ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 15 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా ఆధ్యాత్మికత గురించి, అనైతిక వ్యవహారశైలి గురించి, అనైతికత వల్ల వాటిల్లే వినాశాల గురించి వివరించింది. ఇందులోని మొదటి ఆయతులో ఈ సూరా పేరుకు సంబంధించిన పదం ప్రస్తావనకు వచ్చింది. ఈ సూరా మానవుల ఆధ్యాత్మిక విధులను గుర్తు చేసింది. అల్లాహ్ కు గల ప్రత్యేకమైన సృష్టి సామర్ధ్యాన్ని వర్ణిస్తూ, సూర్యచంద్రుల ప్రకాశం, భూమి, అద్భుతమైన రోదసీ (అంతరిక్ష) వ్యవస్థల సృష్టి గురించి తెలియజేసింది. మానవులందరికీ ఇష్టమొచ్చిన మార్గాన్ని అవలంబించే స్వేచ్ఛ ఉందని, మంచిగా గాని, చెడుగా గాని వ్యవహరించే స్వేచ్ఛ ఉందని, ఏ మార్గాన నడవాలన్నది మనమే నిర్ణయించుకోవాలని తెలియజేస్తూ, అనైతికంగా వ్యవహరించి, అల్లాహ్ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే ఫలితంగా దైవాగ్రహానికి గురి కావలసి వస్తుందని ఈ సూరా తెలియజేసింది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 7 ఆయతులు ఉన్నాయి. అవిశ్వాసులు, కపట విశ్వాసుల గురించి ఈ సూరా ముఖ్యంగా ప్రస్తావించింది. ఈ సూరా మొదటి ఆయతులో వచ్చిన ‘మాఊన్’ (సాధారణ వస్తువులు) అన్న పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. రెండు రకాల ప్రజలను ఈ సూరాలో తీవ్రంగా విమర్శించడం జరిగింది.
(1) తీర్పుదినాన్ని నిరాకరిస్తున్న అవిశ్వాసులు. వారు అనాధలను కఠినంగా కసరి కొడతారు. నిరుపేదలకు సహాయం చేయడాన్ని వారు ప్రోత్సహించరు.
(2) కపట విశ్వాసులైన ముస్లిములు – నమాజులకు ఆలస్యం చేస్తారు. వేళకు నమాజు చేయరు. అందరూ చూడాలని మంచి పనులు చేస్తారు. చిన్న చిన్న విషయాలలో కూడా తమ తోటి వారికి సహాయం చేయడానికి ముందుకు రారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 8 ఆయతులు ఉన్నాయి. సృష్టిరాసులన్నింటిలోను మానవునికి అత్యున్నత స్థానాన్ని ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని ఈ సూరా ముఖ్యంగా ప్రస్తావించింది. మొదటి ఆయతులో వచ్చిన ‘తీన్’ (అంజూరం) అన్న పదాన్ని ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. మనిషిని చక్కని రూపులో సృష్టించడం జరిగిందని, ఉత్తమమైన శారీరక, మానసిక శక్తులు ప్రసాదించడం జరిగిందని, ఇవన్నీ అల్లాహ్ అనుగ్రహాలని తెలియజేసింది. అందువల్ల మనిషి అల్లాహ్ కు కృతజ్ఞుడై ఉండాలని బోధించింది. అల్లాహ్ కు దూరమైతే మనిషి తన హోదాను కోల్పోతాడనీ, అవమానాల పాలయి పతనమవుతాడనీ, పరలోకం అనివార్యమని హెచ్చరించింది.
