వివాదం తలెత్తినప్పుడు ఏం చెయ్యాలి? – హబీబురహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

వివాదం తలెత్తినప్పుడు ఏం చెయ్యాలి?
https://youtu.be/xd6M9eObBtY [7 నిముషాలు]
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

విశ్వాసుల మధ్య ఏదైనా వివాదం తలెత్తినప్పుడు ఏమి చేయాలి? ఈ ప్రసంగం ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల వెలుగులో ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. సూరా నిసాలోని 59వ ఆయతును ఉటంకిస్తూ, ఏ విషయంలోనైనా అభిప్రాయ భేదం వస్తే దాని పరిష్కారం కోసం అల్లాహ్ (ఖురాన్) మరియు ఆయన ప్రవక్త (సున్నత్) వైపు మరలాలని స్పష్టం చేస్తుంది. మూడవ వ్యక్తిని లేదా ఒక నిర్దిష్ట పండితుడిని (తఖ్లీద్) గుడ్డిగా అనుసరించడం ఈ ఖురానీయ సూత్రానికి విరుద్ధమని, ఇది ముస్లిం సమాజంలో అనైక్యతకు దారితీస్తుందని వివరిస్తుంది. అంతిమంగా, ఖురాన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సంప్రదాయాన్ని గట్టిగా పట్టుకున్నంత కాలం ముస్లింలు మార్గభ్రష్టత్వానికి గురికారని ప్రవక్త చేసిన హితోపదేశంతో ప్రసంగం ముగుస్తుంది.

ఇన్నల్ హమ్దలిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాఅదహ్, అమ్మా బాద్.
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

వివాదం తలెత్తినప్పుడు మనం ఏమి చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఏ విషయంలోనైనా వివాదం తలెత్తినప్పుడు మనం ఏమి చేయాలి? ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల్లో దాని పరిష్కారం వెతకాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో ఇలా సెలవిచ్చాడు, సూరా నిసా, ఆయత్ నెంబర్ 59:

فَإِن تَنَٰزَعْتُمْ فِى شَىْءٍ فَرُدُّوهُ إِلَى ٱللَّهِ وَٱلرَّسُولِ
(ఫ ఇన్ తనాజా’తుమ్ ఫీ షైఇన్ ఫరుద్దూహు ఇలల్లాహి వర్రసూల్)
మీ మధ్య వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్‌ మరియు ప్రవక్త వైపుకు మరల్చండి.” (4:59)

ఏ విషయంలోనైనా మీ మధ్య వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపుకు మరల్చండి. వివాదాస్పదమైన విషయాన్ని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపుకు మరల్చటం అంటే, నేటి ధార్మిక పరిభాషలో అర్థం, ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల వైపుకు మరలటం అన్నమాట. అభిప్రాయ భేదాలను, వివాదాలను పరిష్కరించటానికి ఇది అత్యుత్తమమైన మార్గదర్శక సూత్రం.

ఈ సూత్రం ద్వారా అర్థమయ్యేది ఏమిటంటే, మరో మూడో వ్యక్తిని అనుసరించవలసిన అగత్యం లేదు. అనుసరించాలంటే, అల్లాహ్ ఆయన ప్రవక్త ఆదేశాలను పాటించాలంటే, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను అనుసరించటం. మూడో వ్యక్తిని అనుసరించవలసిన అగత్యం లేదన్నమాట. ఈ విషయం బాగా మనం గ్రహించాలి.

ఒకానొక నిర్ణీత పండితున్ని అనుసరించటం, దీనిని తఖ్లీదె ముఅయ్యన అంటారు. అంటే ఒకానొక నిర్ణీత పండితున్ని అనుసరించటం తఖ్లీదె ముఅయ్యన, తఖ్లీదె ముఅయ్యన్ లేక తఖ్లీదె షఖ్సీ తప్పనిసరి అని చెప్పేవారు, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో పాటు మూడో వ్యక్తి అనుసరణను తప్పనిసరిగా ఖరారు చేశారు. దీనికి రూఢీ లేదు.

