు. ఇక ఆవలింపు, ఇది షైతాన్ తరఫున వస్తుంది. గనక ఆవలింతువారు పూర్తి శక్తితో దాన్ని ఆపుకోవాలి. ఎందుకనగా మీలో ఎవరైనా ఆవలించినప్పుడు షైతాన్ చూసి సంబర పడతాడు”. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు. (బుఖారి 6223).
“మీలో ఎవరైనా తుమ్నినప్పుడు అల్ హందులిల్లాహ్, ఇది విన్నవారు యర్ హముకల్లాహ్, మళ్ళీ తుమ్మినవారు యహ్ దీకుముల్లాహ్ వ యుస్లిహు బాలకుం అనాలి”. అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం. (బుఖారి 6224).
“తమ్మిన వ్యక్తి అల్ హందులిల్లాహ్ అన్నప్పుడే మీరు యర్ హముకల్లాహ్ అనండి. అతడు అల్ హందులిల్లాహ్ అనకున్నట్లయితే మీరు జవాబివ్వకండి” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను అని అబూ మూసా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్లిం 2992).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తుమ్మినప్పుడు చెయిని లేక చేతి రూమాలును మూతి మీద పెట్టుకొని, చాలా తక్కువ స్వరంతో తుమ్మేవారు అని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (తిర్మిజి 2745, అబూ దావూద్ 5029).
విశేషాలుః
1- తుమ్మిన వ్యక్తి అల్ హందులిల్లాహ్ అన్నది విన్నవారు యర్ హముకల్లాహ్ అనుట పుణ్యం.
2- అల్ హందులిల్లాహ్ అనకున్నట్లయితే జవాబివ్వనవసరం లేదు.
3- ఆవలింపునాపడం చాలా మంచిది.
4- ఆవలింపును ఆపలేని స్థితిలో చెయి అడ్డం పెట్టుకొనుట మంచిది.
5- తుమ్మెటప్పుడు చెయి, దస్తీ లేక రూమాలు ఏదైనా అడ్డం పెట్టుకోవాలి.
6- తుమ్మినప్పుడు, ఆవలంచినప్పుడు తక్కువ శబ్దం రానివ్వాలి. ఘనంగా తుమ్ముట అసహ్యమేర్పడును.
“మేకల మంద, తోట భద్రత మరియు వేటకు తప్ప వేరే ఉద్దేశ్యంతో కుక్కను పెంచేవారి పుణ్యాలలో రోజుకొక ఖీరాత్ పుణ్యాలు తగ్గుతూ ఉంటాయి”. మరో ఉల్లేఖనంలో “రెండు ఖీరాతులు” అని ఉంది. (ఒక్క ఖీరాత్ ఒక ఉహద్ పర్వతానికి సమానం). అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం. (ముస్లిం 1575, బుఖారి 2322).
“కుక్క మీలోనెవరి పళ్ళములోనైన మూతి పెడితే దాన్ని ఏడు సార్లు కడిగి ఎనిమిదవ సారి మట్టితో కడగండి”. ఉల్లేఖనం: అబ్గుల్లాహ్ బిన్ ముఘఫ్ఫల్ రజియల్లాహు అన్హు. (ముస్లిం 280).
విశేషాలుః
1- కుక్కను పెంచడం నిషేధం. కాని తోట, మేకల భద్రత మరియు వేట కుక్క తప్ప.
2- కుక్కల నుండి దూరంగానే ఉండాలి.
3- కుక్క ఎందులోనైతే మూతి పెట్టినదో, అది అపరిశుభ్రం. గనక దాన్ని ఏడు సార్లు నీళ్ళతో మరియు ఒక్క సారి మట్టితో కడగాలి.
25. అల్లాహ్ యొక్క జిక్ర్ (స్మరణ)
అల్లాహ్ ఆదేశాలుః
{మీరు జయము పొందుటకు అల్లాహ్ ను చాల స్మరింపుము}. (సూరె జుముఅ: 62: 10).
{ఓ విశ్వాసులారా! మీరు చాల ఎక్కువగా అల్లాహ్ ను స్మరించండి. మరియు మీరు ఉదయం సాయంకాలం అతని పవిత్రతను కొనియాడండి}. (సూరె అహ్ జాబ్ 33: 41,42).
“అల్లాహ్ స్మరణల్లో చాలా ఘనత గలది లాఇలాహ ఇల్లల్లాహ్”. అని ప్రవక్త చెప్పగా నేను విన్నాను అని జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (తిర్మిజి 3383, ఇబ్ను మాజ 3800).
కొన్ని దుఆలు:
A. పడుకునే ముందు
بِاسْمِكَ اللَّهُمَّ أَمُوتُ وَأَحْيَا
బిస్మికల్లాహుమ్మ అమూతు వ అహ్ యా. (బుఖారి 6324). [భావం: అల్లాహ్ నేను నీ నామ స్మరణంతోనే మృత్యువు ఒడిలో ఒదిగి పోతాను. నీ పేరు పలుకుతూ బ్రతికి లేస్తాను].
అల్ హందులిల్లాహిల్లజీ అహ్ యానా బఅద మా అమాతనా వఇలైహిన్ నుషూర్. (బుఖారి 6324). [భావం: సర్వ స్తోత్రములకు అర్హుడైన ఆ అల్లాహ్ యే మమ్మల్ని నిర్జీవావస్తకు గురి జేసి తిరిగి జీవం పోసినవాడు. ఆయన సమక్షంలోనే మేము తిరిగి లేచి నిలబడవలసిన వారము].
బిస్మిల్లాహ్, అల్ హందులిల్లాహ్, సుబ్ హానల్లజీ సఖ్ఖరలనా హాజా వమా కున్నా లహూ ముఖ్రినీన్, వఇన్నా ఇలా రబ్బినా లమున్ ఖలిబూన్. (అహ్మద్ 1/97. ముస్లిం 1342.). [భావం: అల్లాహ్ పేరుతో, సర్వస్తోత్రములు అల్లాహ్ కే, ఆయన అతి పవిత్రుడు. ఆయనే ఈ వాహనమును మా ఆధీనంలో చేశాడు. లేకపోతే మేము దీన్ని ఆధీన పరుచుకోలేక పోయేవారము. నిశ్చయంగా మేము మా ప్రభువు వైపునకు మరలవలసిన వారలము].
అఊజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్. (ముస్లిం 2708). [భావం: సృష్టిలో ఉన్న సర్వ కీడుల నుండి నేను అల్లాహ్ యొక్క సంపూర్ణ వచనాల శరణు వేడుతున్నాను].
అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లాషరీక లహూ వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహు. (ముస్లిం 234). [భావం: అల్లాహ్ తప్ప ఇతరులెవ్వరు ఆరాధనకు అర్హులు కానేకారని, ఆయన అద్వితీయుడు, ఆయనకు ఎవరు సాటి లేరని నేను సాక్ష్యమిచ్చుచున్నాను. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను].
బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్. (అబూ దావూద్ 5095, తిర్మిజి 3426). [భావం: అల్లాహ్ పేరుతో మరియు ఆయనపై నమ్మకంతోనే నేను (బైటికి వచ్చాను). పాపానికి దూరంగా ఉండే శక్తిని, సదాచరణకు సద్బుద్ధినీ ప్రసాదించేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే].
బిస్మిల్లాహి వలజ్నా వ బిస్మిల్లాహి ఖరజ్నా వఅలల్లాహి రబ్బినా తవక్కల్నా. (అబూ దావూద్ 5096). [భావం: అల్లాహ్ నామముతోనే ప్రవేశించాము. అల్లాహ్ నామముతోనే బైటికి వచ్చాము. మా పోషకుడైన అల్లాహ్ పైనే మా నమ్మకం].
అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. (బుఖారి 3370). [భావం: అల్లాహ్ నీవు ఇబ్రాహీంను, వారి కుటుంబీకులను కరుణించినట్లు ముహమ్మద్ మరియు వారి కుటుంబీకులను కరుణించు. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి. ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేసినట్లు ముహమ్మద్, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేయుము. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి].
అల్లాహుమ్మ బిక అమ్ సైనా వబిక అస్బహ్నా వబిక నహ్ యా వబిక నమూతు వఇలైకన్నుషూర్. (అబూ దావూద్ 5068). [భావం: అల్లాహ్! నీ సహకారంతోనే సాయంత్రానికి చేరాము. నీ సహాయముతోనే ప్రాతఃకాలానికి చేరాము. నీ దయతోనే జీవిస్తున్నాము. నీ ఆజ్ఞ అయితేనే మరణిస్తాము. చివరికి నీ వద్దకే హాజరవుతాము].
26. స్నేహం
అల్లాహ్ ఆదేశాలుః
{ఆ దినం వచ్చినప్పుడు స్నేహితులందరూ ఒకరికొకరు శత్రువులైపోతారు. -భయభక్తులు కలవారు తప్ప – }. (సూరె జుఖ్రుఫ్ 43: 67).
{దుర్మార్గపు మానవుడు తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు, “అయ్యో నేను దైవప్రవక్తకు తోడుగా ఉంటే ఎంత బాగుండేది! అయ్యో నా దౌర్భాగ్యం! నేను ఫలానా వ్యక్తితో స్నేహం చేయకుండా ఉంటే ఎంత బాగుండేది! అతడి మాయలో పడి నేను నా వద్దకు వచ్చిన హితబోధను స్వీకరించలేదు. షైతాను మానవుని విషయంలో నమ్మకద్రోహి అని తేలిపోయింది”}. (సూరె ఫుర్ ఖాన్ 25: 27-29).
{తరువాత వారు ఒకరి వైపున కొకరు తిరిగి పరిస్థితులను గురించి పరస్పరం అడిగి తెలుసుకుంటారు. వారిలో ఒకడు ఇలా అంటాడుః ప్రపంచంలో నాకు ఒక మిత్రుడు ఉండేవాడు. అతను నాతో ఇలా అంటూండేవాడు, నీవు కూడా ధ్రువీకరించే వారిలో చేరిపోయావా? మనం చనిపోయి, మట్టిగా మారి, అస్థిపంజరంగా మిగిలిపోయినపుడు నిజంగానే మనకు ప్రతిఫలమూ, శిక్షా అనేవి ఉంటాయా? ఇప్పుడతను ఎక్కడున్నాడో, మీరు చూడదలచుకున్నారా? ఇలా చెప్పి అతను తొంగి చూడగానే, అతనికి నరకంలోని ఒక అగాధంలో అతను కనిపిస్తాడు. అప్పుడు అతన్ని సంబోధిస్తూ ఇలా అంటాడుః అల్లాహ్ సాక్షిగా! నీవు నన్ను సర్వ నాశనం చేసి ఉండేవాడివి. నా ప్రభువు అనుగ్రహం లేకపోయి ఉంటే, ఈ రోజు నేను కూడా పట్టుబడి వచ్చిన వారిలో ఒకడినై ఉండేవాణ్ణి}. (సూరె సాఫ్ఫాత్ 37: 50-57).
“మనిషి తన స్నేహితుని ధర్మాన్ని అనుసరిస్తాడు. అందుకని తాను స్నేహం చేస్తున్న వారిని గురించి ఆలోచించుకొని మరీ స్నేహం చేయాలి”. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహుఅన్హు. (అబూ దావూద్ 4833, తిర్మిజి 2378).
“ఏ రోజు అల్లాహ్ నీడ తప్ప వేరే నీడ లభ్యం కాదో ఆ రోజు అల్లాహ్ ఏడు రకాల మనుషులకు తన నీడలో ఆశ్రయమిస్తాడు. ఆందులో వీరు కూడాః అల్లాహ్ మరియు ఆయన ధర్మం కొరకు మాత్రమే మైత్రి ప్రేమాభిమానాలు గల ఇద్దరు వ్యక్తులు; వారు అల్లాహ్ కొరకే కలుసుకుంటారు. మరియు అల్లాహ్ కొరకే వేరౌతారు”. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు. (బుఖారి 660, ముస్లిం 1031).
విశేషాలు
1- ప్రతి మనిషికి మితృడు అవసరం. అలాంటప్పుడు సద్వర్తనగల మరియు మంచిని బోధించి ధర్మమునకు సహాయపడు వానితో స్నేహం చేయాలి. చెడు వైపునకు, పాపానికి మరియు అల్లాహ్ తిరస్కారానికి గురి చేసే దారి చూపు అధర్మ మితృడు, మితృడు కాడు శతృడు.
2- ధర్మము నుండి దూరము చేయు అల్లాహ్ ఆజ్ఞను పాటించనివ్వని అవిశ్వాస స్నేహం నుండి దూరముండాలి.
{మేము మిమ్మల్ని భయప్రమాదాలకు, ఆకలి బాధకు, ధనప్రాణాల నష్టాలకు మరియు ఆదాయాల కొరతలకు గురి చేసి తప్పక పరీక్షిస్తాము. ఈ పరిస్థి- తులలో సహనం వహించేవారికి శుభవార్తనందజేయి}. (బఖర 2: 155).
“విశ్వాసుని వ్యవహారం కూడా వింతయినది. అతను ఏ స్థితిలో ఉన్నా తద్వార శుభాన్నే సేకరిస్తాడు. అతను సుఖ సంపన్నతలు వరించినప్పుడు కృతజ్ఞతతో మెలుగుతాడు. అది అతనికి మేలును చేకూరుస్తుంది. వ్యాది వ్యధలకు గురై నప్పుడు వాటిని సహనంతో ఎదుర్కొంటాడు. అది అతనికి శుభప్రద మవుతుంది”. ఉల్లేఖనం: సుహైబ్ రజియల్లాహు అన్హు. (ముస్లిం 2999).
అల్లాహ్ చెప్పాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను అని అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నేను నా దాసున్ని అతనికి ప్రియమైన వాటితో పరీక్షించినప్పుడు అతడు సహనం వహిస్తే నేను అతనికి దానికి బదులుగా స్వర్గం ప్రసాదిస్తాను”. (బుఖారి 5653).
“ఒక ముస్లిం మానసిక వ్యధకూ లేదా అనారోగ్యానికి లేదా ఏదయినా కష్టానికి, దుఖానికి గురయి దాన్ని ఓరిమితో సహించినట్లయితే దానికి ప్రతిఫలంగా అల్లాహ్ అతని తప్పులను మన్నిస్తాడు. కడకు అతనికి ఒక ముళ్ళు గుచ్చుకున్నా అది అతని పాప విమోచనానికి కారణ భూతమవుతుంది”. (బుఖారి 5642, ముస్లిం 2573).
“విశ్వాసులయిన స్త్రీ పురుషులపై అప్పుడప్పుడు పరీక్ష సమయాలు ఆసన్నమవుతూ ఉంటాయి. ఒక్కోసారి స్వయంగా అతనికి, మరోసారి అతని సంతానానికి, ఇంకొకసారి అతని సంపదకి ఈ ఆపదలు వాటిల్లుతాయి. చివరకు అతను అల్లాహ్ ను కలుసుకున్నప్పుడు అతని (కర్మపత్రంలో) ఏలాంటి పాపముండదు”. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు. (తిర్మిజి 2399).
విశేషాలుః
1- ప్రతి విషయంలో ఓపిక వహించాలని మరియు సహనానికి వ్యతిరేకం చేసి (అల్లాహ్ కోపానికి గురి కాకూడదని) ప్రోత్సహించబడింది. మరియు అసహనానికి గురి కాకూడదని హెచ్చరించబడింది. ఎందుకనగా పరీక్ష (బాధ) కాలములో లభించే పుణ్యాలు కూడా వ్యర్థమయి పోతాయి.
2- ముస్లింపై ఏ కష్టము వచ్చినా, దానితో అతని పాపాలు తగ్గుతాయి.
3- ఓపిక విషయాలలో సత్కార్యములు ఓపికతో చేయుట మరియు పాపాలు చేయకుండా సహనం వహించుట అతి గొప్ప విషయం.
4- అల్లాహ్ సర్వం తెలియువాడు, వివేచనాపరుడు. తన దాసుల మేలు కొరకు ఏది బాగుంటుందనేది అతనికి బాగా తెలుసు. కాబట్టి ఏ పరిస్థితిలో నున్నా సంతోషముతో ఉండాలి.
ﷺ :- ఈ గుర్తు ఉన్న చోట సల్లల్లాహు అలైహి వసల్లం చదవండి.
25.34980855.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ధర్మపరమైన నిషేధాలు (Prohibitions in Sharia) అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
అల్ హందులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅదహ్, వఅష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహ్, వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహ్. అమ్మా బఅద్!
మీరు ఈ పుస్తకాన్ని సంపూర్ణంగా చదవనిదే తీసి పక్కకు పెట్టకండి. ఇది మీ కొరకే, ఇతరులకు కాదు. నేను దీనిని ప్రేమ సిరా (Ink)తో వ్రాసాను. హృదయ ఏకాగ్రత, స్వచ్ఛతతో లిఖించాను.
దానిని ప్రేమ పోస్ట్ మరియు ఆకాంక్ష రాయబారి ద్వారా పంపాను. నీ చక్షువులకు ముందు నీ హృదయం; నీ కళ్ళకు ముందు నీ మనస్సులో అది నాటుకుపోవాలని.
ప్రియ సోదరా… ప్రియ సోదరి…
ఇస్లాం ధర్మం యొక్క పునాది బలమైన విశ్వాసముపై ఉన్నది. విశ్వాస ఆవశ్యకతా నివేదనలో ఆదేశాలను పాటించడం మరియు నివారణల నుండి దూరంగా ఉండడం తప్పనిసరి. ఇస్లాం ధర్మం యొక్క విసరురౌతు ఈ రెండు తిరుగలిరాయిల మీదే తిరుగుతుంది. అల్లాహ్ ఆదేశం చదవండిః
“నేను దేని నుండి మిమ్మల్ని వారిస్తానో దాని జోలికిపోకుండా ఉండండి, దేని గురించి నేను మిమ్మల్ని ఆదేశిస్తానో సాధ్యమైనంత వరకు దానిని నెరవేర్చండి”. (బుఖారి, అల్ ఇఖ్తిదాఉ బిసునని రసూలిల్లాహ్, 7288. ముస్లిం, తౌఖీరిహీ వ తర్కి ఇక్సారి సుఆలిహీ… 1337).
అల్లాహ్ ఏ దాని ఆదేశం ఇచ్చి, అది తప్పనిసరిగా చేయాలని విధించాడో మరియు దానిని నెరవేర్చాలని ప్రోత్సహించాడో విశ్వాసుడు దానిని నెరవేరుస్తూ ప్రేమ, ఆశతో మరియు ఆయన సన్నిధానం పొందుటకు తన పరమ- పవిత్రుడైన ప్రభువును ఆరాధిస్తాడు. అలాగే వినయవినమ్రతతో, భయభక్తులతో మరియు ఆజ్ఞాపాలన భావంతో అల్లాహ్ వారించిన మరియు హెచ్చరించిన వాటికి దూరంగా ఉండుట కూడా అతనిపై విధిగా ఉంది.
ఈ విధంగా చూస్తే ఇస్లాం ధర్మం “చేయండి”, “చేయకండి” అనే రెండిటి మధ్యలో ఉంది. దేనిని ఎంపిక చేసుకోవాలనే స్వేచ్ఛ మనిషిలో ఉంది. దారి స్పష్టంగా తన ముందు ఉంది. సత్ఫలితమో, దుష్ఫలితమో ప్రళయదినాన దొరకనుంది. అల్లాహ్ ఇలా ఆదేశించాడుః
మేము అతనికి మార్గం చూపాము. ఇక అతను కృతజ్ఞుడు కావచ్చు లేదా కృతఘ్నుడూ కావచ్చు. (సూరె దహ్ర్ 76: 3).
అయితే మనము దాసులం. కనుక దాసుడు తన యజమాని ఆధీనంలో ఉంటాడు. యజమాని ఆదేశిస్తాడు, వారిస్తాడు. దాసుడు సంతోషంగా శిరసావహిస్తాడు మరియు శ్రద్ధభక్తులతో విధేయత చూపుతాడు. మనం ఏకైక అల్లాహ్ కు దాసులమయి ఉండడంలో ఉన్న కీర్తి మనకు చాలు.
ప్రియ పాఠకులారా, లేదా శ్రోతల్లారా! నేను నా కొరకు మరియు మీ కొరకు విశ్వాసానికి మరియు దైవఏకత్వానికి సంబంధించిన కొన్ని వారింపులను సమకూర్చాను. వాటి ప్రస్తావన దివ్య ఖుర్ఆనులో లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల్లో ఉంది. మన విశ్వాసం అన్ని రకాల లోటుపాట్లకు, కొరత తగ్గింపులకు దూరంగా ఉండాలని మరియు అజ్ఞానంగా వాటిలో చిక్కుకోకుండా, వాటిని తెలుసుకొనుటకు మరియు వాటిలో చిక్కుకుపోయిన ముస్లింలను హెచ్చరించి, హెచ్చరిక బాధ్యత పూర్తి చేయుటకు లేదా అల్లాహ్ కాపాడేవారిని దాని కీడు నుండి దూరముంచుటకు (ఇవి నేను సమకూర్చాను).
ఆయన మంచి నామముల, ఉత్తమ సద్గుణాల ఆధారంతో, ఆయన కారుణ్యాన్ని ఆశిస్తూ ఈ పనిలో శుభం కలుగజేయాలని, ఏలాంటి కొరతా, దోషం లేకుండా చేయాలని, కేవలం ఆయన సంతృప్తి కొరకు, ఆయన దర్శన భాగ్యం కలిగే కొరకు చేయాలని అల్లాహ్ ను వేడుకుంటున్నాను. మరియు దీనిని సమకూర్చిన, సరిచేసిన, ప్రచురించిన మరియు పంపిణీ చేసిన వారందరికీ అల్లాహ్ సత్ఫలితం ప్రసాదించుగాక! ఆమీన్. వల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తాము, ఆయనపై మాత్రమే నమ్మకం ఉంచుతాము మరియు ఆయన సహాయం మాత్రమే కోరుతాము.
1- దేని కొరకు నీవు పుట్టించబడ్డావో దాని నుండి నిర్లక్ష్యంగా ఉండకు:
అల్లాహ్ ఆదేశం: ]నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నన్ను ఆరాధించుటకే పుట్టించాను. (జారియాత్ 52: 56).
అంటే ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ నే పూజించాలి. ఆయన ఏ ఆదేశమిచ్చినా పాలించాలి. దేనిని నిషేధించినా దానికి దూరంగా ఉండాలి.
2- ఆరాధనలో ఏ ఒక్క భాగం కూడా అల్లాహ్ యేతరుల కొరకు చేయకు: ఆయన ఆరాధనలో ఆయనతో పాటు మరెవ్వరినీ భాగస్వామి చేయకు.
మౌలికంగా ‘ఇబాదత్’ (ఆరాధన) అంటే తనకు తాను అల్లాహ్ యదుట అధమునిగా, ధీనుడిగా భావించి, ఆయన ముందు అణుకువతోట. అల్లాహ్ యేతరుల ఆరాధన హృదయము, నాలుక మరియు అవయవాలతో జరుగుతుంది. అల్లాహ్ ఇలా ఆదేశించాడుః
మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి, ఆయనకు ఎవ్వరినీ భాగస్వామిగా చేయకండి. (సూరె నిసా 4: 36).
3- అల్లాహ్ ను ఏ గౌరవభావంతో ప్రేమించాలో అదే విధంగా లేదా అంతకు మించి మరెవరినీ ప్రేమించకు:
ప్రేమ అనేది అల్లాహ్ తప్ప మరెవరితో ఉండకూడదు. ఎవరితోనైనా ఉంటే అది అల్లాహ్ కొరకే ఉండాలి. మరియు అల్లాహ్ ప్రేమించువాటినే ప్రేమించాలి. ప్రపంచంలో ఉన్న ప్రేమ అల్లాహ్ పట్ల మరియు అల్లాహ్ కొరకు ఉంటే అది అల్లాహ్ ప్రేమలో ఓ భాగమే([1]).
[وَمِنَ النَّاسِ مَنْ يَتَّخِذُ مِنْ دُونِ الله أَنْدَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ الله وَالَّذِينَ آَمَنُوا أَشَدُّ حُبًّا لله] {البقرة:165}
కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు ప్రత్యర్థులుగా నిలబెట్టి, అల్లాహ్ పట్ల కలిగి వుండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు. కాని విశ్వాసులు అన్నిటికంటే అధికంగా అల్లాహ్ నే ప్రేమిస్తారు. (సూరె బఖర 2: 165).
4- అల్లాహ్ తప్ప మరెవ్వరితో భయపడకు:
అల్లాహ్ ఆరాధన సంబంధమైన భయంలో, లేదా మృత్యువునిచ్చుట, ఏదైనా పాపం పై పట్టి శిక్షించుట లాంటివి కేవలం అల్లాహ్ శక్తిలోనే ఉన్న వాటి గురించి అల్లాహ్ తప్ప ఇతరులతో భయపడకూడదు.
అందుకని వారికి భయపడకండి, నాకు భయపడండి. ఇంకా నేను మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేస్తాను. మీరు నా ఆజ్ఞాపాలన ద్వారా సాఫల్యం పొందే అవకాశం ఉంది. (సూరె బఖర 2: 150).
5- అల్లాహ్ తప్ప మరెవ్వరితో దుఆ చెయ్యకు (అర్థించకు)([2]):
చనిపోయినవారితో, దైవ దూతలతో, ప్రవక్తలతో, జిన్నాతులతో మరియు దూరంలో ఉన్నవారితో దుఆ చేయకు. వారిని అర్థించకు.
అల్లాహ్ ను కాదని, ప్రళయదినం వరకు అతనికి సమాధాన మైనా ఇవ్వలేని వారిని, తమను వేడుకుంటున్నారనే విషయం కూడా ఎరుగనివారిని వేడుకునేవాడికంటే పరమ భ్రష్టుడైన వాడు ఎవడు ఉంటాడు. (అంతేకాదు) మానవులందరినీ సమావేశపరచినప్పుడు, వారు తమను వేడుకున్న వారికి విరోధులైపోతారు, వారి ఆరాధన (వేడుకోలు)ను తిరస్కరిస్తారు. (సూరె అహ్ ఖాఫ్ 46: 5,6).
6- అల్లాహ్ ను వదలి మరెవ్వరితో మొరపెట్టుకోకు.
అంటే నీవు కష్టంలో ఉన్నా, ఆపదలో ఉన్నా లేదా సుఖసంతోషాల్లో ఉన్నా అల్లాహ్ శక్తిలో మాత్రమే ఉన్నవాటి విషయంలో నీవు ఇతరులతో మొరపెట్టుకోకు. అవి ఉపాధి, సంతానాలకైనా, స్వస్థత లేదా పాపాల మన్నింపుకైనా, వర్షం కురువాలని మరియు ప్రజలకు సన్మార్గం లభించాలని అయినా, బాధలు తోలగించాలని మరియు శత్రువులపై విజయం పొందాలని అయినా (అల్లాహ్ తప్ప ఇతరులతో మొరపెట్టుకోవడం షిర్క్ అవుతుంది.).
అయితే సజీవంగా మరియు దగ్గర ఉన్న వ్యక్తితో అతని శక్తిలో ఉన్నదేదైనా అడగడంలో అభ్యంతరం ఏమి లేదు. కాని మనసు నమ్మకం అన్నది అతని మీదే ఉండకూడదు. అల్లాహ్ పై ఉండాలి.
అల్లాహ్ ను వదలి నీకు నష్టాన్నిగానీ లాభాన్నిగానీ కలిగించ లేనివాడిని వేడుకోకు (మొరపెట్టుకోకు). ఒకవేళ అలాచేస్తే నీవూ దుర్మార్గుడవై పోతావు. (సూరె యూనుస్ 10: 106).
7- అల్లాహ్ యేతరుల శరణు కోరకు.
నీవు ఏదైనా ప్రాంతము లో మజిలీ చేసినప్పుడు అక్కడ నీలో భయం జనించినప్పుడు అల్లాహ్ తో మాత్రమే శరణు వేడుకో. అల్లాహ్ నే గట్టిగా పట్టుకో, ఆయన శరణే వేడుకో, మరియు అక్కడ ఈ దుఆ చదువుః “అఊజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ షర్రి మాఖలఖ వ జరఅ వ బరఅ”.
(أَعُوذُ بِكَلِمَاتِ الله التَّامَّاتِ مِنْ شَرِّ مَا خَلَقَ وَذَرَأَ وَبَرَأَ)
అనువాదం: నేను అల్లాహ్ యొక్క సంపూర్ణ వచనాలతో, అల్లాహ్ శరణలో వచ్చుచున్నాను అల్లాహ్ పుట్టించిన, సృజించిన వాటిలోని కీడు నుండి.
శత్రువు మరియు క్రూర జంతువులతో ప్రకృతి పరమైన భయం వల్ల విశ్వాసంలో ఏ లోపం ఏర్పడదు.
మానవులలో కొందరు జిన్నాతులలోని కొందరిని శరణు వేడుతుండేవారు. ఈ విధంగా వారు జిన్నాతుల గర్వాన్ని మరింత అధికం చేశారు. (సూరె జిన్న్ 72: 6).
8- కాబా తప్ప మరేదాని ప్రదక్షిణం (తవాఫ్) చేయకు.
మక్క ముకర్రమ, మస్జిదె హరాంలో ఉన్న కాబా ప్రదక్షిణం ఆల్లాహ్ యొక్క ఆరాధన మరియు ఆయన సన్నిధానంలో చేర్పించే ఉత్తమ కార్యం. దానిని వదలి లేదా దానితో పాటు ఏదైనా సమాధి, రాయి, మరేదాని ప్రదక్షిణం పుణ్యోద్దేశంతో, శిక్షకు భయపడుతూ చేయకు([3]).
ఈ గృహాన్ని (కాబా) మేము మానవులందరికీ కేంద్రంగాను, శాంతి నిలయంగానూ చేశాము. ఇబ్రాహీము నిలబడిన ప్రదేశాన్ని నమాజు స్థలంగా చేసుకోండి. ఇంకా ఈ నా గృహాన్ని, దానికి ప్రదక్షిణం చేసేవారి కొరకు, దానిలో ఏతెకాఫ్ పాటించేవారి కొరకు, రుకూ, సజ్దాలు చేసేవారి కొరకు పరిశుద్ధంగా ఉంచవలసిందని ఇబ్రాహీమును, ఇస్మాఈలును నిర్దేశించాము. (బఖర 2: 125).
9- దేని విషయంలో ధార్మిక ఆధారం ఉందో దానితో తప్ప రాయి రప్పలు, చెట్లు చేమలు, సమాధులు మజారులు మరేదానితో శుభాలు కోరవద్దు([4]).
అబూ వాఖిద్ లైసి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట హునైన్ యుద్ధానికి బయలుదేరాము. అప్పుడు మేము కొత్తగా ఇస్లాంలో చేరియుంటిమి. దారిలో ముష్రికులది ఒక రేగు చెట్టు ఉండింది. వారు శుభం కలుగుతుందన్న ఉద్దేశ్యంతో దాని క్రింద కూర్చుండేవారు, తమ ఆయుధాలు దానికి తగిలించేవారు. దానిని ‘జాతు అన్వాత్’ అనబడేది. మేము ఆ చెట్టు నుండి దాటుతూ, ‘ప్రవక్తా! వారికి ఉన్నటువంటి జాతు అన్వాత్ మాకు కూడా ఒక్కటి నిర్ణయించండి అని అన్నాము. ప్రవక్త చెప్పారుః “అల్లాహు అక్బర్! ఇవే పద్ధతులు. నా ప్రాణం ఎవ్వని చేతులో ఉందో ఆయన సాక్షి! బనీ ఇస్రాఈల్ వారు ప్రవక్త మూసా అలైహిస్సలాంతో అన్నటువంటి మాటే మీరన్నారుః ]మూసా! వాళ్ళ దేవుళ్ళవంటి ఒక దేవుణ్ణి మాకు కూడా చేసి పెట్టు. మూసా ఇలా అన్నాడుః “మీరు చాలా అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నారు. మీకు పూర్వికులు అవలంభించిన పద్ధతులు మీరూ అవలంభిస్తారు”. (అల్ మొఅజముల్ కబీర్ లిత్తబ్రానీ, సహీహ్ సునన్ తిర్మిజి 1771, ముస్నద్ అహ్మద్ 2/285).
10- అల్లాహ్ వద్ద ప్రయోజనం లభించాలన్న ఉద్దేశ్యంతో ఎట్టిపరిస్థితిలో అల్లాహ్ తప్ప మరెవ్వరితో సిఫారసు కోరకు.
నిశ్చయంగా సిఫారసు యొక్క సంపూర్ణ అధికారం అల్లాహ్ వద్దనే ఉంది. అందుకు ఎవ్వరితో సిఫారసు కోరకు. అల్లాహ్ కు అతిసమీపంలో ఉన్న దూత అయినా, ఏ ప్రవక్త అయినా మరియు ఏ పుణ్యపురుషుడైనా సరే.
ఈ ప్రజలు అల్లాహ్ ను కాదని తమకు నష్టాన్నిగానీ లాభాన్ని గానీ కలిగించలేనివారిని పూజిస్తున్నారు. పైగా ఇలా అంటున్నారుః వారు అల్లాహ్ వద్ద మా కొరకు సిఫారసు చేస్తారు. ప్రవక్తా! వారితో ఇలా అనుః ఆకాశాలలోగానీ, భూమిలోగానీ అల్లాహ్ ఎరుగని విషయాన్ని గురించి ఆయనకు మీరు తెలుపుతున్నారా? ఆయన పరిశుద్ధుడు. ఈ ప్రజలు చేసే షిర్కుకు ఆతీతుడూ, ఉన్నతుడూ. (సూరె యూనుస్ 10: 18).
11- అల్లాహ్ తప్ప మరెవ్వరిపై భారం మోపకు, నమ్మకం ఉంచకు. నీ వ్యవహారాన్ని ఆయన తప్ప మరెవ్వరికీ అప్పగించకు.
అల్లాహ్ ఆదేశాలు చదవండిః
[أَلَيْسَ اللهُ بِكَافٍ عَبْدَهُ] {الزُّمر:36}
అల్లాహ్ తన దాసునికి సరిపోడా?. (సూరె జుమర్ 39: 36).
మీరు నిజంగానే విశ్వాసులైతే అల్లాహ్ పై నమ్మకం ఉంచండి([5]). (సూరె మాఇద 5: 23)..
12- ఈ సృష్టిని నడపడంలో, కష్టాలు తొలగించడంలో, కోరింది ఇప్పించడంలో ప్రవక్తలు మరియు అల్లాహ్ సన్నిహితు(వలీ)లకు ఏ కొంచమైనా అధికారం ఉందని అనుకోకు/నమ్మకు.
సృష్టించే మరియు సృష్టిని నడిపించే అధికారమంతయూ ఆది నుండి అంతం వరకు అల్లాహ్ చేతులోనే ఉంది. ఈ సృష్టిలో అల్లాహ్ కోరింది, నిర్ణయించింది, తలచింది మరియు ఆయన సులభతరం చేసింది మాత్రమే సంభవిస్తుంది. (ఇతరులకు అందులో ఏ అణువంత అధికారమే కాదు, భాగస్వామ్యమే లేదు).
ప్రవక్తా! వారిని ఇలా అడుగుః భూ సముద్రాల చీకట్లలోని ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడేది ఎవరు? మీరు (ఆపద సమయంలో) కడుదీనంగా విలపిస్తూ, అతిగోప్యంగా వేడుకునేది ఎవరిని? ఈ ఉపద్రవం నుండి ఆయన గనక మమ్మల్ని రక్షిస్తే, మేము తప్పకుండా కృతజ్ఞులం అవుతాము అని మీరు అనేది ఎవరితో? ఇలా అనుః అల్లాహ్ మీకు దాని నుండీ మరియు ప్రతి బాధ నుండి విముక్తి కలిగిస్తాడు. తరువాత మీరు ఇతరులను ఆయనకు భాగస్వాములుగా నిలబెడతారు. (అన్ఆమ్ 6: 63,64).
13- అల్లాహ్ తప్ప వేరెవరికైనా అగోచర జ్ఞానం గలదని నమ్మకు.
రహస్య, బహిరంగ విషయాలన్నిటినీ ఎరిగేవాడు అల్లాహ్ ఒక్కడే. భూమ్యాకాశాల్లో ఏ చిన్న వస్తువు అతనికి మరుగుగా లేదు.
వారితో ఇలా అనుః ఆకాశాలలోనూ, భూమిలోనూ అల్లాహ్ తప్ప అగోచర జ్ఞానం కలవాడు మరెవ్వడూ లేడు. (మీరు ఆరాధిస్తున్న)వారికి తాము ఎప్పుడు లేపబడతారో కూడా తెలియదు. (సూరె నమ్ల్ 27: 65).
14- ఏదైనా లాభం పొందుటకు, మరేదైనా నష్టాన్ని తొలగించుటకు నీవు నీపై , నీ సంతానానికి, నీ వాహానానికి. నీ ఇంటి వగైరాలకు కడము, దారము మరేదైనా వస్తువు తొడిగించకు, తగిలించకు ([6]).
అబూ బషీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, అతను ఏదో ఒక ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉండగా ప్రవక్త ఒక వ్యక్తిని ఇలా చెప్పి పంపారుః “ఏ ఒంటె మెడలో కూడా నరంతో చేసిన పట్టా ఉండ కూడదు. లేదా ఏదైనా పట్టా ఉంటే దానిని తీసెయ్యాలి”. (బుఖారి/ బాబు మా ఖీల ఫిల్ జరసి…/ 3005, ముస్లిం/ బాబు కరాహతు ఖిలాదతిల్ విత్రి ఫీ రఖబతిల్ బఈర్/ 3115).
15- ఆపద దూరమగుటకు, లేదా అది రాకుండా తాయత్తులు, పూసలు మరియు గవ్వలు వేసుకోకు.
عن عَبْدِ الله بْنِ عُكَيْمٍ أَبِي مَعْبَدِ الْجُهَنِيِّ > قَال: قَالَ النَّبِيُّ ^: (مَنْ تَعَلَّقَ شَيْئًا وُكِلَ إِلَيْهِ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబ్దుల్లాహ్ బిన్ ఉకైమ్ అబూ మఅబద్ అల్ జుహనీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఏదైనా వస్తువు తగిలించుకున్న వారు దాని వైపే అప్పగించబడుతారు”. (అంటే వారికి అల్లాహ్ రక్షణ, సహాయం ఉండదు). (తిర్మిజి/ మా జాఅ ఫీ కరాహియతిత్ తాలీఖ్/ 2072, నిసాయి/ బాబుల్ హుక్ మి ఫిస్సహర/ 4011). మరో ఉల్లేఖనంలో ఉందిః
“మంత్రం, తావీజులు, మరియు ‘తివల’ ఇవన్నియు షిర్క్”. ‘తివల’ అనగా భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుటకు చేతబడి చేయడం. (అబూ దావూద్/ బాబు ఫీ తాలీఖిత్ తమాయిమ్/ 3883, ఇబ్ను మాజ/ బాబు తాలీఖిత్ తమాయిమ్/ 3530, అహ్మద్).
16- షిర్క్ సాధనాలను అంతమొందించుటకు సమాధి ఉన్న మస్జిదులో నమాజు చేయకు ([7])
మసీదులు అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కనుక వాటిలో అల్లాహ్ తో పాటు ఇతరులెవ్వరినీ ప్రార్థించకండి. (జిన్ 72: 18).
17- బర్కత్ (శుభం) కలిగే ఉద్దేశంతో సమాధుల మీద, దాని చుట్టు ప్రక్కలో ఎక్కడా నమాజు చేయకు.
అక్కడ దుఆ చేయుట ఘనత గల విషయమని భావించకు. అక్కడ నమాజు చేయుట సంపూర్ణత్వానికి ఓ నిదర్శనం అని భావించకు. ఇవన్నియూ షిర్కులో లేదా దాని దరిదాపులకు చేరుకుండా ఉండటానికి పాటించవలసిన ముఖ్య పనులు([8]).
“మీకు పూర్వం గడచిపోయినవారు తమ ప్రవక్తల మరియు పుణ్యాత్ముల సమాధులను మస్జిదులుగా చేసుకునేవారు, వినండి! మీరు అలా సమాధులను మస్జిదులుగా చేయబోకండి. నేను మిమ్మల్ని దీని నుండి నిషేధిస్తున్నాను. (ముస్లిం 532).
18- నమాజు వదలకు. మానవుల మరియు ప్రభువు మధ్య అది పటిష్ఠ సంబంధం.
అది ధర్మానికి మూల స్థూపం. నమాజు వదలిన వానికి ఇస్లాంలో ఏ వాటా లేనట్లే.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నట్లు జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నిశ్చయంగా ఒక మనిషి మరియు షిర్క్ (బహుదైవారాధన), కుఫ్ర్ (సత్యతిరస్కారా)లకు మధ్య ఉన్న వ్యత్యాసం నమాజు పాటించకపోవడం”. (ముస్లిం/ బయాను ఇత్ లాఖి ఇస్మిల్ కుఫ్రి అలా మన్ తరకస్సలా/ 82).
19- ఆరాధన ఉద్దేశంతో మూడు మసీదులు తప్ప మరెక్కడికీ ప్రయాణం చేయకు.
1. మక్కాలో ఉన్న మస్జిదుల్ హరాం. 2. మదీనలో ఉన్న మస్జిదె నబవి([9]). 3. ఫాలస్తీనలోని ఖుద్స్ లో ఉన్న మస్జిదె అఖ్సా. ఇవి గాకుండా వేరే మస్జిదుల వైపునకు వాటిని ఉద్దేశించి ప్రయాణం చేయరాదు.
“మస్జిదె హరాం, మస్జిదె నబవి మరియు మస్జిదె అఖ్సా. ఈ మూడు మస్జిదులు తప్ప మరే చోట (పుణ్యాన్ని ఆశించి) ప్రయాణించవద్దు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః (బుఖారి/ బాబు ఫజ్లిస్ సలాతి ఫీ మస్జిది మక్కా వ మదీన/ 1189, ముస్లిం/ బాబు లా తుషద్దుర్ రిహాలు ఇల్లా…/ 1397).
20- అల్లాహ్ ను వదలి సమాధిలో ఉన్నవారితో దుఆ చేసే, లేదా వారిని అల్లాహ్ ముందు మధ్యవర్తిగా నిలబెట్టే ఉద్దేశ్యంతో సమాధులను దర్శించకు.
అక్కడ వారి స్థితిగతులను, వారి పర్యవసానాన్ని గ్రహించి, గుణపాఠం నేర్చుకునే ఉద్దేశ్యం ఉండాలి. (ప్రవక్త నేర్పిన ప్రకారం) వారికి సలాం చేయుటకు, వారి కొరకు అల్లాహ్ తో దుఆ చేయుటకు వెళ్ళుట మంచిదే.
ఆ అల్లాహ్ యే మీ ప్రభువు. సామ్రాజ్యాధికారం ఆయనదే. ఆయనను కాదని మీరు పిలిచే ఇతరులు కనీసం ఒక గడ్డిపోచకు కూడా యజమానులు కారు. వారిని వేడుకుంటే, వారు మీ అర్థింపులను వినలేరు. ఒకవేళ విన్నా వాటికి ఏ సమాధానమూ మీకు ఇవ్వలేరు. మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు ప్రళయం నాడు తిరస్కరిస్తారు. సత్యాన్ని గురించిన ఈ సరైన సమాచారాన్ని తెలిసిన వాడు తప్ప మరొకడెవ్వడూ మీకు అందజేయలేడు. (ఫాతిర్ 35: 13,14).
21- సమాధుల మీద గుమ్మటం కట్టబోకు.
సమాధి భూమి లేవల్ కు మించి మరీ ఎక్కువ ఎత్తుగా ఉండకూడదు. దానిని సున్నపు రౌతు, ఇటుక, బండలతో కట్టకూడదు. దానిపై వ్రాయకూడదు. చిత్రాలు, బొమ్మలు దించకూడదు. దాని మీద దీపాలు పెట్టకూడదు. ఒక రకంగా ఇవన్నీ వృధా ఖర్చులే కాకుండా, మరో రకంగా అంతకు మించి షిర్క్ కు సాధనాలవుతాయి. సమాధుల పట్ల గౌరవభావం ఎక్కువయిపోతుంది. చివరికి విగ్రహాలకు పాటించబడే గౌరవం లాంటి పరిస్థితి వస్తుంది.
అబుల్ హయ్యాజ్ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారుః ఒకాసారి అలీ రజియ-ల్లాహు అన్హు నన్ను పిలిచి ఇలా చెప్పారుః ‘ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఏ కార్యనిర్వహణకు పంపారో, దానిగ్గానూ నేను నిన్ను పంపుతున్నాను. “నీవు ఎక్కడ ఏ బొమ్మను చూసినా దానిని చెరిపివెయ్యి. ఎక్కడ ఏ ఎత్తయిన గోరిని చూసినా దానిని నేలమట్టం చెయ్యి”. (ముస్లిం 969).
22- మనిషి, జంతువు, పక్షి, చేప లాంటి ప్రాణం ఉన్న వాటి చిత్రాలు చిత్రించకు([10]).
గుర్తింపు కార్డు మరియు పాస్ పోర్టు లాంటి అత్యవసర విషయాలకు తప్ప. (ఇది యోగ్యమని భావించకు).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నట్లు ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ప్రతి చిత్రకారుడు నరకంలో ఉంటాడు. తాను చిత్రించిన ప్రతి చిత్రపటంలో ప్రాణం పోయబడుతుంది. అది అతనిని నరకంలో శిక్షిస్తూ ఉంటుంది”. (ముస్లిం 2110).
23- అల్లాహ్ యేతరుల కొరకు జంతు బలి చేయకు.
అది వారి సన్నిధానం పొందుటకుగాని, లేదా వారితో భయం చెంది, లేదా వారేమైనా ఇస్తారని ఆశించి. ఉదాహరణకుః జిన్నాతుల నుండి ఏ హానీ కలగకూడదని లేదా మృతుల నుండి ఏదైనా లాభం కలగాలని వారి కొరకు బలి ఇచ్చుట([11]).
ఇలా అనుః నా నమాజ్, నా బలి (ఖుర్బానీ), నా జీవనం, నా మరణం, సమస్తమూ సకలలోకాలకూ ప్రభువైన అల్లాహ్ కొరకే, ఆయనకు ఏ భాగస్వామీ లేడు. ఈ ఆజ్ఞయే నాకు ఇవ్వబడింది. (అన్ఆమ్ 6: 163,164).
24- ఎక్కడ అల్లాహ్ యేతరుల కొరకు జంతుబలి జరుగుతుందో అక్కడ అల్లాహ్ కొరకు జంతుబలి చేయకు.
సాబిత్ బిన్ జహ్హాక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒక వ్యక్తి ‘బువాన’ అనే చోట ఒంటె బలి ఇవ్వాలని మ్రొక్కుకున్నాడు. అతను ప్రవక్త వద్దకు వచ్చి “నేను ‘బువాన’ అనే చోట ఒంటె బలి ఇవ్వాలని మ్రొక్కుకున్నాను. (నా మ్రొక్కును పూర్తి చేయాల వద్దా అని ప్రశ్నించాడు). “అజ్ఞాన కాలం నాటి ఏదైనా విగ్రహ పూజ అక్కడ జరుగుతుందా?” అని ప్రవక్త అడిగారు. ‘లేదు’ అని ప్రజలన్నారు. “అయితే వారి పండుగ, ఉత్సవాలు ఏమైనా అక్కడ జరుగుతాయా?” అని ప్రవక్త అడిగారు. ‘లేదు’ అని వారన్నారు. అప్పుడు ప్రవక్త చెప్పారుః “నీ మ్రొక్కును పూర్తి చేయి. అల్లాహ్ కు అవిధేయతలో ఉన్న ఏ మ్రొక్కూ పూర్తి చేయవద్దు. అలాగే మనిషి అధికారంలో లేని మ్రొక్కు కూడా పూర్తి చేయకూడదు”. (అబూ దావూద్/ బాబు మా యుఅమరు బిహీ మినల్ వఫాఇ… 3313).
25- ఆచరణ, ధన సంబంధమైన మరియు ఇతరత్రా మ్రొక్కుబడులన్నీ కేవలం అల్లాహ్ కొరకే నెరవేర్చాలి([12]).
సమాధుల కొరకు, బాబాలకు, సాయబులకు లేదా మజారుల వద్ద మ్రొక్కుబడులు నెరవేర్చరాదు.
“అల్లాహ్ విధేయత పాటించాలని మ్రొక్కుకున్న వ్యక్తి తన మ్రొక్కును నెరవేర్చాలి. మరెవరయితే అల్లాహ్ కు అవిధేయత పాటించాలని మ్రొక్కుకున్నాడో అతను అవిధేయత పాటించ కూడదు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారు. (బుఖారి/ బాబున్నజ్రి ఫిత్తాఅ/ 6696).
26- అల్లాహ్ ను, ఆయన సృష్టిరాసులో ఏ ఒకరితోను సమానము చేయకు.
ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ‘అల్లాహ్ మరియు మీరు తలచినట్లు’ అని అన్నాడు. ప్రవక్త చెప్పారుః “ఏమీ! నీవు నన్ను మరియు అల్లాహ్ ను సమానంగా చేశావా?. కేవలం ఏకైక అల్లాహ్ తలచినట్లు అని పలుకు”. (అహ్మద్ 1/214. సహీహ 1093).
దీని ఉదాహరణలుః నాకు అల్లాహ్ మరియు నీవు తప్ప ఇంకెవరు. నా కొరకు ఆకాశంలో అల్లాహ్ ఉంటే భూమి మీద నీవున్నావు. అల్లాహ్ మరియు నీపై నమ్మకం కలిగి ఉన్నాను.
27- అల్లాహ్ ఉనికిని గురించి ఆలోచించకు.
నిశ్చయంగా అల్లాహ్ కు సరిసమానులెవ్వరూ లేరు. ఆయన గురించి ఏ బుద్ధి గ్రహించలేదు. ఇహలోకంలో ఆయన్ను ఏ కన్ను చూడలేదు. ప్రేరేపణలకు అంకితం కాకు. ప్రేరేపణల నుండి అల్లాహ్ శరణు వేడుకో. వాటిని మానుకో. నేను అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసించాను అని పలుకు.
عَنِ ابْنِ عُمَرَ > قَالَ : قَالَ رَسُولُ الله ^ : تَفَكَّرُوا فِي آلاءِ الله ، وَلا تَتَفَكَّرُوا فِي الله .
“అల్లాహ్ సృష్టిలో ఆలోచించండి. కాని స్వయం అల్లాహ్ ఉనికి లో ఆలోచించకండి” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (తబ్రాని అల్ ఔసత్. సహీహ లిల్ అల్బానీ 1788).
28- అల్లాహ్ తన ఉనికితో మన వెంట ఉన్నాడని విశ్వసించకు.
అల్లాహ్ మన వెంట ఉన్నాడన్న దానికి అర్ధం ఏమిటంటే; ఆయన ఎల్లవేళల్లో మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన సహాయం మనకు అందుతూ ఉంటుంది. కాని ఆయన తన సృష్టిలో లీనము కాకుండా వేరుగా అర్ష్ (సింహాసనం) మీద తన గౌరవానికి తగినరీతిలో ఉన్నాడు. ఆయనకు పోలినది, సమతూలినది ఏది లేదు. ఆయన సర్వమూ తెలిసినవాడు. అల్లాహ్ ఆదేశం:
ఆయన తన దాసులపై సంపూర్ణమైన అధికారాలు కలిగి ఉన్నాడు. ఇంకా అత్యంత వివేకవంతుడు, అన్నీ తెలిసినవాడు. (అన్ఆమ్ 6: 18).
29- అల్లాహ్ తన కొరకు ఖుర్ఆనులో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ కొరకు సహీ హదీసుల్లో తెలిపిన గుణనామాలే తప్ప మరే గుణనామాలు అల్లాహ్ కు అంకితం చేయకు.
మనకు నచ్చిన పేర్లతో అల్లాహ్ ను పిలుచుకుందాము అన్న ప్రసక్తే లేదు. ఎందుకనగా మన బుద్ధిజ్ఞానాలకు కాదు విలువ ఇవ్వవలసినది, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తెలిపిన విషయాలకు విలువ ఇవ్వాలి.
ఇలా చెప్పండిః అల్లాహ్ అని అయినా పిలవండి, లేదా రహ్మాన్ అని అయినా సరే. ఏ పేరుతో అయినా పిలవండి. ఆయనకు గల పేర్లు అన్నీ చక్కనివే. (బనీ ఇస్రాఈల్ 17: 110).
30- అల్లాహ్ గుణనామాల్లో తప్పుడు మార్గాన్ని అవలంభించకు.
వాటిని నిరాకరించి, లేదా వాటి వాస్తవ భావంలో మార్పు చేసి, లేదా వాటిలో కొన్ని ఆయన సృష్టిరాసుల్లో ఎవరికైనా అంకితం చేసి, లేదా అవి ఏదైనా సృష్టిరాసుల గుణనామాల మాదిరిగా ఉన్నాయని, లేదా ఆయనకు లేని గుణనామములు ఆయనకు అంకితం చేసి. ఏ విధంగానైనా సరే తప్పుడు మార్గం అవలంభించవద్దు.
అల్లాహ్ మంచి పేర్లకు అర్హుడు. ఆయనను మంచి పేర్లతోనే వేడుకోండి. ఆయనను మంచి పేర్లతో పిలిచే విషయంలో సత్యం నుండి వైదొలగేవారిని వదలి పెట్టండి. వారు తాము చేస్తున్న దానికి ప్రతిఫలం పొంది తీరుతారు. (ఆరాఫ్ 7: 180).
31- గొప్పవాడైన అల్లాహ్ ఉనికిని ప్రస్తావించి ఏదీ అడగకు. అల్లాహ్ తో అడిగినప్పుడు ఆయన ఉత్తమ నామాల మరియు గుణవిశేషాల ఆధారంతో అడగాలి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నట్లు అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అల్లాహ్ ఉనికిని ప్రస్తావించి అడిగినవాడు శపింపబడ్డాడు. అలాగే అల్లాహ్ అస్తిత్వ ఆధారంతో అడగబడినవాడు కూడా శపింపబడ్డాడు, ఒక వేళ అతను అడిగిన వ్యక్తిని నెట్టేసి అతనికి ఏమీ ఇవ్వకుంటే. అయితే అనవసరమైన, వృధా విషయం అడిగినవాడికి ఇవ్వకపోవడం వల్ల ఈ శాపం పడదు”. (అల్ ముఅజముల్ కబీర్ లిత్తబ్రానీ. సహీహా 2290).
32- నిశిద్ధమైన మరియు అధర్మ మాధ్యస్థంతో, అల్లాహ్ తో దుఆ చేయకు.
ఉదాః అల్లాహ్! ఫలాన వ్యక్తి ఉన్నత స్థానం యొక్క మాధ్యస్థంతో నేను నిన్ను అడుగుతున్నాను. లేదా ఫలాన వ్యక్తి హక్కు మాధ్యస్థంతో. అయితే ఎవరైనా ప్రాణంతో ఉన్న విశ్వాసులైన, పుణ్యాత్ముల దుఆ యొక్క మాధ్యస్థం యోగ్యమే([13]).
విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి. ఆయన సాన్నిధ్యానికి చేరే మార్గాన్ని అన్వేషించండి. ఆయన మార్గంలో నిరంతర కృషి చెయ్యండి. బహుశా మీకు సాఫల్య భాగ్యం లభించవచ్చు. (5: 35).
33- నీ పాపాలు ఎంత ఉన్నా సరే అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకు.
“మీలో ప్రతి వ్యక్తి అల్లాహ్ పట్ల మంచి తలంపు ఉంచుతూ మరణించాలి” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ మరణానికి మూడు రోజుల ముందు చెప్పగా నేను విన్నాను అని జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్లిం 2877).
36- అల్లాహ్ ఆరాధన కేవలం ప్రేమతో, లేదా కేవలం ఆశతో, లేదా కేవలం భయంతో చేయకూడదు.
ఆశ, భయం పక్షికి ఉండే రెండు రెక్కల్లాంటివి. పక్షి ఒక రెక్కతో పైకి ఎగర లేదు కదా? అందుకే విశ్వాసులైన పుణ్యాత్ములు ఆశ, భయం ఈ రెండిటి ద్వారా అల్లాహ్ ను ఆరాధించేవారుః
ఈ ప్రజలు మొరపెట్టుకుంటున్న వారే స్వయంగా తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు, ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. వారు ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు. ఆయన శిక్షకు భయపడుతున్నారు. (బనీ ఇస్రాఈల్ 17: 57). ఇంకా సూర హిజ్ర్ 15: 49,50లో ఇలా ఆదేశించాడుః
నేను చాలా క్షమించేవాణ్ణి అనీ, కరుణించేవాణ్ణి అనీ, దీనితోపాటు, నా శిక్ష కూడా చాలా బాధాకరమైన శిక్షే అనీ నా దాసులకు చెప్పు.
37- సత్కార్యాలు చేయకుండానే అల్లాహ్ కారుణ్యం పట్ల ఆశ ఉంచకు.
మంచి కార్యాలు చేయడమే అల్లాహ్ పట్ల మంచి తలంపు ఉంచినట్లు నిదర్శనం. అలసట, అలక్ష్యం ద్వారా అల్లాహ్ కారుణ్యం లభించదు. సత్యవిశ్వాసం, సత్కార్యాల ద్వారానే లభిస్తుంది. వాస్తవానికి అల్లాహ్ కారుణ్యం పుణ్యాత్ములకు సమీపంలో ఉంది. అల్లాహ్ ఆదేశం:
నిశ్చయంగా విశ్వసించి, అల్లాహ్ మార్గంలో తమ ఇల్లూ వాకిలీ సహితం విడిచి జిహాద్ చేసేవారు అల్లాహ్ కారుణ్యం ఆశించటానికి అన్ని విధాలా అర్హులు. అల్లాహ్ వారి తప్పులను క్షమించి వారిని కరుణిస్తాడు. (బఖర 2: 218).
38- పరిహాసమాడకు; ఖుర్ఆన్, ప్రవక్త, ధర్మం మరియు ధర్మవిషయాలతో పరిహాసమాడకు, ఎగతాళి చేయకు, హీనపరచకు([14]). అది (వేరే దురుద్దేశం లేకుండా) కేవలం నవ్వు పుట్టించుటకైనా సరే.
ధర్మవిద్యతో లేదా ధార్మిక విద్యార్థులతో పరిహాసమాడుట([15]). మంచిని ఆదేశించి, చెడును నివారించే వారితో పరిహాసమాడుట. గడ్డం, మిస్వాక్ మరియు తదితర ధర్మవిషయాలతో పరిహాసమాడుట అల్లాహ్డతో కుఫ్ర్ చేసినట్లగును. సూర తౌబా (9:65,66)లో అల్లాహ్ ఆదేశం:
మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి? అని ఒకవేళ వారిని అడిగితే, మేము సరదాగా వేళాకోళంగా మాట్లాడుకుంటున్నాము అని తక్షణం బదులు చెబుతారు. వారితో ఇలా అనుః మీ వేళాకోళం, అల్లాహ్ తోనా ఆయన ఆయతులతోనా, ఆయన ప్రవక్తతోనా? ఇక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి పాల్పడ్డారు.
39- అల్లాహ్ ఆయతులతో వేళాకోళం చేస్తున్నవారితో నీవు కూర్చోకు.
వారిని ఆ పని నుండి నివారించే ఉద్దేశ్యం ఉంటే కూర్చోవచ్చు. అల్లాహ్ ఆదేశం ఇలా ఉందిః
అల్లాహ్ ఈ గ్రంథంలో మీకు ఇదివరకే ఈ ఉత్తరువు ఇచ్చి ఉన్నాడుః అల్లాహ్ ఆయతులకు వ్యతిరేకంగా తిరస్కారవచనాలు వాగటాన్ని, వాటిని పరిహసించటాన్ని మీరు విన్నట్లైయితే, అలా చేసేవారు (ఆ సంభాషణ వదలి) వేరే మాట ప్రారంభించనంత వరకు మీరు వారితో కలసి కూర్చోకండి. ఇప్పుడు మీరు గనక అలా చేస్తే మీరూ వారి లాంటి వారే. అల్లాహ్ కపటులనూ, అవిశ్వాసులనూ నరకంలో ఒకచోట పోగుచెయ్య- బోతున్నాడనే విషయం నిశ్చయమని తెలుసుకోండి. (నిసా 4: 140).
40- అల్లాహ్ అవతరించిన దానిని వదలి, వేరేవాటితో తీర్పు చేయకు([16]).
లేదా అందులోని తీర్పుల్లో అన్యాయం, నిరంకుశత్వం, నిర్దాక్షిణ్యం మరియు కఠినాలు ఉన్నాయని, లేదా సంపూర్ణంగా కాకుండా లోపం ఉందని, లేదా వేరే చట్టాలు, తీర్పులు దానికంటే మేలైనవి అని, లేదా దాని లాంటివే మరియు ప్రజలకు ఉత్తమం అయినవని, లేదా అవి ఈ కాలానికి చెల్లవని భావించకు. ఇలాంటి నమ్మకాలన్నియూ అల్లాహ్ తో కుఫ్ర్ (తిరస్కారం) మరియు ధర్మభ్రష్టతకు కారణం అవుతాయి. అల్లాహ్ ఆదేశం చదవండిః
ఎవరైతే అవిశ్వాసానికి ఒడిగట్టారో వారికి వినాశం తప్పదు. అల్లాహ్ వారి కర్మలను తోవ తప్పించాడు. ఎందుకంటే వారు అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నారు. కనుక అల్లాహ్ వారి కర్మలను వ్యర్థపరిచాడు. (ముహమ్మద్ 47: 8,9).
42- అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాల్లో ఏ ఒక్కదాని పట్ల నీ హృదయంలో కల్మషం ఉండ కూడదు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువు వద్ద నుండి తీసుకువచ్చిన దానికనుగుణంగా నీ వాంఛలు కానంత వరకు నీ విశ్వాసం పరిపూర్ణం కాదు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆజ్ఞలను శ్రద్ధగా విని అనుసరించేవానిగా ఉండు.
నీ ప్రభువు సాక్షిగా! వారు పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయనిర్ణేతగా స్వీకరించనంత వరకు, ఇంకా నీవు ఏ నిర్ణయం చేసినా దాని గురించి వారి మనస్సులలో కూడా ఏ మాత్రం సంకోచం లేకుండా దానిని యథాతథంగా శిరసా వహించనంత వరకు వారు నిజమైన విశ్వాసులు కాలేరు. (నిసా 4: 65).
43- అల్లాహ్ హలాల్ (ధర్మసమ్మతం) చేసిన దానిని నీవు హరాం (నిశిద్ధం) చేయకు. లేదా అల్లాహ్ హరాం చేసిన దానిని నీవు హలాల్ చేయకు.
ఇంకా ప్రసిద్ధ, ప్రాముఖ్యమైన ధర్మ విషయాలను తిరస్కరించకు. ఉదాహరణకుః మత్తు నిశిద్ధత, నమాజు విధితము, తదితరాలు.
మీరు ఇట్లే నోటికొచ్చినట్లు ‘ఇది ధర్మసమ్మతమైనది, అది అధర్మమైనది’ అని అబద్ధాలు పలకకండి. ఇందువల్ల మీరు అల్లాహ్ పై అసత్యాన్ని మోపినవాళ్ళవుతారు. అల్లాహ్ పై అసత్యారోపణలు చేసేవారు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు. (నహల్ 16: 116).
44- హలాల్ ను హరాం మరియు హరాం ను హలాల్ చేసే వ్యక్తి (ఏలాంటి వాడైనా సరే అతని)ని అనుసరించకు.
ఈ హక్కు కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది. అల్లాహ్ హలాల్ చేసినదే హలాల్. అల్లాహ్ హరాం చేసినదే హరాం. దేనిని ఆయన ధర్మంగా చేశాడో అదే ధర్మం.
అదీ బిన్ హాతిం రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాను. అప్పుడు నా మెడలో బంగారు శిలువ ఉండింది. నేను చేరుకునే సరికి ప్రవక్త ]వారు అల్లాహ్ ను కాదని తమ పండితులను, సాధువులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. (తౌబా 9: 31). అన్న ఆయతు పఠిస్తున్నారు. ‘ప్రవక్తా! యూదులు, క్రైస్తవులు తమ పండితుల, సన్యాసుల పూజా, ఆరాధనలు చేసేవారు కాదు కదా?’ అని నేనడిగాను. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అవును, కాని అల్లాహ్ హరాం చేసిన వాటిని పండితులు హలాల్ చేస్తే వారు దానిని హలాల్ గానే భావించేవారు. అలాగే అల్లాహ్ హలాల్ చేసిన వాటిని వారు హరాం చేస్తే వారు దానిని హరాంగానే భావించేవారు. ఇదే వారి ఆరాధన చేసినట్లు” అని విశదపరిచారు. (బైహఖీ ‘సునన్ కుబ్రా’లో, కితాబు ఆదాబిల్ ఖాజి, బాబు మా యఖ్ జీ బిహిల్ ఖాజీ…, 10/198).
45- ధార్మిక మరియు ప్రాపంచిక ఏ విషయంలోనైనా ఇస్లాం, ముస్లిముల క్షీణత్వాన్ని మరియు షిర్క్, షిర్క్ చేయువారి ఉన్నత స్థితిని చూసి సంతోషించవద్దు.
మీకు మేలు కలిగితే వారికి బాధ కలుగుతుంది. ఏదైనా ఆపద మీ మీదకు వచ్చిపడినప్పుడు వారు ముఖాన్ని త్రిప్పుకొని సంతోషంతో పొంగిపోతూ మరలిపోతారు. ఇలా అంటూ పోతారుః మేము ముందే మా వ్యవహారాన్ని సరిచేసు కోవటం మంచిదయింది. (తౌబా 9: 50).
46- అవిశ్వాసులతో మరీ సన్నిహితంగా ఉండకు, వారిని అమితంగా ప్రేమించకు, వారి ధార్మిక విషయాల్లో డబ్బు ధనంతో, హోదా అంతుస్తులతో, సలహా మరియు శక్తి సామర్థ్యాలతో తోడు ఇవ్వకు.
అలా చేసితివా వారిలోనే కలసిపోతావు, ప్రళయదినాన వారితోనే లేపబడుతావు.
గ్రంథ జ్ఞానంలో కొంత భాగం ఇవ్వబడిన వారిని నీవు చూడలేదా? వారు భ్రష్టాచారాలను మరియు మిథ్యాదైవాలను నమ్ముతారు. ఇంకా వారు అవిశ్వాసులను గురించి, ‘విశ్వాసుల కంటే వీరే చాలా వరకు సరైన మార్గంలో ఉన్నారు’ అని అంటారు. ఇటువంటి వారినే అల్లాహ్ శపించింది. అల్లాహ్ శపించినవాడికి సహాయం చేసేవాడెవ్వడూ నీకు దొరకడు. (నిసా 4: 51,52).
50- అవిశ్వాసుల పండుగల్లో లేదా వారి ధార్మిక ఉత్సవాల్లో పాల్గొనకు. వారికి శుభకాంక్షలు తెలియజేయకు.
లేదా అందులో వారికి సహాయం చేయకు. ఇలా చేసితివా, ఇది నీ వైపున వారి (ధర్మమును)ని ఒప్పుకున్నట్లు అగును.
తన ప్రభువు ఆయతుల ద్వారా హితబోధ చేయబడినప్పుడు, వాటిపట్ల విముఖుడయ్యే వానికంటే పరమ దుర్మార్గుడెవడు?. అటువంటి అపరాధులకు మేము తప్పనిసరిగా ప్రతీకారం చేసితీరుతాము. (సజ్దా 32: 22).
52- చేతబడి వ్యవహారాల్లో ఏ రవ్వంత జోక్యం చేసుకోకు.
అదో భూతవైద్యం మరియు విశ్వాసానికి వ్యతిరేకమైన అవిశ్వాస మార్గం.
వారు సులైమాను రాజ్యకాలమున షైతానులు పఠించే దానిని (జాలవిద్యను) అనుసరించారు. సులైమాను అవిశ్వాసి కాలేదు. కాని షైతానులు అవిశ్వాసులయ్యారు. వారు జనులకు ‘జాల’ విద్యను నేర్పేవారు. వారు బాబిలోన్ నగరమందు హారూతు మారూతు అన్న దైవదూతలకు నొసంగబడిన దానిని అనుసరించిరి. ఆ ఇద్దరు దూతలు మేము పరీక్షకు ఉన్నాము కావున మీరు (ఈ జాలవిద్యను నేర్చుకొని) అవిశ్వాసులు కాకండి అని చెప్పనంత వరకు ఎవరికి నేర్పకుండిరి. ఆ పిదప వారు ఆ ఇద్దరి నుండి భార్యాభర్తలకు ఎడబాటు కలిగించునట్టి జాలవిద్య నేర్చుకొనుచుండిరి. వారు దాని వలన అల్లాహ్ సెలవు లేక (అల్లాహ్ ఆజ్ఞ లేనిది) ఎవరికిని నష్టము కలిగింపజాలరు. కాని వారు నేర్చుకున్నది వారికి నష్టం కలిగించేదే కాని లాభం కలిగించేది ఎంతమాత్రం కాదు. ఈ విద్యను కొనేవారికి పరలోక సౌఖ్యాలలో ఏ మాత్రం భాగం లేదనే విషయం వారికి బాగా తెలుసు. ఎంత తుచ్ఛమైన సొమ్ముకు బదులుగా వారు తమ ఆత్మలను అమ్ముకున్నారో వారికి తెలిస్తే ఎంత బాగుండేది. (బఖర 2: 102).
53- పంచాంగకర్త, గారడీవాడు, మాంత్రికుడు, అగోచర విషయాల గురించి చెప్పువాడు, భూశకున వైదాంతి, గ్రహాల ఆధారంగా, హస్తం చూసి మరియు గవ్వల ద్వారా భవిష్యం చెప్పేవాళ్ళ (జాతకుడు) వద్దకు వెళ్ళకు.
ప్రవక్త ఇలా సెలవిచ్చారని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం భార్యల్లో ఒకరు ఉల్లేఖించారుః “ఎవరు పంచాంగకర్త వద్దకు వచ్చి అతన్ని ఏదైనా విషయం అడుగుతాడో అతని నలబై రోజుల నమాజు అంగీకరింపబడదు”. (ముస్లిం/తహ్రీముల్ కహాన… 2230).
54- పైన పేర్కొన్నవారిలో ఏ ఒక్కడిని సత్యవంతునిగా భావించకు.
వారి వద్దకు వచ్చుట మరియు వారిని సత్యముగా భావించుట ప్రవక్తపై అవతరించిన సత్య ధర్మాన్ని తిరస్కరించినట్లు([17]).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరు పంచాంగకర్త లేదా అగోచర విషయాలు తెలిపేవాని వద్దకు వెళ్ళి అతను చెప్పిన మాటల్ని సత్యముగా నమ్ముతాడో అతడు ప్రవక్తపై అవతరించిన దానిని తిరస్కరించినవాడవుతాడు”. (అహ్మద్ 2/429, అబూ దావూద్, తిర్మిజి, ఇబ్ను మాజ).
55- తారల ద్వారా వర్షం కోరకు. నక్షత్రరాశుల, కక్ష్యల మరియు గ్రహాల ప్రభావం ఉంటుందని నమ్మకు([18]).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ మాలిక్ అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నా అనుచర సంఘం లోని కొందరిలో అజ్ఞానకాలానికి సంబంధించిన నాలుగు విషయాలు ఉంటాయి. వారు వాటిని వదులుకోరుః వంశగర్వం, వంశానికి సంబంధించిన దూషణలు, తారల ద్వారా వర్షం కోరడం([19]) మరియు శోకం”. (ముస్లిం/ అత్తష్దీదు ఫిన్నియాహ/ 394).
56- ఫలాన నక్షత్రం వల్ల వర్షం కురిసింది అని అనకు([20]). ఇలా వర్షం, దాని కురువడాన్ని వాటికి అంకితం చేసినట్లవుతుంది.
జైద్ బిన్ ఖాలిద్ అల్ జుహ్నీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: హుదైబియ ప్రాంతంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఫజ్ర్ నమాజ్ చేయించారు. ఆ గడిచిన రాత్రి వర్షం కురిసింది. నమాజ్ అయిన తరువాత ఆయన అనుచరుల వైపు తిరిగి “మీ ప్రభువు ఏమన్నాడో మీకు తెలుసా?” అని అడిగారు. అల్లాహ్ కు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు, మాకు తెలియదు అని వారన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ఇలా చెప్పాడని తెలిపారు. “ఈ రోజు ఉదయం నా దాసుల్లో కొందరు నన్ను విశ్వసిస్తూ, మరికొందరు తిరస్కరిస్తూ లేచారు. అల్లాహ్ దయ వల్ల మనకు వర్షం కురిసింది అని అన్నవారు తారాబలాన్ని నిరాకరించి, నన్ను విశ్వసించిన వారయ్యారు. దీనికి భిన్నంగా ఫలానా నక్షత్ర ప్రభావంతో వర్షం కురిసిందని అన్నవారు నక్షత్ర విశ్వాసులయి, నన్ను తిరస్కరించిన వారయ్యారు. (బుఖారి/వతజ్అలూన రిజ్ఖకుం… 1038, ముస్లిం 71).
57- అపశకునం పాటించకు, ఏ దానిని కూడా చెడుదృష్టితో చూడకు.
పక్షులు, మనుషులు, పేర్లు, పదాలు, స్థలం, సంఘటనలు, సంఖ్యలు, రంగులు, నెలలు, రోజులు మరియు గంటలు ఎందులో కూడ ఏలాంటి లాభనష్టాలు లేవు. కేవలం అల్లాహ్ తప్ప.
عَنْ أَبِي هُرَيْرَةَ > أَنَّ رَسُولَ الله ^ قَالَ: (لَا عَدْوَى وَلَا هَامَةَ وَلَا نَوْءَ وَلَا صَفَرَ) {مسلم 2220}. و في رواية جَابِرٍ > أن النبي ^ قال: (وَلَا طِيَرَةَ وَلَا غُولَ). {مسلم 2222}
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అంటు వ్యాది సరైనది కాదు. గుడ్లగూబ అరుపులో నష్టమేమీ లేదు. తారాబలం కూడా నమ్మదగినది కాదు. ‘సఫర్’లో నిజం లేదు([21])”. (ముస్లిం 2220). జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసు లో మరో రెండు విషయాలు అదనంగా ఉన్నాయిః “అపశకునం మరియు దయ్యాల నమ్మకం సరైనది కాదు”. (ముస్లిం 2222).
58- మంచి, చెడు తక్దీర్ (విధివ్రాత)ను తిరస్కరించకు.
తక్దీర్ అన్నది అల్లాహ్ సృష్టిలో ఒక రహస్యం. ఈ జగత్తులో ఏది జరిగినా అది అల్లాహ్ కు తెలిసినదే, కోరినదే, వ్రాసినదే మరియు సృష్టించినదే జరుగుతుంది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అల్లాహ్ భూమ్యాకాశాల వారందరిని శిక్షించదలిస్తే, శిక్షించగలుగుతాడు, అయినా అతడు వారిపై అన్యాయం, దౌర్జన్యం చేసినవాడు కాడు. ఒకవేళ వారిని కరుణించదలిస్తే, ఆయన కరుణ వారికి వారి కర్మల కంటే ఎంతో మేలైనది. నీవు ఉహుద్ పర్వతమంతటి ధనం అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టినా, తక్దీర్ ను విశ్వసించనంత వరకు అల్లాహ్ దానిని అంగీకరించడు. నీకు ప్రాప్తమయ్యేది నీ నుండి తప్పిపోయేది కాదని మరియు నీ నుండి తప్పిపోయేది నీకు ప్రాప్తమయ్యేది కాదని తెలుసుకో!. దీనికి విరుద్ధమైన పద్ధతిలో నీకు చావు వచ్చిందంటే నీవు నరకం పాలవుతావు”. (అబూ దావూద్/ ఫిల్ ఖద్ర్ 4699).
59- అల్లాహ్ వ్రాసిన విధి వ్రాత పట్ల అయిష్టత, కోపం ప్రదర్శించకు([22]).
నీకు చేకూరేది నీ నుండి తప్పిపోయేది కాదని మరియు నీ నుండి తప్పిపోయేది నీకు చేకూరేది కాదని తెలుసుకో!. అల్లాహ్ తన తక్దీర్ మరియు తద్బీర్ (ఉపాయము, నిర్వహణము) లో చాలా వివేకవంతుడు([23]).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అనస్ రజియ ల్లాహు అన్హు ఉల్లేఖించారుః “పరీక్ష ఎంత పెద్దగా ఉంటుందో అంతే గొప్ప పుణ్యఫలం ఉంటుంది. అల్లాహ్ ఎవరిని ప్రేమిస్తాడో వారిని పరీక్షకు గురి చేస్తాడు. ఎవరు సంతోషంగా మసలుకుంటారో వారికి అల్లాహ్ సంతృష్టి లభిస్తుంది. ఎవరు అయిష్టత, కోపానికి గురి అవుతాడో అతడు అల్లాహ్ ఆగ్రహానికి గురి అవుతాడు”. (తిర్మిజి/ ఫిస్సబ్రి వల్ బలా/ 2396).
60- పాపాలు, దోషాలు, తప్పిదాలకు పాల్పడి, నా విధి వ్రాతే ఇలా ఉంది అని వాదించకు.
“దేవుడు నాకు సన్మార్గం ప్రాప్తిస్తే నేను భయభీతి గలవారిలో ఒకడిని అయ్యేవాడిని” అని సాకులు పలకకు. అయితే కష్టాలు, ఆపదలు వచ్చినప్పు డు నా తక్దీరులో ఉన్నట్లు జరిగింది అని అనవచ్చు.
ఏ వ్యక్తి అయినా ఇలా అనే పరిస్థితి రాకూడదు సుమాః “అల్లాహ్ విషయంలో నేను చూపిన నిర్లక్ష్యతకు నేను ఎంతో చింతిస్తున్నాను. పైగా నేను ఎగతాళి చేసే వారిలో చేరిపోయాను”. లేదా “అయ్యో! అల్లాహ్ నాకు సన్మార్గం చూపి ఉంటే, నేను కూడ భయభక్తులు కలవారిలో చేరిపోయేవాణ్ణి”. లేదా శిక్షను చూసి, “అయ్యో! నాకు మరొక అవకాశం దొరికితే ఎంత బాగుండును. నేను కూడ సత్కార్యాలు చేసే వారిలో కలిసిపోతాను”. (అప్పుడు అతనికి ఈ జవాబు దొరకకూడదు) “లేదు. నా ఆయతులు నీ వద్దకు వచ్చాయి. కాని నీవు వాటిని తిరస్కరించావు; విర్రవీగావు, నీవు అవిశ్వాసులలోని వాడవు”. (జుమర్ 39: 56-59).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ప్రయోజనకరమైన దానినే ఆశించు, అభిలషించు; కష్టాల్లో సహాయం కొరకు అల్లాహ్ ను మాత్రమే అర్థించు; ధైర్యాన్ని వీడకు; ఆపదలు ఆసన్నమైనప్పుడు ‘ఒకవేళ నేను ఆ విధంగా చేసి ఉంటే మరో విధంగా జరిగి ఉండేది’ అని తలపోయకు. దానికి బదులుగా, ఇదంతా అల్లాహ్ నిర్ణయం, ఆయన తనకు ఇష్టమైన దానినే చేశాడు అని పలుకు. ఎందుకంటే ‘ఒకవేళ’ అన్న పదం షైతాను చర్యల ద్వారాల్ని తెరుస్తుంది”. (ముస్లిం/ ఫిల్ అమ్రి బిల్ ఖువ్వ… 2664).
