సమాధులపై మస్జిద్ నిర్మించరాదు

308. హజ్రత్ అయిషా (రధి అల్లాహు అన్హ), హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) ల కధనం:-

ధైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు మరణసమయం ఆసన్నమయినపుడు ఆయన పరిస్థితి చాలా  దుర్భరంగా మారిపోయింది. ఒక్కోసారి ఆయన తన దుప్పటిని ముఖం మీదికి లాగుకునేవారు. కాస్సేపటికి ఊపిరి ఆడకపోవడంతో ముఖం మీది దుప్పటిని తొలగించి వేసేవారు. అలాంటి స్థితిలో సయితం ఆయన (సమాధి పూజలను శపిస్తూ) “యూదులు, క్రైస్తవులు తమ ప్రవక్తల సమాధుల్ని ప్రార్ధనా స్థలాలుగా చేసుకున్నారు. దేవుడు వారిని శపించుగాక!” అని అన్నారు. ఈ విధంగా ప్రవచించి ఆయన ముస్లింలను ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని పరోక్షంగా హెచ్చరించారు.

[సహీహ్ బుఖారీ : 8 వ ప్రకరణం – సలాత్, 55 వ అధ్యాయం – హద్దసనా అబూయమాన్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 3 వ అధ్యాయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

%d bloggers like this: