సమాధుల చుట్టూ ప్రదక్షిణ (తవాఫ్) & సమాధుల వైపు నమాజ్ చెయ్యడం https://youtu.be/mtb-SmruW8E [6 నిముషాలు] షేఖ్ హబీబుర్రహ్మాన్ జామిఈ హఫిజహుల్లాహ్
ఈ ప్రసంగంలో, సమాధుల చుట్టూ ప్రదక్షిణ (తవాఫ్) చేయడం మరియు వాటి వైపు తిరిగి నమాజ్ చేయడం ఇస్లాంలో నిషేధించబడినవని స్పష్టంగా వివరించబడింది. తవాఫ్ అనేది మక్కాలోని కాబతుల్లాహ్కు మాత్రమే ప్రత్యేకమైన ఆరాధన అని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో నొక్కి చెప్పబడింది. ప్రవక్తల సమాధులను ఆరాధనా స్థలాలుగా మార్చుకున్న వారిని అల్లాహ్ శపించాడని, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సమాధిని పూజించే స్థలంగా మార్చవద్దని ప్రార్థించారని ఉల్లేఖించబడింది. ప్రవక్త యొక్క మస్జిద్ (మస్జిదె నబవి) ఎంతో పవిత్రమైనదైనప్పటికీ, దాని చుట్టూ కూడా తవాఫ్ చేయడానికి అనుమతి లేనప్పుడు, ఇతర సమాధులు లేదా దర్గాల చుట్టూ తిరగడం ఘోరమైన పాపం (షిర్క్) అవుతుందని హెచ్చరించబడింది. ముస్లింలు ఇలాంటి షిర్క్ మరియు బిద్అత్ (మతంలో నూతన కల్పనలు)లకు దూరంగా ఉండాలని ప్రసంగం ముగిసింది.
ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ బ’అదహు అమ్మా బ’అద్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ 12వ ఎపిసోడ్లో, సమాధుల ప్రదక్షిణం చేయటం, దాని వాస్తవికత ఏమిటో తెలుసుకుందాం. సోదరులారా, మన సమాజంలో కొందరు అమాయకులు, అజ్ఞానం వల్లో అలాగే ఇస్లాం గురించి సరైన అవగాహనం లేనందువల్ల సమాధుల వద్ద పోయి పూజిస్తున్నారు, సమాధుల తవాఫ్ (ప్రదక్షిణం) చేస్తున్నారు.
ఈ భూమండలంలో కాబతుల్లాహ్ తవాఫ్ తప్ప ఇతరుల తవాఫ్కి అనుమతి లేదు. అది ఎంత పవిత్రమైన స్థలమైనా సరే, కాబతుల్లాహ్ తప్ప మరేదానిని తవాఫ్ చేయకూడదు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా తెలియజేశాడు,
وَلْيَطَّوَّفُوا بِالْبَيْتِ الْعَتِيقِ (వల్ యత్తవ్వఫూ బిల్ బైతిల్ అతీఖ్) వారు ఆ ప్రాచీన గృహానికి (కాబతుల్లాహ్కు) ప్రదక్షిణ చేయాలి. (22:29)
అంటే ఆ కాబతుల్లాకి తవాఫ్ చేయాలి. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, ఈ హదీస్ ఇబ్నె మాజాలో ఉంది, ఎవరైతే ఆ కాబతుల్లాకి చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తాడో, తవాఫ్ చేస్తాడో, ఆ తర్వాత రెండు రకాత్ నమాజులు పాటిస్తాడో, ఆ వ్యక్తికి ఒక బానిసను విముక్తి ప్రసాదించే అంత పుణ్యం లభిస్తుంది.
సమాధుల వైపు నమాజ్ చేయడం
అభిమాన సోదరులారా, సమాధుల వైపునకు ముఖాన్ని త్రిప్పి నమాజ్ చేయడం అది అధర్మము, అసత్యము, అది హరామ్ అవుతుంది. కొందరు మదీనాలో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి వైపు తిరిగి ప్రార్థనలు చేస్తారు, వేడుకుంటారు, దుఆ చేస్తారు, నమాజ్ చేస్తారు, ఇది అధర్మం. ఈ విషయం గురించి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కఠినంగా ఖండించారు.
అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు,
لَعَنَ اللَّهُ الْيَهُودَ وَالنَّصَارَى اتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ (ల’అనల్లాహుల్ యహూద వన్ నసారా ఇత్తఖదూ ఖుబూర అంబియా’ఇహిమ్ మసాజిదా) అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యూదుల పైన మరియు క్రైస్తవుల పైన శపించుగాక! ఎందుకంటే వారు ప్రవక్తల సమాధులను సజ్దాగా(ఆరాధన స్థలాలు) చేసుకున్నారు. (ముత్తఫకున్ అలైహ్)
అంటే మస్జిద్ గా చేసుకున్నారు. అంటే సజ్దా అల్లాహ్ కోసమే చేయాలి. అది మనము నమాజ్ ఎక్కడ చేస్తాము? మస్జిద్ కి పోయి చేస్తాము. కాకపోతే యోధులు మరియు క్రైస్తవులు ప్రవక్తల సమాధులను మస్జిదులుగా మార్చేశారు, మస్జిదులుగా ఖరారు చేసుకున్నారు.
అలాగే అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు,
اللَّهُمَّ لَا تَجْعَلْ قَبْرِي وَثَنًا يُعْبَدُ (అల్లాహుమ్మ లా తజ్’అల్ ఖబ్రీ వసనన్ యు’బద్) ఓ అల్లాహ్, నా సమాధిని ప్రార్థనాలయంగా మార్చకు.
అంటే, ఓ అల్లాహ్, నేను చనిపోయిన తర్వాత నా సమాజంలో, నా ఉమ్మత్ లో కొంతమంది రావచ్చు, వచ్చి నా సమాధి వైపు తిరగవచ్చు, ప్రదక్షిణం చేయవచ్చు, కాకపోతే ఓ అల్లాహ్ నువ్వు నా సమాధిని ప్రార్థనాలయంగా మార్చవద్దు.
ఆ జాతి పైన అల్లాహ్ యొక్క క్రోధం కఠినంగా మారిపోతుంది, ఏ జాతి పైన?
“ఏ జాతి వారు, ఏ వర్గం వారు ఎవరైతే ప్రవక్తల సమాధులను ప్రదక్షిణం చేస్తారో, ప్రవక్తల సమాధులను ఆరాధన స్థలంగా మార్చుకుంటారో, అటువంటి జాతి పైన అల్లాహ్ యొక్క క్రోధం కఠినంగా మారిపోతుందని” అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ లో తెలియజేశారు.
అభిమాన సోదరులారా, అలాగే సమాధుల వైపునకు ముఖాన్ని త్రిప్పి నమాజ్ చేయకూడదు. ఎటువైపు త్రిప్పి నమాజ్ చేయాలి? అది కేవలం కాబతుల్లాహ్ వైపు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా తెలియజేశాడు సూరతుల్ బఖరాలో,
అభిమాన సోదరులారా, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, “మీరు సమాధుల పై గానీ, సమాధుల వైపునకు గానీ ముఖాలను త్రిప్పి నమాజు చేయకండి.”
అభిమాన సోదరులారా, ఇక్కడ గమనించే విషయం ఏమిటంటే, ఈ భూమండలంలో కాబతుల్లాహ్ తర్వాత, మస్జిదె హరామ్ తర్వాత పవిత్రమైన స్థలాలు రెండు ఉన్నాయి. ఒకటి మస్జిదె నబవి, రెండవది మస్జిదె అఖ్సా.
మస్జిదె హరామ్, మస్జిదె నబవి, మస్జిదె అఖ్సా – ఈ మూడు మస్జిదులకు నమాజ్ చేసే ఉద్దేశంతో ప్రయాణం చేయవచ్చు. మస్జిదె నబవిలో ఒక నమాజ్ చేస్తే వెయ్యి నమాజుల పుణ్యం అంత లభిస్తుంది. అంటే అది హరమ్ అది. ఏ విధంగా మస్జిదె హరామ్ హరమ్ కిందికి వస్తుందో, అలాగే మస్జిదె నబవి కూడా హరమ్ లో వస్తుంది. అయినప్పటికీ, ఆ మస్జిదె నబవి యొక్క ప్రదక్షిణం చేయటం కూడా ధర్మసమ్మతం కాదు, మరి మనం దర్గాలకు, దర్గాల వైపు తిరుగుతున్నాము, సమాధుల వైపు తిరుగుతున్నాము, బాబాలని, పీర్లని, ఔలియాలని… మన ప్రవక్త కంటే పెద్ద వలీ ఎవరండీ?
కాకపోతే ఈ కాబతుల్లా తవాఫ్ తప్ప, కాబతుల్లా ప్రదక్షిణం తప్ప ప్రపంచంలో, ఈ భూమండలంలో దేనిని ప్రదక్షిణం చేసినా అది అధర్మం అవుతుంది. ఈ విషయం గురించి ఎన్నో వందలాది హదీసులు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ షిర్క్ నుండి, బిద్ఆ నుండి, ఖురాఫాతు నుండి కాపాడుగాక. ఇస్లాం పట్ల సరైన అవగాహనను అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. ఆమీన్.
వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఆయిషహ్ (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం ఒకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముహాజిర్ల, అన్సార్ల సమూహంతో పాటు ఉన్నారు. ఒక ఒంటె ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చి సజ్జహ్ చేసింది. (సాష్టాంగపడింది). అప్పుడు సహాబాలు, ‘ఓ ప్రవక్తా! మీకు పశువులు, వృక్షాలు కూడా సజ్జహ్ చేస్తున్నాయి. మీకు సజ్జహ్ చేయడంలో వాటికంటే మాకే ఎక్కువ హక్కు ఉంది’ అని విన్నవించుకున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘మీ ప్రభువును ఆరాధించండి. మీ సోదరుణ్ణి గౌరవించండి’ (హదీసు గ్రంథం ముస్నద్ అహ్మద్ 76/86)
మానవులందరూ పరస్పరం సోదరుల్లాంటి వారు. అందరి కంటే పెద్దవారు పెద్ద సోదరుల్లాంటి వారు. వారిని గౌరవించండి. అందరి యజమాని, ప్రభువు అల్లాహ్ మాత్రమే. ఆయన్నే ఆరాధించాలి. దీని ద్వారా తెలిస్తున్న విషయం ఏమిటంటే, అల్లాహ్ సన్నిహితులు ప్రవక్తలు, ఔలియాలు అందరూ నిస్సహాయులే. అల్లాహ్ వారికి ఔన్నత్యం ప్రసాదించాడు. కనుక మనకు సోదరుల్లాంటి వారయ్యారు. వారికి విధేయులై ఉండమని మనల్ని ఆదేశించడం జరిగింది. ఎందుకంటే మన స్థాయి వారి కంటే చిన్నది. కనుక వారిని మానవుల మాదిరిగానే గౌరవించాలి. వారిని దేవుళ్ళను చేయకూడదు. కొందరు పుణ్యాత్ములను చెట్లు, జంతువులు కూడా గౌరవిస్తాయి. కనుక కొన్ని దర్గాల వద్దకు పులులు, ఏనుగులు, తోడేళ్ళు వస్తుంటాయి. మానవులు వాటితో పోటీ పడకూడదు. అల్లాహ్ తెలిపిన విధంగానే వారిని గౌరవించాలి. హద్దులు మీరి ప్రవర్తించకూడదు. ఉదాహరణకు : ముజావర్లుగా మారి సమాధుల వద్ద ఉండటం షరీఅత్లో ఎక్కడా లేదు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ముజావర్ల(దర్గా యజమానులు) అవతారం ఎత్తకూడదు. మనుషులు జంతువులను చూసి అనుకరించడం సమంజసం కాదు.
ఖైస్ బిన్ సఅద్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు : నేను హీరా నగరానికి వెళ్లాను. అక్కడి ప్రజలు తమ రాజుకు సాష్టాంగపడటం నేను చూశాను. నిశ్చయంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సజ్జహ్ చేయబడటానికి ఎక్కువ అర్హులు అని మనసులో అనుకున్నాను. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరకు వెళ్ళి ‘నేను హీరాల్లో ప్రజలను రాజుకు సజ్జహ్ చేస్తుండగా చూశాను. వాస్తవానికి మా సబ్దాలకు మీరే ఎక్కువ హక్కు దారులు’ అని అన్నాను. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘ఒకవేళ నువ్వు నా సమాధి దగ్గర నుండి వెళితే దానిపై సజ్జహ్ చేస్తావా? అని ప్రశ్నించారు. ‘లేదు’ అని సమాధాన మిచ్చాను. అయితే ‘అలా చేయకు’ అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హితబోధ చేశారు.(హదీసు గ్రంథం అబూ దావూద్, హదీస్: 2140)
దీని ద్వారా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజలకు చెప్పదలసిన విషయం ఏమిటంటే – ఏదో ఒకరోజు నేను మరణించి సమాధి ఒడిలో నిద్రపోతాను. అలాంటప్పుడు నేను సజ్జహ్ చేయబడటానికి ఎలా అర్హుణ్ణి కాగలను. నిత్యుడు అయిన అల్లాహ్ యే సజ్జహ్ కు అర్హుడు. కనుక బతికున్న వాడికిగానీ, చనిపోయిన వానికి గానీ సజ్జహ్ చేయకూడదు. సమాధికిగానీ, ఆస్థానంలో కూడా సజ్జహ్ చేయకూడదు. ఎందుకంటే బతికున్న వారు ఏదో ఒక రోజు చనిపోతారు. చనిపోయినవారు కూడా ఒకప్పుడు బ్రతికున్నవారే. మనిషి చనిపోయి దేవుడు కాలేడు. దాసునిగానే ఉంటాడు.
—
ఈ పోస్ట్ క్రింది పుస్తకం లోని 7 వ అధ్యాయం నుండి తీసుకోబడింది: విశ్వాస ప్రదాయిని(తఖ్వియతుల్ ఈమాన్) ఉర్దూ మూలం: హదీసు వేత్త షాహ్ ఇస్మాయీల్ (రహిమహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ఆడియోలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) లేదా ఇతరుల మాధ్యమంతో (వసీలా) అల్లాహ్ను ప్రార్థించడం సరైనదేనా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. ఖురాన్ మరియు హదీసుల ప్రకారం దుఆ (ప్రార్థన) చేయడానికి సరైన పద్ధతిని ఇది వివరిస్తుంది. సరైన పద్ధతి ప్రకారం, మొదట అల్లాహ్ను స్తుతించి, ఆ తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ (సలావత్) పంపి, ఆపై మన అవసరాలను అల్లాహ్తో విన్నవించుకోవాలి.