62- ఇన్ షా అల్లాహ్ అనకుండానే నేను రేపు ఫలాన పని చేస్తాను అని అనకు.
అల్లాహ్ మీలో ఎవరికైనా ఇతరులకు ఇచ్చినదానికంటే ఎక్కువగా ప్రసాదించివుంటే మీరు దానికి ఆశపడకండి. పురుషులకు వారు సంపాదించుకున్న దానికి తగిన ప్రతిఫలం ఉంది. అలాగే స్త్రీలకు కూడా వారు సంపాదించుకున్న దానికి తగినట్లే ప్రతిఫలం లభిస్తుంది. అయితే అల్లాహ్ ను ఆయన అనుగ్రహం కొరకు ప్రార్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ సకల విషయ పరిజ్ఞానం కలవాడు. (నిసా 4: 32).
64- అల్లాహ్ అనుగ్రహాన్ని తిరస్కరించి, అది వేరెవరైనా ప్రసాదించారని ఆరోపించి కృతఘ్నతకు పాల్పడకు.
మరియు ఆ అనుగ్రహం యొక్క హక్కు, ఏ కృతజ్ఞత, అల్లాహ్ స్మరణ రూపంలో చెల్లించాలో దానిని విస్మరించకు.
మీ ప్రభువు ఇలా హెచ్చరిక చేశాడుః మీరు గనక కృతజ్ఞులైతే, నేను మిమ్మల్ని ఇంకా ఎక్కువగా అనుగ్రహిస్తాను. ఒకవేళ కృతఘ్నతకు పాల్పడితే నా శిక్ష చాలా కఠినముగా ఉంటుంది. (ఇబ్రాహీం 14: 7).
65- అల్లాహ్ తప్ప మరెవ్వరీ ప్రమాణం చేయకు.
ఉదాహరణకుః కాబా, ప్రవక్త, గౌరవమానవ ప్రమాణం అనీ, లేదా నీ జీవిత ప్రమాణం, తల మీద చెయ్యి వేసి ప్రమాణం వగైరాలు చేయుట నిశిద్ధం.
“వినండి! మీరు మీ తాతముత్తాతల పేర్లతో ప్రమాణం చేయుట నుండి అల్లాహ్ వారించాడు. ఎవరైనా ప్రమాణం చేయదలిచితే కేవలం అల్లాహ్ ప్రమాణమే చేయాలి. లేదా మౌనం వహించాలి” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారని ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు. (బుఖారి/మల్లమ్ యర ఇక్ఫార… 6108, ముస్లిం/అన్నహ్ యు అనిల్ హల్ఫి… 1646).
“అమానత్ ప్రమాణం చేయువారు మాలోని వారు కారు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని బురైద రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (అబూ దావూద్/కరాహియతుల్ హల్ఫి 3253).
67- అనవసరంగా అధికంగా అల్లాహ్ నామ ప్రమాణం చేయకు.
చివరికి ఇది (నీ ఈ చేష్ట) నిన్ను అల్లాహ్ నామముల పట్ల అవహేళన, అవమర్యాదకు గురి చేసే ప్రమాదం ఉంటుంది
[وَاحْفَظُوا أَيْمَانَكُمْ]. {المائدة:89}
మీరు మీ ప్రమాణాలను కాపాడండి. (మాఇద 5: 89).
69- నీ కొరకు అల్లాహ్ నామ ప్రమాణం చేసిన వాని ప్రమాణాన్ని తిరస్కరించకు.
అల్లాహ్ పట్ల ఉండవలసిన గౌరవమర్యాదలను బట్టి అతని ప్రమాణాన్ని స్వీకరించు. అతను తన ప్రమాణం ద్వారా ఏదైనా పాపం కోరితే, లేదా నీ శక్తిలో లేని దానిని కోరితే నీవు తిరస్కరించవచ్చు.
ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ఒక వ్యక్తి తన తండ్రి ప్రమాణం చేస్తున్నది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విని ఇలా బోధించారుః “మీ తండ్రుల ప్రమాణం చేయకండి. అల్లాహ్ ప్రమాణం చేసిన వ్యక్తి తన ప్రమాణంలో సత్యవంతునిగా ఉండాలి. ఎవరి గురించి అల్లాహ్ ప్రమాణం చేయబడిందో అతను దానితో రాజీ పడాలి. అల్లాహ్ ప్రమాణంతో రాజీ పడని వ్యక్తి అల్లాహ్ వాడు కాడు”. (ఇబ్ను మాజ/మన్ హులిఫలహూ… 2101).
70- ఎంత గొప్ప వస్తువైనా ప్రసాదించడం అల్లాహ్ కు కష్టతరమైన పని కాదు.
సృష్టిరాసుల అవసరాలు పూర్తి చేయకుండా ఆయన్ని అడ్డుకునేవాడెవడూ లేడు. వారి అవసరాలు పూర్తి చేయటకు ఆయన్ని బలవంతం చేయువాడెవడూ లేడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీరు అల్లాహ్ తో దుఆ చేస్తున్నప్పుడు “అల్లాహ్! నీవు కోరితే నన్ను క్షమించు, అల్లాహ్! నీవు కోరితే నన్ను కరుణించు, అల్లాహ్! నీవు కోరితే నాకు ఆహరం ప్రసాదించు” అని దుఆ చేయవద్దు. దానికి బదులుగా దృఢ నమ్మకంతో దుఆ చేయాలి. ఆయన తాను కోరింది చేయగలవాడు. ఆయన్ని ఎవరూ బలవంతం పెట్ట లేరు”. (బుఖారి/ఫిల్ మషీఅతి వల్ ఇరాద 7477, ముస్లిం/ అల్ అజ్మ్ బిద్దుఆ…2678). మరో ఉల్లేఖనంలో ఉందిః “తన కోరికను చాలా స్పష్టంగా తెలుపాలి. నిశ్చయంగా అల్లాహ్ ప్రాసదించేవాటిలో ఆయనకు కష్టతరమైనదేదీ లేదు”. (ముస్లిం 2679).
71- ఏ ఒక్క ముస్లింని కూడా అతను చేసిన ఏదైనా అపరాదం వల్ల అతన్ని కాఫిర్ (అవిశ్వాసి) అని అనకు. అతడు దానిని ధర్మసమ్మతం అని భావిస్తే అది వేరే విషయం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఒక ముస్లిం తన సాటి ముస్లిం సోదరుడ్ని అవిశ్వాసి అని పిలిస్తే ఆ మాట ఇద్దరిలో ఏ ఒక్కరిపై అయినా పడుతుంది. పిలువబడే వ్యక్తి దానికి అర్హుడైతే అతని మీద పడుతుంది. లేదా చెప్పిన వానిపై (అంటే ఇతను అవిశ్వాసి అవుతాడు). (ముస్లిం/బయాను హాలి ఈమాని… 60, బుఖారి/మన్ కఫ్ఫర అఖాహు బిగైరి తావిల్ 6104).
72- అల్లాహ్ మీద ప్రమాణం చేసి ఫలాన వ్యక్తి స్వర్గవాసి, ఫలాన నరకవాసి అని తీర్పులు చేయకు. ఎవరి గురించి వహీ ద్వారా స్పష్టంగా చెప్పబడిందో వారు తప్ప.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని జుందుబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఒక వ్యక్తి “అల్లాహ్ సాక్షిగా! అల్లాహ్ ఫలాన వ్యక్తిని క్షమించడు” అని అన్నాడు. అప్పుడు అల్లాహ్ అన్నాడుః “నేను ఫలాన వ్యక్తిని క్షమించనని నా మీద ప్రమాణం చేసేవాడెవడు? నిశ్చయంగా నేను అతన్ని క్షమించాను మరి నీ కర్మలన్నిటినీ వృధా పరిచాను”. (ముస్లిం/అన్నహ్ యు అన్ తఖ్నీతిల్ ఇన్సాన్ మిన్ రహ్మతిల్లాహ్ 2621).
73- ప్రవక్త సహచరు (సహాబా)లను దూషించకు.
అల్లాహ్ వారందరితో తృప్తి చెందుగాక! మనల్ని ప్రళయదినాన వారితో లేపుగాక! ఎవరు వారిని శపిస్తారో అల్లాహ్ వారిని శపిస్తాడు. వారిలో ఏ ఒక్కరినైనా తిట్టినవారిపై మరియు వారిలోని తప్పులు తీయువానిపై అల్లాహ్ ఆగ్రహం కురుస్తుంది. సర్వ ప్రవక్తల తర్వాత వారు సర్వ మానవుల్లో శ్రేష్ఠులు. అల్లాహ్ తన జ్ఞానంతో వారికి ప్రవక్త సహచర భాగ్యం ప్రసాదించాడు.
“నా అనుచరుల గురించి చెడుగా మాట్లాడకండి. నా అనుచరుల గురించి చెడుగా మాట్లాడకండి. ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షిగా! మీలో ఏ ఒక్కడూ ఉహుద్ పర్వతమంత బంగారం ఖర్చు పెట్టినా అది నా అనుచరులు ఖర్చు పెట్టిన ఒక ముద్ లేదా సగం ముద్ ధాన్యపు పుణ్యాలకు సాటిరాదు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్లిం/తహ్రీము సబ్బిస్సహాబ 2540, బుఖారి/ఖౌలున్నబీ లై కుంతు ముత్తఖిజన్ ఖలీల 3673).
74- ప్రవక్త కుటుంబీకుల్లోని పుణ్యాత్ములను ద్వేషించకు.
వారిని ప్రేమించడం ధర్మంలో ఓ భాగమైతే, వారిని గౌరవించడం మన విశ్వాసంలోని ఓ భాగం. పోతే హద్దులు మీరరాదు. మరియు వారికి ఉన్న స్థానం నుంచి క్రింద పడవేయరాదు.
عن أبي سعيد الخدري > قال : قال رسول الله ^: (وَالَّذِي نَفسِي بِيَدِهِ لاَ يُبْغِضُنَا أَهْلَ الْبَيتِ رَجُلٌ إِلاَّ أَدْخَلَهُ اللهُ النَّار ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఏ వ్యక్తి మా కుటుంబీకుల్లోని (పుణ్యాత్ములను) ద్వేషిస్తాడో అల్లాహ్ అతడ్ని తప్పక నరకంలో పడవేస్తాడు”. (సహీ ఇబ్ను హిబ్బాన్ 15/435, సహీహ 2488).
75- అల్లాహ్ వైపు నుండి నీ వద్ద స్పష్టమైన ఆధారం లేనంత వరకు ఏ ముస్లింపై అపరాధ నింద వేయకు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నట్లు అబూ జర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఏ వ్యక్తి మరో వ్యక్తిపై అపరాధ, అవిశ్వాస నింద వేయకూడదు. నిందింపబడిన వ్యక్తి అలా కాకుంటే ఆ మాట చెప్పిన వానిపై తిరుగుతుంది”. (బుఖారి/మా యున్హా మినస్సిబాబి వల్లఅన్ 6045).
76- ఏ ముస్లింని కూడా “ఓ అల్లాహ్ శత్రువా!” అని అనకు.
و عن أبى ذر > سمع النبي ^ يقول : (مَن ادَّعَى لِغير أَبيهِ وهُو يَعلم فَقد كَفر، ومَن ادَّعى قوماً ليسَ هُو مِنهُم فَليتَبَوأ مَقعده مِن النَّار، ومَن دَعا رَجُلاً بِالكُفر أَو قَال عَدو الله وليسَ كَذلكَ إلا حَارت عَليه).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ జర్ రజియల్లాహు అన్హు విని ఉల్లేఖించారుః “ఏ మనిషి తెలిసి కూడా తండ్రి కాని వ్యక్తిని తన తండ్రి అని ఆరోపిస్తాడో అతడు అవిశ్వాసానికి పాల్పడినట్లే. తాను ఏ జాతి వంశం నుండి లేడో దాని వైపు తన్ను ఆరోపించుకుంటే ఆ వ్యక్తి తన స్థానం అగ్నిలో చేసుకోవాలి. ఏ వ్యక్తి మరో వ్యక్తిని “ఓ అవిశ్వాసి” లేదా “ఓ అల్లాహ్ శత్రువుడా!” అని పిలుస్తారో అతను అలా కానిచో అది చెప్పినవానిపై పడుతుంది”. (సహీహుల్ అదబిల్ ముఫ్రద్ 336).
77- అలా జరుగుతే నేను ఇస్లాం నుండి వైదొలిగిపోతాను అని అనకూడదు.
కొందరు ఇలా అంటారుః ఒకవేళ ఇట్లు జరుగుతే నేను యూదున్ని లేదా క్రైస్తవున్ని అయిపోతాను. (ఇలా అనకూడదు).
“ఎవరైనా ప్రమాణం చేసి నేను ఇస్లాం నుండి విసుగు చెందాను అని అంటే, ఆ ప్రమాణంలో అతడు అసత్యుడైతే అన్నట్లే అయి పోతాడు. ఒకవేళ సత్యవంతుడైతే మళ్ళీ ఇస్లాం వైపునకు క్షేమంగా మరలిరాలేడు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని బురైదా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (అబూ దావూద్/ఫిల్ హల్ఫి బిల్ బరాఅ…. 3258, నిసాయి 3772, ఇబ్ను మాజ 2100).
78- అవిశ్వాసి, వంచకుడు, ఫాసిఖ్, మరియు బహిరంగంగా పాపానికి ఒడిగట్టేవారిని సయ్యిద్, మిస్టర్ లాంటి గౌరవపరమైన పదాలతో పిలవకండి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారని బురైదా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “వంచకుడిని సయ్యిద్ (మిస్టర్) అని అనకండి. ఒకవేళ అతడు సయ్యిద్ అయితే మీరు మీ ప్రభువును అసంతృప్తి పరచినట్లే”. (అబూ దావూద్/లాయఖూలుల్ మమ్ లూకు రబ్బీ వ రబ్బతీ 4977).
79- అల్లాహ్ ధర్మంలో కొంగ్రొత్త విషయాలు పుట్టించకు.
ఇబాదత్ (ఆరాధన)ల్లో మౌలిక విషయం: “ఖుర్ఆన్, హదీసు ఆధారాలతో రుజువైన దానినే చేయుట, దేని ప్రస్తావన లేదో దానిని మానుకొనుట”. అందుకు నీవు కొత్త విషయం పుట్టించకు. కేవలం ధర్మాన్ని అనుసరించు. అదే నీకు సరిపోతుంది. ప్రవక్త మార్గాన్ని అనుసరించు. అదే ఉత్తమమైన మార్గం. ప్రతి క్రొత్త విషయం బిద్అత్. ప్రతి బిద్అత్ దుర్మార్గం. ప్రతి దుర్మార్గం నరకం పాలౌతుంది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః “మా ఈ ధర్మంలో లేని విషయాన్ని ఎవరైనా అందులో పుట్టిస్తే అది రద్దు చేయబడుతుంది”. (ముస్లిం/నఖ్జుల్ అహ్కామిల్ బాతిల… 1718, బుఖారి/ ఇజస్తలహూ అలా సుల్ హిన్ జౌరిన్… 2697).
80- అల్లాహ్ ధర్మంలో లేని ఏదైనా చెడు సంప్రదాయాన్ని నీవు ఆరంభించకు. నీకు దాని పాపమే కాకుండా ప్రళయం వరకు దానిని పాటించేవారి పాపం నీపై పడుతుంది.
“ఏ వ్యక్తి ఇస్లాంలోని (ప్రజలు విడనాడిన) ఒక సత్సంప్రదాయాన్ని ఆచరించడం మొదలెడతాడో, అతనికి తాను ఆచరించిన పుణ్యం, ఇంకా అతని తర్వాత దానిని ఆచరించేవారి పుణ్యం లభించును. అయితే వారి పుణ్యాల్లో ఏలాంటి కొరత జరగదు. మరెవడయితే ఇస్లాంలో ఒక దుష్సంప్రదాయాన్ని ప్రారంభిస్తాడో అతనిపై తాను చేసిన పాప భారం, ఇంకా అతని తర్వాత దానిని ఆచరించేవారి పాప భారము వేయబడును. అయితే వారి పాపాల్లో ఏలాంటి తగ్గింపు జరగదు”. (ముస్లిం/అల్ హస్సు అలస్సదఖ… 1017).
81- జ్ఞానం లేకుండా కేవలం తన అభిఫ్రాయ ఆధారంగా ఖుర్ఆన్, హదీసుల పట్ల వాదించకు.
వాటి అర్థభావాల లోతు మరియు వాటి గురించి సలఫె సాలిహీను (పూర్వ ధర్మవేత్త)ల వ్యాఖ్యానాలు తెలియనిదే స్వయంగా వాటి భావం చెప్పే ప్రయత్నం చేయకు.
“తెలిసి కూడా నాపై అసత్యం మోపినవాడు తన స్థానం నరకంలో సిద్ధపరుచుకోవాలి” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (బుఖారి/ఇస్ము మన్ కజబ అలన్నబి 110, ముస్లిం/తగ్లీజుల్ కజిబి అలా రసూలిల్లా 3).
85- అల్లాహ్, ఆయన ప్రవక్త ఆదేశానికి ముందే నీవు నీ తీర్పు, నీ అభిప్రాయం, నీ మాట, నీ బుద్ధీజ్ఞానాలు ఉంచబోకు.
ఆది నుండి అంతం వరకు అధికారం ఏకైక అల్లాహ్ కు మాత్రమే ఉంది. ఆయన తాను చేసే పనులకు (ఎవరి ముందూ) జవాబు దారి కాడు. కాని అందరూ (ఆయన ముందు) జవాబుదారులే.
విశ్వాసులారా! అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (అనుమతి)కి ముందే నిర్ణయలాకు దిగకండి. అల్లాహ్ కు భయపడండి. అల్లాహ్ సమస్తమూ వినేవాడు, సర్వమూ ఎరిగినవాడూ. (హుజురాత్ 49: 1).
86- అల్లాహ్ ధర్మంలో, ఆయన ఆదేశాల్లో నీ వాంఛలకు అనుకూలమైనవి, నీ కోరికలకు తగినవి తీసుకొని ఇతరవాటిని తోసిపుచ్చడం లాంటి చేష్టలు చేయకు.
ధర్మం సంపూర్ణమైనది. అందులో భాగాలు చేయుట సమంజసం కాదు. ఈ విధంగా కొన్నిటిని నమ్మి మరికొన్నిటిని తిరస్కరించే వారిలో కలవకు.
విశ్వాసులారా! మీరు పూర్తిగా ఇస్లాంలో ప్రవేశించండి. షైతాను అడుగుజాడలు త్రొక్కకండి. అతడు మీకు బహిరంగ శత్రువు. (బఖర 2: 208).
87- నీ అల్ప బుద్ధి వల్ల లేదా అవాస్తవిక సిద్ధాంతాల కారణంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ వైపు నుండి తీసుకొచ్చిన ధర్మవిషయాల్లో ఏ ఒక్క దానిని కూడా తిరస్కరించకు;
వాస్తవానికి నిజమైన ధర్మం మరియు సరియైన మేధ పరస్పరం విరుద్ధమేమీ కావు. అయినా ఎప్పుడైనా వాటి మధ్యలో ఎవరికైనా విరుద్ధం అన్న సందేహం తలెత్తుతే ధర్మాన్ని ముందు ఉంచాలి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరుల్లో ఎవరినైనా ఏదైనా పని మీద పంపినప్పుడు “శుభవార్త ఇవ్వండి, అసహ్యత, విసుగు కలిగించకండి. సులభంగా మసలుకోండి. కఠినత్వాన్ని మానుకోండి” అని చెప్పినట్లు అబూ మూసా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్లిం/ఫిల్ అమ్రి బిత్తైసీర్… 1732, బుఖారి 69).
90- కాలాన్ని దూషించకు([24]). ఇది అల్లాహ్ ను బాధ కలిగించినట్లగును([25]).
కాలాన్ని సృష్టించి, దానిని నియమ బద్ధంగా చేసింది అల్లాహ్ యే. కాలంలోనే విధివ్రాత అమలు జరిగే విధంగా చేశాడు.
అల్లాహ్ చెప్పాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు అబూ హురైరా > ఉల్లేఖించారుః “మానవూడు నన్ను బాధిస్తున్నాడు. అతడు కాలాన్ని దూషిస్తున్నాడు. వాస్తవానికి నేనే కాలం. అధికారమంతయూ నా చేతిలోనే ఉంది. రేయింబవళ్ళను మార్చేవాడిని నేనే”. (బుఖారి/వమా యుహ్ లికునా ఇల్లద్దహ్ ర్ 4826).
91- బహుదైవారాధకులు దేవుళ్ళుగా పూజించేవారిని దూషించకండి. ప్రతికారంగా వారు అల్లాహ్ నూ దూషించవచ్చు
(ముస్లిములారా!) వారు అల్లాహ్ ను కాదని వేడుకునే వారిని మీరు దూషించకండి. ఎందుకంటే, వారు మితిమీరి అజ్ఞానం చేత అల్లాహ్ ను దూషిస్తారేమో. (అన్ఆమ్ 6: 108).
92- అజ్ఞానపు పిలుపులు పిలువకూడదు.
ఉదాః కులపరమైన పక్షపాతం, పార్టీ పరమైన పక్షపాతం, జాతీయపరమైన పక్షపాతం, వంశపరమైన పక్షపాతం. ఈ అజ్ఞాన పార్టీల వైపునకు అంకితమై వర్గీకర నినాదాలను ఇస్లాం నిషేధించింది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని జుబైర్ బిన్ ముత్ఇమ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “పక్షపాతం వైపునకు పిలిచేవాడు మాలోనివాడు కాడు. పక్షపాతంతో పోరాడేవాడు మాలోనివాడు కాడు. పక్షపాతం పై మరణించినవాడు మాలోనివాడు కాడు”. (అబూ దావూద్/ ఫిల్ అసబియ్యహ్ 5121).
93- ఇక ఇస్లాం సమాప్తమైనట్లే అని, అది నశించిపోతుంది అని భావించకు.
నిశ్చయంగా అల్లాహ్ సహాయంతో ఒక వర్గం బలమైన ఆధారం మీద ఉంటుంది. ఆ వర్గాన్ని వదలినవారు దానిని ఏ విధంగా నష్టపరచలేరు. రాత్రి పగలు ఉన్నంత వరకు ఈ ధర్మం చేరుతుంది. అల్లాహ్ తప్పక తన ధర్మానికి ప్రాబల్యత ప్రసాదించి ఉంటాడు. విశ్వాసుల్లో ఎవరైతే అల్లాహ్ ధర్మానికి సహాయకులుగా నిలుస్తారో అల్లాహ్ వారికి సహాయపడతాడు. అంతిమ సాఫల్యం భక్తిపరులకే ఉంటుంది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని సౌబాన్ > ఉల్లేఖించారుః “అల్లాహ్ నా కొరకు భూమండలాన్ని చేరదీసాడు. నేను దాని తూర్పు పడమరలను చూశాను. ఎంత వరకు చేరదీయబడిందో అంత వరకు నా అనుచర సంఘం యొక్క ప్రభుత్వం వ్యాపిస్తుంది”. (ముస్లిం/ హలాకు హాజిహిల్ ఉమ్మతి… 2889).
94- ఇస్లాం అనుసరణ వల్లనే ముస్లింలు వెనకబడి ఉన్నారని అనుకోకు.
వాస్తవమేమిటంటే వారు ఇస్లాం ధర్మానికి దూరమై, తమ ప్రభువు మార్గాన్ని విడనాడినందున మరియు ఏ సాధనాల వల్ల బలం, కొత్త పరిశీలన మరియు రాజ్యాధికారాలు లభిస్తాయో వాటిని సమాకూర్చుకోక పోవడం వల్లనే వెనకబడి ఉన్నారు. పూర్వపు ముస్లిముల బాగోగులు ఎందులో ఉండిందో ఈ కాలం ముస్లిముల బాగోగులు అందులోనే ఉంది. చదవండిః
మీలో విశ్వసించి మంచి పనులు చేసేవారికి అల్లాహ్ చేసిన వాగ్దానం ఏమిటంటే, ఆయన వారిని, వారికి పూర్వం గతించిన ప్రజలను చేసిన విధంగా, భూమిపై ఖలీఫాలుగా చేస్తాడు, అల్లాహ్ వారికై అంగీకరించిన వారి ధర్మాన్ని వారికొరకు పటిష్ఠమైన పునాదుల పై స్థాపిస్తాడు. వారి యొక్క భయస్థితిని శాంతి భద్రతలతో కూడిన స్థితిగా మార్సుతాడు. కనుక వారు నాకు దాస్యం చేయాలి, ఎవరినీ నాకు భాగస్వాములుగా చేయకూడదు. దీని తరువాత ఎవరైనా అవిశ్వాసానికి పాల్పడితే, అటువంటి వారే హద్దులు మీరినవారు. (నూర్ 24: 55).
95- అల్లాహ్ యొక్క ఔలియా (సన్నిహితుల)ని, అల్లాహ్ ధర్మం వైపు పిలిచేవారిని మరియు ఈ ధర్మానికి రక్షకులుగా నిలబడినవారిని ద్వేషించకు.
عَنْ أَبِي هُرَيْرَةَ > قَالَ: قَالَ رَسُولُ الله ^: (إِنَّ الله قَالَ مَنْ عَادَى لِي وَلِيًّا فَقَدْ آذَنْتُهُ بِالْحَرْبِ).
అల్లాహ్ ఇలా చెప్పాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లు అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరు నా వలీతో శతృత్వం వహిస్తాడో అతడు నాతో యుద్ధానికి సిధ్ధం కావాలి”. (బుఖారి/ అత్తవాజుఅ 6502).
96- పుణ్యాత్ముల చేత ఏ కరామతులు([26]) ప్రత్యక్షమవుతాయో వాటిని తిరస్కరించకూడదు. అయితే అవి ధర్మానికి అనుగుణంగా ఉండాలి.
మరియు షైతాన్ పనులతో మోసబో కుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కరామతు మరియు దుర్మా ర్గులు, దురాచారులు, సత్యధర్మానికి అతిదూరంగా ఉన్నవారు చూపించే మోసపు గారడి ఆటల మధ్య వ్యత్యాసాన్ని గమనించాలి.
వినండి! అల్లాహ్ కు స్నేహితులైనవారికీ ఆయనను విశ్వసించి భయభక్తుల వైఖరిని అవలంబించిన వారికీ ఏ విధమైన భయం కానీ, విషాదం కానీ కలిగే అవకాశం లేదు. (యూనుస్ 10: 62).
97- ఏ ఒక్క ముస్లిం పట్ల నీవు నీ మనస్సులో ద్వేషం, కపటం కలిగి ఉండకు. అతడేదైనా పాపం చేస్తే దాని పట్ల ద్వేషం ఉండడం తప్పనిసరి.
“పరస్పరం సంబంధాలు తెంచుకోకండి. ఒకర్నొకరు మాట్లాడు కోవడం మానెయ్యకండి. ఒకరు మరొకరిని ద్వేషించుకోకండి. ఒకరు మరొకరి మీద అసూయ చెందకండి. మీరంతా అల్లాహ్ దాసులుగా పరస్పరం అన్నదమ్ములుగా జీవితం గడపండి. మూడు రోజులకు మించి తన తోటి సోదరునితో, సంబంధాలు త్రెంచి ఉండటం లేదా పరస్పరం మాట్లాడుకోకుండా ఉండటం ఏ ముస్లింకూ ధర్మసమ్మతం కాదు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హితువు చేశారని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (తిర్మిజి/ మాజాఅ ఫిల్ హసద్ 1935, బుఖారి 6065, ముస్లిం 2559).
98- ముస్లిములతో పోరాడకు. వారిపై ఆయుధాన్ని లేపకు. వారిలో ఎవరైనా దౌర్జన్యానికి దిగి వారిని అనచడానికి పోరాడం తప్ప వేరే ఏ పద్ధతీ సఫలం కానప్పుడు తప్ప.
عن عَبْد الله > أَنَّ النَّبِيَّ ^ قَالَ: (سِبَابُ الْمُسْلِمِ فُسُوقٌ وَقِتَالُهُ كُفْرٌ)
“ముస్లింను దూషించడం ఫిస్ఖ్ (అపరాధం). అతనితో పోరాడటం కుఫ్ర్ (సత్యతిరస్కారం)తో సమానం” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (బుఖారి/ఖౌఫుల్ మోమిని మిన్ అయ్ యహ్ బత అమలుహు వహువ లాయష్ఉర్ 48, ముస్లిం 64).
99- ముస్లిం నాయకుడు, మరియు ముస్లిం ఐక్య సంఘంతో విడిపోకూడదు. ఐక్యత, కలసి ఉండడం దైవకరుణం అయితే అనైక్యత, విడిపోవడం శిక్ష.
“నాయకుని విధేయతా పరిధి నుండి బయటికి పోయి, సంఘ ఐక్యతను విడనాడి అదే స్థితిలో చనిపోయినవాడు అజ్ఞానపు చావును కొని తెచ్చుకున్నట్లే” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్లిం/ వుజూబు ములాజమతి జమాఅతిల్ ముస్లిమీన్… 1848).
100- ముస్లిముల నాయకునికి వ్యతిరేకంగా తిరుగబడకు. అతనిలో అతిస్పష్టమైన అవిశ్వాసానికి సంబంధించిన ఏదైనా విషయం నీవు చూస్తే తప్ప. అది ఏదైనా దుష్భావంతో లేదా మనోతిరస్కారంతో కూడినదై ఉండకూడదు. అల్లాహ్ వైపు నుండి నీ వద్ద బలమైన ఆధారం ఉండాలి. మరియు ఏలాంటి రక్తపాతం, కల్లోలం జరగకుండా నీ తిరుగుబాటు సఫలీకృతం అయ్యే అంతటి శక్తి నీలో ఉండాలి.
ఉబాద బిన్ సామిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మేము ప్రవక్తతో ఈ విషయాలపై శపథం చేశాము. మాట విని వాటిని పాటిస్తామని, అవి మాకు నచ్చినా నచ్చక పోయినా, కలిమిలోనూ, లేమిలోనూ, మా హక్కులు కాలరాయబడినా సరే. ఇంకా ప్రభుత్వ వ్యవహారాలను గురించి అధికారులతో తగవుపడమని. అయితే పాలకులు బహిరంగంగా సత్యవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు మీ దగ్గర అల్లాహ్ వైపు నుండి బలమైన ఆధారం ఉంటే తప్ప”. (బుఖారి/సతరౌన బఅదీ ఉమూరన్ తున్కిరూనహా 7056). మరో ఉల్లేఖనంలో ఉందిః “ఎక్కడ ఉన్నా సత్యమే పలకాలని మరియు అల్లాహ్ విషయంలో నిందించేవారి నిందలకు భయపడమని”. (బుఖారి/కైఫ యుబాయిఉల్ ఇమామున్నాస 7199).
101- అల్లాహ్ అవిధేయత జరుగుతున్న విషయంలో ఎవ్వరి విధేయత పాటించరాదు. మంచి విషయాల్లోనే విధేయత పాటించాలి.
“తనకు నచ్చిన మరియు నచ్చని ప్రతి విషయం విని విధేయత చూపుట ప్రతి ముస్లింపై విధిగా ఉన్న ధర్మం. అల్లాహ్ అవిధేయతకు గురి చేసే ఆదేశాలు తప్ప. అలాంటి ఆదేశం గనక ఇవ్వబడితే వాటిని పాటించవద్దు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (బుఖారి/అస్సమ్ఉ వత్తాఅతు… 7144, ముస్లిం/వుజూబు తాఅతుల్ ఉమరా ఫీగైరి మఅసియ… 1839).
102- పేరు ప్రఖ్యాతుల ఉద్దేశంతో సత్కర్మలు చేయకు. అల్లాహ్ కాకుండా వారితో నీకు ఏ ప్రయోజనం లేదు. దీని వల్ల చేసిన కర్మ వృధా అవడంతో పాటు దాని పుణ్యము నీకు దక్కదు, పాపం పెరుగును. కేవలం అల్లాహ్ సంతృప్తి కోసం మరియు ప్రవక్త అడుగుజాడలో చేసిన కర్మలనే అల్లాహ్ అంగీకరిస్తాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నా అనుచర సంఘంలోని ప్రతి ఒక్కడూ క్షమార్హుడే, బహిరంగంగా పాపకార్యాలకు పాల్పడేవారు తప్ప. మనిషి రాత్రి పూట ఏదైనా (తప్పు) చేసి, తెల్లవారిన తర్వాత తాను చేసిన పాపాన్ని అల్లాహ్ మరుగుపరచి ఉంచినప్పటికీ తాను మాత్రం (సిగ్గులేకుండా) ‘ఒరేయ్! రాత్రి నేను ఈ పని చేశాన్రా’ అంటూ (నలుగురిలో) చెప్పుకోవటం కూడా బహిరంగ పాపమే అవుతుంది. అతని ప్రభువు అతని పాపాన్ని తెరమరుగున ఉంచగా, తెల్లవారాక అతనే స్వయంగా ఆ తెరను తొలగించటానికి ప్రయత్నిస్తున్నాడు”. (బుఖారి/సిత్రుల్ ముఅమిని అలా నఫ్సిహీ 6069, ముస్లిం/ అన్నహ్ యు అన్ హత్కిల్ ఇన్సాని… 2990).
104- అల్లాహ్ నిన్ను అంతగా గమనించిలేడని మరియు నీ గురించి అంతగా ఏమీ ఎరగడని తక్కువ అంచన వేయకు. అల్లాహ్ తో సిగ్గుపడు. వాస్తవానికి అల్లాహ్ సర్వమూ తెలిసినవాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని సౌబాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ” ప్రళయదినాన తిహామ తెల్లని కొండల్లాంటి సత్కార్యాలతో వచ్చే నా అనుచర సమాజంలోని కొందరు నాకు తెలుసు. అల్లాహ్ వారి సత్కార్యాలను దుమ్ము మాదిరిగా ఎగరవేస్తాడు”. అప్పుడు ‘ప్రవక్తా! వారెవరు? వారి గుణగణాలేమిటో స్పష్టంగా చెప్పండి, మాకు తెలియకుండానే మేము వారిలో అయిపోతామేమో?’ అని సౌబాన్ విన్నవించుకోగా, ప్రవక్త ఇలా చెప్పారుః “వారు మీ సోదరులే, మీ దేశం, గ్రామంవారే మీ లాగ రాత్రి వేళ ఎక్కువగా ప్రార్థనలు చేస్తూ ఉండేవారే, కాని ఏకాంతంలో ఉన్నప్పుడు అల్లాహ్ నిశిద్ధతాలను ఉల్లంఘించేవారు”. (ఇబ్నుమాజ / జిక్రుజ్జనూబ్ 4245).
105- అల్లాహ్ ను అసంతృప్తి పరచి ప్రజల సంతృప్తి కోరకు. ఇతరుల కోరికలపై అల్లాహ్ ఆజ్ఞకు ప్రాధన్యతనివ్వు. అల్లాహ్ నిన్ను ఎవ్వరీ అవసరం లేకుండా చేయగలడు కాని ఏ ఒక్కడు అల్లాహ్ అవసరం లేకుండా చేయలేడు.
عَن عَائِشَةَ < قَالَت: سَمِعْتُ رَسُولَ الله ^ يَقُولُ: (مَنْ الْتَمَسَ رِضَا الله بِسَخَطِ النَّاسِ كَفَاهُ اللهُ مُؤْنَةَ النَّاسِ وَمَنْ الْتَمَسَ رِضَا النَّاسِ بِسَخَطِ الله وَكَلَهُ اللهُ إِلَى النَّاسِ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా తాను విన్నట్లు ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః “ప్రజలు ఇష్టపడకపోయినా అల్లాహ్ ఇష్టాన్ని మాత్రమే కోరే మనిషికి ప్రజల అవసరం పడినప్పటికీ అల్లాహ్ యే సరిపోతాడు. మరెవడైతే అల్లాహ్ ను అసంతృప్తి పరచి ప్రజల మెప్పును కోరుతాడో అల్లాహ్ అతడ్ని వారి వైపే వదలుతాడు”. (అంటే అతనికి అల్లాహ్ సహాయం ఉండదు). (తిర్మిజి/కితాబుజ్జుహ్ ద్ లోని చివరి హదీసు. 2414).
106- పాపం చిన్నదే కదా అని చూడకు. ఏ మహానుభావుని పట్ల అవిధేయత పాటించబోతున్నావో గమనించు. ఆయనే సర్వలోకాల ప్రభువు అల్లాహ్!
[مَا لَكُمْ لَا تَرْجُونَ للهِ وَقَارًا] {نوح:13}
మీకేమయిది, అల్లాహ్ కై మీరు ఎలాంటి గౌరవాన్నీ ఎందుకు ఆశించరు?. (నూహ్ 71: 13).
107- నీ జీవిత ఉద్దేశ్యం, సంకల్పం ప్రపంచమే ప్రపంచం ఉండకూడదు. చివరికి అదే ఉన్నతాశయంగా, విద్యార్జనకు గమ్యంగా కాకూడదు.
కేవలం ఈ ప్రాపంచిక జీవితాన్నీ, దాని ఆకర్షకాలనూ కోరుకునే వారు చేసిన పనులకు పూర్తి ప్రతిఫలాన్ని మేము వారికి ఇక్కడనే ఇచ్చేస్తాము. ఇందులో వారికి తక్కవ చెయ్యటం అంటూ జరగదు. అయితే పరలోకంలో అటువంటివారికి అగ్ని తప్ప మరేమీ ఉండదు. (అక్కడ తెలిసిపోతుంది) వారు ప్రపంచంలో చేసినదంతా మట్టిలో కలసిపోయింది అనీ, వారు చేసినదంతా కేవలం మిథ్య అనీ. (హూద్ 11: 15,16).
108- ప్రళయదినాన్ని మరచిపోకు. దాని కొరకు సంసిద్ధమవడం మరచిపోకు.
నీవు అల్లాహ్ వైపునకే పోవలసి ఉంది. ఆయన ముందు నిలబడవలసి ఉంది. ప్రతి చిన్నది, పెద్దది మరియు గొప్పది అల్పమైనది ప్రతీదాని గురించి నీ ప్రభువు నిన్ను అడగనున్నాడు.
మీరంతా అల్లాహ్ సన్నిధికి చేరుకోవలసిన దినం గురించి భయపడండి. (ఆ రోజు) ప్రతి వ్యక్తికీ అతను చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు. (బఖర 2: 281).
ఇప్పుడు మనం ఈ భాగం యొక్క చివరిలో ఉన్నాము. ఇందులో విశ్వాసానికి సంబంధించిన కొన్ని మినుకుమినుకుమనే మెరుపుల్లాంటి విషయాలు ప్రస్తావించాను. దీనిని సులభ పదాలతో, సరళ శైలిలో, మంచి రూపంలో తీసుకువచ్చే ప్రయత్నం చేశాను. దీనిపై దృష్టి సారించి, చదివి, ప్రచారం చేసి, ప్రచురించడంలో సహాయపడి నన్ను గౌరవించే, ప్రోత్సహించే వారందిరికీ అల్లాహ్ ప్రశాంతంగా చల్లనీ జీవితం ప్రసాదించుగాక!
ఇందులో ఏ మంచి విషయమున్నా అది అల్లాహ్ వైపు నుండి. ఆయనే దాని భాగ్యం కలగజేసి దానిపై స్థిరంగా ఉంచువాడు.
ఏదైనా తప్పు, దోషం ఉంటే నా వైపు నుండి మరియు షైతాన్ నుండి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వాటికి అతి దూరంగా ఉన్నారు.
నేను ప్రతి తప్పిదం నుండి అల్లాహ్ క్షమాపణ కోరుతున్నాను. నా లోపాలు నాకు చూపిన వానిపై అల్లాహ్ కరుణ వర్షాలు కురిపింపజేయుగాక!
ఎవరు మరింత ఎక్కువగా, లాభదాయకమైన విషయం కోరుతారో వారు ఈ శీర్షికకు సంబంధించిన పండితుల రచనలు చదవాలి. ఇలాంటి పుస్తకాల అవసరం మనకు ఈ రోజు అన్నపానీయాలు చివరికి మన శ్వాస కంటే మరీ ముఖ్యమైపోయాయి.
అవును, ఎందుకు లేదు? దాని ఫలితం భుమ్యాకాశాలంత విశాలమైన స్వర్గం. అందులో ఎన్నడూ అంతం కాని వరాలున్నాయి. వాటి గురించి ఏ మనసు ఊహించలేదు. ఇదంతా అల్లాహ్ యొక్క దయ, అనుగ్రహం.
దానికి విరుద్ధమైనదే వీడని దురదృష్టం, పట్టుకొని ఉండే భయంకర శిక్ష. ప్రజ్వలించే అగ్ని; సత్యాన్ని తిరస్కరించి, ముఖం త్రిప్పుకున్న పరమ దౌర్భాగ్యుడు తప్ప మరెవ్వరూ అందులో ప్రవేశించరు. ఇది అల్లాహ్ యొక్క న్యాయం, వివేకం.
ఓ అల్లాహ్ నీ సంతృష్టి మరియు నీ స్వర్గాన్నీ అడుగుతున్నాము. నీ నరకం మరియు నీ శిక్ష నుండి నీ శరణు వేడుకుంటున్నాము.
ఆదంతములో, బాహ్యాంతరంలో సర్వ స్తోత్రాలు అల్లాహ్ కే. ప్రవక్త పై, ఆయన కుటుంబీకులు, సహచరులపై అల్లాహ్ యొక్క అనేకాకనేక కరుణ, శాంతులు కురుయుగాక.
పాద సూచికలు (Footnotes)
([1]) అల్లాహ్ పట్ల ప్రేమ రకాలుః
1- దయ, జాలితో కూడిన ప్రేమ. ఇది సంతానం, చిన్న పిల్లవాళ్ళు మరియు వారి లాంటివారితో ఉంటుంది.
2- గౌరవ మర్యాద, సేవసత్కార్యాలతో కూడిన ప్రేమ. ఈ రకమైన ప్రేమ తండ్రి, శిక్షకుడు మరియు వారి స్థానంలో ఉన్నవారితో ఉంటుంది.
3- కామం, వాత్సల్యంతో కూడిన ప్రేమ. ఇది భార్యతో ఉంటుంది.
4- ఆరాధన, విధేయత భావంతో కూడిన ప్రేమ. అల్లాహ్ పట్ల విధేయత భావంతో కూడిన ప్రేమలో విశ్వాసుల్లో గల పుణ్యపురుషుల ప్రేమ కూడా వస్తుంది. (అంటే వారిని ప్రేమించుట అల్లాహ్ ఆరాధన పాటించినట్లు. ఎందుకనగా వారిని ప్రేమించాలని స్వయంగా అల్లాహ్ యే ఆదేశించాడు).
([2]) అల్లాహ్ తన కొరకు ప్రత్యేకించుకున్న దుఆః
1- ఆరాధన, ప్రశంస పరమైన దుఆః ‘యా జవ్వాద్, యా కరీమ్ (ఓ దాతృతుడా, అనుగ్రహించువాడా)’, ‘సుబ్ హానల్లాహిల్ అజీమ్ (పవిత్రుడైన గొప్పవాడు అల్లాహ్)’, ‘సుబ్ హానక లా ఇలాహ ఇల్లా అంత (నీవు పవిత్రునివి, నీ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు’.
2- ప్రశ్నార్థమైన దుఆః ‘యా రహీమ్ నన్ను కరుణించు’. ఓ అల్లాహ్ నన్ను మన్నించు
([3]) సమాధుల, మజారుల వద్ద ప్రదక్షిణం మరియు జిబహ్ (జంతువు బలి) యొక్క రకాలు క్రింది విధంగా ఉన్నాయిః
1- సమాధిలో ఉన్నవారి గురించి ప్రదక్షిణం, జిబహ్ చేస్తే, అతడు తౌహీద్ (దైవఏకత్వం)కు వ్యతిరేకమైన పెద్ద షిర్క్ చేసినవాడౌతాడు.
2- ఒకవేళ అతని ప్రదక్షిణం అల్లాహ్ కొరకే కాని సమాధివారు లాభ నష్టాలు చేకూర్చే శక్తిగలవారని నమ్మితే అతడు కూడా తౌహీద్ కు వ్యతిరేకమైన, ధర్మ భ్రష్టతకు కారణమయ్యే పెద్ద షిర్క్ చేసినవాడు అవుతాడు.
3- ఒకవేళ అతని ప్రదక్షిణం అల్లాహ్ కొరకే ఉండి సమాధివారి గురించి ఏ ప్రభావ విశ్వాసం లేకుండా ‘ఆ సమాధి వారిది ఉన్నత స్థానం, ఆయన ఆ స్థానం లాభనష్టాలకు కారణం’ అని నమ్మితే, అప్పుడు ఇది షిర్క్ సంబంధిత బిద్అత్ (దురాచారం) అవుతుంది. కాని ధర్మ భ్రష్టతకు కారణమయ్యే పెద్ద షిర్క్ కాదు. పోతే అల్లాహ్ యూదులను, క్రైస్తవులను శపించినట్లు అతను కూడా శాపగ్రస్తుడు అవుతాడు. అలాగే సమాధిని మస్జిదుగా చేసుకున్నవారు కూడా శాపగ్రస్తులు.
([4]) శుభం పొందే రకాలుః
1- ధార్మిక ఆధారం మూలంగా శుభం కోరడం. ఉదాః అల్లాహ్ యొక్క గ్రంథ (పారాయణం చేసి). అందులో అభ్యంతరం లేదు.
2- స్పృహగల విషయాల ద్వారా. ఉదాః ధార్మిక విద్య. స్వయం తమ కొరకు లేదా ఇతరులకు దుఆ. విద్యగల పుణ్యపురుషుని విద్య ద్వారా, అతని వద్ద కూర్చుండి, లేదా అతని దుఆ ద్వారా. అంతేకాని అతని వ్యక్తిత్వం వల్ల అని కాదు.
3- షిర్క్ సంబంధమైన శుభం. ఇది సమాధులతో, మజారులతో కోరడం. వాటిలో ఏలాంటి శుభం లేదు. దానికి ధార్మిక, లౌకిక ఏ ఆధారము లేదు. ఇందులో కొన్ని రకాలు గలవుః
A. ఆరాధనలో ఏ ఒక్క భాగమైన సమాధుల కోసం చేస్తే ఇది తౌహీద్ కు వ్యతిరేకమైన పెద్ద షిర్క్ అవుతుంది.
B. ఆ సమాధులు అతని మరియు అల్లాహ్ మధ్యలో మధ్యవర్తిగా అని నమ్ముతే ఇది కూడా తౌహీద్ కు వ్యతిరేకమైన పెద్ద షిర్క్.
C. అవి మధ్యవర్తిగా కావు, కేవలం శుభం ఉద్దేశం ఉంటే ఇది షిర్క్ సంబంధమైన బిద్అత్. ఇది విధిగా ఉన్న సంపూర్ణ తౌహీద్ కు వ్యతిరేకమైనది.
([5]) ఆయనపై నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి మంచివాటిని పొందుటకు, చెడుల నుండి దూరముండుటకు యోగ్యమైన సాధనాలు ఉపయోగించడం కూడా అల్లాహ్ పై సంపూర్ణ నమ్మకంలో వస్తాయి.
([6]) కడాలు, దారాలు తొడిగి, లాభనష్టాలు అందులో ఉన్నవని విశ్వసిస్తే, ఇది తౌహీదు మరియు సత్య విశ్వాసానికి విరుద్ధం (పెద్ద షిర్క్). ఒకవేళ వాటిని లాభనష్టాలకు ‘సాధనం’ అని నమ్మితే, ఇది ఏకత్వ విశ్వాస సంపూర్ణతకు విరుద్ధం మరియు చిన్న షిర్క్. ఇందువల్ల విశ్వాసంలో కొరత ఏర్పడుతుంది. ఎందుకనగా అది ‘సాధనం’ అని అతని మనస్సులో నాటుకుంది. అయితే నియమం ఏమంటుందంటే: “ఏది ‘సాధనం’ కాదో దానిని ‘సాధనం’ చేసుకొనుట షిర్క్”. అందుకే ధార్మిక నిదర్శనతో ‘సాధనం’ యొక్క రుజువు కావాలి. ఉదాః అసూయపరుని స్నానం నీళ్ళు తీసుకొనుట. లేదా శాస్త్రీయంగా రుజువై యుండాలి. ఉదాః విరిగిన ఎముకను వెదురుబద్దతో నిలపడం, మందుల ఉపయోగం మరియు ధర్మసమ్మతమైన మంత్రం చేయడం. ఈ యోగ్యమైన సాధనాలు ఉపయోగిస్తున్నప్పటికీ మనస్సు మాత్రం అల్లాహ్ పట్ల లగ్నం అయి ఉండాలి. సాధనాలు ఎంత గొప్పవి, బలమైనవిగా ఉన్నా అవి అల్లాహ్ నిర్ణయించిన అదృష్టం, విధివ్రాతకు కట్టుబడి ఉంటాయి.
([7]) సమాధిపై మస్జిద్ నిర్మిచబడితే దానిని పడగొట్టుట లేదా మస్జిదులో సమాధి చేయబడితే శవాన్ని అందులో నుండి తీసి స్మశానం(ఖబ్రిస్తాన్)లో సమాధి చేయుట విధిగా ఉంది. ఇలాగే షిర్క్ ఉపద్రవాల నుండి రక్షణ పొందగలుగుతాము.
([8]) సమాధి వద్ద నమాజు స్థితులుః
1- సమాధి వద్ద నమాజు చేయు వ్యక్తి సమాధి మరియు అందులో ఉన్న వారి గురించి ఏ ప్రత్యేక నమ్మకం లేకుండా, అల్లాహ్ ప్రసన్నత కొరకే, కాని అక్కడ చేయుట ఎక్కువ ఘనత అని భావిస్తే అతను షిర్క్ కు సంబంధించిన బిద్అత్ (దురాచారం) చేసినవాడు, శాపగ్రస్తుడు మరియు సృష్టిలో అతి నీచుడవుతాడు. కాని పెద్ద షిర్క్ కు పాల్పడిన, ఇస్లాం నుండి వైదొలిగినవాడు కాడు.
2- సమాధి వద్ద నమాజు చేయు వ్యక్తి అందులో ఉన్నవారి గురించి లాభాలు చేకూర్చే, నష్టాన్ని తొలిగించేవారని నమ్మి, వారితో మొర పెట్టుకుంటే, వేడుకుంటే అలాంటి వ్యక్తి పెద్ద షిర్క్ కు పాల్పడి, ఇస్లాం నుండి దూరమై, తౌహీద్ కు వ్యతిరేకమైన కార్యం చేసినవాడవుతాడు.
3- ఎవరైతే అజ్ఞానంతో సమాధి వద్ద నమాజ్ చేశాడో, అక్కడ సమాధి ఉన్నదని కూడా అతనికి తెలియదో అతని ఆ నమాజ్ సహీ అగును. అతడు పాపాత్ముడు కాడు.
([9]) ప్రవక్త సమాధినుద్దేశించి మదీన ప్రయాణం చేయుట నిషిద్ధము. స్వయంగా ప్రవక్తయే దీనిని నిషేధించారు. ఇలా చేయుట ఒక పండుగగా, ఉత్సవంగా అయిపోతుంది. ఇలా చేయువాడు హదీసు ఆధారంగా శాపగ్రస్తుడవుతాడు.
([10]) చిత్రాలు చిత్రించడం అల్లాహ్ రుబూబియత్ లో జుల్మ్ (అన్యాయం, దౌర్జన్యాని)కి పాల్పడినట్లగును. సృష్టించుట, ఆదేశించుటలో అల్లాహ్ ఏకైకుడు, ఆయనకు ఎవ్వరూ భాగస్వామి లేరు. ]వినండి! సృష్టించుట, ఆదేశించుట ఆయన పనియే. సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ చాలా శుభము గలవాడు. (ఆరాఫ్ 7: 54).
([11]) అల్లాహ్ యేతరుల కొరకు చేసే జంతు బలి రెండు రకాలుగా ఉంటుందిః
1- సన్నిధానం పొందుటకు, గౌరవభావంతో, ఆరాధన ఉద్దేశంతో చేయుట. అందులో అతని నుండి ఎదైనా మేలు ఆశిస్తూ, లేదా అతని నుండి కీడు కలగవద్దన్న భయంతో చేయుట. ఇది పెద్ద షిర్క్. ఇస్లాం నుండి బహిష్కరణకు కారణం. తౌహీద్ కు వ్యతిరేకం. ఉదాహరణకుః ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత జంతు బలి ఇచ్చి, దానిని ఇంట్లో ఉంచుట, జిన్, షైతానుల కీడు నుండి రక్షణ ఉద్దేశంతో దాని రక్తాన్ని గోడలకు పూయుట.
2- ఎవరైనా అతిథి, బందువు వచ్చినప్పుడు అల్లాహ్ ప్రసన్నత ఉద్దేశంతో జంతువును కోయుట ఇది ధర్మసమ్మతం.
([12]) మ్రొక్కుబడుల రకాలు:=
1- అల్లాహ్ కొరకు ఆయన విధేయతలో ఉన్న మ్రొక్కుబడిని నెరవేర్చాలి. కాని అల్లాహ్ కొరకే అయినప్పటికీ అది ఆయన అవిధేయతలో ఉన్న దానిని నెరవేర్చరాదు.
2- అల్లాహ్ యేతరుల కొరకు మ్రొక్కుకున్న మ్రొక్కుబడి విధేయతలో ఉన్నా అవిధేయతలో ఉన్నా నెరవేర్చరాదు. ఇది షిర్క్ అవుతుంది. ఎలా అనగ మ్రొక్కుబడి ఆరాధన (ఇబాదత్). దానిని కేవలం అల్లాహ్ కు మాత్రమే చేయాలి.
([13]) ఆపదలు దూరమగటకు, సుఖాలు ప్రాప్తించుటకు ధర్మపరమైన మాధ్యస్థములు మూడు రకాలుగా ఉన్నాయిః
1- అల్లాహ్ యొక్క శుభ నామములు, ఉత్తమ గుణాలు. ఉదాహరణకుః ఓ కరుణామయా! నన్ను కరుణించు. ఓ పాపాలను క్షమించేవాడా! నన్ను క్షమించు.
2- నిజ విశ్వాసం మరియు సత్కార్యాలు. ఉదాహరణకుః ఓ అల్లాహ్! నేను నిన్ను విశ్వసించాను కనుక నీవు నాపై దయతలచు. ఓ అల్లాహ్ నీ ప్రవక్త పట్ల నాకు ప్రేమ ఉంది కనుక నీవు నన్ను క్షమించు.
3- పుణ్యపురుషుడైన ముస్లిం వ్యక్తి దుఆ.
([14]) పరిహాసమాడుతూ తిరస్కరించుట, విడనాడి తిరస్కరించుటకంటే మరీ చెడ్డది. ఉదాః నమాజు వదిలే వ్యక్తి, లేదా విగ్రహానికి సాష్టాంగపడే వ్యక్తి కేవలం తిరస్కారానికి గురవుతాడు. కాని పరిహసించే వ్యక్తి తిరస్కారంతో పాటు పరిహాసానికి గురవుతాడు.
([15]) ధర్మవేత్తలతో, ధర్మంపై నడిచేవారితో మరియు ధర్మం వైపునకు పిలిచేవారితో పరిహాసమాడేవారు రెండు రకాల భ్రష్టత్వానికి గురి అవుతారు.
1- అతని ఉద్దేశ్యంలో నేరుగా ధర్మాన్ని, రుజువైన ప్రవక్త సంప్రదాయాల్ని; ఉదాః గడ్డం ఉంచడం, లుంగీ, లాగు చీలమండలానికి పైకి ధరించడం లాంటివి ఉంటే ఇది కుఫ్ర్ (సత్యతిరస్కారం) అవుతుంది. అంతే గాకుండా ఒక ముస్లిం సోదరుడ్ని హీనపరచడం అన్నది అతను (హీనపరిచేవాడు) చెడు అన్నదానికి నిదర్శనం.
2- అతడు వారి ధార్మిక జీవన శైలిని గాకుండా వారిని, వారి కొన్ని చేష్టల్ని ఉద్దేశించి పరిహసిస్తే పాపాత్ముడవుతాడు కాని కాఫిర్ కాడు.
([16]) అల్లాహ్ అవతరించినది కాకుండా ప్రజా నిర్మిత చట్టాలు అవలంబించేవారివి మూడు స్థితులుః
1- అల్లాహ్ యేతరుల చట్టాలతో తీర్పు చేసేవాడు అల్లాహ్ అవతరించిన చట్టం ఈ కాలంలో చెల్లదని, లేదా అది గాకుండా వేరేటివే ఉత్తమం అని, లేదా అది అసంపూర్ణమైనది, అన్యాయం, కఠినత్వంతో కూడినది అని నమ్మితే అతడు అవిశ్వాసి అయినట్లే, ఇస్లాం నుండి వైదొలగినట్లే, ధర్మభ్రష్టతకు గురి అయినట్లే. ఇంకా అతడు ఘోర విచ్ఛిన్నకారుడు మరియు అల్లాహ్ తో పోరాటానికి దిగినవాళ్ళల్లో అతి నీచుడు.
అల్లాహ్ అవతరించిన చట్టం ప్రకారం తీర్పు చేయనివారే అవిశ్వాసులు. (మాఇద 5: 44). [وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللهُ فَأُولَئِكَ هُمُ الكَافِرُونَ].
2- ఎవరైతే అల్లాహ్ అవతరించిన చట్టమే అతిఉత్తమమైనదని, సంపూర్ణమైనదని నమ్మి కూడా తన కోరిక తీర్చుకొనుటకు లేదా ఏదైనా వాంఛకు లోనై, వేరే చట్ట ప్రకారం తీర్పు చేస్తే అతడు అవిశ్వాసి కాడు, ధర్మభ్రష్తతకైతే అంతకూ గురికాడు. పోతే అల్పవిశ్వాసిగా మరియు అల్లాహ్ ఇష్టానికి వ్యతిరేక మార్గాన్ని అవలంబించినవాడవుతాడు.
అల్లాహ్ అవతరించిన చట్టం ప్రకారం తీర్పు చేయనివారే దుర్మార్గులు. (మాఇద 5: 47). [وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللهُ فَأُولَئِكَ هُمُ الفَاسِقُونَ].
3- అల్లాహ్ అవతరించినదానితో తీర్పు చేయుటయే విధిగా అని నమ్మి కూడా దౌర్జన్యపరుడైన అధికారి, రాజుకు లేదా కరడుగట్టిన శత్రువులకు భయపడి వేరే చట్టాల ప్రకారం తీర్పు చేస్తే అతడు తన పట్ల అన్యాయం చేసుకున్నవాడు మరియు అసంపూర్ణ విశ్వాసిగా పరిగణింపబడతాడు.
అల్లాహ్ అవతరించిన చట్టం ప్రకారం తీర్పు చేయనివారే దౌర్జన్యపరులు, అన్యాయులు.(మాఇద 5: 45).[وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللهُ فَأُولَئِكَ هُمُ الظَّالِـمُونَ].
([17]) పంచాంగకర్తలను సత్యపరచువాడు అవిశ్వాసుడవుతాడు. ఎందుకనగా ఏ అగోచరజ్ఞానం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకముగా ఉందో, అందులో ఏ ఒక్కరికి రవ్వంత జోక్యం లేదని వచ్చిన స్పష్ట మైన ఆయతుల మరియు సహీ హదీసులను వ్యతిరేకిస్తున్నట్లు జరుగుతుంది. అగోచరజ్ఞానం అల్లాహ్ కు తప్ప ఎవ్వరికీ లేదు. అలాగే పంచాంగకర్త సత్యవంతుడా, అబద్ధాలకోరుడా అని అనుమానించేవాడు కూడా అవిశ్వాసానికి పాల్పడుతాడు. ఎలా అనగా అగోచరజ్ఞాన బీగములు అల్లాహ్ తప్ప ఇతరుల వద్ద ఉన్నాయని అనుమానించాడు గనక.
([18]) కక్ష్యల మరియు గ్రహాల విద్యభ్యాసం రెండు రకాలుగా ఉంటుందిః
1- విత్తనాలు చల్లే కాలం, రుతువుల ఆరంభం తెలియుటకు. అయితే అందులో వాటి ప్రభావం ఉందన్న నమ్మకం ఉండకూడదు. అల్లాహ్ ఆజ్ఞతో వాటిని ఒక గుర్తు, చిహ్నంగా భావించాలి. ఈ ఉద్దేశ్యంతో అభ్యాసంలో ఏ అభ్యంతరం లేదు.
2- భూసంఘటనలపై వాటి ప్రభావం ఉంటుందని, లేదా గ్రహాల స్థితిగతులు సయితం వాటితో ముడిపడి ఉన్నాయని నమ్ముట. ఉదాహరణకుః ‘ఫలాన తారలో మీ వివాహంలో శుభం కలగదు’ లేదా ‘ఫలాన తారలో మీ వ్వాపారంలో శుభం కలుగుతుంది’ అని. అయితే ఇలాంటివి అవిశ్వాసం క్రింద లెక్కించబడతాయి. ఎందుకనగా అల్లాహ్ కు ప్రత్యేకముగా ఉన్న అగోచరజ్ఞానంలో దౌర్జన్యమగును.
([19]) తారల ద్వారా వర్షం కోరడం ఈ రకంగా ఉంటుందిః
1- తారల ద్వారానే వర్షం కోరడం. ఇది రుబూబియత్ మరియు ఉలూహియత్ లో షిర్క్ అవుతుంది. ఎలా అనగా సృష్టించే మరియు ఉనికిలోకి తెచ్చే శక్తి అల్లాహ్ కే కాకుండా ఇతరులలో ఉంది అని నమ్మడం వల్ల. ఇది తౌహీద్ కు బద్ధ విరుద్ధం.
2- వర్షం కుర్పించే కార్యాన్ని అల్లాహ్ వైపు కాకుండా తారల వైపే అంకితం చేయడం. ఇది తౌహీద్ కు వ్యతిరేకమైన ఘోరమైన షిర్క్.
3- వాటి వల్లనే వర్షం కురిసిందని, వర్షం కురువడానికి అవి సబబు అని అనడం. అయితే అల్లాహ్ దేనిని కారణం, సబబుగా చేయలేదో దానిని సబబుగా నమ్మడం క్రింద లెక్కించబడుతుంది. ఇలా అల్లాహ్ పై దౌర్జన్యం చేసినట్లవుతుంది. అయినా ఇది చిన్న షిర్క్. తౌహీద్ సంపూర్ణతకు వ్యతిరేకం కాని ధర్మభ్రష్టతకు కారణం కాదు.
([20]) నక్షత్రం వైపు వర్షం అంకితం మూడు రకాలుగా ఉంటుంది.
1- సృష్టించే, ఉనికిలోకి తెచ్చేది ఆ నక్షత్రం అని. ఇది పెద్ద షిర్క్.
2- కారణ సంబంధమైనది. ఇది చిన్న షిర్క్.
3- కాలం, సమయం తెలుపునది. ఇది యోగ్యం. అయితే ఫలాన నక్షత్రం “వల్ల” అనే బదులు “ఫలాన నక్షత్రం పొడిసినప్పుడు” అని అనాలి.
([21]) మనిషి ఆకలిగా ఉన్నప్పుడు అతని కడుపులో ఒక పురుగు దూరి తీవ్ర క్షోభకలిగిస్తుంది అన్న మూఢ నమ్మకాన్ని ఇస్లాం కొట్టి పారేసింది. అయితే ఈ మూఢనమ్మకాన్నే వారు ‘సఫర్’ అని అనేవారు.
([22]) అల్లాహ్ నిర్ణయించిన దాని ప్రకారం ఏవైనా ఆపదలు వస్తే అయిష్టత, కోపం ప్రదర్శించుట సంపూర్ణ తౌహీద్ కు విరుద్ధం. ఒక్కోసారి ఇదే స్థితిలో మనిషి ఏదైనా కుఫ్ర్ మాట (అవిశ్వాస పలుకులు) పలికితే లేదా కుఫ్ర్ (అవిశ్వాసానికి గురి చేసే) పని చేస్తే, ఈ చేష్టే తౌహీద్ పునాదినే కూల్చేస్తుంది.
([23]) ఆపద వచ్చినప్పుడు విధిగా పాటించవలసిన విషయాలు ఇవిః
1- కంగారుపడకుండా, ఆందోళన చెందకుండా తనకుతాను సహనం వహించాలి.
3- తన శరీరఅవయవాలను కూడా అదుపులో ఉంచుకోవాలి. చెంపలు బాదుకోరాదు. దుస్తులు చించుకోరాదు. వెండ్రుకలు పీక్కోరాదు. తలపై దుమ్మెత్తి పోసుకోరాదు. ఇంకా ఇలాంటి ఏ పని చేయకూడదు.
([24]) కాలాన్ని దూషించడం మూడు రకాలుగా ఉంటుందిః
1- తౌహీద్ కు వ్యతిరేకమైన ఘోరమైన షిర్క్. కొందరు ఇలా అంటారుః ‘కాలం పాడుగాను’, ‘ఈ రాత్రి విపరీతమైన వేడి గలది’, ‘మహా చల్లని రాత్రి’, ఇలాంటి మాటలు అన్నప్పుడు వేడి, చలిను పుట్టించేది
కాలం, రాత్రి అని నమ్మితే ఇదే ఘోరమైన షిర్క్.
2- కాలం సృష్టికర్త అల్లాహ్ అని నమ్మినప్పటికీ విపరీతమైన వేడి, లేదా చలి ఉన్నప్పుడు యమకోపంతో, ఓపిక లేకుండా, దానిని భరించడం లో పుణ్యం అన్న విషయం మరచి, అల్లాహ్ వ్రాసిన విధివ్రాత మీద ఆగ్రహంతో ప్రవర్తించుట లేదా దాని వార్త ఇతరులకు ఇచ్చుట. ఈ ప్రవర్తన సరియైనది కాదు. ఇందువల్ల మనిషి పాపానికి గురవుతాడు.
3- మంచి విశ్వాసం మరియు సదుద్దేశంతో ఎలా ఉంది వాతవరణం అంటే సమాధానంగా చలి ఉంది అని వేడి ఉంది అని ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉంది అని తెలుపుతే ఈ పద్ధతి సరైనది. ఇందులో ఏలాంటి పాపము లేదు.
([25]) కాలాన్ని, భూమిని, జడపదార్థాల్ని మరియు ఇతర సృష్టిని దూషించుట అల్లాహ్ ను దూషించినట్లు. ఎందునగా అది వాస్తవానికి వాటిని ఉనికిలోకి తెచ్చినవారిని దూషించినట్లు. ఉదాహరణకుః నీవు ఒక ఇల్లును దాని బలహీన నిర్మాణం వల్ల లేదా ఏదైనా వాహనాన్ని అది మంచిగా లేనందుకు దూషించావంటే వాస్తవానికి దానిని చేసినవానిని దూషించినట్లు. అందుకే ఈ చేష్టకు దూరంగా ఉండి భయపడాలి.
([26]) సామాన్య రీతికి భిన్నంగా వెలువడే కొన్ని పనులు, కొందరి పుణ్యాత్ముల ద్వారా అల్లాహ్ ప్రత్యక్షపరుస్తాడు. అయితే ప్రవక్తలతో సంభవించిన మహిమలకు సమానమైనవి అవి ఎంతమాత్రం కావు. మహిమల్లో ఛాలెంజ్ ఉంటుంది. కాని కరామతులో ఉండదు.
25.34980855.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సంతాన శిక్షణకై తల్లిదండ్రులకు మార్గదర్శి అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) రచయిత : Adil bin al Ashuddi عادل بن علي الشدي అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
చాల మంచి వీడియో, ప్రతి ఒక్కరూ వినవలసిన వీడియో, ఎన్నో విషయాలు షేఖ్ గారు ఖురాన్ మరియు హదీసుల వెలుగులో చాలా చాలా చక్కగా వివరించారు, అల్హందులిల్లాహ్. తప్పక విని ప్రయోజనం పొందండి మరియు మీ బంధు మిత్రులకు షేర్ చెయ్యండి, ఇన్షా అల్లాహ్. [1:27: 39 నిముషాలు]
సంతాన శిక్షణకై ప్రవక్త పద్ధతిలోని సూచనలు – విషయ సూచిక
విశ్వాసం పట్ల శ్రద్ధ
నమాజు పట్ల శ్రద్ధ
ముందు జాగ్రత్త వైద్యం కంటే మేలు
ఆవేదన వెలిబుచ్చే అవకాశమిచ్చుట
సమంజసమైన మందలింపు
ఆత్మ విశ్వాసం, ఆత్మ స్థైర్యం నేర్పుట
సధ్వర్తన నేర్పుట
సధ్వర్తునలకు బహుమానం
పిల్లల్ని ప్రేమిస్తున్నానని తెలియజేయుట
సంతానం మధ్య న్యాయం
క్రియాత్మక ఆదర్శంతో కూడిన శిక్షణ
సంతాన శిక్షణలో జరిగే పొరపాట్లు
శిక్షణ పట్ల నిర్భాధ్యత
తండ్రుల ఆధిపత్యం
వైరుద్ధ్య ఆదర్శం
కఠినత్వం
చెడును చూసి నిర్లక్ష్యం చేయడం
యధా పూర్వ పరిస్థితిని వదలటం
తప్పును ఒప్పుకోకపోవడం
వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవడం
ప్రత్యేకతలను గౌరవించక పోవడం
దూర దూరంగా ఉంచడం
సంతాన శిక్షణలో 130 మార్గాలు
విశ్వాసం
ఆరాధన
ప్రవర్తన
సభ్యత సంస్కారం
శారీరక నిర్మాణం
మానసిక నిర్మాణం
సామాజిక నిర్మాణం
ఆరోగ్యకరమైన నిర్మాణం
సంస్కృతి మరియు విద్యాపరమైన శిక్షణ
సత్పలితం, దుష్పలితం
[పూర్తి పుస్తకం క్రింద చదవండి]
సంతాన శిక్షణకై ప్రవక్త పద్ధతిలోని సూచనలు
అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా ఖుద్వతిస్సాలికీన్, వఅలా ఆలిహీ వసహబిహీ అజ్మఈన్, అమ్మాబఅద్:
ఇది ఓ శిక్షణ పుస్తకం. ఇది మన సమాజములోని పిల్లల శిక్షణ స్థాయిని పెంచుటకు దోహదపడుతుంది. అందుకు ఈ([1]) తొలి చిరు పుస్తకంలో “సంతాన శిక్షణకై ప్రవక్త పద్ధతిలోని సూచనలు” అనే శీర్షికను పొందుపరుచుటయే సహజం. ఎందుకనగాః
పిల్లల, టీనేజరుల శిక్షణలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ఉత్తమ పద్ధతి అవలంబించిన వారు సర్వమానవాళిలో ఎవ్వరూ లేరు.
మనం మన జీవిత సర్వ వ్యవహారాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను అనుసరించాలని అల్లాహ్ ఆదేశం ఉంది. వాటిలో పిల్లల, టీనేజరుల (యుక్తవయస్కుల) శిక్షణ అతిముఖ్యమైనది. అల్లాహ్ ఆదేశం:
“నిశ్చయంగా అల్లాహ్ యొక్క ప్రవక్తలో మీకు ఒక మంచి ఆదర్శం ఉంది; అల్లాహ్ పై, అంతిమ దినంపై నమ్మకం కలిగి ఉన్నవారికి”. (అహ్ జాబ్ 33: 21).
మనలో అనేక మంది తమ సంతాన శిక్షణ విషయంలో ప్రవక్త పద్ధతికి చాలా దూరంగా ఉన్నారు.
మనలో అనేక మంది -ప్రత్యేకంగా కొన్ని విషయాల్లో ప్రత్యేకత కలిగి ఉన్నవారు- పాశ్చాత్యుల సిద్ధాంతాలను, విధానాలను ఆశ్చర్యకంగా, ఆదర్శవంతమైనవిగా భావిస్తున్నారు. అయితే ఆ సిద్ధాంతాల్లో, విధానాల్లో అనేక విషయాల మూలం మన ప్రవక్త పద్ధతిలో ఉన్న విషయం వారికి తెలియదు.
1. విశ్వాసం పట్ల శ్రద్ధ
ఇది ప్రతి ముస్లిం శిక్షకునిపై ఉన్న తొలి బాధ్యత. అల్లాహ్ ఈ ఉద్దేశ్యంతోనే సృష్టిని సృష్టించాడు. అల్లాహ్ ఆదేశం చదవండిః
“మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరిక చేశాము: ‘అల్లాహ్ ను ఆరాధించండి. మిథ్యా దైవాల ఆరాధనకు దూరంగా ఉండండి”. (నహ్ల్ 16: 36).
పిల్లల మరియు టీనేజరుల హృదయాలు ఏ భాగస్వామి లేని ఏకైక అల్లాహ్ పట్ల అంకితం అయి ఉండాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కాంక్షించేవారు. చిన్నారి అయిన ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ఉపదేశంలో ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.
“నీవు అల్లాహ్ (దర్మం)ను కాపాడు అల్లాహ్ నిన్ను కాపాడతాడు. నీవు అల్లాహ్ (ధర్మం)ను కాపాడు నీవు అల్లా హ్ ను నీ ముందు పొందుతావు. (అంటే ఎల్లవేళల్లో అతని సహాయం నీ వెంట ఉంటుంది). [ఆనంద ఘడియల్లో నీవు ఆయన్ని జ్ఞాపకముంచుకో, ఆపద సమయాల్లో ఆయన నిన్ను జ్ఞాపకముంచుకుంటాడు] ఏదైనా అడగవలసినప్పుడు అల్లాహ్ తో మాత్రమే అడుగు. సహాయం కోరవలసినప్పుడు అల్లాహ్తో మాత్రమే సహాయం కోరు. తెలుసుకో! ప్రపంచవాసులంతా కలసి నీకేదైనా లాభం చేగూర్చుదలచితే అల్లాహ్ వ్రాసి ఉంచినది తప్ప ఏ లాభం చేగూర్చలేరు. వారంతా కలసి నీకేదైనా నష్టం కలిగించాలన్నా అల్లాహ్ వ్రాసి ఉంచినది తప్ప ఏ నష్టమూ కలిగించలేరు. (విధి వ్రాత వ్రాసే) కలములు లేపబడ్డాయి. (ఇక ఏమీ వ్రాయవు). ఆ పత్రాలు ఎండిపోయినవి (అంటే అందులో ఏ మార్పు కూడా ఇక జరుగదు. [సహనం వెంటే సహాయం ఉంటుంది. కలిమితో పాటే లేమి ఉంటుంది]“. (తిర్మిజి, 2516. సహీ ముస్నద్ అహ్మద్ 1/308).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా పిల్లల విశ్వాసం పట్ల శ్రద్ధ చూపేవారు. ఈ రోజుల్లో మనలోని అనేక మంది విశ్వాసం మరీ అందులో విధివ్రాతపై విశ్వాసం పట్ల మరియు సర్వ వ్యవహారాలు అల్లాహ్ చేతులో ఉన్నాయనే దాని పట్ల చాలా అశ్రద్ధగా ఉన్నారు. వారు దీని ప్రకారం తమ సంతానానికి శిక్షణ ఇవ్వడం లేదు.
2. నమాజు పట్ల శ్రద్ధ
ప్రవక్త ఇచ్చిన శిక్షణలో వచ్చిన ఒక గొప్ప సూచన ఇలా ఉందిః
“మీ పిల్లలు ఏడు సంవత్సరాల వయసుకు చేరుకున్నప్పుడు మీరు వారికి నమాజు గురించి ఆదేశించండి. పది సంవత్సరాలకు చేరు కున్నప్పుడు దాని గురించి వారిని దండించండి”. (అబూ దావూద్ 495).
ఈ నమాజు విషయంలో తప్ప మరే విషయంలోనైనా దండించే ఆదేశం ఏదైనా హదీసులో ఉందా? నాకు తెలిసిన ప్రకారం లేదు. ఇది నమాజు ప్రాముఖ్యత మరియు దాని పట్ల గల తాకీదు వల్లనే. ఈ దండించడం కూడా పిల్లవాడు బుద్ధిగలవాడై (అంటే ఏడేళ్ళవాడై) అతనికి నమాజు ఆదేశమిచ్చిన తర్వాత 1080 రోజులకు వచ్చింది. ఈ వ్యవధిలో సుమారు 5400 సార్లు నమాజు ఆదేశం మరీమరీ ఇవ్వడమే కాకుండా పిల్లవాడు తన తల్లిదండ్రులను అనేక సార్లు నమాజు చేస్తూ ఉన్నది చూస్తూ ఉంటాడు.
సంతానం చెడిపోవడం గాని, వారు అవిధేయులవడం గాని, చదువే భాగ్యం కలగకపోవడం గాని, వీటన్నిటికి నమాజు చేయడం, చేయకపోవడం మరియు దానిని కాపాడడంతో నేరుగా సంబంధం కలిగి ఉన్నది. సంతాన సద్వర్తన మరియు వారి ఉన్నత విద్యలో నమాజు ప్రభావంపై గనక శిక్షణపరమైన సైంటిఫిక్ పరిశోధన జరిగితే నమ్మశక్యం కలిగే ఫలితం వెలువడుతుంది. సంపూర్ణ సాఫల్యానికి నమాజు సంబంధం లోతుగా ఉందని తెలుస్తుంది.
3. ముందు జాగ్రత్త వైద్యము కంటే మేలు
పిల్లల మరియు టీనేజరుల పట్ల ప్రవక్త గారి శిక్షణ విధానంలో వైద్యము కంటే ముందు జాగ్రత్తే ప్రధానంగా ఉండేది. అల్లాహ్ దయతో ఇలాంటి శిక్షణ సంతానం అపాయాల్లో పడకుండా ఉండటానికి పటిష్ఠమైన అడ్డుగా నిలుస్తుంది.
ఈ నాటి శిక్షణలో మన స్పష్టమైన తప్పు ఏమిటంటే మనం ముందు జాగ్రత్తను విడనాడి అశ్రద్ధగా ఉంటాము, మరెప్పుడైతే మన పిల్లలు ఏదైనా అపాయానికి గురవుతారో అప్పుడు దాని చికిత్స కొరకు ప్రయత్నం చేస్తాము.
ఈ సందర్భంగా మనం, పదేళ్ళ పిల్లల గురించి “వారి పడకలను వేరుగా చేయండి” [وَفَرِّقُوا بَيْنَهُمْ فِي الْمَضَاجِعِ అబూ దావూద్ 495 సహీ] అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన ఆదేశాన్ని పసిగట్టగలం. అలాగే ఓసారి ఫజ్ల్ బిన్ అబ్బాస్ అను ఓ నవయువకుడిని ప్రవక్త తమ వెనక వాహనముపై ఎక్కించుకున్నారు. అక్కడ ఖస్అమియా వంశానికి చెందిన ఓ స్త్రీ వచ్చి ఏదో ప్రశ్న ప్రవక్తతో అడుగుతుంది. అప్పుడు ఆ నవయువకుడు తదేకంగా ఆమె వైపే చూస్తున్నాడు. ఇది గమనించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే అతని ముఖాన్ని మరో వైపు మరలించారు. (బుఖారీ 1513).
ముందుజాగ్రత్తను విడనాడుటలోని కొన్ని రూపాలు ఇవి: ఏ కట్టుబాట్లు లేకుండా కొడుకులు, కుమార్తెలు టీవీ ఛానళ్ళు చూడడం. వాటిలో కొన్ని ప్రోగ్రాములు తుచ్ఛమైనవి అయితే మరికొన్ని ఆలోచన, నడతలో ఘోర ప్రమాదాల్ని తెచ్చి పెడతాయి. ఏ ఆటంకము లేకుండా వారు ఇష్టమున్నవారితో ఇంటర్నెట్టుల ద్వారా సంబంధాలు ఏర్పరుచు కొనుట. ఏలాంటి పర్వవేక్షణ, అప్రమత్తత లేకుండా సెల్ ఫోన్ల ఉపయోగం. ఇలాంటి పనులు విచ్చలవిడిగా జరుగుతున్నప్పుడు ప్రవక్త గారి ముందుజాగ్రత్త పద్ధతిని ఎక్కడ అనుసరిస్తున్నట్లు మనం?
