మహాప్రవక్త ﷺ జీవిత చరిత్ర – ఇస్రా మరియు మేరాజ్ యాత్ర వక్త: సలీం జామిఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/ts0-ZZ_G9D0 [39 నిముషాలు]
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రలోని ఇస్రా మరియు మేరాజ్ యాత్ర గురించి ఈ ప్రసంగం వివరిస్తుంది. ఇందులో ప్రవక్త యొక్క హృదయ శుద్ధి, బురాఖ్ పై ప్రయాణం, మస్జిద్ అల్-అక్సాలో ప్రవక్తలందరికీ ఇమామత్ చేయడం, ఏడు ఆకాశాలలో ఆదం, ఈసా, యహ్యా, యూసుఫ్, ఇద్రీస్, హారూన్, మూసా మరియు ఇబ్రాహీం (అలైహిముస్సలాం) వంటి ప్రవక్తలను కలవడం వంటి సంఘటనలు వివరించబడ్డాయి. అల్లాహ్ తో సంభాషణ, యాభై పూటల నమాజు ఐదుకు తగ్గించబడటం, స్వర్గ నరకాలలోని కొన్ని దృశ్యాలు, వడ్డీ, అనాథల సొమ్ము తినేవారికి, వ్యభిచారులకు మరియు చాడీలు చెప్పేవారికి విధించబడే శిక్షల గురించి కూడా ప్రస్తావించబడింది. ఈ అద్భుత సంఘటనను మక్కావాసులు అపహాస్యం చేసినప్పుడు, అబూ బక్ర్ రజియల్లాహు అన్హు దానిని దృవీకరించి “సిద్దీఖ్” బిరుదును ఎలా పొందారో కూడా ఈ ప్రసంగం వివరిస్తుంది.
وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِيْنَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِيْنَ [వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్]
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్
సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు
మేరాజ్ యాత్ర
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర ఆరవ భాగంలోకి మనము ప్రవేశించాము. ఈ భాగంలో మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో చోటు చేసుకున్న ఒక గొప్ప యాత్ర, మేరాజ్ యాత్ర గురించి మనం ఇన్ షా అల్లాహ్ తెలుసుకోబోతున్నాం.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ఉంటున్నప్పటి సంఘటన ఇది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిదె హరాంలో ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దైవదూత అయిన జిబ్రీల్ అలైహిస్సలాం వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పంపించగా, జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చారు. ప్రవక్త వారు మస్జిదె హరాంలో ఉన్న సందర్భంలో ప్రవక్త వారితో కలిసి మాట్లాడి, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదయ శుద్ధి సంఘటన కూడా ఈ సందర్భంలో చోటు చేసుకుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
విశ్వాసుల మధ్య ఏదైనా వివాదం తలెత్తినప్పుడు ఏమి చేయాలి? ఈ ప్రసంగం ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల వెలుగులో ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. సూరా నిసాలోని 59వ ఆయతును ఉటంకిస్తూ, ఏ విషయంలోనైనా అభిప్రాయ భేదం వస్తే దాని పరిష్కారం కోసం అల్లాహ్ (ఖురాన్) మరియు ఆయన ప్రవక్త (సున్నత్) వైపు మరలాలని స్పష్టం చేస్తుంది. మూడవ వ్యక్తిని లేదా ఒక నిర్దిష్ట పండితుడిని (తఖ్లీద్) గుడ్డిగా అనుసరించడం ఈ ఖురానీయ సూత్రానికి విరుద్ధమని, ఇది ముస్లిం సమాజంలో అనైక్యతకు దారితీస్తుందని వివరిస్తుంది. అంతిమంగా, ఖురాన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సంప్రదాయాన్ని గట్టిగా పట్టుకున్నంత కాలం ముస్లింలు మార్గభ్రష్టత్వానికి గురికారని ప్రవక్త చేసిన హితోపదేశంతో ప్రసంగం ముగుస్తుంది.
ఇన్నల్ హమ్దలిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాఅదహ్, అమ్మా బాద్. అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.
వివాదం తలెత్తినప్పుడు ఏమి చేయాలి?
వివాదం తలెత్తినప్పుడు మనం ఏమి చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఏ విషయంలోనైనా వివాదం తలెత్తినప్పుడు మనం ఏమి చేయాలి? ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల్లో దాని పరిష్కారం వెతకాలి.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో ఇలా సెలవిచ్చాడు, సూరా నిసా, ఆయత్ నెంబర్ 59:
فَإِن تَنَٰزَعْتُمْ فِى شَىْءٍ فَرُدُّوهُ إِلَى ٱللَّهِ وَٱلرَّسُولِ (ఫ ఇన్ తనాజా’తుమ్ ఫీ షైఇన్ ఫరుద్దూహు ఇలల్లాహి వర్రసూల్) “మీ మధ్య వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్ మరియు ప్రవక్త వైపుకు మరల్చండి.” (4:59)
ఏ విషయంలోనైనా మీ మధ్య వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపుకు మరల్చండి. వివాదాస్పదమైన విషయాన్ని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపుకు మరల్చటం అంటే, నేటి ధార్మిక పరిభాషలో అర్థం, ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల వైపుకు మరలటం అన్నమాట. అభిప్రాయ భేదాలను, వివాదాలను పరిష్కరించటానికి ఇది అత్యుత్తమమైన మార్గదర్శక సూత్రం.
ఈ సూత్రం ద్వారా అర్థమయ్యేది ఏమిటంటే, మరో మూడో వ్యక్తిని అనుసరించవలసిన అగత్యం లేదు. అనుసరించాలంటే, అల్లాహ్ ఆయన ప్రవక్త ఆదేశాలను పాటించాలంటే, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను అనుసరించటం. మూడో వ్యక్తిని అనుసరించవలసిన అగత్యం లేదన్నమాట. ఈ విషయం బాగా మనం గ్రహించాలి.
తఖ్లీద్ (గుడ్డి అనుసరణ)
ఒకానొక నిర్ణీత పండితున్ని అనుసరించటం, దీనిని తఖ్లీదె ముఅయ్యన అంటారు. అంటే ఒకానొక నిర్ణీత పండితున్ని అనుసరించటం తఖ్లీదె ముఅయ్యన, తఖ్లీదె ముఅయ్యన్ లేక తఖ్లీదె షఖ్సీ తప్పనిసరి అని చెప్పేవారు, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో పాటు మూడో వ్యక్తి అనుసరణను తప్పనిసరిగా ఖరారు చేశారు. దీనికి రూఢీ లేదు.
ఈ దివ్య ఖురాన్ లోని ఈ ఆయతుకు పూర్తిగా విరుద్ధమైన ఈ మూడో వ్యక్తి అనుసరణ, ముస్లింలకు ఐక్య సమాజం, ఉమ్మతె ముత్తహిద కాకుండా, అనైక్య సమాజం, ఉమ్మతె ముంతషిరగా, ఇంకా చెప్పాలంటే, ముస్లిం సమాజ ఐక్యతను దాదాపు దుస్సాధ్యంగా మార్చివేసింది ఈ తఖ్లీదె ముఅయ్యన్, ఈ తఖ్లీదె షఖ్సీ.
కానీ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం సెలవిచ్చారు?
ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి ‘ముఅత్తా’లో ఈ హదీసును ప్రస్తావించారు: మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనం ఇది:
“నేను, మీ మధ్య రెండు వస్తువులను వదలిపోతున్నాను. మీరు ఆ రెండు వస్తువులను గట్టిగా పట్టుకొని ఉన్నంతకాలం సన్మార్గం తప్పరు. సన్మార్గంలోనే ఉంటారు.అవేమంటే, ఒకటి అల్లాహ్ గ్రంథం ఖురాన్. రెండోది, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సంప్రదాయం, సున్నత్.“
అంటే, సారాంశం ఏమనగా, వివాదం తలెత్తినప్పుడు మనం మన వివాదాలను అల్లాహ్ మరియు ప్రవక్త వైపుకు మరల్చాలి అన్నమాట. స్వయంగా మనము ఏదీ కూడా కల్పించకూడదు. స్వయంగా ఊహించుకొని నిర్ణయాలు తీసుకోకూడదు. మూడో వ్యక్తికి, నాలుగో వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వకూడదు.
ఏదైనా ధర్మం విషయంలో, న్యాయం చేసే విషయంలో, ఏదైనా ఆరాధనలో, ఏదైనా సరే అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను పాటించే విషయంలో, అనుసరించే విషయంలో ఏదైనా వివాదం తలెత్తితే ఏం చేయాలి?
فَإِن تَنَٰزَعْتُمْ فِى شَىْءٍ فَرُدُّوهُ إِلَى ٱللَّهِ وَٱلرَّسُولِ (ఫ ఇన్ తనాజా’తుమ్ ఫీ షైఇన్ ఫరుద్దూహు ఇలల్లాహి వర్రసూల్) “ఏ విషయంలోనైనా మీ మధ్య వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్ మరియు ప్రవక్త వైపుకు మరల్చాలి.”
అంటే ఖురాన్ మరియు ప్రవక్త గారి ప్రామాణికమైన హదీసుల వెలుగులో దానికి మనము పరిష్కారం చూపాలి. అదే విషయం మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు: “నేను మీ మధ్య రెండు విషయాలు వదిలిపోతున్నాను. మీరు ఆ రెండు విషయాలను గట్టిగా పట్టుకున్నంతవరకు మార్గం తప్పరు. మార్గభ్రష్టులు అవ్వరు. సన్మార్గంలోనే ఉంటారు, సత్యంలోనే ఉంటారు, న్యాయంలోనే ఉంటారు, ధర్మంలోనే ఉంటారు. ఆ రెండింటిలో ఏ ఒక్కటి వదిలేసినా, ఏ ఒక్క దానిపైన కూడా నిర్లక్ష్యం చూపినా మార్గం తప్పుతారు. ఆ రెండు, ఖురాన్ మరియు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్.”
వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సమాధుల చుట్టూ ప్రదక్షిణ (తవాఫ్) & సమాధుల వైపు నమాజ్ చెయ్యడం https://youtu.be/mtb-SmruW8E [6 నిముషాలు] షేఖ్ హబీబుర్రహ్మాన్ జామిఈ హఫిజహుల్లాహ్
ఈ ప్రసంగంలో, సమాధుల చుట్టూ ప్రదక్షిణ (తవాఫ్) చేయడం మరియు వాటి వైపు తిరిగి నమాజ్ చేయడం ఇస్లాంలో నిషేధించబడినవని స్పష్టంగా వివరించబడింది. తవాఫ్ అనేది మక్కాలోని కాబతుల్లాహ్కు మాత్రమే ప్రత్యేకమైన ఆరాధన అని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో నొక్కి చెప్పబడింది. ప్రవక్తల సమాధులను ఆరాధనా స్థలాలుగా మార్చుకున్న వారిని అల్లాహ్ శపించాడని, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సమాధిని పూజించే స్థలంగా మార్చవద్దని ప్రార్థించారని ఉల్లేఖించబడింది. ప్రవక్త యొక్క మస్జిద్ (మస్జిదె నబవి) ఎంతో పవిత్రమైనదైనప్పటికీ, దాని చుట్టూ కూడా తవాఫ్ చేయడానికి అనుమతి లేనప్పుడు, ఇతర సమాధులు లేదా దర్గాల చుట్టూ తిరగడం ఘోరమైన పాపం (షిర్క్) అవుతుందని హెచ్చరించబడింది. ముస్లింలు ఇలాంటి షిర్క్ మరియు బిద్అత్ (మతంలో నూతన కల్పనలు)లకు దూరంగా ఉండాలని ప్రసంగం ముగిసింది.
ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ బ’అదహు అమ్మా బ’అద్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ 12వ ఎపిసోడ్లో, సమాధుల ప్రదక్షిణం చేయటం, దాని వాస్తవికత ఏమిటో తెలుసుకుందాం. సోదరులారా, మన సమాజంలో కొందరు అమాయకులు, అజ్ఞానం వల్లో అలాగే ఇస్లాం గురించి సరైన అవగాహనం లేనందువల్ల సమాధుల వద్ద పోయి పూజిస్తున్నారు, సమాధుల తవాఫ్ (ప్రదక్షిణం) చేస్తున్నారు.
ఈ భూమండలంలో కాబతుల్లాహ్ తవాఫ్ తప్ప ఇతరుల తవాఫ్కి అనుమతి లేదు. అది ఎంత పవిత్రమైన స్థలమైనా సరే, కాబతుల్లాహ్ తప్ప మరేదానిని తవాఫ్ చేయకూడదు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా తెలియజేశాడు,
وَلْيَطَّوَّفُوا بِالْبَيْتِ الْعَتِيقِ (వల్ యత్తవ్వఫూ బిల్ బైతిల్ అతీఖ్) వారు ఆ ప్రాచీన గృహానికి (కాబతుల్లాహ్కు) ప్రదక్షిణ చేయాలి. (22:29)
అంటే ఆ కాబతుల్లాకి తవాఫ్ చేయాలి. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, ఈ హదీస్ ఇబ్నె మాజాలో ఉంది, ఎవరైతే ఆ కాబతుల్లాకి చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తాడో, తవాఫ్ చేస్తాడో, ఆ తర్వాత రెండు రకాత్ నమాజులు పాటిస్తాడో, ఆ వ్యక్తికి ఒక బానిసను విముక్తి ప్రసాదించే అంత పుణ్యం లభిస్తుంది.
సమాధుల వైపు నమాజ్ చేయడం
అభిమాన సోదరులారా, సమాధుల వైపునకు ముఖాన్ని త్రిప్పి నమాజ్ చేయడం అది అధర్మము, అసత్యము, అది హరామ్ అవుతుంది. కొందరు మదీనాలో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి వైపు తిరిగి ప్రార్థనలు చేస్తారు, వేడుకుంటారు, దుఆ చేస్తారు, నమాజ్ చేస్తారు, ఇది అధర్మం. ఈ విషయం గురించి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కఠినంగా ఖండించారు.
అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు,
لَعَنَ اللَّهُ الْيَهُودَ وَالنَّصَارَى اتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ (ల’అనల్లాహుల్ యహూద వన్ నసారా ఇత్తఖదూ ఖుబూర అంబియా’ఇహిమ్ మసాజిదా) అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యూదుల పైన మరియు క్రైస్తవుల పైన శపించుగాక! ఎందుకంటే వారు ప్రవక్తల సమాధులను సజ్దాగా(ఆరాధన స్థలాలు) చేసుకున్నారు. (ముత్తఫకున్ అలైహ్)
అంటే మస్జిద్ గా చేసుకున్నారు. అంటే సజ్దా అల్లాహ్ కోసమే చేయాలి. అది మనము నమాజ్ ఎక్కడ చేస్తాము? మస్జిద్ కి పోయి చేస్తాము. కాకపోతే యోధులు మరియు క్రైస్తవులు ప్రవక్తల సమాధులను మస్జిదులుగా మార్చేశారు, మస్జిదులుగా ఖరారు చేసుకున్నారు.
అలాగే అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు,
اللَّهُمَّ لَا تَجْعَلْ قَبْرِي وَثَنًا يُعْبَدُ (అల్లాహుమ్మ లా తజ్’అల్ ఖబ్రీ వసనన్ యు’బద్) ఓ అల్లాహ్, నా సమాధిని ప్రార్థనాలయంగా మార్చకు.