95:6 إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَلَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ అయితే విశ్వసించి, ఆ పైన మంచి పనులు చేసిన వారికి మాత్రం ఎన్నటికీ తరగని పుణ్యఫలం ఉంది. [5]
95:7 فَمَا يُكَذِّبُكَ بَعْدُ بِالدِّينِ మరైతే (ఓ మానవుడా!) ప్రతిఫల దినాన్ని ధిక్కరించమని ఏ వస్తువు నిన్ను పురమాయిస్తున్నది. [6]
95:8 أَلَيْسَ اللَّهُ بِأَحْكَمِ الْحَاكِمِينَ ఏమిటి, అధికారులందరికంటే అల్లాహ్ గొప్ప అధికారి కాడా? [7]
Footnotes (పాద సూచికలు):
[1] అల్లాహ్ తన ప్రవక్త అయిన మూసా (అలైహిస్సలాం)తో సంభాషణ జరిపినది ఈ పర్వతం మీదే.
[2] శాంతియుతమైన నగరం అంటే మక్కా నగరం. ఈ నగరంలో హత్యాకాండకు అనుమతి లేదు. ఈ నగరంలో ప్రవేశించిన వారికి రక్షణ లభిస్తుంది.
మరికొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం ఈ సూరాలో మూడు ప్రదేశాలపై ప్రమాణం చేయబడింది. ఈ మూడు ప్రదేశాలు కూడా చరిత్రాత్మకమైనవి. ఎందుకంటే ఆ స్థలాలలో గొప్ప గొప్ప ప్రవక్తలు, షరీయతు ప్రదాతలు వచ్చారు. “అత్తిపండు, ఆలివ్ సాక్షిగా!” అంటే అత్తిపండ్లు,ఆలివ్ పండ్లు విరివిగా ఉత్పత్తి అయ్యే ప్రదేశం అని అర్థం. అది బైతుల్ మజ్లిస్ (జెరూసలేము) ప్రదేశం. దైవప్రవక్త ఈసా (ఏసుక్రీస్తు) ఆ ప్రదేశంలో ప్రభవించారు. సినాయ్ పర్వతంపై మూసా (అలైహిస్సలాం)కు ప్రవక్త పదవి ఇవ్వబడింది. కాగా; మక్కానగరంలో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మించారు (ఇబ్నె కసీర్).
[3] పై మూడు ఆయతులలో చేయబడిన ప్రమాణానికి జవాబు ఈ ఆయతులో ఇవ్వబడింది. అదేమంటే ఈ లోకంలో మానవుణ్ణి అల్లాహ్ అత్యుత్తమ రీతిలో సృజించాడు. ఇతర ప్రాణులతో, జంతువులతో పోల్చుకున్నప్పుడు ఈ తేడా కొట్టొచ్చినట్లే కనిపిస్తుంది.ఇతర జీవుల ముఖాలు క్రిందికి వంగి ఉంటాయి. కాని అల్లాహ్ మనిషిని మాత్రం నిటారుగా నిలబడి నడిచేవానిగా, అందగాడుగా మలిచాడు. ఇతర ప్రాణులకు భిన్నంగా మానవుడు తన చేతులతో సంపాదించి తింటాడు. త్రాగుతాడు. అతని శరీరావయవాలు ఎంతో పొందికగా ఉన్నాయి. వేర్వేరు అవయవాల మధ్య చాలినంత ఎడమ ఉంది. ఇతర ప్రాణుల మాదిరిగా వాటి మధ్య అస్తవ్యస్తతగానీ, అసౌకర్య పరిస్థితిగానీ లేదు. ముఖ్యమైన అవయవాలు రెండేసి చేయబడ్డాయి. మరి అతనిలో కనే, వినే, ఆలోచించే, అర్థంచేసుకునే శక్తియుక్తులు పొందు పరచబడ్డాయి. “అల్లాహ్ ఆదంను తన ఆకారంపై పుట్టించాడ”న్న హదీసును (ముస్లిం – కితాబుల్ బిర్….) విద్వాంసులు ఈ నేపథ్యంలో ఉదాహరించటం కూడా గమనార్హ విషయమే. మానవ సృజనలో ఈ విషయాలన్నింటి మేళవింపే “అహ్సని తఖ్వీమ్” (అందమైన ఆకృతి). అందునా అల్లాహ్ మూడుసార్లు ప్రమాణం చేసిన తరువాత ఈ మాట చెప్పాడు (ఫత్హుల్ ఖదీర్).