“ప్రవక్త యొక్క పుణ్యం కారణంగా” లేదా “ఫాతిమా, హసన్, హుసైన్ల పుణ్యం కారణంగా” మా ప్రార్థనను స్వీకరించు అని వేడుకోవడం ప్రవక్త (స) నేర్పని, సహాబాలు ఆచరించని మరియు సలఫ్-ఎ-సాలిహీన్ పద్ధతి కాని ఒక బిదాత్ (నూతన కల్పన) అని స్పష్టం చేయబడింది. కావున, ముస్లింలు ఇలాంటి పద్ధతులకు దూరంగా ఉండాలని బోధించబడింది.
ఇక్కడ వలీ భాయ్ ఒక ప్రశ్న అడిగారు, అస్సలాము అలైకుమ్. వ అలైకుమ్ అస్సలామ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. “ప్యారే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కే తుఫైల్ సే (ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆశీర్వాదం వల్ల)” మా యొక్క ప్రార్థనలు మరియు దువాలను అల్లాహ్ స్వీకరించు గాక అని అనటం పరిపాటి అయిపోయింది. కావున ఈ విధంగా వేడుకోవటం సమంజసమేనా?
చూడండి, అల్లాహు తాలా దుఆ చేసే యొక్క విధానాన్ని, పద్ధతిని మనకు తెలియజేశాడు. మనం ఖురాన్ ఆరంభంలోనే సూరహ్ ఫాతిహా చూస్తున్నాము కదా?
اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَۙ، الرَّحْمٰنِ الرَّحِيْمِۙ، مٰلِكِ يَوْمِ الدِّيْنِۗ، اِيَّاكَ نَعْبُدُ وَاِيَّاكَ نَسْتَعِيْنُۗ (అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్-రహ్మానిర్-రహీం, మాలికి యౌమిద్దీన్, ఇయ్యాక న’బుదు వ ఇయ్యాక నస్త’ఈన్) (సర్వస్తోత్రములు అల్లాహ్, సకల లోకాల ప్రభువుకే శోభాయమానం. ఆయన అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. తీర్పుదినానికి యజమాని. మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము.)
ఆ తర్వాత, మనకు కావలసింది ఏమిటో, మనకు మన జీవితంలో చాలా అత్యవసరమైనది ఏమిటో అది అడగండి అని అల్లాహ్ స్వయంగా మనకు నేర్పాడు. అయితే అల్లాహు తాలా దుఆ అడిగే యొక్క పద్ధతిని మనకు తెలియజేశాడు. అల్లాహ్ తో మనం ఏదైనా అడగాలంటే, ఏదైనా అర్ధించాలి అంటే, దుఆ చేయాలి అంటే ముందు అల్లాహ్ యొక్క స్తోత్రములు, అల్లాహ్ యొక్క పొగడ్తలు మనం పొగడాలి. అల్లాహ్ యొక్క స్తుతిని స్తుతించాలి.
ఇక ఆ తర్వాత హదీసుల ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ చదవాలి. ఈ విషయం గమనించండి. ఈ రోజుల్లో ధర్మ జ్ఞానం ఖురాన్ హదీసుల నుండి మనం నేర్చుకోవడం లేదు. మనం అంటే అధిక మంది. అల్హందులిల్లాహ్ కొంతమంది ఉన్నారు, మీలాంటి చాలా శుభము గలవారు కూడా ఉన్నారు. అల్హందులిల్లాహ్ చాలా మంది ఖురాన్ హదీస్ ద్వారా సరైన జ్ఞానం నేర్చుకోవడం లేదు. అందుకొరకు, మనకు మన అవసరాలు ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క పరిష్కారాలు అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ మరియు హదీసుల్లో తెలిపారు. అయితే మనం నేర్చుకోవట్లేదు.
ఇక్కడ ప్రశ్నలో వచ్చిన విషయానికి మనం దూరమవుతున్నామని అనుకుంటున్నారు, కానీ లేదు. మనం దుఆ అంగీకరించబడాలి, మనం చేసే దుఆ అల్లాహు తాలా స్వీకరించాలి అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది, అల్లాహ్ యొక్క స్తుతి, ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ చదివి, మనం కావలసింది మనం కోరాలి. అప్పుడు అల్లాహు తాలా తప్పకుండా దుఆ స్వీకరిస్తాడు.
ఇక, “నబీ కే సదఖే కే తుఫైల్ మే (ప్రవక్త యొక్క పుణ్యం మరియు గౌరవం కారణంగా)”, “ఫాతిమా కే సదఖే కే తుఫైల్ మే (ఫాతిమా యొక్క పుణ్యం మరియు గౌరవం కారణంగా)”, “హసన్ హుసైన్ కే సదఖే కే తుఫైల్ మే (హసన్ మరియు హుసైన్ యొక్క పుణ్యం మరియు గౌరవం కారణంగా)”, “హమారీ దుఆ కుబూల్ ఫర్మా (మా ప్రార్థనను స్వీకరించు)” – ఈ విధంగా చెప్పడం, పలకడం స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పలేదు, సహాబాలు ఆచరించలేదు మరియు ఈ పద్ధతి అనేది మన సలఫ్-ఎ-సాలిహీన్ వారిది కాదు. ఇది ఈ పద్ధతి బిదాతి పద్ధతి (ధర్మంలో నూతన కల్పన). దీని నుండి మనం దూరం ఉండాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఖురాన్ లో ఔలియాల ప్రస్తావన వచ్చి ఉంది కదా? మరి ఎందుకు వారితో దుఆ చేయకూడదు, శరణు వేడకూడదు? https://youtu.be/OFeb-uCup0Q [9 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చివరి ప్రవక్త అని, ఆయన తర్వాత ప్రవక్తలు రారని స్పష్టం చేయబడింది. అయితే, అల్లాహ్ యొక్క ‘ఔలియాలు’ (స్నేహితులు) వస్తూనే ఉంటారని ఖురాన్ లో ఉందని, కానీ వారిని ఆరాధించడం, వేడుకోవడం లేదా వారి సమాధుల వద్ద మొక్కుబళ్ళు చెల్లించడం ఘోరమైన షిర్క్ అని వివరించబడింది. అల్లాహ్ ను వదిలి ఇతరులను ఔలియాలుగా చేసుకోవద్దని, కేవలం అల్లాహ్ గ్రంథమైన ఖురాన్ ను మాత్రమే అనుసరించాలని సూరతుల్ ఆరాఫ్, సూరతుర్ రఅద్ వంటి ఆయత్ ల ఆధారంగా నొక్కి చెప్పబడింది.
ప్రశ్న : అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు. అయ్యా మౌలానా గారు, నాకు ఈ ఫాతిహాలకు సంబంధించిన ఒకాయన ఫ్రెండ్ ఉన్నాడు. ఈయన ఏమడుగుతున్నాడంటే, మన ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ఆఖరి పైగంబరు అని ఖురాన్లో ఉంది కదా. కానీ, అదే విధంగా భూమి మీద వలియల్లాలు రారు అని ఏమన్నా చెప్పి ఉన్నదా? అని నాకు అతను ప్రశ్న వేశాడు. నా దగ్గర అంత విద్య లేదు కాబట్టి, నేను అతనితో మా ముఫ్తీ గారు ఉన్నారు, ఆయనకు అడిగి చెప్తాను అని చెప్పి అతని దగ్గర నుంచి వచ్చేసాను. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరని నేను ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
సమాధానం: వ అలైకుం అస్సలాం వ రహమతుల్లాహి వ బరకాతుహు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ ప్రవక్తలకు అంతిమ, చిట్టచివరి ప్రవక్త అని చాలా స్పష్టంగా ఉంది. మరియు ఇక మీరు అడిగిన ప్రశ్న, అల్లాహ్ యొక్క ఔలియాల గురించి ఖురాన్ లో లేదా?
ఖురాన్ లో అల్లాహ్ ఔలియాల ప్రస్తావన
అల్లాహ్ యొక్క ఔలియాల ప్రస్తావన ఖురాన్ లో అనేక సందర్భాలలో ఉంది. కానీ, అల్లాహ్ ను వదిలి ఆ ఔలియాలను మనం వేడుకోవడం లేదా అల్లాహ్ తో పాటు ఆ ఔలియాలతో దువాలు చేయడం, దీని ప్రస్తావన లేదు. ఏముంది ఖురాన్ లో? ఉదాహరణకు మీరు సూరతు యూనుస్ చూశారంటే,
أَلَا إِنَّ أَوْلِيَاءَ اللَّهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ (అలా ఇన్న అవ్లియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలా హుమ్ యహ్జనూన్) వినండి! నిశ్చయంగా అల్లాహ్ మిత్రులకు ఎలాంటి భయమూ ఉండదు, వారు దుఃఖించరు కూడా.
الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ (అల్లజీన ఆమనూ వ కానూ యత్తఖూన్) వారు ఎవరంటే, విశ్వసించి, దైవభీతితో ఉండేవారు.
ఇప్పుడు నేను తిలావత్ చేసిన రెండు ఆయతులు సూరత్ యూనుస్ 62, 63.
వినండి. నిశ్చయంగా అల్లాహ్ యొక్క ఔలియా, (అలా వినండి, ఇన్న నిశ్చయంగా, ఔలియా అల్లాహ్, అల్లాహ్ యొక్క ఔలియా, వలీలు), లా ఖవ్ఫున్ అలైహిమ్, వారికి ఎలాంటి భయము లేదు. వలా హుమ్ యహ్జనూన్, వారు ఎలాంటి చింతించనవసరము లేదు.
అల్లజీన ఆమనూ, ఎవరు ఆ ఔలియాలు? విశ్వసించిన వారు. వ కానూ యత్తఖూన్, వారు పాపాలకు దూరంగా ఉండేవారు, భయభీతితో, అల్లాహ్ యొక్క భయభీతితో తమ జీవితం గడిపేవారు.
ఇక వారికి ఎలాంటి రందీ లేదు, ఎలాంటి చింత లేదు, బాధ లేదు, వారు భయపడవలసిన అవసరం లేదు అని అల్లాహ్ చెప్పాడు కదా, మరి ఏముంది వారికి? అల్లాహ్ అంటున్నాడు ఆయత్ నెంబర్ 64 లో,
لَهُمُ الْبُشْرَىٰ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ (లహుముల్ బుష్రా ఫిల్ హయాతిద్ దున్యా వ ఫిల్ ఆఖిరహ్) ఇహలోక జీవితంలో మరియు పరలోక జీవితంలో వారి కొరకు శుభవార్తలు ఉన్నాయి.
అయితే గమనించారా? ఔలియా అల్లాహ్ ల యొక్క ప్రస్తావన ఖురాన్ లో ఉంది. వారి యొక్క ఘనత అల్లాహ్ త’ఆలా చాలా స్పష్టంగా తెలిపాడు.
ఔలియాలను వేడుకోవడం షిర్క్
కానీ ఈ రోజుల్లో మన ముస్లిం సోదర సోదరీమణులలో ఎంతో మంది అల్లాహ్ తో పాటు ఇతర ఔలియాలను ఏదైతే వేడుకుంటున్నారో, దువా చేస్తున్నారో, వారి యొక్క సమాధుల వద్దకు వెళ్లి అల్లాహ్ కు చేయవలసిన కొన్ని ఆరాధనలు, ఉదాహరణకు మొక్కుబడులు చెల్లించడం గానీ, మరికొన్ని దర్బారుల, దర్గాల వద్ద జంతువులను బలి ఇవ్వడం గానీ, అల్లాహ్ హిదాయత్ ప్రసాదించు గాక కొన్ని దర్బారులు ఉదాహరణకు పాకిస్తాన్ లో ఖలందర్ షా దర్గా అని ఉంది, అక్కడ తవాఫ్ కూడా చేస్తారు. నవూజుబిల్లాహ్ సుమ్మ నవూజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, మనం ఎలాగైతే తవాఫ్ హజ్రే అస్వద్ నుండి మొదలుపెట్టి అక్కడే పూర్తి చేస్తామో, అలా అక్కడ కూడా వారు ఒక స్థలాన్ని నిర్ణయించుకుని అక్కడి నుండి ప్రారంభం చేస్తారు. ఇలాంటి ఘోరమైన షిర్క్ పనులు ఏవైతే జరుగుతున్నాయో, అల్లాహ్ దివ్య గ్రంథం ఖురాన్ లో వీటిని ఖండించాడు.
ఉదాహరణకు మీరు సూరతుల్ ఆరాఫ్, ఆయత్ నెంబర్ మూడు చూశారంటే,
اتَّبِعُوا مَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ وَلَا تَتَّبِعُوا مِن دُونِهِ أَوْلِيَاءَ ۗ قَلِيلًا مَّا تَذَكَّرُونَ (ఇత్తబిఊ మా ఉన్జిల ఇలైకుమ్ మిర్ రబ్బికుమ్ వలా తత్తబిఊ మిన్ దూనిహీ అవ్లియా, ఖలీలమ్ మా తజక్కరూన్) మీ ప్రభువు వైపు నుండి మీ వైపునకు అవతరింప చేయబడిన దానిని మీరు అనుసరించండి. దానిని వదిలి మీరు ఔలియాల వెంట పడకండి. మీరు చాలా తక్కువ గుణపాఠం నేర్చుకుంటున్నారు.
హితోపదేశం ఈ ఖురాన్, హదీసుల ద్వారా ఏదైతే తీసుకోవాలో, దాని నుండి మీరు చాలా తక్కువ హితోపదేశం పొందుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అల్లాహు అక్బర్. గమనించారా?
అయితే స్వయంగా ఆ ఔలియాలు, ఎవరైతే అల్లాహ్ యొక్క నిజమైన ఔలియాలు ఉన్నారో, వారి యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది. అందులో అనుమానం లేదు. కానీ ఆ ఔలియాలలో ఏ ఒక్క వలీ, ఇక్కడ గుర్తుంచుకోండి నిజమైన వలీ అయితే, ఏ ఒక్క వలీ కూడా మీరు నా సమాధి వద్దకు రండి, నా యొక్క దర్గాల వద్దకు రండి, నన్ను ఆరాధించండి, నాతో దువా చేయండి, నా వద్ద మొక్కుబడులు మీరు చెల్లించండి, ఇలాంటి ఏ ఒక్క మాట చెప్పలేదు.
ఒక్కసారి గనక మీరు సూరతుర్ రఅద్, సూర నెంబర్ 13, ఆయత్ నెంబర్ 16 లో గమనిస్తే,
قُلْ مَن رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ قُلِ اللَّهُ ۚ قُلْ أَفَاتَّخَذْتُم مِّن دُونِهِ أَوْلِيَاءَ لَا يَمْلِكُونَ لِأَنفُسِهِمْ نَفْعًا وَلَا ضَرًّا (ఖుల్ మర్ రబ్బుస్ సమావాతి వల్ అర్ద్, ఖులిల్లాహ్. ఖుల్ అఫత్తఖజ్తుమ్ మిన్ దూనిహీ అవ్లియాల లా యమ్లికూన లి అన్ఫుసిహిమ్ నఫ్ అన్ వలా దర్ర) వారితో ప్రశ్నించండి, భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు? వారితో చెప్పండి, అల్లాహ్ మాత్రమే. ఇప్పుడు వారికి ఈ ఆదేశం ఇవ్వండి, ఈ హెచ్చరిక చేయండి, వారికి తెలపండి, చెప్పండి వారితో, అల్లాహ్ ను కాదని మీరు వేరే వారిని ఔలియాలుగా చేసుకుంటున్నారా మీకు ఇష్టం వచ్చినట్లు? వారు స్వయం తమకు ఏ లాభం చేకూర్చలేరు, వారిపై వచ్చి పడిన ఏ నష్టాన్ని వారు దూరం చేసుకోలేరు.
ఔలియా అల్లాహ్, వారిని మనం విశ్వసించాలి. ఎవరైతే అల్లాహ్ యొక్క సత్యమైన వలీలు ఉన్నారో, వారు అల్లాహ్ యొక్క సత్య వలీలు అని నమ్మాలి. కానీ, ఈ రోజుల్లో వలీల పేరు మీద ఏ దందాలు జరుగుతున్నాయో వాటిని స్వయంగా ఖురాన్ ఖండించినది అన్న విషయం కూడా తెలుసుకోవాలి.
అల్లాహ్ మనందరికీ సన్మార్గం ప్రసాదించు గాక. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[2:45 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ధర్మపరమైన నిషేధాలు –21
21– సమాధుల మీద గుమ్మటం కట్టబోకు. సమాధి భూమి లేవల్ కు మించి మరీ ఎక్కువగా ఎత్తు ఉండకూడదు. దానిని సున్నపు రౌతు, ఇటుక, బండలతో కట్టకూడదు. దానిపై వ్రాయ- కూడదు. చిత్రాలు, బొమ్మలు దించకూడదు. దాని మీద దీపాలు పెట్టకూడదు. ఒక రకంగా ఇవన్నీ వృధా ఖర్చులే కాకుండా, మరో రకంగా అంతకు మించి షిర్క్ కు సాధనాలవుతాయి. మరియు సమాధుల పట్ల గౌరవభావం ఎక్కువయిపోతుంది. చివరికి విగ్రహాలకు పాటించబడే గౌరవం లాంటి పరిస్థితి వస్తుంది.
అబుల్ హయ్యాజ్ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు: ఒకాసారి అలీ రజియల్లాహు అన్హు నన్ను పిలిచి ఇలా చెప్పారుః ‘ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఏ కార్యనిర్వహణకు పంపారో, దానిగ్గానూ నేను నిన్ను పంపుతున్నాను. “నీవు ఎక్కడ ఏ బొమ్మను చూసినా దానిని చెరిపివెయ్యి. ఎక్కడ ఏ ఎత్తయిన గోరిని చూసినా దానిని నేలమట్టం చెయ్యి”. (ముస్లిం 969).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ఈనాటి మన శీర్షిక అవిశ్వాసులు ఇహలోకంలో చేసే సత్కార్యాలు, వారి యొక్క విశ్వాసాలు, వారి యొక్క కర్మలు, వాటి యొక్క ఫలం ఏమిటి?
మహాశయులారా! మనం ఇహలోకంలో ఏమి చేసినా, ఏ రవ్వంత, అంతకంటే మరీ చిన్నది, అణువంత, అంతకంటే తక్కువ ఏ సత్కార్యమైనా, దుష్కార్యమైనా అది విశ్వాసానికి సంబంధించినా, అది నాలుక సంబంధమైన కర్మ అయినా, అది హృదయ సంబంధ కర్మ అయినా, ఏ రకమైనదిగా, ఒకవేళ రవ్వంత ఏ కార్యం అయినా గానీ అల్లాహ్ (తఆలా) దానిని హాజరు పరుస్తాడు.
అందుగురించి ప్రళయ దినాన ఎప్పుడైతే సర్వ మానవులను సమాధుల నుండి లేపి లెక్క తీర్పు జరగడానికి, వారి యొక్క కర్మలు తూకం చేయడానికి ఇంకా ఎన్నో మజిలీలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటి కంటే ముందు ఆ మైదానములో ఎక్కడైతే అందరినీ సమీకరించబడుతుందో, అక్కడ ఇహలోకంలో అవిశ్వాసులు పాటించిన, అవిశ్వాసానికి వారి కర్మలకు స్వయంగా వారు ఎప్పుడైతే వాటిని చూసుకుంటారో వారి యొక్క పరిస్థితి ఏముంటుంది?
అయితే సామాన్యంగా మనిషి పాటించే లేక మనిషి చేసే కర్మలలో ఒకటి విశ్వాసానికి సంబంధించింది ఉంటుంది. ఇక అవిశ్వాసులు సృష్టికర్త అయిన అల్లాహ్ ను నమ్మలేదు గనుక, సృష్టికర్త అయిన ఏకేశ్వరుడ్ని, ఏకేశ్వరుని ఆరాధన, ఏకేశ్వరోపాసనలో తమ జీవితం గడపలేదు గనుక ఇది మహా పాపాల్లో లెక్కించబడుతుంది. దానికి ఏదైనా పుణ్యం దొరకడం దూరం వారికి దాని గురించి భయంకరమైన శిక్ష ఉంటుంది. కానీ అవిశ్వాసులు ఇహలోకంలో తల్లిదండ్రుల సేవలు, అనాధల పట్ల, నిరుపేదల పట్ల ఇంకా ఏ పుణ్యాలు, సత్కార్యాలైతే వారు చేసుకున్నారో, వాటి యొక్క ఫలితం అక్కడ దొరుకుతుందా? లేదా ఆ రోజు వారికి ఎప్పుడైతే స్వయంగా ఆ మైదానంలో హాజరు అవుతారో వారికి, వారి ఆ సత్కార్యాలు ఎలా కనబడతాయి? దాని గురించి ఖురాన్ లో అల్లాహ్ కొన్ని ఉపమానాల ద్వారా ఆ విషయాన్ని విశదీకరించారు.
“ఎవరైతే సత్య తిరస్కారానికి గురి అయ్యారో, అవిశ్వాసానికి పాల్పడ్డారో, వారి యొక్క కర్మలు, వారి యొక్క సత్కార్యాలు ఇహలోకంలో వారు ఏదైతే చేస్తున్నారో, దూరం దారిలో మైదానంలో ఎండమావులు ఎలా కనబడతాయో దాహంతో తల్లడిస్తున్న వ్యక్తి దానిని చూసి ఎలాగైతే నీళ్ళు అని భావిస్తాడో అలాగే వీరి పరిస్థితి ఉంటుంది“. వీరు ఏ సత్కార్యాలు అయితే ఇహలోకంలో చేశారో వాటి యొక్క పుణ్యం కనీసం మాకు దొరుకుతుంది కదా! అని అక్కడ వారు ఆశిస్తారు. ఎందుకంటే వారు ఏ అవిశ్వాసానికి పాల్పడ్డారో దాని యొక్క నష్టం ముందే చూసుకున్నారు కదా!
గత భాగాల్లో మీరు విని కూడా ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఆ సత్కార్యాల పుణ్యం కనీసం మాకు లభించి మాకు ఏదైనా లాభం కలుగుతుంది అని భావిస్తారు. కానీ ఆ లాభం ఈవిధంగా మారిపోతుంది. ఎలాగైతే ఎండమావులు దాహంతో ఉన్న వ్యక్తికి దూరంగా నీళ్ల మాదిరిగా కనబడుతుందో, అక్కడికి వెళ్ళిన తర్వాత నా యొక్క దాహం తీరుతుంది అని అనుకుంటాడో అలాగే వారి పరిస్థితి అవుతుంది. అయితే ఇక్కడ ఎవరైనా అడగవచ్చు. ఇహలోకంలో కూడా కనీసం ఏదైనా లాభం కలుగుతుందా? ఇహలోకంలో ఏదైనా లాభం కలగవచ్చు! కానీ పరలోకంలో ఈ సత్కార్యాల లాభం కలగడానికి విశ్వాసం, నిజమైన విశ్వాసం ఉండడం, బహు దైవారాధన కు దూరంగా ఉండడం తప్పనిసరి.
అంతేకాదు కేవలం అవిశ్వాసుల విషయమే కాదు. ఎవరైతే తమకు తాము విశ్వాసులమని అనుకుంటారో మరియు మేము ఇస్లాం పై ఉన్నాము అని సంతోషపడుతున్నారో కానీ షిర్క్,, బిదాత్ ఇంకా ఇలాంటి ఘోరమైన పాపాలు, ఏ పాపాలు అయితే వేరే పుణ్యాలను కూడా, సత్కార్యాలను కూడా నాశనం చేసేస్తాయో అలాంటి పాపాలకు పాల్పడి ఉన్నారో వారు కూడా ప్రళయ దినాన ఆ మైదానంలో హాజరైన తరువాత తమకుతాము చాలా నష్టం లో పడి చూసుకుంటారు. తమకు తాము చాలా నష్టం లో పడి ఉన్నట్లుగా చూసుకుంటారు.
సూరయే కహఫ్ ప్రతి జుమా రోజున చదవాలి అన్నట్లుగా ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మనల్ని ప్రోత్సహించారు, ఆదేశించారు. ఆ సూరయే కహఫ్ లో “వారికి తెలియజేయండి. స్వయంగా తాము చేసుకున్న సత్కార్యాలు వాటిని నష్టంలో పడవేసుకున్న వారు ఎవరో మీకు తెలియ చేయాలా? ఎవరి ఆ కష్టాలు అయితే ఇహ లోకంలోనే వృధా అయిపోయాయి. వారు ఏమి అనుకుంటారు. మేము చాలా మంచి కార్యాలు చేస్తున్నాము. మేము చేసే పనులు చాలా ఉత్తమమైనవి అని తమకు తాము భ్రమలో పడి ఉన్నారు“. కానీ ఏ షిర్క్ పనులు అయితే వారు చేస్తున్నారో ఎలాంటి బిదాత్ లకైతే వారు పాల్పడి ఉన్నారో వాటి మూలంగా ఈ సత్కార్యాల పుణ్యం అక్కడ వారికి ఏమాత్రం లభించకుండా ఉంటుంది.
ఆ తరువాత నూట ఐదవ ఆయత్ లో అల్లాహ్ అంటున్నాడు – “ఇలా వారు చేసుకున్న సత్కార్యాలు ఎందుకు వృధా అయ్యాయి. ఎందుకంటే వారు అల్లాహ్ పంపినటువంటి ఆయతులను తిరస్కరించారు. పరలోక దినాన అల్లాహ్ ను కలుసుకునేది ఉన్నది అన్న విషయాన్ని కూడా వారు తిరస్కరించారు“.
గమనించారా! సోదరులారా, సోదరీమణులారా! పరలోక విశ్వాసం ఎంత ముఖ్యం? ఆనాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి జరుగుతుందో ఆ వివరాలు అన్నీ అల్లాహ్ మనకు ఎందుకు తెలియజేసాడు? ఇంతకు ముందే నేను ఒక ఉదాహరణ ఇచ్చాను కదా! నాన్నా!, పరీక్షలు రాబోతున్నాయి కష్టపడి చదువుకుంటేనే ఇక్కడ పాస్ అవుతావు అని ఎలా అయితే మనం పిల్లలకు తెలియచేస్తామో, అంతకంటే గొప్ప మన కరుణామయుడైన, సృష్టికర్త అయిన అల్లాహ్ మనకు ఇలా బోధిస్తున్నాడు. ఎన్నో ఉపమానాలు, ఎన్నో ఉదాహరణలు తెలియజేస్తూ ఇలా సత్కార్యాలు ఎందుకు వృధా అయ్యాయి? అల్లాహ్ పంపిన ఆయతులు, సూచనలు వీటి ద్వారా మన సృష్టికర్త ఒక్కడే మన ఆరాధ్యుడు, ఆరాధ్య నీయుడు ఒక్కడే మరియు మన యొక్క ఆరాధనల్లో మనం ఆయనతో పాటు ఎవరినీ భాగస్వామిగా కలపవద్దు అన్న విషయాలు తెలుసుకునేది ఉంటే, అలా తెలుసుకోలేదు. వాటిని తిరస్కరించారు. చివరికి పరలోక దినం, ఏ దినం అయితే మనకు ఇక్కడ చేసుకున్న సత్ కర్మల ఫలితం లభించాలో దానిని కూడా బలంగా విశ్వసించనందుకు వారి యొక్క సత్కార్యాలు అన్నీ వృధా అయిపోయాయి. “వారి యొక్క సత్కార్యాలు అన్నీ కూడా వృధా అయిపోయాయి. ఇక అవన్నీ వృధా అయిపోయిన తర్వాత తూకం లో ఎప్పుడైతే పెట్టడం జరుగుతుందో అప్పుడు వాటికీ ఏ మాత్రం బరువు ఉండదు“.
ఈ విధంగా మహాశయులారా! మనం ఆ పరిస్థితి రాకముందే మనల్ని మనం చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలి.
మహాశయులారా! సమాధుల నుండి లేపబడిన తర్వాత ఆదిమానవుడు నుండి మొదలుకొని ప్రళయం వరకు వచ్చిన మానవులందరినీ ఒక మైదానంలో ఏదైతే సమీకరించబడుతుందో, అక్కడ ఎవరికి ఎలా పరిస్థితి ఉంటుంది? అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాము. అక్కడ యొక్క గాంభీర్యం, అక్కడ అవిశ్వాస స్థితిలో ఎవరైతే చనిపోయారో వారు ఎలా లేసి వస్తారు? వారు చేసుకున్న సత్కార్యాలకు ఉత్తమ ఫలితం లభించాలని ఏదైతే వారు ఆశిస్తారో కనీసం ఆ సందర్భంలో వారి యొక్క గతి ఏమవుతుందో? అలాగే తమకు తాము ముస్లింలు అని భావించి ఇస్లాం పై సరైన విధంగా వారి జీవితం గడవనందుకు వారి యొక్క పరిస్థితి ఏమవుతుంది? మనం తెలుసుకుంటూ వస్తున్నాము.
ఇదే మైదానంలో లేచి హాజరైన తర్వాత పరిస్థితి ఏముంటుంది? ఎవరైతే ఆ సృష్టికర్తను కాకుండా ఇంకెవరినెవరినైతే పూజించారో, ఆరాధించారో, ప్రళయ దినాన అక్కడ హాజరు అయినప్పుడు పరస్పరం వారు ఒకరికి ఒకరు వివాదానికి దిగుతారు. అవునండి! ఈ రోజుల్లో షిర్క్ పై మరియు అల్లాహ్ ఆరాధనను వదిలి ఎంత ఐక్యమత్యం చూపుకోవడం జరుగుతుందో ఎంత పరస్పరం ప్రేమ, ప్రేమాభిమానాలు చూసుకోవడం జరుగుతుందో ఆ ప్రళయ దినాన “ఇహలోకంలో ప్రాణ స్నేహితులుగా ఉన్నవారు కూడా పరలోక దినాన ఏమవుతుంది? విడిపోతారు, దూరం అవుతారు, శత్రువులుగా మారుతారు. ఒకవేళ ఏదైనా స్నేహితం మిగిలి ఉంటే అల్లాహ్ యొక్క విశ్వాసం, అల్లాహ్ యొక్క భయభీతి ఆధారంగా ఏ స్నేహితం జరిగిందో అది మాత్రమే మిగిలి ఉంటుంది“.