అంటే, ఓ అల్లాహ్, నేను చనిపోయిన తర్వాత నా సమాజంలో, నా ఉమ్మత్ లో కొంతమంది రావచ్చు, వచ్చి నా సమాధి వైపు తిరగవచ్చు, ప్రదక్షిణం చేయవచ్చు, కాకపోతే ఓ అల్లాహ్ నువ్వు నా సమాధిని ప్రార్థనాలయంగా మార్చవద్దు.
ఆ జాతి పైన అల్లాహ్ యొక్క క్రోధం కఠినంగా మారిపోతుంది, ఏ జాతి పైన?
“ఏ జాతి వారు, ఏ వర్గం వారు ఎవరైతే ప్రవక్తల సమాధులను ప్రదక్షిణం చేస్తారో, ప్రవక్తల సమాధులను ఆరాధన స్థలంగా మార్చుకుంటారో, అటువంటి జాతి పైన అల్లాహ్ యొక్క క్రోధం కఠినంగా మారిపోతుందని” అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ లో తెలియజేశారు.
అభిమాన సోదరులారా, అలాగే సమాధుల వైపునకు ముఖాన్ని త్రిప్పి నమాజ్ చేయకూడదు. ఎటువైపు త్రిప్పి నమాజ్ చేయాలి? అది కేవలం కాబతుల్లాహ్ వైపు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా తెలియజేశాడు సూరతుల్ బఖరాలో,
అభిమాన సోదరులారా, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, “మీరు సమాధుల పై గానీ, సమాధుల వైపునకు గానీ ముఖాలను త్రిప్పి నమాజు చేయకండి.”
అభిమాన సోదరులారా, ఇక్కడ గమనించే విషయం ఏమిటంటే, ఈ భూమండలంలో కాబతుల్లాహ్ తర్వాత, మస్జిదె హరామ్ తర్వాత పవిత్రమైన స్థలాలు రెండు ఉన్నాయి. ఒకటి మస్జిదె నబవి, రెండవది మస్జిదె అఖ్సా.
మస్జిదె హరామ్, మస్జిదె నబవి, మస్జిదె అఖ్సా – ఈ మూడు మస్జిదులకు నమాజ్ చేసే ఉద్దేశంతో ప్రయాణం చేయవచ్చు. మస్జిదె నబవిలో ఒక నమాజ్ చేస్తే వెయ్యి నమాజుల పుణ్యం అంత లభిస్తుంది. అంటే అది హరమ్ అది. ఏ విధంగా మస్జిదె హరామ్ హరమ్ కిందికి వస్తుందో, అలాగే మస్జిదె నబవి కూడా హరమ్ లో వస్తుంది. అయినప్పటికీ, ఆ మస్జిదె నబవి యొక్క ప్రదక్షిణం చేయటం కూడా ధర్మసమ్మతం కాదు, మరి మనం దర్గాలకు, దర్గాల వైపు తిరుగుతున్నాము, సమాధుల వైపు తిరుగుతున్నాము, బాబాలని, పీర్లని, ఔలియాలని… మన ప్రవక్త కంటే పెద్ద వలీ ఎవరండీ?
కాకపోతే ఈ కాబతుల్లా తవాఫ్ తప్ప, కాబతుల్లా ప్రదక్షిణం తప్ప ప్రపంచంలో, ఈ భూమండలంలో దేనిని ప్రదక్షిణం చేసినా అది అధర్మం అవుతుంది. ఈ విషయం గురించి ఎన్నో వందలాది హదీసులు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ షిర్క్ నుండి, బిద్ఆ నుండి, ఖురాఫాతు నుండి కాపాడుగాక. ఇస్లాం పట్ల సరైన అవగాహనను అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. ఆమీన్.
వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ఇస్లాంలో మస్జిద్ (మసీదు) యొక్క ఉన్నతమైన స్థానం మరియు ప్రాముఖ్యత గురించి వివరించబడింది. మస్జిద్ కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదని, అది విశ్వాసం, శాంతి, ఐక్యత మరియు విద్యకు కేంద్రమని వక్త నొక్కిచెప్పారు. మస్జిద్ లు ఇస్లామీయ కోటలని, అక్కడి నుండే ఇస్లాం వెలుగు ప్రపంచమంతటా వ్యాపించిందని తెలిపారు. ప్రవక్త ముహమ్మద్ (స) కాలంలో, సహాబాలు మస్జిద్ ను ఒక విశ్వవిద్యాలయంగా, శిక్షణా కేంద్రంగా ఎలా ఉపయోగించుకున్నారో ఉదాహరణలతో వివరించారు. అబూ హురైరా (ర) వంటి సహాబాలు మస్జిద్ లోనే ఉంటూ జ్ఞానాన్ని ఎలా సంపాదించారో పేర్కొన్నారు. మస్జిద్ లను నిర్మించడం, వాటిని ఆబాద్ (సజీవంగా) చేయడం, మరియు వాటి పట్ల గౌరవం చూపడం యొక్క పుణ్యఫలాలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో విశదీకరించారు. చివరగా, మస్జిద్ లో ప్రవేశించేటప్పుడు, ఉన్నప్పుడు మరియు బయటకు వెళ్ళేటప్పుడు పాటించవలసిన నియమాలు, మర్యాదల గురించి ప్రస్తావించారు.
مَنْ يَهْدِهِ اللهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ [మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహూ వమన్ యుద్లిల్ ఫలా హాదియ లహూ] ఎవరికైతే అల్లాహ్ మార్గదర్శకత్వం చూపాడో అతన్ని ఎవరూ త్రోవ తప్పించలేరు. మరియు ఎవరినైతే అల్లాహ్ త్రోవ తప్పించాడో అతనికి ఎవరూ మార్గదర్శకత్వం చూపలేరు.
وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ [వ అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ] మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు. ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు.
وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ [వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ] మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త.
أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللهِ وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ [అమ్మా బ’అదు ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహి వ ఖైరల్ హద్యి హద్యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం] ఇక విషయానికొస్తే, నిశ్చయంగా అన్ని మాటలలో ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం. మరియు అన్ని మార్గాలలో ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం.
وَشَرَّ الْأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ وَكُلَّ ضَلَالَةٍ فِي النَّارِ [వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా వ కుల్ల ముహ్దసతిన్ బిద్’అతున్ వ కుల్ల బిద్’అతిన్ దలాలతున్ వ కుల్ల దలాలతిన్ ఫిన్నార్] మరియు అన్ని విషయాలలో చెడ్డవి కొత్తగా కల్పించబడినవి. మరియు ప్రతీ కొత్తగా కల్పించబడినది బిద్’అత్. మరియు ప్రతీ బిద్’అత్ మార్గభ్రష్టత్వం. మరియు ప్రతీ మార్గభ్రష్టత్వం నరకానికి దారితీస్తుంది.
సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడతలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయు గాక.
ఇస్లాంలో మస్జిదుల స్థానం
అభిమాన సోదరులారా, ఈరోజు మనం ఇన్షా అల్లాహ్, ఇస్లాంలో మస్జిదుల స్థానం అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
మస్జిద్ అంటే సజ్దా చేసే చోటు అని అర్థం. ప్రత్యేకంగా అల్లాహ్ ఆరాధన కోసం నిర్మించబడిన ఆలయాన్ని మస్జిద్ అంటారు.
మస్జిద్ కి గౌరవప్రదమైన, ఉన్నతమైన, పవిత్రమైన స్థానం ఉంది. ఇది ఈమాన్ మరియు శాంతికి మూలం. ప్రార్థనలు జరుపుకునే ప్రదేశం. ఇక్కడ ప్రార్థనలు స్వీకరించబడతాయి. ఉమ్మతి యొక్క ఐక్యతకు ఇదొక శీర్షిక. హిదాయత్, మంచితనం, స్థిరత్వానికి చిహ్నం. శాస్త్రీయపరమైన, ఆచరణాత్మకమైన, ఆధ్యాత్మికమైన గృహం మస్జిద్.
ఇది ధృడమైన శిక్షణా కేంద్రం. ఈ కేంద్రం నుంచే ఏమీ తెలియని ప్రజలు, గొర్రెలు మేపే సహాబాలు, ప్రపంచ ప్రతినిధులుగా తయారయ్యారు. దీని ఆధారంగానే రాగ ద్వేషాలలో రగిలే ప్రజలు ప్రేమానురాగాలకు ప్రతిరూపాలయ్యారు. ఈ కేంద్రం నుంచే సహాబాలు ఆ తరువాత వారు దీన్, దునియా, పరలోకం యొక్క శాస్త్రాలలో అత్యంత ప్రముఖులు, పట్టభద్రులయ్యారు.
ఇదొక పాఠశాల. దీనిలో విశ్వాసాల శిక్షణ జరుగుతుంది. హృదయాలు ఆధ్యాత్మికంగా శుద్ధి చేయబడతాయి. గొప్ప నాయకులు తయారవుతారు. ఇది ఒక న్యాయ వ్యవస్థ మరియు ఫత్వాలను జారీ చేసే ఓ మండలి. ఆశ్రయం లేని వారికి ఇదొక ఆశ్రయం. దాని మిహరాబు నుంచి అల్లాహ్ యొక్క స్పష్టమైన ఆయతులు పఠించబడతాయి. దీని మింబర్ నుంచి ప్రభావంతమైన ఖుత్బాలు, ఉపన్యాసాలు ఇవ్వబడతాయి.
మస్జిద్ అంటే కేవలం ఆరాధన ఆలయం మాత్రమే కాదు. వాస్తవానికి, మస్జిదులు ఇస్లామీయ కోటలు, ఇస్లాం ధర్మం కేంద్రాలు. ఇక్కడి నుండే ఇస్లాం వెలుగు ప్రపంచంలోని నలుదిశలూ వ్యాపించి విశ్వాన్నంతటినీ జ్యోతిర్మయం చేస్తుంది. ఈ మస్జిద్ల నుంచే సరైన ఇస్లామీయ బోధనలు జనబాహుళ్యంలో ప్రచారం చెందుతాయి. స్వచ్ఛమైన ఏక దైవోపాసనకు ప్రాచుర్యం లభిస్తుంది.
అభిమాన సోదరులారా, ఇక్కడ ముస్లింలందరూ తమ తమ భేదాలన్నీ కట్టిపెట్టి పాలు నీళ్ళల్లా కలిసిపోతారు. అల్పుడు, అధికుడు, పేదవాడు, ధనికుడు, అరబ్బుడు, అరబ్బేతరుడు, నల్లవాడు, తెల్లవాడు అనే భేద భావాలన్నీ మరచి ఒకే వరుసలో నిలుచుంటారు. అటువంటి స్థలం, కేంద్రం మస్జిద్.
మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, “మీరు ఒక వ్యక్తిని మస్జిద్ కు వస్తూ పోతూ ఉండగా చూస్తే అతని విశ్వాసం గురించి సాక్ష్యం ఇవ్వండి” అన్నారు. ఇది మస్జిద్ యొక్క మహత్యం.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో మస్జిద్ గురించి ఏమన్నాడు?
فِي بُيُوتٍ أَذِنَ اللَّهُ أَن تُرْفَعَ وَيُذْكَرَ فِيهَا اسْمُهُ يُسَبِّحُ لَهُ فِيهَا بِالْغُدُوِّ وَالْآصَالِ (ఏ గృహాల గౌరవ ప్రతిపత్తిని పెంచాలని, మరి వేటిలో తన నామస్మరణ చేయాలని అల్లాహ్ ఆజ్ఞాపించాడో వాటిలో ఉదయం సాయంత్రం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతుంటారు, (24:36)
ఇక్కడ గృహాలు అంటే మస్జిద్. అంటే అర్థమేమిటి? విశ్వాసులు, అల్లాహ్ విధేయులు ఉదయం సాయంత్రం మస్జిదులలో అల్లాహ్ ప్రీతి కోసం నమాజులు చేస్తారు, కడు దీనంగా అల్లాహ్ ను వేడుకుంటారు.
అలాగే,
رِجَالٌ لَّا تُلْهِيهِمْ تِجَارَةٌ وَلَا بَيْعٌ عَن ذِكْرِ اللَّهِ وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ ۙ يَخَافُونَ يَوْمًا تَتَقَلَّبُ فِيهِ الْقُلُوبُ وَالْأَبْصَارُ (కొందరు) పురుషులు. వర్తకంగానీ, క్రయవిక్రయాలుగానీ అల్లాహ్ నామస్మరణ, నమాజు స్థాపన, జకాత్ చెల్లింపు విషయంలో వారిని పరధ్యానానికి లోను చేయలేవు. ఏ రోజున హృదయాలు తలక్రిందులై, కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడుతూ ఉంటారు.(24:37)
ఈ ఆయత్ యొక్క అర్థాన్ని మనం గమనించాలి. కొంతమంది ఎలా ఉంటారు? వారిని వారి వర్తకం గానీ, వ్యాపారం, క్రయ విక్రయాలు గానీ అల్లాహ్ నామ స్మరణ, నమాజు స్థాపన, జకాత్ చెల్లింపు విషయంలో పరధ్యానానికి లోను చేయలేవు. అంటే మనిషి చేసే వ్యాపారాలు, క్రయ విక్రయాలు, ఉద్యోగాలు అతని జీవితంలో వస్తూ పోయే సమస్యలు, బాధ్యతలు ఇవన్నీ ఆ విశ్వాసిని, ఆ వ్యక్తుల్ని మస్జిద్ కి పోయి జమాత్ తో నమాజ్ చేయటం లేదా జిక్ర్ చేయటం, అల్లాహ్ ను ఆరాధించటం, జకాత్ ఇవ్వటం వీటిని వారి జీవన సమస్యలు ఆపలేవు. ఎందుకు? ఏ రోజున హృదయాలు తలక్రిందులై కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడతారు. అంటే ప్రళయం గురించి, అల్లాహ్ శిక్ష గురించి వారు భయపడతారు.
لِيَجْزِيَهُمُ اللَّهُ أَحْسَنَ مَا عَمِلُوا وَيَزِيدَهُم مِّن فَضْلِهِ ۗ وَاللَّهُ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ తమ సత్కార్యాలకు అల్లాహ్ ఉత్తమ ప్రతిఫలం ఇవ్వటానికి, అల్లాహ్ తన కృపతో మరింత అధికంగా వొసగటానికి (వారు ఈ విధంగా మసలుకుంటారు). అల్లాహ్ తాను తలచిన వారికి లెక్క లేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు.(24:38)
అభిమాన సోదరులారా, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ గురించి ఇంకా ఇలా సెలవిచ్చారు,
“అల్లాహ్ గృహాలలోని ఏదైనా ఒక గృహంలో కొంతమంది గుమికూడి దైవ గ్రంథాన్ని పారాయణం చేస్తూ, దాని గురించి పరస్పరం చర్చించుకుంటూ ఉంటే, అల్లాహ్ తరపున నుండి వారి మీద ప్రశాంతత, సకీనత్, ఆవరిస్తుంది. అలాగే రహ్మత్, దైవ కారుణ్యం వారిని కమ్ముకుంటుంది. అలాగే దైవదూతలు వారిని చుట్టుముడతారు. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన ఆస్థానములోని అంటే దైవదూతల మధ్య వారిని పరిచయం చేస్తాడు” (ముస్లిం)
ఇది ఎవరైతే మస్జిద్ లో ఖురాన్ పఠిస్తారో, ఖురాన్ నేర్చుకుంటారో, ఖురాన్ గురించి చర్చించుకుంటారో, దీన్ గురించి నేర్చుకుంటారో, నేర్పుతారో అటువంటి వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గొప్ప ప్రతిఫలం ఇస్తున్నాడు. ఈ ఆయత్ లో నాలుగు విషయాలు ఉన్నాయి. ఒకటి వారి జీవితాలలో వారికి ప్రశాంతత. ఇది డబ్బుతో కొనలేము. ప్రశాంతత ఇది విలువైన, గొప్ప వరం ఇది. రెండవది ఏమిటి? కారుణ్యం. అల్లాహ్ కరుణ లేకపోతే మన జీవితం దుర్భరమైపోతుంది. ఇహము పోతుంది పరము పోతుంది. మూడవది ఏమిటి? దైవదూతలు ప్రేమిస్తారు. నాలుగవది ఏమిటి? సకల లోకాలకు సృష్టికర్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రబ్బుల్ ఆలమీన్ ఆయన దైవ దూతల మధ్య వారి పరిచయం చేస్తాడు. ఎంత అదృష్టవంతులు వారు.
ఇంకా అల్లాహ్ యే ఇలా సెలవిచ్చాడు, మస్జిద్ లను ఆబాద్ చేయాలి. అంటే మస్జిద్ లు ఆబాద్ చేయటం అంటే ఏమిటి? మస్జిద్ లు నిర్మించాలి. య’అముర్ అంటే మస్జిద్ ను ఆబాద్ చేయటం, మస్జిద్ ని నిర్మించటం. దానికి అసలు అర్థం ఏమిటి స్వయంగా అల్లాహ్ సెలవిచ్చాడు.
అంటే మస్జిదుల నిర్వహణకి తగిన వారు, మస్జిదులను ఆబాద్ చేసే వారు ఎవరు? ఈ గుణాలు అల్లాహ్ సెలవిచ్చాడు. అంటే సన్మార్గ భాగ్యం పొందిన వారు కూడా వీళ్ళే అని అల్లాహ్ అంటున్నాడు. అంటే ఈ ఆయత్ లో మస్జిదులను ఆబాద్ చేసే వారి గుణాలు అల్లాహ్ తెలియజేశాడు.
మొదటి గుణం ఏమిటి? వారు అల్లాహ్ ను విశ్వసిస్తారు. అల్లాహ్ పట్ల దృఢమైన, నిజమైన, వాస్తవమైన విశ్వాసం కలిగి ఉంటారు. రెండవది ఏమిటి? వారు అంతిమ దినాన్ని విశ్వసిస్తారు. ఒక రోజు నేను చనిపోవాల్సిందే, ఈ ప్రపంచం అంతం అవ్వాల్సిందే, చనిపోయిన తరువాత అల్లాహ్ కు లెక్క చూపించాల్సిందే, లెక్కల గడియ వస్తుంది, తీర్పు దినం వస్తుంది, ఆ అంతిమ దినం పట్ల విశ్వసిస్తాడు రెండవది. మూడవది ఏమిటి? నమాజులు చేస్తారు, నమాజులు పాటిస్తారు. నాలుగోది జకాత్ విధిగా చెల్లిస్తారు. ఐదవది ఏమిటి? అల్లాహ్ కు మాత్రమే భయపడతారు. ఇది గమనించాల్సిన విషయం ఇది. జీవితం, ప్రాపంచిక జీవితం యొక్క ప్రేమలో పడిపోయి చాలామంది అల్లాహ్ కు తప్ప ప్రతి ఒక్కరితో భయపడుతున్నారు. మనలో చాలా మంది జీవితం ఇలా అయిపోయింది ప్రతిదానికి భయపడటం అల్లాహ్ కు తప్ప. అల్లాహ్ ఏమంటున్నాడు? అల్లాహ్ కు మాత్రమే భయపడండి, వేరే వారితో భయపడకండి. మస్జిద్ ను ఆబాద్ చేసేవారు ఎవరు? నాలుగవ వారు అల్లాహ్ ను మాత్రమే భయపడతారు. వ లమ్ యఖ్ష ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప ఎవ్వరికీ భయపడరు.
ఈ గుణాలు కలిగిన వారికి అల్లాహ్ ఏమంటున్నాడు? య’అమురు మసాజిదల్లాహ్. వీళ్లే మసాజిద్ లను ఆబాద్ చేసేవారు, నిర్వహణకు తగిన వారు. ఇంకా చివరి వాక్యంలో అల్లాహ్ ఏమన్నాడు? ఫ’అసా ఉలాఇక అన్ యకూనూ మినల్ ముహ్తదీన్. సన్మార్గ భాగ్యం, హిదాయత్ ప్రసాదించబడిన వారు వీరేనని ఆశించవచ్చు. ఇది అసలైన అర్థం మస్జిదులను ఆబాద్ చేయటం అంటే.
ఇక అభిమాన సోదరులారా, ఇప్పుడు వరకు మనం మస్జిద్ గురించి, మస్జిద్ స్థానం గురించి, మస్జిద్ నిర్వహణ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మన జీవన విధానం అలా ఉందా? మస్జిదుల విషయంలో. మస్జిదులు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాయి? వాస్తవంగా మస్జిదులను మనం ఆబాద్ చేస్తున్నామా? మస్జిదులకు సంబంధించిన ఆదాబులు పాటిస్తున్నామా? మస్జిదుల హక్కులు పూర్తి చేస్తున్నామా? మనలోని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
ను వేరే విషయానికి వస్తున్నాను, మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు,
مَنْ بَنَى مَسْجِدًا لِلَّهِ بَنَى اللَّهُ لَهُ فِي الْجَنَّةِ مِثْلَهُ “మన్ బనా లిల్లాహి మస్జిదన్, బనల్లాహు లహూ బైతన్ ఫిల్ జన్నహ్.” ఎవరైనా అల్లాహ్ కోసం మస్జిద్ ను నిర్మిస్తే, అల్లాహ్ అతని కోసం స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు.
ఇక్కడ ఒక ప్రశ్న మనసులో రావచ్చు, ప్రతి ఒక్కరికీ ఒక మస్జిద్ నిర్మించే స్తోమత ఉంటుందా? ఆర్థికపరంగా. ఇన్నమల్ అ’అమాలు బిన్నియ్యాత్. కర్మల పరంగా అల్లాహ్ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. కర్మలు సంకల్పాలపై ఆధారపడి ఉన్నాయి. అందుకు ప్రతి వ్యక్తికి ఈ స్తోమత ఉండదు. కానీ ప్రతి వ్యక్తి మస్జిద్ నిర్మాణంలో పాలు పంచుకొనవచ్చు, తన శక్తి ప్రకారం.
అలాగే, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,
أَحَبُّ الْبِلَادِ إِلَى اللَّهِ مَسَاجِدُهَا، وَأَبْغَضُ الْبِلَادِ إِلَى اللَّهِ أَسْوَاقُهَا “అహబ్బుల్ బిలాది ఇలల్లాహి మసాజిదుహా వ అబ్గదుల్ బిలాది ఇలల్లాహి అస్వాకుహా.” “అల్లాహ్ దృష్టిలో అన్ని చోట్లలలో కెల్లా అత్యంత ప్రీతికరమైన, శ్రేయస్కరమైన చోటు మస్జిద్. అలాగే అల్లాహ్ దృష్టిలో అన్ని చోట్లలలో కెల్లా అత్యంత హానికరమైన చోటు బజారు“
ఈ హదీస్ మనం మనసులో ఉంచుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు మన మస్జిదులు అలా ఉన్నాయా? అత్యంత శ్రేష్టకరమైన, పవిత్రమైన, ప్రీతికరమైన ఉన్నాయా? అల్లాహ్ దృష్టిలో ఉంది, అల్లాహ్ అంటున్నాడు అన్నిటికంటే శ్రేష్టమైన, శ్రేయస్కరమైన, ప్రీతికరమైన, పవిత్రమైన చోటు, స్థలం, కేంద్రం మస్జిద్ అని. కానీ ఇప్పుడు మన మస్జిదులు గీబత్ కి కేంద్రం, చాడీలకి కేంద్రం, ఖియానత్ కి కేంద్రం, లావాదేవీలకి కేంద్రం, రాజకీయాలకు కేంద్రం, ఇలా మారిపోయినాయి. కానీ అత్యంత హానికరమైన, మంచిది కాని స్థలం బజారు. కానీ మనము సహాబాలు, తాబయీన్లు, మన పూర్వీకుల జీవితాలు మనము వారి చరిత్ర చదివితే, వారు బజార్లను, అస్వాఖ్ లను, మస్జిదులుగా మార్చేసేవారు. వారి జీవన విధానం అలా ఉండేది. కొంతమంది సహాబాలు బజార్ కి సోదరులు, ముస్లిములు, తెలిసిన వారు, తెలియని వారు, ఇరుగు పొరుగు వారు కనపడతారేమో, సలాం చెప్దామన్న ఉద్దేశంతో పోయేవారు. అంటే మన పూర్వీకులు హానికరమైన స్థలాన్ని పవిత్రంగా చేసేసారు, అనగా మస్జిద్ గా చేసేసారు, పవిత్రంగా చేసేసేవారు. ఇప్పుడు మనం మస్జిద్ ని సూఖ్ లాగా, బజార్ లాగా చేసేస్తున్నాము. ఈ విషయంలో మనము పరిశీలించాలి, జాగ్రత్తగా ఉండాలి.
అభిమాన సోదరులారా, అలాగే రేపు ప్రళయ దినాన – ఈ హదీస్ మనందరం ఎన్నోసార్లు విన్నాము,
سَبْعَةٌ يُظِلُّهُمُ اللَّهُ فِي ظِلِّهِ يَوْمَ لاَ ظِلَّ إِلاَّ ظِلُّهُ సబ్’అతున్ యుదిల్లుహుముల్లాహు ఫీ దిల్లిహీ యౌమ లా దిల్లా ఇల్లా దిల్లుహ్ రేపు ప్రళయ దినాన ఏడు రకాల వ్యక్తులకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన నీడను ప్రసాదిస్తాడు. ఆ రోజు అల్లాహ్ నీడ తప్ప ఏ నీడా ఉండదు.
ఆ ఏడు రకాల వ్యక్తులలో ఒకరు ఎవరు?
رَجُلٌ قَلْبُهُ مُعَلَّقٌ فِي الْمَسَاجِدِ రజులున్ ఖల్బుహూ ము’అల్లఖున్ ఫిల్ మసాజిద్. ఏ వ్యక్తి యొక్క హృదయం, ఏ వ్యక్తి యొక్క మనసు మస్జిద్ లో ఉంటుందో, అంటే వారి మనసు మస్జిద్ లోకి నిమగ్నులై ఉంటాయి.
ఇది మస్జిద్ అంటే.
అలాగే, మనిషి తన ఇంట్లో లేక వీధిలో చేసే నమాజ్ కన్నా జమాఅత్ తో చేసే నమాజుకు పాతిక రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని హదీస్ లో ఉంది. ఈ విధంగా ఎక్కువ రెట్లు పుణ్యం లభించడానికి కారణం ఏమిటంటే, మనిషి చక్కగా వుజూ చేసుకొని, కేవలం నమాజు చేసే ఉద్దేశ్యంతో వెళ్తుంటే, ఆ సమయంలో అతను వేసే ప్రతి అడుగుకు అల్లాహ్ ఒక్కొక్కటి చొప్పున అతని అంతస్తులను పెంచుతాడు. అంతే కాదు, అతని వల్ల జరిగే పాపాలను కూడా ఒక్కొక్కటిగా తుడిచి పెట్టేస్తాడు. అతను నమాజ్ చేస్తూ వుజూతో ఉన్నంత వరకు దైవదూతలు అతని మీద శాంతి కురవాలని ప్రార్థిస్తూ, ఓ అల్లాహ్ ఇతనిపై శాంతి కురిపించు, ఓ అల్లాహ్ ఇతన్ని కనికరించు అని అంటూ ఉంటారు.