[4] ఈ ఆయతును పలువురు వ్యాఖ్యాతలు పలు విధాలుగా గ్రహించారు. కొంతమంది ప్రకారం ఈ ఆయతు మనిషి యొక్క హీనాతి హీనమైన వార్ధక్యాన్ని (ముసలితనాన్ని) సూచిస్తోంది. ఈ వయసులో మనిషి జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. అతను విచక్షణా జ్ఞానాన్ని సయితం కోల్పోయి పసిపిల్లవాడిలా ప్రవర్తిస్తాడు. మరికొంత మంది ప్రకారం మానవుడు తన దురాగతాల కారణంగా నైతికంగా దిగజారి పాతాళానికి త్రోసివేయ బడతాడు. పాముల, క్రిమికీటకాల కన్నా హీనుడిగా తయారవుతాడు. ఇంకా కొంత మంది ప్రకారం నరకంలో అవిశ్వాసులకు పట్టే దురవస్థ ఇది! అంటే మానవుడు దైవాన్ని, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఎదిరించి, తనను అత్యుత్తమ స్థానం నుంచి ఎగదోసుకుని నరకంలోని అధమాతి అధమ స్థానంలో పడవేసుకుంటాడు.
[5] అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారిని మాత్రం అల్లాహ్ ఈ దుష్పరిణామం నుండి మినహాయించాడు.
[6] ఇది మనిషికి చేయబడే హెచ్చరిక! ఓ మనిషీ! నిన్ను అత్యుత్తమ ఆకృతిలో పుట్టించి, గౌరవోన్నతుల్ని వొసగిన ప్రభువు అత్యంత అధమస్థితికి చేర్చే శక్తి కూడా కలిగి ఉన్నాడని మరచిపోకు. అలాగే నిన్ను తిరిగి బ్రతికించటం కూడా ఆయనకు ఏమాత్రం కష్టతరం కాదు. ఇది తెలిసి కూడా నువ్వు ప్రళయదినాన్ని, శిక్షాబహుమానాన్ని త్రోసిపుచ్చుతున్నావా? మరికొందరు దీని అర్థం ఇలా చెబుతారు: (ఓ ముహమ్మద్!)దీని తరువాత తీర్పుదినానికి సంబంధించి నిన్ను ఎవరు ధిక్కరించగలరు?
[7] ఆయన ఏ ఒక్కరికీ అన్యాయం చేయడు సరికదా, తీర్పు దినాన్ని నెలకొల్పి అన్యాయం జరిగిన వారందరికీ న్యాయం చేస్తాడు. ఈ సూరా చివరిలో “బలా వ అన అలా జాలిక మినష్షాహిదీన్” (ఎందుకు కాడు?! ఈ విషయానికి నేను సయితం సాక్షినే) అని పలకాలని తిర్మిజీ గ్రంథంలోని ఒక బలహీన హదీసు ద్వారా తెలుస్తోంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ సూరా మక్కాకాలానికి చెందినది. ఇందులో మొత్తం 8 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా సంపద పట్ల వ్యామోహం గురించి వివరించింది. మానవులు విపరీతంగా ప్రాపంచిక సుఖభోగాల వ్యామోహం కలిగి ఉంటారు. ఎల్లప్పుడు తమ సంపదను ఇంకా పెంచుకోవాలని చూస్తుంటారు. తమ హోదాను, అధికారాన్ని పెంచుకో వాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రాపంచిక ప్రయోజనాలను సాధించడంలో పూర్తిగా నిమగ్నమైపోయి పరలోకాన్ని విస్మరిస్తారు. నిజానికి పరలోకం మనిషి భవిష్యత్తు. మృత్యువు ఆసన్నమైనప్పుడు, సమాధిలో వాస్తవాన్ని గుర్తిస్తారు. తీర్పుదినాన వారు తమ కళ్ళారా నరకాన్ని చూసుకుంటారు. అల్లాహ్ కు దూరమైనందుకు, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బాధాకరమైన శిక్షను అనుభవిస్తారు.