ఈ పరికరాల ఉపయోగంలో వారి వయస్సు, వారి మానసిక ఎదుగుదలను గమనిస్తూ ఉండటం చాలా అవసరం. ఉదాహరణకుః ఇంటర్నెట్, కొడుకు లేదా కూతుళ్ళ బెడ్ రూంలోనే ఎందుకు? ఎలాంటి పర్వవేక్షణ లేకుండా అన్ని వేళల్లో ఎందుకు దానిని వారు ఉపయోగించడం? అందరి దృష్టిలో ఉండే విధంగా అది హాలులో ఎందుకు ఉంచరాదు? దానిని అందరూ ఎందుకు ఉపయోగించలేరు? తండ్రి మరియు తల్లికి కొడుకు మరియు కూతుళ్ళు వాడే వాటి కోడ్ లు ఎందుకు తెలియకూడదు? అయితే తల్లిదండ్రులు ఉత్తమ పద్ధతిలో వారికి బోధించాక, (ఇంటర్నెట్ లాభనష్టాలు వారికి తెలిపాక) పర్యవేక్షణ జరపాలి.
4. ఆవేదన వెలిబుచ్చే అవకాశమిచ్చుట
ఓ రోజు ఏ కొడుకైనా తన తండ్రి వద్దకు వచ్చి “మత్తు సేవించుటకు, డ్రగ్స్ ఉపయోగించుటకు లేదా వ్యభిచారం చేయుటకు -అల్లాహ్ మనందరిని వీటి నుండి కాపాడుగాక!- నాకు అనుమతివ్వండి అని తండ్రిని అడుగుతే, సమాధానం ఏముంటుందని భావిస్తారు? సామాన్యంగా ఇలాంటి దురాలోచనగల కొడుకులు స్పష్టంగా ఎన్నడూ తమ తండ్రులతో సలహా తీసుకోరు, తమ స్నేహితుల వైపే మరలుతారు. వారు వారి అల్ప అనుభవం, తక్కువ జ్ఞానం వల్ల చెడుకే సహాయపడతారు. కాని ఇలాంటి ప్రశ్న ఎదురైన చోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేరే పద్ధతి అనుసరించారు. అబూ ఉమామ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఒక యువకుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ప్రవక్తా! నాకు వ్యభిచరించే అనుమతివ్వండి అని అడిగాడు. దానికి అక్కడున్న ప్రజలు అతడ్ని గద్దించి చీవాట్లు పెట్టారు. కాని ప్రవక్త అన్నారుః అతడ్ని నా దగ్గరికి తీసుకురండి. అతడు దగ్గరికి వచ్చాక, కూర్చోమన్నారు. అతడు కూర్చున్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారుః “నీవడిగిన విషయం నీ తల్లితో జరిగితే నీవు ఇష్టపడతావా?” లేదు, అల్లాహ్ సాక్షిగా! నేను మీ కొరకు అర్పితులయ్యే భాగ్యం అల్లాహ్ నాకు ప్రసాదించు గాక! అని అతడన్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ప్రజలు కూడా తమ తల్లులతో ఈ వ్యవహారం ఇష్టపడరు” అని చెప్పి “నీ చెల్లి, నీ కూతురు, నీ మేనత్త, నీ పినతల్లులతో ఈ వ్యవహారం ఇష్టపడతావా” అని అడిగారు. ఆ యువకుడు అదే సమాధానం పలికాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ (శుభ) హస్తం అతని మీద పెట్టి ఇలా దుఆ ఇచ్చారుః
“అల్లాహ్! ఇతని పాపాల్ని మన్నించు. ఇతని హృదయాన్ని శుద్ధ పరచు. ఇతని మర్మాన్ని (మానాన్ని) కాపాడు”. (అహ్మద్ 5/256, బైహఖీ షుఅబ్ 5415లో, సహీహా 370)
ఇక్కడ గమనించండి, ప్రవక్త యువకుని ఆలోచన విధానాన్ని ఎలా మల్లించారో, అతను ఆలోచించలేని కోణాలను ఎలా స్పష్ట పరిచారో. మాట్లాడి, తన ఆవేదన వెళిబుచ్చే స్వేఛ్ఛ ప్రవక్త ఇస్తారన్న నమ్మకం అతనికి ఉన్నందుకే సృష్టిలో అతి పరిశుద్ధులైన వారితోనే ఈ ప్రశ్న అడుగుటకు ధైర్యం చేశాడు.
దీనికి భిన్నంగా ఒక తండ్రి నవయువకుడైన తన 16 సం. కొడుకును ఇంటి నుండి తరిమి వేశాడు. దీనికి కారణం: ఇంటికి ఆలస్యంగా ఎందుకు వచ్చావని ఒకసారి తన తండ్రి అడిగిన ప్రశ్నకు ‘నేను స్వతంతృడిని’ అన్న ఒక్క పదం పలికే ధైర్యం అతడు చేశాడు. తండ్రి ఇంటి నుండి గెంటివేసినందుకు తన బంధువుల వద్దకు వెళ్ళి కొద్ది రోజులు గడిపాడు. ఆ తర్వాత తండ్రి కొడుకుల మధ్య సంధి కుదిరింది. అయితే తండ్రి కొడుకుల మధ్య స్పష్టమైన సంభాషణపై నిలబడే ప్రేమపూర్వకమైన సంబంధం చెడిపోయిన తర్వాత. ఓ రకంగా కొడుకు తప్పు చేశాడు. కాని తండ్రి తప్పు దానికంటే పెద్దది.
ఈ రోజుల్లో సంతానంతో సంభాషించే, మాట్లాడే మరియు వారి ఆవేదనలు, అవసరాలను (ప్రేమపూర్వకంగా) వినే అవసరం చాలా ఉంది. కాని అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతి ప్రకారం, దాని ఓ కోణాన్ని పైన తెలుపడం జరిగింది. ఫిర్ఔన్ పద్ధతి ప్రకారం కాదు. వాడన్నాడుః ]నాకు సముచితంగా తోచిన సలహానే మీకు ఇస్తున్నాను. సక్రమైన మార్గం వైపునకే నేను మిమ్మల్ని నడుపుతున్నాను. (మోమిన్ 40: 29). ఈ పద్ధతి ద్వారా పిల్లలపై ఒత్తిడి వేస్తే వారు దాన్ని ఒప్పుకోరు.
5. సమంజసమైన మందలింపు
మందలింపు విషయంలో ప్రజలు హెచ్చుతగ్గులకు గురయ్యే వారితో పాటు మధ్యరకమైన వారు కొందరున్నారు. కొందరు అతిగా ప్రేమించి వారిని ఏ మాత్రం మందలించరు. ఇది ఓ రకమైన నిర్లక్ష్యం. ఇది సవ్యమైన విధానం కాదు. ఇంకొందరు ప్రతీ చిన్న పెద్ద దానిపై గట్టిగా మందలిస్తారు. ఇది కూడా మెచ్చుకోదగిన విధానం కాదు. మధ్యరకమైన విధానమే ప్రవక్తవారి విధానం.
నవయువకుల తప్పిదాలపై ప్రవక్తగారు మందిలించేవారు, అయితే ఆ మందలింపు హెచ్చుతగ్గులకు అతీతంగా మధ్యరకంగా ఉండేది. అది ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండేది కాదు. తప్పు, దాని అపాయ పరిమాణాన్ని బట్టి మారేది. తప్పు చేసినవాడు తెలిసి కావాలని చేశాడా? లేదా చేసి పశ్చాత్తాపం పడ్డాడా? తెలియక చేశాడా? తెలిసి చేశాడా? ఇలాంటి ఇంకెన్నో రకాలుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవయువకుల శిక్షణలో శ్రద్ధ వహించే వారు. ఇలాంటి ఓ మందలింపు ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హుతో జరిగింది. అతను ఓ యువకుడు. ఒక మస్జిదులో సామూహిక నమాజు చేయించే ఇమాం కూడాను. ఒకసారి చాలా దీర్ఘంగా నమాజు చేయించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారుః “జనాన్ని చిక్కుల్లో పడవేసి ధర్మం పట్ల వారికి వెగటు కలిగించ దలిచావా?” (బుఖారి 705, ముస్లిం 6106). అతను చేసిన తప్పుపై ఊర్కోలేదు. అలా అని అతని తప్పుకు మించి మందలించలేదు.
ఒక్కోసారి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మౌనం వహించి, ముఖవర్చస్సుపై కోపం వ్యక్తం చేసి సరిపుచ్చుకునేవారు. ఇలాంటి ఓ ఘటన మాతృమూర్తి ఆయిషా రజియయల్లాహు అన్హా ఉల్లేఖించారుః ఆమె చిత్రాలున్న ఓ దిండు ఖరీదు చేశారు. ప్రవక్త దాన్ని చూసి గడప పైనే ఆగిపోయారు. లోనికి ప్రవేశించలేదు. నేను ఆయన ముఖంలో అయిష్ట ఛాయల్ని గమనించి, “ప్రవక్తా! అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపునకు మరలుతున్నాను. నాతో జరిగిన తప్పేమిటి? అని అడిగాను. దానికి ప్రవక్త “ఈ దిండు సంగతేమిటి?” అని మందలించారు… (బుఖారి 2105, ముస్లిం 2107).
దీనికి భిన్నంగా ఒక్కసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉసామా బిన్ జైద్ ను చాలా గట్టిగా మందలించారు. దానికి కారణం ఏమిటంటే; మఖ్జూమియా వంశానికి చెందిన ఒక స్త్రీ దొంగతనం చేసింది, దానికి శిక్షగా ఆమె చేతులు నరికేయబడకుండా కొందరు ఉసామాను సిఫారసు చేయుటకై ప్రవక్త వద్దకు పంపారు. అతను వెళ్ళి అల్లాహ్ నిర్ణయించిన హద్దుల విషయంలో సిఫారసు చేశాడు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ హద్దుల్లో ఒకదాని గురించా నీవు సిఫారసు చేసేది” (ఇలా కాజాలదు) అని గట్టిగా మందలించారు.
6. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం నేర్పుట
పిల్లల మరియు టీనేజరుల ఆత్మస్థైర్యం బలహీనపడినదని మనం మొరపెట్టుకున్నప్పుడు లేదా పాశ్చాత్యుల పిల్లలు ఆత్మ స్థైర్యం మరియు తమ భావాలను వ్యక్తపరిచే శక్తి కలిగి ఉండడం మరియు మనలోని ఎక్కువ పిల్లల్లో ఈ అతిముఖ్య గుణం క్షీణించి పోవడంలో అంచన వేసినప్పుడు ప్రవక్తగారి శిక్షణశాలకు మరలుట మనపై విధిగా ఉంది, అక్కడ ఈ రోగానికి వైద్యం క్రియాత్మకంగా జరుగుతుంది.
మన పిల్లల్లో ఆత్మస్థైర్యం జనించాలంటే వారు స్వయంగా వారిని గౌరవించుకోవాలి మరియు వారు ముఖ్యులు అన్న బావం వారిలో కలగాలి. కాని వారు దాన్ని ఎలా గ్రహించగలరు? ఎందుకంటే మనం వారికి ఓ ప్రాముఖ్యత, గౌరవం ఇస్తున్నామని అనేక సందర్భాల్లో వ్యక్త పరచము.
వారు తమ స్వంత భావాలను వ్యక్తం చేసే అనుమతి మనం ఇస్తామా? ఎన్నుకునే స్వేచ్ఛ వారికి ప్రసాదిస్తామా? వారికి ప్రత్యేకించిన విషయాల్లో వారి అనుమతి కోరుతామా? లేదా గద్దించి, చిన్నచూపు చూచి, వారి ఇష్టం, కోరికలను అణచి, వారి -ప్రత్యేక విషయాల్లో- వారి అనుమతిని పట్టించుకోకుండా ప్రవర్తిస్తామా? మనలోని అనేకుల వద్ద ఇదే ప్రవర్తన చెలామణి ఉంది. కొందరు పరిశోధకులు దీనికి “నోరుమూయించే ప్రవర్తన” అని పేరు పెట్టారు.
ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఓ పాలపాత్ర వచ్చింది ఆయన పాలు త్రాగారు, అప్పుడు ఆయన కుడి ప్రక్కన పిల్లవాడున్నాడు, ఎడమ ప్రక్కన పెద్దవారున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబ్బాయిని ఉద్దేశించి “ఈ పాత్ర నా ఎడమ ప్రక్క ఉన్నవారికి ఇవ్వడానికి నీవు అనుమతిస్తావా” అని అడిగారు. అందుకు అబ్బాయి ‘లేదు, అల్లాహ్ సాక్షిగా! మీ నుండి పొందే నావంతు భాగంలో ఇతరులకు ప్రాధాన్యత’నివ్వను అని చెప్పాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పాత్ర అతని చేతిలో పెట్టేశారు. (బుఖారి, ముస్లిం).
ఈ సంఘటనలో; పిల్లల్లో స్వయ గౌరవాన్ని పెంచుటకు, వారు ముఖ్యులు అన్న భావన కలిగించుటకు శిక్షణ సంబంధమైన నాలుగు సూచనలున్నాయి.
1. పిల్లవాడు ప్రవక్తకు అతి సమీపములో కూర్చుండే స్థానం ఎలా పొందాడు? అది కూడా గొప్ప శ్రేష్ఠులైనవారి కుడి ప్రక్కన. మరి అందులో పెద్దలూ ఉన్నారు.
2. స్వయం త్రాగిన తర్వాత అతనికి వచ్చిన హక్కు నుండి అతను తొలిగి పోవుటకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిన్న పిల్లవాడితో అనుమతి కోరుతున్నారంటే అతనిలో ఎంత ఆత్మ స్థైర్యం పెరగవచ్చు. అయినా ఇది ఏమంతా గాంభీర్యమైన, ముఖ్య సమస్య అని? (కాని ప్రవక్త ఎంత శ్రద్ధ చూపారో చూడండి).
3. ప్రవక్త అడిగిన దానిని తిరస్కరించి, దానికి అనుకూలమైన సాకు/కారణం చెప్పగలిగాడంటే, ప్రవక్తగారి శిక్షణశాలలో పిల్లలకు ఎంతటి ఆత్మస్థైర్యం లభించిందో గమనించండి.
4. శిక్షణ విషయంలో క్రియ, మాట కంటే సంపూర్ణంగా ఉంటుంది. అందుకే ఉల్లేఖకుడు చెప్పాడుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పాత్ర అతని చేతిలో పెట్టేశారు. అంటే ఆ పాలపాత్ర అతనికి ఇస్తూ అతడు చెప్పిన నిదర్శనాన్ని మెచ్చుకుంటూ అతనికి గౌరవం ప్రసాదిస్తున్నట్లు అతను గ్రహించే విధంగా ప్రవక్త అతని చేతిలో ఆ పాత్ర పెట్టారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శిక్షణశాలలో నవయువకులకు వారి ప్రాముఖ్యత మరియు వారి గౌరవం వారికి తెలియజేయడం వరకే సరిపుచ్చుకోకుండా, ప్రయోగాత్మకంగా వారి శక్తికి తగిన కొన్ని బాధ్యతలు వారికి అప్పజెప్పి వారి ఆత్మస్థైర్యాన్ని పెంచేవారు.
ఇదిగో, ఇతను ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు; ఈ యువకుడు ప్రజలకు నమాజు చేయించేవాడు. ఎందుకనగా ఈ పని ఇతని శక్తికి తగినదైయుండెను.
ఇతను ఉసామా బిన్ జైద్ ఒక సైన్యానికే అధిపతిగా నిర్ణయించబడ్డాడు. అందులో పెద్ద పెద్ద సహాబాలు (ప్రవక్త సహచరులు)న్నారు. అప్పటికి అతని వయసు 17 సంవత్సరాలు దాటలేదు. ఎందుకు? అతని ఆత్మస్థైర్యం పెరగాలని, తద్వారా సమాజము అతనితో ప్రయోజనం పొందాలని. వీరిద్దరికంటే ముందు అలీ బిన్ అబీ తాలిబ్ ప్రవక్త వలస వెళ్ళే రాత్రి ఆయన పడకపై పడుకుంటాడు. అది ఓ పెద్ద బాధ్యత, అందులో ధైర్యత్యాగాల అవసరముంటుంది.
కాని ఈ రోజుల్లో మనలోని అనేకులు తమ సంతానంపై నమ్మకం కలిగి ఉండరు. కనీసం ఏ చిన్న బాధ్యత కూడా వారికి అప్పజెప్పరు.
7. సద్వర్తన నేర్పుట
పిల్లలకు అనుభవాలు తక్కువ ఉంటాయి గనక ఉపదేశ అవసరం ఎక్కువ ఉంటుంది. మంచి బోధన, శిక్షణకై ఎవరు ముందడుగు వేస్తారో వారే హృదయం మరియు మదిలో స్థానం పొందుతారు. అందుకే పిల్లల శిక్షణ విషయంలో ప్రవక్త ముందుగా చర్య తీసుకొని వారికి ఉత్తమ నడవడిక, మంచి సభ్యత సంస్కారాలు నేర్పేవారు.
ఉదాహరణకుః హసన్ బిన్ అలీ చిన్నగా ఉన్నప్పుడే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా బోధచేశారుః “నిన్ను సందేహంలో పడవేసేదాన్ని వదలి సందేహం లేని దాన్ని ఎన్నుకో, సత్యంలో తృప్తి, నెమ్మది ఉంది. మరియు అబద్ధంలో అనుమానం”. (తిర్మిజి 2518. అల్బానీ దీనిని సహీ అని చెప్పారు). హసన్ రజియల్లాహు అన్హు దానిని మంచిగా జ్ఞాపకం ఉంచుకున్నారు. ఎందుకనగా తన చిన్నతనంలోనే అది తన మదిలో నాటుకుంది.
అలాగే ఇబ్ను ఉమర్ చిన్నతనంలోనే ఈ పలుకులు ప్రవక్త నోట విన్నారుః “నీవు ప్రపంచంలో విదేశీయుని లేదా ప్రయాణికుని మాదిరిగా జీవించు. (బుఖారి 6416).
ఉమర్ బిన్ అబీ సలమ అనే బాలుడు భోజనం చేస్తున్నప్పుడు పళ్ళంలో అతని చేయి తిరుగుతున్నది చూసి “ఓ బాలుడా! అల్లాహ్ నామంతో (భోజనం ఆరంభించు), కుడి చేత్తో తిను మరియు పళ్ళంలో నీ దగ్గర ఉన్నదే తిను” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హితవు చేశారు. (బుఖారి 5376, ముస్లిం 2022).
చాలా బాధకరమైన విషయమేమంటే? కొందరు తల్లిదండ్రులు తమ సంతానానికి ఉత్తమ నడవడిక మరియు శిక్షణ అసలే బోధించరు. వారిద్దరు తమ కొడుకును అతని స్నేహితులతో కఠినంగా, కర్కశంగా ప్రవర్తిస్తూ చూస్తారు అయినా ఏమీ చెప్పరు. లేదా అతడ్ని ఒంటరిగా, దూరదూరంగా ఉండటం చూస్తారు కాని ఏమీ బోధించరు. ఇంకా ఇలాంటి ప్రవర్తనలు ఎన్నో ఉంటాయి, వాటికి సంబంధించిన సరియైన సూచనలు, చికిత్స చాలా అవసరం.
8. సద్వర్తనులకు బహుమానం
పిల్లలు ఉత్తమ సభ్యత, సంస్కార బోధన చేయబడి, దానికి అనుగుణంగా సద్వర్తన పాటించి, మంచి నడవడిక అవలంభించినప్పుడు మరింత ప్రోత్సహించి, ఏదైనా ప్రతిఫలం తప్పక ఇవ్వాలి. అది కనీసం వారిని ప్రశంసించడం, వారి కొరకు మంచి దుఆ ఇవ్వడం అయినా సరే.
ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు తన చిన్నతనంలో ఓసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద రాత్రి గడిపిన సంఘటన ఇలా తెలిపారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరుగుదొడ్డికి వెళ్ళారు. ఆయన వుజూ చేసుకోవటం కోసం నేను నీళ్ళు పెట్టాను. ప్రవక్త (మరుగుదొడ్డి నుండి బైటికి వచ్చి) ఈ నీళ్ళు ఎవరు పెట్టారు? అని అడిగారు. పెట్టినవారి గురించి ఆయనకు తెలిసిన వెంటనే “అల్లాహ్! ఇతనికి ధర్మ అవగాహన మరియు ఖుర్ఆన్ వ్యాఖ్యానజ్ఞానం ప్రసాదించు” అని దీవించారు. ఈ బాలుడు చేసిన ఓ మంచితనానికి ప్రతిఫలంగా, అతను పాటించిన సద్వర్తనకు బదులుగా ఈ గొప్ప దుఆ లభించింది. (బుఖారీ 143, ముస్లిం 2477)
అలాగే జఅఫర్ బిన్ అబీ తాలిబ్ లో ఉన్న ఉత్తమ నడవడికను గురించి ప్రశంసిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓసారి ఇలా అన్నారుః “రూపంలో మరియు నైతిక స్వభావంలో నీవు నాకు పోలి ఉన్నావు”. (బుఖారి 2699).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, యువకుడైన ముఆజ్ బిన్ జబల్ లో, (ప్రవక్త) సంప్రదాయాల పట్ల అధిక శ్రద్ధ చూపడం, ఎక్కువగా ఆయన సమక్షంలో కూర్చుండటం లాంటి ఉత్తమ పద్ధతి చూసి అతడ్ని ప్రశంసిస్తూ రెండు సార్లు అన్నారుః “ముఆజ్! నేను అల్లాహ్ కొరకై నిన్ను ప్రేమిస్తున్నాను”. (అబూ దావూద్ 1522. అల్బానీ సహీ అన్నా). ప్రవక్తగారి ఈ ప్రోత్సాహం వల్ల మఆజ్ పై ఎంత గొప్ప ప్రభావం పడి ఉంటుంది?.
మనలో అనేకులు తమ కొడుకులను మంచి పనులు చేస్తూ, మరియు ఉత్తమ నడవడిక పాటిస్తూ చూసి, వారిని ప్రశంసించరు. అది ఓ సామాన్య విషయమే కదా అని భ్రమపడతారు. కాని అవే మంచితనాలు అతనిలో లేనప్పుడు చీవాట్లు పెడతారు. ఉదాహరణకుః పెద్దలను గౌరవించడం, చదువులో ముందుగా ఉండడం, నమాజులను పాబందీగా పాటించడం, సత్యం, అమానతు (అప్పగింత)లను పాటించడం లాంటివి వగైరా.
9. పిల్లల్ని ప్రేమిస్తున్నామని తెలియజేయుట
1. ప్రేమిస్తున్నామని వారికి తెలియజేయాలి
తల్లిదండ్రుల నుండి లేదా సంరక్షకుల నుండి ప్రేమ, అప్యాయత మరియు అంగీకారం ఉన్నట్లు పిల్లలకు తెలిసియుండుట అతిముఖ్య అవసరాల్లో లెక్కించబడుతుంది. ఈ విషయం వారికి తెలియనిచో వారిలో మానసికంగా చాలా లోటు ఏర్పడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిల్లల ఈ అవసరాన్ని చాలా వరకు తీర్చేవారు. సహీ బుఖారిలో ఉంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్ బిన్ అలీని తమ వడిలో తీసుకొని ఇలా అన్నారుః “అల్లాహ్! నేను ఇతడ్ని ప్రేమిస్తున్నాను. నీవు కూడా ఇతడ్ని ప్రేమించు మరియు ఇతడ్ని ప్రేమించేవారిని కూడా నీవు ప్రేమించు”. (బుఖారీ 5884)
ఒకసారి అఖ్ రఅ బిన్ హాబిస్ రజియల్లాహు అన్హు వచ్చాడు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్ మరియు హుసైనులతో ముద్దాడుతున్నారు. ఇది చూసిన అఖ్ రఅ ‘మీరు మీ పిల్లలను ముద్దాడుతారా? నాకు పది మంది సంతానం, నేను ఎప్పుడు ఏ ఒక్కడిని ముద్దాడ లేదు’ అని అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారుః “నీ హృదయంలో నుండి అల్లాహ్ కరుణను తీసి వేస్తే నేనేమైనా చేయగలనా?”. (బుఖారి 5997).
ప్రవక్త ఎంతటి వివేకులైన శిక్షకులో గమనించండి; అఖ్ రఅ బిన్ హాబిస్ ప్రశ్నకు సమాధానం ఆశ్చర్యంతో ఇచ్చారు. అది దాని జవాబు కంటే ఉత్తమం మరియు సంపూర్ణంగా ఉంది. దాని సారాంశం ఏమిటంటేః చిన్నారుల పట్ల కారుణ్యభావం చూపని మరియు వారికి ప్రేమభావం తెలియజేయని వారిలో కారుణ్య గుణం లేనట్లు. చిన్నారులతో మసలుకొనేటప్పుడు ఈ కారుణ్యం కోల్పోయే వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు. “మా చిన్నారుల పట్ల కరుణభావంతో మెలగనివారు మాలోని వారు కారు”. (అబూ దావూద్ 4943 సహీ).
ప్రవక్త గారి పసిబాబు ఇబ్రాహీం ఈ లోకాన్ని వీడెటప్పుడు ఈ కారుణ్యమే ఆయన్ను కన్నీటిలో ముంచింది. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారుః “నిశ్చయంగా కళ్ళు అశ్రుపూరితాలవుతాయి. మనస్సు కూడా బాధపడుతుంది. అయితే మా ప్రభువుకు ప్రీతికరమైన మాటలే నా నోట వెలువడుతాయి. ఇబ్రాహీమా! నీ ఎడబాటు మమ్మల్ని శోకసముద్రంలో ముంచివేసింది”. (బుఖారి 1303).
“వీరిద్దరు ఈ లోకంలో నాకు రెండు పుష్పాలు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్, హుసైన్ ల గురించి చెప్పినప్పుడు వారు విని మానసికంగా, శిక్షణపరంగా ఎంత సంతోషం కలిగి ఉండవచ్చురు?. (బుఖారి 3753).
దీనికి భిన్నంగా కొందరు ఎంతటి ఓర్వలేని మనస్తత్వం మరియు శిక్షణపరంగా తప్పుడు మార్గానికి ఒడిగడతారు; సంతానం పట్ల గల ప్రేమను వారికి తెలియజేయడం, వారితో ఉండే వాత్సల్యాన్ని వెల్లడించడం మానుకుంటారు, ఏ భ్రమతో అంటే; దీనివల్ల వారు చెడిపోతారని లేదా వారిని పురుషులుగా తీర్చిదిద్దడానికి మరియు వారి జీవిత సంసిద్ధతకు సరియైన విధానం కాదు అని.
2. వారితో ఆటలాడడం, వారి హృదయా-లకు చేరువవడం
ఈ విషయంలోని శ్రద్ధ వల్లనే ఓసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిములకు నమాజు చేయిస్తూ సజ్దా నుండి చాలా ఆలస్యంగా లేశారు. ఎందుకో తెలుసా?
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలో ఉన్నప్పుడు ఒక పసిబాలుడు అంటే హసన్ బిన్ అలీ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వీపుపై కూర్చున్నాడు. ఈ సందర్భంలో ప్రవక్త ఆ బాలుని సంతోషంలో అడ్డు కలిగించదలచలేదు. (అందుకే చాలా దీర్ఘంగా సజ్దా చేశారు). నమాజు ముగించిన తర్వాత తమ సహచరులతో ఇలా చెప్పారుః “(నేను దీర్ఘమైన సజ్దా ఎందుకు చేశానంటే) నా కొడుకు నాపై కూర్చున్నాడు అతని కోరిక తీరక ముందే లేవడం నాకు ఇష్టం లేకపోయింది”. (నిసాయి 1141, సహీ).
ఒక ప్రశ్న: ఇలాంటి సంఘటన ఈ రోజుల్లో మన మస్జిదుల్లోని ఏ ఒక్క ఇమాముతోనైనా జరిగితే ఎలా ఉంటుంది? పసిబాలుని పట్ల ప్రవక్త శ్రద్ధ చూపుతూ దీర్ఘంగా సజ్దా చేసినట్లు అతను గనక చేస్తే మన ముక్తదీలు ఎలా ప్రవర్తిస్తారు?.
ఇది పిల్లలతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పరిస్థితి. నమాజులో ఉండి పిల్లల పట్ల ఇంత శ్రద్ధ చూపేవారు, వేరే సందర్భాల్లో పిల్లలతో హాస్యమాడే వారు, ఆటలాడే వారంటే ఏమిటాశ్చర్యం?. “ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక అబ్బాయితో ఆడుతూ తమ నాలుక బైటికి తీశారు. దాని ఎర్రపు భాగాన్ని ఆ అబ్బాయి చూశాడు”. (సహీహా అల్బానీ 70).
ఒక్కోసారి పిల్లల్లో కొందరితో ఇలా చెప్పేవారుః “ఎవరు నా వైపు ముందుగా పరుగెత్తుకు వస్తారో వారికి ఇదిస్తాను”. (అహ్మద్). ఇలా పిల్లలతో ఆటలాడుతూ ఉండడంలో శిక్షణపరంగా మంచి ప్రభావం ఉంటుంది. ఎవరు వారితో పరిహాసాలాడుతూ, ప్రేమ పూర్వకంగా ఉంటారో వారి పట్ల పిల్లలు ఎక్కువ దగ్గర అవుతారు. వారి మాట విన్నంత మరెవరి మాట వినరు.
10. సంతానం మధ్య న్యాయం
సంతానం పట్ల తల్లిదండ్రుల వ్యవహారంలో వ్యత్యాసం వల్ల వారు అతి తొందరగా ప్రభావితులవుతారు. అనేక సందర్భాల్లో సోదరుల మధ్య కపట, ద్వేషాల పరిస్థితులు అలుముకోడానికి మూలకారణం తల్లిదండ్రులు వారి మధ్య న్యాయం చేయకపోవటమే.
తల్లిదండ్రుల ప్రేమను కోల్పయారన్న అధిక భయం మరియు ఆ ప్రేమ సంతానంలో ఎవరో ఒకరివైపునకే మరలుట వల్ల మిగిత సంతానంలో అతని గురించి శత్రుత్వ గుణం జనిస్తుంది. ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం సోదరులు ఇలాంటి తప్పుడు భావానికే గురై, వారి తండ్రి యూఖూబ్ అలైహిస్సలాం, యూసుఫ్ (అలైహిస్సలాం)కే వారిపై అధిక్యత ఇస్తున్నాడని భ్రమ చెందారు, అందుకే ఇలా అన్నారుః
యూసుఫ్ ను చంపెయ్యండి లేదా అతణ్ణి ఎక్కడైనా పార వెయ్యండి, మీ తండ్రి ధ్యాస కేవలం మీపైనే ఉండేందుకు .
దీని వెనక వారి ఉద్దేశం ఒకటే, అదేమిటంటే; యూసుఫ్ వీడి పోయాక వారు వారి తండ్రి ప్రేమను, శ్రద్ధను పొందుతారని.
ఒక తండ్రి స్వయంగా చెప్పిన సంఘటన ఇదిః అతను తన ఇద్దరి కుమారులతో ఇంటి బైటికి ఓ ఎడారి ప్రదేశంలో వెళ్ళాడు. అక్కడ వారు ఒక దీర్ఘ సీరియల్ ఫిల్మ్ వీక్షిస్తూ ఆనందోత్సవాల్లో గడిపారు. ఆ మధ్యలో అతని ఎనిమిది సంవత్సరాల చిన్న కుమారుడు నిద్రపోయాడు. అందుకు తండ్రి తను ధరించి ఉన్న కోటు తీసి అతని మీద కప్పాడు. ఆ సమావేశం సమాప్తమైన తర్వాత చిన్న కుమారుడిని ఎత్తుకొని బండిలో కూర్చున్నాడు. ఇంటికి తిరిగి వెళ్తూ దారిలో తండ్రి తన 12 సంవత్సరాల కొడుకుతో అతని అమూర్తాలోచన మరియు మౌనాన్ని చూసి, “ఇప్పటి వరకు చూసిన ఫిల్మ్ తో ఏ ప్రయోజనం పొందావు? అని అడిగాడు. దానికి కొడుకు “ఫిల్మ్ చూస్తూ చూస్తూ నేను కూడా పడుకుంటే, నాపై కూడా మీరు మీ కోట్ కప్పుతారా? నన్ను కూడా ఎత్తుకొని బండిలో పడుకోబెడతారా? అని తను అడిగిన ప్రశ్నకు ఏ సంబంధం లేని ప్రశ్న కొడుకు అడిగినందుకు తండ్రి ఆశ్చర్యపడ్డాడు.
అందుకే ఒకసారి నౌమాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి తాను తన కొడుకుకు ఇచ్చిన ఓ బహుమానానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాక్ష్యంగా ఉండాలని కోరాడు. “నీ సంతానంలో ప్రతి ఒక్కరికీ ఇలాంటి బహుమానమే ఇచ్చావా?” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగి, మళ్ళీ చెప్పారుః “మీ సంతాన విషయంలో అల్లాహ్ కు భయపడండి, మీ సంతానం మధ్య న్యాయం పాటించండి”. మరో ఉల్లేఖనంలో ఉందిః “అన్యాయ విషయాల్లో నేను సాక్షుడ్ని కాను”. (బఖారి 2587, 2650).
11. క్రియాత్మక ఆదర్శంతో కూడిన శిక్షణ
ఏ విషయాలు ఆచరించాలని పిల్లవానితో చెప్పబడుతుందో, అవి అతనికి ఆదర్శంగా ఉన్న వారిలో ఆచరణ రూపం దాల్చి ఉన్నది అతను చూచుట చాలా ముఖ్యం. ప్రత్యేకంగా తల్లిదండ్రులు మరియు శిక్షకుల్లో.
నిశ్చయంగా ఆదర్శవంతమైన శిక్షణ ప్రవక్తగారి పిల్లల మరియు టీనేజరుల శిక్షణలో అతి ముఖ్య భాగం. ప్రవక్తగారి జీవిత కార్యాల్లో ప్రతీది మన కొరకు ఆదర్శమే. చదవండి అల్లాహ్ ఆదేశం సూరతుల్ అహ్ జాబ్ (33:21)లో
నిశ్చయంగా అల్లాహ్ ప్రవక్తలో మీకు ఒక మంచి ఆదర్శం ఉంది .
ప్రవక్తగారి ఈ చరిత్ర గోప్యంగా, ఎవరికి తెలియకుండా ఏదో కొందరి ప్రత్యేకులకు తెలిసే విధంగా లేకుండినది. బహిరంగంగా అందరికి తెలిసినట్లే ఉండెను. పిన్నలు, పెద్దలు అందరికీ తెలిసి యుండెను.
ఇది ఎంత సంపూర్ణమైన శిక్షణ గమనించండి. ఇబ్ను అబ్బాస్ అనే బాలుడు తనకు ఆదర్శనకర్త అయిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఒక రాత్రి గడుపుతాడు. “సగం రాత్రి గడిసిన తర్వాత ప్రవక్త మేలుకొని వుజూ చేసి తహజ్జుద్ నమాజు చేయునది” చూశాడు. (బుఖారి).
ఇలాంటి క్రియాత్మక సంఘటనే పిల్లలకు అల్లాహ్ పట్ల స్వచ్ఛత, భయభీతి, తహజ్జుద్ నమాజు ద్వారా దైవ సన్నిధానం పొందే శిక్షణ ఇస్తుంది. వేరుగా శిక్షకుడు ప్రోత్సహకరమైన మాటలు చెప్పే అవసరమే ఉండదు.
నేటి కాలంలో ఆదర్శనకర్తలు, ప్రసిద్ధి చెందిన వ్యక్తులు; సినీ తారలు, క్రీడాకారులు అయిపోయారు. వాస్తవానికి వారు ఈ కొత్త తరానికి, వారి శిక్షణకు మరియు వారికి కావలసిన విలువలకు ఏ మాత్రం అర్హులు కారు. అంతెందుకు వారి క్రియాత్మక వ్యవహారం ఈ విలువలకు, వాటి వైపు ఆహ్వానానికి సయితం తోడ్పడదు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదర్శనాల అవసరం చాలా ఉంది. వాటిని టీనేజరుల ముందు ఆకర్శవంతమైన పరిపూర్ణ పద్ధతిలో పెట్టాలి. అది వారి పంచేద్రియాలకు అబ్బునట్లు ఉండాలి. వారు ఏ కాలంలో జీవిస్తున్నారో దానికి అనుగుణంగా ఉండాలి. వాటికి తోడుగా శిక్షకుల ఆదర్శం ఉండాలి.
సంతాన శిక్షణలో జరిగే పొరపాట్లు
అల్ హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలర్ రహ్మతిల్ ముహ్ దాతి వన్నిఅమతిల్ ముస్ దాతి నబియ్యినా ముహమ్మదివ్ వ అలా ఆలిహీ వసహబిహీ అజ్మఈన్. అమ్మా బఅద్:
సంతాన శిక్షణ సులభతరమైన, లక్ష్యరహితమైన పని కాదు, ప్రతి ఒక్కరు ఏ విద్యాజ్ఞానం లేకుండా దానిని పాటించటానికి. అది నిర్దిష్ట ప్రమాణాలతో, ధార్మిక నియమాలతో కూడిన క్లిష్టమైన పని. అంతే కాదు సంతానం మేళ్ళను సాధించుటకు, వారి జ్ఞానేంద్రియాల పెరుగుదల, దినదినానికి వారి మనోస్థితిని పెంచుటకు మరియు వారి నుండి చెడు అనే అపాయాన్ని దూరం చేయుటకు వ్యక్తిగత ప్రయత్నాలు, భావనాపూర్ణమైన అంతర్దృష్టి చాలా అవసరం.
కొందరు శిక్షణ విషయంలో తాతముత్తాతల గుడ్డి మార్గాన్ని అనుసరిస్తూ వంశపరమైన వారసత్వంలో పొందిన ఒకే ఒక సాలిడ్ (నిశ్చలమైన) పద్దతిని అవలంబిస్తున్నది చూస్తున్నాము. అందువల్ల శిక్షణ విషయంలో చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. దీనికి ప్రభావితులవుతున్నది మన సంతానం. అందుకే వారిలో ఎన్నో దుష్ప్రవర్తనలు, చెడు అలవాట్లు జనిస్తున్నాయి. వాటిని కుటుంబాలు మరియు సమాజాలు భరించలేక పోతున్నాయి.
ఈ చిరుపుస్తకంలో కొన్ని ముఖ్యమైన పొరపాట్లను ప్రస్తావిస్తూ వాటి సరియైన నివారణపద్ధతి కూడా చూపే ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ అందరికి సద్భాగ్యం ప్రసాదించుగాక.
1- శిక్షణ పట్ల నిర్బాధ్యత
కొందరు తల్లిదండ్రులు సంతానం శిక్షణలో ఏ మాత్రం శ్రద్ధ వహించరు. తమ సంతానం పట్ల ఏ చిన్న బాధ్యత వహించకుండా వదిలేస్తారు. వారు అట్లే పెరుగుతూ పోతారు. సంతానం పట్ల ఉన్న వారి బాధ్యత కూడు, గూడు, బట్ట కంటే మించినది లేదని భావిస్తారు. మరి అల్లాహ్ ఈ ఆదేశాన్ని మరచిపోతారు.
“మీలో ప్రతి ఒక్కడు బాధ్యుడు, అతని బాధ్యతలో ఉన్నదాని గురించి అతడు ప్రశ్నించబడుతాడు. నాయకుడు (తన ప్రజలకు) బాధ్యుడు, అతని బాధ్యత గురించి అతడ్ని ప్రశ్నించబడుతుంది. భర్త తనింట్లో బాధ్యుడు అతని బాధ్యతలో ఉన్నదాని గురించి అతడ్ని ప్రశ్నించడం జరుగుతుంది. భార్య తన భర్త ఇంట్లో భాధ్యురాలు. ఆమె బాధ్యతలో ఉన్నదాని గురించి ఆమెను ప్రశ్నించడం జరుగుతుంది. (బుఖారి 2409, ముస్లిం 1829).
ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ ఇలా అన్నారుః ఎవరు తన సంతానానికి లాభదయకమైన విద్య నేర్పకుండా వదిలేశాడో అతడు వారి పట్ల మహా చెడు, కీడు చేసినవాడవుతాడు. సంతానంలో అలవడే చెడు అలవాట్లు ఎక్కువశాతం తండ్రుల వల్లనే అలవడతాయి. అది వారు, వారి పట్ల అవలంబించే అశ్రద్ధ మరియు ధార్మిక విధులను, సున్నతులను వారికి నేర్పకపోవడం వల్లనే. వారి చిన్నతనంలో వారిని వృధాగా వదిలేశారు. అందుకు వారు పెరిగి పెద్దగయిన తర్వాత స్వయానికే గాని లేదా తమ తండ్రులకేగాని ఏ లాభం చేకూర్చలేకపోయారు. వీరి సంగతి ఎలా ఉంటుందంటేః తనయుని అవిధేయత భరించలేక ఒక తండ్రి అతడ్ని గట్టిగా మందలించాడు. అప్పుడు అతడన్నాడుః నాన్నా! మీరు నా చిన్నతనంలో చేసిన దాని ఫలితమే ఇప్పుడు మీరు పొందుతున్నారు. నా చిన్నతనంలో మీరు నన్ను వృధా చేశారు. ఇప్పుడు మీరు ముసలివారయ్యాక నేను మిమ్మల్ని వదిలేశాను. (తొహ్ ఫతుల్ మౌదూద్ 229).
2- తండ్రుల ఆధిపత్యం
ఈ తప్పు మొదటి తప్పుకు వ్యతిరేకమైనది. కొందరు తండ్రులు తమ సంతానం యొక్క సర్వ చేష్టలపై తమదే ఆధికారం నడవాలని ప్రయత్నిస్తారు. ఇలా వారు (తండ్రులు) వారి (సంతానం) వ్యక్తిత్వాన్ని మట్టిలో కల్పుతారు. తమ ఆలోచనలో వచ్చిన ఆదేశాలిస్తారు. దానికి వారు (సంతానం) గుడ్డిగా వాటిని పాటించుట తప్ప మరొక ప్రసక్తే ఉండకూడదని భావిస్తారు. నిశ్చయంగా దీని వల్ల ఎన్నో అవాంఛనీయ చేష్టలు ఉద్భవిస్తాయిః
1. బలహీన వ్యక్తిత్వానికి గురి అవడం. ఆత్మవిశ్వాసం లోపించడం.
2. విముఖత భావం, పిరికితనం మరియు అనవసరపు లజ్జా గుణం చోటు చేసుకొనుట.
3. వింతైన, కొత్త విషయాలు కనుక్కునే యోగ్యత నశించిపోవుట.
4. యుక్తవయస్సుకు చేరిన తర్వాత చెడిపోయే అవకాశం, అప్పుడు అతడు బేడిలలో బందీగా ఉండి విడుదలైనట్లు ఫీల్ అవుతాడు. అందుకు అన్ని రకాల హద్దులను అతిక్రమించే ప్రయత్నం చేస్తాడు. అవి ధర్మపరమైనవి అయినా సరే.
5- మానసిక మరియు శారీరక రోగాలకు గురిఅవుతాడు.
పిల్లలకు వారి స్వంత విషయాల్లో కొంత పాటి స్వతంత్రం ఇవ్వాలని నిశ్చయంగా ఉత్తమ శిక్షణ హామీ ఇస్తుంది. అది ఏవైనా నిర్ణయాలు తీసుకొనుటకైనా, తమ కోరికను వెలిబుచ్చుటకైనా, బాధ్యత వహించుటకైనా. ఇవన్నియూ సవ్యమైన పద్ధతితో, ఉత్తమ సభ్యత తో ఉండేటట్లు తండ్రులు తమ సంతాన మదిలో నాటాలి.
3-వైరుద్ధ్య ఆదర్శం
మొదటిసారిగా పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావమే పడుతుంది. అతని గుణాలు, అలవాట్లలో వీరి ఛాయనే పడుతుంది. తల్లిదండ్రులు సద్వర్తన, ఉత్తమ నడవడిక కలవారైతే పిల్లలు కూడా సద్గుణాలు నేర్చుకుంటారు. వారు చెప్పేదొకటి చేసేది మరొకటైతే పిల్లలపై దాని చెడు ప్రభావం పడుతుంది.
వైరుద్ధ్యంలో మరొకటిః తండ్రి సత్యత గురించి తన సంతానానికి చెప్పి స్వయంగా అబద్ధం పలుకుతే లేదా అతను అమానతు గురించి ఆదేశించి స్వయంగా దొంగతనం చేస్తే, లేదా వాగ్దానానికి కట్టుబడి ఉండాలని బోధించి, తానే వాగ్దాన భంగం చేస్తే, లేదా మంచితనం మరియు సంబంధాల్ని పెంచుకోవాలని బోధించి అతడే తన తల్లిదండ్రుల పట్ల అవిధేయుడైతే, లేదా నమాజు గురించి ఆదేశించి స్వయంగా నమాజు వదులుతూ ఉంటే, లేదా పోగత్రాగరాదని హితువు చెప్పి స్వయంగా ధూమపానం చేస్తే, ఇలాంటి వైరుద్ధ్యం వలన శిక్షకుడు తన పిల్లల దృష్టిలో చులకన అయిపోతాడు. అతని మాటకు వారు ఏ మాత్రం విలువనివ్వరు. అల్లాహ్ అదేశం ఇలా ఉందిః
ఏమిటి, మీరు మంచిపనులు చేయమని ఇతరులకైతే హితబోధ చేస్తారు. కాని మిమ్మల్ని మీరు మరచి పోతారు. మీరు గ్రంథపారాయణం కూడా చేస్తున్నారు. అయినా మీరు బుద్ధిని బొత్తిగా ప్రయోగించరేమిటి. (బఖర 2: 44).
4- కఠినత్వం
తండ్రులు తమ సంతానం పట్ల కరుణ, ప్రేమ మరియు మెతక వైఖరి అవలంభించాలి. చిన్నారుల పట్ల ప్రవక్త పద్ధతి ఇదే. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్ బిన్ అలీని ముద్దాడారు. అప్పుడు అక్కడ అఖ్ రఅ బిన్ హారిస్ ఉన్నారు. ఈ విషయం చూసి అతడన్నాడుః నాకు పది మంది సంతానం, కాని నేను ఇంతవరకు ఏ ఒక్కరినీ ముద్ధాడలేదు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని వైపు చూస్తూ ఇలా అన్నారుః
(مَنْ لَا يَرْحَمْ لَا يُرْحَمْ).
“కరుణించనివారు కరుణింపబడరు“. (బుఖారి 5997).
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః పల్లెటూరి అరబ్బులు కొందరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు. “మీరు మీ పిల్లల ను ముద్దాడుతారా?” అని అడిగారు. “అవును” అని ప్రవక్త సమాధానమిచ్చారు. వారన్నారుః “కాని మేము అల్లాహ్ సాక్షిగా! ముద్దాడము”. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారుః
“అల్లాహ్ మీ హృదయాల్లో నుండి కరుణ తీసేస్తే నేనేమి చేయ గలుగుతాను”. (బుఖారి 5998, ముస్లిం 2317).
శిక్షించేటప్పుడు కఠినత్వం మరియు కర్కశత్వం పాటించటం అనేది తికమక వేసే ఆలోచనలు పుట్టిస్తాయి. అందువల్ల వారు తమనుతామే అదుపులో పెట్టుకోలేరు. ఇక ఇతరులను అదుపులో పెట్టే ప్రసక్తే రాదు.
వెనకటి కాలంలో ఉన్న (ఆలోచన ఏమిటంటే) కఠినత్వం, గట్టిగా కొట్టడం వల్లనే పిల్లల్లో శక్తి, బలం, పురుషత్వం లాంటివి పెరుగుతాయి, బాధ్యత వహించే శక్తి వస్తుంది, ఆత్మవిశ్వాసం కలుగుతుంది అని. అయితే ఈ ఆలోచన తప్పు అని రుజువైపోయింది. ఎందుకనగా కఠినత్వం అనేది పిల్లల్లో వ్యదాభరితమైన మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. అది వాళ్ళను తలబిరుసుతనం, శత్రుత్వం లోనికి నెట్టుతుంది. వారి మానసిక వికాసాని (Mental Maturity)కి అడ్డు పడుతుంది. ఎల్లప్పుడూ వారిలో హీనత్వం, తక్కువ స్థాయి మరియు అగౌరవ భావం కలుగజేస్తుంది.
ఏ మాత్రం శిక్షించనేవద్దు అని కూడా దీని భావం కాదు. ఎప్పుడైనా ఒక్క సారి శిక్షించాలి. అయితే ఈ శిక్ష అనేది కరుణ, కటాక్షాల హద్దులకు మించి ఉండకూడదు.
5- చెడును చూసి నిర్లక్ష్యం చేయడం
ఎలాగైతే కఠినత్వం మంచి విషయం కాదో, దానిని ఖండించడం జరిగిందో. అలాగే చెడును చూసి అశ్రద్ధ వహించడం కూడా మంచి విషయం కాదు. అనేక మంది తండ్రులు ఈ తప్పుకు గురి అవుతారు. వారి సాకు ఏమిటంటే వారు ఇంకా చిన్నారులే కదా, పెద్దగయిన తర్వాత ఈ చెడులను వారే వదులుకుంటారు. ఇది సరియైన మాట కాదు. ఎందుకనగా ఎవరైనా పసితనంలో ఓ అలవాటుకు బానిసయ్యాక పెరిగి పెద్దయ్యాక దాన్ని వదులుకోవడం అతనికి కష్టంగా ఉంటుంది. ఇబ్నుల్ ఖయ్యిం రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు: ఎందరో తండ్రులు తమ సంతానాన్ని తమ కార్జపుముక్కలను అట్లే వదిలేసి, వారి శిక్షణ మానుకొని, వారి వాంఛలు తీర్చుకొనుటకు దోహదపడి వారి ఇహపరాలను పాడు చేస్తున్నారు. వారిని గౌరవపరుస్తున్నాము అన్నది వారి భ్రమ, అసలు వారు వారిని అవమానపరుస్తున్నారు. కనికరం చూపుతున్నాము అన్నది వారి భ్రమ అసలు వారు వారిపై దౌర్జన్యం చేస్తూ వారిని దూరం చేస్తున్నారు. చివరికి తమ సంతానం నుండి ఏ లాభం కూడా పొందలేకపోతారు. అంతే కాదు ఇలా చేసి వారు ఇహపరాల మేళ్ళు సాధించకుండా చేస్తున్నారు. తనయుళ్ళలో ఉన్న చెడును గనక నీవు చూసినట్లైతే అది ఎక్కువశాతం తండ్రుల నుండి సోకినదే అని నీకు తెలుస్తుంది. (తుహ్ ఫతుల్ మౌదూద్).
నిర్లక్ష్యాల్లో అతి గొప్పది; పిల్లలను నమాజు చేయమని, దాని పట్ల శ్రద్ధ వహించమని ప్రోత్సహించకపోవడం. ప్రవక్త ﷺ చెప్పారుః
“మీ పిల్లలు ఏడు సంవత్సరాల వయస్సుకు చేరినప్పుడు మీరు వారికి నమాజు గురించి ఆదేశించండి. వారు పది సంవత్సరాలకు చేరినప్పుడు వారిని దండించండి. వారి పడకలను వేరు చేయండి”. (అహ్మద్, అబూ దావూద్ 495. అల్బానీ దీనిని హసన్ అని అన్నారు).
తనయులు నిద్రపోతున్నది లేదా ఆడుకుంటున్నది చూస్తూ (వారికేమీ చెప్పకుండా) తండ్రి నమాజు కొరకు వెళ్ళిపోవుట చాలా తప్పు విషయం. అల్లాహ్ యొక్క ఈ ఆదేశం చదవండిః
నీ కుటుంబ సభ్యులను నమాజు చెయ్యండి అని ఆజ్ఞాపించు స్వయంగా నీవు కూడ దానిని పాటించు. (తాహా 20:132).
సంగీతం మరియు పాటలు వినుట నుండి వారిని వారించాలి. దుస్తుల్లో, అలవాట్లలో అవిశ్వాసుల పోలికల నుండి వారించాలి. ధరినిపై అల్లకల్లోలాన్ని సృష్టించే, సంస్కరణను చేపట్టని పేరుగల ప్రసిద్ధుల నుండి వారిని దూరం ఉంచాలి. వీటన్నిటిలో తండ్రి తమ సంతానంతో ప్రేమపూర్వకమైన సంబంధంతో పాటు మెతకవైఖరి, దయాగుణం అవలంభించాలి. సున్నితంగా, ఒప్పించగల పద్ధతిలో మాట్లాడాలి.
6- యధాపూర్వ స్థితిపై వదలటం
శిక్షణలోని తప్పుల్లో ఒకటి యధాపూర్వ పరిస్థితిని వదలి పాతరకమైన పద్ధతినే అవలంభించుట. కాలానికి తగిన నూతన విషయాల్ని విడనాడుట. ఉదాహరణకు కొందరు శిక్షణ ఇచ్చేవారు ఈతాడుట, బాణము విడుచుట మరియు గుఱ్ఱపు స్వారి నేర్పుట పట్ల మంచి శ్రద్ధ చూపుతారు మరి ఈ కాలానికి అవసరమైన ఇతర నైపుణ్యాలను వదిలేస్తారు. ఉదాహరణకుః కంప్యూటర్ శిక్షణ, అత్యవసరమైన ఇతర భాషలు, ప్రసంగం, రచన పద్ధతులు నేర్పాలి. తమ రక్షణ (సెల్ఫ్ డిఫెన్స్)కు పనికొచ్చే ఆధునిక ఆటల్లో ఏదైనా మంచి ఆటలో నైపుణ్యం ఉండేట్లు చేయాలి. శిక్షణ ఇచ్చేవారు వారి (శిక్షితుల) ఈ శక్తి సామర్థ్యాలను పెంచుతూ ఉండుటకు ఎక్కువ శ్రద్ధ చూపాలి. లేనిచో వారు తమ తోటి వాళ్ళతో వెనకే ఉండిపోతారు. అందువల్ల వారిలో న్యూనతాభావం జనిస్తుంది. జీవిత వ్వవహారాల్లో వారికంటే ముందుకు వెళ్ళిపోయిన వారి తోటివాళ్ళకు దూరదూరంగా ఉంటుంటారు.
7- తప్పును ఒప్పుకోకపోవడం
తన పిల్లవాని తప్పులేకున్నా అతడ్ని శిక్షించి అతనిపై అన్యాయం చేసిన తండ్రి మనలో లేడా?
తన పిల్లవాడు నిర్దోషి అయినా అతనిపై నిందమోపిన తండ్రి మనలో లేడా?
అబద్ధపు చాడీలను నమ్మి తన కొడుకును కొట్టిన తండ్రి మనలో లేడా?
అవును, నేను నా కొడుకు పట్ల తప్పు చేశాను అని తర్వాత తండ్రి తెలుసుకుంటాడు. కాని తన సంతానం ముందు తన పశ్చాత్తాప భావం వ్యక్త పరచడు, అస్సలు తన తప్పునే ఒప్పుకోడు. బహుశా అతని సంతానానికి ఏ హక్కూ, గౌరవం, మర్యాద మరియు వాటి భావాలు లేవు కావచ్చు అతని దృష్టిలో?
నిశ్చయంగా ఇది అసవ్యమైన పద్ధతి. ఇది పిల్లల మనస్సులో గర్వం, అహంకారం మరియు తప్పుడు అభిప్రాయంపైన పక్షపాతం లాంటి దుర్గుణాలను జనిస్తుంది. తప్పులో ఉండి కూడా తలబిరుసుతనం వహించే గుణాలు పుట్టిస్తాయి.
ఒకవేళ తండ్రి తన కొడుకు ముందు పశ్చాత్తాప భావం వ్యక్తపరిస్తే, ఇది చాలా మంచి పద్ధతి. ఇలా శిక్షకుడు తనతో జరిగిన తప్పును ఓ సానుకూల ప్రవర్తలో మార్చగలడు, దీని వల్ల పిల్లల్లో మంచి ప్రభావం కలిగి, ధర్మం మరియు సత్యం పట్ల అణకువ, తప్పు జరిగితే ఒప్పుకునే భావం, ఇతరుల పట్ల మన్నింపు వైఖరి తదితర గుణాలు పుడుతాయి.
8- వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవడం
తండ్రియే తనింట్లో బాధ్యుడు, వారి వ్యవహారాలు చూసేవాడు మరియు వారి గురించి అతనితోనే విచారించడం జరుగుతుంది. ఇలా అని ఇంట్లో ఉన్నవారితో సంప్రదించకుండా, ప్రతి విషయంలో తానే ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం కూడా సరి కాదు. దీని వల్ల పిల్లల మధ్య ఒకరిపై మరొకరు పెత్తనం నడిపించాలన్న బుద్ధి పుడుతుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళపై చేయిజేసుకుంటారు. వారిని అణచి ఉంచే ప్రయత్నం చేస్తారు. ఎలాగైతే వారి తండ్రి నిర్ణయాలు తీసుకోవడంలో వారితో ప్రవర్తిస్తున్నాడో.
సెలవు రోజున తన భార్యపిల్లల్ని తన కారులో పార్క్ తీసుకెళ్లే ఒక వ్యక్తి నాకు ఇచ్చట గుర్తుకొచ్చాడు. అతడు వారిని ఎటు తీసుకెళ్తున్నాడో వారికేమీ తెలియదు. వారిలో ఏ ఒక్కడైనా (నాన్నా ఎక్కడికి వెళుతున్నారు? అని) అడిగితే, పాపం! వారు పార్క్ పోవడానికి ఎంతో సంతోషంతో ఎదురు చూస్తున్న ఆ సెలవు రోజు ‘వెనక్కి మళ్ళించి ఇంటికి తీసుకెళ్తాను’ అన్న బెదిరింపులతో శిక్షించేవాడు.
ఆ తండ్రి తన సంతానాన్ని దగ్గరికి పిలుచుకొని ఎటు వెళ్తే బాగుంటుందని వారితో సలహా తీసుకుంటే ఉత్తమం కాదా? ఇలా చేస్తే అతడు ఏమి నష్టపోతాడు? కాని కొందరు ఇతరులను అణచి ఉంచడం, వారిని ఏ మాత్రం ఖాతరు చేయకుండా, వారిపై తమ పెత్తనం చూపడమే మేలు అని అనుకుంటుంటారు.
9- ప్రత్యేకతలను గౌరవించకపోవడం
ప్రత్యేకతలకు సంబంధించిన గౌరవం మన పిల్లలకు నేర్పించడం ఎంతైనా అవసరం. దాని వల్ల వారు వారి వ్యక్తిగత వ్యవహారాలు మరియు ఇతరుల వ్యక్తిగత వ్యవహారాల మధ్యగల వ్యత్యాసాన్ని క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతారు.
విశ్రాంతి తీసుకునే సమయాల్లో మరియు ఇతరులతో కలవడం ఇష్టం లేని సమయాల్లో మనం మన సంతానానికి మరియు మన సేవలో ఉన్నవారికి మన గదిలోకి ప్రవేశించే ముందు అనుమతి తీసుకోవాలనే విషయం తప్పనిసరిగా నేర్పాలని ఖుర్ఆన్ మనకు బోధించింది.
అందుకే తల్లిదండ్రులు -ప్రత్యేకంగా తల్లి- ఇతరుల ప్రత్యేకతల గురించి వాటి హద్దుల గురించి తమ సంతానానికి తెలుపాలి. ఇతరులకు ప్రత్యేకించబడిన స్థలం లేక గదిలో వారు అనుమతి లేనిదే ప్రవేశించరాదు. మూయబడి ఉన్న ఏ వస్తువును తెరువరాదు. అది ఏ ఇంటి తలుపైనా, ఫ్రిజ్ అయినా, పుస్తకం, ఆఫీసు, పెట్టె లాంటిదేదైనా ఎప్పడి నుండి పడి ఉన్నా సరే.
కొన్ని ఇళ్ళల్లో ప్రత్యేకతల గౌరవం అనేది నశించిపోయింది. అందువల్ల సంతానం అరాచకత్వం, క్రూరత్వ వాతవరణంలో పెరుగుతూ ఇతరుల హక్కులను నెరవేర్చకుండా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు.
అందుకు తండ్రులు ముందు తమ సంతానం యొక్క ప్రత్యేకతలను గౌరవించాలి. వారి గదిలో ప్రవేశించే ముందు తలుపు తట్టాలి. వారి రహస్యాలను దాచి ఉంచాలి. ఏదైనా చిన్న తప్పు జరిగితే వెంటనే వారిని నిందించకుండా దాన్ని స్పష్టపరచకుండా ఉండాలి, మన్నించాలి. ఇలా తండ్రులు చేశారంటే ఇతరుల ప్రత్యేకతల గురించి వారికి నేర్పడంలో సఫలులైనట్లే.
10- దూరదూరంగా ఉంచడం
పెద్దల సమావేశంలో తమ సంతానం పాల్గొనటాన్ని కొందరు తండ్రులు ఒక న్యూనత, లోపంగా భావిస్తారు. ఎప్పుడు వారు పెద్దల సమక్షంలో రావాలనుకుంటారో వారిని నెట్టేస్తూ, చివాట్లు పెడుతూ, దూరం చేస్తూ ఉంటారు.
నిస్సందేహంగా ఒక్కోసారి పిల్లవాడిని పెద్దల సమావేశంలో కూర్చోనివ్వాలి. అతడు వారితో నేర్చుకుంటాడు. వారి అనుభవాలను సేకరిస్తాడు. బుఖారి (5620), ముస్లిం (2030)లో వచ్చిన ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఓ త్రాగే పదార్థం వచ్చింది. ఆయన అందులో నుండి త్రాగారు. అప్పుడు ఆయన కుడి ప్రక్కన పిల్లవాడున్నాడు. ఎడమ ప్రక్కన పెద్దమనుషులున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిల్లవాడినుద్దేశించిః “ఇటువైపున ఉన్న పెద్దలకు ఇవ్వడానికి నీవు అనుమతిస్తావా” అని అడిగారు. అందుకు ఆ పసివాడు ‘అల్లాహ్ సాక్షిగా! ఓ ప్రవక్తా, మీ నుండి లభించే నా వంతులో నేను ఇతరులకు ప్రధాన్యత నివ్వను’ అని చెప్పాడు. అందుకు ప్రవక్త ఆ పాత్ర అతని చేతిలో పెట్టేశారు.
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతటి గొప్ప మార్గదర్శి, ఉత్తమ శిక్షకులు, మరియు మంచి విధంగా నేర్పేవారు. ప్రతి కాలం మరియు స్థలంలో ప్రతి వయస్సువారు ఆయన నుండి నేర్చుకోగలరు. ఇస్లామీయ దైవ విధానం పిల్లలను పెద్దల సమావేశంలో, వారున్న మస్జిదుల్లో, వారితో ప్రయాణానికి, వారు పోగు అయ్యే చోట పాల్గొనడాన్ని నివారించదు. వారు పాల్గొని వారి అనుభవాలను నేర్చుకుంటారు. వారితో పనుల్లో పాల్గొంటారు. బాధ్యత గుణాల్ని అన్వయించు కుంటారు.
చిన్నారులను పెద్దలతో వేరుంచడం అనేది అవాంఛనీయ విధానం, మరియు కార్య శూన్య పద్ధతి. ఇలా చిన్నారులను పరస్పరం ఒకరికొకరు కలసినట్లు వదిలేస్తే, వారు అల్లరి, చిల్లరి పనులు నేర్చుకుంటూ, షైతాన్ వారిని తన చిక్కులో పడవేసుకుంటాడు, అందువల్ల వారు చెడు నేర్చుకుంటారు. దానికి బదులు పెద్దలతో ఉంటే గొప్ప విషయాలు, అనుభవాలు నేర్చు కుంటారు.
సంతాన శిక్షణలో 130 మార్గాలు
అల్ హందు లిల్లాహి వహ్ దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅదహ్, అమ్మాబఅద్:
నిశ్చయంగా సంతాన శిక్షణ ఒక కళ మరియు ఒక నైపుణ్యం. అతి తక్కువ మంది ఇందులో పరిపూర్ణులుగా తేలుతారు. ఈ విషయంలో ఎన్నో పుస్తకాలు వ్రాయబడ్డాయి. అందులో కొన్ని సంక్షిప్తమైతే మరికొన్ని విపులంగా ఉన్నాయి. వాటిలోని కొన్నింటి సారాంశం మీ ముందు ఉంచదలిచాను. లాభదాయకమైన అనుభవాలతో వాటిని క్రమబద్ధీకరించాను. తమ చిన్నారులకు ఉత్తమ శిక్షణ ఇవ్వదలచిన తండ్రులు మరియు శిక్షకులు ఇలాంటి విషయాల అవసరం లేకుండా ఉండలేరు.
విశ్వాసం
1- నీవు నీ సంతానానికి కలిమయే తౌహీద్ (ఏకత్వ వచనం: లా ఇలాహ ఇల్లల్లాహ్) మరియు అందులో ఉన్న అంగీకారం మరియు నిరాకారం నేర్పు. “లాఇలాహ”లో నిరాకారం ఉంది. అంటే అల్లాహ్ తప్ప సమస్తములో నుండి ‘ఉలూహియత్’ (ఆరాధన హక్కు)ను నిరాకరించుట. “ఇల్లల్లాహ్” లో అంగీకారం ఉంది, అంటే అల్లాహ్ ఏకైకుడు మాత్రమే ఆరాధనలకు అర్హుడు అని నమ్ముట.
2- మనమెందుకు పుట్టించబడ్డామో? ఈ ఆయతు ఆధారంగా వారికి నేర్పించు.
నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నన్ను ఆరాధించుటకే పుట్టించాను. (జారియాత్ 51: 56).
“ఆరాధన” యొక్క భావాన్ని విపులంగా నచ్చజెప్పు
3- అల్లాహ్ పేరు వింటేనే ఓ భయంకరమైన భావన వారి మదిలో కుదిరే విధంగా మాటిమాటికి నరకం, అల్లాహ్ కోపం, శిక్ష, విపత్తు గురించి బెదిరించకు.
4- అల్లాహ్ నే అధికంగా ప్రేమిస్తున్నవాడిగా వారిని తయారు చేయి. ఎందుకనగా? ఆయనే మనల్ని పుట్టించాడు, మనకు ఉపాధి ఇచ్చాడు, తినిపించాడు, త్రాగించాడు, ధరింపజేశాడు, ఆయనకు భక్తులుగా మెదులుకునే విధంగా చేశాడు.
5- ఏకాంతంలో తప్పు చేయుట నుండి వారించు. ఎందుకనగా అల్లాహ్ అన్ని స్థితుల్లో వారిని గమనిస్తున్నాడు.
6- అల్లాహ్ పేరుగల జిక్ర్ (స్మరణలు) వారి ముందు అధికంగా చేయి. ఉదాః తినేత్రాగేటప్పుడు, లోనికి, బయటికి వెళ్ళేటప్పుడు బిస్మిల్లాహ్ అని. బోజనం చేసిన తర్వాత అల్ హందులిల్లాహ్ అని. ఆశ్చర్యం కలిగినప్పుడు సుబ్ హానల్లాహ్ అని. ఇంకా ఇలాంటి జిక్ర్.
7- వారిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమ కుదిరించు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సద్గుణాలు నేర్పించి, వారి ముందు ఆయన చరిత్ర తెలిపి, ఆయన పేరు వచ్చినప్పుడల్లా ఆయనపై దరూద్ చదివి.
8- వారి మనస్సులో విధివ్రాతపై నమ్మకం పటిష్ఠంగా నాటు. అంటే అల్లాహ్ తలచినదే అవుతుంది. అల్లాహ్ తలచనిది కానేకాదు.
9- వారికి విశ్వాస ఆరు మూలసూత్రాలు నేర్పు.
10- విశ్వాసానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు వారి ముందుంచు. ఉదాః నీ ప్రభువు ఎవరు? నీ ధర్మమేది? నీ ప్రవక్త ఎవరు? అల్లాహ్ మనల్ని ఎందుకు పుట్టించాడు? మనకు ఉపాధి, తిను త్రాగు పదార్థాలు మరియు స్వస్థత ప్రసాదించువారు ఎవరు? తౌహీద్ యొక్క రకాలు ఏమిటి? షిర్క్, కుఫ్ర్, నిఫాఖ్ అంటేమిటి? ముష్రిక్, కాఫిర్, మునాఫిఖుల పర్యవసానం ఏమిటి? తదితర…
ఆరాధన
11- వారికి ఇస్లాం యొక్క ఐదు మూలసూత్రాలు నేర్పు.
12- వారికి నమాజు అలవాటు చేయించు. (ప్రవక్త ఆదేశం:) “మీ సంతానం వయస్సు ఏడు సంవత్సరాలు పూర్తి అయితే వారికి నమాజు గురించి ఆదేశించండి. వారి వయస్సు పది సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత నమాజు విషయంలో వారిని దండించండి”.
13- నీవు మస్జిదుకు వెళ్తూ నీ కూమారుడ్ని వెంట తీసుకెళ్ళు. వుజూ ఎలా చెయ్యాలో అతనికి నేర్పించు.
14- అతనికి మస్జిదులో పాటించవలసిన పద్ధతులు, మస్జిద్ గౌరవం, పవిత్రత తెలియజేయి.
15- ఉపవాసం అలవాటు చేయించు. చివరికి అతను పెద్దగయ్యాక దానికి అలవాటు పడి ఉండుటకు.
16- సాధ్యమైనంత వరకు ఖుర్ఆన్, హదీస్ మరియు సమయ సందర్భ స్మరణలు (అజ్కార్) కంఠస్తం చేయించుటకు ప్రోత్సహించు.
17- వారు ఖుర్ఆన్ కంఠస్తం చేస్తున్నా కొద్ది వారికి ఏదైనా బహుమానం ఇస్తూ ఉండు. ఇబ్రాహీం బిన్ అద్ హమ్ చెప్పాడుః నా తండ్రి నాతో ఇలా చెప్పారుః “పుత్రుడా! నీవు ప్రవక్త హదీసులు కంఠస్తం చేయి. నీవు కంఠస్తం చేసే ప్రతి హదీసుకు బదులుగా ఒక దిర్హమ్ ఇస్తాను”. ఈ విధంగా నేను హదీసులు కంఠస్తం చేశాను.
18- ఖుర్ఆన్ పేరు వింటెనే శిక్షగా భావించి, ఖుర్ఆన్ కంఠస్తాన్ని అసహ్యించుకునే విధంగా కంఠస్తం మరియు పారాయణం చేయమని అధికంగా ఒత్తిడి చేయకు.
19- నీవు నీ సంతానానికి ఒక ఆదర్శం అని తెలుసుకో. నీవు ఆరాధనల్లో అలసత్వం పాటిస్తే, లేదా ఎంతో ఇబ్బందిగా పాటిస్తే దాని ప్రభావం వారిపై పడుతుంది. వారు కూడా ఎంతో కష్టంగా దానిని పాటిస్తారు లేదా దాని నుండి పారిపోయే ప్రయత్నం చేస్తారు.
20- వారికి దానధర్మాలు చేసే అలవాటు చేయించు. అదెలా అంటే ఒక్కోసారి వారు చూస్తుండగా నీవు ఏదైనా దానం చేయి. లేదా వారికి ఏదైనా ఇచ్చి ఎవరైనా బీదవానికి లేదా పేదవానికి దానం చేయమని చెప్పు. దీనికంటే మరీ ఉత్తమమేమిటంటే వారు స్వయంగా జమ చేసుకుంటున్న డబ్బులో నుండి దానం చేయాలని ప్రోత్సహించు.
ప్రవర్తన
21- నీ కొడుకు సత్యవంతుడు కావాలని నీవు కోరుకుంటే అతనిలో భయాన్ని జనింపజేయకు.
22- నీవు సత్యమే పలుకుతూ ఉండు అప్పుడు నీ కొడుకు నీతో సత్యం నేర్చుకుంటాడు.
23- సత్యం మరియు అమానత్ (అప్పగింత, బాధ్యత, విశ్వసనీయత)ల ఘనతను వివరించు.
24- అతనికి తెలియకుండానే అతని అమానతును ఒక్కోసారి పరీక్షించు.
25- ఓపిక అలవాటు చేయించు. తొందరపాటు
చేయకూడదని నచ్చజెప్పు. ఉపవాస అభ్యాసం ద్వారా లేదా ఓపిక మరియు నెమ్మదితో కూడిన విషయాలపై అమలు ద్వారా ఇది సంభవం కావచ్చు.
26- వారి మధ్య న్యాయం పాటించు. న్యాయగుణం వారికి నేర్పడానికి ఇదే అతిఉత్తమమైన పద్ధతి.
27- వారికి ప్రాధాన్యత గుణం అలవాటు చేయించు. అది క్రియారూపకంగానైనా లేదా ప్రాధాన్యత గుణం యొక్క ఘనతను చాటే కొన్ని సంఘటనలను ప్రస్తావించి అయినా.
28- మోసం, దొంగతనం మరియు అబద్ధాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించు.
29- వారు ఏదైనా సందర్భంలో ధైర్యం ప్రదర్శిస్తే వారిని ప్రశంసించి ఏదైనా బహుమానం ఇవ్వు. వాస్తవమైన మరియు అవసరం ఉన్న చోటే ధైర్యం ప్రదర్శించాలని బోధించు.
30- కఠినంగా ప్రవర్తించకు. దానివల్ల వారిలో భయం, అబద్ధం మరియు పిరికితనాలు చోటు చేసుకుంటాయి.
31- వారిలో నమ్రత, మెతకవైఖరి గుణాల ప్రేమతో పాటు అహంకారాన్ని వదలుకునే ప్రేమ కుదిరించు.
32- ఘనతల్లో వ్యత్యాసం భయభీతి మరియు సత్కార్యాల ద్వారా ఉంటుంది తప్ప వంశం, డబ్బుధనం వల్ల కాదని నేర్పు.
33- అన్యాయం, అత్యాచారం యొక్క పర్యవసానం మహా చెడ్డదని, దౌర్జన్యం అనేది దౌర్జన్యపరులనే తన పొట్టలో పెట్టుకుంటుందని మరియు నమ్మకద్రోహం అనేది వినాశనానికి దారి తీస్తుందని తెలియజేయి.
34- కొన్ని విషయాల్లో ఉన్న వ్యత్యాసాన్ని విడమర్చి చెప్పు, బహుశా వారికి తెలియకుండా ఉండవచ్చు. ఉదాహరణకుః ధైర్యం, శౌర్యం మరియు వెర్రిసాహసంలోని వ్యత్యాసం. సిగ్గు మరియు జంకులోని వ్యత్యాసం([2]). వినయం, అణకువ మరియు పరాభవంలోని వ్యత్యాసం. చాతుర్యం మరియు మోసంలోని వ్యత్యాసం.
35- ఇతరులకు మేలు చేసే అలవాటు వారికి చేయించు. అందుకై నీవు స్వయంగా నీ ఇంట్లో ఉత్తమముగా మెదులు, ఇతరులకు మేలు చేస్తూ ఉండు.
36- ఎప్పుడూ వాగ్దానభంగం చేయకు. ప్రత్యేకంగా నీ సంతానంతో. అందువల్ల వాగ్దానం నెరవేర్చే ఘనత వారిలో మంచిగా చోటు చేసు కుంటుంది.
సభ్యత సంస్కారం
37- నీవు వారికి సలాం చేయి.
38- నీ మర్మ ప్రదేశాల మీద వారి దృష్టి పడకుండా జాగ్రత్తగా ఉండు.
39- నీ పొరుగువారితో మంచి విధంగా మెలుగు.
40- వారి పట్ల ఉత్తమంగా ప్రవర్తించాలని వారికి నేర్పు. మరియు వారిని బాధించడంలో ఉన్న నష్టం గురించి తెలియజేయి.
41- నీవు నీ తల్లదండ్రుల పట్ల సద్వర్తన పాటించు. నీ బంధువులతో కలుస్తూ ఉండు. ఇలాంటి సందర్భాల్లో నీ సంతానాన్ని నీ వెంట ఉంచుకో.
42- ఇతరులకు ఇబ్బంది కలిగించని మంచి అలవాట్లు గల పిల్లలను ప్రజలు మెచ్చుకుంటారని తెలియజేయి.
43- వారికి ఒక పత్రం వ్రాసి పెట్టు. అందులో కొన్ని ఉత్తమ పద్ధతులు, హితోపదేశాలుండాలి.
44- కొన్ని పద్ధతులు మంచివి కావని తెలియజేస్తూ వాటి కారణం ఏమిటో స్పష్టపరచు.
45- వారితో కూర్చొని వారి ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతి గురించి చదువుతూ ఉండు. వారు దాని ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందుతున్నారో కనుక్కో. ఒక్కోసారి వారిలో ఎవరితోనైనా చదివించి నీవు వింటూ ఉండు.
46- వారిలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే అతనికి ఒంటరిగా నచ్చజెప్పు. నలుగురి ముందు అతన్ని దండించకు.
47- సాధ్యమైనంత వరకు శాపనార్దాలు పెట్టకు.
48- వారి గదిలో ప్రవేశించేటప్పుడు, ముందుగా వారి అనుమతి తీసుకో, వారికి అనుమతి పద్ధతి నేర్పుటకు ఇది ఉత్తమ మార్గం.
49- నీవేదైనా ఆదేశించినప్పుడు తొలిమాటలోనే వారు అర్థం చేసుకుంటారని ఆశించకు. (ఒక్కోసారి ఏదైనా విషయం రెండు మూడు సార్లు కూడా చెప్పవలసి వస్తుంది అలాంటప్పుడు ఓపికతో చెప్పు):
నీ కుటుంబ సభ్యులను నమాజు చెయ్యండి అని ఆజ్ఞాపించు. స్వయంగా నీవు కూడా దానిని పాటించు. (తాహా 20: 132).
50- భోజనం చేసే ముందు బిస్మిల్లాహ్ అని, చేసిన తర్వాత అల్ హందులిల్లాహ్ అని వారికి వినబడే విధంగా చదవడం మరచిపోకు.
51- వారి కొన్ని తప్పిదాలను చూసిచూడనట్లుగా ఉండు. నీ మెదడును వారి తప్పిదాలను భద్రపరిచే స్టోర్ రూంగా చేయకు.
52- నీ నుండి ఏదైనా తప్పు జరిగితే దానికి నిజమైన సాకు చెప్పుకో.
53- నీవు విలక్షణం, ప్రత్యేక విశిష్టత గలవాడివని, నీవు ఇది చేయగలుగుతావని అతడ్ని ప్రోత్సహించు.
54- వారికి ఓ ప్రత్యేకత నీవు ప్రసాదించు.
55- అతని మాటను లేదా పనిని అవహేళన చేయకు.
56- అభినందన వాక్యాలు, శుభకాంక్ష పదాలు, స్వాగతం, మర్యాద పద్ధతులు నేర్పు.
57- (పెడమార్గం పట్టేవిధంగా) ఎక్కువగా గారాభం చేయకు.
58- ఏదైనా పని చేయించుకొనుటకు మాటిమాటికి డబ్బుల ఆశ చూపకు. అందువల్ల అతని వ్యక్తిత్వం దెబ్బతింటుంది.
59- వారిని నీ యొక్క నెంబర్ వన్ స్నేహితునిగా ఉంచు.