మస్జిద్ లో ప్రవేశించిన తర్వాత జమాత్ నమాజు కోసం అతను ఎంతసేపు నిరీక్షిస్తాడో, ఎదురు చూస్తూ ఉంటాడో, అంతసేపు అతను నమాజులో ఉన్నట్లుగానే పరిగణించబడతాడు. అల్లాహు అక్బర్. ఒక వ్యక్తి అరగంట ముందు మస్జిద్ కి పోయాడు, ఇరవై నిమిషాల ముందు మస్జిద్ కి పోయాడు, నమాజ్ కోసం వేచి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు జమాత్ కోసం, అంటే ఈ ఎంత సేపు అతను ఎదురు చూస్తున్నాడో అంత సేపు అతను ఎక్కడ ఉన్నాడు? నమాజ్ లోనే ఉన్నాడు. నమాజ్ చేస్తున్నాడు. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
ఈ విధంగా మస్జిద్, మస్జిద్ స్థానం, మరియు మన పూర్వీకులు దాని గురించి చాలా వివరాలు ఉన్నాయి. మనము సహాబాల, తాబయీన్ ల చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది. ఉదాహరణగా ఒక్క విషయం చెబుతున్నాను. అన్నిటికంటే అత్యధికంగా హదీసులు చెప్పిన వారు, రివాయత్ చేసిన వారు, అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు. ఆయన పాఠశాల ఏది? మస్జిద్. ఆయన చదువుకున్న యూనివర్సిటీ ఏది? మస్జిద్. ఆయనకి తినటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఒకసారి ఆయన వారి రోషం ఎటువంటిది అంటే అవసరం ఉన్నా కూడా చెయ్యి చాపేవారు కాదు. రెండు మూడు రోజులు అయిపోయింది, అన్నం తినలేదు. అడగటానికి బుద్ధి పుట్టటం లేదు. ఆయన మస్జిద్ బయట వీధిలో ఏ ఉద్దేశంతో పోయారు? సహాబాలు కనపడతారు, వారికి సలాం చెప్తే నన్ను చూసి, నా ముఖాన్ని చూసి వారు అర్థం చేసుకుంటారు అని ఉద్దేశంతో వీధిలో పోయి నిలబడితే అబూబకర్ రదియల్లాహు అన్హు వచ్చారు. ఇది నేను పూర్తి వివరంగా చెప్పదలచలేదు సమయం లేదు. అబూబకర్ కి ఆయన సలాం చెప్తే అబూబకర్ రదియల్లాహు అన్హు వఅలైకుం సలాం చెప్పి ముందుకు సాగిపోయారు. ఆయన బాధపడ్డారు మనసులో. ఆ తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ వచ్చారు రదియల్లాహు అన్హు. ఆయన కూడా వఅలైకుం సలాం చెప్పి ముందుకు సాగిపోయారు. ఈయన మనసులో కుమిలిపోతున్నారు, బాధపడిపోతున్నారు. నా ముఖం వారు గమనించలేదా? నన్ను వారు పట్టించుకోవటం లేదా? అని చెప్పి. ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. చిరునవ్వుతో వఅలైకుం సలాం చెప్పి తోడుగా తీసుకుపోయారు. తీసుకుని పోయి ఇంట్లో ఏముంది అని అడిగితే కొంచెం పాలు ఉంది. అబూ హురైరా మనసులో సంతోషం. పండగ మనసులో. ఈరోజు నాకు పండగ, పాలు దక్కింది అని చెప్పి. అప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ అబూ హురైరా, ఇంకా మస్జిద్ లో ఎంత మంది ఉన్నారు అని అడిగారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు మనసులో కొంచెం పాలు, ప్రవక్త గారు ఇలా అడుగుతున్నారు ఇంత మంది వచ్చేస్తే నాకు ఏం మిగులుతుంది అని మనసులో బాధ. పోయి పిలుచుకొని రా. దాదాపు ఒక 20, 30 మంది వచ్చారు. ఇప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హు ఓకే అల్హందులిల్లాహ్ కొంచెమైనా సరే వస్తుంది అనుకున్నారు. అప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హుతో, అందరికీ పంచు అని చెప్పారు. అప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హు మనసు, అందరికీ నేను పంచాలా? అంటే లాస్ట్ లో ఎవరు తాగాలి నేను. మిగులుతుందా మిగలదా? ఆ తర్వాత అందరికీ పంచారు. అందరూ కడుపు నిండా తాగారు. ఓ అబూ హురైరా, ఇంకా ఎవరున్నారు? ఓ ప్రవక్త నేను మీరు ఇద్దరే ఉన్నాం ప్రవక్త అంటే, నువ్వు తాగు అని చెప్పారు. అబూ హురైరా తాగారు. ప్రవక్రా నేను తాగేసాను. ఇంకోసారి తాగు. ఇంకోసారి తాగు. మూడు సార్లు తాగారు. నాలుగోసారి, దైవప్రవక్త ఇంకా ఇంకోసారి తాగండి అంటే, ఓ దైవప్రవక్త, ఇక్కడ వరకు వచ్చేసింది, ఇప్పుడు తాగలేను. ఆ తర్వాత ప్రవక్త గారు తాగారు. ఇది మోజిజా (మహిమ) . చెప్పటం ఏమిటంటే అటువంటి సహాబీ, ఇల్లు లేని సహాబీ, గృహం లేని సహాబీ, ఆర్థిక పరంగా ఏమీ లేని సహాబీ, వారి విశ్వవిద్యాలయం మస్జిద్, వారి పాఠశాల మస్జిద్, వారి శిక్షణా కేంద్రం మస్జిద్. అందరికంటే అత్యధికంగా హదీసులు రివాయత్ చేశారు అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు. అంత పేదరికంలో ఒకసారి ప్రవక్త గారు వరాన్ని ప్రసాదించారు. ఏం కోరుకుంటావు కోరుకో అని. అప్పుడు ఆయన జ్ఞానాన్ని కోరుకున్నారు. మెమరీ శక్తిని కోరుకున్నారు. ప్రపంచాన్ని కోరుకోలే, ఇల్లుని కోరుకోలే, ధనాన్ని కోరుకోలే. ఇల్లు లేదు ఉండటానికి, దుస్తులు లేవు. అటువంటి స్థితిలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇమాముల్ అంబియా, ఎన్నో వందల గొర్రెలు దానం చేసిన వారు. అడిగిన వారికి ఇచ్చేసేవారు. అటువంటి ఇమామ్-ఏ-కాయినాత్ అడుగుతున్నారు, ఓ అబూ హురైరా ఏం కావాలా అని చెప్పి. దానికి అబూ హురైరా, ఆ పేదవాడు ఏం కోరుకున్నారు? జ్ఞానం కోరారు, ఇల్మ్ కోరారు, జ్ఞాపక శక్తి కోరారు. అందుకోసమే ఆయన ఏమి రాసినా, ఏమి విన్నా ఆయన మనసులో అలాగే ఉండిపోయేది. అందరికంటే ఎక్కువగా హదీసులు ఆయనే రివాయత్ చేశారు.
మస్జిద్ లో పాటించవలసిన నియమాలు
కావున అభిమాన సోదరులారా సమయం అయిపోయింది, మస్జిద్ కి సంబంధించిన కొన్ని ఆదాబులు తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి.
ఒకటి, దుఆ చేస్తూ సలాం చెబుతూ మస్జిద్ లోకి ప్రవేశించాలి (అల్లాహుమ్మఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక్). రాని వారు నేర్చుకోవాలి. తహియ్యతుల్ మస్జిద్ చేసుకోవాలి పోయిన తర్వాత. అలాగే ఉల్లిపాయలు, తెల్ల ఉల్లిపాయలు, ఇంకా ఏ పదార్థాల వల్ల తినటం వల్ల నోటిలో దుర్వాసన వస్తుందో వాటిని తిని రాకూడదు. ఒకవేళ తిన్న యెడల బ్రష్ చేసుకొని ముఖంలో ఎటువంటి దుర్వాసన లేకుండా చూసుకొని ఆ తర్వాత మస్జిద్ కి రావాలి. ఎందుకంటే ప్రవక్తగారు సెలవిచ్చారు, దేని వల్ల మనిషి బాధపడతాడో, దేని వల్లకి మనిషికి కష్టం కలుగుతుందో, దైవదూతలు కూడా బాధపడతారు అని చెప్పారు. అలాగే మస్జిద్ ను పరిశుభ్రంగా ఉంచాలి, నిశ్శబ్దంగా కూర్చొని భయభక్తులు గలవారై అల్లాహ్ స్మరణ చేయాలి. ప్రశాంతంగా కూర్చోవాలి. గోల చేయడం, పరిహాసాలాడటం, లావాదేవీలు జరపటం, మస్జిద్ ని అగౌరవపరిచినట్లు అవుతుంది. మస్జిద్ ను వచ్చిపోయే మార్గంగా చేసుకోకూడదు. ప్రవేశించాక నమాజ్ చేయడమో, పారాయణం చేయడమో, జిక్ర్ చేయడమో, ఆరాధించడం చేయాలే గానీ, ఇదే మస్జిద్ కి హక్కు. అలాగే మస్జిద్ నుంచి పోయేటప్పుడు అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫద్లిక్ అనే దుఆ చేసుకుంటూ పోవాలి.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించు గాక. ఆమీన్. వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
స్వర్గంలోకి ప్రవేశించేవారు నాలుగు రకాలు హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్) https://youtu.be/O0rxrJs_Nms [22 నిముషాలు]
ఈ ప్రసంగంలో, స్వర్గంలో ప్రవేశించే వారి గురించి వివరించబడింది. ముఖ్యంగా నాలుగు రకాల స్వర్గవాసుల గురించి చర్చించబడింది. మొదటి రకం వారు విచారణ లేకుండా స్వర్గానికి వెళ్లేవారు, వీరిలో 70,000 మంది ఉంటారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. వీరి లక్షణాలు: ఇతరులను మంత్రించమని కోరరు, అపశకునాలు నమ్మరు, వాతలు పెట్టించుకోరు మరియు పూర్తిగా అల్లాహ్ పైనే నమ్మకం ఉంచుతారు. రెండవ రకం వారు విచారణ తర్వాత స్వర్గానికి వెళ్లేవారు. మూడవ రకం అస్ హాబుల్ ఆరాఫ్, వీరి పుణ్యాలు పాపాలు సమానంగా ఉంటాయి, వీరు కొంతకాలం ఆగి అల్లాహ్ దయతో స్వర్గానికి వెళ్తారు. నాల్గవ రకం వారు పాపాల కారణంగా నరకంలో శిక్ష అనుభవించిన తర్వాత, వారి ఈమాన్ కారణంగా స్వర్గానికి వెళ్లేవారు. పెద్ద పాపాలు చేసిన వారు కూడా చిత్తశుద్ధితో పశ్చాత్తాపం చెందితే (తౌబా), విచారణ లేకుండా స్వర్గానికి వెళ్లే అవకాశం ఉందని ఖుర్ఆన్ ఆయత్ ల ద్వారా స్పష్టం చేయబడింది. సహాబాల జీవితాల నుండి ఉదాహరణలు, ముఖ్యంగా ఉక్కాషా బిన్ మెహ్సన్ మరియు మూర్ఛ రోగంతో బాధపడిన స్త్రీ ఉదంతాలు, స్వర్గం పట్ల వారికున్న ఆకాంక్షను మరియు అల్లాహ్ పై వారికున్న ప్రగాఢ విశ్వాసాన్ని వివరిస్తాయి.
أَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا [అవూదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅ్మాలినా] మేము మా ఆత్మల చెడు నుండి మరియు మా చెడు పనుల నుండి అల్లాహ్ తో శరణు వేడుకుంటున్నాము.
مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ [మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు, వ మన్ యుద్లిల్ ఫలా హాదియ లహు] అల్లాహ్ ఎవరికి మార్గనిర్దేశం చేస్తాడో, అతడిని ఎవరూ దారి తప్పించలేరు. మరియు ఆయన ఎవరిని దారి తప్పిస్తాడో, అతనికి ఎవరూ మార్గనిర్దేశం చేయలేరు.
وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ [వ అష్హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు] మరియు అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వామి ఎవరూ లేరు.
وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ [వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు] మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.
أَمَّا بَعْدُ، فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ [అమ్మా బఅదు ఫఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్] ఇక తర్వాత, నిశ్చయంగా, ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం (ఖుర్ఆన్).
وَخَيْرُ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ [వ ఖైరల్ హద్యి హద్యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం] మరియు ఉత్తమమైన మార్గదర్శకత్వం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకత్వం.
وَشَرُّ الْأُمُورِ مُحْدَثَاتُهَا، وَكُلُّ مُحْدَثَةٍ بِدْعَةٌ، وَكُلُّ بِدْعَةٍ ضَلَالَةٌ، وَكُلُّ ضَلَالَةٍ فِي النَّارِ [వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా, వ కుల్ల ముహ్దసతిన్ బిద్అతున్, వ కుల్ల బిద్అతిన్ దలాలతున్, వ కుల్ల దలాలతిన్ ఫిన్నార్] మరియు చెడ్డ విషయాలు (ధర్మంలో) కొత్తగా కల్పించబడినవి, మరియు ప్రతి కొత్తగా కల్పించబడిన విషయం ఒక బిద్అత్ (, మరియు ప్రతి బిద్అత్ ఒక మార్గభ్రష్టత్వం, మరియు ప్రతి మార్గభ్రష్టత్వం నరకాగ్నికి దారితీస్తుంది.
సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సర్వలోక ప్రభువైన, పాలకుడైన, సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.
అభిమాన సోదరులారా, హమ్ద్ మరియు సనా తర్వాత స్వర్గములో ప్రవేశించే వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం.
స్వర్గంలో ప్రవేశించే నాలుగు రకాల వారు
స్వర్గములో ప్రవేశించే వారు నాలుగు రకాలు. అల్లాహ్ దయ, ఆయన కరుణ మూలంగా ఎవరైతే స్వర్గములో ప్రవేశిస్తారో, స్వర్గ ప్రవేశం ఎవరికి జరుగుతుందో వారు నాలుగు రకాలు.
మొదటి రకం: విచారణ లేకుండా, అతను చేసిన కర్మల లెక్క తీసుకోకుండా స్వర్గ ప్రవేశం జరుగుతుంది. అదృష్టవంతులు వారు, ఎటువంటి లెక్క లేదు, విచారణ లేదు. విచారణ లేకుండా స్వర్గ ప్రవేశం. ఇది మొదటి రకం.
రెండవ రకం: విచారణ తర్వాత స్వర్గ ప్రవేశం. నిలబడాలి, పుస్తకం ఇవ్వబడుతుంది, ఖుర్ఆన్ మరియు హదీస్ లో చెప్పబడిన విధంగా ప్రతి విషయం గురించి లెక్క తీసుకోవడం జరుగుతుంది. ఎలా సంపాదించావు? ఎలా ఖర్చు పెట్టావు? జీవితం ఎలా గడిచింది? వయసు, యవ్వనం, ప్రతి విషయం గురించి, ప్రతి చిన్న ప్రతి పెద్ద. అల్లాహ్ హక్కులు పూర్తి చేశావా లేదా? దాసుల హక్కులు పూర్తి చేశావా లేదా? ఫర్జ్ విషయాలు, ఆదేశాలు పాటించావా లేదా? ప్రతి విషయం గురించి అడగడం జరుగుతుంది. పరీక్ష తర్వాత, విచారణ తర్వాత స్వర్గ ప్రవేశం. రెండవ రకం.
మూడవ రకం: వారు నరకానికి పోరు, కానీ స్వర్గ ప్రవేశానికి నిర్ణీత సమయం వరకు ఆపబడతారు. వారు నరకానికి ఏ మాత్రం పోరు స్వర్గానికే పోతారు, కాకపోతే నిర్ణీత సమయం వరకు స్వర్గానికి పోకుండా ఆపబడతారు. వారినే అస్ హాబుల్ ఆరాఫ్ అంటారు, వారి ప్రస్తావన సూర నెంబర్ 7, సూర ఆరాఫ్ లో ఉంది. ఆరాఫ్ వారు నిర్నీత సమయం వరకు స్వర్గం పోకుండా ఆపబడతారు, తర్వాత స్వర్గానికి పోతారు. ఇది మూడవ రకం.
నాల్గవ రకం: వారి పాపాల మూలంగా నరకానికి పోతారు. శిక్ష ముగిసిన తర్వాత వారి ఈమాన్ మూలంగా చివరికి అల్లాహ్ తన దయతో స్వర్గానికి పంపిస్తాడు.
ఈ నాలుగు రకాలు స్వర్గానికి పోయేవారు.
విచారణ లేకుండా స్వర్గానికి వెళ్ళేవారు
వారిలో మొదటి వారు ఎవరు? విచారణ లేకుండా, ఎటువంటి లెక్క తీసుకోకుండా స్వర్గానికి పోయేవారు. వారి గురించి బుఖారీలో ఒక హదీస్ ఉంది అది తెలుసుకుందాం.
అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా కథనం. ఈయన ఎవరు? మన ప్రవక్త గారి పినతండ్రి అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ కుమారులు. పెద్ద సహాబీ. ఖుర్ఆన్ జ్ఞానం కలిగిన వారు. ముఫస్సిర్ సహాబీ. ఆయన కోసం ప్రవక్త గారు దుఆ చేశారు. అందుకే ఖుర్ఆన్ యొక్క ఆయతుల పరమార్థం, అర్థం బాగా తెలిసిన వారు అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు. ఆయన అంటున్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఏమని? “నాకు గత సమాజాలను చూపించడం జరిగింది”. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి గత సమాజాలు చూపించడం జరిగింది. తద్వారా నేను చూసింది ఏమిటంటే, (లక్షా ఇరవై నాలుగు వేల ప్రవక్తలలో) ఒక ప్రవక్తతో కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు, అంటే స్వర్గానికి పోయేవారు, పాస్ అయిన వారు, ఆయన్ని అల్లాహ్ ని విశ్వసించిన వారు విశ్వాసులు, మూమినీన్లు కొంతమంది మాత్రమే ఉన్నారు, కొంతమంది అంటే పది కంటే తక్కువ మంది. ఇంకో ప్రవక్తను చూశాను, ఆయనతో కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఇంకో ప్రవక్తను చూశాను, ఆయన ఒక్కరే ఉన్నారు, ఆయనతో పాటు ఎవరూ లేరు. అంటే ఆ ప్రవక్తకి విశ్వసించిన వారు ఒక్కరు కూడా లేరు.
ఆ తర్వాత, అకస్మాత్తుగా నాకు పెద్ద సమూహం గోచరించింది. బహుశా ఇది నా అనుచర సమాజం అని అనుకున్నాను. కానీ ఇది మూసా అలైహిస్సలాం, ఆయన అనుచర సమాజం. ఆ తర్వాత, ఇటువైపు చూడండి అని నన్ను చెప్పటం జరిగింది, నేను చూశాను, పెద్ద సమూహం. ఎక్కడ వరకు చూస్తున్నానో అక్కడ వరకు ఉంది జనాలు, పెద్ద సమూహం. మరోవైపు చూడండి అని చెప్పడం జరిగింది, మరోవైపు చూశాను, పెద్ద సమూహం కనపడింది.
అప్పుడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది మీ అనుచర సమాజం. వీరిలో డెబ్బై వేల మంది కర్మల విచారణ లేకుండానే స్వర్గములో ప్రవేశిస్తారు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చి తమ గృహంలోకి వెళ్ళిపోయారు. ఇది విన్న సహాబాలు వారి మనసులో రకరకాల ఆలోచనలు, వారు ఎవరై ఉంటారు? విచారణ లేకుండా, లెక్క లేకుండా, డైరెక్ట్ స్వర్గ ప్రవేశం. సుబ్ హా నల్లాహ్! ఎంత అదృష్టవంతులు! వారెవరు? బహుశా ఇస్లాం స్థితిలోనే జన్మించి షిర్క్ దరిదాపులకి కూడా పోని వారు ఉండవచ్చు అని రకరకాల ఆలోచనలు, మాటలు మాట్లాడుకుంటున్నారు. అటువంటి వారు అయ్యి ఉండవచ్చు, ఇటువంటి వారు అయ్యి ఉండవచ్చు అని మాట్లాడుతూ ఉండగా, అంతలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ సహాబాల మాటలు విని, మీరు ఏమి మాట్లాడుకుంటున్నారు అని అడిగితే, ఓ దైవ ప్రవక్త! ఆ డెబ్బై వేల మంది ఎవరు? విచారణ లేకుండా, కర్మల లెక్క లేకుండా డైరెక్ట్ స్వర్గం, వారు ఎవరు దైవ ప్రవక్త అంటే దానికి సమాధానంగా మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏమిటంటే:
هُمُ الَّذِينَ لاَ يَرْقُونَ وَلاَ يَسْتَرْقُونَ وَلاَ يَتَطَيَّرُونَ وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ [హుముల్లదీన లా యర్కూన వలా యస్తర్కూన వలా యతతయ్యరూన వఅలా రబ్బిహిమ్ యతవక్కలూన] “వారు స్వయంగా మంత్రించి ఊదుకోరు, ఇతరులతో మంత్రించి ఊదించుకోరు, అపశకునం పాటించరు, కేవలం తమ ప్రభువు అనగా అల్లాహ్ పైనే నమ్మకం కలిగి ఉంటారు.”
ఈ నాలుగు లక్షణాలు, గుణాలు కలిగిన వారు. వారెవరు? వారు స్వయంగా మంత్రించి ఊదుకోరు, ఇతరులతో మంత్రించి ఊదించుకోరు, అపశకునం పాటించరు, కేవలం తమ ప్రభువు అనగా అల్లాహ్ పైనే నమ్మకం కలిగి ఉంటారు అని చెప్పారు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.
ఒక సహాబీ, ఆయన పేరు ఉక్కాషా బిన్ మెహ్సన్ రదియల్లాహు అన్హు, ఆయన ఇది విని వెంటనే, ఓ దైవ ప్రవక్త, విచారణ లేకుండా, కర్మల లెక్క లేకుండా, డైరెక్ట్ స్వర్గంలో ప్రవేశించే వారిలో నేను కూడా ఉండాలని దుఆ చేయండి అల్లాహ్ తో అని విన్నవించుకున్నారు. ఎవరు? ఉక్కాషా బిన్ మెహ్సన్ రదియల్లాహు అన్హు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దుఆ చేసే అవసరం లేదు, నువ్వు వారిలో ఉన్నావు అని శుభవార్త చెప్పేశారు. “పో ఉక్కాషా, నువ్వు వారిలో ఉన్నావు. ఎవరికైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విచారణ లేకుండా, లెక్కల అది లెక్కలు లేకుండా డైరెక్ట్ గా స్వర్గం పంపుతారో, నువ్వు వారిలో ఉన్నావు” అని చెప్పారు. సుబ్ హా నల్లాహ్! ఈ భాగ్యం ఉక్కాషా బిన్ మెహ్సన్ కి ఖచ్చితంగా తెలిసిపోయింది. అల్ హమ్దులిల్లాహ్. ఇది విని ఇంకో సహాబీ లేచారు. ఓ దైవ ప్రవక్త, నా కోసం కూడా దుఆ చేయండి, నేను కూడా ఆ సమూహంలో ఉండాలి అని. దానికి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “సబకక బిహా ఉక్కాషా” అన్నారు. అంటే, ఉక్కాషా నీకన్నా ముందుకి వెళ్ళిపోయాడు, ఆ భాగ్యాన్ని ఆయన నోచుకున్నాడు అని చెప్పేశారు మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ హదీస్ బుఖారీలోనే మూడు చోట్ల ఉంది.
ఇదే హదీస్ ముస్లిం గ్రంథంలో కొంచెం తేడాతో ఇలా ఉంటుంది.
هُمُ الَّذِينَ لاَ يَسْتَرْقُونَ وَلاَ يَتَطَيَّرُونَ وَلاَ يَكْتَوُونَ وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ [హుముల్లదీన లా యస్తర్కూన వలా యతతయ్యరూన వలా యక్తవూన వఅలా రబ్బిహిమ్ యతవక్కలూన] “వారు ఇతరులతో మంత్రించి ఊదించుకోరు, అపశకునాలు పాటించరు, (వ్యాధి నివారణకు) వాతలు పెట్టించుకోరు మరియు తమ ప్రభువు పైనే నమ్మకం కలిగి ఉంటారు.”
వారు ఎవరంటే, వారు మంత్రించి ఊదించుకోరు. రెండవది, అపశకునం పాటించరు. ఈ అపశకునం గురించి రెండు వారాల ముందు మనం తెలుసుకున్నాం జుమా ప్రసంగంలోనే అపశకునం అంటే ఏమిటి అనేది. మూడవది, శరీరాన్ని అగ్నితో వాతలు పెట్టుకోరు. నాలుగవది, కేవలం అల్లాహ్ పైనే నమ్మకం కలిగి ఉంటారు. ఇది పూర్తి హదీస్, విచారణ లేకుండా స్వర్గానికి పోయే వారి గురించి.
దీనికి సంబంధించిన సహాబియాత్ లలో, సహాబాలలో అనేక ఉదాహరణలు మనకు కనబడతాయి, వారి జీవిత చరిత్ర మనము చదివితే. ప్రపంచ సమస్యలను, ప్రపంచ బాధలను పట్టించుకోకుండా, వారు ప్రాధాన్యత ఇచ్చింది పరలోకానికి. వారిలో ప్రతి ఒక్కరూ నేను విచారణ లేకుండా స్వర్గానికి పోయే వారిలో ఉండాలని ప్రయత్నం చేసేవారు. దానికి ఉదాహరణ ఒక హదీస్ ఉంది అది తెలుసుకుందాం. ఈ హదీస్ కూడా బుఖారీలో ఉంది, ముస్లింలో కూడా ఉంది. ఇది ఏమిటి?
అతా బిన్ అబూ రిబాహ్ అంటున్నారు, నాకు అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా పిలిచి, నేను నీకు ఒక స్వర్గ స్త్రీని, స్వర్గ మహిళని చూపించనా అని అడిగారు. “ఖుల్తు బలా”, తప్పనిసరిగా చూపించండి, స్వర్గ మహిళ! అంటే ప్రతి ఒక్కరికి గ్యారెంటీ లేదు కదా. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత ఎవరు స్వర్గానికి పోతారో ఖచ్చితంగా చెప్పగలమా? కానీ ఎవరెవరికైతే మన ప్రవక్త గారు ముందే చెప్పి పోయారో వారు ఖచ్చితం గ్యారెంటీ. ఆ విషయం ఇది. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ అంటున్నారు “ఓ అతా బిన్ అబూ రిబాహ్, స్వర్గ మహిళకి చూపించినా?” చూపించండి అన్నారు. అప్పుడు ఆయన అంటున్నారు ఇదిగో ఆ నల్ల రంగు గల స్త్రీ.
ఆవిడ ఒకసారి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి, ఓ దైవ ప్రవక్త, నాకు మూర్ఛ రోగం ఉంది. ఆ రోగం వచ్చినప్పుడు, ఆ స్థితిలో నేను నగ్నంగా అయిపోతాను, నా శరీరంలో బట్టలు లేచిపోతాయి, ఎగిరిపోతాయి. స్వస్థత కోసం దుఆ చేయండి దైవ ప్రవక్త అన్నారు.
ఇది విని మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆవిడకి రెండు ఆప్షన్లు ఇచ్చారు. అది ఏమిటి?
إِنْ شِئْتِ صَبَرْتِ وَلَكِ الْجَنَّةُ، وَإِنْ شِئْتِ دَعَوْتُ اللَّهَ أَنْ يُعَافِيَكِ [ఇన్ షి’తి సబర్తి వలకిల్ జన్నతు, వ ఇన్ షి’తి దఅవుతుల్లాహ అన్ యుఆఫియకి] “నువ్వు తలచుకుంటే సహనం వహించు, నీకు స్వర్గం ఉంది. లేదా నువ్వు కోరుకుంటే నేను అల్లాహ్ తో దుఆ చేస్తాను, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు.”
ఆ స్వర్గ మహిళ మొదటి ఆప్షన్ ఎన్నుకున్నది. నేను సహనం వహిస్తాను ఓ దైవ ప్రవక్త, ఎందుకంటే నాకు స్వర్గం లభిస్తుంది, చెప్పారు కదా, స్వర్గం గ్యారెంటీ ఇస్తున్నారు కదా. నాకు ఈ రోగం ఉన్నా పర్వాలేదు, నేను సహనం వహిస్తాను, కాకపోతే ఒక్క విన్నపం. ఆ రోగం వచ్చినప్పుడు, ఆ స్థితిలో నా శరీరం నుంచి నా బట్టలు ఎగరకుండా ఉండాలి, నేను నగ్నం అవ్వకూడదు, దాని కోసం ప్రార్థించండి అన్నారు. దాని కోసం మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థన చేశారు.
అభిమాన సోదరులారా, ఇది సహాబాల ప్రయత్నం, వారి కృషి, ఏ విధంగా నేను స్వర్గానికి పోవాలి, అది కూడా విచారణ లేకుండా స్వర్గానికి పోవాలి అనేది.
పాపాలు చేసి పశ్చాత్తాపం చెందిన వారు
ఒక ప్రశ్న, అది ఏమిటంటే, కొందరు చిన్న చిన్న ఏదో పాపాలు చేస్తారు, పెద్ద పాపాలు కూడా చేస్తారు, కాకపోతే బుఖారీ హదీస్ లో చెప్పబడిన ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయి కదా అవి ఉండవు. అపశకునం పాటించరు. షిర్క్ చేయరు. మంత్రించి ఊదించుకోరు. అల్లాహ్ పై నమ్మకం ఉంది. ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయి, వేరే పాపాలు చేస్తున్నారు. అటువంటి వారు కర్మల విచారణ లేకుండా స్వర్గానికి పోతారా? ఈ ప్రశ్న షేఖ్ ముహమ్మద్ సాలెహ్ అల్-మునజ్జిద్ తో అడగడం జరిగింది. ఆయన సమాధానం ఇచ్చారు, చిన్న పెద్ద పాపాలకి పాల్పడిన వాడు కూడా కర్మల విచారణ లేకుండా స్వర్గానికి పోయే అవకాశం ఉంది అని చెప్పి ఆయన సూర ఫుర్ఖాన్ లోని ఈ ఆయత్ ను పఠించారు. ఆయత్ ఏమిటి?
وَالَّذِينَ لَا يَدْعُونَ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ وَلَا يَقْتُلُونَ النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ وَلَا يَزْنُونَ వారు అల్లాహ్తోపాటు మరో దైవాన్ని మొరపెట్టుకోరు. న్యాయబద్ధంగా తప్ప – అల్లాహ్ ఏ ప్రాణిని హత్య చేయటాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు. వారు వ్యభిచారానికి పాల్పడరు. (25:68)
అంటే, వారు అల్లాహ్ తో పాటు మరే దైవాన్ని మొరపెట్టుకోరు అంటే షిర్క్ చేయరు. న్యాయబద్ధంగా తప్ప అల్లాహ్ ఏ ప్రాణిని హత్య చేయటాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు, అంటే హత్య చేయరు. వారు వ్యభిచారానికి పాల్పడరు, వ్యభిచారం చేయరు. మూడు విషయాలు, షిర్క్ చేయరు, హత్య చేయరు, వ్యభిచారం చేయరు. ఈ చేష్టలకు ఒడగట్టిన వారు, చేస్తే? హత్య చేశారు, లేదా వ్యభిచారం చేశారు, లేదా షిర్క్ చేశారు. ఇలా చేస్తే, పాప ఫలాన్ని పొంది తీరుతాడు. అంతేకాకుండా:
يُضَاعَفْ لَهُ الْعَذَابُ يَوْمَ الْقِيَامَةِ وَيَخْلُدْ فِيهِ مُهَانًا ప్రళయదినాన అతనికి రెట్టింపు శిక్ష వడ్డించబడుతుంది. వాడు పరాభవంపాలై, అత్యంత నికృష్టస్థితిలో కలకాలం అందులో పడి ఉంటాడు. (25:69)
ఇక మూడోవ ఆయత్.
إِلَّا مَنْ تَابَ وَآمَنَ وَعَمِلَ عَمَلًا صَالِحًا فَأُولَٰئِكَ يُبَدِّلُ اللَّهُ سَيِّئَاتِهِمْ حَسَنَاتٍ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَحِيمًا అయితే (ఈ పాప కార్యాల తరువాత) ఎవరు పశ్చాత్తాపం చెంది, విశ్వసిస్తారో, సదాచరణ చేస్తారో అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చి వేస్తాడు. అల్లాహ్ క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణాకరుడు.(25:70)
అయితే, ఈ పాప కార్యాల తర్వాత, పాపం చేసిన తర్వాత కుమిలిపోయి, పశ్చాత్తాపం చెంది, కన్నీళ్లు కార్చి, అంటే ఇక్కడ పశ్చాత్తాపం అంటే జోక్ కాదు, సీరియస్. ఏ పశ్చాత్తాపం గురించి అల్లాహ్ చెప్పాడో, “యా అయ్యుహల్లదీన ఆమనూ తూబూ ఇలల్లాహి తౌబతన్ నసూహా”. తౌబయే నసూహా. ఏ విధంగా ఖుర్ఆన్ లో హదీస్ లో తౌబా అంటే ఏమిటి, ఆ విధంగా తౌబా పశ్చాత్తాపం చెంది, కుమిలిపోయి పశ్చాత్తాపం చెందారో, విశ్వసిస్తారో, సదాచరణ చేస్తారో, అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చేస్తాడు. సుబ్ హా నల్లాహ్! వారు చేసిన పాపాలు పుణ్యాలుగా మార్చివేయబడతాయి. అల్లాహ్ క్షమాపశీలి, కరుణామయుడు. అంటే ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి? తౌబా చేసుకుంటే, ఆ నాలుగు లక్షణాలు ఉంటే, షిర్క్ చేయని వారు, మంత్రించి ఊదుకోని వారు, అపశకునం పాటించని వారు, అల్లాహ్ పై నమ్మకం వేసిన వారు, వేరే పాపాలు చేసిన తర్వాత పూర్తి నమ్మకంతో, సంపూర్ణ విశ్వాసంతో, దృఢ సంకల్పంతో కుమిలిపోతూ నిజమైన తౌబా చేసుకుంటే వారికి కూడా విచారణ లేకుండా స్వర్గ ప్రవేశానికి అవకాశం ఉంది.
మూడవ రకం వారు – అస్ హాబుల్ ఆరాఫ్
ఇక వారు ఎవరు? మూడవ వర్గం, నరకానికి పోరు, నిర్నీత సమయం వరకు ఆరాఫ్ పైన, ఆరాఫ్ అది స్థలం అక్కడ పరలోకములో. ఆరాఫ్ అంటే ఒక స్థలం పేరు, గోడ పేరు. ఆరాఫ్ పైన చాలామంది ఉంటారు, వారు ప్రతి ఒక్కరినీ వారి చిహ్నాలను బట్టి గుర్తుపడతారు. అంటే ఆరాఫ్ పైన ఉన్న మనుషులు స్వర్గానికి పోయేవారు ఎవరు, నరకానికి పోయేవారు ఎవరు, వారి ఆనవాలను బట్టి గుర్తుపట్టేస్తారు వాళ్ళు, ఆరాఫ్ వాళ్ళు, ఆ గోడ పైన ఉన్నవారు. వారు స్వర్గవాసులను పిలిచి “అస్సలాము అలైకుమ్”, మీపై శాంతి కలుగుగాక అని అంటారు. ఈ ఆరాఫ్ వారు అప్పటికీ ఇంకా స్వర్గంలో ప్రవేశించి ఉండరు. అయితే స్వర్గం లభిస్తుందన్న ఆశతో వారు ఉంటారు. అసలు వీళ్ళు ఎవరు? వీరి గురించి అత్యధిక ధర్మ పండితుల అభిప్రాయం ఏమిటంటే, ఆరాఫ్ వాళ్ళు, వారి సత్కర్మలు, దుష్కర్మలు, పుణ్యాలు, పాపాలు సరిసమానంగా ఉంటాయి. వారి సత్కర్మలు వారిని నరకంలో పోకుండా ఆపుతాయి, వారి దుష్కర్మలు స్వర్గానికి పోకుండా ఆపుతాయి. అందుకు నిర్నీత సమయం వరకు వారు వేచి ఉంటారు, స్వర్గానికి పోకుండా ఆపబడి ఉంటారు, ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దయతో వారిని స్వర్గానికి పంపిస్తాడు. వీరు మూడవ రకం వారు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ విచారణ లేకుండా స్వర్గంలో ప్రవేశించే ఆ సమూహంలో చేరిపించు గాక. ఆమీన్. మనందరికీ ఇహపరలోకాల సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ఇస్లాంలో నిషిద్ధమైన రెండవ ప్రధాన విషయం గురించి వివరించబడింది. అల్లాహ్ హలాల్ (ధర్మసమ్మతం) చేసిన దానిని హరామ్ (నిషిద్ధం)గా లేదా హరామ్ చేసిన దానిని హలాల్గా మార్చడం ఎంత పెద్ద పాపమో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా స్పష్టం చేయబడింది. యూదులు మరియు క్రైస్తవులు తమ పండితులను, సన్యాసులను అల్లాహ్ ను వదిలి ప్రభువులుగా చేసుకోవడం అంటే, వారు హలాల్-హరామ్ నిర్ణయాలలో వారిని గుడ్డిగా అనుసరించడమే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వివరించారు. ఈ అధికారం కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉందని, ఇతరులకు ఈ హక్కును ఆపాదించడం లేదా అనుసరించడం అవిశ్వాసానికి దారితీస్తుందని హెచ్చరించారు. ముస్లింలు తమ జీవితంలోని అన్ని విషయాలలో, ముఖ్యంగా వివాదాల పరిష్కారంలో, ఖురాన్ మరియు సున్నత్లను మాత్రమే అనుసరించాలని, మానవ నిర్మిత చట్టాలను ఆశ్రయించకూడదని ఈ ప్రసంగం నొక్కి చెబుతుంది.
నిషిద్ధ విషయాలలో మొదటి విషయం షిర్క్ అని, దానిలో కొన్ని రకాలు చదివాము. అయితే ఈ రోజు మూడవ పాఠంలో, నిషిద్ధ విషయాలలో రెండవది అల్లాహ్ హరామ్ చేసిన దానిని హలాల్ చేయుట లేదా అల్లాహ్ హలాల్ చేసిన దానిని హరామ్ చేయుట. శ్రద్ధ వహించండి. అల్లాహ్ ఒక వస్తువును హరామ్ చేశాడు, దానిని హలాల్ చేయుట. లేదా అల్లాహ్ ఒక వస్తువును హలాల్ చేశాడు, దానిని హరామ్ చేయుట.
అల్లాహ్ హరామ్ చేసిన దానిని హలాల్ చేయుట లేదా అల్లాహ్ హలాల్ చేసిన దానిని హరామ్ చేయుట లేదా ఇలాంటి హక్కు అల్లాహ్ తప్ప ఇతరులకు ఉంది అని నమ్ముట. గమనిస్తున్నారా? స్వయంగా మనిషి, ఒక మనిషి అల్లాహ్ హలాల్ చేసిన దాన్ని హరామ్ చేస్తున్నాడు. లేదా అల్లాహ్ హరామ్ చేసిన దానిని హలాల్ చేస్తున్నాడు. మూడో మాట దీంట్లో ఏమిటి? అల్లాహ్ తప్ప ఈ హలాల్, హరామ్ చేసేటటువంటి హక్కు ఎవరికైనా ఉంది అని నమ్మటం. ఒక వ్యక్తి స్వయంగా హలాల్ను హరామ్ చేయట్లేదు. కానీ ఎవరైనా చేస్తూ ఉంటే అతన్ని సహీగా, కరెక్ట్గా నమ్ముతున్నాడు. అలా చేయడం అతనికి తగును, అతనికి ఆ హక్కు ఉంది అన్నటువంటి నమ్మకం ఉంది. ఇక ఇలా ఈ నమ్మడం అనేది కూడా అవిశ్వాసంలో వస్తుంది. అల్లాహు త’ఆలా నిషేధించాడు. అంతేకాదు, ఇంకా శ్రద్ధ వహించండి.
సమస్యల తీర్పు కొరకు అల్లాహ్ పంపిన ఇస్లాం ధర్మం కాకుండా ఇతర న్యాయస్థానాలకు వెళ్ళుట. సర్వసామాన్యంగా ఈ రోజుల్లో ముస్లింలలో పరస్పరం ఏదైతే గొడవలు, ప్రత్యేకంగా భార్యాభర్తల గొడవల విషయాలలో ముస్లిం కమ్యూనిటీ, ముస్లిం పంచాయతీ, ముస్లిం వారి యొక్క వారి జమాతుల్లో ఉన్నటువంటి ధర్మవేత్తల పర్యవేక్షణలో ఒక కమిటీ ఏర్పాటు చేసి, వారి యొక్క అధ్వర్యంలో తమ గొడవలకు మంచి పరిష్కారం ఖురాన్, హదీసుల ఆధారంగా తీసుకునే ప్రయత్నం చేయకుండా ఏం చేస్తూ ఉంటారు? ఏదైనా గొడవ జరిగింది, వెంటనే లంచాలు ఇచ్చి తమ ఎదుటి వారిపై కేసులు నమోదు చేయిస్తారు. తమకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారి గురించి కోర్టుల యొక్క మెట్లు ఎక్కుతారు. అయితే ఇలా చేయడం అంతా కూడా సమంజసం, మంచి విషయమే అని భావించడం, ఎక్కడైతే ఖురాన్, హదీస్ ప్రకారంగా తీర్పులు జరగవో అలాంటి చోట వెళ్ళడం, అలాంటి చోట వారితో తీర్పులు చేయించుకోవడం, ఇవన్నీ కూడా ఎంత ఘోరమైన విషయం! ఇంకా శ్రద్ధగా వినండి. మరియు ఇస్లామీయ చట్టాలతో కాకుండా ఇతర చట్టాలతో తీర్పు కోరుట లేదా అది యోగ్యమైనదని సంతోషంగా నమ్ముట, ఎంతటి భయంకరమైన అవిశ్వాసంలో పడవేస్తుందో ఖురాన్లోని ఈ ఆయతు ద్వారా తెలుసుకోండి. మరియు ఈ ఆయతు సూరతు తౌబా, సూర నెంబర్ తొమ్మిది, ఆయతు నెంబర్ 31. శ్రద్ధగా వినండి.
అల్లాహ్ తెలుపుతున్నాడు:
اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِّن دُونِ اللَّهِ (ఇత్తఖజూ అహ్బారహుమ్ వ రుహ్బానహుమ్ అర్బాబమ్ మిన్ దూనిల్లాహ్) వారు అల్లాహ్ను వదలి తమ పండితులను, తమ సన్యాసులను ప్రభువులుగా చేసుకున్నారు. (9:31)
వారు అంటే, యూదులు, క్రైస్తవులు. అల్లాహ్ను కాదని తమ పండితులను, తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. యూదులు, క్రైస్తవులు అల్లాహ్ను వదిలి ఎవరిని? తమ యొక్క పండితులను, తమ యొక్క సన్యాసులను ఏం చేశారు? ప్రభువులుగా చేసుకున్నారు. أَرْبَابًا مِّن دُونِ اللَّهِ (అర్బాబమ్ మిన్ దూనిల్లాహ్) రబ్ ఏకవచనం, అర్బాబ్ ఇది బహువచనం. ఇక మనం చూస్తూ ఉంటాము, చర్చిలో ఉండేటువంటి పాస్టర్లు, వారినైతే ప్రభువుగా నమ్మరు కదా? లేక వారి యొక్క పెద్ద పండితులను సామాన్య క్రైస్తవులు ప్రభువుగా నమ్మరు కదా అని ఈ రోజుల్లో కూడా ఎంతో మంది అనుకుంటారు, కదా? రండి, తిర్మిజీ మరియు ముస్తద్రక్ హాకింలోని హదీస్ ద్వారా దీని యొక్క వివరణ వినండి.
ఈ ఆయతు, సూరత్ తౌబా ఆయతు నెంబర్ 31, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పఠిస్తుండగా అదీ బిన్ హాతిమ్ రదియల్లాహు అన్హు విని, “ప్రవక్తా! యూదులు, క్రైస్తవులు తమ పండితులను, సన్యాసులను ఆరాధించేవారు కారు కదా?” సామాన్య యూదులు మరియు క్రైస్తవులు వారి యొక్క పండితులను, వారి యొక్క సన్యాసులను, పాస్టర్లను పూజించరు కదా? ఆరాధించరు కదా? మరి ప్రభువుగా చేసుకున్నారని ఆయతులో చెప్పబడింది? అతని యొక్క ప్రశ్న విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, “అవును, నువ్వు అంటున్నావు ఆరాధించేవారు కాదు. అవును, ఆరాధించేవారు కాదు. కానీ అల్లాహ్ హరామ్ చేసిన దానిని వారి పండితులు, సన్యాసులు హలాల్ చేస్తే వారు దానిని హలాల్గానే భావించేవారు. ఇంకా అల్లాహ్ హలాల్ చేసిన దానిని వారి పండితులు, సన్యాసులు హరామ్ చేస్తే వారు దానిని హరామ్గానే భావించేవారు. కనుక ఇది వారిని ఆరాధించినట్లు. అందుకని వారు తమ సన్యాసులను, పండితులను ప్రభువులుగా చేసుకున్నారు” అన్నటువంటి సమాధానం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది సహీహ్ హదీస్. షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ వారు కూడా గాయతుల్ మరాంలో సహీహ్ అని తెలిపారు. అయితే అర్థమైంది కదా సోదర మహాశయులారా?
అంతేకాదు. మరొక ఆయత్ సూరత్ తౌబాలోనే ఉంది. కొంచెం శ్రద్ధగా వినండి. అంతకంటే ముందు, అల్లాహ్ నిషేధించిన వాటిని నిషిద్ధంగా నమ్మని వారు, నిషిద్ధతలను నిషిద్ధంగా నమ్మని వారు యూదులు, క్రైస్తవులు మరియు బహుదైవారాధకులు. కానీ ఈ పని ఒక ముస్లింగా తమకు తాము అనుకునే వాళ్ళు, తమ పేర్లు ముస్లింలుగా పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తే మరి వారి గతి ఏమవుతుంది? అల్లాహు అక్బర్. చూడండి, సూరత్ తౌబా ఆయత్ నెంబర్ 29.
وَلَا يُحَرِّمُونَ مَا حَرَّمَ اللَّهُ وَرَسُولُهُ وَلَا يَدِينُونَ دِينَ الْحَقِّ (వ లా యుహర్రిమూన మా హర్రమల్లాహు వ రసూలుహు వ లా యదీనూన దీనల్ హఖ్) అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషిద్ధం చేసిన వాటిని వారు నిషిద్ధంగా భావించరు, మరియు సత్య ధర్మాన్ని అవలంబించరు. (9:29)
యూదులు, క్రైస్తవులు, బహుదైవారాధకులు, వీరందరూ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిషేధించిన వాటిని వారు నిషిద్ధంగా భావించరు మరియు సత్య ధర్మాన్ని అవలంబించరు. ఒకవేళ ఎవరైనా ముస్లిం ఈ పని చేశాడంటే చాలా, చాలా నష్టంలో పడిపోతాడు. ఎలాంటి నష్టం? అల్లాహ్ పై చాలా పెద్ద అభాండం మోపినట్లు. చూడండి, సూర యూనుస్లోని ఆయతు నెంబర్ 59, అల్లాహు త’ఆలా తెలుపుతున్నాడు.