102:1 أَلْهَاكُمُ التَّكَاثُرُ అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది.
102:2 حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ ఆఖరికి మీరు (ఈ ఆశల ఆరాటంలోనే) సమాధులకు చేరుకుంటారు.
102:3 كَلَّا سَوْفَ تَعْلَمُونَ ఎన్నటికీ కాదు, మీరు తొందరగానే తెలుసుకుంటారు.
102:4 ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ మరెన్నటికీ కాదు…. మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.
102:5 كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ అది కాదు. మీరు గనక నిశ్చిత జ్ఞానంతో తెలుసుకున్నట్లయితే (అసలు పరధ్యానంలోనే పడి ఉండరు).
102:6 لَتَرَوُنَّ الْجَحِيمَ మీరు నరకాన్ని చూసి తీరుతారు.
102:7 ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِينِ అవును! మీరు దానిని ఖచ్చితంగా కళ్ళారా చూస్తారు సుమా!
102:8 ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ మరి ఆ రోజు (అల్లాహ్) అనుగ్రహాల గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 40 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ప్రళయం గురించి, ఆ రోజున మరణించిన వారు మళ్ళీ లేపబడడం గురించి, తీర్పుదినం గురించి, శిక్షా బహుమానాల గురించి బోధించింది. మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం అన్నది ఒక భ్రమ ఎంతమాత్రం కాదని, అనివార్యంగా చోటుచేసుకునే సంఘటన అనీ ఈ సూరా హెచ్చరించింది. ప్రళయం రోజు భయాందోళనలతో అందరూ కళ్ళు తేలవేస్తారు. చంద్రుడు కాంతివిహీనుడై పోతాడు. సూర్యచంద్రులు తమ కాంతిని కోల్పోతారు. తీర్పుదినాన ప్రతి ఒక్కరికి వారి కర్మల గురించి తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి నాలుక, కాళ్ళుచేతులు అవి చేసిన పనులకు సాక్ష్యం చెబుతాయి. మనిషిని ఒక వీర్యపు బిందువుతో పుట్టించిన అల్లాహ్ చనిపోయిన తర్వాత మళ్ళీ లేపి నిలబెట్టే శక్తిసామర్ధ్యాలు ఉన్నవాడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 20 ఆయతులు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గడిపిన ఆధ్యాత్మిక జీవితం గురించి ఈ సూరా ముఖ్యంగా వివరించింది. ఈ సూరాకు పేరుగా పెట్టబడిన పదబంధం మొదటి ఆయతులో వచ్చింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ‘దుప్పటికప్పుకున్న వాడు’ అని పిలువడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం గురించి, ఆయన సహచరుల ఆధ్యాత్మిక జీవితం గురించి వారి దైవభీతి గురించి ఈ సూరా ప్రస్తావించింది. వారు రాత్రిలో మూడింట రెండువంతులు, లేదా రాత్రిలో సగభాగం లేదా మూడింటా ఒక భాగం నమాజులో, దైవస్మరణలో, దివ్యఖుర్ఆన్ పారాయణంలో గడిపేవారు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఉద్దేశించి సహనంతో స్థిరంగా నిలబడాలని, జనం కల్పించే మాటలను పట్టించుకోరాదని, వారిని వారి మానాన వదిలెయ్యాలని బోధించడం జరిగింది.