శారీరక నిర్మాణం
60- వారి ఆట కొరకు సరిపడు సమయం వారికివ్వు.
61- వారి కొరకు ప్రయోజనకరమై క్రీడాసామానులు తెచ్చిపెట్టు.
62- కొన్ని ఆటలు స్వయంగా వారే ఎన్నుకునే స్వేచ్ఛ వారికివ్వు.
63- వారికి ఈతాడుట, పరుగెత్తుట లాంటి శక్తిని పెంచే కొన్ని ఆటలు నేర్పు.
64- కొన్ని ఆటల్లో కొన్ని సందర్భాల్లో నీ కొడుకు నీపై గెలుపు పొందే అవకాశమివ్వు.
65- ఆచి తూచి మంచి ఆహారం వారికివ్వు.
66- వారి తిండి విషయంలో సమయపాలన పాటించు.
67- తిండి విషయంలో వారిని మితిమీరినతనం, అత్యాశ గుణాల నుండి హెచ్చరించు.
68- తినేటప్పుడు వారి ఒక్కో తప్పును లెక్కించే ప్రయత్నం చేయకు. (మంచి విధంగా నచ్చజెప్పు).
69- వారు ఇష్టపడే రుచుల వంటకాలు చేసే, చేయించే ప్రయత్నం చేయి.
మానసిక నిర్మాణం
70- వారు చెప్పే మాట నిశబ్దంగా విను. ఒక్కో పదం పట్ల శ్రద్ధ వహించు.
71- వారి ఇబ్బందులను వారే స్వయంగా ఎదురుకొని వాటి నుండి బైటికి రానివ్వు, పోతే వారు గ్రహించకుండా తగిన సహాయం కూడా వారికి అందించు.
72- వారిని గౌరవించు, వారు ఏదైనా మంచి కార్యం చేస్తే ధన్యవాదం తెలుపు.
73- ఏ మాటలోనైనా ప్రమాణం చేసే స్థితికి తీసుకురాకు, నీవు ప్రమాణం చేయకుండా చెప్పినా నేను నీ మాటను నమ్ముతాను అని ధైర్యం ఇవ్వు.
74- హెచ్చరికలు, బెదిరింపుల పదాలకు దూరంగా ఉండు.
75- వారు చాలా చెడ్డవాళ్ళు, మూర్ఖులు అర్థం చేసుకోరు అన్న భ్రమలో ఉండకు.
76- వారు ఎక్కువ ప్రశ్నలు వేస్తుంటే వారిని కసరుకోకుండా, సంక్షిప్తంగా మరియు నమ్మే విధంగా ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయి.
77- ఒక్కోసారి వారిని కౌగలించుకొని వారి పట్ల ప్రేమ, అప్యాయత చూపు.
78- కొన్ని విషయాల్లో వారి సలహా అడిగి, వారి సలహా ప్రకారం అమలు చేయి.
79- ఏవైనా నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంతపాటి స్వేచ్ఛ వారికిస్తున్నట్లు గ్రహింపనివ్వు.
సామాజిక నిర్మాణం
80- వేసవిలో (విద్యార్థుల కొరకు) ఏర్పాటయ్యే ప్రత్యేక శిబిరాల్లో వారి పేరు వ్రాయించి, అందులో పాల్గొనే స్వేచ్ఛనివ్వు. (అందులో ఇస్లాం ధర్మానికి వ్యెతిరేకమైన విషయాలు ఉంటే పాల్గోనివ్వకు). ఖుర్ఆన్ కంఠస్తం కొరకు ప్రత్యేకించబడిన క్లాస్ లో చేర్పించు. జి.కే. పోటీల్లో మరియు స్కౌట్ లో పాల్గొనె అవకాశం కలగజేయి.
81- అతిథుల ఆతిథ్యం స్వయంగా వారినే చేయనివ్వు, అది చాయ్, కాఫీ, ఫలహారాలు ఇవ్వడమైనా సరే.
82- నీవు నీ స్నేహితులతో ఉన్నప్పుడు నీ కొడుకు మీ వద్దకు వస్తే నీవు అతనికి స్వాగతం పలుకు.
83- మస్జిదులో అనాథల మరియు వితంతువుల సంక్షేమం లాంటి ఏవైనా సామాజిక కార్యక్రమం జరుగుతే అతడ్ని అందులో పాల్గొనే అవకాశమివ్వు.
84- కష్టపడి పని చేయడం మరియు క్రయవిక్రయాల, ధర్మ సమ్మతమైన మార్గాల ద్వారా సంపాదించే పద్ధతులు నేర్పు.
85- ఇతరుల ఇబ్బందులను గ్రహించి వాటిని (తన శక్తానుసారం) తగ్గించే ప్రయత్నం చేయడం నేర్పు.
86- అలా అని లోకమంతటి దిగులు తనే మోసుకునే వానిగా కూడా చేయకు.
87- నీ సామాజిక సేవల ఫలం అతడు చూసే అవకాశం కల్పించు.
88- కొన్ని పనులు పూర్తి చేసుకొని రా అని నీ కుమారుడ్ని పంపు, ఇంకా నీవు అతడ్ని నమ్ముతున్నావని గ్రహించనివ్వు.
89- అతడికి స్వయంగా తానే తన స్నేహితుడిని ఎన్నుకునే స్వేచ్ఛనివ్వు. నీవు ఇష్టపడేవారిలో ఏ ఒకరినైనా తన స్నేహితునిగా ఎన్నుకోనివ్వు. కాని నీవు తెలిసితెలియనట్లుగా నటించు.
ఆరోగ్యకరమైన నిర్మాణం
90- వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించు.
91- ఏ వయసులో ఏ టీకాలు ఇప్పించాలో అందులో అశ్రద్ధ వహించకు.
92- ఏ మందు ఏ పరిమాణంలో ఇవ్వాలో అంతే ఇవ్వు. నీ ఇష్టముతో ఎక్కువగా ఇవ్వకు.
93- వారిపై ధార్మిక దుఆలు చదవడం మరువకు.
94- వారిని రాత్రి తొందరగా పడుకోబెట్టి ప్రొద్దున తొందరగా మేల్కొలుపు.
95- తానే స్వయంగా తన శరీరం, పళ్ళు మరియు బట్టలు శుభ్ర పరుచుకునే అలవాటు చేయించు.
96- ఏదైనా రోగం ముదిరే వరకు వేచి ఉండకు.
97- అంటువ్యాదుల నుండి నీ సంతానాన్ని దూరంగా ఉంచు.
98- వారిలో ఎవరికైనా ఏదైనా భయంకరమైన వ్యాది సోకితే అది అతనికి తెలియనివ్వకు.
99- అల్లాహ్ వైపునకు మరలి ఆయన్నే వేడుకో. సర్వ రోగాల నివారణ ఆయన చేతుల్లోనే ఉంది.
సంస్కృతి మరియు విద్యాపరమైన శిక్షణ
100- వారికి కొన్ని పొడుపుకథలు తెలియజేయి.
101- తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఏదైనా వ్యాసం వ్రాయమని కోరు.
102- అతను వ్రాసేది నీవు ఎల్లప్పుడూ చదువు.
103- వ్యాకరణ, లేదా భాషా పరమైన ప్రతి తప్పు వద్ద ఆగి మందలించకు.
104- చదువుకొనుటకు తానే స్వయంగా ఏదైనా పుస్తకం లేదా కథలు ఎన్నుకోనివ్వు.
105- చదువుతూ ఉండమని ప్రోత్సహించు.
106- ఏదైనా చదవడంలో నీవు వారితో పాల్గొను.
107- చురుకుతనాన్ని పెంచే కొన్ని ఆటలు, క్రీడా సామానులు తెచ్చిపెట్టు.
108- అతడు ఎప్పుడూ తన చదువులో విజయం సాధించాలని ప్రోత్సహిస్తూ ఉండు.
109- తన చదువులో ముందుకు వెళ్ళే దారిలో వచ్చే అంతరాయాలను అధిగమించేవానిగా అతడ్ని తయారు చేయి.
110- పూర్వికుల మరియు ప్రస్తుత కవుల కొన్ని మంచి కవిత్వాలు మరియు వారి వివేకవంతమైన విషయాలను జ్ఞాపకం చేసుకోమని ప్రోత్సహించు.
111- అరబీ (మరియు తన మాతృ) భాషలోని కొన్ని సామెతలు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రోత్సహించు.
112- ప్రసంగం మరియు (ఎటువంటి స్థాన, సందర్భంలోనైనా) సంభాషించే కళ (పద్ధతి) నేర్పు.
113- అతనికి సంవాదన మరియు ఒప్పించే కళ (పద్ధతులను) నేర్పు.
114- వ్యక్తిగత యోగ్యతలను, సామర్థ్యాలను పెంచే క్లాస్ లలో పాల్గోనివ్వు.
115- మాతృ భాషే కాకుండా చాలా ప్రాచుర్యమైన వేరే భాష కూడా సంపూర్ణంగా నేర్చుకొనుటకు ప్రోత్సహించు.
సత్ఫలితం, దుష్ఫలితం
116- ఒక్కోసారి శిక్షా మరియు ప్రతిఫలాల పద్ధతి అనుసరించు.
117- ప్రతిఫలమైనా లేదా శిక్ష అయినా ఎల్లప్పుడూ ఇవ్వకు.
118- ఎల్లప్పుడూ డబ్బు రూపంలోనే కాకుండా వేర్వేరు రకాల బహుమానాలిస్తూ ఉండు. అది ఎటైనా టూర్/ ప్రయాణం గాని, లేదా కంప్యూటర్ ఆట గాని, లేదా గిఫ్టు గాని లేదా ఫ్రెండ్ తో కలసి బైటికి వెళ్ళడానికి అనుమతి గాని కావచ్చు.
119- అలాగే శిక్ష కూడా వివిధ రకాల్లో ఉండాలి. కేవలం కొట్టడం ఒకటే నీ దృష్టిలో ప్రధానంగా ఉండకూడదు. ఆగ్రహంతో కూడిన దృష్టి కావచ్చు, గద్దించటం కావచ్చు, కొంత సేపు వరకు మాట్లాడ కుండా ఉండడం కావచ్చు, రోజువారిగా ఇచ్చే ఏదైనా ప్రత్యేక వస్తువు ఇవ్వకుండా ఉండడం కావచ్చు లేదా సెలవు రోజు పార్కు లేదా మరే వినోదానికైనా వెళ్ళడం మానుకొనుట కావచ్చు.
120- తప్పును తిరిగి చేయకుండా ఉంచగలిగే శిక్ష సరైన శిక్ష.
121- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సేవకుడిని ఒక్కసారైనా కొట్టలేదన్న విషయం గుర్తుంచుకో.
122- తొలిసారే శిక్ష విధించకు.
123- శిక్షించడంలో కఠినత్వం వహించకు.
124- శిక్షించినప్పుడు ఎందుకని శిక్షించావో దాని కారణం విశదీకరించు.
125- నీవు శిక్షించి ఆనందిస్తున్నావన్న భావన రానివ్వకు. లేదా మనసులో అతని గురించి ఏదైనా కపటం ఉంచుకున్నావని కూడా అర్థం కానివ్వకు.
126- ప్రజల ముందు కొట్టకు అలాగే కోపంగా ఉన్నప్పుడు కొట్టకు.
127- అతని ముఖం మీద కొట్టకు. మరియు అవస్త, నొప్పి కాకూడదంటే అవసరం కంటే ఎక్కువ కొట్టకు.
128- కొట్టనని వాగ్దానం చేసిన తర్వాత మళ్ళీ కొట్టకు. ఇలా వారు నీ మీద నమ్మకాన్ని కోల్పోతారు.
129- నీవు శిక్షిస్తున్నది అతని మేలు కొరకే అని గ్రహింపజేయి. మరియు నీ పట్ల గల ప్రేమే ఒక్కోసారి ఈ స్థితి తెప్పిస్తుందని నచ్చజెప్పు.
130- శిక్ష అనేది నిన్ను బాధించుటకు కాదు నీవు ఉత్తమ శిక్షణ పొందుటకు మాత్రమే అని తెలియజేయి.
అల్లాహ్ మనందరికీ సన్మార్గం, సద్భాగ్యం ప్రసాదించుగాక. ప్రవక్త పై అనేకానేక కరుణ, శాంతులు కురియింప జేయుగాక
[1] మూడు చిరు పుస్తకాలను కలిపి ఒక పుస్తకంగా ముద్రించబడుతుంది. అయితే వాటిలో ఈ చిరుపుస్తకం మొదటిది.
[2] తప్పు చేసినందువల్ల లేదా లోపంవల్ల మనస్సుకు కలిగే జంకును హయా అని అరబీలో షేమ్ అని ఇంగ్లీషులో అంటారు. చేయవలసిన పని చేయకుండా సిగ్గు పడుటను ఖజల్ అని అరబీలో బాష్ ఫుల్ నెస్ అని ఇంగ్లీషులో అంటారు
25.34980855.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రేమ బంధాలు (Muhabbat ke Bandhan) – Bonds of Love in Islam అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
[1] ఇస్లామీయ అభివందనం [2] ఆహ్వాన స్వీకారం [3] జన శ్రేయోభిలాష ధర్మానికి పునాది [4] తుమ్మిన వారికి బదులు పలకడం [5] రోగిని పరామర్శించడం [6] జనాజా వెంట వెళ్లడం
హృదయాలను కలిపే కళ :
[1] సహాబా శిక్షణ పొందిన ఉన్నత ఉదాహరణ [2] విభేదాలను విడనాదడంలో ఇస్లామీయ విధానం [3] ఇస్లాం పై మాత్రమే ఐక్యత
[క్రింద పూర్తి పుస్తకాన్ని చదవండి]
ముందు మాట
ఇన్నల్ హంద లిల్లాహి నహ్మదుహూ వ నస్తఈనుహూ వ నస్తఘ్ ఫిరుహూ వ నస్తహ్ దీహ్, వ నఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅమాలినా, మన్ యహ్ దిహిల్లాహు ఫలా ముజిల్లలహూ వమన్ యుజ్లిల్ హు ఫలా హాదియ లహ్, వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహ్, సల్లల్లాహు అలైహి వ అలా ఆలిహీ వసహ్ బిహీ వ సల్లమ తస్లీమన్ కసీరా. అమ్మా బాద్:
నిశ్చయంగా అల్లాహ్ కొరకే ప్రేమించడమనేది విశ్వాస మూల సూత్రాల్లో ఒకటి, అది దాని పటిష్ఠమైన కడియాల్లో ఒకటి అని సత్య సంధులైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు.
మన ప్రభువు విశ్వాసుల మధ్య కొన్ని ప్రేమ బంధాలను ఏర్పరిచాడు. వారి హృదయాలను వాటితో కలిపాడు. వాటి ప్రస్తావన తన దివ్య గ్రంథంలో అనేక చోట్ల చేశాడు. ఉదాహరణకు:-
విశ్వాసులందరూ పరస్పర సహోదరులు. (హుజురాత్ 49: 10).
మీరంతా కలసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి. విభేదాలలో పడకండి. (ఆలె ఇమ్రాన్ 3: 103).
ఇంకా ముస్లిముల మనస్సులను ఒకదానితో ఒకటి కలిపిన వాడూ ఆయనేకదా! నీవు సమస్త భూసంపదను ఖర్చు పెట్టినా, వారి మనస్సులను కలపగలిగి ఉండేవాడవు కాదు. కానీ అల్లాహ్ వారి మనస్సులను కలిపాడు. నిశ్చయంగా ఆయన మహా శక్తిమంతుడు, మహా వివేకవంతుడు. (అన్ఫాల్ 8: 63).
పరస్పర స్నేహం విశ్వాసుల వరకే పరిమితం చేశాడు అల్లాహ్. చదవండిః
విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ, వారందరూ ఒకరి కొకరు సహచరులు. (తౌబా 9: 71). మరో ఆదేశం:
వాస్తవానికి మీ మిత్రులు కేవలం అల్లాహ్, అల్లాహ్ ప్రవక్త, నమాజును స్థాపించే జకాత్ ఇచ్చే, అల్లాహ్ ముందు రుకూ చేసే విశ్వాసులు మాత్రమే. అల్లాహ్ నూ, ఆయన ప్రవక్తనూ, విశ్వాసులనూ తమ మిత్రులుగా స్వీకరించేవారు, అల్లాహ్ పక్షమే ఆధిక్యం వహిస్తుందని తెలుసుకోవాలి. (మాఇద 5: 55,56).
ప్రేమ బంధాల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించటమే కాదు, ఆయనే దానికి నాంది వేశారు. దాని నిర్మాణాన్ని బలపరిచారు. ఈ ప్రేమ తన అనుచరుల హృదయాల్లో ప్రళయం వరకు ఉండేట్లుగా చేశారు. అబూ హురైరా ఉల్లేఖనాన్ని గమనించండిః
“ఒక ముస్లిం పట్ల మరొక ముస్లింకు ఆరు హక్కు (బాధ్యత) లున్నవి” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా, అక్కడున్న వారు అవేమిటి ప్రవక్తా? అని అడగ్గా, ఆయన ఇలా సమాధాన మిచ్చారుః “1. నీవు ముస్లిం సోదరుడ్ని కలిస్తే అతనికి సలాం చేయి. 2. అతను (భోజనానికి) ఆహ్వానిస్తే ఆహ్వానాన్ని స్వీకరించు. 3. అతను నీ ద్వారా ఏదయినా మేలును కాంక్షిస్తే దాన్ని అందజేయి. 4. అతను తుమ్మి ‘అల్ హందులిల్లాహ్’ అనంటే నీవు దానికి ‘యర్ హముకల్లాహ్’ అని బదులు పలుకు. 5. అతను వ్యాధిగ్రస్తుడైతే వెళ్ళి పరామర్శించు. 6. అతను మరణిస్తే అతని జనాజాకు తోడుగా వెళ్ళు”([1]).
పై హదీసులో చెప్పబడిన విషయాల అవసరం, నేటి మన సమాజానికి చాలా ఉంది. గడిచే ప్రతీ రాత్రి లేక పగలులో మనలోని ఏ ఒక వ్యక్తికైనా ఈ అవసరం పడుతుంది. అయినా చాలా మంది తమ ముస్లిం సోదురుల పట్ల గల బాధ్యతలు నెరవేర్చడంలో చాలా వెనకబడియున్నారు. రోగులను పరామర్శించడం లేదు. ఏ ఒక్క జనాజా వెంట నడవడం లేదు. పరస్పరం సలాం చేసుకోవడం లేదు.
ఎప్పుడైతే నేను ఈ పరిస్థితిని చాలా స్పష్టంగా గమనించానో అల్లాహ్ సహాయం కోరుతూ ఈ పుస్తక రచనకు అవసరమైన అంశాలను సమకూర్చాను. ఇందులో కొన్ని ప్రేమ మార్గాల(బంధాల)ను ప్రస్తావించాను. ఇవి స్వయంగా నాకు ఉపదేశాలుగా, పిదప నా ముస్లిం సోదరుల కొరకు, వారు తమ మధ్య ప్రేమ బంధాలను పెంపొందించాలని. ఇలా వారి మధ్య ప్రేమానురాగాలు మరియు వాత్సల్యం పెరగాలని అభిలషిస్తున్నాను.
“మీలో ఎవరైనా తన సోదరుడ్ని కలిసినప్పుడు అతనికి సలాం చేయాలి”([2]). అల్లాహ్ తన ప్రవక్తపై అవతరింపజేసిన సలాం ఇదే. మరియు స్వర్గవాసుల సలాం కూడా ఇదే. అల్లాహ్ ఆదేశం:
వారు ఆయనను కలిసే రోజున వారి అభివందనములు సలాము అని యుండును. (అహ్ జాబ్ 33: 44). అల్లాహ్ తన దాసుల కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తమ అనుచరుల కొరకు ఈ సలామునే ఇష్టపడ్డారు. ఈ ఇస్లామీయ సలాంను వదలి ఇతర అభివందనాలను ఉపయోగించుట ఏ ముస్లింకూ తగదు. ఉదాహరణకుః గుడ్ మార్నింగ్, స్వాగతం, లాంటి తదితర అభివందనాలు. ఇమ్రాన్ బిన్ హుసైన్ రజియల్లాహు అన్హు చెప్పారుః మేము అజ్ఞాన కాలంలో ‘అన్అమల్లాహు బిక ఐనా’, ‘అన్అమ సబాహా’ అని అనే వారము. ఇస్లాం వచ్చిన తరువాత వాటి నుండి మమ్మల్ని వారించడం జరిగింది(2). ఇబ్ను అబీ హాతిం మఖాతిల్ బిన్ హయ్యాన్ నుండి ఉల్లేఖించారుః అజ్ఞాన కాలంలో వారు ‘హుయ్యీత మసాఅన్’, ‘హుయ్యీత సబాహన్’ అని అనే వారు. అయితే వాటిని అల్లాహ్ సలాంతో మార్చేసాడు([3]). అందుకని ముస్లిం ఈ గొప్ప సలామునే ఉపయోగించాలి. ఇది మనకు ప్రవక్త నుండి లభించిన ఆస్తి. ధార్మిక పద్ధతి కూడా ఇదే. అల్లాహ్ ఆదేశం:
మీకు ఎవరైనా గౌరవభావంతో సలాము చేస్తే అతనికి మీరు అంత కంటే ఉత్తమమైన పద్ధతిలో ప్రతిసలాము చెయ్యండి. లేదా కనీసం అదే విధంగానైనా చెయ్యండి. అల్లాహ్ ప్రతి దానికి లెక్క తీసుకుంటాడు. (నిసా 4: 86).
పై ఆయతులో [{అంతకంటే ఉత్తమమైన పద్ధతి లో} అని అంటే అతను ‘అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహ్’ అని అంటే నీవు జవాబులో ‘వఅలైకుముస్సలాము వ రహ్మతుల్లాహి వ బరకాతుహు’ అనాలి. లేదా కనీసం ‘వఅలైకు ముస్సలాము వ రహ్మతుల్లాహ్’ అనాలి.
అబూ దావూద్, తిర్మిజి([4])లో సహీ సనద్ (ప్రామాణిక ఆధారం)తో ఇమ్రాన్ బిన్ హుసైన్ ఉల్లేఖించారుః ఒక వ్యక్తి ప్రవక్త ﷺ వద్దకు వచ్చి అస్సలాము అలైకుం అన్నాడు. ప్రవక్త ﷺ అతనికి బదులు పలికారు. అతడు కూర్చున్నాడు. ప్రవక్త “పది” అని చెప్పారు. మరో వ్యక్తి వచ్చి అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహ్ అన్నాడు. ప్రవక్త ﷺ జవాబు ఇచ్చారు. అతడు కూర్చున్నాడు. ప్రవక్త “ఇరవై” అని అన్నారు. ఇంకొక వ్యక్తి వచ్చి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు అన్నాడు. ప్రవక్త ﷺ ప్రతిసలాము చేశారు. అతడు కూర్చున్నాడు. ప్రవక్త ﷺ “ముప్పై” అని అన్నారు. అంటే పూర్తి సలాము చెప్పినతనికి ముప్పై పుణ్యాలు అని భావం.
ఇవి ప్రవక్త బోధనలు. మరియు ఇది ప్రవక్త శిక్షణా విధానం. అయితే ప్రవక్త బోధనలను ఆచరణ రూపంలో తీసుకువచ్చి, ఆయన విధానాన్ని అనుసరించడం వల్ల ఏకైకుడైన అల్లాహ్ నుండి లభించే ఏ గొప్ప ప్రతిఫలం వారి కొరకు వేచి ఉన్నదో దాని శుభవార్త తమ సహచరులకు తెలుపుతూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయాల్లో సున్నతుల ప్రేమ ఎలా నాటుతున్నారో గమనించండి.
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, ఒక వ్యక్తి ప్రవక్త ﷺ వద్దకు వచ్చి ఏ ఇస్లాము మేలైనది? అని ప్రశ్నించాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అన్నం తినిపించు. నీకు పరిచయం ఉన్నవారికీ లేనివారికీ అందరికీ సలాం చేయి” అని సమాధానం ఇచ్చారు.([5])
నీకు ముందు నుండే పరిచయం ఉన్నవారు, పరిచయం లేని వారందరికీ సలాం చేయి. ఇది కూడా ఇస్లామీయ మరియు ప్రవక్త గారి పద్ధతి. కొందరు సలఫె సాలిహీన్ ఇలా చెప్పారుః ‘వెనకటివారిలో సలాం కేవలం పరిచయం ఉన్నవారికే పరిమితం అయ్యింది. ఇది ప్రళయసూచనల్లో ఒకటి. ముస్లిములందరికీ -వారు తెలిసినవారైనా, తెలియనివారైనా- సలాం చేయటం ప్రతి ముస్లింపై విధిగా ఉంది. – అయితే యూదులు, క్రైస్తవులు మరియు విగ్రహారాధకులకు తప్ప. పై హదీసు గాని, పరస్పర హక్కులను స్పష్టపరచడానికి వచ్చిన హదీసుల్లో గాని ‘అందరికి సలాం చెయ్యండి’ అని అంటే ముస్లి ములు అనే భావం. ఏ మనిషి ముస్లిం సమాజములో జీవిస్తు న్నాడో అతను కలిసినవారందిరికీ సలాం చేయాలి. వారు అతని స్నేహితులైనా కాకపోయినా, బంధువులైనా కాకపోయినా – ఏ ముస్లిమైనా సరే.
నేడు మనం సమాజములో తెలిసినవారికే సలాం చేస్తున్నాము. దారిలో వెళ్తూ గమనిస్తే అందరూ తమ పరిచయస్తులకే సలాం చేస్తున్నారు. పరిచయం లేనివారికి సలాం చేయడం లేదు. ఇది అజ్ఞానకాలం నాటి ఆచరణ. ప్రవక్త ﷺ పద్ధతికి వ్యతిరేకం. బుఖారీ, ముస్లింలో ఉందిః అల్లాహు తఆలా ఆదం అలైహిస్సలాంను పుట్టించిన తర్వాత ఇలా చెప్పాడుః “అదిగో అక్కడ కూర్చుండియున్న దూతల వద్దకు వెళ్ళి సలాం చేయి. వారు ఏమని జవాబిస్తారో శ్రద్ధగా విను, అదే నీ యొక్క మరియు నీ సంతానం యొక్క సలాం”. ఆయన వెళ్ళి అస్సలాము అలైకుం అన్నారు. వారు అస్సలాము అలైక వ రహ్మతుల్లాహ్ అని సమాధానమిచ్చారు([6]). అంటే రహ్మతుల్లాహ్ అన్న పదాలు ఎక్కువ పలికారు. ఇదే ఆదం అలైహిస్సలాం, ఆయన సంతతి మరియు స్వర్గవాసుల సలాం.
ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారని అబూ హురైరా ఉల్లేఖించారుః
“మీరు విశ్వాసులు కానంత వరకు స్వర్గంలో ప్రవేశించలేరు. మీరు పరస్పరం ప్రేమతో మెలగనంత వరకు విశ్వాసులు కాలేరు. నేను ఒక విషయం చెప్పనా? దాన్ని మీరు పాటిస్తే తప్పక పరస్పరం ప్రేమతో మెలగ గలుగుతారు! మీలో పరస్పరం సలాంను వ్యాపింప చేయండి”([7]).
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా స్పష్టంగా చెప్పారుః విశ్వాసం లేనిదే స్వర్గంలో ప్రవేశం లభించదు. ప్రేమ లేనిదే విశ్వాసం ప్రాప్తి కాదు. సలాంను వ్యాపింప జేస్తే తప్ప ప్రేమను పొందలేరు.
సలాంను వ్యాపింపజేయటం వల్ల హృదయాల్లో ఉన్న కాపట్యం దూరమవుతుంది. ప్రత్యేకంగా బంధువుల్లో, ఇరుగు పొరుగువారిలో. ఇస్లాంలో దాని భావం ఏమిటంటే నీవు సంధి కొరకు తెల్ల జెండాను ఎగరవేస్తున్నావు. అంటే నీవు ఇలా అంటున్నావన్న మాట! నేను నా తెల్ల జెండాను ఎగరవేస్తు వచ్చాను నేను మీ శాంతి కోరుతున్నాను, నా నుండి కూడా మీకు శాంతియే కలుగును గనక మీరు నా పట్ల భయ పడకండి.
ఇదే ప్రేమ చిహ్నం మరియు ఉత్తమ పద్ధతినూ. మన ప్రవక్త ﷺ దాన్ని స్థాపించారు. ప్రవక్త తమ సహచరుల్లో వారి తరువాత తమ అనుచర సంఘ సభ్యుల హృదయాల్లో నాటడానికి ప్రోత్సహించారు. బుఖారీలో ఉందిః అమ్మార్ బిన్ యాసిర్ చెప్పారుః ‘మూడు విషయాలు ఎవరిలో ఉన్నాయో అతనిలో విశ్వాసమున్నట్లేః తన ఆత్మకు న్యాయం చేసుకోవటం. అందరికీ సలాం చేయటం. లేమిలో కూడా దానం చేయటం'([8]). అందరికీ సలాం చేసే వ్యక్తిలో వినమ్రత ఉందని భావం. అతను ఎవరిపై అహంభావాన్ని వ్యక్తపరచడు. చిన్న, పెద్ద, గౌరవంగలవానికి, నీచునికి, పరిచయస్తునికి, అపరిచితునికి అందరికీ సలాం చేస్తాడు. అదే అంహంభావి అయితే దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. అతడు తన అహంభావం వల్ల కనీసం సలాం చేసినవారికి ప్రతిసలాం కూడా చేయడు. ఇక ఇతరులకు సలాం చేయడంలో ఎలా ముందంజం వేస్తాడు?. (జాదుల్ మఆద్ 2/410 చూడండి).
బుఖారి, ముస్లింలో ఉంది: ప్రవక్త ﷺ చిన్నారులకు కూడా సలాం చేసేవారని అనస్ రజయల్లాహు అన్హు తెలిపారు([9]). ఇది ప్రవక్త గారి జాలితనం, మృదుత్వం మరియు వినమ్రత. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సలాములు పొందినందు వల్ల ఆ చిన్నారుల మనుస్సుల్లో ఓ గొప్ప సంతోషం, ఆనందం చోటు చేసుకుంటుంది. మహాప్రవక్త నాకు సలాం చేశారు అని వారు తమ సభల్లో చెప్పుకుంటారు.
అందుకు ముస్లింలు ఇలాంటి వారితో కూడా వినమ్రతా గుణం పాటించాలి. వారు చిన్నారులు (బచ్చాగాళ్ళు) కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. వారిని వెదికి, వారికి సలాం చేసి, వారికి ఇలాంటి ప్రేమ నేర్పాలి. ఉత్తమ గుణాల వైపు ప్రోత్సహించాలి.
చరిత్రలో మనం ఉమర్ రజియల్లాహు అన్హు గారిని చూశాము. ధర్మం విషయంలో ఆయన నిర్భయుడు, ప్రబలుడై కూడా బాలల నుండి దాటుతున్నప్పుడు వారి వద్ద నిలిచి వారికి సలాం చేసి, వారి వినోదంలో కొంత పాలుపంచుకునేవారు. ఈ సందర్భంలో అతను ‘ఖలీఫా’. అంటే పెద్ద రాజు.
ఒక రోజు మదీనా బాలలు ఆడుకుంటుండగా వారి దగ్గరి నుండి దాటారు, వారు ఆయన్ని చూసి తమ ఇంటికి పరిగెత్తారు. అంతకు ముందే వారు ఆయన పలుకుబడి, అధికారం గురించి విని ఉన్నారు.
ఉమర్ ముందు నుండి షైతానులు పారిపోయినప్పుడు బాలలదేముంది?
చిన్నారుల హృదయాలు పక్షిలాంటివి. ఎందుకని పారిపోరు? ఆ నాటి సూపర్ పవర్ దేశాల (రోమ్ మరియు పర్షియా/ ఇరాన్) రాజులు ఉమర్ పేరు విని (తమ భవిష్యత్తు గురించి) నిరాశ చెంది ఒక్కోసారి స్పృహ తప్పేవారు. పిల్లవాళ్ళు ఏ పాటి?
అందరూ పరుగులు తీశారు. కాని అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ మాత్రం పోలేదు. అక్కడే ఉండిపోయాడు. ఆ సందర్భంలో అతడు నవయువకుడు. ఉమర్ పరియాచకంగా ‘ఏమిటి నీ మిత్రులు పారి పోయారు. నీవు పారిపోలేదు? నీవు భయపడలేదా? అని అడిగారు.
దానికి అబ్దుల్లాహ్ ‘నేనేమి పాపం చేయలేదు కదా మీకు భయపడ్డానికి! దారి కూడా అంత ఇరుకగా లేదు కదా నేను పక్కకు జరిగి మీకు దారివ్వడానికి! అని సమాధానమిచ్చాడు.
అప్పటి నుండే అతని ప్రతిభ, తెలివితేటలు, ధైర్య సాహసాలు ప్రస్ఫుటమయ్యాయి. అయినా అతను ఎవరి బిడ్డ? అతని తండ్రి జుబైర్ బిన్ అవ్వామ్ మరియు తల్లి అస్మా రజియల్లాహు అన్హా .
{ఒకరి వంశాన్నుండి ఒకరు జన్మించిన వీరందరూ ఒకే పరంపరకు చెందినవారు. అల్లాహ్ అంతా వింటాడు. ఆయనకు అంతా తెలుసు}. (ఆలె ఇమ్రాన్ 3: 34).
3- ఇతరులకు సలాం అందజేసే బాధ్యతః
తమకు ఎదురైన వారికి ప్రవక్త ﷺ స్వయంగా సలాం చేసే వారు. దూరంగా ఉన్నవారిలో ఆయన సలాం కోరువారికి సలాం పంపేవారు. ఒకసారి ఆయన ﷺ ఓ రోగి వద్దకు ఒక యువ కుడిని పంపారు. అతను ఆ రోగి వద్దకు వచ్చి ప్రవక్త ﷺ మీకు సలాం తెలుపుతున్నారు అని చెప్పాడు([10]). అలాగే ఎవరికైనా సలాం అందజేసే బాధ్యత కూడా ఆయన ﷺ స్వీకరించేవారు([11]). ఒకసారి జిబ్రీల్ అలైహిస్సలాం ఆకాశం నుండి దిగి వచ్చారు, అప్పుడే ఖదీజ రజియల్లాహు అన్హా ప్రవక్త ﷺ వద్దకు వస్తున్నారు. జిబ్రీల్ చెప్పారుః ‘ప్రవక్తా! అదిగో ఖదీజా ఏదో తిను పదార్థం లేక పానీయం తీసుకొని వస్తున్నారు, ఆమె వచ్చాక ఆమెకు ఆమె ప్రభువు యొక్క సలాం తెలుపండి. నా సలాం కూడా తెలుపండి. ఇంకా ఆమె కొరకు స్వర్గంలో ఒక ముత్యాల గృహం ఉందని, అందులో ఏ మాత్రం అలజడిగానీ మరియు అలసటగానీ లేదని శుభవార్త ఇవ్వండి’([12]). ఈ విధంగా జిబ్రీల్ యొక్క సలాం ఆయిషా రజియల్లాహు అన్హా గారికి కూడా అందజేశారు([13]).
సలాం పదాలు ‘వబరకాతుహు’తో ముగిస్తాయి. దీనిని బలమైన సనదు(ఆధారా)లతో అబూ దావుద్ మరియు తిర్మిజి ఉల్లేఖించారు. కొన్ని ఉల్లేఖనాల్లో ‘వమగ్ఫిరతుహు’ అని అదనంగా ఉంది. కాని ఇది జఈఫ్ (బలహీనమైన ఆధారం). అబూ దావూద్ స్వయంగా నిరాధారమైన హదీసు అని దీని గురించి ప్రస్తావించారు([14]).
ప్రవక్త ﷺ ఒక్కోసారి మూడేసి సార్లు సలాం చేసేవారని అనస్ రజియల్లాహు అన్హు తెలిపారు([15]). ఒక పెద్ద జనసమూహానికి సలాం చేసినప్పుడు ఒకే సలాం అందరికి వినబడదన్న ఉద్దేశంతో బహుశ ఈ పద్ధతి పాటించేవారు. ఈ విషయం హాకిం వద్ద ఒక ఉల్లేఖనంలో ఉంది.
హదీసులో వచ్చిన ఒక విషయం ఇది కూడానుః ప్రవక్త ﷺ సఅద్ బిన్ ఉబాదాను కలుసుకోడానికి వెళ్ళారు. అతని ఇంటి వద్దకు వచ్చి “అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” అని అన్నారు. సఅద్ విని మనుసులోనే జవాబి చ్చారు. గొంతెత్తి జవాబు పలుకలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరోసారి “అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” అని అన్నారు. ప్రవక్తకు వినబడనట్లుగా సఅద్ మెల్లగా జవాబిచ్చారు. ప్రవక్త ﷺ మూడవసారి “అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” అని అన్నారు. అప్పుడు కూడా సఅద్ మెల్లగానే జవాబిచ్చారు. ప్రవక్త గారికి వినబడలేదు గనక ప్రవక్త అక్కడి నుండి తిరిగి వెళ్లారు. సఅద్ బిన్ ఉబాద వెంటనే ప్రవక్త వెనక వెళ్ళి ఇలా విన్నవించుకున్నారుః ‘ప్రవక్తా! తమరు సలాం చేసినప్పుడల్లా నేను విన్నాను. మెల్లగా జవాబిచ్చాను. దీని వెనక నా ఉద్దేశ్యం మీ సలాములను ఎక్కువగా పొందాలన్నది మాత్రమే’. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “అస్సలాము అలైకుం అహ్లల్ బైతి వ రహ్మతుహు ఇన్నహూ హమీదుమ్మజీద్”([16]).
4- స్త్రీలకు సలాం:
ఒకసారి ప్రవక్త ﷺ స్త్రీల సమూహం నుండి దాటుతూ (చెయ్యి సైగతో) వారికి సలాం చేశారు([17]). ఇది ప్రవక్త ﷺ యొక్క ఉత్తమ గుణం. ఎందుకనగా ఆయన స్త్రీపురుషులందరి వైపునకు ప్రవక్త.
కొందరు విద్యావంతులు ఇలా చెప్పారుః ఏ అటంకాలూ లేనప్పుడు, చెడు వైపునకు కారణమయ్యే భయం లేనప్పుడు పురుషులు స్త్రీలకు సలాం చేయవచ్చు. ఉదాహరణకు వృద్ధు రాళ్ళకు సలాం చేయుట. అలాంటి వారికి నీవు సలాం చేసి కొంత సేపు వారితో ఉండి వారి సంక్షేమాలు తెలుసుకో, ఇలా ప్రవక్త సహచరులు చేశారు. బుఖారీలో సహల్ బిన్ సఅద్ ఉల్లేఖనంలో ఉందిః వారు జుముఅ నమాజు చేసుకొని వారి దారి మధ్యలో ఉన్న ఒక ముసలి తల్లి వద్దకు వచ్చి, ఆమెకు సలాం చేసేవారు. ముస్లిముల్లో వయసుగల వారితో ఇలాంటి గౌరవభావం చాలా మంచి విషయం. ఇస్లాం ఈ విషయంలో ప్రోత్సహిస్తున్నట్లు అనేక ఆధారాలు గలవు. ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం జాదుల్ మఆద్ (2/412) లో పేర్కొన్నారు.
సలాం మర్యాదలుః
1- ప్రవక్త ﷺ చెప్పారుః “చిన్నవాళ్ళు పెద్దవాళ్లకు, కాలినడకన వెళ్ళేవారు కూర్చున్నవారికి, వాహనముపై ఉన్నవ్యక్తి కాలినడకన వెళ్ళేవారికి, చిన్న సమూహం పెద్ద సమూహానికి సలాం చేయాలి([18]).
చిన్నవారు పెద్దవారికి సలాం చేయాలిః ప్రవక్త ﷺ గారి ఈ ఆదేశంలో గొప్ప వివేకం గలదు. పెద్దవారు గౌరవమర్యాదలకు హక్కు దారులు. అందుకు చిన్నవారు పెద్ద వారికి సలాం చేయడంలో ముందడుగు వేయాలి. నీవు వయసులో నీకంటే పెద్దవారిని కలిసినప్పుడు నీవు ముందుగా అతనికి సలాం చేయడం నీపై విధిగా ఉంది. అతను నీకంటే పెద్ద వాడైనందు వల్ల నీవు అతన్ని గౌరవిస్తున్నావు అని అతనికి తెలియజేయాలి. ఒకవేళ అతనే నీకు ముందుగా సలాం చేస్తే అతను నీకంటే ఉత్తముడు. అందులో ఏ అనుమానం లేదు.
చిన్నవారు పెద్దవారికి సలాం చేయాలి అనే ఆధారంపై పెద్ద ఆలింకు, ముస్లిం పండితునికి ఇంకా ఉన్నత స్థానం కలవారికి మనం సలాం చేయాలి.
కూర్చున్నవారికి కాలినడకన వెళ్ళేవారు సలాం చేయాలిః ప్రవక్త ﷺ గారి ఈ ఆదేశం ప్రకారం కాలినడకన వెళ్ళేవారు కూర్చున్న వారికి సలాం చేయుట విధిగా ఉంది. కొందరు నడుస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, కూర్చున్నా అన్ని స్థితుల్లో ఇతరుల సలాం కొరకు వేచి ఉంటారు. స్వయంగా ముందుకు వెళ్ళి సలాం చేయరు. ఇది చాలా తప్పు. దీని కారణంగా అతను గర్వానికి గురయ్యే అవకాశం ఉంది. ఇందులో సున్నతు పద్ధతి ఏమిటో తప్పక తెలుసుకోవాలి. దాన్ని అనుసరించాలి. నడిచే వ్యక్తియే కూర్చున్న వ్యక్తికి సలాం చేయాలి. ఎందుకంటే ఒక్కోసారి అతనే ఒంటరిగా ఉండవచ్చు. కూర్చున్నవారు కొంతమంది అయి ఉండవచ్చు. నడిచేవ్యక్తి వారి మధ్య హఠాత్తుగా రావచ్చు.
వాహనముపై ఉన్న వ్యక్తి నడిచివెళ్ళే వ్యక్తికి సలాం చేయాలిః వాహనములో ఉన్న వ్యక్తి నడిచి వెళ్ళే వ్యక్తికి సలాం చేయాలి. ఇందులో కొన్ని సూక్ష్మవిషయాలున్నాయి అని ఫత్ హుల్ బారిలో ఉందిః వాహనములో ఉన్న వ్యక్తి తనకు తాను ఉన్నతుడుగా భావిస్తాడు. అందుకని ఇస్లాం నడిచేవాళ్ళకు సలాం చేయుట అతనిపై విధిగా చేసింది. అతనిలో నమ్రత మరియు మృదుత్వ గుణాలు రావాలని మరియు అహంకార భావానికి గురి కాకూడదని.
చిన్న సమూహం పెద్ద సమూహానికి సలాం చేయాలిః ఒక వ్యక్తి ఒక సమూహం దగ్గరి నుండి వెళ్తుంటే అతను ఆ సమూహానికి సలాం చేయాలి. ఐదుగురు పది మంది మీదుగా పోతున్నప్పుడు ఐదుగురు పది మందికి సలాం చేయాలి. పది మంది ఐదుగురికి కాదు సలాం చేయాల్సింది. “జమాఅతులోని ఒక వ్యక్తి సలాం చేసినా అది వారందరి తరఫున సరిపోతుంది. అలాగే కూర్చున్నవారిలో ఏ ఒక్కరు జవాబిచ్చినా అది వారందరి తరఫున సరిపోతుంది”. ఈ హదీసు అబూదావూద్([19])లో ఉంది. దీనికొక సాక్ష్యం ముఅత్త మాలిక్([20])లో ఉంది. దానితో కలసి ఇది హసన్ స్థానానికి చేరుతుంది.
ప్రవక్త ﷺ చెప్పారుః “నడిచే వ్యక్తి నిలుచున్న వ్యక్తికి సలాం చేయాలి([21])“.
ఇవి ప్రవక్త ﷺ పద్ధతులు, శిక్షణలు, వివేకముతో కూడిన ఆదేశాలు. ఆయన మనకు మేలైన ప్రతీ విషయాన్ని చేయాలని ప్రోత్సహించారు. ప్రతీ చెడు నుండి వారించారు.
“వాహనముపై ఉన్న వ్యక్తి నడుస్తున్న వ్యక్తికి, నడుస్తున్న వ్యక్తి కూర్చున్న వ్యక్తికి సలాం చేయాలి. ఇక ఇద్దరు నడుస్తూ ఎదురెదురుగా కలుసు- కున్నప్పుడు ఎవరు సలాం చేయటంలో ముందుంటారో వారే ఉత్తములు” అని ప్రవక్త ﷺ చెప్పారని ఇబ్ను హిబ్బాన్([22]) మరియు బజ్జార్ లు([23]) జాబిర్ తో ఉల్లేఖించారు.
అబూ ఉమామ ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ﷺ ప్రవచించారుః “సలాం చేయటంలో ఎవరు ముందంజ వేస్తారో నిశ్చయంగా వారే అల్లాహ్ కు అతి సన్నిహితులు”([24]). దీని భావం చాలా స్పష్టంగా ఉందిః ముస్లిములను కలసి వారికి సలాం చేయటంలో ముందంజ వేసేవారు అల్లాహ్ కు చాలా సమీపంగా, ప్రియులుగా మరియు అతి సన్నిహితులుగా ఉంటారు. సహాబా, తాబిఈనుల ఉత్తమ గుణం ఇదే. సలాం చేయడంలో ఇతరులకంటే వారు ముందంజ వేశేవారు.
ఒక హదీసులో ఉందిః “ప్రశ్నకంటే ముందు సలాం చేయాలి. మీతో ఎవరైనా సలాంకు ముందు ఏదైనా అడిగితే అతనికి సమాధానం చెప్పకండి”([25]). అంటే ఎవరూ కూడా సలాంకు ముందు మాట్లాడవద్దు. సలాం చేసిన తరువాత మాట్లాడవచ్చు.
కలదా బిన్ హంబల్ చెప్పారుః పాలు, జున్ను, లేడి మరియు చిన్నజాతి దోసకాయలిచ్చి సుఫ్వాన్ బిన్ ఉమయ్య అతన్ని ప్రవక్త ﷺ వద్దకు పంపాడు. అప్పుడు ప్రవక్త ﷺ మక్కాలోని ఎగువ ప్రాంతములో ఉండిరి. నేను ఆయన ఉన్న గదిలోకి ప్రవేశిం చాను, సలాము చేయలేదు మరియు అనుమతి కోరలేదు. ప్రవక్త ﷺ చెప్పారుః “తిరిగి వెళ్ళు, అస్సలాము అలైకుం అని పలికిన తర్వాత “లోనికి రావచ్చా?” అని అనుమతి అడుగు”([26]).
నిరక్షరాస్యుల సంఘం… {ఆయనే నిరక్షరాస్యులలో ఒక ప్రవక్తను స్వయంగా వారి నుండే లేపాడు. ఆ ప్రవక్త వారికి ఆయన ఆయతులను వినిపిస్తున్నాడు. వారి జీవితాలను తీర్చిదిద్దుతున్నాడు, వారికి గ్రంథాన్నీ, వివేకాన్నీ బోధిస్తున్నాడు. వాస్తవానికి దీనికి పూర్వం వారు పూర్తిగా మార్గం తప్పి ఉన్నారు}. (జుముఅ 62: 2). అల్లాహ్ ఈ జాతిలో ప్రవక్తను పంపాడు. ఆయన వారిని తీర్చిదిద్ది, వారికి ధర్మ జ్ఞానం నేర్పడానికి, ఉన్నత మర్యాదలు, ఉత్తమ గుణాలు నేర్పడానికి.
పైన పేర్కొనబడిన కలదా హదీసు ద్వారా బోధపడేదేమిటంటేః సలాం ప్రవేశానికి, మాటకు ఒకటేమిటి సర్వానికి ముందు ఉండాలి.
అబ్దుల్లాహ్ బిన్ బుస్ర్ ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త ﷺ ఎవరింటికైనా వచ్చినప్పుడు తలుపుకు ఎదురుగా నిలబడేవారు కాదు. దాని కుడి ప్రక్కన లేక ఎడమ ప్రక్కన ఉండే వారు. అస్సలాము అలైకుం, అస్సలాము అలైకుం అనేవారు([27]).
కలిసిన వారికి సలాం చేయడంలో ముందంజ వేయటం ప్రవక్త అలవాటు. ఇలాంటి అవకాశాన్ని మరీమరీ పొందాలని కాంక్షించే వారు. అహంభావానికి గురైనవారి లాగా కాదు. అహంభావులు ప్రజల నుండే ఎల్లప్పుడూ సలాం వినడానికి ప్రయత్నిస్తుంటారు.
సలాం చేసే వ్యక్తి ‘అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకా- తుహు’ అని ప్రారంభించాలి. జవాబిచ్చే వ్యక్తి ‘వఅలైకు ముస్సలాం…’ అని ప్రారంభించాలి. ఈ పద్ధతిని నవవీ మరియు ఇబ్నుల్ ఖయ్యిమ్ రుజువు చేశారు. ఇది ‘అలైకుముస్సలాం’ కంటే చాలా మంచిది, ఉత్తమం.
సలాం చేసే వ్యక్తి ‘అలైకస్సలాం’ అనటం మంచిది కాదు. అబూ జురై అల్ హుజైమీ చెప్పారుః నేను ప్రవక్త వద్దకు వచ్చి, అలైకస్సలాం యా రసూలుల్లాహ్ అని అన్నాను. అలైకస్సలాం అనకు, అలైకస్సలాం అని మృతులకు సలాం చేయబడుతుంది అని ప్రవక్త చెప్పారు([28]).
ఇక నుండి అలైకస్సలాం పదాలను మానుకోవాలి. ఆ కాలంలో ఈ పదాలతో మృతులకు సలాం చేయబడేది. ప్రవక్త ﷺ కూడా ఈ పద్ధతిని అసహ్యించుకున్నారు. ఆయన ﷺ అసహ్యిం చుకున్నారు గనక ఈ పదాలతో సలాం చేసే వ్యక్తికి జవాబివ్వ కూడదు. (చూడండిః జాదుల్ మఆద్ 2/420, 421).
“మీలో ఎవరైనా (ఏదైనా సభలోకి) ప్రవేశిస్తే సలాం చేయాలి. అక్కడి నుండి లేచి పోవాలనుకున్నప్పుడు కూడా సలాం చేయాలి. తుదిసారి చేసేది తొలిసారిదానికంటే ప్రాముఖ్యత గలది”([29]).
దీని అర్థం చాలా స్పష్టంగా ఉందిః నీవు ఏదైనా సమావేశం, సభ నుండి వెళ్తూ నీ సోదరులతో, మిత్రులతో వీడ్కోలు తీసుకుంటూ అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు అను. ఈ సున్నతును చాలా మంది ముస్లిములు మరచిపోయి ఉన్నారు. ఫీ అమానిల్లాహ్, అస్తౌదిఉకుముల్లాహ్ (ఖుదాహాఫిజ్) లాంటి పదాలంటూ ఉంటారు, ప్రవక్తతో రుజువైన ఈ గొప్ప సున్నతును వదిలేస్తూ ఉంటారు.
అబూ దావూదు([30])లో రెండు సనదులు: -ఒకటిః మర్ఫూ సహీ సనద్ తో, మరొకటిః మౌఖూఫ్ జఈఫ్ సనద్- తో వచ్చిన హదీసు ఇలా ఉందిః
“మీలో ఎవరైనా తన సోదరుడ్ని కలిసినప్పుడు అతనికి సలాం చే యాలి. కలిసి వెళ్తుండగా ఇద్దరి మధ్యలో ఏదైనా చెట్టు, గోడ లేదా పెద్దరాయి అడ్డు వచ్చి మళ్ళీ కలుసుకుంటే సలాం చేయాలి”. ఈ పద్ధతి ప్రవక్త సహచరుల్లో ఉండేది. అనస్ తెలిపారుః ప్రవక్త ﷺ సహచరులు కలిసి నడుస్తుండేవారు, ఏదైనా చెట్టు లేదా కొమ్మ అడ్డు వస్తే కుడి, ఎడమ వైపుల్లో విడిపోయి మళ్ళీ కలుసు కున్నప్పుడు మళ్ళీ సలాం చేసుకునేవారు([31]). దీని ఆధారంగానే సమావేశాల్లో వచ్చే, పోయే వ్యక్తి వచ్చిపోయినప్పుడల్లా సలాం చేయాలి. ఇది ఓ మంచి కార్యాం. దీని కర్తకు పుణ్యం లభిస్తుంది.
7- మస్జిదులో ప్రవేశించినప్పుడు సలాం పద్ధతులు:
ఇబ్నుల్ ఖయ్యిమ్ చెప్పారుః ‘ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతుల్లో ఒకటిః మస్జిదులో ప్రవేశించు వ్యక్తి తహియ్య తుల్ మస్జిద్ రెండు రకాతులు చేయాలి. ఆ తరువాత వచ్చి అందులో ఉన్నవారికి సలాం చేయాలి. ఆయన దీనికి ఆధారం నమాజులో పొరపాటు జరిగిన సహాబీ రిఫాఅ యొక్క హదీసును ప్రస్తావించారు. ఆయన నమాజు చేసి వచ్చి ప్రవక్తకు సలాం చేశారు. ప్రవక్త అతని సలాంకు జవాబు పలికి నీవు మళ్ళీ నమాజు చెయ్యి, నీవు నమాజు చేయలేదు. అని చెప్పారు([32]). ఇది వారి అభి ప్రాయం, కాని రిఫాఅ సహాబీ మస్జిదులో ప్రవేశించిన తరువాత సలాం చేయలేదని ఏ ఆధారమూ లేదు. బహుశా అతను మస్జిదు మూలలో నమాజు చేసి ప్రవక్త వద్దకు వచ్చి సలాం చేసి ఉండ వచ్చు. నిజం ఏమిటంటే మనిషి మస్జిదులో ప్రవేశించి, ముందు సలాం చేయాలి. పిదప నమాజు చేయాలి.
నీవు నమాజులో ఉన్నప్పుడు -అది ఫరజు, సున్నతు, నఫిలు ఏ నమాజైనా సరే- ఎవరైనా ముస్లిం సలాం చేస్తే, దాని జవాబు నోటితో కాకుండా చేతి సైగతో ఇవ్వాలి([33]). అయితే దాని పద్ధతి ఇదిః కుడి చెయ్యి అరచేతి లోపలి భాగాన్ని భూమి వైపు, పై భాగాన్ని తన ముఖము వైపు చేయాలి. బొటనవ్రేళితో సైగ చేయమని కొందరు విధ్వాంసులు చెప్పారు. కాని చేత్తో సైగ విషయమే నిజమైనది, నిర్థారితమైనది.
8- ఇంటివారికి సలాం చేసే పద్ధతి:
ప్రవక్త ﷺ రాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించినప్పుడు పడుకునేవారు మేల్కోకుండా, మేల్కొని ఉన్నవారు వినేవిధంగా సలాం చేసేవారు([34]). ఏ మనిషి కూడా తన ఇంట్లో ప్రవేశించి గట్టిగా, వారికి ఇబ్బంది కలుగు విధంగా సలాం చేయకూడదు. చూడండి! ప్రవక్తగారి మృదుత్వాన్ని, మెత్తదనాన్ని.
ఇక మాటకు ముందే సలాం (అస్సలాము కబ్లల్ కలాం) అన్న హదీసు నిరాధారమైనది. ప్రవక్త వరకు దీని పరంపర ప్రామాణికంగా లేదు. ఇమాం తిర్మిజి ([35]) జాబిర్ తో ఉల్లేఖించారు. కాని దీని సనదులో అంబస బిన్ అబ్దుర్రహ్మాన్ ఉన్నాడు. అతడు (మత్రూక్). అతను (వజ్జాఅ) అని అబూ హాతిం చెప్పాడు. అలాగే అంబస యొక్క గురువు ముహమ్మద్ బిన్ జాజాన్ కూడా (మత్రూక్). అందుకు ఈ హదీసు బాతిల్ (చెల్లనిది, నిరాధారమైనది).
9- ముస్లిమేతరులకు సలాం చేయటం?
గ్రంథమివ్వబడినవారికి ప్రవక్త ﷺ సలాం చేసేవారు కారు. ఆయన ఇలా సెలవిచ్చారుః “యూదులు, క్రైస్తవులకు సలాం చేయడంలో మీరు ముందు పడకండి”([36]). యూద, క్రైస్తవుల చుట్టుప్రక్కన ఉన్నవారు స్వయంగా వారికి సలాం చేయకూడదు. కాని వారు సాలం చేస్తే, వఅలైకుం అనాలి.
ముస్లిములు, ముష్రికులు, బహుదైవారాధకులు మరియు యూదులు కలిసి కూర్చున్న ఒక సమావేశం మీదుగా ఒకసారి ప్రవక్త ﷺ సాగిపోయారు. వారికి సలాం చేశారు([37]). నీవు ఏదైనా సభ, సమావేశము నుండి దాటుతూ ఉంటే అందులో ముస్లిములు (ముస్లిములు ఉండడం తప్పనిసరి) యూదులు, క్రైస్తవులు కలిసి ఉంటే వారికి నీవు ధర్మ రీత్యా చేయవలసిన సలాం (అంటే అస్సలాము అలైకుం…) చేయవచ్చును.
ప్రవక్త ﷺ హెరిక్లిస్ రాజుకు వ్రాసిన పత్రములో ‘అస్సలాము అలా మనిత్తబఅల్ హుదా’ అని సంబోధించారు([38]). ఇలాంటి సలాం ప్రస్తావన ఖుర్ఆనులో కూడా వచ్చి ఉంది. ప్రవక్త మూసా అలైహిస్సలాం ఫిర్ఔనుకు చెప్పిన విషయం: {వస్సలాము అలా మనిత్తబఅల్ హుదా}. (తాహా: 47). మీరు యూదులు, క్రైస్తవులకు సలాం చేసినప్పుడు, లేదా వారికి పత్రము వ్రాయునప్పుడు “అస్సలాము అలా మనిత్తబఅల్ హుదా” వ్రాయండి. కాని అస్సలాము అలైకుం అని ఆరంభించకండి.
10- అపరాధి తౌబా చేయనంత వరకు సలాం విడనాడటం:
ఎవరైనా ఏదైనా అపరాధం చేస్తే అతను దాని నుండి (పశ్చా త్తాపం చెంది) తౌబా చేయనంత వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాం చేసేవారు కారు, జవాబు సయితం ఇచ్చేవారు కారు. ఆయన ﷺ కఅబ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు మరియు అతని ఇద్దరి మిత్రుల పట్ల అలాగే ప్రవర్తించారు. ప్రవక్త ﷺ వారికి సలాం చేసేవారు కాదు. ఆ విషయాన్ని స్వయంగా కఅబ్ ﷺ ఇలా తెలిపారుః ‘నేను ప్రవక్త ﷺ కు సలాం చేసేవాణ్ణి, ఆయన నా సలాంకు సమాధానం ఇచ్చారా లేదా అనేది నాకు తెలియదు. కనీసం ఆయన పెదవులైనా కదిలాయా లేదా నాకు తెలియకపోయేది’([39]).
ఇదే విధంగా స్పష్టంగా బిద్అత్ పనులు చేస్తున్న బిద్అతీకి. ముందు అతనికి ఉపదేశాలు చేస్తూ ఉండాలి. బిద్అత్ యొక్క కీడును గురించి హెచ్చరిస్తూ ఉండాలి. దాన్ని విడనాడమని ప్రోత్స హించాలి. ఈ ప్రయత్నాలన్నీ సఫలం కాకుంటే అతను దాన్ని విడనాడి తౌబా చేయనంత వరకూ అతనితో దూరముండాలి. అతనికి సలాం చేయకూడదు, అతని సలాముకు జవాబివ్వ కూడదు.
అదే విధంగా మస్జిదుకు పక్కనే, ఆరోగ్యంగా ఉండి, అకారణంగా నమాజు జమాఅతుతో (సామూహికంగా) చేయనివాడు. అతనికి మంచి విధంగా నచ్చజెప్పిన తర్వాత కూడా సామూహిక నమాజుకు హాజరు కాకున్నట్లైతే అతనికి సలాం చేయటం మానుకోవాలి. అతని సలాంకు జవాబు కూడా ఇవ్వకూడదు.
అబూ అయ్యూబ్ అన్సారీ ఉల్లేఖనంలో ప్రవక్త ﷺ చెప్పారుః “ఒక ముస్లిం మరో ముస్లింతో మూడు రోజుల కంటే ఎక్కువగా సంబంధాలు త్రెంచుకొని ఉండటం, ఇద్దరూ దారిలో కలిసినప్పుడు ఎడముఖం పెడముఖంగా తప్పుకోవటం ధర్మసమ్మతం కాదు. వారిద్దరిలో ఎవరు ముందుగా సలాం చేస్తారో వారే ఉత్తములు”([40]). ఇది ప్రాపంచిక విషయాల్లో. ఐహిక విషయాల కోపతాపాలు మూడు రోజుల్లో అంతమయి పోవాలి. ఆ తరువాత మాట్లాడక పోవడం నిషిద్ధం. కాని ధర్మపర విషయాల్లో మూడు రోజులకు అంతం కాదు. తౌబా చేసి తన బిద్అత్, దుర్మార్గాన్ని వడనాడితేనే అంతమయ్యేది.
రెండవది: ఆహ్వాన స్వీకారం
1- ముస్లిం ఆహ్వానాన్ని స్వీకరించటం విధి:
ప్రేమ మార్గాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ ప్రవచనం: “అతను (భోజనానికి) ఆహ్వానిస్తే ఆహ్వానాన్ని స్వీకరించు”.
కొన్ని ఆహ్వానాలను స్వీకరించటం విధిగా ఉంటే, కొన్నిటిని స్వీకరించటం సున్నత్. మరి కొన్నింటి స్వీకారం నిషిద్ధం కూడా.
స్వీకరించటం విధిగా ఉన్న ఆహ్వానాలు: పెళ్ళి పిలుపు. [అచ్చట ఏలాంటి ధర్మవ్యతిరేక కార్యం లేనప్పుడు]. ఇబ్ను ఉమర్ ؆ ఉల్లేఖనంలో ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారుః “మీలో ఎవరికైనా వలీమ ఆహ్వానం వస్తే అతను దాన్ని స్వీకరించాలి”([41]). ముస్లింలోని మరో ఉల్లేఖనంలో ఉందిః “మీలో ఎవరైనా తన సోదరున్ని ఆహ్వానిస్తే అతను దాన్ని స్వీకరించాలి. అది పెళ్ళి పిలుపైనా ఇంకేదైనా సరే”. ఇందులో (స్వీకరించండి) అనే ఆదేశం, విధిగా ఉన్నట్లు సూచిస్తుంది. అంటే ధర్మానికి వ్యతిరేకమైన ఏ కార్యాలు లేనప్పుడు వలీమా పిలుపును స్వీకరించుట మీపై విధిగా ఉంది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “భోజనాల్లో అతి చెడ్డది వలీమా భోజనం, అందులో వచ్చేవారిని పిలవడం జరగదు. రాని వాళ్ళను ఆహ్వానించటం జరుగుతుంది. ఇక ఎవరు ఆ పిలుపును అంగీకరించరో అతను అల్లాహ్ మరియు ప్రవక్త అవిధేయతకు గురి అయినట్లే”([42]).
దీని ద్వారా తెలిసిందేమిటంటేః పెద్దవాళ్ళను ఆహ్వానించి, పేదవాళ్ళను దూరం చేసి, ప్రదర్శనాబుద్ధితో, పేరు ప్రఖ్యాతుల కొరకు చేయబడే వలీమాలు చాలా చెడ్డవి.
“మీలో ఎవరికైనా పిలుపు వస్తే అతను దాన్ని స్వీకరించి, అందులో పాల్గొనాలి. (ఆకలి ఉండి) ఇష్టముంటే తినాలి. ఇష్టము లేకుంటే మానాలి”(2). ఉద్దేశమేమిటంటే నీవు అందులో పాల్గొనాలి. తినాలి అని కాదు. ఈ రొజుల్లో కొందరు, వారికి వలీమా పిలుపు ఇవ్వబడినప్పుడు, ‘నేను రాలేను, నేను తిన్నాను’. లేదా ‘నేను తినదలుచుకోలేదు’ అని అంటారు. ఇలా అనడం తప్పు. నీవు అందులో పాల్గొని వారికి దుఆ ఇవ్వడం ముఖ్యం, తినడం కాదు అసలుద్దేశం., వారితో మాట్లాడటం. వారి ఆ శుభకార్యంలో వారికి సహాయపడి, వారి పట్ల ప్రేమ, అప్యాయత చూపటం. మన పూర్వ పుణ్యాత్ములు రోజా (ఉపవాసం) ఉన్నప్పటికీ ఆహ్వానం స్వీకరించి, వారి కార్యంలో హాజరయ్యేవారు. ఆ ఇంటివారితో తమ ఉత్తమ గుణాలతో మెలిగి వారిని ఆశీర్వదించేవారు.
ఇబ్ను మస్ఊద్ ద్వారా మర్ఫూ ఉల్లేఖనం ఉందిః “మొదటి రోజు వలీమా భోజనం వాస్తవమైనది. రెండవ రోజు వలీమా భోజనం సున్నత్. మూడవ రోజు వలీమా భోజనం పేరు ప్రఖ్యాతుల కొరకు చేయబడునది. పేరు ప్రఖ్యాతుల కొరకు చేసేవాని ఆ ఉద్దేశం ఇక్కడే పూర్తి కావచ్చు. కాని పరలోకంలో నష్టమే కలుగుతుంది”. ఈ హదీసు ను ఇమాం అబూదావూద్, ఇమాం అహ్మద్([43])లు ఉల్లేఖించారు. దీని సనదులో ఒక ఉల్లేఖకుడు ‘మజ్ హూల్’ ఉన్నాడు. అందువల్ల ఇది జఈఫ్ హదీసు. ఇమాం బుఖారీ దృష్టిలో కూడా ఇది జఈఫే. బుఖారీయే తన సహీ (బుఖారీ)లో “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వలీమా విషయంలో ఒక, రెండు రోజులు నిర్ణయించలేదు” అని ఉల్లేఖించారు. అందుకే అవసరాన్ని బట్టి ఒకటి, రెండు, మూడు రోజుల వరకు కూడా వలీమా చేయవచ్చు. కాని ధర్మానికి చేరువుగా ఉన్నది ఒక్క రోజు మాత్రమే.
మరీ అక్కడ ఏలాంటి ధర్మవ్యతిరేకత లేకుంటే ఆ ఆహ్వానాన్ని స్వీకరించాలి.
ఒకరికంటే ఎక్కువ మంది ఆహ్వానించినప్పుడు ఎవరు ముందు ఆహ్వానించారో వారి ఆహ్వానాన్నే స్వీకరించాలి. రెండోవారికి ఇలా స్పష్టంగా చెప్పాలిః ఫలానా వ్యక్తి మీ కంటే ముందు ఆహ్వానించారు గనక మీ వద్దకు రాలేను. ఇద్దరూ ఒకే సందర్భంలో ఆహ్వానిస్తు న్నప్పుడు, దగ్గరి బంధువు పిలుపును స్వీకరించు. రక్త సంబంధి కుడు మరియు పొరుగువారిద్దరు ఒకేసారి ఆహ్వానించినప్పుడు రక్త సంబంధికుని వద్దకు వెళ్ళు.
ధర్మవిరుధ్ధ కార్యాలు అందులో ఏమైనా ఉంటే పాల్గొన కూడదన్న విషయం ముందే చెప్పడం జరిగింది. అయితే ఎవరైనా వాటిని ఖండించగలుగుతే అతను పాల్గొనవచ్చును.
మూడవది: జన శ్రేయోభిలాష ధర్మానికి పునాది
1- జన శ్రేయోభిలాష తప్పనిసరి:
ప్రవక్త ﷺ ప్రవచనం: “అతను నీ ద్వారా ఏదయినా మేలును కాంక్షిస్తే దాన్ని అందజెయ్యి”. ఇది మూడవ పునాది. దీని గురించి మనకు ప్రవక్త ﷺ స్పష్టంగా బోధించారు. ఇదే ప్రేమ చిహ్నం. ఇది మనలోని ప్రతి ఒక్కరిపై విధిగా ఉంది.
పండితుల దృష్టిలో శ్రేయోభిలాష తప్పనిసరి. ప్రవక్త ﷺ గారి ఈ హదీసు ఆధారంగాః
ప్రవక్త ﷺ ప్రవచించారని తమీం బిన్ ఔస్ అద్దారి ఉల్లేఖించారుః “దీన్ (ధర్మం) చిత్తశుద్ధితో కూడిన శ్రేయోభిలాషకు మారుపేరు”. (ప్రవక్త ﷺ ఇలా మూడు సార్లు అన్నారు). ఈ శ్రేయోభిలాష ఎవరి పట్ల? అని మేమడిగాము. “అల్లాహ్ పట్ల, ఆయన గ్రంథం పట్ల, ముస్లిముల నాయకుని పట్ల వారి సామాన్య ప్రజల పట్ల” అని ప్రవక్త బదులిచ్చారు([44]).
ప్రవక్త గారి మరో హదీసు కూడా శ్రేయోభిలాష గురించి బోధిస్తుందిః “నీ సోదరుడు దౌర్జన్యపరుడైనా లేక బాధితుడైనా అతనికి సహాయపడు” అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. ‘ప్రవక్తా! దౌర్జన్యానికి గురైన పక్షంలో సహాయం చేయడమంటే తెలిసిందే, అది చేస్తునే ఉంటాము, అయితే దౌర్జన్యపరుడైన పక్షంలో ఎలా సహాయపడాలి అని సహచరులన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “దౌర్జన్యం చేయకుండా అతని చేతులను పట్టుకోండి. ఇదే అతనికి చేయవలసిన సహాయం”([45]).
మనము పరస్పరం శ్రేయోభిలాషులై ఉండడం తప్పనిసరి. మనిషి లోపాలు, కొరత లేకుండా ఉండలేడు. మన అనేక పనుల్లో మనందరి వల్ల ఏదో తప్పు జరుగుతూనే ఉంటుంది. తప్పుల్లేని జీవితం ప్రవక్తలదే కదా. అలాంటప్పుడు ఎవరైనా తన సోదరుణ్ణి ఏదైనా విషయంలో, ప్రయత్నంలో, విధానంలో, కార్యంలో తప్పు చేస్తుండగా చూస్తే అతనిపై ఉన్న బాధ్యతేమిటంటే అతని వద్దకు వెళ్ళి, అతనికి ఉపదేశించి, అతనికి మేలు చేయాలి. ఇలా మేలు చేసేవాడు ప్రేమ, దుఆ, సంతోషం మరియు స్వాగతమే పొందుతాడు. అలీ అనేవారుః విశ్వాసులు పరస్పరం శ్రేయోభిలాషులు. వంచకులు (మునాఫికులు) పరస్పరం మోసగాళ్ళు.
తెలుసుకోండి! ఎవరైనా తన సోదరులను విమర్శిస్తూ, సభల్లో, నలుగురి మధ్యా వారి గురించి చెప్పుకుంటూ, వారి మాన, మర్యాదలను మంట గలుపుతూ ఉంటాడో, వారి వద్దకు వెళ్ళి వారిలో ఉన్న లోపాల్ని వారికి చూపి సరిదిద్దకుండా, వారి పట్ల సదభిలాష లేని వ్యక్తిని మీరు చూసినప్పుడు అతను అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను మరియు విశ్వాసులను మోసగించువాడు అని తెలుసుకోండి!
విశ్వాసుని గుణము ఇదండీః తన సోదరునిలో ఉన్న తప్పు, లోపాన్ని దూరము చేయాలనుకున్నప్పుడు అతని వద్దకు వెళ్ళి ఒంటరిగా కలిసి (నలుగురిలో కాదు), తను అతని పట్ల మేలు కోరుతున్నట్లుగా తెలియజేస్తూ, అతనిపై కనికరం చూపుతూ, మృదుభావంతో అతన్ని మంచి దారిన బెడతాడు. ఇలాంటి వాడే వాస్తవంగా శ్రేయోభిలాషి. ఇలా గాకుండా ఎవరు తన సోదరుడ్ని అవమానపరచగోరుతారో అల్లాహ్ యే వారి దుశ్చేష్టల నుండి కాపాడేవాడు. అల్లాహ్ అలాంటి వారికి చాలు. వారి ఉద్దేశాల్ని ఎరిగేవాడు అల్లాహ్ యే.
దివ్యగ్రంథం ఖుర్ఆనులో అల్లాహ్ ప్రవక్తల ప్రచార విధానాన్ని తెలిపాడు. వారి ప్రచారంలో శ్రేయోభిలాష ఉట్టపడేది. ఇదిగో చూడండి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం తమ జాతితో ఏమంటున్నారోః
{నా ప్రభువు సందేశాలను మీకు అందజేస్తాను. నేను మీ శ్రేయోభిలాషిని}. (ఆరాఫ్ 7: 62). ఇంకా ఇలా అంటారుః
{నేను ఇప్పుడు మీ శ్రేయస్సును ఎంతగా కోరినా నా శ్రేయోభిలాష మీకు ఏ లాభాన్నీ చేకూర్చలేదు}. (హూద్ 11: 34).
ప్రవక్త సాలిహ్ అలైహిస్సలాం తమ జాతివారితో ఇలా అంటున్నారుః
{నా జాతి ప్రజలారా! నేను నా ప్రభువు సందేశాన్ని మీకు అందజేశాను. నేను మీ శ్రేయస్సునే సదా అభిలషించాను}. (ఆరాఫ్ 7: 79).
ప్రవక్త షుఐబ్ అలైహిస్సలాం ఇలా అన్నారుః
{నేను నా ప్రభువు సందేశాలను మీకు అందజేశాను. మీ శ్రేయోభి- లాషిగా నేను నా బాధ్యతను పూర్తిగా నెరవేర్చాను}. (ఆరాఫ్ 7: 93).
వీరందరు అల్లాహ్ యొక్క ప్రవక్తలు, సందేశహరులు. తన సృష్టిలో ఎన్నుకొనబడినవారు. ఎవరు ఎవరి పోలిక వహిస్తారో వారు వారితోనే ఉంటారు.
అనేక సార్లు మనిషి వల్ల ఏదో పొరపాటు జరుగుతూ ఉంటుంది. మనలో ఎవరు తప్పుచేయని వారు లేరు. నేను మరీ మరీ చెప్పేదొకటే. శ్రేయోభిలాషి దీన్ని గమనించాలని! తప్పు, పొరపాటు మన నైజంలో ఇమిడి యుంది. అది సామాన్యమైన విషయం. అందుకే మనిషి శ్రేయోభిలాషి అయినప్పుడు పక్షపాతం వహించవద్దు.
అతన్ని ఏకాంతములో తీసుకెళ్ళి అతని తప్పు గురించి తెలియజేయుట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పద్ధతి. ప్రజల ముందు అతన్ని నిలదీసి, విమర్శిస్తే అతన్ని అవమాన పరిచినట్లవుతుంది.
ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పేవారుః ‘అల్లాహ్ ఆ వ్యక్తిని కరుణించుగాక! అతను నాలో ఉన్న లోపాలు నాకు చూపుతాడు. సహచరులు అతని (ఉమర్ )కి ఏదైనా మేలు గురించి చెబుతున్నప్పుడు చాలా శ్రద్ధగా వినేవారు.
నాల్గవది: తుమ్మినవారికి బదులు పలకడం
1- తుమ్మిన వారికి ఎప్పుడు బదులివ్వాలి? దాని విధానం ఏమిటి?
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక ప్రవచనం ఇలా ఉంది: “అతను తుమ్మి ‘అల్ హందులిల్లాహ్’ అనంటే నీవు దానికి ‘యర్ హముకల్లాహ్’ అని బదులు పలుకు”. మరో ఉల్లేఖనంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారుః “నిశ్చయంగా అల్లాహ్ తుమ్మును ప్రేమిస్తాడు. ఆవలింపును ఏవగించుకుంటాడు”. (బుఖారీ/ అల్అదబ్/ మా యుస్తహబ్బు మినల్ ఉతాస్/ 6223).
తుమ్ము అల్లాహ్ యొక్క కరుణ. మరియు ఆవలింత షైతాను నుండి ఉంది. తుమ్ము వలన ధమనులు వివృతమవును (వికసించును). హృదయము తెరియును. అందుకే అది అల్లాహ్ కరుణ. ఇక ఇందులోని మర్మాన్ని అల్లాహ్ యే ఎరుగును. కాని మనపై విధిగా ఉన్న విషయం ఏమిటంటే మనము తుమ్మిన తరువాత అల్ హందులిల్లాహ్ అనాలి.
ఇక ఆవలింత, నీ శక్తి మేరకు దానిని ఆపే ప్రయత్నం చేయి.
అబూ హురైరా ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః “మీలో ఎవరైనా తుమ్మితే (అల్ హందులిల్లాహ్) అనాలి. అది విన్న అతని సోదరుడు లేక మిత్రుడు (యర్ హముకల్లాహ్) అనాలి. మళ్ళీ తుమ్మిన వ్యక్తి (యహ్ దీకుముల్లాహు వ యుస్లిహు బాలకుం) అనాలి”. (బుఖారీ 6224. అహ్మద్ 2/353).
అనస్ ఉల్లేఖించారుః ప్రవక్తﷺ ముందు ఇద్దరు తుమ్మారు. ప్రవక్త ఒకరికి జవాబిచ్చారు. మరొకరి తుమ్ముకు జవాబివ్వలేదు. ఎవరి తుమ్ముకైతే జవాబివ్వలేదో ఆ వ్యక్తి ప్రవక్తను ప్రశ్నించాడుః ‘అతను తుమ్మితే జవాబిచ్చారు, నేను తుమ్మితే జవాబివ్వలేదు’ అని. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారుః “అతను తుమ్మిన తరువాత అల్ హందులిల్లాహ్ అని అన్నాడు. నీవు అల్ హందులిల్లాహ్ అనలేదు గనక”([46]).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నానని అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా తుమ్మి అల్ హందులిల్లాహ్ అన్నప్పుడే మీరు జవాబివ్వండి. అల్ హందులిల్లాహ్ అనకపోయినచో మీరు జవాబివ్వకండి”([47]).
పై హదీసు ద్వారా తెలిసిందేమిటంటే తుమ్మిన వ్యక్తి అల్ హందు లిల్లాహ్ అన్నప్పుడు మనం యర్ హముకల్లాహ్ అని బదులివ్వడం తప్పనిసరి. అతను మౌనంగా ఉండిపోయి, అల్ హందులిల్లాహ్ అనకున్నట్లయితే యర్ హముకల్లాహ్ అని పలకటం తప్పనిసరి కాదు. మనం మౌనంగా ఉండిపోవాలి.
2- బదులు పలకడం ఫర్జె ఐనా లేక ఫర్జె కిఫాయానా?([48])
మాలికియలో ఇబ్ను అబీ జైద్, ఇబ్నుల్ అరబీ ప్రకారం అది ఫర్జె ఐన్. ఇదే మాట నిజమైనది కూడా. ఉదాః ఒక సభలో కూర్చున్నవారు తుమ్మిన వ్యక్తి అల్ హందులిల్లాహ్ అన్నది విన్నప్పుడు ప్రతీ ఒక్కరూ యర్ హముకల్లాహ్ అనాలి. ఎవరైనా ఒక్కరు యర్ హముకల్లాహ్ అని అంటే సరిపోదు. ఎందుకంటే ఇది ఫర్జె కిఫాయ కాదు. ఫర్జె ఐన్.
“ఆవలించినప్పుడు, తుమ్మినప్పుడు శబ్దం పెంచటాన్ని అల్లాహ్ ఇష్ట పడడు”([51]). ఇది కూడా జఈఫ్ హదీసు. ప్రవక్తతో రుజువైనది కాదు.