అల్లాహ్ ను వదిలి ఎవరెవరినైతే ఆరాధించారో ఆరాధించిన వారు హాజరవుతారు, ఆ ఆరాధ్యనీయులు కూడా, ఎవరినైతే ఆరాధించడం జరిగిందో, వారు కూడా హాజరవుతారు. చదవండి ఖురాన్ యొక్క ఈ ఆయత్ :
“అపరాధుల కొరకు నరకాన్ని దగ్గరగా చేయబడుతుంది. మీరు ఎవరిని ఆరాధిస్తూ ఉండేవారు? అని వారిని ప్రశ్నించడం జరుగుతుంది. మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ఆరాధిస్తూ ఉండేవారో వారు మీకు ఈరోజు ఏదైనా సహాయం చేయగలుగుతారా? లేదా స్వయంగా తమకు తాము వారు ఏదైనా సహాయం చేసుకోగలుగుతారా? ఆరాధింపబడిన వారు మరియు ఈ అపరాధులు అందరినీ కలిసి నరకంలో బోర్ల వేయబడటం జరుగుతుంది“.
అల్లాహ్ మనందరిని అలాంటి పరిస్థితుల నుండి కాపాడుగాక.
“అల్లాహ్ యొక్క ఆరాధన నుండి దూరం చేసి, ఇతరుల ఆరాధన వైపునకు పురికొల్పిన ఇబ్లీస్ మరియు అతని యొక్క అనుయాయులు, అతని యొక్క సైన్యం అందరినీ కూడా ఆ నరకంలో వేయడం జరుగుతుంది. అప్పుడు వారు పరస్పరం వివాదానికి దిగి ఇలా అంటారు. అల్లాహ్ సాక్షిగా మేము ఇహలోకం లో చాలా స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉంటిమి. మేము అల్లాహ్ ను వదిలి అల్లాహ్ కు, ఆ సర్వ లోకాలకు ప్రభువైన అల్లాహ్ తో పాటు మిమ్మల్ని మేము భాగస్వాములుగా చేశాము. అల్లాహ్ కు చేయునటువంటి ఆరాధన మిమ్మల్ని అల్లాహ్ కు సమానులుగా చేసి, మీకు ఆ ఆరాధనలు చేస్తూ ఉన్నాము“.
ఈవిధంగా ఆ ప్రళయ దినాన ఎప్పుడైతే నరకంలో పోకముందు ఆ మైదానంలో ఒక దృశ్యం ఏదైతే చూపడం జరుగుతుందో దానిని వారు చూసి అక్కడ మేము ఇహలోకంలో ఎంత తప్పు చేసామో కదా! ఆ ఏకైక సృష్టికర్త ఆరాధనలు వదులుకొని మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము కదా అని అక్కడ వారితో వివాదానికి దిగుతారు. కానీ ఏమి ప్రయోజనం ఉండదు.
అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేమిటంటే ఏ పుణ్యాత్ములు, ప్రవక్తలు, అల్లాహ్ యొక్క భక్తులు వారు ఎవరిని కూడా మమ్మల్ని ఆరాధించండి అని చెప్పలేదు. ప్రజలే స్వయంగా వారికి ఇష్టం లేని ఈ షిర్క్ కార్యం చేస్తూ అల్లాహ్ తో పాటు వారిని ఏదైతే సాటి కల్పించారో అలాంటి పుణ్యాత్ముల్ని నరకంలో వేయడం జరగదు. ఏ ఆరాధ్యనీయులైతే ప్రజల్ని పురిగొలిపి మార్గభ్రష్టత్వం లో పడవేసి అల్లాహ్ ను వదిలి వారిని ఆరాధించాలని, వారి ద్వారా ఆరాధన చేయించుకుంటున్నారో అలాంటి వారినే నరకంలో పంపడం జరుగుతుంది. కానీ ఎవరైతే పుణ్యాత్ములుగా జీవించి, ఏకైక సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తూ ఉండి, ప్రజల్ని స్వయంగా షిర్క్ నుండి ఆపుతూ వచ్చారో అలాంటి పుణ్యాత్ముల్ని నరకంలో వేయడం జరగదు.
అయితే ఆ మైదానంలో ఈ ఆరాధించిన వాళ్ళు హాజరవుతారు. ఎవరినైతే ఆరాధించారో వారిని చూసి మేము మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము. ఈరోజు మమ్మల్ని కాపాడుకోండి. మాకు సహాయం చేయండి అని అరుస్తారు. కానీ వారు స్పష్టంగా చెప్పేస్తారు. మీరు మమ్మల్ని ఆరాధించేవారు కాదు. మీరు జిన్నులను ఆరాధించేవారు, షైతానులను ఆరాధించేవారు. షైతాను మిమ్మల్ని ఇలాంటి పెడమార్గంలో పడవేసాడు, అతన్ని మీరు ఆరాధిస్తూ ఉన్నారు అని ఎలాంటి సహాయం చేయకుండా వారి నుండి తప్పించుకుంటారు.
చదవండి ఈ ఆయత్. ఎన్నో ఆయత్ లు ఇలాంటివి ఉన్నాయి కానీ ఉదాహరణకు ఒక ఆయత్ నేను చదువుతున్నాను – “ఆ రోజు అల్లాహ్ (తఆలా) ఆ మహా మైదానంలో అందరిని సమీకరిస్తాడు. మళ్ళీ అల్లాహ్ (తఆలా) దైవదూతలతో ప్రశ్నిస్తాడు. ఏమి? వీరు మిమ్మల్ని ఆరాధించేవారా? దైవ దూతలు సమాధానం చెబుతారు. నీవు అన్ని రకాల షిర్క్, బహు దైవారాధన నుండి అతీతునివి. నీవు మాకు సాన్నిహిత్యునివి మరియు నీవు మాకు వలి. ఇలాంటి వారిని ఎవరైతే నీతో పాటు ఇతరులను షిర్క్ చేశారో వారికి మాకు ఎలాంటి సంబంధం లేదు. వారు కాదు మాకు స్నేహితులు. సాన్నిహిత్యానికి మేము నిన్ను వేడుకుంటాము. నీవు అన్ని రకాల షిర్క్ లకు అతీతునివి. వారు జిన్నులను ఆరాధించేవారు. వారిలో అనేకమంది అధిక సంఖ్యలో ఆ జిన్నుల మీదనే వారికి నమ్మకం ఉండింది. వారిపై విశ్వాసం ఉండింది“.
అలాగే ఏసుక్రీస్తు, హజరత్ ఈసా (అలైహిస్సలాం) “మీరు కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి” అని తెలియజేశారు. కానీ ఈ రోజుల్లో ఆయన్ను కూడా పూజించడం జరుగుతుంది. అయితే ప్రళయ దినాన యేసు క్రీస్తు హాజరవుతారు. ఈసా (అలైహిస్సలాం) హాజరవుతారు. వారిని ఆరాధించిన వారు కూడా హాజరవుతారు. ఏమి జరుగుతుంది అప్పుడు – “అప్పుడు అల్లాహ్ (తఆలా) మర్యమ్ కుమారుడైన ఈసా అలైహిస్సలాం ని ప్రశ్నిస్తాడు. అల్లాహ్ ను వదిలి “నన్ను, నా తల్లిని మీరు ఆరాధ్య దైవంగా చేసుకోండి” అని ఓ ఈసా, ఓ యేసు నీవు ప్రజలకు చెప్పావా? అని అల్లాహ్ (తఆలా) మందలిస్తాడు“. అప్పుడు ఆ సందర్భంలో యేసుక్రీస్తు ఏమంటారు? ఎంతో వినయ వినమ్రతతో ఇలా సమాధానం తెలుపుకుంటారు? “నీవు పవిత్రునివి, అన్ని రకాల బహు దైవారాధనకు అతీతునివి. ఏ మాట పలకడం నాకు ఏ మాత్రం హక్కు లేదో అలాంటి మాట నేను ఎందుకు పలుకుతాను? అలాంటి మాట నేను ఎందుకు చెపుతాను? నేను ఒకవేళ చెప్పి ఉంటె నీకు తెలుసు ఆ విషయం. నేను వారికి చెప్పి ఉంటె నీకు తెలుసు. ఎందుకంటే నా మనసులో ఏముందో నీకు తెలుసు కానీ నీ మనసులో ఏముందో నాకు తెలియదు. నీవు నాకు ఏ ఆదేశం ఇచ్చావో అదే ఆదేశాన్ని నేను వారికి తెలియజేశాను. ఆ ఆదేశం చాలా స్పష్టంగా ఉండింది. అదేమిటి! నా యొక్క ప్రభు, మీ యొక్క ప్రభువు అల్లాహ్ మాత్రమే గనుక మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించండి. ఇదే బోధ నేను నా ప్రజలందరికీ చేశాను అని స్పష్టంగా ఏసుక్రీస్తు (అలైహిస్సలాం) తెలియజేస్తారు“.
ఇంకా ఏమి జరగనుంది? ఇన్షా అల్లాహ్ తరవాయి భాగంలో మనం తెలుసుకుందాము.
జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్.అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ఈనాటి శీర్షికలో ప్రళయ దినాన ఎలాంటి గాంభీర్యం ఉండును?, ప్రజల పరిస్థితి ఆరోజు ఎలా ఉండును? అనే విషయాలు మనం గత భాగంలో నుండి తెలుసుకుంటూ వస్తున్నాము దాని తరువాయి భాగం ఇది.
మహాశయులారా! ఆ ప్రళయ దినాన అక్కడి ఒక్కరోజు ఇహలోకంలోని యాబై వేల సంవత్సరాల పరిమాణం. యాభై వేల సంవత్సరాలు ఇహలోకంలో గడిస్తే అక్కడి ఒక్కరోజు గడిచినట్టు. గమనించండి! అంత దీర్ఘకాలం ఇది ఎప్పుడు, ఎప్పుడైతే మనం సమాధుల నుండి లేపబడి అల్లాహ్ ఎదుట సమీకరింపబడతామో ఆ సమయాన. అల్లాహ్ (తఆలా) ఆ విషయాన్ని సూరతుల్ మఆరిజ్ లో (70:4) ఇలా తెలియపరిచాడు –
تَعْرُجُ الْمَلَائِكَةُ وَالرُّوحُ إِلَيْهِ فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِينَ أَلْفَ سَنَةٍ – 70:4 యాభై వేల సంవత్సరాల పరిమాణం గల రోజున దైవదూతలు మరియు ఆత్మ (జిబ్రయీల్) ఆయన వైపునకు అధిరోహిస్తారు.
యాబై వేల సంవత్సరాల పరిమాణం గల ఆ రోజున దైవదూతలు మరియు రూహ్ (ఆత్మ), అంటే జిబ్రిల్ అమీన్ ఆయన వైపునకు అధిరోహిస్తారు. అందుకే అక్కడికి చేరుకున్న తర్వాత అవిశ్వాసులు, పాపాత్ములు ఇహదినాన్ని గుర్తు చేసుకుంటూ మేము ఒకపొద్దు మాత్రము లేదా ఒక సాయంకాలం మాత్రమే ఇహలోకం లో ఉన్నాము అని భావిస్తారు.
ఈ రోజుల్లో ముప్పై, నలబై, యాబై సంవత్సరాలు జీవిస్తున్నాము. రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి వస్తూ ఉంది. పగలుశ్రమిస్తున్నాము. రాత్రి పడుకుంటున్నాము. ఈ విధంగా జీవితం ఇహలోక వ్యామోహంలో గడిచిపోతూ ఉంది.. పరలోకం గురించి రవ్వంత కూడా మనం ఆలోచించడం లేదు. ఆలోచించండి!, దాని గురించి సిద్ధపడండి! లేదా అంటే ఆ రోజు ఎలాంటి పరిస్థితి అవుతుంది?. ఈ ఆయతులను శ్రద్ధగా విని అర్ధం చేసుకొనే ప్రయత్నం చేయండి. సూరయే యూనుస్ ఆయత్ నెంబర్ నలబై ఐదు లో అల్లాహ్ (తఆలా) ఇలా తెలిపాడు –
وَيَوْمَ يَحْشُرُهُمْ كَأَن لَّمْ يَلْبَثُوا إِلَّا سَاعَةً مِّنَ النَّهَارِ – 10:45 అల్లాహ్ వారిని సమీకరించే ఆ రోజు గురించి జ్ఞాపకం చెయ్యి. అప్పుడు వారికి తాము (ప్రపంచ జీవితంలో) దినములో ఒక గడియకాలం ఆగి ఉన్నామేమో!? అనిపిస్తుంది.
“ఎప్పుడు ఏ రోజున అయితే వారిని సమీకరిస్తామో, పోగు చేస్తామో ఆ రోజున వారు ఏమంటారు? పగలు యొక్క కొంత భాగం మాత్రమే మేము ఇహలోకంలో ఉన్నాము”. ఆ అంటే పరలోక దినాన్ని ఎప్పుడైతే వారు తమ కన్నులారా చూస్తారో అప్పుడు ఇహలోకం చాలా సంక్షిప్తమైన జీవితం, పరలోకానికి ఎదుట దీని యొక్క లెక్క ఏ మాత్రం లేకుండా ఉంది అన్నట్లుగా అప్పుడు వారికి అర్థమవుతుంది. అందుగురించి క్షణం పాటు ఈజీవితంలో మన కోరికల్ని తీర్చుకుంటూ, పాపంలో జీవితం గడుపుతూ ఆ శాశ్వత జీవితాన్ని ఎప్పుడూ పాడు చేసుకోవద్దు. అక్కడ ఆ పరిస్థితిని తట్టుకోలేక, ఆ దీర్ఘ కాలాన్ని భరించలేక మనిషి స్వయంగా తనకు అతి ప్రియమైన వారిని, తన బంధువులలో అతి దగ్గరగా ఉన్న వారిని కూడా ఆనాటి శిక్షకు బదులుగా, పరిహారంగా చెల్లించి తాను శిక్ష నుండి తప్పించుకోవాలి అని కోరుతాడు.
సూరయే మఆరిజ్ పదకొండు నుండి పద్నాలుగు వరకు ఆయతులు ఒకసారి మీరు చదవండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
يَوَدُّ الْمُجْرِمُ لَوْ يَفْتَدِي مِنْ عَذَابِ يَوْمِئِذٍ بِبَنِيهِ – 70:11 నేరస్థుడు ఆ రోజు (తనకు పడే) శిక్ష నుంచి తప్పించుకోవటానికి పరిహారంగా తన కుమారులను,
وَصَاحِبَتِهِ وَأَخِيهِ – 70:12 తన ఇల్లాలినీ, తన సోదరుణ్ణి,
وَفَصِيلَتِهِ الَّتِي تُؤْوِيهِ – 70:13 తనకు ఆశ్రయమిచ్చిన తన కుటుంబాన్నీ,
وَمَن فِي الْأَرْضِ جَمِيعًا ثُمَّ يُنجِيهِ – 70:14 భూమండలంలోని సమస్త జనులనూ ఇచ్చేసి, తాను మాత్రం బయటపడాలని కోరుకుంటాడు.