విశ్వాసులు దివ్యఖుర్ఆన్ ను వారు చదువగలిగినంత వరకు చదువుతూ ఉండాలని, నమాజు చేస్తూ ఉండాలని, దానధర్మాలు చేస్తూ ఉండాలని బోధించడం జరిగింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సాక్షిగా వ్యవహరిస్తారని, దివ్యఖుర్ఆన్ ఒక హితబోధ అని ఇందులో అభివర్ణించడం జరిగింది. తీర్పుదినాన భూమి, పర్వతాలు కుదిపి వేయబడతాయని, పర్వతాలు ఇసుక గుట్టల మాదిరిగా తునాతునకలైపోతాయని హెచ్చరించడం జరిగింది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 28 ఆయతులు ఉన్నాయి. ఏకదైవారాధన, ప్రవక్తల పరంపర గురించి ఈ సూరా ముఖ్యంగా వివరించింది.మొదటి ఆయతులో ప్రస్తావనకు వచ్చిన జిన్నులు అన్న పదాన్ని ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. దివ్య ఖుర్ఆన్ ప్రాముఖ్యానికి జిన్నులు కూడా ప్రభావితమయ్యాయని తెలియజేయడం ద్వారా ఖుర్ఆన్ ఔన్నత్యాన్ని విశదీకరించడం జరిగింది. జిన్నులు రెండు రకాలని, కొందరు మంచివారని, కొందరు చెడ్డవారని తెలిపింది. కొందరు జిన్నులు దైవవాణిని విన్న తర్వాత దానిని విశ్వసించారు. ఈ సూరా ఏకదైవారాధన ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పింది. అల్లాహ్ కు భాగస్వాములను చేర్చడం మహాపరాధమనీ, దానికి దూరంగా ఉండాలని బోధించింది. అల్లాహ్ కు కుమారులు ఎవరూ లేరని, ఆయనకు భాగస్వాములు కూడా లేరని, ఆయనకు అగోచరాలు (కంటికి కనబడనివి) అన్నీ తెలుసనీ, అల్లాహ్ ను,ఆయన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను తిరస్కరించిన వారు నరకాగ్నికి ఆహుతి అవుతారని హెచ్చరించింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అల్లాహ్ ఎన్నుకుని తన సందేశాన్ని మానవాళికి చేరవేయడానికి పంపాడని, మానవులు ఆయనకు విధేయత చూపాలని, అల్లాహ్ కు భాగస్వాములుగా ఎవరినీ నిలబెట్టరాదని బోధించింది.
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) వారికి చెప్పు: నాకు దివ్యవాణి (వహీ) ద్వారా ఇలా తెలియజేయబడింది – జిన్నుల సమూహం ఒకటి (ఖుర్ఆన్ ను ) విన్నది. వారు (తమ వాళ్లతో) ఇలా అన్నారు: “మేమొక అద్భుతమైన ఖుర్ఆన్ ను విన్నాము.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
(ఓ ప్రవక్తా!) తన భర్త విషయమై నీతో వాదిస్తూ, అల్లాహ్ కు ఫిర్యాదు చేసుకుంటూ ఉన్న ఆ స్త్రీ మాటను అల్లాహ్ విన్నాడు. ఇంకా, అల్లాహ్ మీరిద్దరి మధ్య జరిగిన సంవాదనను (కూడా) విన్నాడు. నిశ్చయంగా అల్లాహ్ (అంతా) వినేవాడు, చూసేవాడు.
మీలో ఎవరైనాసరే తమ భార్యలపై ‘జిహార్’ను ప్రయోగించినంత మాత్రాన (నీవు నా తల్లి వీపు లాంటి దానివి అని నోరు జారినంత మాత్రాన) వారు వారికి తల్లులైపోరు. వారిని కన్నవారు మాత్రమే వాస్తవానికి వారి తల్లులు. నిజానికి ఈ విధంగా పలికేవారు అసహ్యమైన మాటను, అబద్ధాన్ని పలికారు. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడు, క్షమాభిక్షపెట్టేవాడూను.
మరెవరైనా తమ భార్యలపై ‘జిహార్’ను ప్రయోగించి, తమ నోటి ద్వారా జారిపోయిన (తప్పుడు) మాటను ఉపసంహరించదలచుకుంటే వారు ఒకరినొకరు తాకకముందే అతను ఒక బానిసకు స్వేచ్ఛను ప్రసాదించాలి. దీని ద్వారా మీకు గుణపాఠం నేర్పబడుతున్నది. మీరు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు.
