మరణం మరియు సమాధి శిక్షల వివరాలు, సందేహ సమాధానాలు [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణం మరియు సమాధి శిక్షల వివరాలు, సందేహ సమాధానాలు
https://www.youtube.com/watch?v=_HrW7uu-pc4 [14 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం మరణం మరియు సమాధి జీవితం (బర్ జఖ్) గురించిన వివిధ ప్రశ్నలకు సమాధానమిస్తుంది. మరణ దూత (మలకుల్ మౌత్) అందరికీ ఒకరేనని, వేర్వేరు మతాల వారికి వేర్వేరు దూతలు ఉండరని స్పష్టం చేస్తుంది. విశ్వాసులు మరియు అవిశ్వాసుల మరణ అనుభవాలలో తేడా ఉంటుందని సహీ హదీసుల ఆధారంగా వివరిస్తుంది. విశ్వాసి ఆత్మ శాంతియుతంగా తీయబడి, స్వర్గపు సువాసనలతో స్వీకరించబడి, ఆకాశాలలో గౌరవించబడుతుంది. దీనికి విరుద్ధంగా, అవిశ్వాసి ఆత్మ కఠినంగా తీయబడి, నరకపు దుర్వాసనలతో అవమానించబడుతుంది. సమాధిలో పెట్టడం అనేది సాధారణ పద్ధతి అయినప్పటికీ, దహనం చేయబడిన లేదా ఏ విధంగానైనా శరీరం నాశనమైనప్పటికీ, ఆత్మకు శిక్ష లేదా బహుమానం తప్పదని ఖురాన్ మరియు హదీసుల ద్వారా వివరిస్తుంది. ఈ మధ్య కాలాన్ని “బర్ జఖ్” అని అంటారు. చివరగా, సమాధిలో జరిగే ముగ్గురు దేవదూతల ప్రశ్నలు (నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? నీ ప్రవక్త ఎవరు?) మరియు వాటికి విశ్వాసులు, అవిశ్వాసులు ఇచ్చే సమాధానాలను చర్చిస్తుంది.

أَسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ
(అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బ’అద్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు. మరియు ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారి కుటుంబ సభ్యులు మరియు సహచరులందరిపై శాంతి మరియు శుభాలు కురియుగాక. ఇక ఆ తర్వాత.

చావు మరియు సమాధి శిక్షణ గురించి ఒక ప్రశ్న వచ్చింది. వాస్తవానికి ఆ ప్రశ్నలో ఎన్నో ఇంకా లింక్ ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానంగా ఈ ఆడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. శ్రద్ధగా వింటారని, విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.

మొదటి విషయం ఏమిటంటే, సామాన్యంగా చావు దూత అని, మలకుల్ మౌత్ అని, మౌత్ కా ఫరిష్తా అని, లేదా యమదూత అని ఏదైతే అంటారో, హిందువులకు వేరు, ముస్లింలకు వేరు, క్రైస్తవులకు వేరు, వేరే ఇంకా మతాలు అవలంబించే వారికి వేరు, అలాగా ఏమీ లేరు. ఇలాంటి భ్రమలో నుండి మనం బయటికి రావాలి. వాస్తవానికి, ప్రాణం తీసే దూత మరియు ఆయనకు తోడుగా వచ్చే అటువంటి దూతలు, ఆ తోడుగా వచ్చే దూతల యొక్క సంఖ్య అల్లాహ్ కు మాత్రమే తెలుసు. అయితే, ఇక్కడ మనకు ఖురాన్ హదీస్ ద్వారా తెలుస్తున్న విషయం ఏంటంటే, విశ్వాసులు, పుణ్యాత్ములు వీరికి వీరి యొక్క ప్రాణం ఒక రకంగా తీయడం జరుగుతుంది మరియు ఎవరైతే అవిశ్వాసులు లేదా విశ్వాసులుగా ఉండి కలిమా చదివి కూడా మహా పాపాత్ములు ఉంటారో వారి యొక్క ప్రాణం మరో రకంగా తీయడం జరుగుతుంది అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఖురాన్ యొక్క ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఏదైనా వేరే సందర్భంలో ఆ ఆయతులు, ఆ వాటి యొక్క అర్థం భావం అనేది ఇన్ షా అల్లాహ్ రికార్డ్ చేసి పంపుదాము. కానీ సంక్షిప్తంగా ప్రస్తుతం ఏంటంటే, సహీ హదీస్లో వచ్చిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు.