అపరాధి ఆ రోజు ఇలా కోరుతాడు – ఆనాటి శిక్షకు బదులుగా, పరిహారంగా చెల్లించాలి ఎవరిని సంతానాన్ని, తన సహవాసిని, ఏ వంశం, ఏ కుటుంబం అతనికి రక్షణ ఇచ్చిందో, శరణ ఇచ్చిందో స్వయంగా వారిని కూడా నరకంలో తోసేయ్యాలి. ప్రపంచంలో ఉన్న వారందరినీ కూడా అతనికి బదులుగా నరకంలో పడ వేయాలి. ఆ తర్వాత అతన్ని అతనికి మోక్షం కలిగించాలి, అతనికి దాని నుండి రక్షణ కలిగించాలి – అని అపరాధి ఆ రోజు కోరుతాడు. సమాధానం ఏమి వస్తుంది అల్లాహ్ వైపు నుండి? “ముమ్మాటికి అలా జరగదు”. అందుగురించి ఆ రోజు రాకముందే మనం సిద్దపడాలి. దానికి సిద్ధమై ఆ రోజు మనపై అంత కష్టంగా గడవకుండా మనం అతి త్వరగా ఆ సమయం మనకు దాటే విధంగా మనం చూసుకోవాలి.
ఇదే సూరయే మఆరిజ్ లో అల్లాహ్ (తఆలా) తెలిపాడు.
إِنَّهُمْ يَرَوْنَهُ بَعِيدًا – 70:6 అది (ఆ శిక్ష) చాలా దూరాన ఉందని వారు భావిస్తున్నారు.
وَنَرَاهُ قَرِيبًا – 70:7 కాని అది మాకు చాలా దగ్గరే కనిపిస్తున్నది.
అవిశ్వాసులకు, సత్యతిరస్కారులకు, అపరాధాలు చేసినవారికి ఆ రోజు అంత దీర్ఘంగా ఏర్పడుతుంది. కానీ, మాకు, విశ్వాసం అవలంభించిన వారికి, సత్కార్యాలు చేస్తున్న వారికి, అల్లాహ్ ఇష్టప్రకారం తమ జీవితం గడుపుతున్న వారికి, అది చాలా తక్కువ సమయంగా, కొన్ని హదీతు లలో చెప్పడం జరిగింది, ఒక ఫర్ద్ నమాజ్ (విధి నమాజ్) చేయడంలో ఎంత సమయం అవుతుందో అంతే వారికి ఏర్పడుతుంది.
ఈ విధంగా మహాశయులారా! ఎన్ని పాపాలు పెరుగుతాయో, ఎన్ని కష్టాలు పెరుగుతాయో, ఎంత మనం అవిశ్వాసానికి ఒడికడతామో, దైవ ధిక్కారానికి, అల్లాహ్ ఏకత్వ ఆరాధనకు దూరంగా ఉంటామో, ఆ రోజు మనకు అంతే దూరంగా, దీర్ఘంగా, పొడుగ్గా ఏర్పడుతుంది. ఎంత మనం అల్లాహ్ కు చేరువుగా ఉంటామో, ఆయనకు విధేయత పాటిస్తూ ఉంటామో, కేవలం ఆయన యొక్క ఆయన ఆరాధనలోనే మన జీవితం గడుపుతామో అది మనకు చాలా తక్కువ సమయంగా ఏర్పడుతూ ఉంటుంది.
ఆ రోజు ప్రజలు మూడు స్థితులుగా ముందుకు వస్తారు. ఒకరు అవిశ్వాసానికి ఒడిగట్టిన వారు. మరొకరు విశ్వాసమార్గాన్ని అవలంబించారు కానీ దానిపై స్థిరంగా నడవలేదు. పాపాలలో కూరుకుపోయి పేరుకు మాత్రమే ఇస్లాంను అవలంబించినట్లుగా జీవితం గడిపేవారు. మూడోవారు పుణ్యాత్ములు, సదాచారణ చేసేవారు, విశ్వాసులు, అల్లాహ్ యొక్క భక్తులు. ఈ ముగ్గురు స్థితులు ఎలా ఉంటాయో, వాటి గురించి ఖురాన్లో ఏ ప్రస్తావన తెలపడం జరిగిందో, ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గురించి ఏ విషయాలు తెలిపారో అది ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకో బోతున్నాము.
ఎవరైతే అవిశ్వాసానికి ఒడికడతారో, సత్య తిరస్కారానికి పాల్పడతారో వారి యొక్క పరిస్థితి ఏముంటుంది? ఎవరు ఏ స్థితిలో చనిపోయినా, ఎవరు ఎక్కడ దేనికి గురి అయినా, క్రూర జంతువులకు ఆహారంగా అయిపోయినా, నీళ్ళల్లో కొట్టుకుపోయినా, కాల్చబడి బూడిద అయిపోయినా, ఏ స్థితిలో ఎవరు ఉన్నాగాని అల్లాహ్ వారందరినీ వెలికి తీస్తాడు. ఎప్పుడైతే వారు బయటకి వస్తారో, ఆ మహా మైదానంలో సమీకరింపబడతారో అప్పుడు ఆ సందర్భంలో అవిశ్వాసులు –
مُّهْطِعِينَ إِلَى الدَّاعِ ۖ يَقُولُ الْكَافِرُونَ هَٰذَا يَوْمٌ عَسِرٌ – 54:8 తమను పిలిచేవాని వైపు పరుగెత్తుకుంటూ వస్తారు. అప్పుడు అవిశ్వాసులు “ఇది చాలా గడ్డు రోజు” అనంటారు.
అవిశ్వాసులు, సత్య తిరస్కారాలు అంటారు – “ఈ రోజు చాలా కఠినమైనరోజు, చాలా కష్టతరమైన రోజు.” అంతే కాదు ఆనాటి గాంభీర్యాన్ని చూసి తమకుతాము శాపం కురిపించు కుంటూ అయ్యో నా పాడుగాను అనుకుంటూ అరుస్తారు.
సూరయే యాసీన్, ఏ సూరాలోనైతే ప్రళయ దినానికి సంబంధించిన ఎన్నో సత్య విషయాల్ని, ఎన్నో వివరాలను అల్లాహ్ (తఆలా) స్పష్ట పరిచాడో ఆ సూరయే యాసీన్ ను ఈరోజుల్లో బ్రతికి ఉన్న వారు చదివి గుణపాఠం నేర్చుకునే కి బదులుగా దానిని మృత్తులపై చదువుతూ ఉంటారు. ఈ సూరయే యాసీన్ ఈ ఖురాన్ లో అవతరింప చేయటానికి ముఖ్య కారణం బ్రతికి ఉన్నవారికి ఒక హెచ్చరిక, వారు దాని నుండి గుణపాఠం నేర్చుకోవాలి. అయితే అదే సూరాలో ఖురాన్ లో అల్లాహ్ అంటున్నాడు:
وَنُفِخَ فِي الصُّورِ فَإِذَا هُم مِّنَ الْأَجْدَاثِ إِلَىٰ رَبِّهِمْ يَنسِلُونَ – 36:51 మరి శంఖం పూరించబడగానే అందరూ తమ తమ గోరీల నుంచి లేచి, తమ ప్రభువు వైపునకు వడివడిగా వస్తారు
قَالُوا يَا وَيْلَنَا مَن بَعَثَنَا مِن مَّرْقَدِنَا ۜ ۗ هَٰذَا مَا وَعَدَ الرَّحْمَٰنُ وَصَدَقَ الْمُرْسَلُونَ – 36:52 “అయ్యో మా దౌర్భాగ్యం! మమ్మల్ని మా శయనాగారాల నుంచి లేపినదెవరు?” అని వారు వాపోతారు. “కరుణామయుడు (అయిన అల్లాహ్) చేసిన వాగ్దానమిదే. ప్రవక్తలు చెప్పింది నిజం” (అని వారితో అనబడుతుంది).
శంఖము ఉదబడినప్పుడు వారు తమ సమాధుల నుండి లేచి పరుగెడుతూ వస్తారు. అయ్యో! మా పాడుగాను అని తమకు తాము శపించుకుంటారు. మా ఈ పడక గదుల నుండి మమ్మల్ని ఎవరు లేపారు? అని అంటారు. అప్పుడు వారితో చెప్పడం జరుగుతుంది. రహ్మాన్ కరుణామయుడైన అల్లాహ్ చేసిన వాగ్దానం ఇది. ఈ రోజు తప్పకుండా మీరు ఆయన ఎదుట సమీకరింపబడతారు. ప్రవక్తలు కూడా ఈనాటి దినం గురించి మీకు ఏదైతే చెప్పారో అది సత్యం జరిగితీరింది. ఇప్పుడు మీరుకు మీరు శపించి కున్నా, మీకు మీరు బాధ పడ్డా అయ్యో! మమ్మల్ని ఎవరు లేపారు? ఎందుకు లేపారు? అని ఎంత మీరు కేకలు పెట్టినా ఏమి లాభం లేదు.
ఎవరైతే ఈ లోకంలో అల్లాహ్ ఆరాధనను ధిక్కరించారో, పుణ్య మార్గంలో నడవడానికి ఇది మాపని కాదు అంటూ పుణ్యాన్ని గురించి, సత్కార్యాల్ని గురించి, మంచిని గురించి బోధించే వారిని అడ్డుకునే వారు. అలాంటి వారి పరిస్థితి ఏమి జరుగుతుంది? సూరయే ఇబ్రాహీం నలబై ఎనిమిది నుంచి యాబై వరకు చదివి చూడండి –
يَوْمَ تُبَدَّلُ الْأَرْضُ غَيْرَ الْأَرْضِ وَالسَّمَاوَاتُ ۖ وَبَرَزُوا لِلَّهِ الْوَاحِدِ الْقَهَّارِ – 14:48 ఏ రోజున ఈ భూమి మరో భూమిగా మార్చివేయబడుతుందో, ఆకాశం సయితం (మారిపోతుందో), అప్పుడు అందరూ సర్వశక్తిమంతుడు, ఒకే ఒక్కడైన అల్లాహ్ ముందుకు వస్తారు
وَتَرَى الْمُجْرِمِينَ يَوْمَئِذٍ مُّقَرَّنِينَ فِي الْأَصْفَادِ – 14:49 ఆ రోజు అపరాధులంతా ఒకచోట సంకెళ్ళతో బంధించబడి ఉండటం నువ్వు చూస్తావు.
سَرَابِيلُهُم مِّن قَطِرَانٍ وَتَغْشَىٰ وُجُوهَهُمُ النَّارُ – 14:50 వారి దుస్తులు గంధకంతో చేయబడిన దుస్తులై ఉంటాయి. అగ్నిజ్వాలలు వారి ముఖాలను సయితం ఆవరించి ఉంటాయి.
“ఏ రోజు అయితే భూమి మార్చివేయడం జరుగుతుంది, ఈ భూమి ఉండదు మరియు ఆకాశాలు కూడా అవన్నీ మార్చివేయడం జరుగుతుంది. అందరూ ఆ ఏకైక, మరియు ఎంతో శక్తిశాలి అయినా అందరి పై గెలుపొందినటువంటి ఆ సృష్టికర్త ఎదుటకు హాజరవుతారు, వెలికి వస్తారు. అపరాధులను, అల్లాహ్ ఆరాధనలు దిక్కరించిన వారిని నువ్వు చూస్తావు. వారిని సంకెళ్లలో బంధించబడి తీసుకురావడం జరుగుతుంది. వారి యొక్క దుస్తులు, గంధకం తో చేయబడిన దుస్తులు గా ఉంటాయి మరియు వారిని అగ్ని కమ్ముకొని ఉంటుంది”. అల్లాహ్ ఇలాంటి అన్ని శిక్షల నుండి ఇలాంటి భయంకరమైన ఆ పరిస్థితి నుండి మనందరినీ కూడా కాపాడుగాక!
మరొక బాధకరమైన మరియు ఆశ్చర్యకరమైన, గాంభీర్యం అయిన విషయం మరొకటి ఏమిటంటే, ఆ రోజు సూర్యుడు కేవలం ఒక మీల్ (మైల్) అంత దూరంలోనే ఉంటారు. అల్లాహు అక్బర్! గమనించండి ఈరోజు సూర్యుడు మన నుండి ఎంత దూరంలో ఉన్నాడో దానికంటే కొంచెం దగ్గరయ్యాడంటే మనం కాలి మసి బొగ్గుల్లా మారుతాము. కానీ ఆరోజు వేడి యొక్క, ఆనాటి శిక్ష యొక్క రుచి చూపించడానికి ఈ శరీరాలు భరించేటువంటి అల్లాహ్ (తఆలా) అటువంటి శరీరాలను పుట్టిస్తాడు. మరియు సూర్యుడు ఇంత దగ్గరగా ఉండి, దాని యొక్క తాపం, దాని యొక్క వేడి వల్ల మనిషి పరిస్థితి ఏమవుతుంది? ఆ వేడి వల్ల మరియు ఇహలోకంలో వారి యొక్క కర్మలు ఎలా ఉండెనో దాని ప్రకారంగా వారి నుండి చెమట వెళ్తూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. చివరికి కొందరి పరిస్థితి ఏముంటుంది?
సహీ ముస్లింలో హదీత్ ఉంది – ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు చెప్పారు: సూర్యుడు ఒక మైల్ దూరంలో ఉంటాడు. ఆ రోజు సూర్యుడు సమీపిస్తాడు అది కేవలం పరిమాణం అనేది కేవలం ఒక మైల్ అంత దూరం లో ఉంటుంది“. ఒక ఉల్లేఖనంలో ఉంది – “ఆ రోజు ప్రజలు వారి కర్మల ప్రకారంగా చెమటలో మునిగి ఉంటారు. కొందరు తమ చెమటలో చీలమండలాల వరకు మునిగి ఉంటారు. మరి కొందరు తమ చెమటలో మోకాళ్ళ వరకు మునిగి ఉంటారు. మరికొందరు తమ చెమటలో నడుము వరకు మునిగి ఉంటారు. మరికొందరు తమ చెమటలో పూర్తిగా మునిగి ఉంటారు“.
సూరయే ముతఫ్ఫిఫీన్ ఆయత్ يَوْمَ يَقُومُ النَّاسُ لِرَبِّ الْعَالَمِينَ – 83:6 (ఆ రోజు జనులంతా సర్వలోకాల ప్రభువు ముందు నిలబడతారు) యొక్క వ్యాఖ్యానంలో ఒక సందర్భంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు చెప్పారు. “ప్రజలు ఆ రోజు తమ కర్మల ప్రకారంగా తమ చెమట లో మునిగి ఉంటారు. కొందరు అయితే ఈ చెవుల మధ్యలో వరకు మునిగి ఉంటారు“.