(ఇవి రెండు జఈఫ్ అయినప్పటికీ వేరే సహీ హదీసుల ద్వారా రజువైన విషయం ఏమిటంటే; తుమ్మినప్పుడు తక్కువ స్వరం ఉండాలి, పైన ప్రవక్త వద్ధతి చదివాము. ఇక ఆవలింపు వచ్చినప్పుడు హా అని శబ్దం చేయడం వల్ల షైతాన్ నవ్వుతాడు. అందుకు దానిని ఆపడం మంచిది. బుఖారీ 6223).
ఎన్నిసార్లు బదులు పలకాలనే విషయంలో ప్రవక్త ﷺ చెప్పారుః
“నీ సోదరుని మూడు తుమ్ములకు బదులు పలుకు, అంతకు ఎక్కువ తుమ్మాడంటే అతనికి జలుబుందన్న మాట”([52]). అనగా అతను మొదటిసారి తుమ్మి అల్ హందులిల్లాహ్ అన్నప్పుడు నీవు యర్ హముకల్లాహ్ అను. రెండవసారి యర్ హముకల్లాహ్ అని బదులు పలుకు. మూడవసారి కూడా యర్ హముకల్లాహ్ అని జవాబివ్వు. ఇక నాల్గవసారి “ఆఫాకల్లాహ్” అని చెప్పు. ఒక వ్యక్తి తుమ్మాడు. ఆయన ﷺ యర్ హముకల్లాహ్ అన్నారు. అతను ఇంకా తుమ్ముతూ పోయాడు. ప్రవక్త ﷺ అన్నారుః ఇతనికి పడిసెమయింది([53]).
ఇబ్నుల్ ఖయ్యిం చెప్పారుః “ఇతనికి పడిసెమయ్యింది” అనే పదంలో అతని స్వస్థతకై దుఆ చేయాలన్న సూచన ఉంది. ఎందుకంటే జలుబు ఒక వ్యాధి. అలాగే మూడు తరువాత బదులు పలకక పోవడంలో పాపం లేదని తెలుస్తుంది. అలాగే ఇది ఒక వ్యాధి, తగిన చికిత్స చేయించాలి, నిర్లక్ష్యం చేసి వ్యాధి ముదిరే వరకు చూడ వద్దు అన్న సూచన కూడా ఉంది. ఆయన ﷺ గారి ప్రతి మాటలో వివేకం, కరుణ, జ్ఞానం మరియు సన్మార్గాలున్నాయి.
ప్రవక్త ﷺ చెప్పారుః “మీలో ఎవరైనా తుమ్మినప్పుడు అతని పక్కన ఉన్నవాడు బదులు పలకాలి. మూడిటికంటే ఎక్కువ తుమ్మినవాడు జలుబు వ్యాధికి లోనయ్యాడని అర్థం. ఇక మూడు తరువాత మీరు బదులు పలకకండి”([54]). ధర్మ వేత్తలు చెప్పారుః మూడిటికంటే ఎక్కువ తుమ్మిన వారి కొరకు, అల్లాహ్ వారికి స్వస్థత కలిగించాలని దుఆ చెయ్యాలి.
ఒక విషయం: తుమ్మిన వ్యక్తి అల్ హందులిల్లాహ్ అన్నది నీవు వినలేదు, కాని అతని పక్కన ఉన్న వ్యక్తి విన్నాడు. నీవు విననప్పటికీ అతని పక్కవాడు విన్నాడని తెలిసాక నీవు ఏమి చేస్తావు? యర్ హముకల్లాహ్ అని బదులు పలుకు. అల్ హందులిల్లాహ్ అన్న విషయం స్పష్టం కాకపోతే జవాబివ్వకు.
రెండో విషయం: తుమ్మిన వ్యక్తి అల్ హందులిల్లాహ్ అనడం మరచిపోతే అతనికి గుర్తు చేయాలా?
అవును గుర్తు చేయించాలి.
ఇమాం నవవీ మరియు ఇతర ధర్మవేత్తల అభిప్రాయం కూడా ఇదే. ఇంకా దీనిని (అంటే అతను మరచిపోతే, గుర్తు చేయటం) మంచి పద్ధతి అన్నారు. ఇబ్రాహీం తైమీ ఇలా చేశాడు. అలాగే ఇబ్ను ముబారక్ వద్ద ఒక వ్యక్తి తుమ్మి, అల్ హందులిల్లాహ్ అనలేదు. మనిషి తుమ్మినప్పుడు ఏమంటాడు అని ఇబ్ను ముబారక్ అతడ్ని అడిగారు. అల్ హందులిల్లాహ్ అంటాడు అని ఆ వ్యక్తి చెప్పాడు. యర్ హముకల్లాహ్ అని ఆయనన్నారు.
మరచిపోయిన వ్యక్తికి గుర్తు చేయడం తప్పనిసరేమీ కాదు. ఎందుకంటే ఒక వేళ అది తప్పనిసరి అయి ఉంటే స్వయంగా ప్రవక్త ﷺ తన ముందు తుమ్మి అల్ హందులిల్లాహ్ అని చెప్పని వ్యక్తికి గుర్తు చేసేవారు. గుర్తు చేయనూ లేదు. జవాబు ఇవ్వనూ లేదు. అతను అల్ హందులిల్లాహ్ యొక్క శుభాన్ని కొల్పోయి నందుకు, ఇతరులు అతనికివ్వబోయే దుఆ యొక్క బర్కత్ (శుభాన్)ని కూడా నోచుకోలేదు. (జాదుల్ మఆద్ 2/442). ప్రవక్త ఉన్న సమావేశాల్లో కొందరు తుమ్మి అల్ హందులిల్లాహ్ అనలేదు. ప్రవక్త వారికి జవాబు ఇవ్వలేదు. గుర్తు చేయనూ లేదు. ఇదే తిరుగు లేని విషయం. (ప్రవక్త ﷺ గుర్తు చేయించలేదని రచయిత పై హదీసు ద్వారా రుజువు చేసే ప్రయత్నం చేశారు. కాని ఆ వ్యక్తి వెంటనే ప్రవక్తతో అడిగి సమాధానం తెలుసుకున్నారన్నది కూడా అదే హదీసులో ఉంది. అందుకు గుర్తు చేయించకూడదన్న సమస్యే తీసుకురావద్దు. గుర్తు చేయించడమే మంచిది. ఇలా గుర్తు చేయించే వ్యక్తి, తుమ్మిన వ్యక్తి ఇద్దరికీ పుణ్యం లభించును. (అనువాదకుడు).
యూదుల తుమ్ముకు సమాధానం: యూదులు ప్రవక్త ﷺ ముందు తుమ్మి, ఆయన ‘యర్ హముకల్లాహ్’ అంటారన్న ఆశతో అల్ హందులిల్లాహ్ అనేవారు. కాని ప్రవక్త ﷺ వారికి సమాధానంగా “యహ్ దీకుముల్లాహు వ యుస్లిహు బాలకుం” అనేవారు([55]). ప్రవక్త సల్లల్లాహ అలైహి వసల్లం గారి వివేకమును గమనించండి; యూదులకున్న అవసరం ‘హిదాయత్’ (సన్మార్గము)ది. వారు అల్లాహ్ కరుణకు యోగ్యులు కారు. వారు అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు విరోధులు. అలాంటి వారు కరుణించబడాలని దుఆ చేయవచ్చునా?
లేదు. ముందు వారికి సన్మార్గం అవసరం. ఇది పొందారంటే తరువాత అల్లాహ్ యొక్క కరుణ, దయ అవసరం. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘యర్ హముకల్లాహ్’కు బదులుగా ‘యహ్ దీకుముల్లాహు వ యుస్లిహు బాలకుమ్’ అన్నారు.
ఐదవది: రోగిని పరామర్శించటం
1- రోగిని పరామర్శించు ఘనత మరియు అతని కొరకు దుఆః
ప్రవక్త ﷺ ఉపదేశం: “అతను వ్యాధిగ్రస్తుడైతే వెళ్ళి పరామర్శించు”.
ఇది ముస్లిముల మధ్య ప్రేమ మార్గాల్లో మరొకటి. ఒక ముస్లింపై ఉన్న మరో ముస్లిం హక్కు ఏమిటంటే అతను వ్యాధిగ్రస్తుడైతే అతన్ని పరామర్శించాలి. పరామర్శ యొక్క కొన్ని పద్ధతులున్నాయి. అల్లాహ్ వద్ద దాని ఘనత చాలా గొప్పగా ఉంది. ముస్లిం షరీఫు([56])లో ఉంది ప్రవక్త ﷺ ఇచ్చిన శుభవార్తను సౌబాన్ ఉల్లేఖించారుః
“రోగిని పరామర్శించే వ్యక్తి తిరిగి వచ్చేంత వరకు ‘ఖుర్ఫతుల్ జన్నహ్’లో ఉంటాడు”. మరో ఉల్లేఖనంలోః ‘ఖుర్ఫతుల్ జన్నహ్ అంటేమిటి ప్రవక్తా’ అని సహచరులు అడిగారు. దానికి ఆయన ﷺ “స్వర్గ వనాలు” అని చెప్పారు. అంటే ఆ మనిషి స్వర్గ వనాల్లో నడుస్తూ ఉంటాడన్న మాట. ప్రవక్త, ఆయన సహచరులు రోగులను పరామర్శించేవారు. ఒకసారి సఅద్ బిన్ అబీ వఖ్ఖాస్ రజియల్లాహు అన్హుని పరామర్శించారు. ఆ సందర్భంలో వారితో ఇలా అన్నారుః “నీ వలన అనేకమందికి ప్రయోజనం చేకూరి, అనేక మందికి నష్టం వాటిల్లే వరకు నీవు బహుశా జీవించి ఉంటావు”([57]).
అలాగే జాబిర్ రజియల్లాహు అన్హును పరామర్శించడానికి కూడా వెళ్ళారు ఆయన ﷺ. అప్పుడు అతను స్పృహ తప్పియున్నాడు. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేసి ఆయనపై నీళ్ళు పోసారు. ఆ తరువాత అతనికి స్పృహ వచ్చింది([58]).
మరోసారి ఒక ఎడారి అరబ్బు యొక్క పరామర్శ కొరకు వెళ్ళారు. అతని వద్దకు చేరుకొని, “లాబఅస తహూరున్ ఇన్షాఅల్లాహ్” (బాధ పడవద్దు. ఇన్షాఅల్లాహ్! నీకు పాప ప్రక్షాళన కలుగుతుంది) అన్నారు. అతడన్నాడుః ముమ్మాటికి అలా కాదు. అది (అగ్ని లాంటి) జ్వరం. వృద్ధులపై మరింత రెచ్చిపోతుంది. సమాధి వరకు చేర్పిస్తుంది. అప్పుడు ప్రవక్త చెప్పారుః “సరే అలాగే”([59]). దీని పర్యవసానం, పాపం, అతను అదే వ్యాధిలో మరణించాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి పరామర్శకైనా వెళ్ళినప్పుడు అతని కొరకు దుఆ చేసేవారు, కొంతసేపు అతని తలగడ వద్ద కూర్చునేవారు, తమ శుభహస్తాన్ని అతని ఛాతిపై పెట్టేవారు. ఇందువల్ల రోగి ఓ రకమైన తృప్తి, ఆనందం పొందుతాడు.
2- పరామర్శ పద్ధతులుః
అహ్లుస్సున్న వారి ప్రకారం ప్రతి మూడు రోజులకొకసారి రోగిని పరామర్శించాలి. తండ్రి, కొడుకు, సోదరుడు లాంటి దగ్గరి సంబంధికు- లైతే వారి విషయం వేరు. (ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పోవలసి ఉంటుంది. రోగి వెంటనే ఎల్లప్పుడు ఉండే అవసరం కూడా ఇంతటి దగ్గరి సంబంధికులకు పడవచ్చు). ఇతరుల పరామర్శకై మూడు రోజులకొకసారి వెళ్ళాలి. అలాకాకుండా ప్రతి రోజు లేదా పొద్దు మాపు వస్తూ పోతూ ఉంటే అందువల్ల రోగికి మరింత ఇబ్బంది కలుగవచ్చు.
ఇమాం జహబీ రహిమహుల్లాహ్ సులైమాన్ బిన్ మహ్రాన్ -అతని బిరుదు అఅమష్- చరిత్రలో వ్రాసారుః అతను చాలా రోజులు ఏదో వ్యాధికి గురిఅయి ఉండగా, పరామర్శ కొరకు ప్రజల రాకపోకలు మొదలయి అతనికి ఇబ్బంది కలిగించసాగారు. చివరికి ఓ ఉపాయం తట్టింది; తన రోగానికి సంబంధించిన వివరాలన్నీ ఓ కాగితంలో వ్రాసి మెత్త క్రింద పెట్టుకున్నాడు. ఎవరు వచ్చినా అది తీసి చూపించి, ఇదిగో చదువుకో అనేవాడు. అయినా జనం అధికమే అయ్యారు తప్ప తగ్గలేదు. ఇక భరించలేక తొందరగా లేచి, తన మెత్తను చంకలో పెట్టుకొని బజారులో వచ్చి నిలబడి ‘ప్రజలారా! అల్లాహ్ మీ రోగికి స్వస్థ కలిగించాడు’ అని ప్రకటించారు.
(పరామర్శి తన అనుకూలాన్ని కాదు) రోగికి అనుకూలమైన సమయాన్ని చూసి అప్పుడే అతని వద్దకు వెళ్ళాలి. అతడు పడుకునే సందర్భంలో, అతని తిండి సందర్భంలో, అతని నమాజు సమయంలో, అతను విశ్రాంతి తీసుకుంటున్న వేళ కాకుండా వేరే ఏదైనా అనుకూల ఘడియలో పరామర్శించాలి.
పరామర్శ పద్ధతులుః రోగి వద్ద ఎక్కువ సేపు కూర్చోకూడదు. కొందరు రోగి పరామర్శకై వెళ్ళినప్పుడు, గంటల తరబడి అక్కడే కూర్చుండి వ్యాధిని మరింత పెంచుతారు. ఇది పరామర్శ పద్ధతి కాదు.
నీవు రోగిని పరామర్శించినప్పుడు వ్యాధి గంభీరముగా కాకుండా అతను కోలుకుంటూ ఉంటే, అతనికి శుభవార్త ఇవ్వాలిః ‘నీ ఆరోగ్యం చాలా బావుంది, మాషాఅల్లాహ్! ఇంత మంచిగా ఉన్నావని నేననుకో- లేదు. అల్లాహ్ నీకు స్వస్థత, క్షేమము ప్రసాదించుగాక! తొందరగా ఈ వ్యాధి నుండి విముక్తి కలుగుతుంది ఇన్షాఅల్లాహ్’ అనాలి. ఇలా కాకుండా కొందరు మరింత వ్యాధిని పెంచేవాళ్ళుంటారు. అల్లాహ్ వారికి సద్బుద్ధిని ఇవ్వుగాక! రోగీ చాలా భయంకరమైన వ్యాధికి గురి అయి యున్నాడు, ఈ వ్యాధికి చికిత్సయే లేదు, తొందరగా తన ధనసంపద గురించి వీలునామాలు వ్రాయాలి, వ్రాయించాలి అన్న మాటలు మాట్లాడతారు. చివరికి రోగిని మృతుల్లో లెక్కిస్తారు. ఇది పెద్ద తప్పు. మానసిక స్థితిగతుల ప్రభావం ప్రాముఖ్యత తెలిసినదే. అతడు ఆరోగ్యంగా ఉన్నాడన్న భావన నీవు అతనికి కలుగజేస్తే ఇది అతను బాగుపడటానికి ఓ కారణం కావచ్చు. ఇన్షాఅల్లాహ్! అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ‘లాబఅస తహూరున్ ఇన్షాఅల్లాహ్’ అనేవారు. ఈ విషయం పైన మీరు చదివి ఉన్నారు.
విద్వాంసులు చెప్పినట్లు: పరలోకానికి దగ్గర అయిన, స్వస్థత కలిగే ఆశలేని రోగి వద్దకు వెళ్ళినప్పుడు ముందు అతనికి అల్లాహ్ పై మంచి నమ్మకం ఉంచమని, అల్లాహ్ ముందు మంచి విధంగా చేరుకోవాలని, అల్లాహ్ అతని పట్ల మేలే చేస్తాడని ఆశించాలన్న బోధ చేయాలి. ఇదే పరామర్శ పద్ధతి.
పరామర్శి రోగి వద్ద ఉన్నప్పుడు ప్రాపంచిక విషయాలు, అధిక జోకులు, నవ్వులాటలు మరియు వృధా మాటలు మాట్లాడవద్దు. అడపాదడపా మాత్రమే అతని దర్శనానికి వెళ్ళాలి.
ఆరవది: జనాజా వెంట వెళ్ళడం
1- జనాజా వెంట వెళ్ళు ఘనత:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం: “అతను మరణిస్తే అతని జనాజాకు తోడుగా వెళ్ళు”. ఇది ఒక ముస్లింపై ఉన్న మరో ముస్లిం హక్కు. అతను శవం అయి పోయి, అతని ఆత్మ ‘ఇల్లియ్యీన్’లో చెరుకున్నాక కూడాను, నీవు అతని వెనక నడచి, నీపై ఉన్న అతని హక్కులు నెరవేర్చు. అతని జనాజా నమాజు చేస్తూ అతని కొరకు సిఫారసు చేయి. అతను మట్టిలో పెట్టబడిన తరువాత కూడా అతనిపై అల్లాహ్ కరుణ, దయ కురవాలని దుఆ చేస్తూ ఉండు.
ఇది ఇస్లామీయ సోదరభావం. విశ్వాస వాగ్దానం. ఇవి ఒక ముస్లింపై మరొక ముస్లిం హక్కులు. ఇవి కేవలం జీవితకాలం వరకే పరిమితం కావు. చనిపోయిన తరువాత కూడా ఉంటాయి. సహీ హదీసు([60])లో ఉందిః
ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారని అబూహురైరా ఉల్లేఖించారుః “ఎవరైతే జనాజా వెంట వెళ్తాడో, జనాజా నమాజ్ చేయించే వరకు ఉంటాడో అతనికి ఒక ‘ఖీరాత్’కు సమానంగా పుణ్యఫలం లభిస్తుంది. మరెవరయితే ఖననం చేసే వరకూ హాజరై ఉంటాడో అతనికి రెండు ‘ఖీరాత్’ల పుణ్యం లభిస్తుంది”. రెండు ‘ఖీరాత్’లంటే ఎంత? అని ప్రశ్నించగా “రెండు ‘ఖీరాత్’లంటే అవి రెండు పెద్ద పర్వతాలకు సమాన”మని ప్రవక్త ﷺ సమాధానమిచ్చారు. చూడండి ఎంత తేలికైన ఆచరణ మరియు గొప్ప పుణ్యం!
2- జనాజ మరియు సంతాప పధ్ధతులుః
జనాజా ముందు నడవడం సున్నత్. ఇందులో ఘనత కూడా ఉంది. ఇబ్ను ఉమర్ తెలిపారుః “నేను ప్రవక్త ﷺ, అబూ బక్ర్ మరియు ఉమర్ రజియల్లాహు అన్హుమాలను చూశాను. వారు జనాజ ముందు నడిచేవారు”([61]). జనాజ ముందు నడవడమే సున్నత్. కాని వాహనముపై ఉన్నవాడు వెనకనే ఉండాలి. నడిచే వ్యక్తి వెనక నడిచినా అభ్యంతరమేమీ లేదు.
ఉమ్మె అతియ్య రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం: “మేము జనాజా వెంట వెళ్ళడం నిషేధించబడింది. అయితే ఈ వారింపు తీవ్రంగా రాలేదు”([62]). అయినా స్త్రీలను వారించుట విధిగా ఉంది. ఎందుకనగా స్త్రీ స్వభావికంగా బలహీనురాలు. తొందరగా ఏడుపు, దుఃఖానికి గురి అవుతుంది. ఏదైనా పరీక్షకు గురి కావచ్చు. అల్లాహ్ విధి చేసిన అదృష్టంపై అసంతృప్తి చెందవచ్చు. అందుకే వృద్ధురాలైనా సరే జనాజ (శవపేటికల) వెంట నడవకూడదు. సమాధుల దర్శనం కూడా చేయకూడదు.
ధర్మానికి వ్యతిరేకైమైన కొన్ని దురాచారాలు ప్రజల్లో ప్రబలి ఉన్నాయి. పండితులు వాటి గురించి హెచ్చరించి, తప్పును స్పష్టపరిచారు. వాటికి బదులుగా సరియైన ఆధారిత సత్కర్యాలేమిటో తెలియజేశారు. అల్లాహ్ దీనికి బదులుగా వారికి సత్ఫలితం నొసంగుగాక! వాటిలో కొన్ని దిగువ చదవండిః
సంతాప సభలు ఏర్పాటు చేసి, టెంట్లు వేసి, భోజనాలు వడ్డించి, శోకగీతాలు పాడుకుంటూ, పెడబొబ్బలు పెట్టుట నెత్తినోరు బాదుకుంటూ, దుస్తులు చించుకుంటూ, అదృష్టంపై అసంతృప్తి చెందుట.
మరో వ్యతిరేక విషయం: ఆ సభల్లో ప్రజల సంతృప్తి కొరకు, వారి మనోహరానికి పరిహాసమాడటం, నవ్వులాటలు ఆడటం ప్రాపంచిక విషయాల్లో నిమగ్నులైపోవటం లాంటి అనేకానేక దురాచారాలున్నాయి. పండితులు వాటికి సంబంధించిన వివరాలు తెలిపి ఉన్నారు. వాటిని చదవాలి.
పైన పేర్కొనబడిన కొన్ని ప్రేమ బంధాల గురించి, ప్రవక్త ﷺ తెలిపారు. ప్రవక్త సహచరులు వాటిని అలవర్చుకున్నారు. వాస్తవ (ప్రాక్టికల్) జీవితములో వాటిపై ఆచరించిచూపారు. వాటి పట్ల వారి అంగీకరణ సంపూర్ణంగా ఉండింది. ఈ ఉత్తమ గుణాలతో వారి హృదయాంతరాళాలు నిండిపోయాయి. దానికనుగుణంగా అల్లాహ్ అనుమతితో ఫలితం కూడా వచ్చింది. తత్ఫలితంగా వారు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆ అధిరోహణ సాధ్యమయ్యేది అల్లాహ్ దాస్యం, ఆరాధన మంచి విధంగా చేసినవారికి, అల్లాహ్ గ్రంథాన్ని, ప్రవక్త సంప్రదాయాల ప్రకారం దృఢంగా అమలు చేయువారికి మరియు ఇస్లామీయ గుణగణాలు అలవర్చుకున్నవారికి మాత్రమే.
అల్ హందులిల్లాహ్!….. ఇప్పటికీ ఈ ద్వారము తెరచుకునే ఉంది, ఈ సరుకు అందరి ముందూ వేసియుంది, ఇక మనం అల్లాహ్ తో వర్తకం చేయటమే ఆలస్యం. ఇది సాధ్యపడేది పైన పేర్కొనబడిన ఉత్తమ తరం (ప్రవక్త సహచరుల తరం) లాంటి నడవడికను అలవరుచుకోవటం ద్వారానే. అవి అవలంభించామంటే, మానవుడు ఇహలోకంలో ఏ మానవతా ఉన్నత శిఖరానికి చేరడం సాధ్యమో, తప్పక అక్కడికి చేరుకుంటాము. దైవదూతలు కూడా వచ్చి కరచాలనము చేస్తారు ఇన్షాఅల్లాహ్.
హృదయాలను కలిపే కళ
మొదటిది: సహచరు (సహాబా)లు శిక్షణ పొందిన ఉన్నత ఉదాహరణ
హృదయాలను కలిపే కళ, సహీ సనదుతో రుజూవైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చరిత్ర, ఆయన విద్యాసొత్తు, ప్రచారం నుండి మద్దతు తీసుకొంటూ ఆ కళను నేర్చుకుందాము, దాని గురించి చర్చించుకుందాము, దాని శిక్షణ పొందుదాము. ఎలాగైతే మన పూర్వికుల్లో అగ్రశ్రేణి సహచరులు శిక్షణ పొందారో. అయితే మేము ఈ గొప్ప కళ యొక్క పునాది దేనిపై ఉందో దానికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలను క్రింద పేర్కొంటున్నాముః
1- కోపాన్ని దిగమ్రింగటం:
ఈ కళ యొక్క ఓ మూల అంశాన్ని అల్లాహ్ తన పటిష్ఠమైన గ్రంథం ఖుర్ఆనులో తెలిపాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ వాచాకర్మ ద్వారా తెలిపారు. మరియు ఉన్నత, ఉత్తమ నడవడిక ద్వారా చూపారుః అల్లాహ్ ఆదేశం చదవండిః
{కోపాన్ని దిగమ్రింగేవారు, ఇతర తప్పులను క్షమించేవారు, ఇలాంటి సజ్జనులంటే (ఉపకారం చేసేవారంటే) అల్లాహ్ కు ఎంతో ఇష్టం}. (అలి ఇమ్రాన్ 3: 134).
విద్వాంసుల ప్రకారం ఇందులో ముగ్గురి మూడు స్థానాలు తెలుప బడ్డాయి. 1. తొలిదశలో ఉన్నవారు. 2. మధ్యేమార్గంలో ఉన్నవారు. 3. పుణ్యాల్లో అందరిని మించి ముందుగా ఉన్నవారు.
మొదటి స్థానం: ఎవరి పట్ల చెడుగా ప్రవర్తించడం జరిగిందో అతనుతన కోపాన్ని దిగమ్రింగాలి. ఇది మన లాంటి (పుణ్యాల్లో కొరత చూపే) ముస్లిముల స్థానం. ‘తన కోపాన్ని దిగమ్రింగాలి’ అంటే (చెడుగా ప్రవర్తించిన వాని) పరువు తీసి, సభల్లో కూర్చుండి తన ఆవేశాన్ని వ్యక్త పరచి తృప్తిగా శ్వాస పీల్చే ప్రయత్నం చేయవద్దు.
రెండవ స్థానం: కోపాన్ని దిగమ్రింగాక మరో అడుగు ముందుకు వేసి మరో మంచి పని చేయాలి. అదేః {ఇతర తప్పులను క్షమించే- వారు}. అంటే ఎవడు బాధించాడో, చెడుగా ప్రవర్తించాడో అతని వద్దకు వెళ్ళి ‘అఫల్లాహు అన్ క’ (అల్లాహ్ నిన్ను క్షమించుగాక) అని దుఆ ఇవ్వాలి.
మూడవ స్థానం: మరో అడుగు ముందుకు వేసి, మంచి కార్యం చేయాలి. అదేః {సజ్జనులంటే (ఉపకారం చేసేవారంటే) అల్లాహ్ కు ఎంతో ఇష్టం}. అంటే అతని వద్దకు వెళ్ళి అతనితో ముసాఫహా (కరచాలనం), ముఆనఖ (కౌగిలించుట) చేసి, అతనికి ఏదైనా కానుక ఇవ్వాలి.
చరిత్రకారులు ఒక సంఘటన పేర్కొన్నారుః హారూన్ రషీద్ యొక్క బానిస తన యజమాని సేవ చేస్తూ ఒకసారి అతనికి వేడి నీళ్ళు పోస్తూ ఉండగా ఆ వేడి నీళ్ళ చెంబు చేతిలో నుండి జారిపోయి హారూన్ రషీద్ తల మీద పడింది. హారూన్ రషీద్ విశ్వ విఖ్యాత ఖలీఫ. అతనికి కోపం వచ్చేసింది. బానిస వైపు తిరిగి చూశాడు.
బానిస -చాలా తెలివగలవాడు- ఇలా అన్నాడుః {కోపాన్ని దిగమ్రింగేవారు}.
నేను నా కోపాన్ని దిగమ్రింగాను అని ఖలీఫా అన్నాడు.
{ఇతర తప్పులను క్షమించేవారు} అని బానిసన్నాడు.
నిన్ను క్షమించానని ఖలీఫా అన్నాడు.
{సజ్జనులంటే (ఉపకారం చేసేవారంటే) అల్లాహ్ కు ఎంతో ఇష్టం} అని బానిస అన్నాడు.
వెళ్ళిపో, నిన్ను బానిసత్వం నుండి విముక్తి కలిగించాను అని ఖలీఫా చెప్పాడు.
2- ద్వేషం, అక్కసు తీసెయ్యాలి:
జమల్ యుద్ధంలో ఆయిషా రజియల్లాహు అన్హా, తల్హా రజియల్లాహు అన్హు మరియు జుబైర్ రజియల్లాహు అన్హు వారితో పాటు కొందరు సహాబాలు ఒక వైపున ఆయుధాలు తీసుకొని వెళ్ళారు. మరో వైపున అలీ రజియల్లాహు అన్హు మరియు వారితో పాటు బద్ర్ వీరులు ఆయుధాలు తీసుకొని బయలుదేరారు. యుద్ధం మొదలైంది. ఆ సందర్భంలో ఆమిర్ శొఅబీతో ఒక వ్యక్తి ‘అల్లాహు అక్బర్! సహాబాలు ఒకరిపై ఒకరి ఆయుధం లేపారే? ఎవరు కూడా వెనుతిరగడం లేదేమిటి?’ అని ప్రశ్నించాడు. దానికి అతను ఇలా సమాధానమిచ్చాడుః ‘స్వర్గవాసులు ఒకరినొకరు కలుసుకున్నారు. పరస్పరం సిగ్గుపడుతున్నారు’. అదే రణరంగంలో తల్హా రజియల్లాహు అన్హు షహీద్ అయ్యారు. అతను అప్పుడు అలీ రజియల్లాహు అన్హుకు వ్యెతిరేకంగా మరో పక్షంలో ఉండిరి. ఇతని మరణ వార్త విన్న అలీ రజియల్లాహు అన్హు తన గుఱ్ఱాన్నుండి దిగి, ఆయుధం దూరం విసిరేసి, కాలినడకన తల్హా వైపు వచ్చారు. అతన్ని చూశారు. అతను హత్యచేయబడ్డారు. -ఇహలోకంలోనే స్వర్గం శుభవార్త పొందిన పది మందిలో ఒక్కరు తల్హా- అతని గడ్డానికి అంటిన దుమ్మును దులిపారు. తరువాత ఇలా అన్నారుః “అబూ ముహమ్మద్ -తల్హా యొక్క నిక్ నేమ్- నిన్ను ఈ స్థితిలో నేను చూడలేకపోతున్నాను. కాని అల్లాహ్ తో ఇలా మొరపెట్టుకుంటున్నాను, అల్లాహ్ నిన్ను మరియు నన్ను తను ఖుర్ఆనులో తెలిపిన పుణ్యాత్ముల్లో చేర్చుగాక!
{వారి హృదయాలలో మిగిలి ఉన్న మాలిన్యాన్నీ కాపట్యాన్నీ మేము తొలగిస్తాము. వారు పరస్పరం సోదరులై ఎదురెదురుగా పీఠాలపై కూర్చుంటారు}. (15: హిజ్ర్: 47).
చూడండి వారి హృదయాలు ఎంత నిర్మలంగా, పరిశుద్ధంగా ఉన్నాయో! ఎంతటి దూరపు ఆలోచన, పరలోక చింతన! వారు పరస్పరం పోరాడుతున్నారు. రక్తపుటేరులు ప్రవహిస్తున్నాయి. అలీ రజియల్లాహు అన్హు, తల్హా రజియల్లాహు అన్హు తలను తన ఒడిలో తీసుకొనియున్నారు. వారి శాంతి సంక్షేమాలకై అర్థిస్తున్నారు. ఇంకా ఆయనతో కలిసి స్వర్గాల్లో, స్వర్గపు సెలయేల్లలో ఉంటారు. గౌరవస్థానం, మహత్తరమైన అధికారాలు కల చక్రవర్తికి సమీపంలో ఉంటారన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. వాస్తవంగా ఇది అపూర్వమైన దర్శనం! వింత నిదర్శనం!!
ఈ అపూర్వ దర్శనాలు చాలా స్పష్టంగా మనకు బోధిస్తున్న దేమంటే; వారూ మానవులే! మానవ పరిధిని దాటిన వారు కాదు. ఏ ఒక్క రోజూ వారు దైవదూతలూ కాలేదు. కాని మానవత యొక్క ఉన్నత శిఖరానికి ఎదిగారు.
* ఒక రోజు ఇబ్ను సమ్మాక్ మిత్రుడు కోపంగా అతని దగ్గరి నుండి వెళ్తూ “గదన్ నతహాసబ్” అన్నాడు. అంటే నీ సంగతి రేపు చూసు కుంటాను. రేపు మన తీర్పు జరగనుంది. నేను నిన్ను నిలదీస్తాను, నీవు నన్ను నిలదీస్తావు. మనలో తప్పు ఎవరిదో అప్పుడు తెలుస్తుంది. ఇబ్ను సమ్మాక్ ఇది విని, “కాదు, కాదు, అల్లాహ్ సాక్షిగా! రేపు మనం ఒకరినొకరు మన్నించుకుంటాము” అని అన్నాడు.
విశ్వాసులు పరస్పరం లెక్క చూసుకోరు, ఒకరికొకరు నీవు నా గురించి ఇలా…….. వ్రాసావు, ఇలా …… చెప్పావు, నీవు నన్ను పరోక్షంగా నిందించావు….. మరియు ….. మరియు ….. కాదు, ఇది సరియైన పద్ధతి కాదు. సరియైన పద్ధతి ఏమిటంటే “అల్లాహ్ నిన్ను మన్నించుగాక!” అని దుఆ ఇవ్వాలి (వేడుకోవాలి).
3- తన మానాన్ని, ధనాన్ని అల్లాహ్ మార్గంలో వెచ్చించటం:
ప్రవక్తగారి శుభ కాలంలో అబూ జమ్ జమ్ అను ఒక వ్యక్తి రాత్రి వేళ మేల్కొని అల్లాహ్ సన్నిధిలో ఈ విధంగా మొరపెట్టుకుంటాడుః “అల్లాహ్! నీ మార్గంలో ఖర్చు చేయుటకు నా వద్ద ధనం లేదు. నీ మార్గంలో పోరాడుటకు నాలో శక్తీ లేదు. అందుకు నేను నా మానాన్ని (గౌరవప్రతిష్ఠ) ముస్లిముల కొరకు అంకితం చేస్తున్నాను. ఓ అల్లాహ్! ఇక నుండి ఎవరు నన్ను దూషించినా, బాధించినా, పరోక్షంగా నిందించినా దానిని స్వయం వారి పాపాలకే పరిహారంగా చేయి!!
మరో ఉల్లేఖనంలో ఉందిః ఒక రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం దానధర్మాలు చేయండని ప్రోత్సహించారు. అప్పుడు ఉల్బా బిన్ జైద్ నిలబడి “ప్రవక్తా! దానధర్మాలు చేయమని మీరు ప్రోత్సహించారు. అయితే నా వద్ద నా మానము (గౌరవప్రతిష్ఠ) తప్ప మరేమీ లేదు. అందువల్ల నేను దాన్ని నాపై అన్యాయం చేసినవారికి దానం చేస్తున్నాను. ప్రవక్త ﷺ అతనికేమి సమాధానమివ్వలేదు. మరుసటి రోజు స్వయంగా ప్రవక్త ﷺ “ఉల్బ బిన్ జైద్ ఎక్కడున్నాడు?, తన ఆత్మాభిమానాన్ని దానం చేసినతను ఎక్కడున్నాడు?. నిశ్చయంగా అల్లాహ్ అతని ఈ దానాన్ని స్వీకరించాడు” అని శుభవార్త అందజేశారు.([63]).
ఇది ఆత్మాభిమానాల దానం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ధన మాన ప్రాణాలను ఈ శాశ్వత ‘దావత్’ (ఇస్లాం ప్రచారం) కొరకు త్యాగం చేసినట్లు, ధర్మప్రచారకులు, విద్యార్థులు తప్పక తమ మాన మర్యాదలను త్యాగం చేయాలి. మన ప్రాణం, ధనం, మానం, సంతానం ఒక్కటేమిటి సమస్తం “లాఇలాహ ఇల్లల్లాహ్” కొరకు అర్పించే సద్భాగ్యం అల్లాహ్ మనకు ప్రసాదించుగాక! (ఆమీన్).
4- ఇతరుల తప్పిదాలను సహించటం:
‘ఇహ్ యాఉల్ ఉలూం’ రచయిత ఇమాం గజాలి పేర్కొన్నారుః ఒక వ్యక్తి హసన్ బస్రీ రహిమహుల్లాహ్ వద్దకు వచ్చి ‘అబూ సఈద్ (హసన్ బసరీ కునియత్)! ఫలానా మనిషి మిమ్మల్ని పరోక్షంగా నిందించాడు’ అని చెప్పాడు. అతన్ని దగ్గరికి పిలిచి, తాజా ఖర్జూర పండ్ల బుట్ట ఇచ్చి ఇలా చెప్పారుః “నీవు అతని వద్దకు వెళ్ళి ఈ బుట్ట అతనికి ఇచ్చి నీవు మాకు పుణ్యాలిచ్చావు, దానికి బదులుగా మేము నీకు తాజా ఖర్జూర పండ్లు ఇచ్చాము అని చెప్పు”. ఇతను వెళ్ళి అవి అతనికి ఇచ్చాడు, అలాగే చెప్పాడు.
దీని ఉద్దేశ్యం ఏమిటంటే ఈ ప్రపంచ విషయం సులభం. కొందరు తమ పుణ్యాల దానం చేస్తూ ఉంటారు. ఎవరైనా నిన్ను చూసి అసూయపడినా, పగతీర్చుకొనదలచినా, నిన్ను వ్యతిరేకించినా అందుకు నీవు బాధ పడకు, ఇవన్నియూ నీ పత్రంలో పుణ్యాలుగా చేరుతాయి. నీ స్థానాన్ని పెంచుతాయి అన్న విషయాన్ని తెలుసుకో!
* హజ్రత్ మూసా అలైహిస్సలాం చరిత్రలో ఉంది, ఆయన ఒకసారి “ప్రభువా! నేనో విషయం కోరుతున్నాను”. (అతను కోరేదేమిటో అల్లాహ్ కు తెలుసు, అయినా) అదేమిటి మూసా? అని అడిగాడు. “ప్రజలు నాకు వ్యతిరేకంగా మాట్లడకుండా వారి నోరును మూయించు” అని అన్నారు. అప్పుడు అల్లాహ్ ఇలా చెప్పాడుః “మూసా! నా గౌరవం, గొప్పతనం సాక్షి! నేను ఈ పని నా కొరకు చేయలేదు. నేను వారిని సృజించాను, నేనే వారికి ఆహారం నొసంగుతాను. అయినా వారు నన్ను దూషిస్తారు”. సుబ్ హానల్లాహ్!! అల్లాహ్, కరుణించేవాడు, ఒక్కడు, అద్వితీయుడు, అక్కరలేనివాడు, ఆయనకు సంతానం ఎవరూ లేరు. ఆయన కూడా ఎవరి సంతానమూ కాదు. ఆయనకు సరిసమానులు ఎవరూ లేరు. ఇంతటి ఆ సృష్టికర్తయే ప్రజల దూషణలకు గురి అవుతున్నాడు. ఈ బలహీన, అధమ మానవుడు, వీర్య బిందువుతో పుట్టినవాడు గౌరవ సృష్టికర్త అయిన అల్లాహ్ ను దూషిస్తాడా?
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అల్లాహ్ ఇలా సెలవిచ్చాడుః ఆదము కుమారుడు నన్ను దూషిస్తాడు. ఇది అతనికి తగదు. ఆదము కుమారుడు నన్ను తిరస్కరిస్తాడు. ఇది అతనికి శోభించదు. నాకు సంతానం ఉంది అని ఆరోపించడం నన్ను దూషించినట్లు. నేను తొలిసారి పుట్టించినట్లు మరోసారి పుట్టించలేను అని అనడం నన్ను తిరస్కరించినట్లు”([64]).
ఇమాం అహ్మద్ రహిమహుల్లాహ్ తన రచన కితాబుజ్జుహ్ ద్ లో పేర్కొన్నారు అల్లాహ్ ఇలా చెప్పాడుః “మానవుడా! ఎంత ఆశ్చర్యం! నేను నిన్ను పుట్టించాను. నీవు ఇతరులను ఆరాధిస్తున్నావు. నేను నీకు ఆహారం నొసంగాను. నీవు ఇతరులకు కృతజ్ఞత తెలుపుతున్నావు. నేను నీ అక్కరలేనివాడిని, అయినా నేను నిన్ను సంతోషంగా ఉంచడానికి వరాలు ప్రసాదిస్తూ ఉన్నాను. నీవు నా అక్కరగలవాడివై కూడా నాకు అవిధేయత చూపుతూ నన్ను అసంతృప్తి పరుచు తున్నావు. నా వైపు నుండి నీపై మేళ్ళు కురుస్తున్నాయి. కాని నీ తరఫున నా వైపుకు దుష్కార్యాలే చేరుతున్నాయి”.
అన్ని లోపాలకు అతీతుడైన, ఏకైక అద్వితీయుడినే కొందరు తిడుతున్నారంటే మన లాంటి లోపాలుగల వారు ఏ పాటి?
ప్రవక్త సహచరుల ఉత్తమ మరియు ఉన్నత ఆదర్శానికి ఇదో గొప్ప నిదర్శనం. ఎలా అనగా; వారు పరస్పరం సంతోషంగా ఉండేవారు అయినా సామాన్య మానవుల్లో మాదిరిగా ఒకప్పుడు వారి మధ్య విభేదాలు చోటు చేసుకునేవి. పరస్పరం కొద్ది రోజులు అసంతృప్తిగా ఉండేవారు. కాని తిరిగి తెల్లటి నిష్కల హృదయులుగా మారారు. పరస్పరం కలిసారు, కౌగిలించుకున్నారు. సహనాన్ని ప్రదర్శించారు. ప్రేమలను పంచుకున్నారు. ఎందుకంటే వారందరి పునాది ఒక్కటి, వేరు వేరు ఎంతమాత్రం కాదు. అదే “లాఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మ దర్రసూలుల్లాహ్”. ఇక వారి మధ్యలో జరిగినదంతా, వారు మనుషులే అన్నదానికి నిదర్శన. దైవదూతలూ కారు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసును మించి పోలేరుః “ప్రతి ఆదము కుమారుడు తప్పు చేయువాడే”([65]).
ఎలాంటి మచ్చ లేని తెల్ల కాగితం లాగా కూడా లేకుండిరి. ఎన్నటికీ అలా లేకుండిరి!
వారూ మనుషులే, వారి హృదయాల్లో కూడా మానవ స్వభావమే కదులుతుండేది. వాటితోనే వారు భూమి మీద తిరుగుతుండేవారు. కాని వారి ఆ స్వభావం ఉత్తమ స్థితి మరియు ఉన్నత శిఖరంలో ఉండింది. ఎప్పుడైనా ఏదైనా కారణంగా తప్పు జరిగినా, వెంటనే సర్దుకొని మళ్ళీ ముందుకు, పైకి ఎదిగే ప్రయత్నమే చేసేవారు.
హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు ఉపమాణం చరిత్రలో ఉంది. ఒకసారి ఒక వ్యక్తి ఆయనతో అంటాడుః అబూ బక్ర్! అల్లాహ్ సాక్షిగా నేను నిన్ను ఎలా తిడతానంటే, ఆ తిట్లు నీతో నీ సమాధిలో చేరుతాయి. హజ్రత్ అబూ బక్ర్ అతనికి ఇలా సమాధానమిచ్చారుః నీతో నీ సమాధిలోనే చేరుతాయి, నా సమాధిలో కాదు.
హజ్రత్ అబూ బక్ర్ నిజం చెప్పారు. అవి దూషించబడినవారి సమాధిలోకి రావు. ఎవరు తమ నాలుకను ప్రజలను బాధించడానికి ఉపయోగించారో వారి సమాధిలోనే చేరుతాయి. ఏ మూర్ఖుడు హజ్రత్ అబూ బక్ర్ ను తిట్టాడో, ఆ తిట్లు అబూ బక్ర్ సమాధిలో చేరుతాయని భావిస్తున్నాడా? ఏలాంటి మూర్ఖత్వం ఇది? ఇంతకంటే మించిన మూర్ఖత్వం మరేముంటుంది?
మళ్ళీ హజ్రత్ అబూ బక్ర్ జవాబును గమనించండి! ఏమన్నారు? “నీతో నీ సమాధిలోనే చేరుతాయి, నా సమాధిలో కాదు” అని చెప్పారు. ఇదే సమాధానమిచ్చారు, ఇది గాకుండా, “నేనూ నిన్ను తిడతాను, నా తిట్లు నీ సమాధిలో చేరుతాయి” అని గాని, “నేను నీకు ఇలా చేస్తాను, అలా చేస్తాను” అని గానీ అనలేదు. కేవలం “నీతో నీ సమాధిలో చేరుతాయి” అని మాత్రమే అన్నారు.
హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ జవాబు, ఆయన ప్రవర్తన చాలా సరియైనది. మనసును నొప్పించే మాట, దుర్భాష, వాటి దుష్ఫలం, పరిణామం, ఆ మాటలు అనడానికి సాహసం చేసినవాడే అనుభవిస్తాడు.
5- జగడము మాని, సంధి ప్రయత్నం చేయాలి:
ఒక వ్యక్తి హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హుతో అన్నాడుః నేను తీరిక చూసుకొని నీ పని పడతాను. దానికి హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్ ‘అలాగైతే నీకు పని తగిలింది’ అన్నారు.
ఇదే సరియైన జవాబు. ఎవడైతే తన సొదరులను బాధ కలిగించ- టానికి, వారిని దూషించటానికి, వారికి వ్యతిరేకంగా ఏదైనా పన్నాగం పన్నటానికి తీరిక పొందాలనుకుంటాడో, వాస్తవానికి అతడు ఎప్పుడూ తీరిక పొందడు, అల్లాహ్ అతన్ని ఇలాగే తీరిక లేకుండా చేసేస్తాడు. వాస్తవానికి అతను ఈ విధంగా తన జీవితంలోని అమూల్యమైన సమయాన్ని లాభం లేని వషయాల్లో వృధా చేసుకుంటున్నాడు.
హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్ జవాబు సరియైనది మరియు వివేకంతో కూడుకున్నది. {ఎవరికి దివ్యజ్ఞానం (వివేకం) లభించినదో, వాస్తవంగా వారికి మహాభాగ్యం లభించినట్లే}. (సూరె బఖర 2: 269).
హదీసు వేత్తల కథనం, ఒక వ్యక్తి ఆమిర్ బిన్ షొఅబీ -పేరు గాంచిన తాబిఈన్ పండితుల్లో ఒకరు- యదుట నిలబడి ‘ఆమిర్ నీవు అబద్ధం పలుకుతున్నావు’ అని అన్నాడు.
ఆమిర్ ఇలా జవాబిచ్చారుః నీవు సత్యవంతునివైతే, అల్లాహ్ నన్ను క్షమించుగాక! నీవు అబద్ధం పలికినవానివైతే అల్లాహ్ నిన్ను క్షమించుగాక!
చెప్పండి! ఆ తరువాత అతడేమని యుంటాడు??
ఏమంటాడు? ఊరుకున్నాడు!! ఎందుకంటే ఎవరు జగడాన్ని అంతమొందించి, రాజీ కుదర్చడానికి ప్రయత్నం చేస్తారో, ఎవరిపై అత్యాచారం జరపకుండా ఉంటారో -ప్రత్యేకంగా హోదా, అంతస్తులు, గొప్ప స్థానంగల వారిపై- అలాంటివారు స్వయంగా తమ పట్ల తరువాత ఇస్లాం మరియు ముస్లిముల పట్ల మేలు చేసినవారౌతారు.
6- ఆత్మ పరిశీలన:
హజ్ సందర్భంగా మినాలో ఒక వ్యక్తి సాలిం బిన్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ ను ఢీకొన్నాడు. మళ్ళీ అతనే తిరిగి సాలింతో అంటాడుః నీవు చాలా చెడ్డ మనిషివి. సాలిం -తాబిఈన్ లోని గొప్ప పండితుడు- ఇలా జవాబిచ్చాడుః “ఈ విషయం నీవే కనుగొన్నావు, నీవే నాకు తెలిపావు. ఇప్పటి వరకెవరూ నాకు తెలుపలేదు”. ఎందుకంటే సాలిం తనకు తాను చెడ్డవాడని భావించేవారు. ఇది నిజమే. విశ్వాసి తనలో తాను లోపం, కొరత ఉన్నట్లు గమనిస్తాడు. తన ఆత్మ పెద్దిరికానికి, ఆహంభావానికి గురవుతుందని అనుకున్నప్పుడు అతను దాన్ని నిందిస్తాడు, పరిశీలిస్తాడు. కాని దుర్మార్గుడు, వంచకుడు తనను తాను మంచివానిగా ప్రచారం చేసుకుంటుంటాడు.
సఈద్ బిన్ ముసయ్యిబ్ రహిమహుల్లాహ్ అర్థ రాత్రి తరువాత నిద్ర మేలుకొని, తన ఆత్మనుద్దేశించి ఇలా అనేవారుః ‘ఓ చెడులను ప్రేరిపించే మనసా! లే అల్లాహ్ సమక్షంలో నిలబడు’.
సఈద్ బిన్ ముసయ్యిబ్ రహిమహుల్లాహ్ ఇలా అంటున్నారు!! మనం మన ఆత్మలతో ఏమంటాము?. (ఓ అల్లాహ్ మా లోపాల్ని కప్పి పుచ్చు).
సహీ సనదులతో రుజువైన ఒక సంఘటన ఇలా ఉందిః ఖుర్ఆన్ వ్యాఖ్యాత, పండితులకే పండితులైన హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు గారిని ఒక వ్యక్తి మస్జిదుల్ హరాంలో, ప్రజల ముందు దూషించడం మొదలెట్టాడు. ఆయన తల దించుకొని ఉన్నారు. కర్షకుడు, ఎడారివాసి అయిన అతడు ప్రపంచములోకెల్లా గొప్ప మేధావిని తిడుతున్నాడు. ఆయన ఏమీ బదులు పలుకడం లేదు……. ఈ (నిశబ్దాన్ని చూసిన అతను) తిడుతూనేపోయాడు. అప్పుడు ఇబ్నె అబ్బాస్ తల ఎత్తి ఇలా అంటారుః నన్ను తిడుతున్నావా? నాలో ఈ మూడు గుణాలున్నాయి!
‘ఇబ్నె అబ్బాస్ అవేమిటి?’ అని అడిగాడతను.
ఇబ్నె అబ్బాస్ చెప్పారుః అల్లాహ్ సాక్షిగా! ఎప్పుడు వర్షం కురిసినా నేను సంతోషించి, అల్లాహ్ స్తోత్రం చేస్తాను. మరి నాకు ఒంటెలు, మేకలు ఏమీ లేవు!!
‘రెండవదేమిటి?’ అని అడిగాడతను.
ఆయనన్నారుః న్యాయం చేసే ఏ న్యాయాధిపతి గురించి నేను విన్నా, అతని పరోక్షంలో నేను అతని కొరకు దుఆ చేస్తాను, మరి చూడబోతే అతని వద్ద నా అర్జీ ఏదీ లేదు.
‘మూడవదేమిటి?’ అని అడిగాడతను.
ఆయన చెప్పారుః ఖుర్ఆనులోని ఒక్క ఆయతు భావం నాకు తెలిసినా, నాకు తెలిసిన విధంగా ముస్లిములందరికీ తెలియాలని నేను కోరుకుంటాను!!
ఇది, సహాబాలో గల ఉన్నత ఆదర్శం! విశ్వాసం మరియు ఉత్తమ నడవడికల అసలైన పునాదులపై మహాప్రవక్త ﷺ వారికి శిక్షణ ఇచ్చారు. లేకుంటే వారు ఎడారి నుండి వెలికి వచ్చిన నిరక్ష్యరాస్య వర్గమే. కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్రమక్రమంగా వారికి శిక్షణ ఇచ్చి, వారి భవిష్యత్తును తీర్చిదిద్దారు. వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. చివరికి వారు సమస్త జాతులపై నాయకత్వం వహించు- టకు అర్హులయ్యారు. ప్రజలందరికీ ఉత్తమ ఆదర్శంగా నిలిచారు.
నూటికి నూరు పాల్లు నీవు ఎవరిని పొందుతావు?. నీవు వందశాతం మంచి వ్యక్తిని పొందాలంటే, ఎన్నటికీ పొందలేవు. కొంచెం, 30 శాతం, 50 శాతం మంచి వాడిని పొందగలవు. ముస్లిం సమాజములో ఒక ముస్లిం వ్యక్తి -అతను ఎంత ఉత్తమ, ఉన్నత స్థానానికి చేరుకున్నా- ఏ చిన్న లోపం, కొంత అయిన కొరత లేనివాడిని చూడలేవు. ఇలా ముమ్మాటికి అసంభవం.
{ఒక వేళ అల్లాహ్ అనుగ్రహం ఆయన కారుణ్యం మీ మీద లేకపోతే, మీలో ఏ వ్యక్తీ పరిశుద్ధుడు కాలేడు. కాని అల్లాహ్ యే తాను కోరిన వారిని పరిశుద్ధులుగా చేస్తాడు}. (సూరె నూర్ 24:21).
ఫలానా వ్యక్తి దాతృత గుణం గలవాడు కాని కోపిష్టి. ఫలానా వ్యక్తి నిగ్రహశక్తి గలవాడు కాని పిసినారి. ఫలానా వ్యక్తి సద్గుణుడు కాని తొందరపాటు స్వభావి. ఇలా వివిధ గుణాలవారుంటారు. ఎందుకంటే మంచి, చెడు గుణాలన్నీ పంచింది అల్లాహ్ యే.
ఏ వ్యక్తి యొక్క పాపాలు లెక్కించటం సాధ్యమో అతనే మంచివాడు. కాని కొందరుంటారు, నీవు ఎంత ప్రయత్నం చేసినా వారి పాపాల్ని లెక్కించ లేవు!! మరి కొందరు, నీవు వారి మంచితనాన్ని చూసి వారిలో ఏ తప్పు లేదు, కేవలం ఇది …. మాత్రమే అని అంటావు, ఇలాంటే వారే మంచివాళ్ళు. ఎవరి పుణ్యాలు వారి పాపాలను అధిగమిస్తాయో వారే ఇస్లాం యొక్క సరియైన మార్గంలో ఉన్నవారు. మరెవరి పాపాలైతే వారి పుణ్యాలకంటే మించి ఉంటాయో అతనే అల్లాహ్ మార్గం నుండి వైదొలగినవాడు. ఎందుకంటే అల్లాహ్ ప్రళయదినాన పాపపుణ్యాలను త్రాసులో తూకంవేస్తాడు. దాని గురించే అల్లాహ్ ఇలా తెలిపాడుః
{ఇటువంటి వారి నుండే మేము వారు చేసిన మంచి కర్మలను స్వీకరిస్తాము; వారు చేసిన చెడుకర్మలను మన్నిస్తాము. వారికి చేయబడుతూ వచ్చిన సత్యవాగ్దానం ప్రకారం, వారు స్వర్గవాసులలో చేరిపోతారు}. (అహ్ ఖాఫ్ 46: 16).
ఈ ఆయతులో వారిలో పాపాలు, తప్పిదాలున్నాయని, అయితే ఆయన వాటిని మన్నిస్తాడని స్పష్టపరిచాడు. ఒక హదీసులో ఈ విధంగా ఉందిః “నీటి పరిమాణం రెండు పెద్ద కడవలకు సమానంగా ఉన్నప్పుడు అది మాలిన్యాన్ని గ్రహించదు”([66]).
కొందరి నీళ్ళు (పుణ్యాలు) తక్కువ ఉండి, అందులో ఎంత చిన్న వస్తువు పడినా తన ప్రభావం చూపుతుంది, నీళ్ళు కలుషితమైపోతాయి. మరి కొందరి సత్కార్యాలు రెండు పెద్ద కడవల మాదిరిగా ఉండి అందులో ఏ వస్తువు పడినా అందులో మార్పు రాదు. వారి దానం, విద్య, ప్రచారం ఇంకా ఇతర సద్గుణాల వల్ల షైతాన్ నుండి కొన్ని దుష్ప్రేరణలు కలిగినా అవి తమ ప్రభావం చూపవు.
“హజ్రత్ మూసా అలైహిస్సలాం శిలాఫలకాలను తీసుకువచ్చారు. వాటిపై అల్లాహ్ వాక్కు, వాణి లిఖించబడి ఉంది. వాటిని ఒక పక్కన పడేశారు. తన సోదరుని జుత్తును పట్టుకొని అతన్ని లాగాడు” అని వచ్చిన విషయంలో ఇబ్ను తైమియ్య చెప్పారని ఇబ్ను ఖయ్యిమ్ మదారిజుస్సాలికీన్ లో పేర్కొన్నారుః ఆయన సోదరుడు కూడా ప్రవక్తే. అయినా మూసా అలైహిస్సలాం ప్రజల ముందు తన సోదరుని గడ్డము పట్టి లాగాడు. కాని అల్లాహ్ ఆయన్ని మన్నించాడు.
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః “సద్గుణ సంపన్నుల తప్పిదాలను మన్నించివేయండి. ‘హుదూద్’ తప్ప”([67]). హద్దుల్లో అందరూ సమానులే. కాని ఏ విషయాల్లో హద్దు నిర్ణయించబడలేదో, అవి సద్గుణ సంపన్నుల ద్వారా జరుగుతే వారిని మన్నించాలి. సద్గుణ సంపన్నులంటే ఇస్లాంపై సత్యంగా, స్థిరంగా ఉన్నవారు, ప్రచార, సంక్షేమ కార్యక్రమాలు, దానధర్మాలు, సలహా సంప్రదింపులు ఒక్కటేమిటి అన్ని రంగాల్లో ముందున్నవారు. వారి నుండి ఎప్పుడైనా ఏదైనా చిన్న తప్పు జరిగితే ఓర్చుకోవాలి. (వారి ఆ ఒక్క తప్పును “గోరంతను కొండంత చేయుట” మాదిరిగా చేయకుండా,) వారి సత్కర్యాలు, దానధర్మాలు మరియు అల్లాహ్ వద్ద మరియు ప్రజల్లో వారికున్న మంచితనాన్ని చూడాలి.
సోదరులతో కలసి ఉండు, వారి పొరపాట్లను ఓర్చుకో, వారి తప్పిదాలను మన్నించు.
ఇబ్ను ముబారక్ రహిమహుల్లాహ్ ముందు వారి మిత్రుల, శిష్యుల, చెడు ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఇలా అనేవారుః ‘ఫలాన మాదిరిగా ఎవరుంటారు. అతనిలో ఇలాంటి …. ఉత్తమ గుణాలున్నాయి’. వారి చెడులను ప్రస్తావించేవారు కాదు.
అయ్యో! మనము కూడా ప్రజల మంచి కార్యాలను ప్రస్తావిస్తూ ఉంటే ఎంత బాగుండు?. ఎంత చెడ్డ ముస్లిమైనా అతనిలో కొన్ని సత్కార్యాలు లేకుండా ఉండవు. కనీసం నమాజైనా చేస్తాడు కావచ్చు. ఇది లేకున్నా అల్లాహ్, ఆయన ప్రవక్తను ప్రేమించే వాడై ఉండవచ్చు. ఇదే నిజమైతే, అతని మంచితనానికి ఇదే సరిపోతుంది.
* మత్తు సేవించిన ఒక వ్యక్తిని ప్రవక్త సమక్షంలో తీసుకురావడం జరిగింది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కొరడా శిక్ష విధించారు. అతను ఇంతకు ముందు కూడా అనేక సార్లు శిక్ష అనుభవించాడు. అతన్ని చూసిన ఒక వ్యక్తి ‘ఇతనిపై అల్లాహ్ శాపం పడుగాక! ఎన్ని సార్లు పట్టుబడ్డాడు’ అని అన్నాడు. ఇది విన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “మీరు శాపనార్థాలు పెట్టకండి. అల్లాహ్ సాక్షిగా అతను అల్లాహ్ , ఆయన ప్రవక్తను ప్రేమిస్తాడన్నది నాకు తెలుసు”. మరో ఉల్లేఖనంలో ఉందిః ఒక వ్యక్తి ‘అల్లాహ్ ఇతన్ని అవమానపరుచుగాక!’ అని శపించాడు. ప్రవక్త ﷺ “మీ సోదరునికి వ్యతిరేకంగా షైతాన్ కు సహాయపడకండి” అని చెప్పారు.
అతను అల్లాహ్, ఆయన ప్రవక్తను ప్రేమిస్తున్నాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రుజువు పరిచారు. ఈ ప్రేమ కూడా ఒక సత్కార్యమే. ఇంకా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లామీయ సోదరత్వంలో అతన్ని చేర్చారు. ఇది అతి గొప్ప సత్కార్యం. మరలాంటప్పుడు మనం ముస్లిముల మేళ్ళను, ఇస్లాములో వారి త్యాగాలను ఎందుకు ప్రస్తావించకూడదు?
సంపూర్ణ దుర్మార్గంపై నీవు ఏ మనిషినైనా చూస్తున్నావంటే అతడు సత్యతిరస్కారి, లేదా అల్లాహ్ హద్దులను మితిమీరినవాడు, లేదా ఘోరపాపాలు బహిరంగంగా చేసేవాడు, లేదా సిగ్గూ లజ్జా వస్త్రాన్ని పూర్తిగా దించేసినవాడు, లేదా పుణ్యాత్ములతో, సద్పురుషులతో శతృత్వం వహించేవాడు, లేదా ఇస్లాంను తన వీపు వెనక వదిలేసినవాడు.
రెండవది: విభేదాలను విడనాడడంలో ఇస్లామీయ విధానం
క్రియాత్మక ఆదర్శాలు/ దృష్టాంతాలు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభ కాలంలో ఆయన సహచరుల ద్వారా ఉనికిలో వచ్చిన అత్యుత్తమ ఆదర్శాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని దిగువ తెలుపబడుతున్నవిః
1- బిలాల్ మరియు అబూ జర్ర్ ల మధ్య విభేదం:
ఒకసారి అబూ జర్ర్ బిలాల్ ను అతని తల్లి గురించి ప్రస్తావించి సిగ్గు చేటయిన విషయమన్నాడు. బిలాల్ అతని గురించి ప్రవక్తకు ఫిర్యాదు చేశారు. అటు అబూ జర్ర్ తను చెప్పిన మాటను గుర్తు తెచ్చుకొని పశ్చాత్తాప పడ్డారు. ఇకేమయింది? తన చెంప భూమి మీద పెట్టి బిలాల్ తో అన్నారుః ‘అల్లాహ్ సాక్షిగా! మీ పాదం నా చెంప పై పెట్టనంత వరకు నేను భూమి మీద నుండి లేవను’. ఇద్దరు ఒకరికొకరు కరచాలనం చేసి, కలుసుకున్నారు.
ఇస్లాం స్వీకరణ తరువాత, ముహాజిరుల మరియు అన్సారుల మధ్య పరస్పరం ఆయుధాలు బైటికి తీసి, ఒకరిపై ఒకరు దాడి చేసుకునే సందర్భంలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మధ్య ప్రత్యక్షమయ్యారు. “ఏమిటిది, అనాగరిక నినాదం? విడనాడండి. ఇది అత్యంత నీచమైనది, దుర్గంధభూయిష్టమైనది” అని అన్నారు. అందరూ కన్నీరు కార్చారు. తమ చేతుల నుండి ఆయుధాల్ని వదిలేసారు. పరస్పరం కలుసుకున్నారు. ఇది నిజమైన సోదరభావం. ఇది అల్లాహ్ పై ప్రగాఢ విశ్వాసం ద్వారా లభిస్తుంది. ఇది అల్లాహ్ యొక్క గొప్ప వరం. ఆయన తన దాసుల్లో తాను కోరినవారికి ప్రసాదిస్తాడు. పరస్పర ద్వేషాలతో నిండియున్నమనస్సులు కలవడం కేవలం ఇస్లాం ద్వారానే సాధ్యమయ్యేది. అది కేవలం అల్లాహ్ యొక్క త్రాడు. దాన్ని గట్టిగా పట్టుకుంటేనే, అల్లాహ్ కరుణతో సోదరులవుతారు. కాలాల తరబడి రగులుతున్న వైరాన్ని కాలరాయటానికి, వర్గాల కక్షలను అంతం చేయటానికి, వ్యక్తిగత కోరికల్ని హరించివేయటానికి మరియు జాతీయ ద్వేషాలను అంతమొందించటానికి అల్లాహ్ కొరకైన సోదరభావం తప్ప మరే మార్గం లేదు. అల్లాహ్ ఆదేశం ఇలా ఉందిః
{అందరూ కలిసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి. విభేదాలలో పడకండి. అల్లాహ్ మీకు చేసిన మేలును జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు ఒకరి కొకరు శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలను కలిపాడు. ఆయన కటాక్షం వల్లనే మీరు పరస్పరం సోదరులయ్యారు. మీరు నిప్పులతో నిండివున్న ఒక గుండం ఒడ్డున నిలబడి ఉన్నారు. అల్లాహ్ మిమ్మల్ని దాని నుండి కాపాడాడు}. (ఆలి ఇమ్రాన్ 3: 103).
* చరిత్రకారులు సహీ సనదు (ప్రామాణిక ఆధారాల)తో ఒక సంఘటన పేర్కొన్నారుః ప్రవక్త సహచరులు బనీ ముస్తలిక్ యుద్ధానికి బయలు దేరారు. (దారి మధ్యలో ఓ చోట మజిలీ చేశారు). ఉమర్ కు ఓ బానిస ఉండేవాడు. అతని పేరు జహ్ జాహ్. అతను మరియు అన్సారులోని సనాన్ బిన్ వబ్రా మధ్య గొడవ మొదలయి, ఇద్దరూ కోపానికొచ్చి, కేకలు వేశారు. ఉమర్ రజియల్లాహు అన్హు బానిస ‘ముహాజిరులారా!’ అని, అన్సారీ ‘అన్సారులారా!’ అని పిలిచారు. ఆ నినాదాలు మనస్సులను కలుషితం చేశాయి. మునాఫిఖు (వంచకు)ల నాయకుడైన అబ్దుల్లాహ్ బిన్ ఉబై బిన్ సలూల్ ఇలా అన్నాడుః ‘ఎవరు చెప్పాడో కాని బలే మంచి సామెత చెప్పాడుః నీవు నీ కుక్కను ఆకలితో ఉంచుతే అది నీ వెనక వెనక వస్తుంది. తినిపించి లావు చేస్తే నిన్నే తినేస్తుంది. ఒకవేళ మనము, వాళ్ళను మన ఇండ్ల నుండి తరిమివేసియుంటే ఈనాడు మనతో ఇలాగా ప్రవర్తించి యుండే వారు కాదు. మనము మదీనా తిరిగి వెళ్ళిన తరువాత మనలోని గౌరవనీయులు నీచులని అక్కణ్ణించి వెళ్ళగొడదాము’. ఈ విషయం జైద్ బిన్ అర్ఖమ్ విని, ప్రవక్తకు తెలియజేశారు. ప్రవక్త ﷺ సహచరుల వద్దకు వచ్చి, ఆ ప్రాంతం నుండి బయలుదేరాలని ఆదేశించారు. ఎందుకంటే అక్కడే ఉండడం వల్ల వంచకులు ఈ విషయాన్ని మరింతగా లేపి పరిస్థితిని చెడగొట్టకుండా ఉండటానికి. సమాజంలో కొందరుంటారు, ఇతరుల తప్పు, పొరపాట్లను పట్టడానికి మాటు వేసి యుంటారు. వాటి గురించి చిలువలు పలువలు చేస్తారు. దీనినే ఓ పనిగా పెట్టుకోని కుక్క ప్రతి పల్లములో మూతి పెట్టినట్లు ఇతరుల మాన మర్యాదలలో జోక్యం చేసుకోనిది తృప్తి పడరు.
కాని ఇక్కడ ప్రవక్త ﷺ గారి వివేచనతో కూడిన విధానాన్ని గమనించండి! ఎవరికీ ఆ విషయంలో గొడవపడే అవకాశం లభించకుండా, ఆ ప్రాంతం నుండి బయలుదేరాలని ఆదేశించారు.
అందుకే వదంతులను అంతమొందించి, పరస్పరం ప్రేమగా ఉన్నవారి మధ్య ఏర్పడే చిచ్చులు చల్లారటానికి సులభమైన పద్ధతి ఏమిటంటే? ప్రజల్ని విద్యా, విద్య సంబంధిత విషయాల్లో, చింతనాత్మక పనుల్లో నిమగ్నుల్ని చేయాలి. ముస్లిం సమాజ పెద్ద పెద్ద సమస్యలు వారి ముందుంచాలి. ఎందుకంటే ఇస్లాం మరియు ముస్లిముల సమస్యలు మన వ్యక్తిగత సమస్యల కంటే, మన గొడవలకంటే ముఖ్యమైనవి. ఇస్లాంను వ్యాప్తి చేసే సమస్య. అంతర్జాతీయంగా యూదులను అణచివేసే సమస్య. సెక్యులిరిజం (లౌకికవాదం), కమ్యూనిజం (సామ్యవాదం) మరియు క్రైస్తవుల దినదినానికి పెరుగుతున్న సమస్యలు. కలకాలం ఉండే ముస్లిం సమాజ ఐక్యత సమస్య. అల్లాహ్ ముస్లిం సమాజాన్ని సర్వ సమాజాలపై సాక్షిగా ఉండే మధ్యస్త సమాజంగా చేశాడు. అది దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు ప్రవక్త ﷺ యొక్క సహీ హదీసులను అనుసరిస్తుంది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సఅద్ బిన్ ఉబాదతో కలసి జరిగిన ఈ సంఘటన గురించి తెలిపారు. అతనన్నాడుః ప్రవక్తా! అల్లాహ్ సాక్షిగా! మీకిష్టముంటే మేము అతడ్ని (అబ్దుల్లాహ్ బిన్ ఉబై) నరికేస్తాము. లేదా అతడు మదీనాలో ప్రవేశించకుండా అడ్డుకుంటాము. నిస్సందేహంగా మీరు గౌరవపాత్రులు, అతడే నీచుడు. ఉమర్ వచ్చి, ప్రవక్తా! నాకు అనుమతివ్వండి, నేను అతన్ని అంతమొందిస్తాను అన్నారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఉమర్! ముహమ్మద్ తన అనుచరులనే హతమారుస్తున్నాడని ప్రజలు పుకార్లు లేపుతారు కదా, అందుకు నీవు ఆ పని చేయకు” అని అన్నారు. ([69]).
ఇస్లామీయ ప్రచార సందర్భాలలో శత్రువులతో, విరోధులతో ప్రవర్తించాల్సిన సరియైన విధానం ఇదే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద మంచి ప్రచార విధానం ఉండింది, దానిని ఆయన అనుసరించేవారు. ప్రచారం ముందుకు సాగుతూ ఉండాలన్నదే ఆయన కాంక్ష. ఇందులో తమ ధనం, ప్రాణం, రక్తం, భార్యా పిల్లలందరిని త్యాగం చేయవలసి వచ్చినా, అన్నిటికీ సిద్ధమై ఉండేవారు. ఎందుకంటే ఇస్లామీయ ప్రచారం ఎల్లవేళల్లో జరుగుతూ ఉండాలి. ప్రజలు లబ్ధి పొందుతూ ఉండాలి. ప్రజలు వినాలి, గుణపాఠం నేర్చుకోవాలి. ఆయన ద్వారా అనేకానేక మంది సన్మార్గం పొందాలి. స్వార్థం కొరకు ప్రతీకారం తీర్చుకోవడం, ఆగ్రహపడడం ఆయన గుణాల్లో ఎంత మాత్రం లేదు.
అటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉమర్ రజియల్లాహు అన్హుని నిలిపేసారు. ఇటు అబ్దుల్లాహ్ బిన్ ఉబై కుమారుడు -అతని పేరు కూడా అబ్దుల్లాహ్ యే, (అతను ముస్లిం)- వచ్చి, ‘మీరు నా తండ్రి హత్య చేయదలుచుకున్నట్లు నేను విన్నాను. నా తండ్రి హత్య కొరకు మీరు ఎవరినైనా పంపుతే, ఆ హంతకుడిని నా కళ్ళ ముందు నడుస్తూ చూసి, అతడ్ని హత్య చేయనిదే నా ఆత్మకు తృప్తి కలగదు. అందుకే ప్రవక్తా! మీతో విన్నవించుకునేదేమిటంటే మీరు నాకు అనుమతిస్తే, ఇప్పుడే నా తండ్రి తల నరికేసి మీ ముందు తెచ్చి- పెడతాను. మీకిష్టముంటే నేను తప్పక అతన్ని హతమారుస్తాను. నిశ్చయంగా మీరు గౌరవపాత్రులు. అతడే నీచుడు’ అని చెప్పాడు.
చూడండి! ఈ ఇస్లాంను. దీని పట్లగల గొప్ప సంబంధాన్ని! తండ్రి మరియు కుమారుడిలో ఎలా వేర్పాటు జరిగింది! కొడుకు అతని రక్తం, అతని వంశోద్ధారకుడే మరి! కాని…..?
ఆ సహచరుని విశ్వాసాన్ని కూడా చూడండి, అది అతనిలో ఇమిడిపోయింది. నరనరాల్లో జీర్ణించుకుపోయింది.
వాస్తవంగా “లాఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్రసూ లుల్లాహ్” ద్వారా ప్రస్ఫుటమయ్యే విశ్వాసం, నమ్మకం మరియు ధైర్యం, సాహసం యొక్క వర్ణనాతీత విషయాలు (చరిత్ర పుటల్లో) లిఖించబడ్డాయి. విచిత్ర సంఘటనలు వెలికి వచ్చాయి. అవి విజ్ఞానులను, బుద్ధి- మంతులను ఆశ్చర్యంలో పడవేస్తాయి. వారు వాటి గురించి ఏ వివరణా ఇవ్వలేని స్థితిలో ఉంటారు.
ఆ దౌర్భాగ్యుడు (అబ్దుల్లాహ్ బిన్ ఉబై) చనిపోయాడు. అతని కొడుకు అబ్దుల్లాహ్ ప్రవక్త వద్దకు వచ్చి, ఆయనగారి చొక్కా అడిగాడు. అందులో తన తండ్రి భౌతిక కాయాన్ని చుట్టి సమాధి చేయడానికి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తమ చొక్కా ఇచ్చేశారు. ప్రవక్త, తన తండ్రి యొక్క జనాజ నమాజు చేయించాలని కోరాడతను. నమాజు చేయించటానికి ప్రవక్త నిలబడ్డారు. అంతలోనే ఉమర్ రజియల్లాహ్ అన్హు ప్రవక్త వస్త్రాన్ని పట్టుకొని, ప్రవక్తా! మీరు అతని జనాజ నమాజు చేయిస్తారా?, మీ ప్రభువు మిమ్మల్ని నివారించాడు కదా? అని గుర్తు చేయగా, అప్పుడు ప్రవక్త చెప్పారుః అల్లాహ్ నాకు అధికారం ఇస్తూ ఇలా ఆదేశించాడుః
{నీవు వారిని క్షమింపవేడినను, వేడకపోయినను సమానమే. నీవు వారి కొరకు డెబ్బై సార్లు క్షమాపణ వేడినను అల్లాహ్ ఎన్నటికీ వారిని క్షమించడు}. (సూరె తౌబా 9: 80). అయితే నేను డెబ్బైకన్నా ఎక్కువ సార్లు అతడి మన్నింపు కోసం ప్రార్థిస్తాను.
అతడు మునాఫిఖ్ కదా! అని ఉమర్ చెప్పారు. అయినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని నమాజు చేశారు. సహచరులు చేశారు. ఆ తరువాత అల్లాహ్ వైపు నుండి ఈ ఆదేశం వచ్చిందిః
{వారిలో మరణించినవాని కొరకు ఎప్పటికిని నీవు ప్రార్థన చేయకు. వాని గోరి యొద్ద నిలవకు}. (సూరె తౌబా 9: 84).
* అల్లాహ్ అవిధేయతకు ఒడిగట్టిన, ప్రవక్త ﷺ ఆదేశాన్ని వ్యతిరేకించిన, ప్రవక్త ﷺ తో కలిసి జిహాద్ చేయడం మానుకున్న మరియు ముస్లిములతో అసభ్యంగా వ్యవహరించిన మునాఫిఖులు (కపటులు), ఒక్కొక్కడు ప్రవక్త (యుద్దం నుండి తిరిగి వచ్చాక, ఆయన) వద్దకు వచ్చి, ప్రవక్తా! నేను వ్యాధిగ్రస్తునిగా ఉంటిని అని అన్నాడు. ప్రవక్త సరే మంచిది అని జవాబిచ్చారు. అతను శారీరక రోగి కాదు, హృదయరోగి. మరొకడు వచ్చి, యుద్ధ సందర్భంలో నా భార్య ఆరోగ్యం పాడయింది అందు వల్ల నేను మీతో పాల్గొన లేదు అన్నాడు. అతనికీ సరే, నీవు చెప్పేది సత్యమే కావచ్చు అని సమాధానమిచ్చారు. మరొకడు వచ్చాడు. ప్రవక్తా! ప్రయాణానికి ఒక ఒంటె ఖరీదు చేసేంత శక్తి లేని బీదవాణ్ణి నేను అందుకే మీ వెంట రాలేదు అని చెప్పుకున్నాడు. నీవు కూడా నిజమే చెప్పావు అని ఇలా సమాధానమిస్తూ పోయారు. అటు అల్లాహ్ వైపు నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం పై ఈ ఆయతు అవతరించిందిః
{అల్లాహ్ నిన్ను క్షమించుగాక! సత్యవంతులు నీకు స్పష్టపడి అసత్యవంతులు నీకు తెలియనంత వరకు నీవెందుకు వారికి సెలవొసంగితివి?}. (సూరె తౌబా 9: 43).
ఈ ఉత్తమ ప్రవర్తన ద్వారా ప్రవక్త -సల్లల్లాహు అలైహి వసల్లం- ఏమి సాధించారు?
ఆయన తమ (సత్ర్పవర్తనతో కూడిన) ప్రచారం ద్వారా హృదయాల్ని కలిపారు, తమ వివేకం ద్వారా మనసులను ఒకటిగా చేశారు. ఒక సహచరుడు వచ్చి ఇలా అంటాడుః సత్య ఆరాధ్యుడైన అల్లాహ్ సాక్షిగా! మీరు నా దృష్టిలో స్వయంగా నా ఆత్మకంటే ఎక్కువ అభిమానులు. మరొకడు ఇలా అన్నాడుః ఆయన గొప్పతనం చెప్పరానిది, నేను ఎన్నడూ వారిని కళ్ళారా చూడలేదు. అల్లాహ్ సాక్షిగా! ఆయన ఎలా ఉండిరి తెలుపమని మీరు నన్ను అడిగినచో నేను చెప్పలేను.
ప్రవక్త సహచరులు ప్రవక్తను ప్రేమించిన తీరు అపూర్వం. వారి రక్తాలు పారినా, మెడలు నరికినా సహిస్తారేమో కాని ప్రవక్త -సల్లల్లాహు అలైహి వసల్లం- పాదములో ఒక ముళ్ళు గుచ్చుకుంటే భరించలేకపోయేవారు. ఇదే నిజమైన ప్రేమ.
3- ముఆవియ మరియు ఇబ్ను జుబైర్ ల మధ్య విభేదం:
మదీనాలో ముఆవియ రజియల్లాహు అన్హు గారికి ఒక చేను ఉండేది. అందు లో అతని పని మనుషులుండేవారు. దాని ప్రక్కనే అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ రజియల్లాహు అన్హు గారి చేనూ ఉండింది. అప్పట్లో ముఆవియ రజియల్లాహు అన్హు ఈనాటి ఇరువై దేశాలంతటి రాజ్యానికి పాలకుడు. ఇక ఇబ్ను జుబైర్ రజియల్లాహు అన్హు ఆయన రాజ్యపాలనలో ఒక పౌరుడు. వారిద్దరి మధ్యలో (ఈ భూమికి సంబంధించిన) ఓ గొడవ ఎప్పటి నుండో ఉండింది. అయితే ఒకసారి ముఆవియ రజియల్లాహు అన్హు పనిమనుషులు ఇబ్ను జుబైర్ రజియల్లాహు అన్హు చేనులో చొరబడ్డారు. అప్పుడు ఇబ్ను జుబైర్ రజియల్లాహు అన్హు –కోపోగ్రహీతుడై- మఆవియా రజియల్లాహు అన్హుకు ఇలా లేఖ వ్రాసారు.
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, ఈ లేఖ ‘హవారియె’([70]) రసూల్ జుబైర్ మరి జాతున్ నితాఖైన్([71]) అస్మా కుమారుడగు అబ్దుల్లాహ్ తరఫున, పచ్చి కాలేయాన్ని నమిలిన హిందా కొడుకు ముఆవియా పేర, వ్రాయునది! అమ్మాబఅద్: నీ చేనులోని పనిమనుషులు నా చేనులో చొరబడ్డారు. సత్య ఆరాధ్యుడైన అల్లాహ్ సాక్షిగా! నీవు వారిని ఆపకున్నట్లయితే నీతో నా సమస్య మరింత జటిలమవుతుంది!!
ముఆవియా లేఖ చదివారు. అతను చాలా ఓర్పు, సహనం గలవారు. తన కుమారుడైన యజీదును పిలిచారు. యజీదు తొందర పాటుగల మనిషి. ముఆవియా రజియల్లాహు అన్హు తన కొడుకు ముందు లేఖనుంచి నీ అభిప్రాయం ఏమిటి? దీనికి ఎలా జవాబివ్వాలి? అని ప్రశ్నించారు. అతడన్నాడుః ఒక పెద్ద సైన్యాన్ని సిద్ధ పరచండి, దాని మొదటి సిపాయీ మదీనాలో ఉండగా, చివరి సిపాయి ఇక్కడ మీ వద్ద డమస్కస్ లో ఉండాలి. ఆ సైన్యం అతని (ఇబ్ను జుబైర్) తల తీసుకురావాలి.
‘లేదు, దానికంటే ఉత్తమమైన మరియు ప్రేమను, రక్త సంబంధాన్ని పటిష్ఠం చేసే ఒక పద్ధతి నా వద్ద ఉంది’ అంటూ ముఆవియా రజియల్లాహు అన్హు లేఖ వ్రాయడం మొదలెట్టారు.
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, మిఆవియా బిన్ అబీ సుఫ్యాన్ తరఫున, ‘హవారియె’ రసూల్ జుబైర్ మరియు జాతున్ నితాఖైన్ అస్మా కుమారుడగు అబ్దుల్లాహ్ కు, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహూ, వబఅద్: (ఈ చేనేమిటి) నా మధ్య మరియు నీ మధ్య ఈ జగమంతటి సమస్య ఎదురైనా, నీవు దాని గురించి నన్ను మందలిస్తే అది నీకు అప్పగిస్తాను. నా ఈ లేఖ నీ వద్దకు చేరిన వెంటనే నా చేను కూడా నీదే మరియు నా పని మనుషులు కూడా నీకే. ఇక అవన్నియూ నీ సొత్తే. వస్సలామ్!!
లేఖ అబ్దుల్లాహ్ బిన్ జుబైర్ రజియల్లాహు అన్హుకు చేరింది. దాన్ని చదివి, ఆయన కంటతడి పెట్టారు. లేఖ కూడా తడిసిపోయింది. ఇక లేచి ముఆవియా రజియల్లాహు అన్హును కలుసుకోవటానికి డమస్కస్ బయలుదేరారు. అక్కడికి వెళ్ళి ఆయన తలను చుంబించి, ఇలా అన్నారుః అల్లాహ్ నీ బుద్ధిజ్ఞానాలు, తెలివితేటలను కాపాడుగాక! ఇందువలనే అల్లాహ్ నిన్ను ఖురైషుల్లో ఈ గొప్ప స్థానానికి చేర్పించాడు.
మూడవది: ఇస్లాం పై మాత్రమే ఐక్యత
మనము ఇతర జాతులకంటే విలక్షణమైన వారం. మనం దేశా- భిమానం ఆధారంగా ఒకటి కాలేము. మనల్ని దేశం ఐక్య పరచదు. ముస్లిములు నివసిస్తున్న దేశాలన్నీ మన దేశాలు. ఏ ప్రాంతంలో అల్లాహ్ నామ స్మరణ జరుగుతుందో అది ముస్లిం దేశమే.
అలాగే మనలో రక్తం ప్రాతిపదికపై కూడా ఐక్యత కుదరదు. ఇది భూవాసుల నినాదం. అల్లాహ్ దాని గురించి ఏ ఆధారమూ అవతరింప జేయలేదు. భాషా పరంగా కూడా మనలో ఐక్యమత్యమేర్పడదు. భాషలు అనేకం గలవు.
విశ్వాస పరంగా మాత్రమే మనం ఒక్కటి కాగలము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన సత్య ధర్మం ఆధారంగా. అదే “లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్” ఆధారంగా సంఘటితం కాగలం.
ఇదే గొప్ప మూల సూత్రం. ఇది విడివిడిగా ఉన్న మనల్ని ఏకం చేసింది. వర్గాల్లో ఉన్న మనల్ని ఒక్కటిగా చేసింది.
మనలో ఏ చిన్న ఎడబాటు, అనైక్యత ఏర్పడినా మనం ధర్మం వైపునకు మరలాలి. మనమందరం కలిసే ఐదు పూటల నమాజు చేస్తూ ఉంటాము. మన అందరి ఖిబ్లా కూడా ఒక్కటే. మనమనుసరించే ప్రవక్త కూడా ఒక్కరే. మనమందరం ఆరాధించే అల్లాహ్ కూడా ఒక్కడే. మనందరి గ్రంథం (ఖుర్ఆన్) ఒక్కటే. ఇంకా మనందరి సున్నత్ కూడా ఒక్కటే అన్న విషయాల్ని మనం గుర్తు తెచ్చుకోవాలి.
ప్రేమగా ఉన్నవారి మధ్యలో ఏదైనా సందర్భంలో కలత వచ్చినా అది ప్రేమను, ఆంతర్యంలో ఉన్న అభిమానాలను నశింపజేయరాదు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడుః {నీ ప్రభువు కాంక్షించినచో వారు ఎన్నటికీ అలా చెయ్యరు}. (సూరె అన్ఆమ్ 6: 112). అల్లాహ్ అభీష్టంతో ఇలాంటి చిన్న సంఘటనలు జరిగినా, అందులో అల్లాహ్ కు మాత్రమే తెలిసియున్న ఏదైనా ఔచిత్యం ఉండవచ్చు?
ఒకప్పుడు ఒక విషయం మనకు నచ్చకపోచ్చు కాని అందులోనే మేలు ఉండవచ్చు. మరొక్కప్పుడు ఒక విషయం మనకు ఇష్టముండ వచ్చు కాని అందులో మనకే నష్టం ఉండవచ్చు. సంపూర్ణ వివేచనా పరుడు అల్లాహ్ మాత్రమే.
అల్లాహ్ యొక్క ఏ నిర్ణయాన్నీ అసహ్యించుకోకు, నష్టం అనిపించేదే బహుశా లాభదాయకంగా ఉండవచ్చు. ఒక్కోసారి ఏదైనా అనైక్యత లేదా ఇంకేదైనా ఏర్పడినచో అందులో గొప్ప లాభాలు కలగవచ్చు. వాటిని మనం మన బుద్ధీజ్ఞానాలతో, మన పథకాలతో లేదా ప్రయత్నాలతో తెలుసుకోలేము. ఇందులో మన స్థానాల రెట్టింపు, రక్షణ, పాపాల మన్నింపు లాంటి ఎన్నో మేళ్ళుండవచ్చు. కాని మనిషి (దూరదృష్టి, లేక ఇతర కారణాల వల్ల) వాటిని విపత్తుగా, పీడనగా భావిస్తాడు. అలా భావించకూడదు. అల్లాహ్ సంపూర్ణ వివేచనాపరుడు. మనిషి పగలు, రేయి ఇలా అనాలిః “రజీతు బిల్లాహి రబ్బా, వబిల్ ఇస్లామి దీనా, వబిముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వ సల్లమ నబియ్య”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః “ఎవరు రజీతు బిల్లాహి రబ్బా, వబిల్ ఇస్లామి దీనా, వబి ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లమ నబియ్యా చదువుతారో అతనికి తప్పక స్వర్గం లభిస్తుంది”. (అబూ దావూద్).
ఐహిక కారణాల మూలంగా లేదా స్వార్థం కోసం మనం పరస్పరం ఎవరితో కూడా తగవు పెట్టుకోకూడదు. ప్రతీ వ్యక్తి తన ధర్మ ప్రాభల్యానికి, దాన్ని అనుసరించే వారి ఉన్నతి, వారి సంక్షేమాల కొరకు పాటుపడాలి. మనందరం ఐకమత్యాన్ని పాటించి అనైక్యతకు దూరంగా ఉండాలి. ఇంకా ముస్లిం సమాజంపై వచ్చే విపత్తును ఆపడానికి ప్రయత్నం చేయాలి. చివరికి ఈ ఖుర్ఆను ఆయతు వెలుగులో అందరూ ఒక్కటై యుండాలి.
{ఇంకా ముస్లిముల మనస్సులను ఒకదానితో ఒకటి కలిపినవాడూ ఆయనేకదా! నీవు సమస్త భూసంపదను ఖర్చు పెట్టినా, వారి మనస్సులను కలపగలిగి ఉండేవాడవు కాదు. కానీ అల్లాహ్ వారి మనస్సులను కలిపాడు. నిశ్చయంగా ఆయన మహా శక్తిమంతుడు, మహా వివేకవంతుడు}. (8: అన్ఫాల్: 63).
ఓ అల్లాహ్ మమ్మల్ని పాపాల నుండి కాపాడు. వృధా మాటల, చేష్టల నుండి రక్షించు. ఘోర ప్రమాదాల్లో నుండి వెలికితీయుము!!
ఓ అల్లాహ్! ధర్మంపై మాకు నిలకడ ప్రసాదించు. మా బాణాలు గురిపై పడుటకు సహకరించు. మా చేతులారా ఇస్లాం కేతనమెగిరేసే భాగ్యం ప్రసాదించు. ఇస్లాం ద్వారా మాకు సహాయం నొసంగు.
ఓ అల్లాహ్ !మా హృదయాల్లో మా సోదరుల పట్ల ఉన్న అక్కసును, పొరుగువారి పట్ల గల కక్షను, మాతోటి వారి పట్ల గల ఈర్ష్యను తీసివేయుము.
ఓ అల్లాహ్! పరిశుద్ధ నీటితో మా హృదయాల్ని కడిగి వేయి, ధర్మజలంతో మా ఆత్మలను పరిశుద్ధపరచు. విశ్వాసులకు శాంతి, తృప్తినిచ్చి మా గుండెలను చల్లపరచు.
[2] అబూ దావూద్/ అదబ్/ ఫిర్రజులి యుఫారిఖుర్రజుల…/ 5200. ఈ హదీసు రెండు ‘సనదుల’తో ఉల్లేఖించబడినది. ఆ రెండిట్లో ఒకటి సహీ ఉంది అని షేఖ్ అల్బానీ మిష్కాత్/ 4650లో తెలిపారు.
=5227 ఈ హదీసు ఉల్లేఖన కర్తలు నమ్మకస్తులైనప్పటికీ ఇది ‘మున్ ఖతిఅ’ (అంటే హదీసు పరంపరలో ఒక ఉల్లేఖన కర్త తన గురువు నుండి కాకుండా అతని గురువు నుండి ఉల్లేఖించడం) అని ‘ఫత్ హుల్ బారి’ (11/6) రచయిత తెలిపారు.
[3] ఈ విషయం ఫత్ హుల్ బారి 11/6లో ఉంది.
[4] అబూ దావూద్/ అదబ్/ కైఫస్సలాం/ 5195. తిర్మిజి/ అల్ ఇస్తిఅజాన్/ మా జుకిర ఫీ ఫజ్లిస్సలాం/ 2689. ఈ విధంగా హసన్, సహీ, గరీబ్ ఉంది అని తిర్మిజి చెప్పారు. ఇది హసన్ అని షేఖ్ అల్బానీ తెలిపారు. మిష్కాత్: 4643.
[18] బుఖారి/ అల్ ఇస్తీజాన్/ తస్లీముల్ కలీల్ అలల్ కసీర్. 6231, 6232. ముస్లిం/ అస్సలాం/ యుసల్లిముర్రాకిబ్ అలల్ మాషి.. తిర్మిజి/ అల్ ఇస్తీజాన్/ మా జాఅ ఫీ తస్లీమిర్రాకిబ్…
[19] అబూదావూద్/ అల్అదబ్/ మాజాఅ ఫీ రద్దిల్ వాహిది అనిల్ జమాఅ/ 5210. దీని సనద్ లో సఈద్ బిన్ ఖాలిద్ ఖుజాఈ ఉన్నాడు. అతని గురించి హాఫిజిబ్నె హజ్ర్ తక్రీబ్ 235లో ‘జఈఫ్ మినస్సాబిఅ’ అని చెప్పారు. షేఖ్ అల్బానీ ఇతర హదీసుల ఆధారంగా దీనిని హసన్ అని ఇర్వాఉల్ గలీల్ 778లో చెప్పారు.
[20] ముఅత్త 2/959. ఇది ప్రామాణికమైన (సహీ) ముర్సల్ ఉల్లేఖనం.
[22] అల్ఇహ్సాను ఫీ తక్రీబి సహీహిబ్ని హిబ్బాన్ (2/251), నం: 498. దీని ఉల్లేఖకులు నమ్మకస్తులైన ఇమాం ముస్లిం యొక్క ఉల్లేఖకులే. కాని అబుజ్జుబైర్ మదల్లిస్. అతను ఈ హదీసును ‘అన్’ అని ఉల్లేఖించాడు అని అర్నావూత్ చెప్పారు.
[23] హైసమీ ‘అల్ మజ్ మఅ’ 8/39లో దీనిని బజ్జార్ ఉల్లేఖించారు, దీని ఉల్లేఖకులు సహీకి సంబంధించిన వారే అని చెప్పారు. షేఖ్ అల్బానీ సహీ అని చెప్పారు. సహీహుత్తర్గీబ్ 2704.
[25] ఈ పదాలు కామిల్ 2/303లో ఇబ్ను అదీ ఉల్లేఖించారు. కాని దీని సనద్ జఈఫ్ ఉంది. తబ్రానీ, ఔసత్ లో ఉల్లేఖించారు. అయితే హైసమీ, అల్ మజ్ మఅ 8/35లో చెప్పాడుః దీని సనద్ (పరంపర)లో హారూన్ బిన్ ముహమ్మద్ అబుత్తయ్యిబ్ ఉన్నాడు. అతడు కజ్జాబ్ (అబద్ధకుడు). ఇబ్నుస్సినీ మరో విధంగా ఉల్లేఖించారు. దాని పదాలు= =ఇలా ఉన్నాయిః “సలాంకు ముందు మాటనారంభించేవానికి జవాబు ఇవ్వకండి”. చూడండిః అమలుల్ యౌమి వల్లైల 214. షేఖ్ అల్బానీ దీని సనదును హసన్ అని చెప్పారు. సహీహ: 816.
[26] తిర్మిజి/ అల్ ఇస్తిఅజాన్/ మాజాఅ ఫిత్తస్లీం కబ్లల్ ఇస్తిఅజాన్/ 2710. అబూదా వూద్/ అల్అదబ్/ కైఫల్ ఇస్తిఅజాన్/ 5176. అహ్మద్ 3/414. షేఖ్ అల్బానీ సహీహ 818లో సహీ అని చెప్పారు.
[35] అల్ఇస్తిఅజాన్/ మాజాఅ ఫిస్సలామి కబ్లల్ కలాం/ 2699. తిర్మిజి ఈ హదీసును మున్కర్ అని చెప్పారు. (షేఖ్ అల్బానీ దీనిని హసన్ అని చెప్పారు. అయితే విషయమేమిటంటే ‘అస్సలాము కబ్లల్ కలామ్’ హదీసు మాత్రం ఇతర ఆధారాలతో కలిసి హసన్ స్థానానికి చేరుకుంది. కాని దానితో కలిసిఉన్న మరో వాక్యం అది మౌజూ, బాతిల్).
[48] విడివిడిగా ప్రతీ ఒక్కరిపై ఉన్న విధిని ఫర్జె ఐన్ అంటారు. ప్రతీ ఒక్కరిపై కాకుండా ఏ ఒక్కరు, లేదా కొందరు నిర్వహించినప్పుడు ఇతరులపై అది విధిగా లేని దానిని ఫర్జె కిఫాయ అంటారు.
([65]) తిర్మిజి/ సిఫతుల్ ఖియామ…/ మిన్హు../ 2499. ఇబ్ను మాజ/ అజ్జుహ్ ద్/ జిక్రు త్తౌబా/ 4251. దార్మి/ రిఖాఖ్/ ఫిత్తౌబా/ 2611. అహ్మద్/ 3/198. ముస్తద్రక్ హాకిం/ 4/244. హాకిం దీని సనద్ సహీ అని చెప్పారు. అల్బానీ సహీహుల్ జామిఅ 4515లో హసన్ అని చెప్పారు.
([66]) అబూ దావూద్/ తహార/ మా యునజ్జిసుల్ మాఅ/ 63. తిర్మిజి/ తహర/ 67. నిసాయీ/ తహార/ 52. ఈ హదీసును ఇబ్ను ఖుజైమ, హాకిం, ఇబ్ను హిబ్బాన్, షేఖ్ అహ్మద్ షాకిర్ ~ (తాలీఖ్ తిర్మిజి 1/98లో) మరియు అల్బానీ ~ (ఇర్వా 23లో) సహీ అని చెప్పారు. దీని వివరణ తెలుగులో చూడదలుచుకున్న వారు
([67]) అబూ దావూద్/ అల్ హుదూద్/ ఫిల్ హద్ది యుష్ ఫఉ ఫీహి/ 4375. అహ్మద్ 6/181. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీ అబీ దావూద్ మరియు సహీహుల్ జామిఅ 1185లో సహీ అని చెప్పారు. ‘హుదూద్’ అంటేః ఏ పాపాల పై ఇస్లాంలో వాటి శిక్ష ఇహలోకములో నిర్ణయించబడిందో అవి అని భావం. ఉదాః దొంగ యొక్క హస్త ఖండన, వివాహితుడైన వ్యబిచారి యొక్క శిలా శిక్ష వగైరా.
([68]) ముహాజిరీన్ అంటే మక్కా నుండి మదీనాకు వలస వచ్చిన ప్రవక్త సహచరులు. అన్సార్ అంటే ముహాజిరీన్ కు ఆశ్రయమిచ్చిన మదీనవాసులు.
([69]) ఈ సంఘటన సంక్షిప్తంగా బుఖారీలో ఉంది
[70] హవారియె రసూల్ ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుబైర్ రజియల్లాహు అన్హుకు నొసంగిన ప్రత్యేక బిరుదు. దీని భావం: ప్రత్యేక సహాయకులు అని.
[71] ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు హజ్రత్ అబూ బక్ర్ రజియల్లాహు అన్హు మదీనాకు హిజ్రత్ (వలస) చేసే సందర్భంలో ‘సౌర్’ గుహలో ఉండగా వారి కొరకు అస్మా రజియల్లాహు అన్హా తీసుకురాబోయిన, సద్ధి అన్నం కట్టడానికి ఏ త్రాడు దొరకనప్పుడు ఆమె తమ నడికట్టును రెండు ముక్కలుగా చీల్చి ఒకటి ఆమె కట్టకొని మరోదానితో సద్ధి మూటను కట్టింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు ‘జాతున్ నితాఖైన్’ అని బిరుదిచ్చారు. అంటే రెండు నడికట్లు గల స్త్రీ.
25.34980855.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రయాణపు ఆదేశాలు(Rulings of Travel in Islam) అంశాల నుండి: ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం: అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
తిరిగి వచ్చాక ముందు మస్జిదులో రెండు రకాతులు చేసుకోవాలి
వచ్చినవారిని కౌగలించు కొనుట
ప్రయాణికుని ఫలితం
ప్రయాణ సౌకర్యాలు
ఎంత దూరంలో ఖస్ర్ చేయాలి
పరిశుభ్రత ఆదేశాలు
తయమ్ముం విధానం
మేజోల్ల పై మసా
అజాన్ ఆదేశాలు
నమాజు ఆదేశాలు
ఇమామత్ ఆదేశాలు
‘జమ్అ బైనస్సలాతిన్’ ఆదేశాలు
నమాజు తర్వాత జిక్ర్
విమానంలో నమాజు
జుమా నమాజు ఆదేశాలు
ప్రయాణంలో ఉపవాసాలు (రోజాలు)
[పూర్తి పుస్తకం క్రింద చదవండి]
సాంప్రదాయాలు & పద్ధతులు
వీడ్కోలు
ప్రయాణికుడు తన ఇంటివారికి, స్నేహితులకు ఇలా వీడ్కోలు చెప్పాలిః
అస్తౌదిఉకల్లాహల్లజీ లా తజీఉ వదాఇఉహూ اسْتَوْدِعُكَ اللهَ الَّذِي لاَ تَضِيعُ وَدَائِعُه (నేను నిన్ను అల్లాహ్ కు అప్పగిస్తున్నాను. అతనికి అప్పగించినవి వృధా కావు (వాటిలో నష్టం జరగదు). (ఇబ్ను మాజ 2825, ).
వారు (ఇంటివారు, స్నేహితులు) అతనికి ఇలా వీడ్కోలు చెప్పాలిః
అస్తౌదిఉల్లాహ దీనక వ అమానతక వ ఖవాతీమ అమలిక. أَسْتَوْدِعُ اللهَ دِينَكَ وَأَمَانَتَكَ وَخَوَاتِيمَ عَمَلِكَ (నీ ధర్మం, నీ అమానతు మరియు నీ అంతిమ ఆచరణలన్నియూ అల్లాహ్ కు అప్పగిస్తున్నాను). (అబూ దావూద్ 2600, తిర్మిజి 3443, ఇబ్ను మాజ 2826).
ఒంటరి ప్రయాణం అవాంఛనీయం
అనవసరంగా మరియు ఎవరైనా తోడు ఉండే అవకాశం ఉన్నప్పటికీ మనిషి ఒంటరిగా పయనించడం అవాంఛనీయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసు ఆధారంగాః
ఒంటరి ప్రయాణం(లో ఉన్న నష్టం) గురించి నాకు తెలిసినట్లు ప్రజలకు తెలిసి ఉంటే ఏ ప్రయాణికుడు రాత్రి వేళ ఒంటరిగా ప్రయాణించడు. (బుఖారి 2998).
ఇందులో ఓ రకమైన భయం ఉంది. మరేదైనా సంభవించినప్పుడు -అల్లాహ్ తర్వాత- ఏ సహాయకుడు లేకుండా అవుతుంది.
మంచి స్నేహితం గురించి వెదకాలి
ప్రయాణికుడు అతనికి తోడుగా ఉండుటకు దైవభీతిగల, ఉత్తమమైన, మంచిని వాంఛించే, చెడును అసహ్యించే మిత్రుడిని వెదకాలి. ఇద్దరిలో ప్రతీ ఒకరు మరొకరి పట్ల సహనశీలిగా ఉండాలి. మరొకరి ఘనత, గౌరవాన్ని గుర్తించాలి.
స్త్రీ ఒంటరిగా ప్రయాణించకూడదు
దూరపు ప్రయాణమైనా, దగ్గరి ప్రయాణమైనా మరియు ఏరోప్లేన్ లోనైనా లేదా బస్సు, ట్రైన్, మరే రకమైన వాహనంలో అయినా సరే తన భర్త లేదా “మహ్రమ్” లేకుండా ఒంటరిగా ప్రయాణించడం యోగ్యం కాదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఆదేశించారుః
“ఏ స్త్రీ అయినా “మహ్రమ్” లేకుండా ప్రయాణం చేయకూడదు”. (బుఖారి 1862).
అనేక మంది ఆడవాళ్ళు ఏరోప్లేన్ ప్రయాణం ఒంటరిగా చేయడంలో అజాగ్రత్తకు గురి అయ్యారు. ఇందులో ధార్మిక వ్యతిరేకం ఉందని వారు గ్రహించాలి. మరియు భయంకరమైన సంక్షోభం ఉంది. ఎందుకనగా స్వయంగా స్త్రీ ఒక పరీక్ష, ఉపద్రవం. ఆమె ఒంటరిగా ఉండడమే నిషిద్ధకార్యానికి సబబు. ఆమె ఒంటరితనాన్ని అదృష్టంగా భావించి షైతాన్ ప్రేరేపణలు కలగజేసి, ఆమె వైపునకు పురికొలుపుతాడు. ప్రయాణం ఎలాంటిదైనా, ప్రయాణం అనేబడే ప్రతీ ప్రయాణం స్త్రీ ఒంటరిగా చేయడం యోగ్యం కాదు. స్త్రీ ప్రయాణం కొరకు ఉపయోగపడే సాధనం గురించి కాదు, అసలు ప్రయాణము చేయవచ్చా లేదా అనేది యోచింపదగినది.
“మహ్రమ్” అంటే ఒక స్త్రీకి రక్త సంబంధం లేదా పాల సంబంధంగల వివాహ నిషిద్ధమైన బంధువు. అతడు యుక్త వయస్సుగల, బుద్ధి- జ్ఞానంగల, ముస్లిం పురుషుడు అయి యుండాలి. (ఉదాహరణకుః తండ్రి, పెదనాన్న, బాబాయి, కొడుకు, స్వంత సోదరులు, సోదరసోదరీల కుమారులు వగైరాలు).
(అల్లాహ్ గొప్పవాడు, అల్లాహ్ గొప్పవాడు, అల్లాహ్ గొప్పవాడు, పరిశుద్ధుడైన అల్లాహ్ యే దీనిని (ఈ వాహనాన్ని) మా ఆధీనంలోకి ఇచ్చాడు. లేకపోతే మేము దీనిని ఆధీనపరచుకోలేకపోయేవారము. నిస్సందేహంగా మేము మా ప్రభువు వైపునకు మరలవలసిన వారము. ఓ అల్లాహ్! మేము ఈ ప్రయాణంలో సత్కార్యాలు చేసే, భయభక్తులతో మెలిగే, నీ ప్రసన్నత లభించే కార్యాల బుద్ధిని కోరుకుంటున్నాము. అల్లాహ్! ఈ ప్రయాణాన్ని మాకు సులభతరం చెయ్యి. దీని దూరాలను దగ్గర చెయ్యి. ఓ అల్లాహ్! నీవే ఈ ప్రయాణంలో మాసన్నిహితుడివి. నీవే మా ఇంటివారిని, మా ధనాన్ని కనిపెట్టుకు ఉండేవాడివి. ఓ అల్లాహ్! నేను నీ శరణు కోరుతున్నాను; ప్రయాణంలోని కష్టాల నుండి, అయిష్టకరమైన దృష్యాల నుండి. నా సంపద, నా ఆత్మీయులు మరియు నా సంతానానికి నేను తిరిగి వెళ్ళేటప్పటికీ హాని కలగకుండా కూడా నీ శరణే కోరుతున్నాను).
తిరిగి వచ్చేటప్పటి దుఆ భావం:
(తిరిగివెళ్ళేవారము, పశ్చాత్తాపంతో మన్నింపు కోరేవారము, మా ప్రభువునే ఆరాధించేవారము, ఆయన్నే స్తుతించేవారము).
ఒకరిని నాయకునిగా ఎన్నుకోవాలి
ప్రయాణికులు తమలో ఒకరిని తమ నాయకునిగా ఎన్నుకోవడం సున్నత్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారని అబూ సఈద్ ఖుద్రీ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హుమాలు ఉల్లేఖించారుః
“ముగ్గురు వ్యక్తులు కలసి ప్రయాణంలో వెళ్ళినప్పుడు వారు తమలో ఒకర్ని తమ నాయకునిగా ఎన్నుకోవాలి”. (బుఖారి 2608).
దీని ఉద్దేశ్యం అతను వారిని కలిపి ఉంచాలి. వారి మేలు కొరకు పాటుపడాలి. వారు అతని విధేయత పాటించాలి. అతడు ఏదైనా అవిధేయతకు గురి చేసే ఆదేశం ఇస్తే మాత్రం దానిని పాటించకూడదు.
ఎక్కడైనా మజిలీ చేస్తే చదవండి
ఏదైనా చోట మజిలీ చేసినప్పుడు ఈ దుఆ చదవడం అభిలషణీయం.
అఊజు బికలిమా తిల్లాహిత్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్. (ముస్లిం 2708). أَعُوذُ بِكَلِمَاتِ الله التَّامَّاتِ مِنْ شَرِّ مَا خَلَقَ (అల్లాహ్ యొక్క సంపూర్ణ వచనాల ద్వారా నేను అల్లాహ్ సృష్టించిన ప్రతిదాని కీడు నుండి శరణు వేడుకుంటున్నాను).
ఈ దుఆ చదివిన వారు ఆ ప్రాంతం నుండి వెళ్ళే వరకు వారికి ఏ విధమైన నష్టం కూడా కలగదు.
తక్బీర్, తస్బీహ్
ప్రయాణికుడు తన దారిలో ఎత్తు ప్రదేశం నుండి వెళ్తూ అల్లాహు అక్బర్ అనడం, దిగువ ప్రదేశం నుండి వెళ్తూ సుబ్ హానల్లాహ్ అనడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం. జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారుః
“మేము ఎత్తు ప్రదేశం నుండి వెళ్తున్నప్పుడూ తక్బీర్ అనేవారము మరియు దిగువ ప్రదేశం నుండి వెళ్తున్నప్పుడూ తస్బీహ్ అనే వారము”.
అధికంగా దుఆ చేయాలి
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ హదీసు ఆధారంగా ప్రయాణంలో ఉన్నప్పుడు ఎక్కువగా దుఆ చేయడం కూడా ప్రవక్త సంప్రదాయమే.
“ముగ్గురి దుఆలు అంగీకరించబడతాయి; బాధితుని అర్తనాదం. ప్రయాణికుని దుఆ. తండ్రి తన సంతానానికిచ్చే శాపం”. (తిర్మిజి 3448).
నగరంలో ప్రవేశిస్తూ చదవండి
ప్రయాణికుడు ఏదైనా గ్రామం, నగరంలో ప్రవేశించినప్పుడు ఈ దుఆ చదవడం సంప్రదాయం.
అల్లాహుమ్మ రబ్బస్ సమావాతిస్ సబ్ఇ వమా అజ్లల్ న, వ రబ్బల్ అర్జీనస్సబ్ఇ వ మా అఖ్లల్ న, వ రబ్బష్షయాతీని వ మా అజ్లల్ న, వ రబ్బర్రియాహి వ మా జరైన, ఫఇన్నా నస్అలుక ఖైర హాజిహిల్ ఖర్యతి వ ఖైర అహ్లిహా వ నఊజు బిక మిన్ షర్రిహా వ షర్రి అహ్లిహా వ షర్రి మా ఫీహా. (నిసాయి కుబ్రా, బైహఖీ, హాకిం).
(సప్తాకాశాలకు మరియు అవి నీడ చేసినవాటికి ప్రభువైన, సప్తభూములకు మరియు అవి మోసుకొని ఉన్న ప్రతీ దానికి ప్రభువైన, షైతానులకు మరియు వారు మార్గభ్రష్టత్వంలో పడవేసిన వాటికి ప్రభువైన, గాలులకు మరియు అవి లేపుకపోయే వాటికి ప్రభువైన ఓ అల్లాహ్! మేము నీతో ఈ పట్టణ మేలును, పట్టణవాసుల మేలును కోరుతున్నాము. దీని కీడు నుండి, దీని వాసుల కీడునుండి మరియు అందులో ఉన్న కీడు నుండి నీ శరణు వేడుకుంటున్నాము).
ముస్లింలకు బాధ కలిగించకుండా ఉండాలి
ఎవరికీ బాధ కలిగించకుండా ఉండడానికి పూర్తిగా ప్రయత్నించాలి. అది మితిమీరిన వేగం, రెడ్ సిగ్నల్ దాటిపోవడం, ఇతరులను అన్యా- యంగా క్రాస్ చేయడం లాంటి ఇతర చేష్టలను వదలుకొని. అల్లాహ్ ఈ ఆదేశాన్ని చదవండిః
“ఎవరైతే, ఏ తప్పూ చేయని విశ్వాసులైన పురుషులకు మరియు స్త్రీలకు బాధ కలిగిస్తారో వాస్తవానికి వారు అపనిందను మరియు స్పష్టమైన పాప భారాన్ని తమ మీద మోపుకున్నట్లే”. (అహ్ జాబ్ 33: 58).
దారి హక్కులు నెరవేర్చాలి
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం ప్రకారం దారి హక్కులు ఇవి:
“ప్రయాణం ఒక విధమైన శిక్ష. దాని వల్ల మనిషి నిద్రా అన్నపానీయాలకు దూరమవుతాడు. అందువల్ల ప్రయాణీకుడు తన పని ముగిసిన వెంటనే తన భార్యపిల్లల వద్దకు చేరుకోవాలి”.
తిరిగి వచ్చాక ముందు మస్జిదులో రెండు రకాతులు చేసుకోవాలి
ప్రయాణం నుండి తిరిగి వచ్చాక, ముందు మస్జిదుకు వెళ్ళి రెండు రకాతుల నమాజు చేయడం ప్రవక్త ﷺ సంప్రదాయం. కఅబ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
“ప్రవక్త ﷺప్రయాణం నుండి తిరిగి వచ్చాక, ముందు మస్జిదుకు వెళ్ళి రెండు రకాతులు చేసేవారు”. (బుఖారి 4418, ముస్లిం 716).
వచ్చినవారిని కౌగలించు కొనుట
ప్రయాణం నుండి వచ్చినవారి కొరకు లేచి నిలబడుట, వారిని కౌగలించుకొనుట, వారి దర్శనానికి వెళ్ళుట అభిలషణీయం. ప్రవక్త ﷺ సహచరులు ప్రయాణం నుండి వచ్చినవారిని కౌగలించుకునేవారు. (తబ్రానీ ఔసత్, బైహఖీ, సహీహ 2647). దీని వల్ల ప్రేమ, ఆప్యాయత, సత్సంబంధాలు పెరుగుతాయి. మనస్సులు ఏకమవుతాయి. వీటి అవసరం ఈ కాలంలో మనకు చాలా ఎక్కువగా ఉంది.
ప్రయాణికుని ఫలితం
తన దాసులపై ఉన్న అల్లాహ్ యొక్క దయలో ఒకటేమిటంటే; మనిషి స్థానికంగా, ఆరోగ్యంగా ఉండి పాటిస్తూ వచ్చిన (నఫిల్) సత్కార్యాలు అనారోగ్యం మరియు ప్రయాణంలో ఉన్నప్పుడు (పాటించక పోయినప్పటికీ, అతను పాటిస్తున్నట్లు) అతని లెక్కలో వ్రాయబడతాయి.
“దాసుడు అనారోగ్యానికి గురైనప్పుడు లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు అతను స్తానికుడై ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేస్తున్నటువంటి పుణ్యఫలితాలే అతని కొరకు వ్రాయబడతాయి”. (బుఖారి 2996).
ప్రయాణ సౌకర్యాలు
ముస్లింల సౌలభ్యానికై ఇస్లాం ధర్మం ఏ ప్రయాణ సౌకర్యాలను తెలియజేసిందో వాటిని ప్రయాణికుడు వినియోగించుకోవడం మంచిది. అవి అతను తనుండే నివాస ప్రాంతాన్ని వీడినప్పటి నుండి మొదలవుతాయి.
ఆ సౌకర్యాలు ఇవిః ఖస్ర్ (నాలుగు రకాతుల ఫర్జ్ నమాజు రెండు రకాతులు చేయుట). జమ్అ (రెండు నమాజులు ఒకే సమయంలో చేయుట). మూడు రేయింబవళ్ళు మేజోళ్ళపై మసా (స్పర్శ) చేయుట. నఫిల్ నమాజు వాహనంలో చేయుట. జుమా నమాజు విధిగా లేకపోవుట. అవసరముంటే ఫర్జ్ ఉపవాసాలు కూడా ఉండకపోవుట. (వీటి వివరాలు తర్వాత పేజీల్లో వస్సున్నాయి).
ఎంత దూరంలో ఖస్ర్ చేయాలి
ప్రయాణం అనబడే దూరంలో వెళ్ళినప్పుడు నాలుగు రకాతుల నమాజు ఖస్ర్ చేసి రెండు చదవడం, మరియు జొహ్ర్, అస్ర్ కలిపి చేయడం, మగ్రిబ్, ఇషా కలిపి చేయడం ధర్మసమ్మతం. ఇంత దూరం వెళ్ళిన తర్వాత ఖస్ర్ మరియు జమ్అ చేయవచ్చునని ఇస్లాం ధర్మంలో ఏ నిర్ణీత కిలోమీటరుల లెక్క చెప్పబడలేదు.
అయితే అధిక ధర్మవేత్తల ఏకాభిప్రాయం ప్రకారం 80కి.మీ. దూరం ప్రయాణంలో ఖస్ర్ చేయాలి. అంతకు తక్కువ ప్రయాణంలో ఖస్ర్ చేయరాదు. నిస్సందేహంగా ఇది చాలా పటిష్టమైన మరియు ఉత్తమమైన పద్ధతి.
పరిశుభ్రత ఆదేశాలు
(ఏ విషయం సంభవిస్తే వుజూ చేయడం విధిగా అవుతుందో దానిని ‘హదసె అస్గర్‘ అని అంటారు. ఉదాహరణకుః మల మూత్ర విసర్జన, అపానవాయువు వగైరాలు. మరే విషయం వల్ల స్నానం చేయడం విధిగా అవుతుందో దానిని ‘హదసె అక్బర్‘ అని అంటారు. ఉదాహరణకుః భార్యభర్తల సంభోగం, స్వప్నస్ఖలనం వగైరా).
నమాజు కొరకు వుజూ తప్పనిసరి. మరియు హదసె అక్బర్ వల్ల స్నానం చేయడం తప్పనిసరి. ఇందులో ఏ మాత్రం అలక్ష్యం చేయుట యోగ్యం లేదు. అయితే ప్రయాణంలో ఉన్న వ్యక్తి నమాజు సమయం అయినప్పుడు నీళ్ళు పొందనిచో;
1- నీళ్ళు లభించవచ్చు అన్న ఆశ లేదా నమ్మకం ఉంటే నమాజును దాని చివరి సమయం వరకు ఆలస్యం చేయవచ్చును. కాని సమయం దాటవద్దు.
2- నీళ్ళు లభించే ఏ ఆశగానీ, నమ్మకంగానీ లేదా నీళ్ళు దొరికే ఏ సూచన లేనప్పుడు తొలిసమయం లోనే తయమ్ముం చేసుకొని నమాజు చేసుకొనుటయే ఉత్తమం.
3- తయమ్ముం చేసి నమాజు మొదలు పెట్టిన తర్వాత నీళ్ళు లభిస్తే నఫిల్ నమాజు సంకల్పంతో ఈ నమాజును పూర్తి చేయాలి. తర్వాత వుజూ చేసుకొని, ఫర్జ్ నమాజు చేయాలి. ఒకవేళ మొదలు పెట్టిన ఫర్జ్ నమాజు చేసుకున్న తర్వాత నీళ్ళు లభిస్తే నమాజు అయినట్లే. దానిని తిరిగి మరోసారి చేయనక్కర లేదు.
4- బాటసారిపై (స్వప్నస్ఖలనం వల్లగానీ, లేదా భార్యభర్తలు కలుసుకోవడం వల్లగానీ) స్నానం విధిగా అయి, విపరీతమైన చలి కారణంగా ప్రాణానికి హాని కలిగే భయంతో నీళ్ళు ఉపయోగించే స్థితిలో లేనప్పుడు, లేదా నీళ్ళ జాడలో నమాజు సమయం దాటిపోయే భయం ఉన్నప్పుడు తయమ్ముం చేయుట యోగ్యం. అలాగే నీళ్ళు చాలా తక్కువ ఉండి, స్నానానికి సరిపడనప్పుడు స్నానం ఉద్దేశ్యంతో తయమ్ముం చేసుకోవాలి. ఉన్న నీళ్ళతో వుజూ చేసుకోవాలి.
విపరీతమైన చలి భయం ఉండడం అసలు సబబు కాదు, ఆ చలి వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందన్న అనుమానమో, లేదా పూర్తి నమ్మకమో ఉండి, కనీసం నీళ్ళు వేడి చేసుకుందామన్నా ఏ సాధనం లేకపోవడం, లేదా సాధనం ఉండి కూడా వేడి చేయడంలో నమాజు సమయం దాటిపోతుందన్న భయం ఉన్నప్పుడే తయమ్ముం చేయుట యోగ్యమగును.
5- నీళ్ళు తక్కువ ఉండి, వుజూ కొరకు సరిపడనప్పుడు ఉన్న నీళ్ళతో వుజూ మొదలు పెట్టి, నీళ్ళు సరిపడే అంత వరకు వుజూ చేసి మిగిత అవయవాలపై మసా (స్పర్శ) చేయాలి.
తయమ్ముం విధానం
హదసె అస్గర్ అయినా హదసె అక్బర్ అయినా ప్రతీ దానికి తయమ్ముం పద్ధతి ఇదిః రెండు అరచేతులను భూమికి ఒకసారి తాకించి, ముందు ముఖంపై తర్వాత రెండు అరచేతుల వెలుపలి భాగంపై మసా చేయాలి. అయితే ఎవరైనా హదసె అక్బర్ వల్ల తయమ్ముం చేసి ఉంటే నీళ్ళు లభించిన తర్వాత స్నానం చేయడం విధిగానే ఉంటుంది.
మేజోళ్ళపై మసహ్
1- బాటసారి మూడు రేయింబవళ్ళు తన మేజోళ్ళపై మసా చేయవచ్చును. మొదటిసారి మసా చేసినప్పటి నుండి మూడు రోజుల పరిమితి మొదలవుతుంది.
2- ఒక మనిషి స్థానికంగా ఉండి మసహ్ మొదలుపెట్టి, మళ్ళీ ప్రయాణానికి బయలుదేరితే బాటసారిగా పరిగణించబడతాడు గనక మూడు రోజులు మసహ్ చేయాలి.
3- మరెవరైనా ప్రయాణంలో ఉండి మసహ్ మొదలుపెట్టి మళ్ళీ తన నివానానికి వచ్చేస్తే స్థానికుల ప్రకారం ఒక రోజు ఒక రాత్రి లెక్కతో మసహ్ చేయాలి.
అజాన్ ఆదేశాలు
1- “నమాజు సమయం అయిన వెంటనే మీలో ఒకరు అజాన్ ఇవ్వాలి” అన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశానుసారం బాటసారుల బృందంపై అజాన్ మరియు ఇఖామత్ ఇవ్వడం విధిగా ఉంది. అలాగే ఒంటరిగా ఉన్న వ్యక్తి కూడా అజాన్ ఇవ్వాలి. ఇక ఎవరైతే సామూహిక నమాజు జరిగే మస్జిదులో నమాజు చేస్తున్నాడో అతనికి ఆ మస్జిదులో ఇవ్వబడిన అజానే సరిపోతుంది.
2- అజాన్ మరియు ఇఖామత్ చెప్పకుండా లేదా ఇఖామత్ మాత్రమే చెప్పి చేయబడిన నమాజు సహీ అగును. కాని ఆ బృందం వారందరూ స్వచ్ఛమైన పశ్చాత్తాపంతో అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవాలి. మరోసారి ఇలా చేయకూడదు. ఏ ధర్మవేత్తల వద్ద అజాన్ విధిగా ఉందో వారు ఇలాంటి ఆదేశమిచ్చారు. అయితే ఇదే బలమైన, నిజమైన మాట.
3- బాటసారి రెండు నమాజులను కలిపి చేసినప్పుడు ఒక్క అజాన్ ఇచ్చి రెండు నమాజులకు వేరు వేరు రెండు సార్లు ఇఖామత్ చెప్పవలెను.
నమాజు అదేశాలు
1- ఖిబ్లా దిశ తెలుసుకొనుట ప్రయాణికునిపై విధిగా ఉంది. అందుకై అతను సర్వవిధాల ప్రయత్నం చేయాలి. ఎవరినైనా అడిగాలి, లేదా దానిని కనుగొనే కొన్ని నూతన పరికరాల ద్వారా మరియు ఇంకే విదంగానైనా తెలుసుకోవాలి. మరెవరైతే ఏ మాత్రం ప్రయత్నం చేయకుండా ఖిబ్లా కాని దిశలో నమాజు చేస్తాడో అతడు తిరిగి అదే నమాజు మరల చేయాలి. ఎందుకనగా అతను పాటించవలసిన హక్కును విడనాడాడు. ఎడారిలో ఉన్న వ్యక్తి సర్వ విధాల ప్రయత్నం చేసినప్పటికీ తర్వాత ఆ దిశ కాదు అని తెలిస్తే అతను తన నమాజు తిరిగి చేయ వలసిన అక్కర లేదు. కాని ఎడారిలో కాకుండా గ్రామం, నగరంలో ఉన్న వ్యక్తి ఖిబ్లా దిశ తెలిసిన తర్వాత తిరిగి అదే నమాజు మరల చేయాలి.
2- ప్రయాణంలో సున్నతె ముఅక్కద చేయుట సంప్రదాయం కాదు. కాని ఫజ్ర్ సున్నతులు మరియు విత్ర్ నమాజ్, చాష్త్ నమాజ్, తహజ్జుద్ నమాజ్, మరికొన్ని; తహియ్యతుల్ వుజూ, తహియ్యతుల్ మస్జిద్ మరియు సూర్య, చంద్ర గ్రహణ నమాజుల్లాంటివి స్థానికంగా ఉన్నప్పుడు చదివినట్లే ప్రయాణంలో కూడా చదవాలి.
3- ఒక నమాజు సమయం ప్రవేశించిన తర్వాత పయణమైన వ్యక్తి తన ఊరి బైటికి ఇండ్లు కనబడనంత దూరం వెళ్ళినప్పటి నుండి ఖస్ర్ మరియు జమ్అ చేయవచ్చును.
4- ఖస్ర్ నాలుగు రకాతుల నమాజులోనే చేయాలి. ఫజ్ర్ మరియు మగ్రిబ్ నమాజుల్లో ఖస్ర్ చేయరాదు.
5- నమాజు చేయునప్పుడు ఖస్ర్ సంకల్పం చేయాలన్న నిబంధన (షరతు) లేదు. ఎందుకనగా ప్రయాణంలో ఖస్ర్ చేయడమే అసలైన, సరియైన పద్ధతి. అందుకే సంకల్పం అవసరం లేదు. ఎలాగైతే స్థానికంగా ఉండి నమాజు చేస్తున్నప్పుడు పూర్తి నమాజు అన్న సంకల్పం చేయరో. ఒకవేళ సంకల్పం చేసుకుంటే చాలా ఉత్తమం. (అది మనస్సులోనే చేసుకోవాలి. నోటితో కాదు. ఎందకనగా నోటితో ఏవైనా పదాలు పలికి సంకల్పం చేయడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల సంప్రదాయం కాదు).
6- ఒకవేళ బాటసారి ముఖ్తదీగా (సామూహిక నమాజులో ఇమాం వెనక ఉండి) నమాజు చేస్తూ పూర్తి నమాజుకై సంకల్పిస్తే మరియు అతని ఇమాం ఖస్ర్ చేస్తే అతను కూడా తన ఇమాం మాదిరిగా ఖస్ర్ చేసుకోవాలి.
7- ఒకవేళ బాటసారి ఖస్ర్ సంకల్పం చేస్తే మరి అతని ఇమాం పూర్తి నమాజు చేయిస్తే అతను కూడా పూర్తి నమాజు చేయడం విధిగా ఉంది.
8- బాటసారి ఏ ఇమాం వెనక నమాజు చేస్తున్నాడో అతను బాటసారియా? లేదా స్థానికుడా? అన్న విషయం తెలియనప్పుడు అతను ఇమాంను అనుసరిస్తూ పోవాలి.
9- బాటిసారి ఇమాంగా ఉన్నా, లేదా ఒంటరిగా ఉన్నా అతను బాటసారి అన్న విషయం మరచిపోయి పూర్తి నమాజు చేయాలని సంకల్పించి, తర్వాత నమాజు మధ్యలో గుర్తుకు వస్తే అతను ఖస్రే చేయాలి. ఎందుకనగా అతని కొరకు సరియైన పద్ధతి ఇదే. ఒకవేళ అతను పూర్తి చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదు.
10- అజ్ఞానం కారణంగా ఎవరైనా బాటసారి మగ్రిబ్ కూడా ఖస్ర్ చేయబడుతుందని అనుకోని రెండు రకాతులు చేసుకుంటే అతని ఆ నమాజు వ్యర్థం. దానిని తిరిగి చేయుట విధిగా ఉంది.
11- ఖస్ర్ సంకల్పం చేసిన బాటసారి మరచిపోయి మూడో రకాతు కొరకు నిలబడిన తర్వాత గుర్తుకు వస్తే వెంటనే కూర్చోవాలి. తర్వాత సజ్దా సహ్ వ్ చేయాలి.
12- ప్రయాణంలో ఇమాం సంక్షిప్తంగా నమాజు చేయించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులది ఇదే పద్ధతి ఉండినది.
13- బాటసారి ఏదైనా ఊరిలో మజిలి చేస్తే ఎప్పటి వరకు అక్కడి అజాన్ వింటూ ఉంటాడో మస్జిదులో సామూహికంగా నమాజు పాటించడం తప్పనిసరి. కాని అతను ఏదైనా ఊరి నుండి దాటుతూ ఉన్నప్పుడు అజాన్ వింటే మస్జిదులో సామూహికంగా నమాజు చేయడం తప్పనిసరి ఏమీ లేదు. ఒకవేళ అతను ఏదైనా అవసరానికి బండి దిగినా సరే.
గమనిక:
* స్థానికంగా ఉండి చేయవలసిన నమాజు చేయలేదని ప్రయాణంలో ఉన్నప్పుడు గుర్తొచ్చినా లేదా ప్రయాణంలో ఏదైనా తప్పిపోయిన నమాజు స్థానికంగా ఉన్నప్పుడు గుర్తొచ్చినా అతను దానిని పూర్తిగానే చేయాలి. అదే అతని విషయంలో ఉత్తమమైన, బాధ్యతరహితమైన విషయం.
* ఒక ప్రయాణంలో మరచిపోయిన నమాజ్ మరో ప్రయాణంలో గుర్తుకువస్తే ఖస్ర్ చేయాలి.
ఇమామత్ అదేశాలు
1- స్థానిక ఇమాం వెనక బాటసారి నమాజు చేయవచ్చును. ఇద్దరి సంకల్పాలు, నమాజులు వేరు వేరు అయినా ఏమీ నష్టం లేదు. ఎలా అనగా ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు ఇషా నమాజు ప్రవక్త వెనక చేసేవారు, మళ్ళీ తాను ఉండే వాడలోకి వెళ్ళి అక్కడ తన జాతివారికి ఇషా నమాజు చేయించేవారు. అయితే ఈ నమాజు అతనిది నఫిల్ మరియు అతని వెనక ఉన్నవారిది ఫర్జ్ అయి ఉండేది. (బుఖారి 711, ముస్లిం 465).
2- సంపూర్ణ నమాజు చేయించే స్థానిక ఇమాం వెనక ఉండి ఖస్ర్ చేయడం సరియైనది కాదు. నమాజు ఆరంభంలో చేరినా, లేక చివరలో చేరినా సరే. ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారు:
నోట్: ఏమిటి విషయం బాటసారి ఒంటరిగా నమాజు చేసుకుంటే ఖస్ర్ చేసి రెండు రకాతులే చేయాలి కాని (స్థానిక) ఇమాం వెనక ముఖ్తదీగా ఉంటే నాలుగు రకాతులు చేయాలి అని ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హు) గారిని అడిగితే ‘సరియైన సంప్రదాయం ఇదే’ అని సమాధా- నమిచ్చారు. (ముస్నద్ అహ్మద్, ఇర్వాఉల్ గలీల్ 571 లో షేఖ్ అల్బానీ ఈ హదీసును సహీ అని అన్నారు.
3- తప్పుడు విషయం: కొందరు బాటసారులు స్థానిక ఇమాం నాలుగు రకాతుల నమాజు చేయిస్తున్నప్పుడు మూడవ రకాతులో వచ్చి కలసి, అతనితోనే సలాం త్రిప్పి రెండు రకాతులతోనే సరిపుచ్చుకుంటారు. ఇది తప్పు. అతను ఇమాంతో సలాం త్రిప్పకుండా నిలబడి మిగితా రెండు రకాతులు చేసుకోవాలి. ఒకవేళ అతను ఆ రెండు రకాతులే చేసి వెళ్తే, అతను ఆ నమాజు మళ్ళీ చేయాలి.
4- ఇమాం బాటసారి కావచ్చు అన్న భావనతో అతనితో కలసి రెండు రకాతులు చేసిన తర్వాత, కాదు అతను స్థానికుడు అని తెలిస్తే అతనితో పూర్తి నమాజు చేయాలి. ఒకవేళ నమాజులో ప్రవేశిస్తూ ఇమాం ఏ సంకల్పం చేశాడో నాది అదే సంకల్పం అని నిశ్చయించుకుంటే, ఇమాం ఖస్ర్ చేస్తే ఇతను ఖస్ర్ చేయాలి. అతను పూర్తిగా చేస్తే పూర్తిగా చేయాలి. ఇలా నమాజు సహీ అవుతుంది.
5- మగ్రిబ్ నమాజు చేయిస్తున్న ఇమాంతో బాటసారి ఇషా నమాజు సంకల్పంతో కలిస్తే నాలుగు రకాతులు సంపూర్ణంగా చేయుట విధిగా ఉంది. అంటే ఇమాం మూడు రకాతులు చేసి సలాం త్రిప్పిన తర్వాత అతను నిలబడి నాల్గవ రకాతు చేసుకోవాలి.
6- బాటసారి ఇమాంగా ఉండి నమాజు చేయిస్తుంటే అతని వెనక స్థానికుడు ముఖ్తదీగా ఉండి నమాజు చేయడం యోగ్యం. అయితే ఇమాం ఖస్ర్ చేసి సలాం త్రిప్పిన తర్వాత ఇతను పూర్తి నమాజు చేసుకోవాలి.
7- బాటసారి స్థానికులకు నమాజు చేయిస్తున్న- ప్పుడు ఖస్ర్ చేయాలి. అతను సలాం త్రిప్పిన తర్వాత ‘మీరు నమాజు పూర్తి చేసుకోండి’ అని వెనకున్నవారికి చెప్పాలి. ఒకవేళ నమాజుకు ముందే ఈ విషయం తెలియజేస్తే మరీ మంచిది, వారికి అనుమానం, ఇబ్బంది కలగకుండా ఉంటుంది.
8- జొహ్ర్ నమాజు చేయని వ్యక్తి మస్జిదులో ప్రవేశించే సరికి అచ్చట ఇమాం అస్ర్ నమాజు చేయిస్తున్నది చూస్తే అతను జొహ్ర్ సంకల్పంతో ఇమాంతో కలవాలి. వారితో జొహ్ర్ నమాజు చేసుకున్న తర్వాత (వెనక వచ్చినవారు ఎవరైనా ఉంటే వారితో కలసి, ఎవరు లేని యడల ఒంటరిగానే) అస్ర్ నమాజు చేసుకోవాలి.
9- ఒకడు, లేదా కొందరు బాటసారులు రమజానులో తరావీహ్ నమాజు చేయిస్తున్న స్థానికుడైన ఇమాం వెనక వచ్చి కలుస్తే వారు ఈ క్రింది రెండింటిలోని ఏదైనా ఒక పద్ధతి అనుసరించాలి.
j అది వారి స్వగ్రామం అయితే వారు ఇషా నమాజ్ సంపూర్ణంగా చేసే ఉద్దేశంతో ఇమాంతో కలవాలి. ఇమాం సలాం తింపిన తర్వాత మిగిలిన రకాతులు చేసుకోవాలి.
k ఒకవేళ వారు ప్రయాణంలో ఉంటే వారు ఇషా నమాజ్ ఖస్ర్ చేసే ఉద్దేశంతో ఇమాంతో కలవాలి. వారు స్వయంగా మరో జమాఅతు చేయకూడదు. అలా చేసినచో ముందు నుండే అదే మస్జిదులో తరావీహ్ చేయుచున్నవారికి అంతరాయం, కలత ఏర్పడును.
గమనిక: ఒకే సమయంలో ఒక మస్జిదులో రెండు జమాఅతులో జరగడం ధర్మసమ్మతం కాదు. దీని వల్ల ముస్లిముల అనైక్యత మరియు వారి మధ్య భిన్నత్వం ఏర్పడును. సామూహిక నమాజు విధిగావించబడింది కేవలం వారి ఐక్యత కొరకే.
‘జమ్అ బైనస్సలాతైన్’ అదేశాలు
1- జొహ్ర్ నమాజును అస్ర్ నమాజుతో కలిపి మరియు మగ్రిబ్ నమాజును ఇషా నమాజుతో కలిపి చేయుటనే ‘జమ్అ బైనస్ సలాతైన్’ అని అంటారు. అది ‘జమ్అ తక్దీమ్‘ చేయవచ్చు, లేదా ‘జమ్అ తాఖీర్‘ చేయవచ్చు[2]. ఈ రెండిటిలో తనకు సులభంగా ఏది ఉండునో అది చేయవచ్చును. ఎలా చేసినా సరిపోవును. అయితే ఫజ్ర్ నమాజును మరో నమాజుతో కలిపి చేయరాదు. అలాగే జుమా నమాజు కూడా అని సర్వ సామాన్యంగా ధర్మవేత్తల వద్ద ఆధిక్యత పొందిన మాట ఇదే.
నోట్: ‘జమ్అ తక్దీమ్’ అంటే జొహ్ర్ సమయంలో జొహ్ర్, అస్ర్ నమాజులు కలిపి చేయడం, మగ్రిబ్ సమయంలో మగ్రిబ్, ఇషా నమాజులు కలిపి చేయడం. ‘జమ్అతాఖీర్’ అంటే అస్ర్ సమయంలో జొహ్ర్, అస్ర్ నమాజులు కలిపి చేయడం. ఇషా సమయంలో మగ్రిబ్, ఇషా నమాజులు కలిపి చేయడం.
2- ‘జమ్అ’ చేస్తున్నప్పుడు ఒక్క అజాన్ ఇచ్చి, ప్రతి నమాజుకు వేర్వేరు ఇఖామత్ ఇవ్వాలి.
3- ‘జమ్అ’ సమయం, మొదటి నమాజు సమయం ప్రారంభం నుండి రెండవ నమాజు సమయం అంతమయ్యే వరకు ఉంటుంది[3]. అంటే బాటసారి తొలి సమయంలో, దాని మధ్యలో లేదా సమయం అంతం అయ్యేకి కొంచెం ముందు వరకు కూడా ‘జమ్అ’ చేయవచ్చును. కాని జొహ్ర్, అస్ర్ నమాజులు (సూర్యస్తమయానికి ముందు) సూర్యుడు పసుపు రంగులో మారే వరకు, మరియు మగ్రిబ్, ఇషా నమాజులు అర్థ రాత్రి గడిసే వరకు ఆలస్యం చేయడం ధర్మసమ్మతం కాదు[4].
నోట్ : అర్థరాత్రి అంటే రాత్రి 12 గంటలు అన్న భావన సరి కాదు. సూర్యాస్తమయం నుండి ఉషోదయం వరకు గల పూర్తి సమయంలో సగభాగం ఎన్నింటికి పూర్తవుతుందో ఆ సమయం. ఉదాహరణకుః సూర్యాస్తమయం సా. 6 గం., ఉషోదయం తెల్లవారుజామున 4 గం.కు అయితే, రాత్రి 11 గం.కు అర్థరాత్రి అవుతుంది.
4- ‘జమ్అ తాఖీర్’ చేసే ఉద్దేశంతో ప్రయాణం కొనసాగిస్తూ, రెండవ నమాజు సమయం ప్రారంభం కాక ముందే తన స్వగ్రామంలో చేరుకుంటే, రెండవ నమాజును మొదటి నమాజుతో కలిపి చేయకూడదు. ప్రతి నమాజు దాని సమయంలో ‘ఖస్ర్’ చేయకుండా సంపూర్ణంగా చేయాలి. మొదటి నమాజు సమయం అతి తక్కువగా ఉన్నా సరే ప్రతి నమాజు దాని సమయంలోనే చేయాలి. ఎందుకనగా ‘ఖస్ర్’ మరియు ‘జమ్అ’ చేయుటకు కారణం ప్రయాణం, ప్రయాణం ముగిసినప్పుడు ‘ఖస్ర్’, ‘జమ్అ’ చేయరాదు.
5- ‘జమ్అ తాఖీర్’ ఉద్ధేశంతో ప్రయాణం కొనసాగిస్తూ రెండవ నమాజు సమయం ప్రారంభం అయిన తర్వాత తన స్వగ్రామం లో చేరుకుంటే రెండు నమాజులు కలిపి చేసినా సంపూర్ణంగా చేయాలి. ఖస్ర్ చేయకూడదు. ఎందుకనగా ప్రయాణం ముగిసింది, సబబు కూడా అంతం అయింది.
6- ‘జమ్అ తాఖీర్’ ఉద్దేశంతో ప్రయాణం కొనసాగిస్తూ నిర్దేశ స్థలానికి (స్వగ్రామం కాదు) చేరుకున్నప్పుడు మొదటి నమాజు సమయం అంతం అయి రెండవ నమాజు సమయం ప్రారంభం కావడానికి సమీపించినప్పుడు ఈ క్రింది విధానాల్లో ఏదో ఒకటి పాటించవచ్చును.
(a) ఒకవేళ అతను మస్జిదుకు దూరంగా, అజాన్ వినలేకుండా ఉంటే, రెండవ నమాజు సమయం ప్రారంభం అయ్యే వరకు వేచి ఉండడం ఉత్తమం, అప్పుడు రెండు నమాజులు ‘జమ్అ’, ‘ఖస్ర్’ చేయాలి. ఒకవేళ అతను రెండవ నమాజు సమయం ప్రారంభం కాక ముందే నమాజు చేసుకుంటే ధర్మసమ్మతమే.
(b) లేదా రెండవ నమాజు యొక్క అజాన్ అయిన తర్వాత, ఇఖామత్ కు ముందు మస్జిదు లో ప్రవేశిస్తే, అతను మొదటి నమాజు ‘ఖస్ర్’ చేసుకోవాలి. రెండవ నమాజ్ జమాఅతుతో చేసుకోవాలి.
(c) మస్జిదులో ప్రవేశించినప్పుడు అక్కడ ప్రజలు రెండవ నమాజు చేస్తూ ఉంటే, అతను మొదటి నమాజు నియ్యతుతో వారితో కలవాలి. దీని వివరణ ఇమామత్ ఆదేశాలు అనే అంశంలోని 8వ నంబర్లో చదివి ఉన్నారు.
7- రెండవ నమాజు సమయం ప్రారంభం కాక ముందే తన స్వగ్రామానికి చేరుకుంటానని బాటసారికి తెలిసినప్పటికీ ‘జమ్అ’ చేయడం ధర్మసమ్మతమే. ‘జమ్అ’ చేసిన తర్వాత రెండవ నమాజు యొక్క అజాన్ కు ముందు లేదా నమాజ్ సమయంలో తన స్వగ్రామానికి చేరుకుంటే, మరోసారి ఆ నమాజు చేయనవసరం లేదు.
8- బాటసారి ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ‘జమ్అ’ చేయడం ధర్మసమ్మతమే. అయితే ఎక్కడైనా మజిలీ చేసినప్పుడు, ఏలాంటి అవసరం, ఇబ్బంది లేకుండా ఉంటే ‘జమ్అ’ చేయకపోవడమే మంచిది, ఒకవేళ ‘జమ్అ’ చేస్తే అది యోగ్యమగును.
9- తప్పిపోయిన నమాజులు గుర్తు వచ్చిన తర్వాత చేయునప్పుడు మరియు ‘జమ్అ బైనస్సలాతైన్’ చేయునప్పుడు క్రమపద్ధతిని పాటించుట తప్పనిసరి. మరచిపోయి లేదా తెలియనందు వల్ల, లేదా ప్రస్తుతం ముందు ఉన్న నమాజు సమయం దాటిపోతుందన్న భయం వల్ల క్రమపద్ధతి పాటించలేకపోయినచో పాపం లేదు.
ప్రస్తుత నమాజు చేస్తున్నప్పుడు, తప్పిపోయిన నమాజు లేదా దానికి ముందు గడిసిపోయిన నమాజు చేయలేదని గుర్తు వచ్చినప్పుడు, ప్రస్తుత నమాజు పూర్తి చేయాలి ఆ తర్వాత తప్పిపోయిన నమాజులు చేసుకోవాలి.
10- బాటసారి మగ్రిబ్ మరియు ఇషా నమాజులు ‘జమ్అ తక్దీమ్’ చేసిన వెంటనే విత్ర్ నమాజు సమయం ప్రవేశించినట్లే, అంటే విత్ర్ నమాజు చేయుటకు ఇషా నమాజు సమయం ప్రారంభం కావాలని వేచించే అవసరం లేదు.
11- మగ్రిబ్ మరియు ఇషా నమాజులు ‘జమ్అ తాఖీర్’ చేయాలనుకున్న బాటసారి, ఏదైనా ప్రాంతంలో ఇషా నమాజు సామూహి- కంగా జరుగుతున్నది చూసినచో, మగ్రిబ్ నమాజు నియ్యతుతో వారితో కలవాలి; ఒకవేళ ఇమాం రెండవ రకాతులో ఉండగా కలుస్తే వారితో మూడు రకాతులు చేసినట్లగును, అందుకు ఇమాంతోనే సలాం తింపాలి. ఒకవేళ మూడవ రకాతులో కలుస్తే, ఇమాం సలాం తింపిన తర్వాత ఒక రకాతు చేసుకోవాలి. ఒకవేళ ఇమాంతో మొదటి రకాతులోనే కలుస్తే, ఇమాంతో మూడు రకాతులు చేసి, ఇమాం నాలుగో రకాతు కొరకు నిలబడినప్పుడు అతను కూర్చుండి తషహ్హుద్ దుఆలు చదివి, సలాం తింపి, మళ్ళీ ఇషా నమాజు నియ్యతుతో అదే ఇమాంతో కలవాలి. ఇమాం సలాం తింపిన తర్వాత తప్పిపోయిన రకాతులు చేసుకోవాలి. ఈ విధంగా రెండు నమాజులు జమాఅతుతో (సామూహికంగా) చేసినట్లుగును.
నమాజు తర్వాత జిక్ర్
‘జమ్అ’ చేయునప్పుడు ముందు మొదటి నమాజు తర్వాత జిక్ర్, దాని పిదప రెండవ నమాజు తర్వాత జిక్ర్ చేయడం మంచిది మరియు ఉత్తమం. కాని రెండవ నమాజు తర్వాతే జిక్ర్ చేసినా సరిపోవును. మొదటి నమాజు తర్వాత జిక్ర్ అట్లే అందులో లెక్కించబడును.
విమానంలో నమాజు
విమానంలో నమాజు రెండు రకాలుగా ఉంటుందిః
1- నఫిల్ నమాజ్: బాటసారి నిలబడి, కూర్చుండి ఏ స్థితిలోనైనా ఈ నమాజు చేయవచ్చును, రుకూ, సజ్దాలు సైగతో ఏ దిశలో ఉండి చేసిన సరే, ఖిబ్లా దిశలోనే ఉండుట తప్పనిసరి ఏమీ లేదు. అలాగే కార్లో మరియు ఇతర వాహనాల్లో కూడా. కాని వీలైనంత వరకు మొదటి తక్బీరె తహ్రీమ సందర్భంలో ఖిబ్లా దిశలో ఉండుట ఉత్తమం.
2- ఫర్జ్ నమాజులుః ‘జమ్అ’ చేయు నమాజులైతే, వాటి విషయంలో మూడు స్థితులు.
(a) విమానం ఎక్కే ముందు లేదా దిగిన తర్వాత ‘జమ్అ తక్దీమ్’, లేదా ‘జమ్అ తాఖీర్’ వాటి సమయంలో చేసే వీలు ఉంటే అలా చేయాలి.
ఉదాహరణకుః మొదటి నమాజు సమయం ప్రారంభం కాక ముందు విమానం ఎక్కి, మొదటి నమాజు సమయం దాటిన తర్వాతే విమానం నుండి దిగవలసి ఉంటుంది అన్న నమ్మకం ఉంటే, దిగిన తర్వాత ‘జమ్అ తాఖీర్’ చేయాలి. అంటే జొహ్ర్ అస్ర్ తో కలిపి చేసుకోవాలి. మగ్రిబ్ ఇషాతో కలిపి చేసుకోవాలి.
(b) నమాజు సమయం ప్రారంభం కాక ముందే విమానం ఎక్కి, విమానం దిగే సరికి ‘జమ్అ’ చేయగలిగే రెండు నమాజుల సమయాలు కూడా దాటిపోతాయని, లేదా ఫజ్ర్ నమాజు అయి ఉంటే దాని సమయం కూడా దాటిపోతుందన్న భయం ఉంటే, విమానంలో నమాజు చేయుటకు అనుకూలమైన స్థలం కెటాయించబడి ఉంటే అక్కడే ఖిబ్లా దిశలో నిలబడి నమాజు చేసుకోవాలి. అనుకూలమైన స్థలం లేనిచో, దారిలో చేసుకోవాలి. అదీ సాధ్యం కానప్పుడు తన సీట్లోనే నిలబడి నమాజు చేసుకోవాలి, అయితే రుకూలో పూర్తిగా వంగలేక పోతే, వంగినట్లు చేయాలి. ఇక సజ్దా చేయుటకు తన సీటులో కూర్చొని సైగ చేయాలి. ఏ దిశలో ముఖం చేసినా పర్వా లేదు. కాని ఎట్టి పరిస్థితిలో కూడా నమాజును దాని సమయం దాటి చేయడం ధర్మసమ్మతం కాదు.
(c) విమానంలో నమాజు చేయుటకు స్థలం కెటాయించబడి, నమాజు సమయం అయి, అక్కడ నమాజు చేసుకోవడం సాధ్యమైతే ఖిబ్లా దిశలో నిలబడి చేసుకోవాలి. రుకూ, సజ్దాలు సామాన్య రీతిలో చేయాలి.
3- విమానాశ్రయం తన సిటీకి దూరంగా ఉంటే, టికెట్ ఓకే (కన్ఫర్మ్) అయి ఉంటే, బాటసారి అందులో ‘ఖస్ర్’ చేయవచ్చును. ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ కాకుండా, వేటింగ్ లో ఉంటే ‘ఖస్ర్’ చేయరాదు, ఎందుకనగా అతను ముందుకు ప్రయాణం చేస్తాడన్న నమ్మకం లేదు.
4- ఒకవేళ విమానాశ్రయం సిటీలోనే ఉంటే బాటసారి అందులో ‘ఖస్ర్’ చేయకూడదు. టికెట్ కన్ఫర్మ్ అయి ఉన్నా లేకపోయినా, ఎందుకనగా ఇంకా అతను తన సిటీ కట్టడాలు కనబడని దూరంలో వెళ్ళ లేదు.
జూమా ఆదేశాలు
(a) జుమా రోజు (జుమా ప్రసంగం ఆరంభంలో ఇచ్చే) అజాన్ కంటే ముందు ప్రయాణం కొరకై వెళ్ళవచ్చును. అజాన్ అయిన తర్వాత, జుమా నమాజుకంటే ముందు వెళ్ళుట ధర్మసమ్మతం కాదు. కాని క్రింద ఇవ్వబడిన కారణాలుంటే వెళ్ళవచ్చునుః
(b) జుమా నమాజు చేసే వరకు వేచి ఉంటే, తోటి ప్రయాణికులు బయలుదేరుతారని, లేదా విమానం వెళ్లిపోతుందని, లేదా బస్సు, రైలు బండి బయలు దేరుతుందన్న భయం ఉంటే,
(c) దారిలో చేసుకునే వీలు లభిస్తుందన్న ఆశ ఉంటే,
1- జుమా రోజు పండుగ అయితే, బాటసారి పండుగ నమాజు చేసుకొని ఉంటే, అతను జుమా రోజు అజాన్ అయిన తర్వాత, నమాజుకు ముందు ప్రయాణానికి వెళ్ళవచ్చును. అప్పుడు అతను జొహ్ర్ నమాజు ఖస్ర్ చేయవచ్చును.
2- బాటసారి ప్రయాణములో ఉన్నప్పుడు జుమా రోజు వస్తే, లేదా ఏదైనా చోట మజిలీ చేశాడు, కాని అక్కడ జుమా నమాజు స్థాపించేవారే లేరు, లేదా ఎక్కడో అజాన్ వినబడని దూరంలో మస్జిద్ ఉండి పోవడానికి వీలు లేనప్పుడు అతనిపై జుమా విధిగా ఉండదు. అతను జొహ్ర్ నమాజు ఖస్ర్ చేసుకోవచ్చు, అలాగే అస్ర్ నమాజుతో కలిపి చేసుకోవచ్చు.
3- బాటసారి ఏదైనా చోట మజిలీ చేశాడు, అక్కడ జుమా నమాజు జరుగుతుంది, అజాన్ కూడా వినబడుతుంది. అలాంటప్పుడు అతనిపై జుమా విధి అగును. సామాన్య ఆధారాలతో ఇదే విషయం రుజువైంది. కాని అతను ఏదైనా ఊరి నుండి దాటుతూ ప్రయాణం కొనసాగిస్తూ ఉంటే, ఏదైనా చిన్న అవసరానికి అక్కడ దిగినందుకు జుమా అజాన్ వింటే, అతని పై జుమా విధి కాదు, అయినా అతను జుమా చేసుకుంటే అది అతనికి సరిపోతుంది.
పొరపాటుః కొందరు ప్రయాణికులు ఏదైనా ప్రాంతంలో బసచేస్తే అక్కడ జుమా జరగకున్నా, వారు స్వయంగా జుమా చేసుకుంటారు. అయితే ఇది సరియైన విషయం కాదు. వారిపై విధిగా ఉన్న నమాజు జొహ్ర్, అది చేయడమే వారిపై విధిగా ఉంది.
4- బాటసారి జుమా చేసినచో, దానితో అస్ర్ నమాజును ‘జమ్అ’ చేయరాదు. అస్ర్ నమాజు సమయం ప్రారంభం అయిన తర్వాతే అస్ర్ చేయవలెను. ఎందుకనగ జుమా నమాజుతో మరో నమాజును కలిపి చేయరాదు. ఎవరిపై జుమా విధిగా లేదో, లేదా తానున్న చోట జుమా స్థాపించబడదో అలాంటి వ్యక్తి జొహ్ర్, అస్ర్ ‘జమ్అ’, ఖస్ర్ చేయవచ్చును.
5- బాటసారి అయినా, స్థానికుడైనా జుమా నమాజు యొక్క కనీసం ఒక రకాతు కూడా ఇమాంతో పొందనిచో అతను జొహ్ర్ నమాజు చేసుకోవాలి. బాటసారి అయితే ఖస్ర్ చేయవచ్చును. స్థానికుడైతే పూర్తి నాలుగు రకాతులు చేసుకోవాలి. కనీసం ఒక రకాతైనా పొందినచో జుమా చేసుకోవాలి. ఎలా అనగ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః
“నమాజులోని ఒక రకాతును పొందిన వ్యక్తి నమాజును పొందినట్లే”. (బుఖారి 580, ముస్లిం).
6- బాటసారి జుమా రోజు ఖుర్ఆనులోని సూరె కహఫ్ పారాయణం చేయడం అభిలషణీయం. దానికి సంబంధించిన ఆధారాల వల్ల. మరియు అది జుమా రోజు యొక్క సున్నతులో లెక్కించబడుతుంది, జుమా నమాజు యొక్క సున్నతు (సంప్రదాయం)లో కాదు
ప్రయాణంలో ఉపవాసాలు
1- కష్టంగా ఉన్నా, లేకపోయినా బాటసారి ఉపవాసం విడనాడవచ్చును. కష్టం ఉన్నప్పుడైతే ఉపవాసం ఉండకపోవడమే ఉత్తమం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసానుసారం:
“ఇది అల్లాహ్ తరఫున ఒక రాయితీ, దానితో ప్రయోజనం పొందిన వ్యక్తి మేలే చేశాడు. ఇక ఎవరు ఉపవాసం ఉండాలనుకున్నారో అతను ఉండవచ్చు, ఏలాంటి అభ్యంతరం లేదు”. (ముస్లిం 1121).
2- బాటసారి ఉపవాసం విడనాడే రెండు స్థితులుః
(a) ఎవరైనా బాటసారి ఉపవాసం ఉండి, పగటిపూటనే ఉపవాసం విరమించాలనుకుంటే ధర్మసమ్మతమే.
(b) ఎవరైనా స్థానికంగా ఉపవాసం ఉండి, మళ్ళీ ప్రయాణంలో వెళ్తే, అతను తన ఊరి కట్టడాలు దాటక ముందే ఉపవాసం వదలుకోకూడదు.
3- బాటసారి ఉపవాసం లేని స్థితిలో తన ఊరిలో చేరుకుంటే, అతను తినత్రాగడం మానుకోవలసిన అవసరం లేదు, కాని తాను ఉపవాసం లేని విషయం వెల్లడించుట మంచిది కాదు, తెలియనివాళ్ళు అతని గురించి చెడుగా ఊహించే అవకాశం ఉంటుంది.
4- ప్రయాణంలో ఉపవాసం వదలివేయడం అనేది క్రమబద్ధంగా ఉండవలసిన ఉపవాసాల క్రమబద్ధతను భంగపరచదు. అంటే ఎవరైనా పొరపాటుగా చేసిన హత్యకు పరిహారంగా ఉపవాసం ఉంటున్నారో, వారు అవసర నిమిత్తం ప్రయాణం చేసినందున ఏ లోపం జరగదు.
5- తానున్న విమానాశ్రయంలో సూర్యాస్త- మయం అయిన తర్వాతే ఇఫ్తార్ చేసిన వ్యక్తి, విమానం గాలిలో లేచాక సూర్యుడిని చూస్తే, మళ్ళీ తినత్రాగడం మానుకునే అవసరం లేదు.
6- సూర్యాస్తమయానికి కొంచెం ముందు విమానంలో పయనించాడు, (విమానం, పైకి లేచాక) సూర్యుడు కనబడతున్నప్పుడు ఇఫ్తార్ చేయకూడదు, మగ్రిబ్ నమాజు చేయకూడదు. అతను గగనములో ఉన్న చోట సూర్యాస్తమయం అయినదని తెలిసినప్పుడే ఇఫ్తార్ చేసి, నమాజు చేయాలి. అతనున్న విమానం ఏదైనా పట్టణం మీదుగా వెళ్తుందని, ఆ పట్టణవాసులు ఇఫ్తార్ చేశారని తెలిసినా, తాను సూర్యుడిని చూస్తున్నంత వరకు ఇఫ్తార్ చేయకూడదు.