ఈ స్థోమత లేనివాడు, భార్యాభర్తలు పరస్పరం ముట్టుకోకముందే అతను రెండు మాసాలపాటు ఎడతెగకుండా ఉపవాసాలు పాటించాలి. ఈపాటి శక్తి కూడా లేనివాడు అరవై మంది అగత్యపరులకు అన్నం పెట్టాలి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై మీ పరిపూర్ణ విశ్వాసం రూడీ కావటానికే ఇది మీపై విధించబడింది. ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. అవిశ్వాసులకు బాధాకరమైన శిక్ష ఖాయం.
అల్లాహ్ ఆయన ప్రవక్తకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు వారి పూర్వీకులు పరాభవం పాలైనట్లే పరాభవం పాలవుతారు. నిశ్చయంగా మేము స్పష్టమైన నిదర్శనాలను అవతరింపజేసి ఉన్నాము. అవిశ్వాసులకు అవమానకరమయిన శిక్ష తథ్యం.
ఏ రోజున అల్లాహ్ వారందరినీ తిరిగి లేపుతాడో అప్పుడు వారికి వారు చేసుకున్న కర్మలను తెలియపరుస్తాడు. అల్లాహ్ దాన్ని లెక్కించి పెట్టాడు. వారు మాత్రం దానిని మరచిపోయారు. కాని అల్లాహ్ అన్నింటికీ సాక్షిగా ఉన్నాడు.
భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువు గురించి అల్లాహ్ కు తెలుసన్నది నీవు చూడటం లేదా? నాల్గవవాడుగా అల్లాహ్ లేకుండా ఏ ముగ్గురి మధ్య కూడా రహస్య మంతనాలు జరగవు. అరవవాడుగా అల్లాహ్ లేకుండా ఏ ఐదుగురి మధ్యన కూడా (రహస్య సమాలోచనలు సాగవు). అంతకన్నా తక్కువ మంది ఉన్నా, ఎక్కువ మంది ఉన్నా – వారెక్కడ ఉన్నా – ఆయన వారితో ఉంటాడు. మరి వారు చేసుకున్నవన్నీ ప్రళయదినాన వారికి తెలియపరుస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు.
రహస్య మంతనాలు జరపరాదని వారించబడినవారిని నీవు చూడలేదా? అయినాసరే వారు వారింపబడిన దానికే మళ్ళి పాల్పడుతున్నారు. వారు పాపం, అత్యాచారం, ప్రవక్త పట్ల అవిధేయతలకు సంబంధించిన రహస్య మంతనాలను సాగిస్తున్నారు. వారు నీ దగ్గరకు వచ్చినపుడు, అల్లాహ్ నీకు ఏ పదజాలంతో సలాం చెయ్యలేదో ఆ పదజాలంతో నీకు సలాం చేస్తారు. పైపెచ్చు, “మనం పలికే ఈ మాటలపై అల్లాహ్ మనల్ని ఎందుకు శిక్షించటం లేదు?!” అని లోలోపలే చెప్పుకుంటారు. వారికి నరకం (యాతన) సరిపోతుంది. వారు అందులోకి ప్రవేశిస్తారు. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం.
ఓ విశ్వాసులారా! మీరు గనక (పరస్పరం) రహస్య సమాలోచన జరిపితే పాపం, అత్యాచారం, ప్రవక్త పట్ల అవిధేయత గురించిన సమాలోచన జరపకండి. దానికి బదులు సత్కార్యం, భయ భక్తులకు సంబంధించిన సమాలోచన జరపండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. ఆయన వద్దకే మీరంతా సమీకరించబడతారు.
విశ్వాసులను వ్యాకుల పరచాలనుకునే (కుత్సిత) సమాలోచనలు షైతాను ప్రేరణలే. అల్లాహ్ అనుజ్ఞ కానంత వరకూ వాడు వారికి ఎలాంటి కీడు కలిగించలేడన్నది నిజం. విశ్వాసులు మాత్రం అల్లాహ్ నే నమ్ముకోవాలి.