సహీ బుఖారి మరియు సహీ ముస్లిం లోని హదీత్ లో ఉంది. “ప్రళయ దినాన ప్రజలకు చెమటలు కారుతూ ఉంటాయి. కారుతూ ఉంటాయి. చివరికి వారి చెమట వారి వెనక డెబ్బై గజాల దూరం వరకు కూడా పారుతూ ఉంటుంది“. అల్లాహు అక్బర్! గమనించండి ఇది స్వయంగా మన చెమట. ఆరోజు ఆ పరిస్థితి ఉంటుంది.
ప్రళయ దినాల ప్రజలందరూ కూడా లేచి వచ్చినప్పుడు అల్లాహ్ యొక్క మాటలు ధిక్కరించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క బాటను అవలంబించని వారు, ప్రవక్త బాటకు వ్యతిరేకంగా వారి యొక్క మిత్రులు, వారి యొక్క స్నేహితులు, వారి యొక్క ఫ్రెండ్ వారి మాటలకు ప్రాధాన్యతను ఇచ్చువారు ఎలా వాపోతారో, బాధపడతారో ఈ ఆయతులను విని గమనించండి.
وَيَوْمَ يَعَضُّ الظَّالِمُ عَلَىٰ يَدَيْهِ يَقُولُ يَا لَيْتَنِي اتَّخَذْتُ مَعَ الرَّسُولِ سَبِيلًا – 25:27 ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు: “అయ్యో! నేను దైవప్రవక్త (సఅసం) మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బావుందేది!”
يَا وَيْلَتَىٰ لَيْتَنِي لَمْ أَتَّخِذْ فُلَانًا خَلِيلًا – 25:28 “అయ్యో! నా పాడుగాను. నేను ఫలానా వ్యక్తిని స్నేహితునిగా చేసుకోకుండా ఉంటే ఎంత బావుండేది!
لَّقَدْ أَضَلَّنِي عَنِ الذِّكْرِ بَعْدَ إِذْ جَاءَنِي ۗ وَكَانَ الشَّيْطَانُ لِلْإِنسَانِ خَذُولًا – 25:29 “నా వద్దకు ఉపదేశం వచ్చిన తరువాత కూడా వాడు నన్ను అపమార్గం పట్టించాడే! ఎంతయినా షైతాను మనిషికి (అదను చూసి) ద్రోహం చేసేవాడే!”
“ఆ రోజు అపరాధి, దౌర్జన్య పరుడు స్వయంగా తన చేతులను కొరుకుతాడు. మరి అంటాడు – అయ్యో! నా పాడుగాను. నేను ప్రవక్త బాటను అనుసరించి ఉంటే ఎంత బాగుండిపోను, ఓ నా పాడుగాను ఫలానా వ్యక్తిని నేను స్నేహితుడిగా చేసుకోకుంటే బాగుండును. నా దోస్తు, నా ఫ్రెండ్, నా యొక్క మిత్రుడు బోధ నా వద్దకు వచ్చిన తరువాత నన్ను మార్గభ్రష్టత్వం లోకి పడవేశాడు. ఈవిధంగా తీరా సమయం వచ్చినప్పుడు షైతాను మానవుణ్ణి అవమానం పాలు చేస్తాడు”.
అల్లాహ్ (తఆలా) మనందరి సృష్టికర్త ఆ రోజు సంభవించే విషయాల్ని విశదీకరిస్తూ మన గురించి ఇంత గొప్ప మేలు చేసాడో గమనించండి. ఇకనైనా సత్యాన్ని, ధర్మాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవితం గడిపే ప్రయత్నం మనం చేద్దాం. ఈ పరిస్థితి అంతా చూసి అప్పుడు వారికి అర్థమవుతుంది – “ఈ రోజు మనకు ఎవరు సిఫారసు చేసేవాడు లేడు. ఎవరి సహాయం మనకు అందదు. ఈరోజు మనం అల్లాహ్ యొక్క మన్నింపును, అల్లాహ్ యొక్క క్షమాపణను నోచుకోలేము” అన్నటువంటి నిరాశ వారికి అప్పుడు కలుగుతుంది.
సూరయే రూమ్ ఆయత్ నెంబర్ పన్నెండులో అల్లాహ్ చెప్పాడు –
ప్రళయం సంభవించిన రోజున అపరాధములు పూర్తిగా నిరాశ చెంది పోతారు – ఇక వారి యొక్క మన్నింపు జరగదు అని, వారు ఇహ లోకంలో చేసుకున్న పుణ్యాలు ఏ మాత్రం పనికి రావు అని. విశ్వాసం లేనిది ఏ పుణ్యము అంగీకరించబడదు. అందుకే ఆ రోజు అవిశ్వాసులు ఇదే కోరుతారు – “నా వద్దనైతే విశ్వాసం లేదు, నా వద్దనైతే సత్కార్యాలు లేవు. నేను అల్లాహ్ కు ఏమని సమాధానం పలకాలి? అయ్యో! ఈరోజు నేను మట్టిని అయిపోయి ఎలాంటి లెక్క ఇవ్వకుండా, ఎలాంటి అల్లాహ్ వద్ద నిలబడేటువంటి పరిస్థితి రాకుండా ఉంటె బాగుండును” అని. కానీ అలాంటి కోరికలు పూర్తి కావు.
ఇలా సూరయే నబాలో ఇలా తెలియపరిచారు.
وَيَقُولُ الْكَافِرُ يَا لَيْتَنِي كُنتُ تُرَابًا – 78:40 అప్పుడు అవిశ్వాసి, “అయ్యో! నేను మట్టినైపోయినా బావుండేదే!” అనంటాడు.
ఆ రోజు అవిశ్వాసుడు అంటాడు – అయ్యో! నేను మట్టిగా మారిపోతే ఎంత బాగుండేది! అని వాపోతాడు. కానీ అతనికి ఏ ప్రయోజనం చేకూర్చదు దానివల్ల. అందుగురించి మహాశయులారా! ఇలాంటి పరిస్థితులు మనకు జరగకూడదు. ఇలాంటి పరిస్థితి మనది కాకూడదు అంటే విశ్వాసమార్గాన్ని అవలంబించి సత్కార్యాలు చేస్తూ ఉండాలి. అల్లాహ్ (తఆలా) మనందరికీ అలాంటి సౌభాగ్యం ప్రసాదించుగాక!
జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్.అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ఈనాటి శీర్షిక ప్రళయం సంభవించినప్పుడు ఎలాంటి ఆందోళనకర పరిస్థితి ఉంటుందో దానిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము.
మహాశయులారా! ప్రళయం, పునరుత్థానదినం, పరలోకం మరోసారి అందరూ బ్రతికించబడి అల్లాహ్ యందు సమీకరించబడే రోజు. ఆ రోజు గురించి వెంటనే భయకంపితులై ఆ రోజు రాకముందే దాని గురించి మనం విశ్వాసం, పుణ్యాలతో, సత్కార్యాలతో సిద్ధంగా ఉండేటటువంటి ప్రయత్నం మనలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చేయాలి.
ఈ రోజుల్లో మనకు ఎన్నో అనుభవాలు కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రదేశాల్లో వెళ్తాము లేదా ఏదైనా సంఘటన సంభవిస్తుంది. చాలా బాధకు గురి అవుతాము. అప్పుడు మనం ఒకవేళ ముందు నుండే జాగ్రత్తపడి ఉండేది ఉంటే ఈనాటి రోజు చూసే రోజు కాకపోవచ్చు. ఎలాగైతే రిజల్ట్ వచ్చే సందర్భంలో ఏ స్టూడెంట్ అయితే చదువు కాలంలో సమయాన్ని వృధా చేసి తల్లిదండ్రులు, అటువైపున సార్లు, టీచర్ లు, మరోవైపున శిక్షణ ఇచ్చే వారు ఎన్నో రకాలుగా బోధ చేసినప్పటికీ పెడచెవిన పెట్టి వారి యొక్క బోధనలను ఏ మాత్రం విలువ నివ్వకుండా, సమయాన్ని వృధా చేశాడో రిజల్ట్ వచ్చే రోజు ఎలా పశ్చాత్తాప పడతాడు. ఈ ఉదాహరణలు, ఈ అనుభవాలు మనకు ఎందుకు ఇక్కడ కలుగుతున్నాయి? ఆ పరలోక దినం, అక్కడ పశ్చాత్తాపపడే ఆ రోజు గతాన్ని గుర్తు చేసుకొని బాధపడే ఆ రోజు మనం కూడా అలాంటి దురదృష్టవంతుల్లో కలవకూడదని.
అందుకు మహాశయులారా! ఆ పునరుత్థాన దినం మనమందరము సమాధుల నుండి లేపబడి ఏదైతే అల్లాహ్ ఎదురునకు సమీకరింప బడతామో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఖురాన్ లో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. దానిని ఈరోజు మనం అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తాము. ఆ రోజును అల్లాహ్ (తఆలా) ఎంతో గొప్ప రోజుగా, గొప్ప దినంగా, ఎంతో గాంభీర్యమైన ఒక దినంగా పేర్కొన్నాడు. ఆ గొప్ప దినాన, ఏ దినాన అయితే ప్రజలందరూ సర్వ లోకాల ప్రభువు ఎదుట నిలబడడానికి వెళ్తారు. మరియు ఆ రోజు అవిశ్వాసుల కొరకు సృష్టికర్త అయిన అల్లాహ్ ని విశ్వసించని వారి గురించి ఎంతో కఠినంగా, ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది.
సూరతుల్ ముద్దస్సిర్ ఆయత్ తొమ్మిది, పదిలో అల్లాహ్ (తఆలా) ఇలా తెలియపరిచాడు: “ఆ రోజు చాలా కష్టతరమైన రోజు. విశ్వాసాన్ని నమ్మని తిరస్కరించిన వారి గురించి అది ఏమాత్రం సులభతరంగా ఉండదు“.
అది ఎంత భయంకరమైన మరియు మన యొక్క ఆలోచనా విధానాన్ని కూడా మార్చి వేసే అంతటి భయంకరమైన రోజు అంటే ఏ తల్లి కూడా ఈ లోకంలో తన పసికందును, పాలు త్రాగే పిల్లని మర్చిపోదు. కానీ ఆ రోజున పరిస్థితి ఏమవుతుంది? సూరతుల్ హజ్ లోని తొలి ఆయత్ లోనే అల్లాహ్ (తఆలా) ఈ విషయాన్ని ఇలా స్పష్టపరిచాడు – “ఓ ప్రజలారా! మీ ప్రభువు తో మీరు భయపడండి. నిశ్చయంగా ఆ ప్రళయ దినం అనేది చాలా భయంకరమైన, చాలా గొప్ప దినం“. ఆనాటి విషయమే చాలా గొప్ప విషయం, భయంకరమైన విషయం. ఆరోజు భూమి కంపించి పోతుంది. అందులో ప్రకంపనలు ఏర్పడతాయి. దాని మూలంగా ఒక ఆందోళన ఏర్పడుతుంది. “ప్రళయ దినాన ఏ ప్రకంపనలు అయితే జరుగుతాయో చాలా గొప్ప విషయం అది. ఆ రోజు ప్రతి పాలిచ్చు తల్లి పాలు త్రాగే తన పసికందును మర్చిపోతుంది. మరియు ప్రతి గర్భిణి స్త్రీ ఆమె యొక్క గర్భం పడిపోతుంది“. గమనించారా! “మరియు ప్రజలు మత్తులో ఉన్నట్లుగా కనబడతారు. ఏదో మత్తు సేవించడం వల్ల ఎలాగైతే సొమ్మసిల్లి పోతారో అందువల్ల కాదు. కానీ ఆరోజు అల్లాహ్ యొక్క శిక్ష చాలా కఠినంగా ఉంటుంది“. అందుగురించి అలాంటి భయంకరమైన ఆ ప్రళయదినం రాకముందే విశ్వాస మార్గాన్ని అవలంబిస్తే ఆరోజు విశ్వాసులకు కొరకు ఎంతో సులభతరంగా గడిచిపోతుంది.
ఆనాటి గాంభీర్యం, ఆనాటి యొక్క ఆ భయంకరం ఎంత గొప్పగా ఉంటుంది అంటే మనిషి పరిస్థితి ఏమవుతుందో సూరయే ఇబ్రాహీం లో అల్లాహ్ (తఆలా) ఈ విధంగా తెలియజేసాడు. మరియు ప్రత్యేకంగా ఎవరైతే ఇహలోకంలో సన్మార్గాన్ని విడనాడి దుర్మామార్గంలో పడి ఉన్నారో, ఏకత్వ మార్గాన్ని వదిలి బహుదైవత్వంలో పడి ఉన్నారో, మరియు ఎవరైతే శాంతి మార్గాన్ని విడనాడి అశాంతి జీవితం గడుపుతున్నారో గమనించండి ఈ ఆయత్ ను: దుర్మార్గులు, దౌర్జన్య పరులు, షిర్క్ చేసేవారు, పాపాల్లో మునిగి తేలాడుతున్న వారు, వారి యొక్క పాపాల్ని వారి యొక్క షిర్క్ పనులను, వారి యొక్క దుర్మార్గాన్ని అల్లాహ్ చూడటం లేదు, అల్లాహ్ కు తెలియదు అన్నటువంటి భ్రమలో మీరు పడి ఉండకండి. అల్లాహ్ (తఆలా) వారికి కొంత వ్యవధిని ఇస్తున్నాడు. ఈ వ్యవధి ఎప్పటివరకు కొందరికైతే ప్రపంచంలోనే గుణపాఠం దొరుకుతుంది. కానీ ఎంతోమంది ఆనాటి వరకు ఏనాడైతే వారి యొక్క చూపులు చాలా క్రిందికి అయిపోతాయి. పరిగెడుతూ ఉంటారు. సమాధుల నుండి లేచిన తర్వాత పరిగెత్తుతారు. వారి తలలు కూడా క్రిందికి వంగి ఉంటాయి. కనురెప్పలు ఎత్తి కూడా చూడడానికి అవకాశం అనేది ఉండదు. అంత భయకంపితులై ఉంటారు. ఆనాటి పరిస్థితిలో అవిశ్వాసంగా ఇక్కడికి చేరుకున్నాము కదా!అని సిగ్గుతో, పశ్చాత్తాపంతో తలఎత్తడం, కళ్ళు ఎత్తి చూడడం అది కూడా వారికి సిగ్గుగా అనిపిస్తుంది మరియు ఆనాటి యొక్క భయంకరం, గాంభీర్యంతో వారి యొక్క హృదయాలు బయటికి వస్తాయా అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. మరి కొందరు పాపాత్ములు వారి పరిస్థితి ఇంతకంటే మరీ ఘోరంగా వారి యొక్క హృదయాలు బయటికి వచ్చి పడతాయా? అన్నటువంటి పరిస్థితి ఉంటుంది.