7- టికిట్ కన్ఫర్మ్ ఉన్న వ్యక్తి, చాలా దూరంలో ఉన్న విమానాశ్రయానికి బయలుదేరుతూ, తన ఊరు దాటిన తర్వాత ఉపవాసం విడనాడి, నమాజు ఖస్ర్ చేశాడు, విమానాశ్రయం చేరుకున్నాక విమానం ఆలస్యంగా ఉందని, లేదా ఏదైనా కారణం వల్ల అది రద్దు అయిందని తెలిసి అతడు ప్రయాణం చేయలేకపోతే అతని నమాజు అయినట్లే, అలాగే అతను ఉపవాసం మానుకోవడం కూడా తప్పేమీ కాదు, ఇక మళ్ళీ తినత్రాగడం నుండి ఆగవలసిన అవసరం లేదు. ఎందుకనగా అతని ప్రమేయంతో కావాలని చేసుకున్నదేమీ కాదు, అతను చేసింది ధర్మానుసారం చేశాడు.
8- ప్రయాణం కారణంగా లేదా మరే కారణంగా రమజాను ఉపవాసాలు వదిలిన వ్యక్తి, తాను విడనాడిన ఉపవాసాలు తర్వాత పాటించాలి.
అల్లాహ్ అందరినీ క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానం చేర్చుగాక! ఆమీన్
పాద సూచిక (ఫుట్ నోట్స్) :
[1] ఏమిటి విషయం – బాటసారి ఒంటరిగా నమాజు చేసుకుంటే ఖస్ర్ చేసి రెండు రకాతులే చేయాలి కాని (స్థానిక) ఇమాం వెనక ముఖ్తదీగా ఉంటే నాలుగు రకాతులు చేయాలి అని ఇబ్ను అబ్బాస్ ؓ గారిని అడిగితే ‘సరియైన సంప్రదాయం ఇదే’ అని సమాధానమిచ్చారు. (ముస్నద్ అహ్మద్, ఇర్వాఉల్ గలీల్ 571 లో షేఖ్ అల్బానీ ఈ హదీసును సహీ అని అన్నారు.
[2] ‘జమ్అతక్దీమ్’ అంటే జొహ్ర్ సమయంలో జొహ్ర్, అస్ర్ నమాజులు కలిపి చేయడం, మగ్రిబ్ సమయంలో మగ్రిబ్, ఇషా నమాజులు కలిపి చేయడం.
‘జమ్అతాఖీర్’ అంటే అస్ర్ సమయంలో జొహ్ర్, అస్ర్ నమాజులు కలిపి చేయడం. ఇషా సమయంలో మగ్రిబ్, ఇషా నమాజులు కలిపి చేయడం.
[3] నమాజుల సమయ పట్టిక తెలుసుకొనుటకు మా ప్రచురితమైన “శుద్ధి – నమాజు” అన్న పుస్తకం చదవండి.
[4] అర్థరాత్రి అంటే రాత్రి 12 గంటలు అన్న భావన సరి కాదు. సూర్యాస్తమయం నుండి ఉషోదయం వరకు గల పూర్తి సమయంలో సగభాగం ఎన్నింటికి పూర్తవుతుందో ఆ సమయం. ఉదాహరణకుః సూర్యా- స్తమయం సా. 6 గం., ఉషోదయం తెల్లవారుజామున 4 గం.కు అయితే, రాత్రి 11 గం.కు అర్థరాత్రి అవుతుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సత్కార్య వనాలు అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
సోదర మహాశయ! కప్పి ఉంచుట అనేది రెండు రకాలుగా ఉంటుంది. 1. బాహ్యముగా. 2. అంతర్యముగా.
అంతర్యముగా అంటే ఒక ముస్లిం ఏదైనా పాపం లేదా అశ్లీల కార్యానికి ఒడిగడితే నీవు అతడ్ని నలుగురి ముందుకు తెచ్చి అవమానపరచకు. అతడ్ని పాపం చేయకుండా నిరోధించు. మృదుత్వము, అప్యాయతతో కూడిన ఉపదేశం చేస్తూ అతనితో మెతకవైఖరి అవలంభించు. అతడ్ని దాచి ఉంచి, అతని తప్పిదాన్ని బహిర్గతం చేయకు. అల్లాహ్ ఎవరి తప్పిదాన్ని కప్పి ఉంచాడో నీవు దాన్ని బట్టబయలు చేయకు.
మాఇజ్ అస్లమీ తాను పాల్పడిన వ్యబిచారం గురించి ప్రవక్త ﷺ ముందు స్వయంగా తన నోట ప్రస్తావించాడు. అయినా ప్రవక్త ﷺ మాఇజ్ తన తప్పిదాన్ని కప్పి ఉంచి, అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటే బావుండు అని తపన పడుతూ ఇలా అన్నారుః ఏమైంది నీకు, తిరిగి వెళ్ళు, క్షమాభిక్ష కోరి, అల్లాహ్ వైపునకు మరలిపో”. (ముస్లిం 1695). మాఇజ్ కొంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడు. ప్రవక్తా! నన్ను పవిత్రపరచండి అని అంటాడు. ప్రవక్త అదే సమాధానమిస్తారు. ఇలా మూడు సార్లు జరుగుతుంది. ఎప్పుడైతే ప్రవక్తకు నమ్మకం కుదిరిందో అతను ఈ దుష్కార్యానికి పాల్పడ్డాడని; ఈ పాపం నుండి పవిత్రుడు అవదలుచు- కుంటున్నాడని; మరియు తాను తన ప్రభువుతో కలుసుకున్నప్పుడు అతనిపై ఈ పాపభారం ఉండద్దని ఆశిస్తున్నాడని. అప్పడు ప్రవక్త ﷺ అతనిపై “హద్” (శిక్ష) విధించాలని సహచరులకు ఆదేశించారు. వారు అతన్ని తీసుకెళ్ళి అతనిపై రాళ్ళు రువ్వడం ఆరంభించారు. రాళ్ళ తాకిడిని సహించలేక అక్కడి నుండి పరుగెత్తాడు. కొందరు సహచరులు అతని వెంటబడి రాళ్ళు రువ్వారు. చివరికి అతను చనిపోయాడు. అతని పారిపోయే విషయం తెలిసినప్పుడు ప్రవక్త ﷺ ఇలా చెప్పారుః
హా! ఎంతటి విచిత్రం! ఎక్కడ ఏ దుష్కార్యం, ఏ చెడు సంభవిస్తుందో అని కొందరు నిరీక్షిస్తూ ఉంటారు. ఎందుకు? దానికి సంబంధించిన అధికారులకు తెలియజేస్తే వారు ధర్మపరమైన సాధనాలతో దాన్ని ఖండిస్తారు అనా? కాదు, దాన్ని ప్రజల్లో వ్యాపింపజేయాలని, అంతే కాదు సెల్, ఇంటర్ నెట్ లో మరియు ఇతర సాధనాలతో ప్రచురించాలని. ఇది వదంతులను వ్యాపింపజేయాలన్న వాంఛ, ఇది మహా విపరీతంగా పాకుతుంది. సరియైన ఇంక్వైరీ చేయుట, నిర్ధారించుట, దాచి ఉంచుట మరియు సభ్యతను పాటించుట లాంటి నిజమైన సాధనాలకు భిన్నంగా ఉంది ఈ వైఖరి. ధర్మపరమైన శ్రేయోభిలాష పునాదులను తెలుసుకోకుండా వీరు ఎక్కడు- న్నారు? అల్లాహ్ యొక్క ఈ ఆదేశాన్ని ఎందుకు చెవున బెట్టుట లేదు?
విశ్వాసుల మధ్య అశ్లీలత వ్యాపించాలని కోరేవారు, ప్రపంచంలోనూ, పరలోకంలోనూ వ్యధాభరితమైన శిక్షకు అర్హులు. అల్లాహ్ ఎరుగును. మీరు ఎరుగరు. (నూర్ 24: 19).
ప్రజల మరుగు విషయాల వెంట పడేవారు తమ ఈ అలవాటును వదులుకోకుంటే వారు స్వయంగా నీచాతినీచమైన స్థితిలో అవమానానికి గురి కావలసి వచ్చే సందర్భం నుండి ఇకనైన భయపడాలి.
అబూ బర్జా అస్లమీ ఉల్లేఖనం ప్రకారం: నవయువకురాళ్ళకు కూడా వినిపించే విధంగా ప్రవక్త ﷺ గొంతెత్తి చాటింపు చేస్తూ ఇలా చెప్పారుః “ఓ ప్రజలారా ఎవరైతే నోటి ద్వారా విశ్వసించారో, విశ్వాసం వారి ఆంతర్యంలో చేరలేదో! ముస్లిములను పరోక్షంగా నిందించకండి. వారి రహస్య విషయాల వెంటబడకండి. ఎవరు తన సోదరుని రహస్య విషయాల వెంట పడుతాడో అల్లాహ్ అతని రహస్య విషయాల వెంటపడతాడు. అతడు తన ఇంట్లో ఉండగానే అల్లాహ్ అతడిని అవమానం పాలు చేస్తాడు”. (అహ్మద్. సహీ లిగైరిహీ, దాని సనద్ హసన్).
బాహ్యముగా కప్పి ఉంచుట అంటే దుస్తులు లేకుండా నగ్నంగా ఉన్నవానికి దుస్తులు ధరించి ప్రజల చూపు పడకుండా ఉంచుట. అల్లాహ్ సాక్షిగా! ఇది ప్రియప్రవక్త పద్ధతి. మాఇజ్ అస్లమీ సంఘటనలో ఈ రెండు రకాలు ఉన్నాయి. (మొదటి రకం గురించి పై హదీసులు చదివారు, రెండవ రకం గురించి) అబూ దావూద్(4377)లో ఉంది, ప్రవక్త ﷺ హజ్జాల్ అను వ్యక్తిని మాఇజ్ కు ఏదైనా గుడ్డ ఇవ్వాలని ప్రోత్సహిస్తూ ఇలా చెప్పారుః
(لَوْ سَتَرْتَهُ بِثَوْبِكَ كَانَ خَيْرًا لَكَ).
“నీ దుస్తులతో అతడ్ని దాచి ఉంచితే అది నీ కొరకే మేలుగా ఉండును”.
అల్లాహ్ నిన్ను కాపాడుగాక! ప్రవక్త ﷺ ముస్లిముల బాహ్యంతర రహస్యాలను, వారు సజీవంగా ఉన్నప్పుడు మరియు చనిపోయిన తర్వాత కూడా ఎలా దాచి ఉంచుతున్నారో గమనించు.
అల్లాహ్ నీకు సద్భాగ్యం ప్రసాదించుగాక! పూర్వపు ఇద్దరి పుణ్యపురుషుల్లో జరిగిన ఈ సంఘటన; వారు ముస్లిముల రహస్యాలను కప్పి ఉంచడంలో ఉన్న ప్రవక్త ﷺ యొక్క ఉత్తమ పద్ధతిని ఎలా ప్రస్తావించుకుంటున్నారో శ్రద్ధగా పఠించు (ఆలకించు): ఇదిగో ఇతను అబ్దుల్లాహ్ హౌజని, ఇలా తెలిపారుః నేను ప్రవక్తగారి మొఅజ్జిన్ బిలాల్ ను హలబ్ అను ప్రాంతంలో కలిశాను. బిలాల్! ప్రవక్త ఖర్చులు ఎలా ఉండేవి ఏమైనా నాకు తెలుపుతావా అని అడిగాను. దానికి అతను ఇలా సమాధానం ఇచ్చాడుః ఆయన వద్ద ఏమి లేకుండింది. అల్లాహ్ వారిని ప్రవక్తగా చేసినప్పటి నుండి ఆయన గతించే వరకు నేనే ఆయన ఖర్చులకు బాధ్యునిగా ఉంటిని. ఆయన వద్దకు ఎవరైనా ముస్లిం నగ్న స్థితిలో వచ్చింది చూస్తే నన్ను ఆదేశించేవారు. నేను ఎవరి నుంచైనా అప్పు తీసుకొని అతనికి దుస్తులు ధరించి, భోజనం చేయించేవాడిని. ఒకసారి ఒక బహుదైవారాధకుడు నన్ను కలసి, బిలాల్! నేను చాలా ఉన్నవాడిని, నా నుంచే నీవు అప్పు తీసుకో, చూడు సుమా! వేరెవ్వరి నుంచి తీసుకోవద్దు అని చెప్పాడు. నేను అలాగే చేసేవాడిని. ఒకనాడు నేను వుజూ చేసుకొని నమాజు కొరకు అజాన్ ఇవ్వడానికి సిద్ధమయ్యాను అప్పుడే అదే బహుదైవారాధకుడు కొందరి వ్యాపారుల మధ్య వస్తూ నన్ను చూడగానే ‘ఓ హబషీ!’ అని అరిచాడు. హాజరుగా ఉన్నాను చెప్పండి అన్నాను. అతి చెడ్డ ముఖంతో నా ముందుకు వచ్చి ఓ చెడ్డ మాట అని, తెలుసా నెల పూర్తి కావడానికి ఎన్ని రోజులున్నాయో? అని అడిగాడు. దగ్గరే ఉంది అని నేనన్నాను. కేవలం నాలుగు రోజులే అని చెప్పి, నీ మీద ఉన్న నా అప్పుకు బదులుగా నిన్ను తీసుకెళ్ళి నీవు గతంలో ఉన్నట్లు మేకల కాపరిగా ఉంచుతాను అని అనేశాడు. ఈ మాటలు విని నా గుండె చలించి పోయింది. ఇతరులకు కూడా ఇలాంటి బాధే అవుతుంది కదా. నేను ఇషా నమాజు చేసుకున్నాను, అప్పటికి ప్రవక్త ﷺ ఇంటికి తిరిగి వచ్చేశారు. ఆయన వద్దకు వెళ్ళి నేను రావచ్చా అని అనుమతి కోరాను, ఆయన నాకు అనుమతించారు. నేను నా తల్లిదండ్రుల్ని మీకు అర్పిస్తును. ఏ బహు- దైవారధకునితో నేను అప్పు తీసుకునేవాడినో అతడు ఇలా ఇలా అన్నాడు. నా వైపు నుండి మీరు చెల్లించడానికి మీ వద్ద ఏమీ లేదు, అలాగే నా వద్ద ఏమీ లేదు. అతడు నా పరువుతీయనున్నాడు. మీరు అనుమతిస్తే గనక ఇస్లాం స్వీకరించిన ఫలాన తెగవారి వద్దకు వెళ్తాను. నా అప్పు తీర్చడానికి అల్లాహ్ తన ప్రవక్తకు ఏదైనా ప్రసాదించవచ్చు. అక్కడి నుండి బయలుదేరి నా ఇంటికి వచ్చాను. నా తలవారి, తిత్తి, చెప్పులు మరియు ఢాలు నా తలకడన పెట్టుకున్నాను. సహరీ సమయం (ఫజ్ర్ సమయానికి కొంచం ముందు) అవుతుంది. ఇక నేను వెళ్దామని అనుకుంటున్నాను. ఎవరో ఒకరు పరుగెత్తుకుంటు వస్తూ బిలాల్! తొందరగా ప్రవక్త వద్దకు చేరుకో అని కేకేశాడు. నేను ప్రవక్త వద్దకు వచ్చాను. అక్కడ నాలుగు జంతువులు సామానులతో సహా ఉన్నాయి. అనుమతి కోరాను. అప్పుడు ప్రవక్త ﷺ అల్లాహ్ నీ అప్పు తేర్చడానికి పంపాడు అని శుభవార్త వినిపిస్తూ, అదిగో సామానులతో నిండి ఉన్న నాలుగు జంతువులను చూడటం లేదా? అని అడిగారు. అవును అని నేనన్నాను. ప్రవక్త ﷺ చెప్పారుః ఆ జంతువులు, వాటి మీద ఉన్న సామానులన్నియూ నీకే. వాటిలో బట్టలు, అన్నపానీయాలున్నాయి. ఫదక్ ప్రాంత రాజు బహుకరించాడు. వీటిని ఆధీనపరుచుకో నీ అప్పును చెల్లించు. …. (హదీసులో పూర్తి వివరణ ఉంది; బిలాల్ ప్రవక్త మీద ఉన్నఅప్పంత చెల్లించి వచ్చి ప్రవక్తకు తెలియజేశారు, అప్పుడు ప్రవక్త) ఆ సొమ్ము నా వద్ద ఉండగానే ఎక్కడ చావు వస్తుందో అన్న భయంతో (ఆ వార్త తెలిసినందుకు) అల్లాహ్ గొప్పతనాన్ని చాటుతూ, ఆయన స్తుతులు స్తుతించసాగారు. (అబూ దావూద్ 3055. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ దీనిని సహీ అని అన్నారు).
రహస్యాలను కప్పి ఉంచుట చాలా ఉత్తమ గుణం. గొప్ప మనస్సుగలవారు ఈ గుణాన్ని అవలంబించి వారి సమావేశాలు ప్రజల పరువుల జోక్యంతోనే నిండిపోకుండా దూరంగా ఉంటారు. వారి కలములు ప్రజల తప్పులు వ్రాయడానికి అవసరం లేకుండా ఉంటాయి. వారి చెవులు ప్రజల దోషాలు వినకుండా మూతబడి ఉంటాయి. ఈ అందమైన కప్పిఉంచే గుణంది ఎంతటి వైభవం. నిజంగా ఇందులో అల్లాహ్ యొక్క గొప్ప దయను అంగీకరిస్తున్నట్లుందిః ఆయన మనల్ని నగ్నంగా పుట్టించాక అందమైన దుస్తుల్లో కప్పి ఉంచాడు.
ఓ ఆదము సంతానమా! మేము మీపై దుస్తులను అవతరింప జేశాము. అవి మీరు సిగ్గు పడే మీ శరీర భాగాలను కప్పుతాయి. మీ శరీర రక్షణకు శోభకు సాధనంగా ఉంటాయి. భయభక్తులు అనే దుస్తులే మంచి దుస్తులు. ఇది అల్లాహ్ సూచనలలోని ఒక సూచన. భహుశా ప్రజలు దీని ద్వారా గుణపాఠం నేర్చుకుంటారేమో!. (ఆరాఫ్ 7: 26).
మనం ఎన్నో పాపాలకు, దోషాలకు గురవుతున్నది చూస్తూ కూడా అల్లాహ్ మనల్ని సర్వ సృష్టి ముందు అవమాన పరచకుండా కాపాడి ఎంతో గొప్ప మేలు చేశాడు. ఏ రోజైతే మర్మావయవాలు బయటపడతాయో, పాపాలు అందరి ముందు ప్రత్యక్షంగా వస్తాయో ఆ రోజు అల్లాహ్ నిన్ను కప్పి ఉంచాడంటే ఇంతకంటే గొప్ప కప్పి ఉంచడం ఇంకేదైనా ఉంటుందా!! ప్రవక్త ﷺ చెప్పారుః
“నిశ్చయంగా (ప్రళయదినాన) అల్లాహ్ విశ్వాసికి దగ్గరగా వచ్చి తన దండ అతని మీద పెట్టి అతన్ని దాచి పెట్టుకుంటాడు. మళ్ళీ నీవు చేసిన ఫలాన పాపం గుర్తుందా, ఫలాన పాపం చేశావు కదూ? అని అడుగుతాడు. అవును ఓ ప్రభువు అని అతడంటాడు. అల్లాహ్ అతన్ని తన పాపాల గురించి ఒప్పిస్తాడు. (అతడు వాటిని ఒప్పుకొని) ఇక నాశనమయ్యానని భావిస్తాడు. అప్పుడు అల్లాహ్ అంటాడుః “నీ పాపాలను (ప్రజలకు తెలియకుండా) ప్రపంచంలో దాచి ఉంచాను. మరి ఈ రోజు వాటిని కూడా నీ కొరకు క్షమిస్తున్నాను”. అప్పుడు (మిగిలిన) సత్కర్మల పత్రం అతనికి ఇవ్వబడుతుంది. అయితే అవిశ్వాసి మరియు వంచకుల విషయం ఇలా ఉందిః “తమ ప్రభువునకు అబద్ధాన్ని అంటగట్టిన వారు వీరే అని అపుడు సాక్షులు సాక్ష్యం చెబుతారు. విను! దుర్మార్గుల మీద దేవుని శాపం పడుతుంది”. (ఈ విషయం ఖుర్ఆన్ సూర హూద్ 11: 18లో ఉంది). (బుఖారి 2441, ముస్లిం 2768).
ప్రియ పాఠకుడా! ముస్లిములను కప్పి ఉంచే వనానికి చిత్తశుద్ధి అనే నీరు పెడుతూ ఉండు. అప్పుడే దాని ఉత్తమ పంటను కోయగలుగుతావు. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః
ప్రియ సోదరా! ఈ వనం ఆరంభం ఒక చిన్న సంఘటన ద్వారా చేస్తాను, నా స్నేహితుడైన షేఖ్ (ఇబ్రాహీం బిన్ సాలిహ్, అహ్ సాలోని షరీఆ కాలెజ్ లెక్చరర్) చెప్పారుః
“సుమారు 18 సంవత్సరాల ఒక నవయువకుడు అహ్‘సా నుండి దమ్మామ్ తన కార్లో బయలుదేరాడు. అతడు అస్థమ రోగి. దమ్మామ్ చేరుకున్న వెంటనే అతనికి ఊపిరి ఆడనట్లు ఏర్పడింది. ఇది ఓ భయంకర విషయానికి సంకేతం అని అస్థమ రోగులకు ముందే తెలుసు. ఇలాంటప్పుడు వివేకవంతమైన చురుకుతనం, వెంటనే రోగి చుట్టు గుమిగూడి అతని ఆరోగ్యం గురించి సూక్ష్మమైన శ్రద్ధ చాలా అవసరం.
ఎప్పుడైతే తాను ఏ క్షణాన్నైనా స్పృహ తప్పి పోవచ్చని, పడిపోవచ్చనీ ఆ యువకునికి అర్థమయ్యిందో, అప్పడతను చుట్టాల ముందు పడిపోతే బాగుండదు కదా అన్న మరింత ఆవేదనతో దమ్మామ్ చేరుకొని ఏమంత సమయం కాక ముందే తిరిగి అహ్ సా చేరుకోవాలని నిశ్చయించు కున్నాడు. అతని ఛాతిలో ఏదో అవస్త ఉన్నట్లు, సరిగ్గా శ్వాస తీసుకోలేక పోతున్నాడని దగ్గరున్న వారు గ్రహించి, ఈ స్థితిలో వెళ్ళకుంటే బావుంటదని ప్రాధేయ పడ్డారు. ఎన్నో రకాలుగా అతనిపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయినా అతడు ఒక్కటీ పట్టించు కోకుండా తిరిగి పోవడానికి తన కారు ఎక్కాడు. ఒక్కో క్షణం అతి కఠినంగా గడుస్తుంది. ఒక్కో క్షణం ఒక్కో శ్వాసను ఆపుతున్నట్లుంది. ప్రక్కన తిరుగుతే ధైర్యం ఇచ్చే కారుణ్యతండ్రి లేడు. మమకారంతో గుండెకు హత్తుకునే మాతృమూర్తి లేదు. త్వరగా తొలి చికిత్స అందించే, ఆపద్బాంధువ సోదరుడు లేడు. రెప్పలార్పకుండా ముందుకు చూస్తూ పోతే పొడగాటి రొడ్డు. గమ్యానికి చేరుకునేంత శక్తి లేనట్లు ఏర్పడుతుంది. సగం దారి చేరుకున్నాడో లేదో అవస్త ఎక్కువై పోయింది. కంట్రోల్ కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. కళ్ళు తేటగిల్లుతున్నాయి. చావు సమీపించి- నట్లనిపిస్తుంది. ఇక చివరి ఘడియలే అని భావించాడు. ఒక బ్రిడ్జి క్రింద కారును ఆపాడు. దారి గుండా పోయేవారితో ఏదైనా సహాయం కోరుదామన్నా శక్తి లేకుండా అయిపోయింది. ఆశలు కోల్పోయాడు. ఇక అల్లాహ్ వైపునకు మరలాడు. అమానతుగా ఉన్న ఆత్మను అప్పజెప్పటానికి, ఒంటరి ప్రయాణంలో ఉండి, ఏమి చేయాలో దోయక అనుకోకుండా బండి నుండి దిగి దాని ముందు వచ్చి వెలకిల పడ్డాడు. బహుశా అల్లాహ్ కారుణ్యం కురుస్తేందేమో, జాడలేని ఒంటరితనంపై అల్లాహ్ కరుణ దృష్టి పడుతుందేమో. అదే క్షణంలో తనకు తానే మరచిపోయినట్లయింది. సృహ తప్పినట్లయింది. ఏమి జరుగుతుందో ఏమీ తెలియదు. ఒక విషయం తప్ప; ఇక ఈ జీవితాన్ని దాని అందచందాలను వీడిపోయే సమయం వచ్చేసిందని.
కాని అల్లాహ్ కారుణ్యం అతని వెంటే వెంబడిస్తూ ఉంది. ఎందుకు అలా కాదు? ఆయన కరుణామయుడు, క్షమించువాడు, కృపాసాగరుడు, ఓర్పుగల పరిశుద్ధుడు.
దారి గుండా పోతున్న ప్రయాణికుల్లో ఒకతను స్పృహ తప్పినట్లు తన కారుపై పడి ఉన్న పడచుపిల్లవాడిని చూడటానికి వస్తాడు. ఏ యాక్సిడెంట్ చిహ్నాలు లేవు, ఇతని ఈ స్థితికి అసలు కారణం ఏమిటో తెలియడం లేదు. అయినా అతను ప్రశ్నల మోతలకు తావివ్వకుండా ముందు ఈ అపరిచిత వ్యక్తికి సహాయం అందించాలి అని చెయితో పట్టి చూస్తే యువకుని చెయ్యి కదిలినట్లు చూశాడు అతడు తన మూతి, ముక్కు వైపు సైగ చేస్తున్నాడు. అంటే ఇక శ్వాస నడిచే అవకాశాల్లేవు అని తెలియజేస్తున్నాడు. అతడ్ని ప్రాణంతో చూసి ఈ పుణ్యాత్ముడు సంతోషపడ్డాడు. అల్లాహ్ అతడ్ని కాపాడడానికే నన్ను పంపాడెమో అని అనుకొని, దగ్గర ఉన్న ఓ ఊరిలో మంచి చెస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ వద్దకు తీసుకెళ్ళడానికి తొందర పడ్డాడు. అక్కడికి చేరుకున్నాక తన మెడపై వచ్చి పడ్డ అమానతు పట్ల మంచి శ్రద్ధ చూపాడు ఓ డాక్టర్. ఆ పుణ్యాత్ముడు శ్వాస ఆగిపోతున్న, చావుగురకలకు గురైన యువకుని తలాపున నిలబడి చూస్తునే ఉన్నాడు. తాను ఏ ఉద్దేశంతో ప్రయాణానికి బయలుదేరాడో మరచి పోయాడు. లోకాన్నే తన వెనక వదిలాడు. ప్రాణం కోల్పోతున్న మనిషిని కాపాడుటకు ముందుకు వచ్చి అల్లాహ్ దయతో తిరిగి అతని స్థానంలో చేర్చడానికి. ఏదో ముందు నుండే పరిచయం ఉన్నట్లు కాదు. ఐహిక లాభాన్ని ఉద్దేశించీ అంతకు కాదు. అల్లాహ్ అనుగ్రహించిన ఓ సత్కార్యం చేసుకోవాలని మాత్రమే. అలాగే దృష్టి సారించి యువకుని వైపు చూస్తూ, తనకు తోచిన శ్రద్ధ చూపుతూ, అల్లాహ్ అతనికి స్వస్థత ప్రసాదించాలని, తిరిగి కొత్త జీవితం దొరకాలని అల్లాహ్ తో దుఆలో నిమగ్నుడై ఉన్నాడు. కొంచం కొంచం మంచిగా శ్వాస తీసుకోగలుగు తున్నాడు. క్లిష్టపరిస్థితి దూరమవుతుంది. వ్రేళ్ళు ఆడుతన్నాయి. జీవితం మెరుపు కళ్ళల్లోని కాంతి ద్వారా మినుకుమినుకుమంటుంది. ఆ పుణ్యాత్ముడు ఎంతో ఆశతో డాక్టర్ కళ్ళల్లో కళ్ళేసి తదేకదృష్టి సారించి ఉన్నాడు. అతని మోమున ఒక ఆనందమైన చిరునవ్వు గురించి పెనగులాడుతున్నాడు. క్షణం తర్వాత క్షణం గడుస్తుంది. నీ ప్రభువు కారుణ్యం మేలుచేసేవారికి సమీపం కనబడుతుంది. యువకుని శరీరంగాలలో జీవచలనం మొదలయింది. డాక్టర్ ముఖకవలికల్లో సంతోషం తొనికిసలాడింది. అతని నూతన జీవిత శుభవార్త డాక్టర్ నోట వెలువడింది. ఆ పుణ్యాత్ముడు అప్పుడే అతని నోట అతని ఇంటి ఫోన్ నంబర్ తెలుసుకున్నాడు. అతని ఇంటివారికి తాను తెలియకుండా ఉండటానికి అక్కడి నుండి జారుకున్నాడు. తన ఈ సత్కార్యాన్ని వివేకవంతముతో గట్టెక్కించడానికి అతని ఇంటికి ఫోన్ చేసి వారి అబ్బాయి క్షేమ విషయంతో పాటు ప్రస్తుతం ఉన్న అడ్రస్ వారికి తెలిపేశాడు.
కాని: … మీరెవరండి మాట్లాడుతున్నది? చెప్పండి అల్లాహ్ మీకు సద్భాగ్యం ప్రసాదించుగాక? ఓ పుణ్యాత్ముడా మీరెవరో చెప్పండి? మీ శుభనామం తెలియజేయండి, మీ గొప్పతనం గురించి ప్రజలకు తెలుపనివ్వండి, మీరు చేసిన సత్కార్యం గురించి వివరించనివ్వండి, మీరు మాకు చేసిన మేలుకు బదులుగా మీకు మేలు చేయనివ్వండి, పరిశుద్ధుడైన అల్లాహ్ దయతో మా కొడుకు ప్రాణాన్ని కాపాడిన మీరు, మీకు ఏ మేలు చేస్తే సమతూలుతుంది. మిమ్మల్ని గౌరవించి, సత్కరించే భాగ్యం మాకివ్వరా? చెప్పండి మీరెవరు? అన అడిగిన ప్రశ్నకు బదులుగా “పుణ్యం సంపాదించుకోదలిచిన వాడు”… అన్న రెండే రెండు పదాలు చెప్పి కరుణామయుడు, కనికరించేవాడైన అల్లాహ్ నుండి సత్ఫలితాన్ని ఆశిస్తూ ఆ పుణ్యాత్ముడు ఫోన్ పెట్టేశాడు.
సత్కార్యం చేసినవాడా నీకు శుభం కలుగుగాక, అల్లాహ్ నీకు సరిపోవుగాక, నీ అడుగులు మంచి వైపే పయనమవుగాక, అల్లాహ్ నిన్ను సర్వ చెడుల నుండి కాపాడి, రక్షణ కల్పించుగాక, అల్లాహ్ నీ ఆరోగ్యం, నీ జీవితం, నీ సంతానాల్లో శుభం, వృద్ధి కలుగజేయుగాక, మీకు, మాకూ స్వర్గంలో ఉన్నత స్థానం ప్రసాదించుగాక అని వారు దీవించారు.
షేఖ్ నాతో చెప్పాడు: ఇప్పటికీ దీనమైన, వినయపూర్వకమైన ఈ చేతులు ఆ పుణ్యాత్ముని కొరకు దుఆ చేయుటకై అల్లాహ్ ముందు ఎత్తబడుతాయి. అతని మేలు గుర్తుకొచ్చినప్పుడల్లా ఇదే పరిస్తితి ఉంటుంది.
తన సోదరుని ఓ అవసరాన్ని తీర్చాడు, చూడ్డానికి అదేమంతలే… కాని దానికి రెండు పక్కల్లో (ఇరువైపుల్లోని మధ్య) ఉన్న మనస్సు కావాలి. తన సోదరుని అవసరం తీర్చి ఎంత గొప్ప అదృష్టం సంపాదించాడు!! త్వరలో తీసుకెళ్ళి తొలి చికిత్స చేయించి ఏ సాఫల్యం, విజయం సాధించాడు!! నిశ్చయంగా అది గొప్ప సాఫల్యం, విజయం, దాని గురించే అల్లాహ్ ఇలా తెలిపాడుః
మీ ప్రభువును ఆరాధించండి, మంచి పనులు చేయండి, వీటి ద్వారానే మీకు సాఫల్య భాగ్యం లభిస్తుంది. (హజ్ 23: 77).
సోదరా నీకు సద్భాగ్యం ప్రాప్తమవుగాక! నీ సోదరుని ఏదైనా అవసరం తీర్చడంలో వెనకాడకు, అది నీ సమయం కెటాయించైనా, నీ శ్రమ ద్వారానైనా సరే. నీ సృష్టికర్త నీ అవసరాల్ని తీరుస్తూ ఉంటాడని, నీ బాధను తేలికగా చేస్తాడని, నీ చింతను దూరం చేస్తాడని మరియు నీ ఉపాధిలో శుభం కలుగజేస్తాడని నమ్మకం ఉంచు. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః
“ఒక వ్యక్తి వాహనము మీద కూర్చోడానికి లేదా అతని ఏదైనా సామాను దాని మీద పెట్టడానికి అతనికి సహాయపడుట కూడా సత్కార్యమే“. (ముస్లిం 1009, బుఖారి 2989).
బహుశా నీవు ఒక హవాల్దారునిగా పనిచేస్తున్న వీరుని సంఘటన విని ఉంటావు. అతని పేరు జుమ్ హూర్ బిన్ అబ్దుల్లాహ్ గామిదీ రహిమహుల్లాహ్. ఏదో కోర్ నిష్ లో మునుగుతున్న ఒక తండ్రి అతని ఇద్దరు కొడుకులను కాపాడే భాగ్యం అల్లాహ్ అతనికి ప్రసాదించాడు. అస్ర్ నమాజు చేసుకోవడానికి తాను ఓ మస్జిద్ వైపు వెళ్తుండగా ‘కాపాడండి, కాపాడండి’ అని అంతరాత్మ నుండి వెళ్తున్న, పరిచయమైన కేకలు విని, క్షణం పాటు ఆలస్యం చేయ కుండా మునుగ బోతున్న ఆ ముగ్గురి ప్రాణాలు కాపాడుటకు ప్రయత్నం చేసి, ముందు తండ్రిని కాపాడి ఒడ్డుకు చేర్చి తన మిత్రునికి అప్పజెప్పాడు. అనంతమైన ధైర్యంతో, నిరుపమానమైన త్యాగంతో తన ఆత్మను, జీవితాన్ని ధారాపోసి తండ్రి లాంటి ప్రేమతో ఇద్దరు పిల్లలను కాపాడుటకు వెంటనే వెనక్కి తిరిగాడు. వారిద్దరిని కాపాడే భాగ్యం అల్లాహ్ అతనికి ప్రసాదించాడు. కాని క్షేమంగా ఒడ్డు చేరుకొనుటకు అతని శక్తి అతనికి తోడివ్వలేక పోయింది. విపరీతమైన అలసటకు గురయ్యాడు. సముద్ర సుడిగుండంలో పట్టు కోల్పోయాడు. కెరటాలు అతన్ని మరింత లోతుకే తీసుకెళ్ళ సాగాయి. శక్తి నశించి పోయింది. కళ్ళ ముందే కొంచెం కొంచెం జీవిత జ్యోతి ఆరిపోయింది. అతడు అల్లాహ్ మార్గంలో అమరవీరుడయ్యాడు. బహుశా ఈ అమరవీర పతకం తన గురించే ఎదిరి చూస్తుండవచ్చు. మనం ఇదే మంచి భావన ఉంచుతాము. అల్లాహ్ ఇదే మంచి స్థానం అతనికి ప్రాప్తి చేయుగాక. అయితే ఇలా ఈ వీరుడు కనుమరుగయి పోయాడు. సముద్రం లోతులోకి మునిగి పోయాడు. తన ఈ ధైర్యం మరియు శౌర్యంతో అరుదైన ఫిదాయీ మరియు ప్రాధాన్యత పలకలు చెక్కాడు. వాస్తవానికి మన ఈ కాలంలో ఇది అరుదైన నిదర్శన. నేను ఇంకేమనాలి. ఇంతకంటే ఎక్కువ ఏమీ అనలేను. అల్లాహ్ నీపై అనేకానేక కరుణలు కురిపించుగాక. విశాల స్వర్గంలో నివాసముంచుగాక. అమరవీరుల, పుణ్యాత్ముల స్థానం ప్రసాదించుగాక. ఆయన సత్కార్యఫలమిచ్చువాడు, కనికరం, దయ గలవాడు.
నీ సోదరుని అవసరం అంటేః అతనికి ఏదైనా బాధ ఉంటే నీవు దాన్ని సులువుగా చేయుట. అవస్త ఉంటే చికిత్స చేయించుట. అప్పు ఉంటే తీర్చుట. అతను అడిగినప్పుడు అప్పిచ్చుట. ఏదైనా లోపం ఉంటే దూరం చేసి అతని పరువు కాపాడుట. స్నేహం ద్వారా తృప్తినిచ్చుట. అతని వెనక అతని కొరకు దుఆ చేయుట. ప్రతి సత్కార్యంలో అతనికి చేయూతనిచ్చుట. మంచి విషయంలో సహాయపడుట. ఈ సత్కార్యాల ద్వారా అల్లాహ్ ప్రేమను చూరగొని, ఆయన కొరకే ప్రాయాసపడి ఆయన సంతృష్టి పొంది విజయ వంతునివి అయిపో.
ప్రియ సోదరా! దైవ వాగ్దానాలు, అప్పులిచ్చేవారికి రెండితలు లభించే పుణ్యాలు, ఉత్తమ ఫలితాలు, ఎల్లకాలం ఉండే ఫలాలు, నీడలు గల స్వర్గాలు. ఎవరికీ? మనస్తృప్తితో, ఆత్మసంతోషంతో, ఉదార గుణంతో దానం చేసేవారికి. అతని ముందు ఉత్తమ వాగ్దాన ఖుర్ఆన్ ఆయతులు అట్లే వచ్చేస్తాయిః
అల్లాహ్ కు రుణం ఇచ్చేవాడెవడైనా ఉన్నాడా? మేలైన రుణం: అటువంటి వానికి అల్లాహ్ దానిని ఎన్నో రెట్లు పెంచి తిరిగి ఇస్తాడు. అతనికి ఎంతో శ్రేష్ఠమైన ప్రతిఫలం లభిస్తుంది. (హదీద్ 57: 11).
తమ సంపదను రెయింబవళ్ళు బహిరంగంగానూ, రహస్యంగానూ ఖర్చు చేసే వారు తమ ప్రతిఫలాన్ని తమ ప్రభువు వద్ద పొందుతారు. (బఖర 2: 274).
దానధర్మాలు ఐశ్వర్యవంతమైన చెలమ. దాని ప్రవాహంతో జీవిత పాపాలు, కష్టాలన్నీ కొట్టుకపోతాయి. మంచి విషయాల్లో ఖర్చు పెట్టుట ఎన్నో పెద్ద రోగాలకు బల్సమ్ చికిత్స లాంటిది. గుప్తంగా ఖర్చు పెట్టుట వలన ధనంలో అభివృద్ధి, శుభాలు కలుగుతాయి. భూమ్యాకాశాల ప్రభువు వీటి వాగ్దానం చేశాడు.
ఇలా చెప్పండిః నా ప్రభువు తన దాసులలో తన కిష్టమైన వారికి విస్తృతమైన ఉపాధిని ఇస్తాడు. తన కిష్టమైన వారికి ఆచితూచి ఇస్తాడు. మీరు దేనిని ఖర్చు చేసినప్పటికీ దాని స్థానంలో ఆయనే మీకు మరింత ఇస్తాడు. ఆయనే సర్వశ్రేష్ఠుడైన జీవనోపాధిప్రదాత. (సబా 34: 39).
ఔదార్యుడా! నీవు చేసే దానం ఒక బీజం లాంటిది. ఈ నేలపై కాలు మోపిన అతి ఉత్తమమైనవారు; అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాని బీజం నాటారు. “వాస్తవానికి దానధర్మాలు చేయడంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రభంజనం కన్నా చురుకుగా ఉండేవారు”. (బుఖారి 6, ముస్లిం 2308).
ఈ వనంలోని పూవుల్లో ఒక పూవును సమీపించడానికి ఈ పేజిలో ఈ సంఘటన చదువుదాము. తెల్ల జాతివారి ఇంట్లోని ఓ వ్యక్తి మధ్యలో ఉన్న మంచం మీద సంపూర్ణ జడత్వానికి గురి అయిఉన్నాడు. అతని ప్రక్కనే ఉన్న నాడిమితి (Pulsimeter), శ్వాసను కంట్రోల్ చేసే యంత్రం మరియు మెడికల్ సుల్యూషన్ ట్యూబుల గురించి అతనికి ఏమీ తెలియదు.
సంవత్సరం పైగా ఎడతెగ కుండా ప్రతి రోజు అతని భార్య మరియు 14 సంవత్సరాల ఓ కొడుకు అతని వద్దకు వచ్చి, ప్రేమ, వాత్సల్యంతో అతని వైపు చూసి, అతనికి బట్టలు మార్చి, అతని క్షేమ విషయాలు తెలుసుకుంటూ, అతని గురించి డాక్టర్ తో కూడా మరిన్ని వివరాలు తెలుసుకుంటూ ఉండేవారు. అతనిలో ఏ కొత్త మార్పు లేకుండా, ఎక్కువ తక్కువ కాకుండా అదే ఆరోగ్య స్థితిలో సంపూర్ణ జడత్వం (Coma)లో ఉన్నాడు. అల్లాహ్ తప్ప అతని స్వస్థత ఆశ ఎక్కడా లేకుండా అయిపోయింది. కాని ఓర్పుగల స్త్రీ మరియు యౌవనారంభదశలో ఉన్న అబ్బాయి ఇద్దరూ వినయ నమ్రతతో తమ చేతులు అల్లాహ్ వైపు ఎత్తి అతని స్వస్తత, ఆరోగ్యం గురించి దుఆ చేయనిదే అక్కడి నుండి వెళ్ళేవారు కారు.
అదే రోజు మళ్ళీ తిరిగి రావడానికి హాస్పిటల్ నుండి వెళ్ళిపోయేవారు. ఇలా ఎడతెగకుండా చికాకు, అలసట లేకుండా ప్రతి రోజు వస్తూ ఉండేవారు. హృదయాలు ప్రేమతో ఏకమైనాయి, సత్యంతో కలసిపోయాయి, కష్టాల్లో ఓర్పు, సానుభూతి, జాలి లాంటి పూర్ణసౌందర్య పుష్పాలు పుష్పించాయి.
ఏ కొత్త మార్పు లేని ఈ శవం లాంటి రోగి దర్శనానికి వస్తున్న స్త్రీ మరియు అబ్బాయిని చూసి పేషెంట్లు, నర్సులు, డాక్టర్లే ఆశ్చర్యపోయేవారు. అల్లాహ్! అల్లాహ్!! ఎంతటి విచిత్రమైన సందర్భం! తన ప్రక్కన ఏముందో తెలియని రోగి దర్శనం రోజుకు రెండు సార్లా? డాక్టర్లు మరియు వారి అసిస్టెంటులు వారిద్దరిపై జాలి, దయ చూపుతూ అతని దర్శనమవసరం లేదు. వారంలో ఒకసారి రండి చాలు అని స్పష్టం చేశారు. అప్పుడు “అల్లాహుల్ ముస్తఆన్, అల్లాహుల్ ముస్తఆన్”(సహాయం కోసం అర్థింపదగినవాడు అల్లాహ్ మాత్రమే) అన్న పదాలే ఆ శ్రేయోభిలాష గుణం గల ఆడపడచు నోట వెళ్లేవి.
ఒకరోజు … భార్య, కొడుకుల దర్శానినికి కొంచెం ముందు ప్రభా- వితమైన ఓ వింత సంఘటన సంభవించింది; కోమలో ఉన్న మనిషి తన మంచంలో కదులుతున్నాడు, ప్రక్క మార్చుతున్నాడు, క్షణాలు గడవక ముందే కళ్ళూ తెరుస్తున్నాడు, ఆక్సిజన్ యంత్రాన్ని తన నుండి దూరం జేస్తూ, సరిగ్గా కూర్చుంటున్నాడు, నర్సును పిలుస్తూ ఓ కేక వేస్తున్నాడు. ఆమె బిత్తరపోయి వెంటనే హజరయింది. అతడు ఆమెతో వైద్య యంత్రాలన్నిటి (Medical equipents)ని తీయమని కోరాడు. ఆమె నిరాకరించి వెంటనే డాక్టర్ ను పిలిచింది. అతడు దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే ఎన్నో రకాల చెకప్ లు చేశాడు. కాని ఆ మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు. అప్పుడు డాక్టర్ అవును ఈ యంత్రాలన్నిటిని తీసేసి అతని శరీరాన్ని శుభ్రపరచండని ఆదేశించాడు.
నిష్ఠగల భార్య దర్శన సమయం సమీపించింది. భార్య మరియు కొడుకు తమ ప్రియమైనవారి వద్దకు వచ్చారు. నేను ఏ విధంగా ఆ దయార్థ క్షణాలను వర్ణించాలో, ఏ పదాలను కూర్చి నీ ముందు ఉంచాలో, వాస్తవానికి (వర్ణాతీతమైన ఘడియ అది) చూపులు చూపులను కౌగలించుకుంటున్నాయి, ఆశ్రువులు ఆశ్రువుల్లో మిశ్రమం అయిపోతున్నాయి. చిరునవ్వులు పెదవులపై నివ్వెర పరుస్తున్నాయి. అనుభూతులు నోరుమూతపడవేశాయి. కేవలం అమిత దయాలుడు, మహోపకారుడైన అల్లాహ్ స్తోత్రములు తప్ప. ఆయనే ఆమె భర్తకు స్వస్తత వరం ప్రసాదించాడు.
ఓ పుణ్యాత్ములారా ఈ సంఘటన ఇక్కడికే అంతం కాలేదు. ఇందులో ఓ గొప్ప రహస్యం ఉంది. అది స్పష్టమయ్యే వరకు డాక్టర్ కే ఓపిక లేదు. వెంటనే అతని భార్యను ‘నీవెప్పుడైనా ఇతడ్ని ఈ స్థితిలో చూడగలుతావని ఆశించావా?’ అని ప్రశ్నించాడు. ఆమె చెప్పిందిః ‘అవును, అల్లాహ్ సాక్షిగా! ఒక రోజు తప్పక రానుంది ఆయన మా రాక గురించి కూర్చుండీ వేచిస్తారు అని నేను ఆశించాను’.
డాక్టర్ చెప్పాడు: అతను ఈ స్థితికి రావడానికి ఎదో విషయముంది. అందులో వైద్యశాలకే గాని లేదా వైద్యులకే గాని ఏ ప్రమేయం, ఏ పాత్ర లేదు. అల్లాహ్ సాక్షిగా అడుగుతున్నాను నీవు తప్పక చెప్పే తీరాలి. అవును? రోజుకు రెండేసి సార్లు నీవు ఎందుకని వస్తూ ఉంటివి? నీవు ఏమి చేస్తూ ఉంటివి?
ఆమె చెప్పింది: నీవు నాపై అల్లాహ్ పేరున ప్రమాణం చేసి అడగావు గనక చెబుతున్నానుః నేను మొదటి దర్శనానికి ఆయన తృప్తి మరియు ఆయన గురించి దుఆ చేయుటకు వచ్చేదానిని. మళ్ళీ నేను, నా కొడుకు అల్లాహ్ సామీప్యం కోరుతూ, అల్లాహ్ ఆయనకు స్వస్థత ప్రసాదించాలని బీదవాళ్ళ మరియు నిరుపేదల వద్దకు వెళ్ళి దానధర్మాలు చేసేవాళ్ళము.
అల్లాహ్ ఆమె ఆశను, దుఆను నిరాశగా చేయలేదు. ఆమె చివరి దర్శనానికి వచ్చి, ఆయన రాక కొరకు వేచిస్తూ ఉన్న ఆమె, ఆయన్ని తన వెంట తీసుకువెళ్ళసాగింది. ఆమె, ఆమె ఇంటి వారి కొరకు చిరునవ్వులు, సంతోషాలు తిరిగి రాసాగాయి.
తమ సంపదను రేయింబవళ్ళు బహిరంగంగానూ, రహస్యంగానూ ఖర్చు చేసేవారు తమ ప్రతిఫలాన్ని తమ ప్రభువు వద్ద పొందుతారు. వారికి ఏ విధమైన భయంగాని, దుఃఖంగాని కలిగే అవకాశం లేదు. (బఖర 2: 274).
ఈ సంఘటనను గౌరవనీయులైన అధ్యాపకులు అహ్మద్ సాలిమ్ బా దువైలాన్ “లా తయ్అస్” అన్న తన రచనలో పేర్కొన్నారు. అల్లాహ్ వారికి మరింత సద్భాగ్యం ప్రసాదించుగాక. మరియు మా వైపున ఉత్తమ ఫలితం నొసంగుగాక.
మీరు అమితంగా ప్రేమించే వస్తువులను (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టనంత వరకు మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు. (ఆలిఇమ్రాన్ 3: 92).
దానధర్మాలు ఏ చోట చేస్తే చాలా మేలు ఉందో వెతకాలి. అయితే అన్నిట్లో కెల్లా అతిఉత్తమమైన స్థానం అల్లాహ్ వద్ద అతి చేరువ స్థానం పొందుటకు ఇల్లాలు, పిల్లలకు మరియు బంధువులపై ఖర్చు చేయాలి.
ఉమ్మె సల్మా రజియల్లాహు అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ‘ప్రవక్తా! నేను అబూ సలమ సంతానం కొరకు ఖర్చు చేస్తే నాకు పుణ్యం లభిస్తుందా? నేను వారిని (దీన స్థితిలో చూస్తూ) వదలలేను. వాళ్ళు కూడా నా పిల్లలే కదా?’ అని అడిగింది. దానికి ప్రవక్త ﷺ చెప్పారుః “అవును, నీవు వారి కొరకు ఖర్చు చేస్తున్నదాని ప్రతిఫలం నీకు తప్పక లభిస్తుంది”. (బుఖారి 5369, ముస్లిం 1001).
మనం మన భార్యపిల్లలపై ఖర్చు చేయని రోజంటు ఏదైనా ఉంటుందా? కావలసిందేమిటంటే మనం సర్వ లోకాల ప్రభువైన అల్లాహ్ తో పుణ్యాన్నాశించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
“నీవు అల్లాహ్ ప్రసన్నత కోరుతూ ఖర్చు చేసే ప్రతీదానికి నీకు తప్పకుండా పుణ్యం లభిస్తుంది. చివరికి నీవు నీ భార్య నోటికందించే దాని(ముద్ద, గుటక) పై కూడా నీకు పుణ్యం దొరుకుతుంది“. (బుఖారి 56, ముస్లిం 1628).
అల్లాహ్ నీ ఉపాధిలో వృద్ధి చేసి ఉంటే నీవు స్వయం నీపై మరియు దేశ, విదేశాల్లో ఉన్న నీ సోదరులపై ఎక్కువైనా, తక్కువైనా శుభప్రదమైన ఖర్చు చేస్తూ ఉండడంలో పిసినారితనం వహించకు.
తక్కువదాని ఉదాహరణ ఒక మస్జిద్ ఇమాం ఇలా ప్రస్తావించాడుః మస్జిద్ శుభ్రపరిచే పనిమనుషుల్లో ఒకరి విషయం చాలా గొప్పగా ఉంది; అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయుటకు ఎప్పుడు చెప్పినా వెంటనే అంగీకరించి, తాను స్వయంగా ఆర్థికంగా బలహీనుడు, దీనుడయినప్పటికీ వెనకాడకుండా అతని శక్తి ప్రకారంగా అర్థ రూపాయి దానం చేసేవాడు.
కేవలం అర్థ రూపాయి!! జాగ్రత్త! చాలా తక్కువే కదా అన్న హీనభావం నీలో కలగకూడదు. నిశ్చయంగా అల్లాహ్ వద్ద దాని విలువ చాలా గొప్పగా ఉంది. ఎందుకో నీకు తెలుసా? ఎందుకనగా, ప్రవక్త ﷺ ఇలా చెప్పారుః
“అల్లాహ్ ధర్మసమ్మతమైన సంపాదన (నుండి ఇచ్చే దానాల్ని) మాత్రమే స్వీకరిస్తాడు. అందుకే ఎవరైనా ధర్మసమ్మతమైన సంపాదన నుండి ఖర్జూరపుటంత వస్తువేదైనా దానం చేస్తాడో అల్లాహ్ దానిని కుడి చేత్తో అందుకొని మీరు గుర్రపు పిల్లను పెంచి పెద్ద చేసినట్లుగా దానిని దానం చేసినవాడి కోసం పెంచుతాడు. అలా పెరుగుతూ చివరకు అది పర్వతమంత పెద్దదిగా అయిపోతుంది“. (బుఖారి 1410).
అది అర్థ రూపాయి మాత్రమే.. కాని అల్లాహ్ ఆజ్ఞతో నరకాగ్ని నుండి రక్షణకై గొప్ప కారణం కావచ్చు. నాతో పాటు మీరు కూడా
ప్రవక్త ఈ ప్రవచనం గుర్తు చేసుకోలేరా?
(اتَّقُوا النَّارَ وَلَوْ بِشِقِّ تَمْرَةٍ)
“మిమ్మల్ని మీరు నరకం నుండి కాపాడుకోండి, ఒక ఖర్జూరపు ముక్క (దానం)తోనైనా సరే“. (బుఖారి 1417).
మనం నింపాదిగా అడుగులు ముందుకేస్తూ ఒక స్వచ్ఛంద సేవ సంస్థ వైపుకెళ్దాము, అక్కడ ఓ దాతృత్వ దృశ్యాన్ని వీక్షిద్దాముః పండుగకు ఒకరోజు ముందు రాత్రి వేళ అక్కడి ఒక అధికారి వద్దకు పది సంవత్సరాలు కూడా దాటని ఒక అబ్బాయి వచ్చి సుమారు రెండు వందల రూపాలు దానం చేస్తాడు. ఎంతో ఆశ్చర్యంతో ‘నీకీ డబ్బలు ఎక్కడివి, మేము వీటిని ఏమి చేయాలి’ అని అతను అడుగుతాడు. అబ్బాయి ఇలా సమాధానమిస్తాడుః ఈ డబ్బులు నాకు నా తండ్రి పండుగ కొరకు బట్టలు ఖరీదు చేసుకోమని ఇచ్చాడు. అయితే ఈ డబ్బులతో అనాధ అబ్బాయి ఎవరైనా పండుగ సందర్భంగా తన కొరకు కొత్త బట్టలు ఖరీదు చేసుకుంటే బాగుంటుందని నా కోరిక. ఇక పోతే నాకు నా శరీరంపై ఉన్న ఈ బట్టలే చాలు అని అన్నాడు.
అల్లాహ్ మరింత సద్భాగ్యం ప్రసాదించుగాక ఆ ఇంటివారికి ఎందులోనైతే నీవు పెరుగుతున్నావో ఎవరి ఒడిలో నీవు పెద్దగవుతున్నావో! అల్లాహ్ ఇహపరాల్లో నిన్ను వారి కళ్ళకు చల్లదనంగా చేయుగాక.
ప్రియపాఠకుడా! ఒకవేళ నీవు ఎక్కువ ధనం గలవాడివై ఉంటే అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన సంఘటనను గుర్తుచేసుకోః
మదీనాలోని అన్సార్ ముస్లిములలో అందరికంటే ఎక్కవ ఖర్జూరపు తోటల సంపద కలిగి ఉన్న వ్యక్తి అబూ తల్హాయే ఉండిరి. తన సంపదలో ఆయనకు ‘బైరుహా’ అనే తోటంటే చాలా ఇష్టం. అది మస్జిదె నబవికి ఎదురుగా ఉండింది. ప్రవక్త ﷺ కూడా ఆ తోటలోకి వెళ్తుండేవారు. అక్కడ లభించే మంచి నీళ్ళు త్రాగేవారు. ]మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు దానం చేయనంత వరకు మీరు పుణ్య స్థాయికి చేరుకోలేరు[ అనే అల్లాహ్ ఆయతు అవతరించినప్పుడు అబూ తల్హా లేచి, ‘ప్రవక్తా! ]మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు దానం చేయనంత వరకు మీరు పుణ్య స్థాయికి చేరుకోలేరు[ అనే ఆయతు అల్లాహ్ మీపై అవతరింప జేశాడు. నా సంపద మొత్తంలో ‘బైరుహా’ తోట నాకు అత్యంత ప్రీతికరమైనది. అందుకు నేను దానిని అల్లాహ్ కోసం దానం చేస్తున్నాను. దానిపై నాకు పుణ్యం లభిస్తుందని, అల్లాహ్ వద్ద అది నిలువచేసి ఉంచబడుతుందని ఆశిస్తున్నాను. కనుక ప్రవక్తా! మీరు దీనిని అల్లాహ్ మీకు చూపిన పద్దుల్లో వినియోగించండి’ అని అన్నారు. అప్పుడు ప్రవక్త ﷺ “ఓహో! ఇదెంతో లాభదాయకమైన సంపద, నిజంగా ఇది ఎంతో లాభదాయకమైన సంపద. ఇప్పుడు నువ్వన్న మాటలన్నీ నేను విన్నాను. అయితే నీవు దానిని నీ బంధువుల్లో పంచిపెడితే బాగుంటుందని నేను భావిస్తున్నాను” అని అన్నారు. దానికి అబూ తల్హా ‘నేను అలాగే చేస్తాను ప్రవక్తా!’ అని అన్నారు. అన్న ప్రకారమే ఆయన దానిని తన బంధువులకు, పెద్దనాన్న, చిన్నాన్న పిల్లలకు పంచిపెట్టారు”. (బుఖారి 1461).
ప్రియసోదరా! దైవదూతలు ఎవరి కొరకు దుఆ చేస్తారో వారిలో ఒక్కనివి నీవు అయిపోః
(اللَّهُمَّ أَعْطِ مُنْفِقًا خَلَفًا)
“ఓ అల్లాహ్! నీ (మార్గంలో) దానం చేసేవారికి నీవు వెంటనే మరింత ప్రసాదించు“. (బుఖారి 1442, ముస్లిం 1010).
ప్రియసోదరా! అల్లాహ్ ఎవరిపై ఖర్చు చేస్తాడో వారిలో ఒకనివి నీవు ఐపో, ఆయనే స్వయంగా ఒక హదీసె ఖుదుసిలో ఇలా చెప్పాడుః
(أَنْفِقْ يَا ابْنَ آدَمَ أُنْفِقْ عَلَيْكَ)
“ఆదము కుమారా నీవు ఖర్చు చేయి నేను నీపై ఖర్చు చేస్తాను“. (బుఖారి 5352).
ప్రియసోదరా! నీవు దానం చేసిందే నీ కొరకు మిగిలి ఉండేది. అది అంతం అయ్యేది కాదు. ఏదైతే నీవు ఖర్చు చేయకుండా ఆపి ఉంచుతావో అదే నిజానికి నీకు కానిది అని నమ్ము.
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం: వారు ఓ మేకను కోశారు. (దాని మాంసంలో చాలా భాగం ప్రజలకు పంచి పెట్టారు). ఆ సందర్భంగా ప్రవక్త ﷺ ఆయిషాతో “ఆ మాంసంలో ఇంకా ఎంత మిగిలి ఉంది?” అని అడిగారు. ‘అంతా అయిపోయింది, ఒక్క భుజ భాగం మాత్రమే మిగిలి ఉంది అని చెప్పారామె. దానికాయన “(కాదు) ఆ భుజ భాగం తప్ప తతిమ్మా మాంసమంతా మిగిలి ఉంది” అని చెప్పారు. (ఇమాం తిర్మిజి దీనిని ఉల్లేఖించి ఇది సహీ హదీసు అని చెప్పారు).
కాదు.. మనం దానం చేసింది మిగిలి ఉండడమే కాదు. అది పెరుగుతూ ఉంటుంది. ప్రవక్త ﷺ చెప్పారుః
(مَا نَقَصَتْ صَدَقَةٌ مِنْ مَالٍ) {مسلم 2588}
“దానధర్మాలు ఎప్పుడూ సంపదలో లోటు ఏర్పరచవు“. (ముస్లిం).
ధర్మప్రచారంలో ఉన్న నా సోదరుడు డా. ఖాలిద్ బిన్ సఊద్ అల్ హులైబీ తెలిపాడుః దాతృత గుణంగల ఒక పెద్ద వ్యాపారి అహ్ సా పట్టణంలోని గొప్ప ధనవంతుల్లోని ఒకరు షేఖ్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ అజీజ్ అన్నుఐమ్ ఇలా చెప్పేవారు: నేను అల్లాహ్ మార్గంలో ఏది ఖర్చు చేసినా, దాని ఘనత వల్ల అందులో చాలా శుభం నా కళ్ళార చూసేవాడిని.
ఈ హదీసుపై శ్రద్ధ వహించు, ఇది ఈ సుందర వనం ఫలాల్లోని ఓ ఫలాన్ని నీకు అతి చేరువుగా చేస్తుందిః
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఒక వ్యక్తి ఓ మైదానం గుండా వెళ్తుండగా ఏదో ఓ మేఘం నుంచి “ఫలానా వ్యక్తి తోటలో వర్షం కురిపించు” అన్న శబ్దం వినపడింది. మళ్ళీ ఆ మేఘం పక్కకు జరిగి ఓ నల్లని రాతి నేలపై కురిసింది. (దాంతో చిన్న చిన్న కాల్వలు ఏర్పడ్డాయి) చివరకు ఒక (పెద్ద) కాలువ మిగతా కాలువలన్నిటిని తనలో కలుపుకొని ప్రవహించసాగింది. ఆయన కూడా ఆ ప్రవాహం వెంట నడవసాగాడు. అటు ఓ మనిషి పారతో తన తోటకు నీళ్ళు కడుతున్నాడు. ‘ఓ దైవ దాసుడా! నీ పేరేమిటి అని అతడ్ని అడిగాడు. ఫలాన పేరు అని ఇతను మేఘంలో విన్నపేరే అతడు చెప్పాడు. ‘ఓ దైవదాసుడా! నా పేరెందుకు అడుగుతున్నావు’ అని అతడడిగాడు. ఇతడన్నాడుః నీవు చెప్పిన పేరే చెబుతూ ఫలాన తోటలో వర్షం కురిపించు అని నేను ఏ మేఘంలో విన్నానో దాని నీళ్ళే ఇవి. అయితే అసలు నీవు చేస్తున్న పనేమిటి? అతడన్నాడుః నీవు అడిగావు గనక చెబుతున్నానుః పంట పండిన తర్వాత నేను దాని అంచనా వేసుకొని, మూడో వంతు భాగం దానం చేస్తాను. మరో మూడో వంతు నేను, నా ఆలుబిడ్డలు తినడానికి (ఉంచుకుంటాను). మరో మూడో వంతు తిరిగి విత్తనంగా వేయుటకు ఉపయోగిస్తాను”. మరో ఉల్లేఖనంలో ఉందిః “నేను మూడో వంతును పేదవాళ్ళల్లో, అడిగేవారిలో మరియు బాటసారుల్లో దానం చేస్తాను”. (ముస్లిం 2984).
దానధర్మాలు చేయడం కూడా ఓ సద్గుణమే. ఎక్కడైతే అవసరం, బీదరికం ఉందో అక్కడ దాని అందం మరీ పెరుగుతుంది. అందులో దాతృత్వం మరియు ప్రాధాన్యత గుణాలు కలసి ఏకమవుతాయి. అత్యంత దాతృతుడు, మహోపకారుడైన అల్లాహ్ స్వయంగా ఆశ్చర్య(సంతోష) పడ్డాడన్న హదీసు ఒకటి శ్రద్ధగా చదువుః అబూ హురైరా దానిని ఉల్లేఖించారుః
ఒక వ్యక్తి ప్రవక్త ﷺ వద్దకు వచ్చి ‘నేను తిండి లేక పరితపిస్తున్నాను’ అని చెప్పాడు. అందుకు ప్రవక్త ﷺ తమ ఒక భార్యకు ఈ వార్త పంపారు. ‘మిమ్మల్ని సత్య ధర్మం ఇచ్చిపంపిన అల్లాహ్ సాక్షిగా! నా దగ్గర నీళ్ళు తప్ప మరేమీ లేదు” అని ఆమె చెప్పంపింది. తర్వాత మరో భార్య వద్దకు పంపారు. ఆమె కూడా అలాగే జవాబు చెప్పింది. చివరికి ఆయన భార్యలందరూ “మిమ్మల్ని సత్యధర్మం తో పంపిన అల్లాహ్ సాక్షిగా! నా దగ్గర నీళ్ళు తప్ప మరేమీ లేదు” అనే చెప్పారు. అప్పుడు ప్రవక్త ﷺ తమ సహచరులనుద్దేశించి “ఈ రాత్రి ఇతనికి ఆతిథ్యమిచ్చే వారెవరైనా మీలో ఉన్నారా” అని అడిగారు. ఒక అన్సార్ వ్యక్తి లేచి, నేను ఇస్తాను ప్రవక్తా! అని అన్నారు. ఆయన అతడ్ని తనింటికి తీసుకెళ్ళాడు. తన భార్యతో ‘ఇతను ప్రవక్తగారి అతిథి, ఇతనికి మంచి ఆతిథ్యమివ్వాలి’ అని చెప్పాడు. మరో ఉల్లేఖనంలో ఉందిః ‘ఇంట్లో భోజనానికి ఏదైనా ఉందా’ అని తన భార్యను అడిగారు. దానికి ఆమె ‘పిల్లలకు సరిపోయేంత మాత్రమే ఉంది’ అని చెప్పింది. అప్పుడాయన చెప్పారుః రాత్రి భోజనం నుండి పిలవాళ్ళ మనస్సు మళ్ళించు. ఎప్పుడు వారు రాత్రి భోజనం కోరుతారో అప్పుడు వారిని పడుకోబెట్టు. ఇక అతిథి ఇంట్లోకి రాగానే (అన్నం వడ్డించి, తినేముందు) దీపం ఆర్పెయ్యి. ఆయన ముందు మనం కూడా అన్నం తిన్నట్లు నటిద్దాం. అందరూ భోజనానికి కూర్చున్నారు. (ఆమె దీపం ఆర్పేసింది) వచ్చిన అతిథి (కడుపునిండా) భోజనం చేశాడు. కాని ఆ దంపతులు మాత్రం పస్తుండిపోయారు. ఆ అన్సార్ సహచరుడు మరునాడు ఉదయం ప్రవక్త ﷺ వద్దకు వెళ్ళగా ఆయన ﷺ ఇలా చెప్పారుః
“నిశ్చయంగా రాత్రి మీరు మీ అతిథికి చేసిన సేవ చూసి అల్లాహ్ చాలా సంతోషించాడు“. (ముస్లిం 2054).
ఈ సమాజం ప్రవక్త ﷺ చూపిన సద్గుణాలపై శిక్షణపొందిన, స్వచ్చమైన చెలమ నుండి ఆస్వాదించిన సమాజం. అహం, స్వార్థం అంటే తెలియని సమాజం. ఇదిగో; సమాజంలో ఒక రకమైన సమాజాన్ని వారిలో ఉన్న ఆదర్శవంతమైన ఉత్తమ గుణాన్ని ప్రవక్త ﷺ ప్రశంసించారు. ఆ మనుగడపై గనక నేటి అనుచర సంఘం నడిచి ఉంటే వారిలో ఒక్క బీదవాడు అంటూ ఉండడు. వారు అష్అరీ తెగకు చెందినవారు. వారి గురించే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః
“అష్అరీ తెగవాళ్ళు యుద్ధరంగంలో ఉన్నప్పుడు వారి ఆహార పదార్థాలు అయిపోవస్తే లేదా (స్వస్థలం) మదీనాలో ఉన్నప్పుడు తమ ఆలుబిడ్డల ఆహారపదార్థాల్లో కొరత ఏర్పడితే ఎవరి వద్ద ఏ కొంత ఆహారం ఉన్నా వారు దాన్ని ఒక వస్త్రంలో పోగుచేస్తారు. మళ్ళీ ఒక పాత్రతో అందరూ సమానంగా వాటిని పంచుకుంటారు. అందుకే వారు నాతో పాటు ఉన్నారు. నేను వారితో పాటు ఉన్నాను“. (బుఖారి 2486, ముస్లిం 2500).
జాగ్రత్తా! ఓ ఉదారుడా! నిరాశ నిస్పృహలు నీపై తిష్టవేయకుండా జాగ్రత్తగా ఉండు. ఇప్పటికీ ఈ అనుచర సంఘంలో ప్రవక్త అడుగుజాడల్లో, పూర్వపు పుణ్యపురుషుల బాటలో నడిచే ఉపకా- రులున్నారు. ప్రతి చోట మన బలహీన సోదరుల కొరకు విరాళాల మరియు దానాల ఉద్యమాలు మనం ఎన్నటికీ మరవలేము. విరాళాల, దానాల ఈ రకాల్ని చూసి మనస్సు సంతోషిస్తుంది, హృదయం ఆనందిస్తుంది. వీటిని చూసేవాడు, వాస్తవానికి ఇవి భూమ్మీద ఓ మంచి రక్షక విధానం అని మరియు భూవాసుల శాంతి క్షేమాల రహస్యమని గ్రహించగలుగుతాడు. అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు, కృతజ్ఞతలు.
రెండు సంఘటనలు నన్ను చాలా ఆశ్చర్యపరచాయి. వాటిని షేఖ్ అలీ తంతావీ రహిమహుల్లాహ్ “జిక్రయాత్” అన్న తన రచనలోని భూమికలో ప్రస్తావించాడుః మా తండ్రిగారి అధ్యాపకులు షేఖ్ సలీమ్ అల్ మసూతీ రహిమహుల్లాహ్ స్వయంగా ఎంతో బీదవారైనప్పటికీ ఏ ఒక్క బీదవాడిని ఎప్పుడూ నెట్టలేదు. అతను ఓ చొక్కా ధరించి బైటికి వెళ్ళేవారు, దారిలో చలితో వణికిపోతున్న ఓ మనిషిని చూసి ఆ చొక్కా అతనికి ఇచ్చేసి, తాను కేవలం లాగు మీద ఇంటికి తిరిగి వచ్చేవారు. ఒక్కోసారి తన ఆలుబిడ్డలతో కలసి భోజనం చేస్తుండగా వారు తింటూ ఉన్న ఆహారపదార్థాలు తీసి ఇంటి ముందు వచ్చిన భిక్షకునికి ఇచ్చేవారు. ఒకసారి రమజానులో ఇఫ్తార్ గురించి తినుత్రాగు పదార్థాలు (దస్తర్ ఖ్వాన్ మీద) పెట్టి సైరన్ గురించి వేచిస్తుండగా ఒక భిక్షకుడు వచ్చి తనకు తన ఆలుబిడ్డలకు తినడానికి ఏమీ లేదు అని ప్రమాణాలు చేశాడు. షేఖ్ తన ఆవిడ అశ్రద్ధను గమనించి ఇఫ్తార్ గురించి వడ్డించిన మొత్తం ఆహారం అతనికిచ్చేశారు. కాని ఆవిడ చూసి అరవడం, విలపించడం మొదలెట్టి, నీ దగ్గరే కూర్చోను పో! అని ప్రమాణం చేసింది. ఆయన గారు మౌనంగా ఉన్నారు. అర్థ గంట కూడా గడవక ముందే ఎవరో తలుపు తట్టుతున్న శబ్దం విన్నారు. చూసే సరికి ఒక వ్యక్తి పెద్ద పళ్ళం ఎత్తుకువస్తున్నాడు. అందులో ఎన్నో రకాల తినుభంఢారాలు, స్వీట్లు, ఫలాలున్నాయి. ఏమిటి? అని అడిగితే, ఇక్కడి మన నగర పాలకుడు కొంతమంది పెద్దమనుషులను ఆహ్వానించాడు. వారు రానట్లుగా విన్నవించుకోగా, ఆయన కోపంతో నేనూ తినను అని ప్రమాణం చేసి ఇదంతా షేఖ్ సలీం అల్ మసూతీ ఇంటికి తరలించండని ఆదేశించాడు అని వారు చెప్పారు.
రెండవ సంఘటనః ఒక ఆడపడచు సంఘటన. ఆమె కొడుకు ఏదో ప్రయాణానికి వెళ్ళాడు. ఒకరోజు ఆమె తినడానికి కూర్చుంది. ఆమె ముందు ఓ రొట్టె ముక్క, దానికి సరిపడు కొంత కూర ఉంది. అంతలోనే ఒక భిక్షకుడు వచ్చాడు. అందుకు ఆమె తన నోట్లోకి తీసుకుపోయే ముద్దను ఆపేసి, అతనికిచ్చేసింది. తాను పస్తుండి పోయింది. ఆమె కొడుకు ప్రయాణం నుండి తిరిగి వచ్చాక ప్రయాణంలో చూసిన విషయాల్ని చెప్పసాగాడు. అన్నిట్లోకెల్ల చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటేమిటంటేః ఒక దారిలో ఓ పులి నన్ను ఒంటరిగా చూసి వెంబడించింది. నేను పరుగులు తీశాను. ఒక్కసారి కొంచెం దగ్గరున్నప్పుడు అమాంతం దూకి నా మీద పడింది. ఇక నేను దాని నోట్లో పోయానని భావిస్తున్న వేళ ఒక మనిషి తెల్లని దుస్తుల్లో నా ముందుకు వచ్చి నన్ను పులి నుండి విడిపించి “ముద్దకు బదులు ముద్ద” అన్నాడు. కాని ఏమిటుద్దేశ్యం నాకు అర్థం కాలేదు. అప్పుడే అతని తల్లి సంఘటన జరిగిన రోజు, సమయం అడిగింది. అదే సమయానికి ఇక్కడ తల్లి బీదవానికి దానం చేసిన వేళ. తన నోట్లోకి పోయే ముద్దను వెనక్కి తీసుకొని అల్లాహ్ మార్గంలో దానం చేసింది. ఇలా తన కొడుకు పులి నోట్లో నుండి బయటికి తీయబడ్డాడు. ఇక్కడికి షేఖ్ తంతావీ మాట సమాప్తమయింది.
ఓ! ఇంతనా పిసినారితనం? పిసినారితనం, పిసినారిని అవమానం, అవహేళన పాలు జేస్తుంది. దాని పర్యవసానం వినాశకరం. దాని వాసన దుర్గంధమైనది. వ్యక్తిగతంగాగాని, జాతియపరంగాగాని అది వినాశనం పాలుజేస్తుంది. సత్యసంధులైన ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః
“పిసినారితనానికి బహుదూరంగా ఉండండి. ఈ పిసినారితనమే మీకు పూర్వం గతించినవారిని సర్వనాశనం చేసింది. తమవారి రక్తం చిందించేందుకు, నిషిద్ధ విషయాల్ని ధర్మసమ్మతం(హలాల్) గా చేసుకోవడానికి ప్రేరేపించింది“. (ముస్లిం 2578).
మల్లె మరియు గులాబీ లాంటి సువాసన ఈ వనం వెదజల్లుతుంది. తాజాగా దాని కొమ్మలు కరుణగల హృదయుల ముందు వంగి ఉంటాయి. ఆ హృదయాలు కరుణామయుడైన అల్లాహ్ ముందు నమ్రతతో ఉండే విధంగా శిక్షణ పొంది ఉన్నాయి. అందుకే అవి తమ ప్రభువు కరుణను మరియు దయను కోరుతూ ఆయన సృష్టి పట్ల మెత్తగా, దాసుల పట్ల మృదువుగా ఉన్నాయి.
“కరుణామయులు”, ఇలాగే మన ప్రభువు మనల్ని నిర్వచించాడు. మనం సానుభూతి చెలమ దగ్గర మేశాము, మరియు దయాగుణ చెలమ నీటి త్రాగాము.
ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త. ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులగానూ ఉంటారు, పరస్పరం కరుణామయులుగానూ ఉంటారు. నీవు వారిని చూసినప్పుడు, వారు రుకూ సజ్దాలలో, అల్లాహ్ అనుగ్రహాన్నీ, ఆయన ప్రసన్నతనూ అర్థించటంలో నిమగ్నులై ఉండటం కనిపిస్తుంది. (ఫత్ హ్ 48: 29 ).
ఇదిగో కారుణ్యమూర్తి ప్రవక్త ﷺ ఊపిరాడుతున్న ఓ చంటి పాపను తమ చేతుల్లో తీసుకున్నారు. ఏ క్షణంలోనైనా ప్రాణం పోతుందన్న పరిస్థితిలో వున్న ఆ అబ్బాయిని చూసి ప్రవక్త చక్షువుల్లో కన్నీరు కారాయి. ఇది గమనించిన సఅద్ ‘ప్రవక్తా! ఇదేమిటి? అని అడిగారు. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారుః
“ఇది కారుణ్యం. అల్లాహ్ తన దాసుల హృదయాల్లో దీనిని పెట్టాడు. తన దాసుల్లో కరుణామయులైన వారిని అల్లాహ్ కరుణిస్తాడు“. (బుఖారి 1384, ముస్లిం933).
అల్లాహ్ నిన్ను కాపాడుగాకా! తెలుసుకోః కారుణ్యం స్వర్గానికి బాట. ఇతర బాటల్లో కెల్లా మరీ అందమైన బాట. ఎలా కాదు? ఒక మనిషి మనస్సులో ఉన్న ఈ కారుణ్యం కారణంగానే అల్లాహ్ అతడ్ని స్వర్గంలో ప్రవేశింపజేశాడు. ఆ కారుణ్యం వల్ల అతడు ఏమి చేశాడు? రండి, సత్యసంధులైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట సంక్షిప్త వాక్యాల్లో ఈ సంఘటన వివిరాలు చదువుదాముః
“ఒక వ్యక్తి ఓ దారి గుండా నడచి వెళ్తుండగా అతనికి విపరీతంగా దాహం కలిగింది. ఒక బావిలో దిగి నీళ్ళు త్రాగి బైటికి వచ్చేశాడు. అంతలోనే ఓ కుక్క నాలుక వెళ్ళబెట్టి బురదమట్టిని నాకుతూ (కనబడింది). ‘నేను దప్పికతో అల్లాడిపోయినట్లు ఈ కుక్క కూడా బాధపడుతుందేమో’ అనుకొని (మళ్ళీ బావిలో దిగి) తన మేజోడును నీటితో నింపి, దాన్ని నోటితో పట్టుకొని పైకి తెచ్చాడు. ఆ నీరు కుక్కకు త్రాపించాడు. అప్పుడు అల్లాహ్ అతను చేసిన పనిని మెచ్చుకొని అతన్ని క్షమించాడు. సహచరులు ఈ వృత్తాంతం విని ‘ప్రవక్తా! భూతదయపై కూడా మాకు పుణ్యం లభిస్తుందా? అని అడిగారు. ప్రవక్త ﷺ ఇలా సమాధానమిచ్చారుః “తడి కాలేయం (అంటే ప్రతి ప్రాణం) గల జీవికి చేసే మేలుకు మీకు పుణ్యం లభిస్తుంది. (బుఖారి 2363, ముస్లిం 2244).
అహా! కర్శక నోరు మరియు కఠిన హృదయుల సంగతే విచిత్రం!! అతని వద్ద ఏ మనిషికి కరుణా కటాక్షాలు లభించవు. చివరికి అతని పెదవులపై చిన్నటి మందహాసమైనా కానరాదు. ఇలాంటి వాడు నోరులేని జీవులపై ఏ దయచూపగలడు? మహా దుస్థితి అతనిది. ఇలాంటి మానవుల దుస్థితి, దురదృష్టం గురించి నేను లేదా నువ్వు కాదు తీర్పు చేసింది? కారుణ్యమూర్తి ﷺ తీర్పు చేశారు.
(لَا تُنْزَعُ الرَّحْمَةُ إِلَّا مِنْ شَقِيٍّ).
“దురదృష్టుని నుండే కారుణ్యం తీసుకోబడుతుంది“. (అహ్మద్, తిర్మిజి 1923. దీని సనద్ హసన్. అబూ దావూద్ 4942).
నరకాగ్ని కంటే మించిన దురదృష్టం ఇంకేమైనా ఉంటుందా? ఒక స్త్రీ అతి చెడ్డ స్థానమైన నరకానికి ఆహుతి అవుతుంది. కారుణ్య స్వభావం ఆమె చీకటి హృదయంలో నిరంకుశం మరియు కఠినత్వంలో మారింది. ఆమె దుష్ఫలిత సమాచారం మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతున్నారుః
“ఒక స్త్రీ పిల్లి కారణంగా శిక్షించబడింది. ఆమె దానిని బంధించింది చివరికి అది చనిపోయింది. అందుకు ఆమె నరకంలో చేరింది. ఆమె ఆ పిల్లికి అన్నం పెట్టలేదు. నీరు త్రాగించలేదు. కట్టి ఉంచింది. కనీసం ఆమె దానిని వదిలివేసినా అదే స్వయంగా నేల మీద తిరిగే క్రిమికీటకాలు తినిబ్రతికేది“. (బుఖారి 3482, ముస్లిం 2242).
ప్రియ సోదరా! నిద్ర లేకుండా చేసిన నొప్పి, రాత్రంత మేల్కొనే ఉండినట్లు చేసిన అవస్థ గల ఓ రోగిని పరామర్శించడం ద్వారా నీపై ఎలా కారుణ్యం కురుస్తుందో ఎప్పుడైనా నీవు అనుభవించావా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః
“ఒక ముస్లిం తోటి ముస్లింను ఉదయం పూట పరామర్శిస్తే, డెబ్బైవేల దైవదూతలు సాయంత్రం వరకూ అతని శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ ఉంటారు. అదే సాయంత్రంవేళ పరామర్శిస్తే డెబ్బై వేల దేవదూతలు ఉదయం వరకూ అతని శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ ఉంటారు. ఇంకా అతని కోసం స్వర్గఫలాలు ఏరి ఉంచబడుతాయి“. (తిర్మిజి 969, అబూ దావూద్ 3098).
ప్రియసోదరా! తండ్రి ప్రేమను కోల్పోయిన అనాథ రక్షణకై చెయ్యి చాచు. అతడు ఎడబాటు బాధను చవిచూశాడు. నీవు చేసే ఈ పుణ్యంలో ప్రవక్త ﷺ చెప్పిన ప్రకారం నీకో వాట లభించుగాకః
“నేను మరియు అనాథ సంరక్షకుడు స్వర్గంలో ఇలా ఉంటాము అని ప్రవక్త ﷺ తమ చూపుడు వ్రేళు మరియు మధ్య వ్రేళును కలపకుండా కొంత సంధు ఉంచి చూపించారు“. (బుఖారి 5304).
విధవల పట్ల దయార్థ హృదయునివిగా ఉండు. చావు ఆమెను తన ప్రియభర్తతో దూరము చేసింది, ఈ దూరం ఆమె గుండెను చీల్చివేసింది. ప్రజల ముందు అవసరాలు ఉంచడం వీపు మీద మోయలేని భారం వేసుకున్నట్లయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారుః
“విధవలు మరియు నిరుపేదల బాగుకోసం కృషిచేసేవాడు అల్లాహ్ మార్గం లో పోరాడే యోధుడితో సమానం. లేదా రాత్రంతా నమాజు, పొద్దంతా ఉపవాసం ఉన్నవారితో సమానం”. (బుఖారి 5353, ముస్లిం 2982).
బలహీనుడి పట్ల నీ కారూణ్య ప్రక్కలను చాచు. బాధలు అతడిని బలహీనతకు గురిచేశాయి. ఈ బలహీనతే అతడ్ని ఒంటరిగా చేసింది. అల్లాహ్ ఆదేశం ఇలా ఉందిః
కావున నీవు అనాథుల పట్ల కఠినంగా ప్రవర్తించకు. యాచకుణ్ణి కసురుకోకు. (జుహా 93: 9,10).
నీ భార్య, సంతానం మరియు ఇతర బంధువుల పట్ల కారూణ్య ఛాయల్ని వేసి ఉంచు. వారు ధన, జ్ఞానపరంగా ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా నీ అవసరం, వాత్సల్యం ఛాయ లేనిది ఉండలేరు. పుణ్య విత్తనం నాటువాడా గుర్తుంచుకో దాని కోత శుభపరం అయినది. ఫలాలు రుచికరమైనవి. ఆయిషా తెలిపిన ఓ సంఘటన ఎలా ఉందో గమనించు:
ఓ నిరుపేద స్త్రీ తన ఇద్దరు బిడ్డలను ఎత్తుకొని నా వద్దకు వచ్చింది. నేనామెకు మూడు ఖర్జూర పండ్లు ఇచ్చాను. ఇద్దరు కూతుళ్ళకు ఒక్కో ఖర్జూరపండు ఇచ్చి మిగిలిన ఒకటి తన నోట్లో వేసుకోబోయింది. అంతలోనే అది కూడా ఇచ్చేయమని వారు కోరారు. వెంటనే ఆమె తాను తిందామనుకున్న ఆ ఖర్జూరాన్ని రెండు ముక్కలు చేసి తలోముక్క ఇద్దరు కూతుళ్ళకిచ్చింది. అది చూసి నాకు చాలా సంతోషం కలిగింది. నేనీ విషయాన్ని ప్రవక్తకు తెలియజేశాను. దానికి ఆయన ﷺ ఇలా సమాధానం చెప్పారుః “అల్లాహ్ ఆమె చేసిన పనిని మెచ్చుకొని ఆమె కోసం స్వర్గం తప్పనిసరి చేశాడు. లేదా ఆమెకు నరకాగ్ని నుండి విముక్తి నొసంగాడు”. (ముస్లిం 2630).
బంధుత్వాల్ని కలుపుకోవడం నీపై విధిగా ఉంది. ఎందుకనగా “రహిమ్” (బంధుత్వం) అన్న అరబీ పదం “రహ్మత్” (కారూణ్యం) అన్న పదం నుండే వచ్చింది. బంధుత్వాన్ని కలుపుకుంటే, పెంచుకుంటే దాని సాఫల్య మాధుర్యం పరలోకం కంటే ముందు ఇహ లోకంలోనే నీవు చవిచూస్తావు. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః
“తన ఉపాధిలో సమృద్ధి, ఆయుష్యులో పెరుగుదల ఎవరికి ఇష్టమో వారు తన బంధువులతో సత్సంబంధాలు పెట్టుకోవాలి“. (ముస్లిం 2557, బుఖారి 2067).
అల్లాహ్ నీకు తన ప్రత్యేక దయ నొసంగి ఉంటే, గుర్తుంచుకో! నీ వద్ద పనిచేయుటకు వచ్చిన వ్యక్తి తన పరిస్థితి బాగులేక, ఆర్థిక దుస్థితి తన సంతానాన్ని శక్తిహీనంగా చేసినందుకు వచ్చాడు. అతనితో నీవు కఠినంగా ప్రవర్తించకు. అతనితో జరిగే లోపాల్ని మన్నించేసెయ్యి. అనస్ రజియల్లాహు అన్హు ప్రకారం:
“నేను పది సంవత్సరాలు ప్రవక్త ﷺ సేవలో ఉన్నాను. ఒక్కసారి ఊఁ అనలేదు. ఎందుకు చేశావు, ఎందుకు చేయలేదు అనీ అనలేదు“. (బుఖారి 6038).
ఆయిషా ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త ﷺ ఎన్నడూ తమ సేవకుణ్ణి- గానీ, భార్యనుగానీ కొట్టలేదు. కొట్టడానికి తమ చెయ్యి లేపినది కేవలం అల్లాహ్ మార్గంలో యుద్ధం చేసిన్నప్పుడే. (అహ్మద్. ఇది సహీ హదీసు).
ఇబ్ను ఉమర్ ఉల్లేఖనం ప్రకారం: ఒక వ్యక్తి ప్రవక్త ﷺ వద్దకు వచ్చి ‘ప్రవక్తా! నా సేవకుడు చెడుగా ప్రవర్తిస్తాడు, అన్యాయం చేస్తాడు. అలాంటప్పుడు నేనతడ్ని కొట్టవచ్చా?’ అని అడిగాడు. అందుకు ప్రవక్త సమాధానమిస్తూ “నీవు అతడ్ని ప్రతి రోజు డెబ్బై సార్లు మన్నిస్తూ ఉండు” అని చెప్పారు. (అహ్మద్, తిర్మిజి. ఇది సహీ హదీసు).
అహా! ఎంత విచిత్రం!! మనం మనలో ఉన్న బలహీనుల హక్కులను నెరవేర్చడంలో వెనకబడి ఉన్నాము, అయినా అల్లాహ్ తో వర్షం కొరకు దుఆ చేస్తున్నాము. ప్రవక్త ﷺ ఈ ప్రవచనాన్ని మరచిపోయామా?
“ప్రవక్త ﷺ ప్రయాణంలో నడచినప్పుడు అందరికన్నా వెనుక ఉండి బలహీనులకు ఊతమిచ్చి నడిపించేవారు. లేదా వారిని వాహనం మీద తన వెనుక కూర్చోబెట్టుకునేవారు. వారికోసం (అల్లాహ్ ను) ప్రార్థించేవారు“. (అబూ దావూద్ 2639. దీని సనద్ హసన్).
ఈ అనుచర సంఘంలో బీదవాళ్ళ, అగత్యపరుల (సహాయానికి) ఎందరో వీరులున్నారు; వారిలోని బలహీనుల పట్ల సానుభూతి చూపేవారు. వస్త్రాల్లేనివారికి వస్త్రాలు ధరించేవారు. వారిలోని అనాథలను పోషించేవారు. వారిలోని వితంతువుల పట్ల మేలు చేసేవారు.
ఈ సంఘటన ప్రజల్లో ప్రభలియుంది. అయినా నేను కూడా దాన్ని ప్రస్తావించడంలో తృప్తి, ఇతరులకు గుణపాఠం అని ఆశిస్తున్నాను. ఒక వ్యక్తి కలలో ప్రవక్త ﷺ తన వద్దకు వచ్చి “నీవు ఫలాన చోట ఫలాన బిన్ ఫలాన వద్దకు వెళ్ళి స్వర్గం శుభవార్త ఇవ్వు” అని చెప్పినట్లు విన్నాడు. ఇతను మేల్కొని, ప్రవక్త కలలో చెప్పిన వ్యక్తి పేరు ఆలోచించగలిగాడు. ఆ పేరు గల ఏ వ్యక్తి అతనికి గుర్తురాలేదు. అప్పుడు అతను స్వప్నభావం చెప్పే వ్యక్తి వద్దకు వెళ్ళాడు. ఎవరి గురించి నీవు స్వప్న చూశావు అతనికి ఈ శుభవార్త వినిపించు అని అతడు చెప్పాడు. అడుగుతూ, తెలుసుకుంటూ చివరికి అతనుండే గ్రామం తెలుసుకున్నాడు. ఆ గ్రామానికి వెళ్ళాడు. ఆ వ్యక్తి గురించి అడిగాడు. ఎవరో అతని వద్దకు తీసుకెళ్ళారు. అతడ్ని కలిశాక ‘నా వద్ద నీకో శుభవార్త ఉంది. అయితే నీవు చేసే సత్కార్యాలేమిటో చెప్పనంత వరకు నేను కూడా శుభవార్త వినిపించను అని చెప్పేశాడు. ఇతర ముస్లింలు చేసే సత్కార్యాలే చేస్తున్నాను అని అతడన్నాడు. అయితే నేను చెప్పను అని అతను చేసే సత్కార్యమేమిటో చెప్పే తీరాలని మొండిపట్టు పట్టాడు. అప్పుడు అతడు ఇలా చెప్పాడుః “వినుః నేను ఓ చిన్న పాటి పని చేసుకొని నా భార్యసంతానానికి ఖర్చు పెడుతూ ఉంటాను. ఎప్పుడైతే నా పక్కింటి మనిషి చనిపోయాడో, అతనింట్లో భార్య, పిల్లలున్నారో అప్పటి నుండి నా నెలసరి జీతంలో రెండు వంతులు చేసి ఒక వంతు నా ఇంట్లో మరో వంతు నా పొరుగువారింట్లో ఖర్చు పెడుతున్నాను. అప్పుడు ఇతను చెప్పాడుః ఇదే సత్కార్యం నిన్ను ఇంతటి గొప్ప స్థానానికి చేర్చింది. తెలుసుకో! నేను ప్రవక్త ﷺ ని కలలో చూశాను. ఆయన నీకు స్వర్గం శుభవార్త ఇచ్చాడు అని చెప్పాడు
సత్కార్యాల్లో ఓ కార్యం దానికి సరిసమానం మరో కార్యం లేదు. దాని గురించి నేను ఏ కోణం నుండి ఆరంభించి ఏ కోణంలో అంతం చేయాలో నాకే దోయడం లేదు. అదో సత్కార్యం, అల్లాహ్ తన ఏకత్వం తర్వాత దాని ఆదేశమే ఇచ్చాడు. ప్రవక్త ﷺ కూడా దాని గురించి చాలా ప్రోత్సహించారు. పండితులు, ఉపన్యాసకులు, వక్తలు దాని గురించి చాలా చెప్పారు. అల్లాహ్ ఆదేశం తర్వాత ఇక నేనేమి చెప్పగలనుః
నీ ప్రభువు ఇలా నిర్ణయం చేశాడుః మీరు కేవలం ఆయనను తప్ప మరెవ్వరినీ ఆరాధించకండి. తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించండి. ఒకవేళ మీ వద్ద వారిలో ఒకరుగాని ఇద్దరుగాని ముసలివారై ఉంటే, వారిముందు విసుగ్గా “ఛీ” అని కూడా అనకండి. వారిని కసరుకుంటూ సమాధానం ఇవ్వకండి. వారితో మర్యాదగా మాట్లాడండి. మృదుత్వమూ, దయాభావమూ కలిగి వారిముందు వినమ్రులై ఉండండి. ఇలా ప్రార్థిస్తూ ఉండండి. ప్రభూ! వారిపై కరుణ జూపు, బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో, వాత్సల్యంతో పోషించినట్లు. మీ హృదయాలలో ఉన్నది ఏమిటో మీ ప్రభువుకు బాగా తెలుసు. మీరు గనక మంచివారుగా నడుచుకుంటే తమ తప్పులను గ్రహించి దాస్యవైఖరి వైపునకు మరలివచ్చే వారందరినీ ఆయన మన్నిస్తాడు [ (బనీ ఇస్రాఈల్ 17: 23-25).
ప్రవక్త చెప్పిన తర్వాత నేను చెప్పడానికి ఏమి మిగిలి ఉంటుందిః
“వాడి ముక్కుకి మన్ను తగల! వాడి ముక్కుకి మన్ను తగల! వాడి ముక్కుకి మన్ను తగల!” అని మూడుసార్లు ప్రవక్త ﷺ శపించారు. ప్రవక్తా! వాడెవడు? అని మేమడగ్గా, “ఎవడైతే తన తల్లిదండ్రుల్లో ఇద్దరినీ లేదా ఒక్కరిని వారి వృద్ధాప్యంలో పొంది కూడా స్వర్గంలో ప్రవేశించలేక పోయాడో” అని ప్రవక్త ﷺ సమాధానమిచ్చారు. (ముస్లిం 2551).
మన ఆపద ఏమిటంటే? తల్లిదండ్రుల సేవ వృక్షం తొందరగా ఫలిస్తుందన్నది, దాని ఫలాలు అతి చేరువుగా ఉంటాయన్నది మరచిపోతాము. మనిషి ఆ ఫలాన్ని ఇహంలోనే తన కళ్ళారా చూడగలుగుతాడు. అంతకంటే గొప్పగా తన కొరకు పరంలో సమ- కూర్చబడుతుంది. అయితే ప్రాపంచిక ఉపద్రవాలు మన ఈ నమ్మకాన్ని ఎందుకు వమ్ము చేస్తున్నాయి? చివరికి మన తల్లిదండ్రుల సేవ చేయకుండా చేసేస్తున్నాయి? ఉపకారం చేయలేని, లేదా ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయలేని జీవితం అతి చెడ్డ జీవితం. తల్లిదండ్రులతో సత్ప్రవర్తన వారి పట్ల ఉపకారం కంటే విలువ గలది, సమానమైనది మరేదైనా ఉంటుందా?
అల్లాహ్ దయ తర్వాత తల్లిదండ్రుల సేవయే జీవితంలో సాఫల్య రహస్యం. అనేక ఆపదల నుండి రక్షణ. దానితో మనస్సులు తృప్తి చెందుతాయి. హృదయాలు వికసిస్తాయి. వారి సేవలో ఉండేవాడు అదృష్టాన్ని, తన ధన, ప్రాణ, సంతానంలో శుభాన్ని తన కళ్లారా చూస్తాడు.
చెవి మొగ్గి, హృదయాంతరంతో ఈ హదీసు విని మరచిపోకుండా ఉండు, అందులో ఉన్న సత్కార్యాల పట్ల మరియు వాటి ఫలం ఎలా ఉంటుందో గమనించుః
“ముగ్గురు వ్యక్తులు నడచి వెళ్తుండగా దారిలో వర్షం కురిసింది. అందుకు వారు ఒక కొండ గుహలోకి వెళ్ళారు. అంతలోనే ఒక బండరాయి గుహ ముఖద్వారం మీద వచ్చిపడింది. వారు బైటికి వెళ్ళకుండా దారి మూతపడింది. అప్పుడు వారు పరస్పరం ఇలా అనుకున్నారుః ‘అల్లాహ్ కొరకే ప్రత్యేకంగా చేసుకున్న సత్కర్మల లో ఒకదాని ఆధారంగా అల్లాహ్ తో దుఆ చేయండి. బహుశా అల్లాహ్ మన కొరకు సంది ఏర్పరుస్తాడు. అప్పుడు వారిలో ఒకడు ఇలా అన్నాడుః ఓ అల్లాహ్! నాకు తల్లిదండ్రి, భార్య పిల్లలు ఉండే వారు. నేను మేకలు కాస్తూ వారిని పోషించేవాడిని. సాయంకాలం వేళ ఇంటికి తిరిగొచ్చిన తర్వాత నేను పాలు పితికి మొట్టమొదట నా తల్లిదండ్రులకు ఇచ్చేవాడిని. పిలవాళ్ళకంటే ముందు వారికి త్రాగించేవాడిని. ఒక రోజు నేను (పశువులకు) చెట్లమేత కోసం చాలా దూరం వెళ్ళిపోయాను. ఇంటికి చేరుకునే సరికి రాత్రయింది. అప్పటికే వారు నిద్రపోయారు. ప్రతి రోజు పాలు పితికే విధంగా పితికి పాల పాత్ర తీసుకొని వారి వద్దకు వచ్చి వారి తలాపున నిలబడ్డాను. వారిని నిద్ర నుండి మేల్కొలపటం భావ్యం కాదనుకున్నాను. వారికంటే ముందు పిల్లలకు త్రాగించడం కూడా నాకు ఇష్టం అనిపించ లేదు. పిల్లలు నా కాళ్ళ దగ్గర ఆకలితో తల్లడిల్లిపోతూ ఏడ్వసాగారు. (అయినా నేను నా తల్లిదండ్రులకు నిద్రా భంగం కలిగించలేదు). వారు పడుకునే ఉన్నారు. నేను కూడా తెల్లవారే దాకా అలాగే వారి ముందు నిల్చున్నాను. అల్లాహ్! నేనీ పని కేవలం నీ ప్రసన్నత కోసం చేశాను. అది నీకూ తెలుసు. అందుచేత మా గుహలో నుంచి మేము ఆకాశాన్ని చూడ గలిగే అంత సందు చెయ్యి. అప్పుడే అల్లాహ్ ఓ సందు చేశాడు. అందులో నుండి వారు ఆకాశాన్ని చూడగలిగారు”. (ముస్లిం 2743, బుఖారి 2215). ఈ విధంగా మిగితా ఇద్దరు వారు చేసుకున్న సత్కర్మల ఆధారంగా దుఆ చేశారు. అల్లాహ్ సాన్నిధ్యం పొందగోరారు. చివరికి అల్లాహ్ వారిని ఆ ఆపద నుండి వెలికి తీశాడు. వారందరూ గుహ నుండి బైటికి వచ్చేశారు.
ఓ రకంగా మృత్యువువాత పడి జీవం పొందారు. నామరూపాల్లే- కుండా నాశనమయ్యేవారు మోక్షం పొందారు. నిశ్చయంగా ఇదీ పుణ్యఫలం. సత్కార్య సాఫల్యం.
ఇదీ పుణ్యఫలం. సత్కార్య సాఫల్యం: తల్లిదండ్రుల పట్ల విధేయతగలవాడా! నీ సత్కార్యఫలం నీవు నీ సంతానంలో చూస్తావు. వారు సుగుణవంతులై, నిన్ను ప్రేమించేవారై, వారి తల్లి పట్ల ప్రేమ వాత్సల్యంతో మెలుగుతారు. నీవు చేసుకున్న పుణ్యానికి ఫలితం నీకు ఇహంలోనూ ఉంది. పరంలోనూ ఉంది.
ఇక తల్లిదండ్రుల పట్ల అవిధేయతకు పాల్పడేవాడు -అల్లాహ్ కొరకు చెప్పండి- ఏమి సంపాదిస్తాడు? కేవలం దుర్భరమైన జీవితం, బిగుసుకుపోతున్న హృదయం, ఉపాధి విషయంలో అపశకునాలు, తన సంతానం నుండి ధూత్కారం. తల్లిదండ్రుల పట్ల కఠిన హృదయులుగా ఉండేవారు గనక అల్లాహ్ వైపునకు మరలకుంటే వారికి శాపమే పడుతుంది. తల్లిదండ్రులపై చేతులు లేపేవారు గనక అల్లాహ్ తో స్వచ్ఛమైన తౌబా చేయకుంటే వినాశనానికి గురవుతారు. కర్కశనోరు గలవారు గనక అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుకోకుంటే నాశనమయిపోతారు.
అతడ్ని వాని తల్లి ఎంతో బలహీనతకు గురి అయి పెంచి పోషించింది. తన రక్తం (పాలుగా) అతనికి త్రాగించింది. తన మాంసం, ఎముకలను (కరిగించి) అతనికి ఆహారమిచ్చింది. అతడు బలపడుతూ ఉంటే తాను బలహీనపడుతుండేది. అతడు హాయిగా నిద్రిస్తుంటే తాను మేల్కొని ఉండేది. అతనికి చిన్న ఆపద ఎదురైనా ఆమె కళ్ళకు చీకటి క్రమ్ముకున్నట్లయ్యేది. అతను చిరునవ్వితే ఆమె ముందు జీవితమంతా చిరునవ్వులనిపించేది. అతని సుఖం కోసం తాను రుచికరమైన వాటిని వదిలేసేది. రుచికరమైన ఆహారాలు, ఆనందకరమైన త్రాగుపదార్థాలు అతనికి ఇవ్వడానికి ప్రాధాన్యత ఇచ్చేదామె. అతడు చిన్నోడు గనక జోకొడుతూ ఉండేది కాని అతనిలో ఆమె పెద్ద ఆశలు చూసేది. శరీరం బలపడ్డాక, యుక్తవయస్సుకు చేరాక, నాలుక చకాచకా మాట్లడ్డం మొదలెట్టాక అతను కోరిన స్త్రీతో పెళ్ళి చేయించింది. అతని సంతోషంతో తాను సంతోషపడింది. అతనికంటే ఎక్కువ ఆనందపడింది. కాని…
ప్రియ సోదరా! టెలిఫోన్ మోగుతూ నా చెవులు గిల్లుమన్నాయి… ఇదేమిటి? బొంగురుపోయిన, ఏడుపుతో కూడిన ఓ శబ్దం వింటు- న్నాను… అస్థమ రోగి గురక లాంటి శబ్దం… హృదయవిదారక- మయిన ఏడుపు స్వరం… అది ఒక ముసలి తల్లి గొంతు, ఆమె తన కొడుకు అవిధేయత యొక్క వ్యధాభరితమైన సంఘటన నాకు ఇలా వినిపించసాగిందిః అతని తండ్రి గుండె ఆగిపోయి చనిపోయాడు. సుమారు పది సంవత్సరాల ఒక అబ్బాయి (అతని తమ్ముడు) నా వెంట ఉన్నాడు. నేను ఎన్నో దీర్ఘ కాలపు రోగాలకు గురయి ఉన్నాను. అతడు తన భార్యతో మీదంతస్తులో ఉన్నాడు. అతడు ఎప్పుడు క్రిందికి దిగి, నా దగ్గరి నుండి దాటినా నన్ను కించపరుస్తూ, అవమానపరుస్తూ, దూషించుకుంటూ వెళ్తాడు. అతని అనాథ తమ్ముడు ఎప్పుడైనా అతని కొడుకుతో కొట్లాడితే మరీ చెప్పరాని విధంగా అతని తమ్ముడ్ని కొడుతాడు. అసలే నేను ఒక రోగిని, పైగా వృద్ధురాలిని నేనెలా ఎదుర్కోగలుగుతాను. అంతే కాదు; తన రెండు చేతులతో తన తమ్ముడ్ని పట్టుకుంటాడు. అతని కొడుకు కాళ్ళు, చేతులతో మనస్సు తీరా అలసిపోయేంత వరకు కొడుతాడు. ఇలా తన తమ్ముని పట్ల సౌభ్రాత్రం, జాలి, దయ చూపే బదులు దౌర్భాగ్య, నిర్భంధ, దుర్భర స్థితి రుచి చూపిస్తూ వదలుతున్నాడు. అంతే కాదు ఒక్కోసారి నన్ను చూడవద్దని తన ముఖం కప్పుకుంటూ వెళ్తాడు. కఠోరంగా ‘నీవు నా తల్లే కావు’ అని అంటాడు. ఈ మాట వెనకే ఎలాంటి పదాలు వెళ్తాయంటే… ఎవరి మనస్సులోనైనా కనీస కారుణ్యం, కటాక్షం ఉన్నా అనలేడు. ఇంకా వాడు ఇలా చేస్తాడు, అలా చేస్తాడు…
ఇలాంటి వ్యదాభరితమైన మాటలు మన సురక్షిత సమాజం లో వింటానని నేనెప్పుడూ అనుకోలేదు. కాని చాలా అరుదు, మరియు దౌర్భాగ్యం అంతే… బహుశా అతడు తన అలక్ష్యం నుండి మేల్కొంటాడు అని ఆమెకు నచ్చజెప్పగలిగాను. వెంటనే అందిః వద్దు, వద్దు, మీరు మాట్లాడకండి, నన్ను అతడి తమ్మున్ని మరింత బాధ పెడతాడేమోనని భయం అనిపిస్తుంది. అతని ముందు, అతని బలం, శక్తి ముందు నాదేం నడుస్తుంది. అప్పుడు నేను చెప్పానుః అయితే అతని గురించి కోర్టులో కేసు పెడతాను. ఇది విన్న వెంటనే గొంతెత్తుకుంటూ ఇలా అనసాగిందిః ‘కేసా!! నా కంటి చలువను గురించి నేను ఫిర్యాదు చేయాలా? నా చేతులతో పెంచినవాని మీద కేసు పెట్టాలా? నేను అతనికి పాలు పట్టలేదా? అతడు నా ప్రియకుమారుడు, అతడు నా జీవితపు చివరి ఆశ, అతనికి ఏదైనా అవమానం జరుగుతే నాకిష్టమేనా? నేను అతని సమస్య కరుణామయుడు, కృపాసాగరుని ముందు పెడతాను. ఆయనే అతనికి సన్మార్గం చూపుతాడు, అతని పరిస్థితి బాగుజేస్తాడు.
అప్పుడు నాకర్థమయింది; ఇదో గాయపడిన దీర్ఘ నిశ్వాసము. (ఎవరికైనా చెప్పుకొని) ఊపిరాడుటకు, భారం దించుకొనుటకు ఓ ప్రయత్నం ఆమె చేసింది.
లాఇలాహ ఇల్లల్లాహ్!! తల్లి గుండె ఎంతైనా ప్రేమ, కరుణతో నిండి ఉన్న గుండె. జాలి హృదయం.
ప్రియులారా! ఆ తర్వాత తెలిసింది; అతడు చాలా దుస్థితికి గురయ్యాడు, అతని నరాలు బిగుసుకుపోయేవి అని. అవును ఇందులో ఏలాంటి ఆశ్చర్యం లేదు. అతడు ఆనందకరమైన సత్కార్య తోట (తల్లిదండ్రుల విధేయత) దారి నుండి తప్పిపోయాడు. దానికి బదులుగా దౌర్భాగ్య యడారి అవిధేయత మైదానాన్ని కోరి ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు (అందులో కొట్టుమిట్టాడుతున్నాడు).
మనం ఇతరులతో గుణపాఠం నేర్చుకోవాలి. ఇతురలతో గుణ పాఠం నేర్చుకున్న వాడే భాగ్యవంతుడు.
ఈ తోట దారి చాలా పొడుగ్గా మరియు కష్టాలతో కూడి ఉంది. అయినా అందులో ఓ అలంకరణ, అందం ఉంది. దాని దూరం అలసట, ఆయాసానికి గురి చేస్తుంది. కాని దాని పర్యవసానం చాలా మంచిది, ప్రశంసనీయమైనది. సంతానం పచ్చని చిన్న చిన్న మొక్కల లాంటి వారు, వాటికి నీవు సద్వర్తన అనే నీటితో సాగు చేసి ఉంటే. అందమైన పూలు, వారికి నీవు మంచి శిక్షణ ఇచ్చి ఉంటే. మెరుస్తున్న ఇళ్ళు, విశ్వాస కాంతితో ప్రకాశించి ఉంటే. వారి శిక్షణ మార్గంలో ఓపిక వహించు, అప్పుడు నీవు నీ కళ్ళకు చలువగల, నీ మనస్సును సంతోషపెట్టే సమయం చూస్తావు. వారి ఒక్కసారి సాఫల్యం నీవు అనేక సార్లు భరించిన కష్టాల్ని మరిపిస్తుంది. వారి ఒక సంవత్సరపు విజయం నీవు సంవత్సరాల తరబడి చేసిన జాగారాలను మరిపిస్తుంది. వారి చిన్నతనంలో వారి గురించి నీవు కొంత శ్రమపడడం, వారు పెరిగిన తర్వాత మంచి అదృష్ట ఫలాన్నిస్తుంది. వారి దైనందిక స్కూల్ పాఠాలు (హోంవర్కులు), వారి శిక్షణ, వారి ఆరోగ్యం అన్నిట్లో నీవు శ్రద్ధ చూపు. నీవు నీ హృదయం, దేహంతో వారితో ఉండు. ఏదైనా కారణం వల్ల నీ అస్థిత్వంతో నీవు వారితో ఉండలేకపోతే కనీసం నీ మనస్సు, దుఆలతో. వారు నీ మెడలో న్యాసం అన్న విషయం తెలుసుకో. వారి పట్ల ఏలాంటి అశ్రద్ధ పాటించకు. ప్రవక్త ఆదేశాన్ని గమనించుః
“మీలో ప్రతి ఒక్కడు బాధ్యుడు, అతని బాధ్యతలో ఉన్నదాని గురించి అతనితో ప్రశ్నింపబడును“. (బుఖారి).
కొన్ని సంవత్సరాల సంరక్షణ మరియు శ్రద్ధతో పుష్పవంతమైన, ఫలవంతమైన జీవితం లభిస్తుంది. కొన్నేళ్ళు నీవు సహనం వహించావంటే దాని ఫలితంగా వారు నీ ముందుకు వచ్చినప్పటికీ లోకమంత ఆనందంతో నిండిపోయినట్లు నీవు చూస్తావు. అప్పటికీ వారిలో ఒకడు ఇంజనీరింగ్ లో నైపుణ్యుడయి ఉంటాడు. లేదా గొప్ప డాక్టర్ అయి ఉంటాడు. లేదా ఏదైనా పనిలో మంచి నేర్పు గలవాడు (లేదా మ్యానుఫాక్చరర్ గా) అయి ఉంటాడు. లేదా ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడవుతాడు. లేదా సౌభాగ్యవంతుడైన బోధకుడవుతాడు. వీటన్నిటితో పాటు వారు నీ పట్ల మేలు చేస్తూ ఉంటారు. మరీ నీవు వారి సంస్కారం మరియు ధర్మనిష్ఠతతో సంతోషపడుతూ ఉంటావు. ఇంతకంటే ఐహిక అలంకారం ఇంకేమి కావాలి. ఇది రహ్మాన్ దాసుల దుఆల ఫలితం:
వారు ఇలా ప్రార్థిస్తూ ఉంటారుః మా ప్రభూ! మాకు మా భార్యల ద్వారానూ మా సంతానం ద్వారానూ కన్నుల చల్లదనాన్ని ప్రసాదించు, మమ్మల్ని భయభక్తులు కలవారికి ఇమాములుగా చేయు. (ఫుర్ఖాన్ 25: 74).
మంచి శిక్షణ తోట ద్వారా నీవు ఏరుకునే ఫలం ఇంతే కాదు; నీవు చనిపోయిన తర్వాత నీ సంతానం దుఆలు కూడా నీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః
“మనిషి చనిపోయినప్పుడు అతని ఆచరణలు అంతమవుతాయి. కాని మూడు రకాల ఆచరణలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. (1) సదఖ జారియ (సుదీర్ఘ కాలం వరకు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే సత్కార్యం) (2) ప్రయోజనకరమయిన విద్యాజ్ఞానం. (3) అతనికై ప్రార్థించే ఉత్తమ సంతానం. (ముస్లిం).
దాని ఫలం అల్లాహ్ దయతో స్వర్గంలో ఉన్నత స్థానం రూపం లో కూడా నీకు ప్రాప్తమవుతుంది. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః
“అల్లాహ్ స్వర్గంలో పుణ్యపురుషునికి ఒక స్థానం పెంచుతాడు. అతడంటాడుః ప్రభూ! ఏ కారణంగా నాకిది ప్రాప్తమయింది? అప్పుడు అల్లాహ్ అంటాడుః నీ సంతానం నీ పాపాల క్షమాభిక్ష కోరుతున్నందు వల్ల“. (అహ్మద్, దీని సనద్ హసన్).
శిక్షణ శిబిరం దాని ఛాయ ఎంత అందమైనది! ! అందుకే మంచి కృషి చేస్తూ దానిపై నిలకడగా ఉండు. అప్పుడే నీవు అందమైన ఫలాలు పొందగలుగుతావు.
మంచి విషయం నిమిత్తం సిఫారసు చేసేవానికి అందులో భాగం లభిస్తుంది. (నిసా 4: 85).
ఇది అల్లాహ్ యొక్క వాగ్దానం; నీవు చేసే మంచి సిఫారసుకు బదులుగా ఓ వాట మేలు నీకు లభిస్తుంది. ఇంకా నీవు చేసిన సిఫారసు యొక్క పుణ్యం అదనంగా ఉంటుంది. తన సోదరుల పట్ల ప్రేమ కలిగి ఉన్నవ్వక్తికి ఇవి అల్లాహ్ వాగ్దానాలు. అతను ఈ ప్రేమకు ప్రతీకగా చురుకతనంతో తన శక్తానుసారం తన పరపతి, మాట ద్వారా వారి అవసరాలు పూర్తి చేస్తాడు. సహీ హదీసులో ప్రవక్త ﷺ ఇలా ప్రవచించినట్లు ఉందిః
“విశ్వాసులు పరస్పరం కట్టడంలా రూపొందాలి; అందులోని ఒక ఇటుక మరో ఇటుకతో కలసి బలపడినట్లు. మళ్ళీ ప్రవక్త ﷺ తమ ఒక చేతి వ్రేళ్ళను మరో చేతి వ్రేళ్ళలో జొప్పించి కలిపి చూపించారు. ఈ విషయం చెబుతున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చుండి ఉన్నారు. అప్పుడే ఒక వ్యక్తి ఏదో ప్రశ్నిస్తూ లేదా ఏదో అవసరం గురించి అడుగుతూ వచ్చాడు. అది విన్న ప్రవక్త ﷺ వెంటనే మా వైపు తిరిగి “సిఫారసు చేయండి పుణ్యం పొందండి, అల్లాహ్ తలచుకుంటే తన ప్రవక్త నోట వెలవడిన మాటను పూర్తి చేస్తాడు” అని అన్నారు. (బుఖారి 6028, ముస్లిం 2585, 2627).
ప్రియ సోదరా! నీ సిఫారసు అంగీకరింపబడకపోయిన, లేదా నీ కోరిక పూర్తి కాకపోయినా నీవు చేసిన సిఫారసుకు బదులుగా నీకు పుణ్యం లభించుట సరిపోదా?. ఇందులో నీకు ఆదర్శం ప్రియ ప్రవక్త ﷺ. ఆయన సిఫారసు చేశారు, అయినా అది అంగీకరింప బడలేదు. ఇబ్ను అబ్బాస్ ఉల్లేఖనం ప్రకారం: బరీర అను ఒక స్త్రీ యొక్క భర్త బానిసగా ఉండేవాడు. అతని పేరుః ముఘీస్ . అతను తన భార్య బరీరా వెనక వెనకనే తిరుగుతూ ఉండేవాడు. ఆమె కూడా బానిసగా ఉండినది. అయితే ఆమెకు విముక్తి ఇవ్వ బడింది. కాని అతడికి విముక్తి లభించలేదు. అందుకు ఆమె అతని వివాహ బంధం నుండి విడిపోదామని నిర్ణయించింది. (కాని అతనికి బరీరా అంటే ఎనలేని ప్రేమ). అందుకు అతను చాలా ఏడుస్తూ ఉండేవాడు. అతని అశ్రువులు గడ్డం మీద పారుతూ ఉండేవి. అప్పుడు ప్రవక్త ﷺ అబ్బాస్ తో ఇలా చెప్పారుః
“బరీరా పట్ల ముఘీస్ ప్రేమ మరియు ముఘీస్ పట్ల బరీరా ద్వేషాల్ని చూస్తే విచిత్రం అనిపించడం లేదా?” (ఆ సందర్భంలో) ప్రవక్త బరీరాతో చెప్పారుః “నీవు తిరిగి ముఘీస్ తో ఉంటే బావుంటుంది” అని. అప్పుడు బరీరా అడిగిందిః ప్రవక్తా! మీరు ఆదేశిస్తున్నారా? అని. అందుకు ప్రవక్త చెప్పారుః “లేదు, నేను సిఫారసు చేస్తున్నాను”. “నాకు అతని అవసరం లేదు” అని బరీరా నిక్కచ్చిగా చెప్పేసింది. (బుఖారి 5283).
అనుభవం చేసి చూడు; ప్రజల్లో ఎవరికైనా అతని ఓ అవసరం లో సిఫారసు చేయి. నీ సోదరుడ్ని సంతోష పెట్టిన సత్కార్యం నీ గుండెను ఎలా చల్లబరుచుతుందో, అతని దుఆ వల్ల నీ హృదయానికి ఎంత సంతోషం కలుగుతుందో తెలుస్తుంది. అది క్షణం పాటు శ్రమ కావచ్చు కాని దీర్ఘ కాల సంతోషాన్ని తెస్తుంది. ఓ గడియ సమయం వెచ్చించుటయే కావచ్చు కాని సుఖుసంతోష జీవితానికి కారణం అవుతుంది.
విశ్వాసులు పరస్పరం సోదరులు. కనుక మీ సోదరుల మధ్య సంబంధాలను సంస్కరించండి. అల్లాహ్ కు భయపడండి, మీపై దయచూపటం జరగవచ్చు. (హుజురాత్ 49: 10).
సోదరా! మంచి మనస్సులు అనైక్యత, భిన్నత్వం అంటే సహించవు, ఇష్టపడవు. అవి స్వచ్ఛత, పవిత్రతను ఇష్టపడని నైర్మల్యానికి దూరంగా కలుషితమైన సమాజంలో అవి దాన్ని లెక్కిస్తాయి. అందుకే అవి (మంచి మనస్సులు) పవిత్ర ఛాయలోనే నీడ వెతుకుతూ ఉంటాయి. సౌభ్రాతృత్వంతో వీచే గాలితోనే ప్రీతి చెందుతాయి. ప్రేమ పచ్చిక మరియు అనురాగ పుష్పాల మధ్యే తృప్తి చెందుతాయి. అందుకే ప్రేమంగా ఉండేవారి మధ్య ద్వేషాల తుఫాను గాలి వీస్తున్నప్పుడు మంచి మనస్సుగలవాడు తృప్తిగా ఉండలేని విషయం నీవు చూస్తావు. అప్పుడు అతడు శాంతిపావురం మాదిరిగా తహతహలాడుతూ హృదయాల్లో ప్రేమ, మనస్సులో నైర్మల్యం తిరిగి రానంత వరకు నిద్రపోడు. పరస్పరం సత్సంబంధాలు లేని వారి మధ్య రాజీ కుదిర్చే వ్యక్తి ఎంత చల్వ హృదయుడు. ఈ శ్రేయోభిలాషిది ఎంత మంచి మనస్సు.
ఈ తోట ఫలం అల్లాహ్ సంతృష్టితో పాటు గొప్ప పుణ్యం కూడాను.
ప్రజలు జరిపే రహస్య సమాలోచనలలో సాధారణంగా ఏ మేలూ ఉండదు. కాని ఎవరైనా రహస్యంగా దానధర్మాలు చెయ్యండి అని బోధిస్తే లేక ఏదైనా సత్కార్యం కొరకు లేదా ప్రజల వ్యవహారాలను చక్కబరిచే ఉద్దేశ్యంతో ఎవరితోనైనా ఏదైనా రహస్యం చెబితే అది మంచి విషయమే. ఎవరైనా అల్లాహ్ సంతోషం కొరకు ఈ విధంగా చేస్తే వారికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము. (నిసా 4: 114).
నీ సోదరుల మధ్య రాజీ కుదిర్చే పని దుఆతో ఆరంభించు. ఇలా దుఆ చెయిః అల్లాహ్ ఈ మేలు కొరకు వారి హృదయాలను తెరువుగాక! అల్లాహ్ ఇలా అంటున్నాడుః [وَالصُّلْحُ خَيْر] ]రాజీ కుదుర్చడంలోనే ఎంతో మేలుంది[.
వేరు వేరు దృక్పథాల్ని దగ్గర చేసే, విభేదాల కారణాల్ని తక్కువ చేసే ప్రయత్నం చేయి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలుగజేయి. ప్రతి ఒక్కరికి రెండోవాడు అతనితో చాలా గాఢంగా ప్రేమిస్తున్నాడని, అతనిలో నీ మీద ఏలాంటి ద్వేషం, కపటం లేదని తెలియజేయి. ఇందులో నీకు కొంత అబద్ధం చెప్పవలసి వచ్చినా పరవాలేదు. (ఈ అబద్ధం అనుమతి కేవలం రాజీ కుదర్చడానికే సుమా, మరే దానికి కాదు). ప్రవక్త ﷺ ఇలా ఆదేశించారుః
“ప్రజల మధ్య సంబంధాలను చక్కదిద్దే ఉద్దేశ్యంతో ఒకరి సద్గుణాలు మరొకరి ముందు వ్యక్తపరిచేవాడు లేదా ఒకిర్ని గురించి ఏదైనా మంచి విషయాన్ని మరొకరి ముందు వెలిబుచ్చేవాడు అబద్ధాలకోరు కాజాలడు”. (బుఖారి 2692, ముస్లిం 2605).
సోదరుల మధ్య సంధి కుదర్చడం కూడా ఓ సత్కార్యమే. అందుకు ఈ పని చేస్తూ పుణ్యాన్ని ఆశించడం మరచిపోకు. అదే సద్భాగ్య రహస్యం. సంధి కుదుర్చడానికి తాళంచెవి లాంటిది. స్వీకృతికి సబబు. ప్రవక్త ﷺ ఇలా ఆదేశించారుః
అల్లాహ్ సాక్షిగా ఇంతకంటే అందమైన తోట మరొకటి ఉండదు; రకరకాల ఫలాలు, ప్రభావితం చేసే పుష్పాలు, ఈ తోట దర్శనానికి వచ్చిన వాడు అలసిపోడు, దాని చెలమలు అంతం కావు. దాని ఛాయ ఎడతెగనిది. దాని ఊటలు లెక్కలేనివి. అందులో తన హృదయం, నోరు మరి ఆలోచనలతో పనితీసుకునువాడే విజయ వంతుడు. తేనెటీగ మాదిరిగా; అది విసుగు, అలసట అంటే తెలియదు. రకారకాల రసాన్ని పీల్చుకుంటూ తేనె తయారు చేస్తుంది. ఈ (ప్రచార, శిక్షణ) తోటలో పని చేసేవాడు ప్రతిఫలం పొందుతాడు. దాని కోతకు సిద్ధమయ్యేవాడు లాభం మరియు సంతోషం పొందుతాడు.
ఒక మంచి మాట ద్వారా నీవు బోధన ఆరంభించు. ఎందుకనగా మంచి మాట ఒక సదకా (సత్కార్యం). ఒక చిరునవ్వు ద్వారా ప్రచారం ఆరంభించు. నీ తోటి సోదరునితో నీవు మందహాసముతో మాట్లాడడం కూడా సత్కార్యం. నీ ఉత్తమ నడవడిక ద్వారా నీవు ప్రచారకుడివయిపో. నీవు నీ ధనంతో ప్రజల్ని ఆకట్టుకోలేవు. నీ సద్వర్తనతో ఆకట్టుకోగలుగుతావు.
సోదరా! ప్రవక్తగారి ఒక వచనం అయినా సరే ఇతరుల వరకు చేరవేయి. నీ ప్రేమికుల గుండెల్లో ప్రవక్తి గారి ఒక సంప్రదాయ ప్రేమను కలిగించు. వారి హృదయాలను వారి ప్రభువు విధేయతతో అలంకరించు. వివేకము మరియు మంచి ఉపదేశం ద్వారా వారిని పిలువు. దూరం చేసే మాటలు, కఠోర పద్ధతి విడనాడు.
(ప్రవక్తా!) అల్లాహ్ యొక్క అనంత కరుణ వల్లనే నీవు వారిపట్ల మృదు స్వభావుడవు అయ్యావు. నీవే గనక కర్కశుడవు కఠిన హృదయుడవు అయినట్లయితే వారందరూ నీ చుట్టు పక్కల నుండి దూరంగా పోయేవారు. (ఆలి ఇమ్రాన్ 3: 159).
నీ పట్ల తప్పు చేసిన వాడిని క్షమించి పిలుపునిచ్చావని ఆశించు. పాపంలో మునిగి ఉన్న నీ సోదరునికి సహాయం చేసి నీ చేత అతని సన్మార్గానికి మార్గం సుగమం చేయి. రుజుమార్గం నుండి దూరమైన ప్రతి ఒక్కరి పట్ల వాత్సల్య కాంతి ద్వారా నీ కళ్ళను ప్రకాశవంతం చేసుకో చివిరికి నీవు ఎవరెవరి కోసం సన్మార్గం కోరుతున్నావో వారికి ఈ కాంతి లభిస్తుంది.
నీ పొరుగువానికి ఒక క్యాసెట్ బహుకరించి, లేదా నీ మిత్రునికి ఓ పుస్తకం పంపి, ఇస్లాం వైపు స్వచ్ఛముగా పిలిచి అల్లాహ్ అతనికి సధ్బాగ్యం ప్రసాదించుగాక అని ఆశిస్తూ కూడా నీవు ప్రచారకునివి కావచ్చు.
నీకు ప్రసాదించబడిన సర్వ శక్తులను, ఉపాయాలను ఉపయోగించి ప్రచారకునివి కావచ్చు. నీవు కాలు మోపిన ప్రతి చోట శుభం కలగజేసేవానివిగా అయిపో. అడ్డంకులుంటాయని భ్రమ పడకు. చిన్నవాటిని మహా పెద్దగా భావించి (భయం చెందకు). విద్యావంతులు, గొప్ప ప్రచారకులతో సంప్రదించి నీ ప్రచారం ఆరభించు. ఇలా నీ ప్రచారం పరిపూర్ణజ్ఞానం మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది.
నీ ప్రభువు మార్గం వైపునకు పిలువు, వివేకంతో, చక్కని హితబోధతో. ఉత్తమోత్తమ రీతిలో వారితో వాదించు. నీ ప్రభువుకే బాగా తెలుసు; ఆయన మార్గం నుండి తప్పిపోయినవాడు ఎవడో, రుజు మార్గంపై ఉన్నవాడూ ఎవడో (నహ్ల్ 16: 125).
స్పష్టమైన రీతిలో సందేశాన్ని అందజేయడమే మా బాధ్యత. (యాసీన్ 36: 17). హృదయాలకు మార్గం చూపే బాధ్యత, తాలాలు పడి ఉన్నవాటిలో తాను కోరేవారివి విప్పే బాధ్యత కూడా అల్లాహ్ దే.
ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం. దీని ద్వారా ఆయన తాను కోరిన వారిని సత్యమార్గంపైకి తీసుకువస్తాడు. స్వయంగా అల్లాహ్ మార్గం చూపనివాడికి, మరొక మార్గదర్శకుడు ఎవ్వడూ లేడు (జుమర్ 39: 23).
నీ ప్రచారం ఫలించినది, దాని ఫలితంగా పండిన ఫలాలు చూసి సంతోషపడు. నీవు పొందే ప్రతి విజయాన్ని నీ కొరకు వేచి చూస్తున్న, నీ అడుగులు పడటానికి ఎదురుచూస్తున్న మరో విజయానికి మెట్టుగా ఉంచి ముందుకెదుగు.
ప్రవక్త ﷺ తమ జాతి వారి సన్మార్గంతో ఎంత సంతోషించారు? కాదు, అనారోగ్య యూదుని పిల్లవాని సన్మార్గంతో ప్రవక్త ﷺ చాలా సంతోషించారు. ఆ సంఘటనను అనస్ ఇలా ఉల్లేఖించారుః
ఒక యూద బాలుడు ప్రవక్త సేవ చేస్తూ ఉండేవాడు. ఒకసారి అతని ఆరోగ్యం చెడిపోయింది. అతడ్ని పరామర్శించడానికి ప్రవక్త ﷺ వచ్చి, అతని తలాపున కూర్చున్నారు. కొంతసేపటికి “నీవు ఇస్లాం స్వీకరించు” అని అతనితో అన్నారు. అప్పుడు అతడు అక్కడే ఉన్న తన తండ్రి వైపు చూశాడు. దానికి అతను నీవు అబుల్ ఖాసిం ﷺ (అంటే ప్రవక్త) మాటను అనుసరించు అని అన్నాడు. అప్పుడు ఆ బాలుడు ఇస్లాం స్వీకరించాడు. (ఆ తర్వాత కొంత సేపటికి ఆ బాలుడు చనిపోయాడు. అప్పుడు ప్రవక్త) అల్ హందులిల్లాహ్! అల్లాహ్ ఇతడిని నరకం నుండి కాపాడాడు అన్నారు. (బుఖారి 1356).
తలతలలాడే ప్రవక్త మాటలను శ్రద్ధగా విను, అతిఉత్తమ, అతిఉన్నతమైన ప్రచారకులు (అంటే ప్రవక్త) తాను తయ్యారు చేసిన ప్రచారకుల్లో చిత్తశుద్ధిగల ఒకరైనా అలీ బిన్ అబీ తాలిబ్ కు కైబర్ రోజున ఇలా చెప్పారుః
“వారిని ఇస్లాం వైపునకు పిలువు. వారిపై విధిగా ఉన్న విషయాల్ని వారికి తెలియజేయి. అల్లాహ్ సాక్షిగా! నీ ద్వారా ఒక్క మనిషికి కూడా సన్మార్గం ప్రాప్తమయ్యిందంటే అది నీకు మేలు జాతికి చెందిన ఎర్ర ఒంటెల కంటే ఎంతో ఉత్తమం“. (బుఖారి 2942).
ప్రచార కార్యం ద్వారా లేదా ఎవరికైనా ఒక ధర్మ విషయం నేర్పడం ద్వారా నీవెన్ని పుణ్యాలు పొందుతావు లెక్కించలేవు. నీవు ఇచ్చిన పిలుపు ప్రకారం ఆచరించే వారు, నీవు నేర్పిన విద్యకు క్రియరూపం ఇచ్చేవారు ఎంతమంది ఉంటారో అంతే పుణ్యం నీకు లభిస్తుంది. వారి పుణ్యాల్లో ఏలాంటి కొరత జరగదు. అల్లాహ్ గొప్ప దయగలవాడు.
ప్రచార కార్యం నీ నుండి, నీ ఇల్లాలు పిల్లలతో, నీ దగ్గరివారితో ఆరంభం చేయి. బహుశా అల్లాహ్ నీ శ్రమలో శుభం కలుగు జేయుగాక. నీ సత్కా- ర్యాన్ని అంగీకరించుగాక. ఆయన చాలా దాతృత్వ, ఉదార గుణం గలవాడు.
అల్లాహ్ వైపు పిలుపుకు సంబంధించిన ఓ సత్కార్య సంఘటన శ్రద్ధగా చదువు. ఎవరితో ఈ సంఘటన జరిగిందో స్వయంగా అతడే చెప్పాడు. అతను ఇటాలీ దేశానికి సంబంధించిన అల్ బర్తో ఓ. పచ్చీని (Alberto O. Pacini): నాకు సత్య ధర్మం వైపునకు సన్మార్గం చూపిన అల్లాహ్ కే అనేకానేక స్తోత్రములు. అంతకు మునుపు నేను నాస్తికునిగా, విలాసవంతమైన జీవితం గడుపుతూ మనోవాంఛల పూజ చేసేవాడిని. జీవితం అంటే డబ్బు, పైసా అని. సంపాదనే పరమార్థం అని భావిస్తూ ఉండేవాడిని. ఆకాశ ధర్మాలన్నిటితో విసుగెత్తి పోయి ఉంటిని. ప్రథమ స్థానంలో ఇస్లామే ఉండినది. ఎందుకనగా మా సమాజంలో దానిని చరిత్రలోనే అతి చెడ్డ ధర్మంగా చిత్రీకరిస్తున్నారు. ముస్లిములు అంటే మా మధిలో విగ్రహాలను పూజించేవారు, సహజీవన చేయలేనివారు, ఏదో కొన్ని అగోచరాలను నమ్ముతూ వాటి ద్వారానే తమ సమస్యల పరిష్కారాన్ని కోరువారు. రక్తపిపాసులు, గర్వులు, కపటులు మరియు ఇతరులతో ప్రేమపూర్వకమైన వాతవరణంలో జీవితం గడిపే గుణం లేనివారు అని అనుకునేవాడిని.
ఇస్లాంకు వ్యతిరేకమైన ఈ వాతావరణంలో నేను పెరిగాను. కాని అల్లాహ్ నా కొరకు మార్గదర్శకత్వం వ్రాసాడు, అది కూడా సంపాదన కొరకై ఇటాలీ వలస వచ్చిన ఓ ముస్లిం యువకుని ద్వారా. ఏ ఉద్దేశ్యం లేకుండానే నేను అతడిని కలిశాను. ఒక రాత్రి నేను చాలా సేపటి వరకు ఒక బార్ లో రాత్రి గడిపి తిరిగి వస్తున్నాను. మత్తు కారణంగా పూర్తి స్పృహ తప్పి ఉన్నాను. రోడ్ మీద నడుస్తూ వస్తున్నాను నాకు ఏదీ తెలియకుండా ఉంది పరిస్థితి. అకస్మాత్తుగా వేగంగా వస్తున్న ఓ కార్ నన్ను ఢీకొంది. నేలకు ఒరిగాను. నా రక్తంలోనే తేలాడుతుండగా, అప్పుడే ఆ ముస్లిం యువకుడు తారసపడి నా తొలి చికిత్సకు ప్రయత్నం చేశాడు. పోలీస్ కు ఖబరు ఇచ్చాడు. నేను కోలుకునే వరకు నన్ను చూసుకుంటూ నా సేవలో ఉన్నాడు. ఇదంతా నాకు చేసిన వ్యక్తి ఒక ముస్లిం అని నేను నమ్మలేక పోయాను. అప్పుడు నేను అతనికి దగ్గరయ్యాను. అతని ధర్మం యొక్క మూల విషయాలు తెలుపమని కోరాను. దేని గురించి ఆదేశిస్తుంది, దేని గురించి నివారిస్తుందో చెప్పుమన్నాను. అలాగే ఇతర మతాల గురించి నీ ధర్మ అభిప్రాయమేమిటి? ఈ విధంగా ఇస్లాం గురించి తెలుసుకొని, ఆ యువకుని సద్పర్తన వల్ల అతనితో ఉండసాగాను. చివరికి పూర్తి నమ్మకం కలిగింది; నేను అజ్ఞానంలో ఉండి నా ముఖంపై దుమ్ము రాసుకుంటుంటినీ అని, ఇస్లామే సత్యధర్మమని. వాస్తవానికి అల్లాహ్ చెప్పింది నిజమేననిః
ఎవడైనా ఈ విధేయతా విధానాన్ని (ఇస్లాం) కాక మరొక మార్గాన్ని అవలంబించదలిస్తే, ఆ మార్గం ఎంతమాత్రం ఆమోదించ బడదు. అతడు పరలోకంలో విఫలుడౌతాడు, నష్టపోతాడు. (ఆలి ఇమ్రాన్ 3: 85). అప్పుడు నేను ఇస్లాం స్వీకరించాను.
కేవలం అల్లాహ్ సంతృష్టి కొరకు ఇందులో ఓ పాలు పంచుకున్నవారికి రెండింతల పంట, అంటే నీవు ఒక్క రోజులో రెండు ఉపవాసాలు ఉంటున్నావన్నమాట. అది ధర్మసంపద నుండి కొంత ఖర్చు పెట్టినంత మాత్రనా. దట్టమైన తోటల ఛాయలో నీవు ఛాయ పొందుతావు. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః
“ఎవరు ఉపవాసమున్నవారికి ఇఫ్తార్ చేయిస్తారో అతనికి ఉపవాసమున్న వారంత పుణ్యం లభించును. ఉపవాసమున్నవారి పుణ్యంలో ఏ కొరత జరగదు“. (తిర్మిజి 807. ఈ హదీసు హసన్ మరియు సహీ అని ఇమాం తిర్మిజి స్వయంగా చెప్పారు).
ఈ రోజుల్లో -అల్లాహ్ దయతో- కొన్ని స్వచ్ఛంద సేవ సంస్థలు ఎన్నో చోట్ల ఈ ఆరాధనను చాలా సులభమైనదిగా చేస్తున్నారు. కొన్ని (ఇఫ్తార్ చేయించే) మార్గాలు చూపిస్తారు. నీవు నీ కొంత సంపదతో అందులో పాల్గొనవచ్చు. వాస్తవానికి ఇది అగత్య పరులపై అల్లాహ్ కరుణ మరియు ఉపకారం చేసేవారికై రెట్టింపు పుణ్యాలకు మంచి దారి.
నీవు స్వయంగా ఈ దృశ్యాలు చూసి ఉంటావు. మస్జిదు ఆవరణలో మంచి మంచి ఆహారపదార్థాలతో విస్తరి వేయబడి ఉంటుంది. దాని చుట్టు దేశ, విదేశ బీద ముస్లింలు ఎంతో ప్రేమ, సంతోషంతో కూర్చుండి ఉంటారు. శ్రీమంతులు, ధనవంతులు స్వయంగా వారి సేవలో ఉండటాన్ని చూసి నీ నర నరాల్లో విశ్వాసం జీర్ణించుకుపోతుంది. వారు (శ్రీమంతులు) వారి(ఇఫ్తార్ చేయువారి)కి చన్నీళ్ళు, వేడి వేడి జిలేబీలు, ఇతర తీపి పదార్థాలు అందిస్తూ ఉంటారు. సౌభ్రాత్వం, ప్రేమతో కూడిన చిరునవ్వు దాని మాధుర్యాన్ని మరింత పెంచుతుంది. ఇది ఓ చెప్పరాని విశ్వాసం. ఇది నిన్ను నీ ధర్మంపై గౌరవంగా ఉండే విధంగా చేస్తుంది. ఈ ధర్మమే ధనవంతుడిని పేదవాని పెదవుపై చిరునవ్వు తెప్పించే వానిగా చేస్తుంది. అంతే కాదు ధనవంతుడు స్వయంగా పేదలను వెతికి వారు సంతోషపడే వరకు వారికి ఇస్తూ ఉండే విధంగా చేస్తుంది.
వాస్తవానికి నేను ఆ సౌభ్రాత్రుత్వ దృశ్యాన్ని మరవలేను. నా కళ్ళార నేను చూశాను (ఇఫ్తార్ సందర్భంలో) ఒక యజమాని తన చేతిలో ముద్ద తీసుకొని తన పనిమనిషి నోటిలో పెట్ట బోయాడు. ఆ పనిమనిషి సిగ్గుపడి తాను కూర్చున్న స్థలాన్ని వదలి పరిగెత్తాడు. యజమాని అతని వెంట పరుగిడుతూ చివరికి అతని నోట్లో ముద్ద పెట్టాడు. ఇది ఏదో ఒక నూతన సంఘటన కాదు. ప్రవక్త ﷺ ప్రవచనానికి ఆచరణ రూపం.
“మీలో ఎవరి దగ్గరికైనా అతని సేవకుడు భోజనం తీసుకువస్తే, అతను సేవకుడ్ని తనతో పాటు భోజనానికి కూర్చోబెట్టుకోలేని స్థితిలో ఉంటే అందులో నుంచి ఒక రెండు ముద్దలయినా అతనికి తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే అతను అన్నం వండే శ్రమ భరించాడు”. (బుఖారి 2557, ముస్లిం 1663).
ప్రియసోదరా! అల్లాహ్ నీపై తన ప్రత్యేక అనుగ్రహాన్ని అనుగ్రహించి ఉంటే డబ్బు అవసరం గల ఓ సోదరునికి నీవు సహాయం చేసి ఉంటే, అతడు నీ సొమ్ము తిరిగి ఇవ్వడానికి నీవు అతనిపై ఒత్తిడి తీసుకువచ్చి నీవు చేసుకున్న శుభప్రదమైన బహుమానాన్ని పాడుచేసుకోకు. అతనికి సౌలభ్యం కలుగజేయి. అతని వ్యవధిని కొంత పొడిగించు. అతన్ని ఎత్తిపొడచి, హెచ్చరించి లేదా మాటిమాటికి అడిగి నీ దానాన్ని కలుషితం చేయకు. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః
“ఎవరు పేదరుణగ్రస్తునికి సౌలభ్యం కలుగుజేస్తారో అల్లాహ్ అతనికి ఇహపరాల్లో సౌలభ్యం కలుగజేస్తాడు“. (ముస్లిం 2699).
అతనికి వ్యవధి ఇవ్వడమే కాకుండా కొంత అప్పు అతని నుండి మాఫీ చేసి, అంటే ఇచ్చేదానికంటే మరీ తక్కువ తీసుకొని నీ ఈ ఉపకారతోటను మరింత అందంగా చేసుకో. ఇలా నీవు పుణ్యం సంపాదించుకొని ముందు నీపై గొప్ప ఉపకారం చేసినవాడివి అవుతావు. ఆ తర్వాత అతని భారాన్ని దించి అతని పట్ల ఉపకారం చేసినవాడివవుతావు. ప్రవక్త ﷺ ఇలా చెప్పారు:
“అల్లాహు తఆలా పరలోక కష్టాల నుండి కాపాడి, మోక్షం ప్రాప్తిం- చాలని ఎవరికి ఇష్టమో వారు పేద రుణగ్రస్తునికి తగినంత వ్యవధి ఇవ్వాలి.లేదా అతని అప్పును మాఫీ చేయాలి”. (ముస్లిం 1563).
మనం ఇహలోక సుఖం గురించి ఎంతో పాకులాడుతాము. కాని దాని వరకు చేర్పించే సరియైన దారిని తప్పిపోతాము. లేదా ఇలాంటి దైవమార్గాల్లో సుఖం ఉండదని భ్రమ చెందుతాము. అయితే ఇక నుండి అల్లాహ్ తన గ్రంథంలో మరియు ప్రవక్త తమ నోట చేసిన వాగ్దానాలను పూర్తి విశ్వాసంతో నమ్మాలి. అప్పుడే మనం ఇహపరాల సుఖాన్ని పొందగలుగుతాము.
“అల్లాహ్ మార్గంలో పోరాడే యోధునికి కావలసిన సామాగ్రి సమకూర్చేవాడు యోధునిగా పరిగణింపబడతాడు, అలాగే అల్లాహ్ మార్గంలో పోరాడే యోధుని ఇంటివారి అవసరాలు తీర్చేవాడు కూడా యోధునిగా పరిగణింపబడతాడు“. (బుఖారి/ ఫజ్లు మన్ జహ్హజ గాజియ…2843, ముస్లిం/ ఫజ్లు ఇఆనతిల్ గాజీ…1895).
నీవు (బైటికి వెళ్ళకుండా) నీ ఇంటివారి మధ్య ఉండి, ఈ సత్కార్య వనం ద్వారా అల్లాహ్ మార్గంలో పోరాడే యోధునికి సమానమైన పుణ్యం పొందుతావు. అందుకై నీవు ఆ యోధుని కుటుంబాన్ని కనిపెట్టుకుంటూ, తండ్రి లాంటి ప్రేమ, అప్యాయత చూపుతూ, వారి అవసరాలు తీరుస్తూ ఉండు.
“దారి నుండి అవస్త కలిగించే వస్తువును దూరం చేయుట ఒక సత్కార్యమే“. (బుఖారి 2989, ముస్లిం 1009).
ఈ పని కేవలం పాకీవాళ్ళు మరియు (మున్సిపాలిటీకి సంబంధించిన) సఫాయివాళ్ళదే కాదు. వాస్తవానికి ఇది మనందరి పని. ఈ సత్కార్యంలో మనం వెనకబడి దాని అవసరం లేనట్లుగా భావించాము. మరికొందరు మనలో ఈ పనికి అతీతులుగా భావించి ఈ పనిని నీచంగా చూడసాగారు. కాని అల్లాహ్ వద్ద దాని స్థానం చాలా గొప్పగా ఉంది. దాని బహుమానం ఎంతో విలువైనది. ప్రవక్త ﷺ తెలుపుతున్న ఈ ప్రవచనాన్ని శ్రద్ధగా పఠించు:
“ఒక వ్యక్తి దారికి అడ్డంగా ఉన్న ఓ చెట్టుకొమ్మ దగ్గర్నుంచి వెళుతూ, ‘అల్లాహ్ సాక్షిగా! ఇది ముస్లిములకు బాధ కలిగించ కుండా నేను దీన్ని ఇక్కడి నుండి దూరం చేస్తాను’ అని (దూరం చేసేశాడు కూడా, అందుకు) అతణ్ణి స్వర్గంలో ప్రవేశింపజేయడం జరిగింది“. (ముస్లిం 1914, బుఖారి 2472).
ఒక చెట్టు కొమ్మ, నీవు దారి నుండి తీసి పక్కకు వేస్తే, దాని ఫలితం భూమ్యాకాశాల వైశాల్యముగల స్వర్గం. ఇవి పుణ్య వనాలు, సత్కార్య తోటలు. మన ప్రభువు ఉదారుడు మరియు దయాశీలుడు.
ప్రియసోదరా! నీవు దానధర్మాలు చేసేంత పొడుగుగా నీ చేయి లేనట్లయితే, నీ సమయం, నీ హోదా, నీ శక్తి సామర్థ్యాలను వ్యయం చేసి నీ తోటి సోదరులకు సహాయపడలేకపోతే, ఇంకే విధంగానైనా వారికి మేలు చేకూర్చలేక పోతే కనీసం ఒక మంచి మాట మాట్లాడడంలో వెనకాడకు. ఇది చాలా గొప్ప విషయం. దీని ద్వారా నీ ప్రభువును సంతోష పెట్టగలుగుతావు. నీ సోదరుడ్ని ఓదార్చగల్గుతావు. లెక్కలేనన్ని పుణ్యాలు సంపాదించుకోగల్గుతావు. ప్రవక్త ﷺ చెప్పారుః
(وَالْكَلِمَةُ الطَّيِّبَةُ صَدَقَةٌ)
“మంచి మాట కూడా సత్కార్యమే“. (బుఖారి 2989, ముస్లిం 1009).
సత్కార్య వనాలు అనేకం. వాటిలో అల్లాహ్ దయ చాలా ఎక్కువ. మేలైన మార్గాలు అనేకం. వ్రాస్తూపోతే స్థలం (కాగితం) సరిపోదు. సమయం తోడివ్వదు. కొంత మార్గం చూపడం కూడా సరిపోతుంది. అల్లాహ్ గ్రంథంలో, ప్రవక్త ﷺ హదీసుల్లో మన రోగ నివారణ చాలా ఉంది. పోతే కొందరు స్వయం తమ పట్ల లోభిగా ప్రవర్తిస్తారు. పిసినారిగా మెదులుతారు. ఆ మేలు తమ సోదరుల వరకు చెందకుండా మసలుకుంటారు. కనీసం ఒక మంచి మాట ద్వారా అయినా మేలు చేయరు. దానికి వారు తమ శరీరంలోని నాలుకను కదలించడం తప్ప మరేమీ చేయనక్కరలేదు. కాని ఏ మేలు చేయరు. మంచి మాట మాట్లాడరు. అలాంటి వారికి చెప్పడానికి మిగిలింది ఇక ఒకే విషయం: మీరు కనీసం మీ పట్ల మేలు చేసుకోండి. ప్రజలకు హాని కలగకుండా మెదులుకోండి. తమ వాక్కర్మ ద్వారా బాధ కలిగించకండి. అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
“ఏ ఆచరణ చాలా శ్రేష్ఠమైనద”ని నేను ప్రవక్త ﷺని అడిగాను. “అల్లాహ్ ను విశ్వసించడం, ఆయన మార్గంలో యుద్ధం చేయడం” అని ప్రవక్త ﷺ సమాధానమిచ్చారు. “ఏలాంటి బానిసకు స్వేచ్ఛ కలిగించడం ఉత్తమం” అని అడిగాను. దానికి ప్రవక్త ﷺ అన్నారుః “ఎక్కువ ధర గలవాడికి మరియు యజమాని వద్ద ఉత్తమంగా ఉన్నవాడిని విముక్తి కలిగించడం”. “ఇది చేసే శక్తి లేనిచో ఎలా?” అని అడిగాను. “కష్టంలో ఉన్నవానికి సహాయం చేయు, పనిరాని వానికి పని చేసిపెట్టు” అని చెప్పారు ప్రవక్త. అది కూడా నేను చేయలేక పోయాననుకోండి, అప్పుడు? అని ప్రశ్నించినందుకు ప్రవక్త ﷺ ఇలా సమాధానమిచ్చారుః “ప్రజలకు నీ నుండి ఏ కీడు కలగకుండా జాగ్రత్తపడు. ఇది కూడా ఒక సదకా (సత్కార్యం). నీవు స్వయంగా నీపై సదకా చేసినవానివి అవుతావు”. (బుఖారి 2518, ముస్లిం 84).
]కనుక తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కా- ర్యాలు చేయాలి. ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ చేర్చకూడదు[. (కహఫ్ 18: 110).
2- ఏ సత్కార్యం గురించి విన్నా దానిని ఆచరించడంలో ఆలస్యం చేయకు. సంతోషంతో, ఇష్టాపూర్వంగా సద్మనస్సుతో ముందడుగు వేయి. ఇది దైవభీతి చిహ్నం. అల్లాహ్ ఇలా ఆదేశించాడుః
మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పోయే మార్గంలో పరుగెత్తండి. ఆ స్వర్గం భూమ్యాకాశాల అంత విశాలమైనది. అది భయభక్తులు కలవారి కొరకు తయారు చెయ్యబడింది (ఆలి ఇమ్రాన్ 3: 133).
దైవాదేశాల పాలనకు త్వరపడే ఓ అరుదైన సంఘటన శ్రద్ధగా చదవండిః అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు నఫిల్ నమాజు చేస్తూ ఉన్నారు. నాఫిఅ అను ఆయన బానిస ప్రక్కనే కూర్చుండి, ఆయన ఏదైనా ఆదేశమిస్తే దాని పాలనకు వేచిస్తూ ఉన్నాడు. స్వయంగా నాఫిఅ ఓ గొప్ప పండితులు, ప్రఖ్యాతి గాంచిన హదీసు గ్రంథం మువత్త ఇమాం మాలిక్ యొక్క ఉల్లేఖకుల్లో ఒకరు. అతనిలో ఉన్న ఉన్నత గుణాల వల్ల అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ అతణ్ణి చాలా ప్రేమించేవారు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ నమాజులో ఖుర్ఆన్ పఠిస్తూ]మీరు అమితంగా ప్రేమించే వస్తువులను (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టనంత వరకు మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరు[. (ఆలిఇమ్రాన్ 3: 92). చదివినప్పుడు వెంటనే తన చెయితో సైగ చేశాడు. ఆదేశపాలనకై సిద్ధంగా ఉన్న నాఫిఅకు ఆయన ఎందుకు సైగ చేస్తున్నాడో అర్థం కాలేక పోయింది. అర్థం చేసుకొనుటకై ఎంతో ప్రయత్నం చేశాడు. ఫలితం లేకపోయింది. అందుకు ఆయన సలాం తిప్పే వరకు వేచించి, ఎందుకు సైగ చేశారు? అని అడిగాడు. దానికి అబ్దుల్లాహ్ ఇలా సమాధానం చెప్పారు “అమితంగా నేను ప్రేమించే వస్తువులు ఏమిటని ఆలోచిస్తే నీవు తప్ప నాకు ఏదీ ఆలోచన రాలేదు. అయితే నేను నమాజులో ఉండగానే నీకు స్వేచ్ఛ ప్రసాదించుటకు సైగ చేయడమే మంచిదిగా భావించాను. నమాజు అయ్యే వరకు వేచిస్తే బహుశా నా కోరిక, వాంఛ ఆధిక్యత పొంది ఈ నిర్ణయానికి వ్యతిరేకం జరుగుతుందని భయం అనిపించింది. అందుకే వెంటనే సైగ చేశాను. ఈ మాటను విన్న నాఫిఅ వెంటనే “మీ సహచర్యం లభిస్తుంది కదా”? అని అడిగాడు. అవును నీవు నాతో ఉండవచ్చు అన్న హామీ ఇచ్చారు అబ్దుల్లాహ్.
3- అల్లాహ్ నీకు ఏదైనా సత్కార్యం చేసే భాగ్యం నొసంగాడంటే దానిని మంచి విధంగా సంపూర్ణంగా చేయుటకు ప్రయత్నించు.
మంచి పనులు చేసే వారికి మంచి బహుమానాలు లభిస్తాయి. ఇంకా ఎక్కువ అనుగ్రహం లభిస్తుంది. వారి ముఖాలను నల్లదనం గానీ అవమానం గానీ కప్పివేయవు. వారు స్వర్గానికి అర్హులు, అక్కడే శాశ్వతంగా ఉంటారు (యూనుస్ 10: 26).
నీ అవసరం ఎవరికి పడిందో అతని స్థానంలో నీవు నిన్ను చూసుకో, అప్పుడు ప్రవక్త ఈ ఆదేశాన్ని కూడా దృష్టికి తెచ్చుకోః
“మీలో ఒకరు తాను తన గురించి కోరుకున్నట్లు తమ సోదరుని గురించి కోరనంత వరకు విశ్వాసి కాజాలడు“. (బుఖారి 13, ముస్లిం 45).
4- చేసిన పుణ్యాన్ని గుర్తు చేసుకోకు. ఎవరి పట్ల ఆ కార్యం చేశావో అతన్ని ఎత్తిపోడవకు, హెచ్చరించకు. దాని గురించి మరెవరికో చెప్పుకోబోకు. ఏదైనా ఔచిత్యం ఉంటే తప్ప. అల్లాహ్ ఆదేశం ఇలా ఉంది గమనించుః
విశ్వాసులారా! మీరు దెప్పిపొడిచి, గ్రహీత మనస్సును గాయ- పరచి మీ దానధర్మాలను మట్టిలో కలపకండి. (బఖర 2: 264).
నీవు చేసిన దాన్ని అల్లాహ్ వద్ద నీ త్రాసులో పెట్టడం జరుగుతుంది. ఎవరి పట్ల నీవు మేలు చేశావో వారు దాన్ని తిరస్కరించినా పరవా లేదు.
5- నీ పట్ల ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయి. అది కనీసం ఒక మంచి మాట ద్వారా అయినా సరే. అల్లాహ్ దయ తర్వాత నీవు సత్కార్యం చేయునట్లు ఇది నీకు తోడ్పడుతుంది. అల్లాహ్ ఆదేశం ఇలా ఉందిః
ఇవి కొన్ని సత్కార్యవనాలు, సత్కార్యతోటలు. అవి చేయుటకు సుగమమైన మార్గం ఉంది. ద్వారాలు తెరువబడి ఉన్నాయి. మంచి ఫలాలు ఉన్నాయి. ఇహపరాల్లో ఉత్తమమైన ఫలితాలూ ఉన్నాయి. ఓ అల్లాహ్! నీకు ఇష్టమైనవి, నీవు కోరినవి చేసే సద్భాగ్యం మాకు ప్రసాదించమని, మాకు స్వర్గం ప్రసాదించి, నరకం నుండి కాపాడమని నీతో వేడుకుంటున్నాము. నీ మార్గంలో అత్యంత కృషి సలుపుతున్నవారికి, నీ మార్గంలో పోరాడుతున్న వారికి సహాయం చేయి. అల్లాహ్ వారి గురి సరిచేయి. వారి సామాగ్రిలో శుభం కలుగజేయి. వారి బలం రెట్టింపు చేయి. వారిలోని రోగు లకు స్వస్థత ప్రసాదించు. అమరవీరులైనవారిని నీవు అంగీకరించు. వారిలోని బలహీనులకు అతిఉత్తమ సహాయకునివిగా అయిపో. ఓ అల్లాహ్ ఆక్రామకులైన యూదుల పంజా నుండి మస్జిద్ అక్సాను విడిపించు. ఓ అల్లాహ్ యూదులకు, వారికి తోడ్పడే వారికి ఓటమి పాలు చేయి. వారి మధ్య విభేదాలు పుట్టించు. వారిలో అనైక్యత ఏర్పరచు. వారిని ఇస్లాం మరియు ముస్లిముల కొరకు లాభకరంగా చేయి. అల్లాహ్ మా దేశంలో ప్రత్యేకంగా, తద్వారా ముస్లిములు జీవించే ప్రతి చోట శాంతిభద్రతలు వర్థిల్లునట్లుగా చేయి. అల్లాహ్ నీవు ప్రసాదించిన మా భార్య, సంతానం, సంపాదనల్లో శుభం కలుగజేయి. వారిని ఇహపరాల్లో మా కళ్ళకు చల్లదనంగా చేయి. అల్లాహ్! మమ్మల్ని, మా తల్లిదండ్రుల్ని, ముస్లిము- లందరిని క్షమించు. నిశ్చయంగా నీవు వినేవానివి, అంగీకరించేవానివి.
25.34980855.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.