قُلْ أَرَأَيْتُم مَّا أَنزَلَ اللَّهُ لَكُم مِّن رِّزْقٍ فَجَعَلْتُم مِّنْهُ حَرَامًا وَحَلَالًا قُلْ آللَّهُ أَذِنَ لَكُمْ ۖ أَمْ عَلَى اللَّهِ تَفْتَرُونَ (ఓ ప్రవక్తా!) ఇలా అను: “ఏమిటి? మీరు ఆలోచించారా? అల్లాహ్ మీ కొరకు అవతరింపజేసిన జీవనోపాధిలో నుండి మీరు స్వయంగానే కొన్నింటిని హరామ్గానూ, మరి కొన్నింటిని హలాల్గానూ నిర్ధారించుకున్నారు.” వారినిలా అడుగు: “ఇలా చేయడానికి అల్లాహ్ మీకు అనుమతించాడా? లేక మీరు అల్లాహ్కు అబద్ధాలను అంటగడుతున్నారా?” (10:59)
ఈ ఆయతు ద్వారా ఏం తెలుస్తుంది? అల్లాహు త’ఆలా ప్రజల్లో ఎవరికీ కూడా ఏదైనా వస్తువును హలాల్ చేసే, ఏదైనా వస్తువును హరామ్ చేసే అటువంటి హక్కు ఇవ్వలేదు. ఇది వాస్తవం, ఇవ్వలేదు. ఇది కేవలం అల్లాహ్ యొక్క హక్కు మాత్రమే. ఇంతకుముందు కూడా దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు మొదటి పాఠంలో, మొదటి క్లాస్లో విన్నాము మనం. మీలో ఎవరికైనా గుర్తు లేకుంటే ఒకసారి ఆ పాఠాన్ని తర్వాత మీరు చూడండి, వినండి. అయితే అల్లాహ్ అయితే ఎవరికీ ఈ హక్కు ఇవ్వలేదు. అలాంటప్పుడు ఎవరైనా ఈ హక్కును దుర్వినియోగం చేసుకుంటున్నాడు, అతడు దౌర్జన్యపరుడు అవుతున్నాడు, అంతేకాదు అల్లాహ్ పై అబద్ధాలు మోపేవాడు అవుతున్నాడు.
అర్థమైంది కదా? ఎంత ఘోరమైన పాపం? అందుకొరకే ఈ రోజుల్లో కూడా ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్లుగా కొన్ని వస్తువులను ఇది హలాల్ అని, ఇది హరామ్ అని లేదా వారి యొక్క పెద్దలు, గురువులు, “అరే హమారే బాబా బోలే జీ,” “మా పీర్ సాబ్ చెప్పారు,” “మేము ఫలానా ముర్షిదులను నమ్ముతున్నాము, ఆయన చెప్పినట్లే మేము వింటాము” ఇక వారు హరామ్ చేసిందే హరామ్, వారు హలాల్ అని చెప్పిందే హలాల్. ఈ విధంగా మనం అల్లాహ్ మరియు ప్రవక్తకు వ్యతిరేకంగా ఒక మార్గంలో వెళ్తున్నామంటే అది మనల్ని స్వర్గానికి తీసుకెళ్తుందా? మనమే మంచిగా ఆలోచించాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, వక్త ఉమ్మహాతుల్ ము’మినీన్ (విశ్వాసుల మాతృమూర్తులు), ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భార్యల యొక్క ఉన్నత స్థానం మరియు ప్రత్యేకతలను వివరిస్తారు. సాధారణ స్త్రీల కంటే వారి స్థాయి ఎంతో ఉన్నతమైనదని, అల్లాహ్ వారిని ప్రత్యేకంగా ప్రవక్త కోసం ఎంపిక చేశారని ఖురాన్ ఆయతుల ఆధారంగా తెలియజేస్తారు. వారు విశ్వాసులందరికీ తల్లులని, ప్రవక్త మరణానంతరం వారిని వివాహం చేసుకోవడం నిషిద్ధమని స్పష్టం చేస్తారు. వారి సత్కార్యాలకు రెండింతల పుణ్యం లభిస్తుందని మరియు అల్లాహ్ వారిని అన్ని రకాల మాలిన్యాల నుండి పరిశుభ్రపరిచాడని వివరిస్తారు. ఈ ప్రపంచంలోనే కాక, స్వర్గంలో కూడా వారు ప్రవక్త భార్యలుగానే ఉంటారనే గౌరవాన్ని కూడా ప్రస్తావించారు.
సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.
ఉమ్మహాతుల్ ము’మినీన్ (విశ్వాసుల మాతలు) యొక్క ఘనత
ఉమ్మహాతుల్ ము’మినీన్ అందరి ఘనత, ప్రత్యేకత. ఉమ్మహాతుల్ ము’మినీన్ ఖదీజా రదియల్లాహు అన్హా నుంచి మైమూనా రదియల్లాహు అన్హా వరకు, వారందరి విశిష్టతలు, ఘనతలు, ప్రత్యేకతలు.
ఉమ్మహాతుల్ ము’మినీన్, వారందరూ సాధారణ స్త్రీల వంటి వారు కాదు. వారి ప్రత్యేకత ఇది. ఉమ్మహాతుల్ ము’మినీన్ల ప్రత్యేకత ఏమిటి? వారందరూ సాధారణ స్త్రీల వంటి వారు కారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉమ్మహాతుల్ ము’మినీన్ల గురించి ఖురాన్ గ్రంథంలో అనేక చోట్ల ప్రస్తావించాడు. ముఖ్యంగా సూరతుల్ అహ్జాబ్ లో కొంచెం వివరంగా ఉంటుంది.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
يَا نِسَاءَ النَّبِيِّ لَسْتُنَّ كَأَحَدٍ مِّنَ النِّسَاءِ (యా నిసాఇన్ నబియ్యి లస్తున్న కఅహదిమ్ మినన్ నిసా) ఓ ప్రవక్త సతీమణులారా! మీరు సాధారణ స్త్రీల వంటి వారు కారు. (33:32)
గౌరవంలో, మర్యాదలో, ఘనతలో, విశిష్టతలో, మంచి విషయాలలో, అన్ని విషయాలలో మీరు సాధారణమైన స్త్రీలు కారు , వారు ఎవ్వరైనా సరే, గొప్ప గొప్ప సహాబియాతులు అయినా, గొప్ప ప్రముఖ సహాబాల సతీమణులైనా, తాబయీన్లు, ముహద్దసీన్లు, సామాన్య ప్రజలు, ఎవరైనా సరే, ఉమ్మహాతుల్ ము’మినీన్ల ప్రత్యేకత, అలాగే ఇతరుల వారు సమానులు కారు. ఇది వారి ప్రత్యేకత.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొరకే ఎంపిక చేయబడ్డారు
అలాగే రెండవ విషయం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని, ఉమ్మహాతుల్ ము’మినీన్లని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకై ఎంపిక చేశాడు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
لَّا يَحِلُّ لَكَ النِّسَاءُ مِن بَعْدُ وَلَا أَن تَبَدَّلَ بِهِنَّ مِنْ أَزْوَاجٍ وَلَوْ أَعْجَبَكَ حُسْنُهُنَّ ఇక దీని తరువాత, వేరితర స్త్రీలు నీ కొరకు ధర్మసమ్మతం కారు. వీరికి బదులుగా ఇతర స్త్రీలను భార్యలుగా చేసుకోవటం కూడా నీకు సమ్మతం కాదు – వారి అందచందాలు నీకు ఎంత నచ్చినాసరే! (33:52)
ఓ ప్రవక్తా! ఇక, అంటే మైమూనా రదియల్లాహు అన్హా వివాహం తర్వాత, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణులు, ఉమ్మహాతుల్ ము’మినీన్, 11 మంది. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరిగా వివాహం చేసుకునింది మైమూనా బిన్తె హారిత్ రదియల్లాహు అన్హాని. మైమూనా రదియల్లాహు అన్హా వివాహం తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆదేశం ఇచ్చాడు. ఓ ప్రవక్తా! ఇక నుంచి ఇంకో వివాహం చేసుకోవటం నీకు సమ్మతం కాదు, ఇక నువ్వు చేసుకోలేవు. ఈ 11 మంది మాత్రమే నీ కోసం ఎంపిక చేశాను, ఇక నీకు అనుమతి లేదు. ఇక తర్వాత ఏ స్త్రీని అయినా నువ్వు వివాహం చేసుకోలేవు. ఒక సతీమణిని విడాకులు ఇచ్చి దానికి బదులుగా కూడా నువ్వు చేసుకోలేవు. ఈ ప్రత్యేకత, ఈ గౌరవం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి ప్రసాదించాడు.
విశ్వాసులందరికీ తల్లులు
మూడవది, వారు ఉమ్మహాతుల్ ము’మినీన్ల స్థానం అల్లాహ్ తెలియపరుస్తున్నాడు. విశ్వాసుల కొరకు తల్లులు. మూడవ ప్రత్యేకత.
النَّبِيُّ أَوْلَىٰ بِالْمُؤْمِنِينَ مِنْ أَنفُسِهِمْ ۖ وَأَزْوَاجُهُ أُمَّهَاتُهُمْ దైవ ప్రవక్తకు విశ్వాసులపై స్వయంగా వారి ఆత్మల కన్నా ఎక్కువ హక్కు ఉంది. అతని భార్యలు విశ్వాసుల కొరకు తల్లులు. (33:6)
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విశ్వాసులపై స్వయంగా వారి ఆత్మల కన్నా ఎక్కువగా హక్కు ఉంది. ఆయన భార్యలు విశ్వాసుల కొరకు తల్లులు. అంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ స్థానం, ఆ గౌరవం వారికి ప్రసాదించాడు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తర్వాత వారితో వివాహం నిషిద్ధం
ఏ గొప్ప సహాబీ సతీమణి అయినా, భర్త మరణించిన తర్వాత ఇంకో వివాహం చేసుకునే అనుమతి ఉంది. కానీ, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ అనుమతి ఉమ్మహాతుల్ ము’మినీన్లకి ప్రసాదించలేదు. ఎందుకు? వారు తల్లులు మనకు. ప్రళయం వరకు వచ్చే విశ్వాసులందరికీ ఉమ్మహాతుల్ ము’మినీన్ తల్లులు. ఆ గౌరవం అల్లాహ్ వారికి ప్రసాదించాడు.
నాలుగవ ప్రత్యేకత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత వారు వివాహమాడడం ధర్మసమ్మతం కాదు, ఈ విషయం చెప్పింది ఇప్పుడు.
وَلَا أَن تَنكِحُوا أَزْوَاجَهُ مِن بَعْدِهِ أَبَدًا (వలా అన్ తన్కిహు అజ్వాజహూ మిమ్ బ’అదిహీ అబదా) అతని తదనంతరం అతని భార్యలను వివాహమాడటంగానీ ఎన్నటికీ మీకు ధర్మసమ్మతం కాదు. (33:53)
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, ఉమ్మహాతుల్ ము’మినీన్ ఇంకో వివాహం చేసుకోలేరు, సమ్మతం లేదు. వారి ప్రత్యేకత ఇది.
స్వర్గంలో కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) భార్యలే
ఐదవది, వారు ఈ ప్రపంచంలోనే కాదు, స్వర్గంలో కూడా ప్రవక్త గారికి భార్యలుగానే ఉంటారు, సతీమణులుగానే ఉంటారు.
ఆరవ ప్రత్యేకత, ఆయతె తఖ్ఈర్, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉమ్మహాతుల్ ము’మినీన్లను ఒక సందర్భంలో రెండు అవకాశాలు ఇచ్చాడు. ఈ రెండింటిలో ఒకటి మీరు నిర్ణయించుకోండి అన్నాడు. ప్రాపంచిక జీవితమా, పరలోక నిలయమా? ఈ రెండింటిని ఏదో ఒకటి ఎన్నుకోండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి ఈ ఆప్షన్ ఇచ్చాడు. ఈ ప్రాపంచిక జీవితం కావాలా? పరలోకం కావాలా? ప్రాపంచిక జీవితమా, పరలోక నిలయమా?
అల్లాహ్ ఈ ఆయతును సెలవిచ్చాడు సూరహ్ అహ్జాబ్ లోనే.
يَا أَيُّهَا النَّبِيُّ قُل لِّأَزْوَاجِكَ إِن كُنتُنَّ تُرِدْنَ الْحَيَاةَ الدُّنْيَا وَزِينَتَهَا فَتَعَالَيْنَ أُمَتِّعْكُنَّ وَأُسَرِّحْكُنَّ سَرَاحًا جَمِيلًا ఓ ప్రవక్తా! నీ భార్యలకు ఇలా చెప్పు: “మీరు గనక ప్రాపంచిక జీవితాన్ని, దాని తళుకు బెళుకులను కోరుకుంటూ ఉన్నట్లయితే, రండి, నేను మీకు ఎంతో కొంత ఇచ్చి, మిమ్మల్ని ఉత్తమరీతిలో సాగనంపుతాను –(33:28)
ప్రపంచం కోరుకుంటే, ఈ ప్రాపంచిక జీవితం కోరుకుంటే మీకు ఎంతో కొంత మొత్తం నేను ఇచ్చేస్తాను, ప్రపంచానికి సంబంధించిన విషయాలు, ధనము, ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే.
وَإِن كُنتُنَّ تُرِدْنَ اللَّهَ وَرَسُولَهُ وَالدَّارَ الْآخِرَةَ فَإِنَّ اللَّهَ أَعَدَّ لِلْمُحْسِنَاتِ مِنكُنَّ أَجْرًا عَظِيمًا “కాని ఒకవేళ అల్లాహ్ను, ఆయన ప్రవక్తను, పరలోక నిలయాన్ని పొందాలన్నదే మీ లక్ష్యమైతే, మీలోని సద్వర్తనుల కోసం అల్లాహ్ గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.” (33:29)
ఒకవేళ మీకు అల్లాహ్ కావాలా, ఆయన ప్రవక్త కావాలా, పరలోకం ఎన్నుకుంటారా, అటువంటి స్థితిలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సద్వర్తనుల కొరకు గొప్ప ప్రతిఫలం ప్రసాదించి ఉంచాడు, సిద్ధం చేసి ఉంచాడు. అంటే, ఉమ్మహాతుల్ ము’మినీన్లలో అందరూ, ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ రెండు విషయాలు అవకాశాలు ఇచ్చాడో, ప్రాపంచిక జీవితం కావాలా, పరలోకం కావాలా అంటే, ఉమ్మహాతుల్ ము’మినీన్లో అందరూ ఉమ్మడిగా, సంతోషంగా, హృదయపూర్వకంగా వారు ఎన్నుకునింది ఏమిటి? పరలోక జీవితమే.
అల్లాహ్ చే పరిశుద్ధులుగా చేయబడ్డారు
ఉమ్మహాతుల్ ము’మినీన్లను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని షిర్క్ నుండి, షైతాన్ నుండి, చెడు పనుల నుండి, అన్ని కీడుల నుండి అన్ని అశుద్ధతల నుండి అల్లాహ్ వారిని పరిశుద్ధం చేశాడు, పవిత్రులుగా చేశాడు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
إِنَّمَا يُرِيدُ اللَّهُ لِيُذْهِبَ عَنكُمُ الرِّجْسَ أَهْلَ الْبَيْتِ وَيُطَهِّرَكُمْ تَطْهِيرًا ఓ ప్రవక్త ఇంటివారలారా! మీ నుండి (అన్ని రకాల) మాలిన్యాన్ని దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలన్నది అల్లాహ్ అభిలాష.(33:33)
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అన్ని రకాల మాలిన్యం దూరం చేయాలన్నది, ఉమ్మహాతుల్ ము’మినీన్ల నుండి షిర్క్ యొక్క మాలిన్యం, చెడు మాలిన్యం, అన్ని రకాల మాలిన్యం దూరం చేయాలన్నది అల్లాహ్ అభిలాష. కావున అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉమ్మహాతుల్ ము’మినీన్ల నుండి అన్ని రకాల మాలిన్యాన్ని దూరం చేశాడు. ఇది వారి ప్రత్యేకత.
సత్కార్యాలకు రెండింతల పుణ్యం
ఇక ఎనిమిదవది, వారు ఏ సదాచరణ చేసినా, ఏ మంచి పని చేసినా, ఏ సద్వర్తన, ఏ పుణ్య కార్యం ఏది చేసినా వారికి రెండింతల పుణ్యం ప్రసాదించబడుతుంది. ఇది వారి ప్రత్యేకత. రెండింతల పుణ్యం.
అల్లాహ్ సెలవిచ్చాడు:
وَمَن يَقْنُتْ مِنكُنَّ لِلَّهِ وَرَسُولِهِ وَتَعْمَلْ صَالِحًا نُّؤْتِهَا أَجْرَهَا مَرَّتَيْنِ وَأَعْتَدْنَا لَهَا رِزْقًا كَرِيمًا మరి మీలో ఎవరు అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత కనబరుస్తారో, సదాచరణ చేస్తారో ఆమెకు మేము రెండింతల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాము. ఆమె కోసం మేము గౌరవప్రదమైన ఉపాధిని సిద్ధం చేసి ఉంచాము.(33:31)
మీలోని వారు అల్లాహ్ కు విధేయత చూపుతారో, అల్లాహ్ ప్రవక్తకు విధేయత చూపుతారో, మంచి పనులు చేస్తారో, సదాచారాలు చేస్తారో, సత్కార్యాలు చేస్తారో, మేము రెండింతల పుణ్యాన్ని ప్రసాదిస్తాము. గౌరవప్రదమైన ఉపాధిని సిద్ధం చేసి ఉంచాము. ఇది ఉమ్మహాతుల్ ము’మినీన్ల ప్రత్యేకత ఏమిటంటే, వారు చేసే సదాచరణకి బదులుగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెండింతల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. ఇది వారి ప్రత్యేకత.
వారి గృహాల ప్రస్తావన
అలాగే, వారి ఇండ్ల ప్రస్తావన పారాయణం మరియు హిక్మత్ తో చేశాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. వారి ఇండ్ల ప్రస్తావన అల్లాహ్ ఖురాన్ పారాయణంతో, హిక్మత్ తో చేశాడు. అదే సూరా 34వ ఆయత్.
وَاذْكُرْنَ مَا يُتْلَىٰ فِي بُيُوتِكُنَّ مِنْ آيَاتِ اللَّهِ وَالْحِكْمَةِ ۚ إِنَّ اللَّهَ كَانَ لَطِيفًا خَبِيرًا మీ ఇండ్లలో పారాయణం చేయబడే అల్లాహ్ ఆయతులను, ప్రవక్త ప్రవచనాలను స్మరించుకుంటూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మృదుస్వభావి, అన్నీ తెలిసినవాడు.(33:34)
మీ ఇండ్లలో పారాయణం చేయబడే అల్లాహ్ ఆయతులను, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలను స్మరించుకుంటూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మృదు స్వభావి, అన్నీ ఎరిగినవాడు, తెలిసినవాడు. అంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉమ్మహాతుల్ ము’మినీన్ల ఇండ్ల ప్రస్తావన ఖురాన్ పారాయణం మరియు హిక్మత్, ప్రవక్త గారి ప్రవచనాలతో, వహీ జలీ అయినా, వహీ ఖఫీ అయినా, ఖురాన్ మరియు హిక్మత్ తో వారి ఇండ్ల ప్రస్తావన అల్లాహ్ చేశాడు, ఇది వారి ప్రత్యేకత.
అలాగే, స్వర్గంలో కూడా వీరు ప్రవక్తకి భార్యలుగానే ఉంటారు అని ఇంతకుముందే తెలుసుకున్నాము. ఒకసారి ఆయిషా రదియల్లాహు అన్హా కథనం, ఈ ఉల్లేఖనం, ఈ హదీస్ ఇబ్నె హిబ్బాన్, హాకిమ్ మరియు తబరానీలో ఉంది. ఆయిషా రదియల్లాహు అన్హా ఒక సందర్భంలో అడిగారు. ఓ దైవ ప్రవక్తా, స్వర్గంలో ఏ సతీమణి మీ తోడుగా ఉంటారు అని ప్రశ్న. ఉమ్ముల్ ము’మినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా అడిగిన ప్రశ్న ఏమిటి? ఓ దైవ ప్రవక్తా, ఏ సతీమణి స్వర్గంలో మీకు తోడుగా ఉంటారు అని అడిగితే, దానికి సమాధానంగా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఓ ఆయిషా, వారిలో నువ్వు కూడా ఉన్నావు. ఇంకా ఇతర రివాయతుల ఆధారంగా, ఉమ్మహాతుల్ ము’మినీన్ ఈ ప్రాపంచిక జీవితంలో ఎలాగైతే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి సతీమణులుగా, భార్యలుగా ఉన్నారో, స్వర్గంలో కూడా వారు మహా ప్రవక్తకి సతీమణులుగానే ఉంటారు.
అభిమాన సోదరులారా! ఇంతవరకు మనము ఉమ్మడిగా ఉమ్మహాతుల్ ము’మినీన్లకు సంబంధించిన ఘనత తెలుసుకున్నాము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
యాఖూబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/dTlJikQ_EoE [30 నిముషాలు]
ఈ ప్రసంగంలో, ప్రవక్త యాఖూబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర వివరించబడింది. ఆయన వంశం, ఆయన తండ్రి ఇస్ హాఖ్ (అలైహిస్సలాం) మరియు తాత ఇబ్రాహీం (అలైహిస్సలాం కూడా ప్రవక్తలేనని ప్రస్తావించబడింది. యాఖూబ్ (అలైహిస్సలాం) తన మామయ్య కుమార్తెలు లయ్యా మరియు రాహీల్ లను వివాహం చేసుకున్న వృత్తాంతం, ఆయనకు 12 మంది కుమారులు మరియు ఒక కుమార్తె పుట్టిన వివరాలు ఇవ్వబడ్డాయి. ఆయన తన ప్రయాణంలో కన్న కల, దాని ఆధారంగా ఒక పుణ్యక్షేత్రం (బైతుల్ మఖ్దిస్) నిర్మిస్తానని మొక్కుకున్న సంఘటన, మరియు ఆ మొక్కును నెరవేర్చిన విధానం కూడా వివరించబడింది. చివరగా, ప్రవక్తలు వారి జాతి కోసమే పంపబడ్డారని, కేవలం ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాత్రమే యావత్ మానవాళి కోసం పంపబడ్డారని స్పష్టం చేయబడింది.
اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ [అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్] సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.
وَ الصَّلَاةُ وَ السَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَ الْمُرْسَلِيْنَ [వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్] మరియు ప్రవక్తలలో శ్రేష్ఠుడు మరియు ప్రవక్తల నాయకునిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.
نَبِيِّنَا مُحَمَّدٍ وَّ عَلَى آلِهِ وَ أَصْحَابِهِ أَجْمَعِيْنَ [నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్] మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై మరియు వారి అనుచరులందరిపై శుభాలు కలుగుగాక.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَ رَحْمَةُ اللهِ وَ بَرَكَاتُهُ [అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు] మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
ఈనాటి ప్రసంగంలో మనం ఒక మహా ప్రవక్త గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన స్వయంగా ఒక ప్రవక్త, ఆయన తండ్రి కూడా ఒక ప్రవక్త, ఆయన తాత కూడా ప్రవక్త. ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సంతానము ప్రసాదించాడు, అయితే సంతానము తరఫున ఆయనకు పరీక్షలు కూడా ఎదురయ్యాయి. సంతానం విషయంలో ఆయన ఎంతగా దుఃఖించారంటే, చివరికి ఆయన కళ్ళు తెల్లబడిపోయి కంటిచూపుకి ఆయన దూరమైపోయారు. ఎవరాయన అంటే, ఆయనే ప్రవక్త యాఖూబ్ అలైహిస్సలాం వారు.
ప్రవక్తల వంశం
యాఖూబ్ అలైహిస్సలాం వారు ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారి కుమారుడు. ఇస్ హాఖ్ అలైహిస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుడు. ఆ ప్రకారంగా యాఖూబ్ అలైహిస్సలాం వారు కూడా ప్రవక్త, యాఖూబ్ అలైహిస్సలాం వారి తండ్రి ఇస్ హాఖ్ అలైహిస్సలాం కూడా ప్రవక్త, ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారి తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కూడా ప్రవక్త కాబట్టి, నేను ప్రారంభంలో ఆ విధంగా మాట్లాడాను.
ఇక రండి, యాఖూబ్ అలైహిస్సలాం వారి చరిత్ర మనం తెలుసుకుందాం. ఇంతకుముందు మనం విన్నట్టుగా, యాఖూబ్ అలైహిస్సలాం వారి తండ్రి పేరు ఇస్ హాఖ్ అలైహిస్సలాం. ఆయన ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి మనవడు అవుతాడు. యాఖూబ్ అలైహిస్సలాం వారి తల్లి పేరు రిఫ్కా, తెలుగులో రిబ్కా అని అనువాదము చేయబడి ఉంది.
రిబ్కాతో వివాహం జరిగిన తరువాత, ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో సంతానం కోసమో ప్రార్థన చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఇద్దరు కుమారుల్ని ప్రసాదించాడు. ఒక కుమారుని పేరు ఈస్ (ఈసు అని కూడా చెబుతూ ఉంటారు), రెండవ కుమారుని పేరు యాఖూబ్. అయితే చరిత్రకారులు వీరిద్దరి గురించి తెలియజేస్తూ ఏమన్నారంటే, ఈస్ పెద్ద కుమారుడు, యాఖూబ్ చిన్న కుమారుడు. అయితే ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏమిటంటే, ఈస్ శరీరం మీద వెంట్రుకలు ఎక్కువగా ఉండేవి, యాఖూబ్ శరీరం మీద వెంట్రుకలు ఉండేవి కావు. ఈస్ వారిని ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారు ఎక్కువగా అభిమానించేవారు, యాఖూబ్ వారిని రిబ్కా ఎక్కువగా అభిమానించేవారు అని చరిత్రకారులు తెలియజేశారు, అసలు విషయం అల్లాహ్ కే తెలుసు.
ఇకపోతే, ఆ పుట్టిన ఇద్దరు కుమారులు, ఈస్ మరియు యాఖూబ్, ఇద్దరూ కూడా పెరిగి పెద్దవారయ్యారు. ఈలోపు ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారు ముసలివారైపోయారు, వృద్ధాప్యానికి చేరుకున్నారు, ఆయన కంటిచూపు క్షీణించింది. ఇద్దరు కుమారులు పెరిగి పెద్దవారైన తరువాత, వారిద్దరి మధ్య భేదాభిప్రాయము జరిగింది. వారిద్దరి మధ్య భేదాభిప్రాయము జరిగినప్పుడు, తల్లి రిబ్కా యాఖూబ్ వారిని పిలిచి, “చూడబ్బాయ్, నీవు నీ మామయ్య ఇంటి వద్దకు వెళ్ళిపో.” అంటే యాఖూబ్ అలైహిస్సలాం వారి మామయ్య హరాన్ అనే ఒక ప్రదేశంలో ఉండేవారు, అక్కడికి వెళ్ళిపోమని తల్లి రిబ్కా యాఖూబ్ అలైహిస్సలాం వారికి పురమాయించారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం [మరణానంతర జీవితం – పార్ట్ 49] https://www.youtube.com/watch?v=LJvDCtqg1H0 [23 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహిల్లజీ హదానా లిహాదా వమా కున్నా లినహ్తదియ లవ్లా అన్ హదానల్లాహ్. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ వఅలా ఆలిహి వమన్ వాలాహ్. అమ్మాబాద్. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం ఈ విషయాల వివరణలు మనం తెలుసు కుంటున్నాము.
అయితే మహాశయులారా, గత కార్యక్రమంలో మనం ఇహలోకంలో మన కర్మలన్నీ కూడా వ్రాయబడుతున్నాయి అనే విషయానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాము. ఎప్పుడైతే పరలోకంలో మనం హాజరవుతామో అక్కడ మన కర్మ పత్రాలు మన ముందు తెరవబడటం జరుగుతుంది. ప్రతీ మనిషి ఇహలోకంలో అతను చదువుకున్నా, చదువుకోకున్నా అతడు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ప్రళయ దినాన అతని మెడలో అతని యొక్క కర్మ పత్రం ఉంటుంది. స్వయంగా దానిని అతను చదువుకోవచ్చు కూడా. స్వయంగా అతను దానిని చదువుకునే అటువంటి శక్తి కూడా ఆ రోజు అల్లాహు తఆలా అతనికి ప్రసాదిస్తాడు.
ఒకసారి సూరత్ బనీ ఇస్రాయీల్, దాని మరొక పేరు సూరతుల్ ఇస్రా. సూరతుల్ ఇస్రాలోని ఈ ఆయతు చదవండి.
మేము ప్రతీ మనిషి యొక్క మంచి చెడులను అతని మెడలో వ్రేలాడదీశాము. ప్రళయ దినాన మేము అతని కర్మ పత్రాలను వెలికి తీస్తాము. అతను దానిని ఒక తెరువబడిన పుస్తకం మాదిరిగా స్పష్టంగా చూస్తాడు పొందుతాడు. అప్పుడు అతనితో చెప్పడం జరుగుతుంది. నీవు నీ ఈ కర్మ పత్రాన్ని చదువుకో. ఈ రోజు నీ లెక్క తీసుకోవటానికి నీవే చాలు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.అల్హందులిల్లాహి వహదహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅద అమ్మా బఅద్. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
మహాశయులారా! నరకం, నరకం యొక్క వివరణలు, నరకవాసుల గురించి వివరాలు మనం ఇన్షా అల్లాహ్ తెలుసుకోబోతున్నాము. నరకం, ఇది అల్లాహ్ యొక్క శిక్ష. అల్లాహ్ ను విశ్వసించని వారు, అల్లాహ్ యొక్క ఆదేశాలను పాటించకుండా ఆయనకు అవిధేయత చూపుతూ, ఆయన పంపిన సత్యధర్మానికి వ్యతిరేకంగా జీవించే వారి గురించి నివాసస్థలం.
మరణానంతర జీవిత ఘట్టాల్లో ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము. అయితే, చివరిగా మిగిలిన రెండు విషయాలు: ఒకటి నరకం, మరొకటి స్వర్గం. నరకం, దాని భయంకర విషయాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మనం స్వర్గం గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాము.
నరకానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. వాటి యొక్క భావనను బట్టి, పాపాలు చేసేవారు ఎలాంటి పాపాలకు గురి అవుతారో, వారికి ఎలాంటి శిక్ష విధించాలో దానిని బట్టి కూడా ఆ పేర్లు దానికి నిర్ణయించడం జరిగింది. అల్లాహు తఆలా ఎన్నో పేర్లను ఖురాన్ లో కూడా ప్రస్తావించాడు:
ఈ విధంగా ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ పేర్ల యొక్క భావన మరియు పాపాలను బట్టి ఆ పేర్లు పెట్టబడ్డాయి. ఉదాహరణకు, ఒక ఉదాహరణ ఇచ్చి నేను మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ముందుకు వెళ్దాము. సూరతుల్ హుమజాలో అల్లాహ్ ఇలా అంటున్నాడు:
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.