మహాశయులారా!, మరి కొందరి పరిస్థితి ఆనాడు ఎలా ఉంటుందో సూరయే గాఫిర్ ఆయత్ నెంబర్ పద్దెనిమిదిలో అల్లాహ్ (తఆలా) ఇలా తెలియజేసాడు: “అతి సమీపంలో రానున్న ఆ భయంకరమైన రోజు గురించి వారిని హెచ్చరించండి. వారి యొక్క హృదయాలు గొంతు వరకు వస్తున్నాయి. దానిని వారు ఇటు మింగ లేక పోతున్నారు అంటు బయటికి రాలేక పోతుంది”. అంత గాంభీర్యం అయిన పరిస్థితి ఉంటుంది. అంతెందుకండీ చిన్న పిల్లలు, వారు అయితే ఇంకా ఏ పాపం చెయ్యలేదు. వారు చేసేటటువంటి పని వారి గురించి రాయబడదు. అయినా గాని ఆ ప్రళయం సంభవించే రోజు ఎంతటి భయంకరమైన రోజు అంటే ఆ పిల్లల యొక్క వెంట్రుకలు కూడా తెల్ల పడిపోతాయి.
సూరయే ముజ్జమ్మిల్ లో అల్లాహ్ (తఆలా) తెలియపరిచాడు: “మీరు ఒకవేళ ఆ ప్రళయ దినాన్ని నిరాకరిస్తే, తిరస్కరిస్తే మరి ఆ శిక్ష నుండి మీరు ఎలా బయటపడతారు, ఎలా రక్షింపబడతారు. ఆ ప్రళయ దినం నాటి యొక్క భయంకరత్వం ఎలా ఉంది? పిల్లలు సైతం ముసలివారు గా ఏర్పడతారు”. అంతటి గాంభీర్యం.
ఆ రోజు మనిషి యొక్క పరిస్థితి ఎంతవరకు చేరుకుంటుంది అంటే తనను తాను తప్ప మరి ఎవరి గురించి కూడా ఆలోచించలేడు. చివరికి మనిషి అతని యొక్క భార్యను గాని లేదా భార్య తన యొక్క భర్తను గాని, తల్లి కొడుకును గాని, కొడుకు తల్లిని గాని, కూతురు తండ్రిని గాని, తండ్రి కూతురును గాని, సోదరులు పరస్పరం, సోదరీమణులు పరస్పరం ఎవరు కూడా ఎవరైతే ఇహలోకంలో క్లోజ్ ఫ్రెండ్ అని, సుఖదుఃఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉండేవాళ్ళు, ప్రాణానికి ప్రాణం ఇచ్చేటటువంటి మాటలు చెప్పుకునేవారు సైతం ఆ ప్రళయదినాన తమను తప్ప మరెవరి గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి ఉండదు. ఒకసారి ఖురాన్ లో ఈయొక్క విషయాన్ని ఎలా స్పష్టంగా తెలుపడం జరిగిందో గమనించండి. సూరత్ అబస ఆయత్ నెంబర్ ముప్పై మూడు నుండి ముప్పై ఏడు వరకు: “ఆ ప్రళయదినం సంభవించినప్పుడు మనిషి తన సోదరునితో పారిపోతాడు. తన తల్లిదండ్రులతో కూడా పారిపోతాడు. తన భార్య, స్త్రీ అయితే తన భర్త మరియు సంతానం నుండి పారిపోతారు. ఆ రోజు ప్రతి ఒక్కరికీ స్వయం తన గురించి ఎంత బాధ, ఎంత పశ్చాత్తాపం, ఎంత రంది ఉంటుందో ఇతరుల గురించి ఆలోచించే ఆ పరిస్థితిని రానివ్వదు.”
ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. సహీ బుఖారీ లో హదీత్ ఉంది. ప్రళయ దినాన శంకు ఊదబడిన తరువాత అందరూ సమాధుల నుండి లేచి వచ్చినప్పుడు వారి శరీరంపై దుస్తులు ఉండవు, కాళ్ళకు చెప్పులు ఉండవు మరియు పురుషులు ఒడుగులు చేయబడిన స్థితిలో ఖత్న, సున్నతీ లేకుండా లేప బడతారు. అందరూ ఈవిధంగా నగ్నంగా వస్తారు అన్న విషయం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలుపుతూ ఉన్నప్పుడు హజ్రత్ ఆయిషా సిద్దీక (రదియల్లాహు అన్హా) గారు అడిగారు: “ప్రవక్తా! మరి ఆ సందర్భంలో పురుషులు, స్త్రీల యొక్క దృష్టి ఒకరిపై ఒకరికి పడదా?” అంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: “ఆయేషా! ఆనాటి పరిస్థితి అంతకంటే మరీ ఘోరంగా ఉంటుంది. ఎవరికీ ఎవరి గురించి ఏ ఆలోచన ఉండదు. ఇలా దృష్టి ఒకరిపై వేసి చూడాలి అన్నటువంటి ఆ ఆలోచన రానే రాదు”.
ఆ రోజు అవిశ్వాసులు, సత్య తిరస్కారాలు పాపాల్లో కూరుకుపోయి తమ జీవితం సత్కార్యాలు నుండి దూరం ఉంచినవారు నరక శిక్ష గురించి, ప్రళయం యొక్క ఆ గాంభీర్యం గురించి అవన్నీ వారికి ఆ రోజున ఎప్పుడైతే సత్యాలు తెలుస్తాయో వారికి కోరిక ఏముంటుంది? భూమి నిండా బంగారం కానీ, ఇంకా ఏదైనా వారికి లభిస్తే వారు దానిని ఒక పరిహారంగా అల్లాహ్ ఎదుట ఇచ్చి, ఆనాటి గాంభీర్యం, ఆనాటి యొక్క భయంకరత్వం దాని నుండి రక్షించుకోవాలని, తప్పించుకోవాలని ఆలోచిస్తారు. సూరయే యూనుస్ ఆయత్ నెంబర్ యాబై నాలుగులో అల్లాహ్ (తఆలా) తెలిపాడు: ఇహలోకంలో షిర్క్ చేస్తూ, పాపాలు చేస్తూ అల్లాహ్ అవిధేయత లో జీవితం గడిపిన ప్రతి మనిషి భూమి నిండా ధనం అతనికి లభిస్తే అదంతా కూడా ఆనాటి గాంభీర్యం మరియు శిక్ష నుండి తప్పించుకోవటానికి ఒక పరిహారంగా ఇచ్ఛేద్దామా అని ఆలోచిస్తాడు. సూరయే రఆద్ ఆయత్ నెంబర్ పద్దెనిమిదిలో అల్లాహ్ మరి కొందరి గురించి ఏమని తెలిపాడంటే – వారి వద్ద ఈ భూమి కాదు ఈ భూమి యొక్క రెండింతలు ఉన్నాకానీ, ఈ భూమి యొక్క రెండింతలు ఉన్నా కానీ దానిని పరిహారంగా చెల్లించి ఆనాటి శిక్షల నుండి, ఆనాటి ఆందోళనకరల నుండి తప్పించుకుందాం అన్నటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇది ఏమాత్రం సాధ్యపడదు. ఆ రోజు ఏ డబ్బు, ఏ ధనము, ఏ బంగారం, ఏ వెండీ, ఏ డైమండ్స్ ఏదీ కూడా చెల్లదు. ఆ రోజు విశ్వాసం మరియు సత్కార్యాల ఆధారంగా తీర్పు జరుగుతుంది. ఎవరు విశ్వాసాన్ని అవలంభించి సత్కార్యాలు చేసి ఉన్నారో వారి కొరకే సుఖాలు, ఐశ్వర్యాలు, అన్ని రకాల లాభాలు, భోగభాగ్యాలు ఉంటాయి. అల్లాహ్ ఎవరి నుండి ధనము, డబ్బు స్వీకరించడు వారిని ఆ శిక్ష నుండి తప్పించడానికి, ఆ శిక్ష నుండి రక్షించడానికి. గమనించండి, సూరయే ఆలె ఇమ్రాన్ ఆయత్ నెంబర్ తొంబై ఒకటిలో అల్లాహ్ (తఆలా) ఇలా తెలియపరిచాడు – “ఎవరైతే సత్యాన్ని తిరస్కరించారో, అవిశ్వాసానికి ఒడిగట్టారో, వారు అ విశ్వాసులుగా ఉన్నప్పుడే వారికి చావు వచ్చిందో భూమి నిండా బంగారం కూడా వారు ప్రాయశ్చితంగా ఇవ్వాలి అని అనుకుంటే అది స్వీకరించబడదు. వారికి ఆ రోజు కఠినమైన శిక్ష ఉంటుంది, బాధాకరమైన శిక్ష ఉంటుంది. ఎవరు కూడా వారికీ ఎలాంటి సహాయం చేసేవారు ఉండరు.” ఇలాంటి ఆయతులతో, ఇలాంటి బోధనలతో గుణపాఠం నేర్చుకొని మనలో వెంటనే మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ ఈ సత్భాగ్యం నాకు మీకు అందరికి ప్రసాదించు గాకా!
సహీ బుఖారీ లో హదీత్ ఉంది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు – సత్య తిరస్కారిని, అవిశ్వాసిని ప్రళయ దినాన తీసుకురావడం జరుగుతుంది. అతనితో ఇలా ప్రశ్నించడం జరుగుతుంది. ఏమీ! నీ వద్ద ఈభూమి నిండా బంగారం ఉంటే నీవు దానిని పరిహారంగా చెల్లించి ఈ శిక్షల నుండి తప్పించుకుందామని అనుకుంటివా? అతను అంటాడు, అవును. అప్పుడు అతనికి సమాధానం చెప్పడం జరుగుతుంది. నేనైతే ఇహలోకంలో నీవు ఉన్నప్పుడు దీనికంటే ఎంతో తేలికమైన విషయం నీతో నేను కోరాను. విశ్వాసాన్ని అవలంభించు, సత్కార్యాలు చేస్తూపో. ఇదే నీతో నేను కోరబడినది ఇహలోకంలో, కానీ అది మాత్రం చేయలేదు. ఇప్పుడు నీ వద్ద భూమి నిండా బంగారం ఉంటే దాన్ని పరిహారంగా చెల్లించాలి అనుకుంటున్నావు. ఇది ఎక్కడ సాధ్యపడుతుంది?
ఇంకా ఆ ప్రళయదిన గాంభీర్య విషయాలు మరిన్ని తెలుసుకునేటివి చాలా ఉన్నాయి. తరువాయి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్.అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
మహాశయులారా! లెక్క తీసుకునే విధానాలు ప్రళయ దినాన ప్రతి ఒక్కరితో వేరు వేరుగా ఉండవచ్చు. అల్లాహ్ (తఆలా) కొందరిని తన దగ్గరికి పిలుచుకొని తాను చేసిన ఒక్కొక్క పాపాన్ని, ఒక్కొక్క సత్కార్యాన్ని గుర్తు చేసి, పాపాలు ఏదైతే అతని నుండి జరిగినవో అతని ద్వారా ఒప్పిస్తాడు. ప్రజల్లో కొందరు ఒప్పుకుంటారు. మరి కొందరు స్వయంగా వారు చేసిన పాపాల్ని అబద్దం చెప్పి మేము చేయలేదు అని అంటారు. అలాంటి వారికి అల్లాహ్ (తఆలా) వారి ముందు కొన్ని, కొందరు సాక్షులను తీసుకొస్తాడు. చివరికి స్వయంగా వారి శరీర భాగాలు కూడా మాట్లాడుతాయి మరియు వారికి వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతాయి.
ఈ విధంగా సోదరులారా సహీ బుఖారిలో ఒక హదీత్ వచ్చి ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: ప్రళయ దినాన అల్లాహ్ (తఆలా) ఒక వ్యక్తిని ప్రజలందరి మధ్యలో నుండి హాజరు పరుస్తాడు మరియు తనకు మరియు అతనికి మధ్యలో ఎలాంటి అనువాదం చేసే వాని అవసరం లేకుండా స్వయంగా అల్లాహ్ (తఆలా) అతనితో మాట్లాడుతాడు. అతడు చేసిన పాపాల్ని అతనికి గుర్తు చేస్తాడు. అతడు తన పాపాలు అన్నిటిని కూడా ఒప్పుకుంటాడు. అప్పుడు అల్లాహ్ (తఆలా) అతనితో అంటాడు: “ఇహలోకంలో నీవు ఈ పాపాలు చేసినప్పుడు నిన్ను అవమాన పరచకుండా నీతో జరిగిన ఈ పాపాల విషయంలో ఎవరికి తెలియకుండా నేను కప్పి ఉంచాను. ఈ రోజు కూడా ప్రజలందరి ముందు నిన్ను అవమాన పరచకుండా నేను నిన్ను క్షమిస్తున్నాను, మన్నించేస్తున్నాను” అని అల్లాహ్ (తఆలా) శుభవార్త తెలియపరుస్తాడు.
దీనికి భిన్నంగా ఖురాన్ లోని ఆయత్ మనం చదివామంటే ఒళ్ళు కంపించిపోతుంది. ఒక వ్యక్తి వస్తాడు. ఎన్నో పాపాలు చేసి ఉంటాడు. కానీ ఏ ఒక్క పాపాన్ని ఒప్పుకోడు. “నీవు చేసిన పాపాలు ఒప్పించడానికి సాక్ష్యం పలికే వారిని తీసుకొస్తాను” అని అంటే “ఈ రోజు నేను నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే వారిని ఎవరినీ స్వీకరించను. నా శరీరం నాకు సాక్ష్యం పలుకుతే నేను స్వీకరిస్తాను”. అప్పుడు అల్లాహ్ (తఆలా) శరీరం యొక్క తోలు ఏదైతే ఉందో దానిని ఆదేశిస్తాడు. మనిషి యొక్క తోలు మాట్లాడుతూ ఉంటుంది. వారు తమ శరీర తోలును ఎప్పుడైతే మాట్లాడడం వ్యతిరేకంగా సాక్ష్యం పలకడం చూస్తారో, వారు తోలుతో అంటారు: “ఏమైంది? నాకు వ్యతిరేకంగా మీరు ఎందుకు సాక్ష్యం పలుకుతున్నారు?” “ప్రతి మాట్లాడే వారికి మాట్లాడే శక్తి అల్లాహ్ ఎలా ప్రసాదించాడో ఈరోజు మాకు మాట్లాడే శక్తి అల్లాహ్ అలాగే ప్రసాదించాడు” అని ఆ తోళ్ళు పలుకుతాయి.