ఓ విశ్వాసులారా! సమావేశాలలో కాస్త ఎడంగా కూర్చోండి అని మీతో అనబడినప్పుడు, మీరు కాస్త ఎడంగా కూర్చోండి. అల్లాహ్ మీకు విశాలాన్ని ప్రసాదిస్తాడు. ‘లేవండి’ అని మీతో అనబడినప్పుడు మీరు లేచినిలబడండి. మీలో విశ్వసించినవారి, జ్ఞానం ప్రసాదించబడినవారి అంతస్థులను అల్లాహ్ పెంచుతాడు. మీరు చేసే ప్రతి పనీ అల్లాహ్ జ్ఞాన పరిధిలో ఉంది.
విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తో రహస్య సమాలోచన చేయదలిస్తే, మీరు రహస్య సమాలోచనకు ముందు ఎంతో కొంత దానం చేయండి. ఇది మీ కొరకు ఎంతో ఉత్తమమైనది, పవిత్రమైనది. ఒకవేళ మీకు ఆ స్థోమత లేకపోతే అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు.
ఏమిటి, మీ రహస్య సమాలోచనకు ముందు మీరు దానం చేయాలి అనేసరికి భయపడిపోయారా? మీరు ఈ దానధర్మము చేయలేకపోయినప్పుడు అల్లాహ్ కూడా మిమ్మల్ని మన్నించాడు. అందుకే ఇప్పుడు నమాజులను (సజావుగా) నెలకొల్పండి. జకాత్ ను (విధిగా) ఇస్తూ ఉండండి. అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి. మీరు చేసేదంతా అల్లాహ్ కు పూర్తిగా ఎరుకే.
ఏమిటి, అల్లాహ్ ఆగ్రహానికి గురైన వారితో కుమ్మక్కు అయిన వారిని నీవు చూడలేదా? అసలు వీరు (ఈ కపటులు) మీ వారూ కారు. వాళ్ళ పక్షాన చేరినవారూ కారు. తెలిసి కూడా వారు – ఉద్దేశ్యపూర్వకంగా – అసత్య విషయాలపై ప్రమాణం చేస్తున్నారు.
వారందరినీ అల్లాహ్ తిరిగి లేపిన రోజున, వారు మీ ముందు ప్రమాణాలు చేసినట్లే ఆయన ముందు కూడా ప్రమాణాలు చేస్తారు. తమకూ ఏదో ఒక ఆధారం ఉందని తలపోస్తారు. బాగా తెలుసుకోండి! వారు పచ్చి అబద్ధాల కోరులు.
షైతాను వారిని లొంగదీసుకున్నాడు. వారు అల్లాహ్ ధ్యానాన్ని మరచి పోయేలా చేశాడు. వాళ్ళు షైతాను ముఠాకు చెందినవారు. బాగా తెలుసుకోండి! ఎట్టకేలకు నష్టపోయేది షైతాను ముఠాయే.
అల్లాహ్ ను, అంతిమదినాన్ని విశ్వసించేవారు అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల శత్రుత్వం వహించేవారిని ప్రేమిస్తున్నట్లు నీవు ఎక్కడా చూడవు – ఆఖరికి వారు తమ తండ్రులైనాసరే, తమ కొడుకులైనాసరే, తమ అన్నదమ్ములైనాసరే, తమ పరివారజనులైనా సరే (ససేమిరా వారిని ప్రేమించరు). అల్లాహ్ విశ్వాసాన్ని రాసి పెట్టినది ఇలాంటి వారి హృదయాలలోనే! ఆయన తన ఆత్మ ద్వారా వీరిని ప్రత్యేకంగా బలపరిచాడు. ఇంకా వీరికి, క్రింద సెలయేరులు పారే స్వర్గ వనాలలో ప్రవేశం కల్పిస్తాడు. అందులో వీరు కలకాలం ఉంటారు. అల్లాహ్ వీరి పట్ల ప్రసన్నుడయ్యాడు. వీరు అల్లాహ్ పట్ల సంతుష్టులయ్యారు. అల్లాహ్ పక్షానికి చెందిన వారంటే వీరే. నిశ్చయంగా సాఫల్యం పొందేవారు అల్లాహ్ పక్షం వారే.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.