ఈ దివ్య ఖురాన్ లోని ఈ ఆయతుకు పూర్తిగా విరుద్ధమైన ఈ మూడో వ్యక్తి అనుసరణ, ముస్లింలకు ఐక్య సమాజం, ఉమ్మతె ముత్తహిద కాకుండా, అనైక్య సమాజం, ఉమ్మతె ముంతషిరగా, ఇంకా చెప్పాలంటే, ముస్లిం సమాజ ఐక్యతను దాదాపు దుస్సాధ్యంగా మార్చివేసింది ఈ తఖ్లీదె ముఅయ్యన్, ఈ తఖ్లీదె షఖ్సీ.

కానీ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం సెలవిచ్చారు?

ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి ‘ముఅత్తా’లో ఈ హదీసును ప్రస్తావించారు: మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనం ఇది:

تَرَكْتُ فِيكُمْ أَمْرَيْنِ لَنْ تَضِلُّوا مَا تَمَسَّكْتُمْ بِهِمَا كِتَابَ اللَّهِ وَسُنَّةَ نَبِيِّهِ
(తరక్తు ఫీకుమ్ అమ్రైన్, లన్ తదిల్లూ మా తమస్సక్తుమ్ బిహిమా, కితాబల్లాహి వ సున్నత నబియ్యిహి)

“నేను, మీ మధ్య రెండు వస్తువులను వదలిపోతున్నాను. మీరు ఆ రెండు వస్తువులను గట్టిగా పట్టుకొని ఉన్నంతకాలం సన్మార్గం తప్పరు. సన్మార్గంలోనే ఉంటారు.అవేమంటే, ఒకటి అల్లాహ్ గ్రంథం ఖురాన్. రెండోది, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సంప్రదాయం, సున్నత్.

అంటే, సారాంశం ఏమనగా, వివాదం తలెత్తినప్పుడు మనం మన వివాదాలను అల్లాహ్ మరియు ప్రవక్త వైపుకు మరల్చాలి అన్నమాట. స్వయంగా మనము ఏదీ కూడా కల్పించకూడదు. స్వయంగా ఊహించుకొని నిర్ణయాలు తీసుకోకూడదు. మూడో వ్యక్తికి, నాలుగో వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వకూడదు.

ఏదైనా ధర్మం విషయంలో, న్యాయం చేసే విషయంలో, ఏదైనా ఆరాధనలో, ఏదైనా సరే అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను పాటించే విషయంలో, అనుసరించే విషయంలో ఏదైనా వివాదం తలెత్తితే ఏం చేయాలి?

فَإِن تَنَٰزَعْتُمْ فِى شَىْءٍ فَرُدُّوهُ إِلَى ٱللَّهِ وَٱلرَّسُولِ
(ఫ ఇన్ తనాజా’తుమ్ ఫీ షైఇన్ ఫరుద్దూహు ఇలల్లాహి వర్రసూల్)
“ఏ విషయంలోనైనా మీ మధ్య వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్ మరియు ప్రవక్త వైపుకు మరల్చాలి.”

అంటే ఖురాన్ మరియు ప్రవక్త గారి ప్రామాణికమైన హదీసుల వెలుగులో దానికి మనము పరిష్కారం చూపాలి. అదే విషయం మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు: “నేను మీ మధ్య రెండు విషయాలు వదిలిపోతున్నాను. మీరు ఆ రెండు విషయాలను గట్టిగా పట్టుకున్నంతవరకు మార్గం తప్పరు. మార్గభ్రష్టులు అవ్వరు. సన్మార్గంలోనే ఉంటారు, సత్యంలోనే ఉంటారు, న్యాయంలోనే ఉంటారు, ధర్మంలోనే ఉంటారు. ఆ రెండింటిలో ఏ ఒక్కటి వదిలేసినా, ఏ ఒక్క దానిపైన కూడా నిర్లక్ష్యం చూపినా మార్గం తప్పుతారు. ఆ రెండు, ఖురాన్ మరియు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్.”

వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43693