సూరయే యాసీన్ లోని ఆయతులు చదవండి – “మేము ఆ రోజు ప్రళయ దినాన వారి యొక్క నోళ్ళపై ముద్ర వేసేస్తాం. అప్పుడు వారి యొక్క చేతులు మాట్లాడుతూ ఉంటాయి. వారి యొక్క కాళ్లు సాక్ష్యం పలుకుతాయి. వారు చేసిన వాటన్నిటి గురించి చెపుతూ ఉంటాయి”. మహాశయులారా! అల్లాహ్ ఒకవేళ తన దాసులపై అన్యాయం చేసి నరకంలో పంపినా గానీ, అతన్ని ఎవరూ అడిగేవారు లేరు. అంతటి శక్తిశాలి. అయినా అది అతని యొక్క అన్యాయం అనబడదు కూడా. ఎందుకంటే మనందరం అతని ఆధీనంలో ఉన్నాము. అతని యొక్క దాసులము. కానీ, “నీ ప్రభువు తన దాసులపై ఏ రవ్వంత అన్యాయం చేసేవాడు కాదు“. ఆనాడు లెక్క తీసుకోబడటం ఏదైతే జరుగుతుందో అందులో అల్లాహ్ ఏ ఒక్కరిపై కూడా రవ్వంత అన్యాయం, దౌర్జన్యం చేయనే చేయడు. అల్లాహ్ ఎలా దౌర్జన్యం చేయగలుగుతాడు? అస్తగ్ఫిరుల్లాహ్! అల్లాహ్ ఎలా అన్యాయం చేయగలుగుతాడు? ఆయనే స్వయంగా చెబుతున్నాడు, ముస్లిం షరీఫ్ లోని హదీత్ ఖుద్సీ, “అన్యాయాన్ని దౌర్జన్యాన్ని నేను నాపై నిషేధించాను మరియు మీ మధ్యలో కూడా దానిని నిషేధించి ఉన్నాను. మీరు కూడా పరస్పరం దౌర్జన్యం చేసుకోకండి, అన్యాయాలు చేసుకోకండి“.
లెక్క తీసుకునే విషయంలో అల్లాహ్ వద్ద ఉన్నటువంటి మరొక నియమం ఏమిటంటే ఆయన ఒకరి పాపాల గురించి మరొకరిని పట్టుకోడు. ఒకరి పాపాల భారం మరొకరిపై వేయడు. ఒకరు చేసిన పాపానికి మరొకరిని శిక్షించడు.
అంతేకాకుండా లెక్క తీసుకునే విషయంలో మరొక నియమం అల్లాహ్ ఏదైతే పాటిస్తాడో – దాసులు వారు చేసిన కర్మలన్నీ వారికి స్వయంగా చూపిస్తాడు. “ఎవరైతే అణువంత పుణ్యం చేసుకున్నారో వారు కూడా దానిని చూసుకుంటారు. మరి ఎవరైతే అణువంత పాపం చేశారో వారు కూడా దానిని చూసుకుంటారు“. సూరయే ఆలె ఇమ్రాన్ లో అల్లాహ్ (తఆలా) తెలిపాడు: “ఆనాడు ప్రతీ ప్రాణి, ప్రతీ ఒక్కరు తాను చేసుకున్న మంచిగానీ, చెడ్డ గానీ, సత్కార్యం గానీ, దుష్కార్యం కానీ దానిని వారు చూస్తారు. దానిని వారు పొందుతారు. ప్రతీ కార్యం వారికి తెలియజేయడం జరుగుతుంది.”
లెక్క తీసుకునే విషయంలో అల్లాహ్ వద్ద ఉన్నటువంటి మరొక నియమం ఏమిటంటే – అల్లాహ్ (తఆలా) సత్కార్యాల సత్ఫలితం ఎన్నో రెట్లుగాపెంచి ఇస్తాడు. కానీ అదే దుష్కార్యాలు వాటి యొక్క శిక్ష ఏ రవ్వంత పెంచి ఇవ్వడు. దీని గురించి ఎన్నో హదీతులు వచ్చి ఉన్నాయి. ఒక సహీ హదీత్ లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఎప్పుడైతే ఒక మనిషి ఒక సత్కార్యం చేయాలని మనసులో అనుకుంటాడో అల్లాహ్ అతనికి ఒక పుణ్యం రాస్తాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ సత్కార్యాన్ని ఆచరణ రూపంలో చేస్తాడో అల్లాహ్ అతనికి ఆ సత్కార్యానికి బదులుగా పది రెట్లు నుండి ఏడు వందల రెట్ల వరకు పుణ్యాలు రాస్తాడు. దాసుడు ఒకవేళ దుష్కార్యం గురించి మనసులో అనుకుంటే అల్లాహ్ అతనికి ఒక పాపం రాయడు. ఒకవేళ అతను ఆ దుష్కార్యం చేస్తే ఒక్క పాపం మాత్రమే రాస్తాడు. అదే ఒకవేళ అతను ఆ దుష్కార్యం ఆలోచనను వదులుకుంటే అతనికి ఒక పుణ్యం రాస్తాడు“. ఈ హదీత్ కు సాక్షాధారం చదవాలనుకుంటే ఖురాన్ లోని ఈ ఆయత్ కూడా చదవవచ్చు. “ఎవరైతే ఒక సత్కార్యం చేస్తారో వారికి దాని పది రెట్ల కు ఎక్కువగా వారికి పుణ్యం లభిస్తుంది“
అలాగే లెక్క తీసుకోవడంలో ఒక నియమం ఏమిటంటే – అల్లాహ్ (తఆలా) ఒకరు చేసిన పాపానికి బదులుగా మరొకరిని శిక్షించడు. ఒకరు చేసిన పాపానికి బదులుగా మరొకరిని పట్టుకోవడం జరగదు. ఖురాన్ లోని ఈ ఆయత్ చదవండి – “ఒకరి పాపాల భారం మరో ఒకరిపై వేయడం జరగదు“. మరోచోట అల్లాహ్ (తఆలా) తెలిపాడు – “ప్రతి మనిషి తాను ఏమి సంపాదించాడో దాని ప్రకారమే అతనికి ప్రతిఫలం లభిస్తుంది“. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఒకరు చేసిన పాపానికి బదులుగా మరొకరు శిక్ష పొందడం ఇలా జరగదు కానీ ఎవరైనా ఇతరులకు చెడు చేయాలని చెప్పి, చెడు వైపునకు ప్రేరేపిస్తే వారు చెడు చేసినందుకు ఇతని కారణంగా అతను ఆ చెడు చేశాడు కనుక అతను చేసిన చెడులోని పాప భారం అతనిపై ఏమాత్రం తగ్గకుండా, ఇతను చెడు వైపునకు పురికొల్పినందుకు ఇతను కూడా ఆ పాప భారాన్ని మోస్తాడు. అతని యొక్క పాప భారంలో ఏ మాత్రం తగ్గింపు జరగదు. లెక్క జరిగే విషయాల కొన్ని వివరాలు మనం తెలుసుకుంటున్నాము. అలాగే సోదరులారా, చెడు వైపునకు ప్రేరేపిస్తే, ప్రేరేపించిన వారికి ఆ చెడు యొక్క పాపం కలుగును. దాని యొక్క శిక్ష అతను పొందాలి. అలాగే ఎవరైనా మంచి కార్యం వైపునకు, పుణ్యకార్యం వైపునకు ఇతరులను ఆహ్వానిస్తే, ఆ ఆహ్వానం మేరకు ఎవరెవరు ఆ పుణ్యం వైపునకు వస్తారో, దానిని ఆచరిస్తారో వారికి వారి ప్రకారంగా సత్ఫలితం లభిస్తుంది. కానీ పుణ్యం వైపునకు ఆహ్వానించే వారికి కూడా ఆ పుణ్యం చేసినంత సత్ఫలితం వారికి లభిస్తుంది.
లెక్క తీసుకునే విషయంలో మరొక నియమం ఏమిటంటే – అల్లాహ్ (తఆలా) అవిశ్వాసులకు, కపటవిశ్వాసులకు, వంచకులకు, మరెందరో పాపాలు చేసేటటువంటి దుర్మార్గులకు వారు తిరస్కరించినందుకు, వారికి వ్యతిరేకంగా ఎన్నో రకాల సాక్షులను వారి ముందు నిలబెట్టడం జరుగుతుంది. వాటి యొక్క వివరాలు తర్వాత ఎపిసోడ్ లలో ఇన్షాఅల్లాహ్ మనం విననున్నాము.
అయితే లెక్క విషయంలో మరొక విషయం మనం తెలుసుకోవలసినది ఏమిటంటే – ఆదమ్ (అలైహిస్సలాం) నుండి మొదులుకొని చిట్టచివరి ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వరకు ఎందరు ప్రవక్తలు వచ్చారో, వారందరి ప్రవక్తల జాతుల్లో అందరికంటే మొట్టమొదటి సారిగా లెక్క తీసుకోవడం జరిగేది మన ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క అనుచర సంఘం. దీనికి సంబంధించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు – “మనం ఇతర జాతులను చూస్తే వారికంటే చివరిలో వచ్చిన వారిమి. కానీ ప్రళయ దినాన అందరికంటే ముందు మనం ఉంటాము. సర్వ ప్రజల్లో అందరికంటే ముందు లెక్క, తీర్పు జరిగేది మన అనుచర సంఘం యొక్క లెక్క తీర్పు.” ఇది కూడా మన ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై మరియు మనపై అల్లాహ్ యొక్క గొప్ప కరుణ. దీనిని మనం గ్రహించాలి.
ఈ హదీత్ సహీ బుఖారి మరియు సహీ ముస్లిం లో ఉంది మరియు ముస్నద్ అహ్మద్ ఇంకా ఇబ్నెమాజా లో ఉంది – ఇబ్నె అబ్బాస్ (రది యల్లాహు తఆలా అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపినట్లుగా చెప్పారు – “ఇతర అనుచర సంఘాల్లో మనం అందరికంటే చివరి వారిమి. కానీ లెక్క జరిగే ప్రకారంగా మొట్టమొదటి వాళ్ళం. మన నుండే లెక్క మొదలవుతుంది. మన లెక్క అయిన తర్వాతనే ఇతర జాతుల లెక్క జరుగుతుంది.”
మరి సోదరులారా!, సోదరీమణులారా!, లెక్క జరిగే ఆ ప్రళయదినాన మొట్టమొదటి లెక్క దేని గురించి జరుగునో ఎప్పుడైనా మనం గమనించామా? హదీతుల్లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ విషయం కూడా చాలా స్పష్టంగా మనకి తెలియజేసారు. ఎందుకూ? అలాంటి సత్కార్యాలు చేయడంలో మనం వెనుక ఉండకూడదు అని. ప్రళయ దినాన లెక్క తీసుకోబడే రోజు మనం అక్కడ మోక్షం పొందాలి, ఆ లెక్కలో పాస్ అవ్వాలి అని. ఇబ్నెమాజా లోని సహీ హదీత్ – “ప్రళయ దినాన ఆరాధనల్లో అందరికంటే ముందు నమాజ్ యొక్క లెక్క తీసుకోబడును. నమాజ్ సరిగ్గా ఉంటే అందులో అతడు పాస్ అయ్యాడు అంటే ఇతర వేరే కర్మలు కూడా సరి అయినట్లు. అతను నమాజ్ లో ఫెయిల్ అయ్యాడు అంటే ఇతర విషయాల్లో కూడా ఫెయిల్ అయినట్లే“, అందుగురించి మహాశయులారా!, ఇకనైనా నమాజ్ విషయంలో మనం శ్రద్ధ వహించాలి. ప్రత్యేకంగా పురుషులు సామూహికంగా మస్జిద్ లో నమాజ్ చేయాలి. ప్రత్యేకంగా ఫజర్ నమాజ్ లో ఏ బద్ధకం వహిస్తున్నామో, రాత్రి పడుకోవడంలో ఆలస్యం చేసి ఫజర్ నమాజ్ ను వదిలేస్తున్నామో, మనం డ్యూటీ వెళ్ళే సమయంలో చదవడం లేదా జోహార్ తో పాటు కలిపి చదవడం లాంటి ఏ తప్పులు అయితే చేస్తున్నామో వాటిని వదులుకోవాలి. తొలిసారిగా లెక్క జరిగేది నమాజ్ గురించి. ఈ నమాజ్ లో పాస్ కాకుంటే మనం చాలా నష్టపోతాము, ఫెయిల్ అయిన వాళ్ళల్లో లెక్కించబడుతుంది. అందుగురించి నమాజ్ పట్ల శ్రద్ధ వహించండి.
ఇంకా మహాశయులారా!, తీర్పుల్లో మొట్టమొదటి తీర్పు, సహీ బుఖారీ, సహీ ముస్లిం లోని హదీత్, “ప్రళయ దినాన ప్రజలందరి మధ్యలో మొట్టమొదటి తీర్పు రక్తాల గురించి జరుగును. ఎవరు ఎవరిని అన్యాయంగా హత్య చేశారో, ఎవరు ఎవరిని హత్య చేయడానికి ప్లాన్ లు వేసాడో, ఎవరు ఎవరిని హత్య చేయడానికి సహాయ పడ్డాడో” ఈ విధంగా ఇస్లాంలో ఆరాధనల్లో మొట్ట మొదటి విషయం నమాజ్ అయితే సామాజిక వ్యవహారాల్లో, సామాజిక విషయాల్లో రక్తానికి చాలా గొప్ప విలువ ఉన్నది. మహాశయులారా!, ఇకనైనా గమనించండి. ఇస్లాం పై బురద చల్లకండి. ఇస్లాం పై అజ్ఞానంతో వేరే రకంగా దాన్ని చిత్రీకరించకండి. ప్రాణాలకు ఎంత విలువనిస్తుంది. అన్యాయంగా, అకారణంగా, దౌర్జన్యంగా ఎవరైతే ఎవరిని హత మారుస్తారో వారికి స్వర్గం కూడా లభించదు. స్వర్గం యొక్క సువాసన నలభై సంవత్సరాల ప్రయాణం గల దూరం నుండి ఆఘ్రానించ బడుతుంది. కానీ అలాంటి వారికి ఆ సువాసన కూడా లభించదు అని ఇస్లాం స్పష్టపరిచింది. అయితే ప్రళయదినాన ఈ రక్తాలు గురించి మొట్టమొదటి తీర్పు జరుగును. అందుగురించే ఇస్లాం “ఎవరైనా అన్యాయంగా ఒక ప్రాణిని చంపారంటే మానవత్వం మొత్తాన్ని మట్టిలో కలిపినట్లు” అని వారి గురించి హెచ్చరించింది.
ఈ విధంగా లెక్క జరిగే ఆ రోజున దానికి సంబంధించిన వివరాలు మనం అల్లాహ్ యొక్క దయ వల్ల ఈనాటి కార్యక్రమంలో విన్నాము, తెలుసుకున్నాము. అయితే ఆ లెక్క జరిగే రోజు రాకముందే మనం ఇక్కడే దాని గురించి సిద్దపడాలి. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వారు చెప్పిన ఈ మాటలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి: “ప్రళయ దినాన అక్కడ మీ లెక్క జరిగే కి ముందు మీరు ఇక్కడే మీలెక్క తీసుకుంటూ ఉండండి. మీకు అక్కడ సులభతరం కలుగుతుంది“.
అల్లాహ్ మనందరికీ ప్రతిరోజు మనం చేస్తున్న ప్రతికార్యం గురించి లెక్క తీసుకుంటూ ఆ లెక్క రోజు గురించి సిద్ధపడేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.