విశ్వాసుడు, పుణ్యాత్ముడు అతని ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు, ప్రాణం తీసే దూత, ఆయన కూడా దైవదూతనే, ప్రాణం తీసే దూత వస్తాడు మరియు స్వర్గం నుండి కరుణ దూతలు కూడా హాజరవుతారు. స్వర్గం నుండి వారు సువాసనతో కూడి ఉన్నటువంటి వస్త్రాలు తీసుకొని వస్తారు. ఆ తర్వాత అతని దగ్గర కూర్చుండి, ప్రభువు యొక్క కారుణ్యం వైపునకు, అల్లాహ్ యొక్క సంతృష్టి వైపునకు వచ్చేసెయ్ ఓ పవిత్ర ఆత్మా, ఈ రోజు నీపై నీ ప్రభువు ఏమీ కోపగించుకోకుండా నీ పట్ల సంతృప్తి కలిగి ఉన్నాడు అన్నటువంటి శుభవార్తలు వినిపిస్తూ ఉంటారు. దీని సంక్షిప్త విషయం ఖురాన్ సూరే హామీమ్ అస్సజ్దాలో కూడా వచ్చి ఉంది.

وَأَبْشِرُوا بِالْجَنَّةِ الَّتِي كُنتُمْ تُوعَدُونَ
(వ అబ్షిరూ బిల్ జన్నతిల్లతీ కున్తుం తూ’అదూన్)
“మీకు వాగ్దానం చేయబడిన స్వర్గం ఇదేనని సంతోషించండి.” (41:30)

ఇక ప్రాణం తీసే దూత ఎంతో సునాయాసంగా, నిదానంగా మంచి విధంగా అతని యొక్క ప్రాణం తీస్తాడు. ఆ మనిషి యొక్క ఆత్మ కూడా మంచి విధంగా ఆ ప్రాణం తీసే దూత యొక్క చేతుల్లోకి వచ్చేస్తుంది. దానికి కూడా హదీసుల్లో కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ దైవదూతలు వెంటనే ఆ సువాసనలతో కూడి ఉన్నటువంటి స్వర్గపు వస్త్రాలలో ఆ ఆత్మను చుట్టుకొని ఆకాశం పైకి వెళ్తారు. మొదటి ఆకాశం ద్వారాలు మూయబడి ఉంటాయి. అయితే అక్కడ తీసుకుపోయే దూతలు పర్మిషన్ కోరుతారు. ఆకాశపు యొక్క ఆ దూతలు అడుగుతారు, ఈ మంచి ఆత్మ ఎవరిది మీరు తీసుకొని వస్తున్నారు? అయితే అతని యొక్క మంచి పేరు, మంచి గుణాలు ఈ దైవదూతలు తెలియజేస్తారు. ఆకాశపు ద్వారాలు తెరవబడతాయి. ఆ మొదటి ఆకాశపు దైవదూతలు ఘనంగా ఇతన్ని స్వాగతిస్తూ ఆ దూతలతో కలిసి ఇంకా పైకి వెళ్తారు. ఈ విధంగా రెండో ఆకాశం పైకి చేరుతారు. అలాగే అక్కడ కూడా స్వాగతం జరుగుతుంది, ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. చివరికి ప్రతి ఆకాశంలో కూడా అలాగే జరుగుతుంది. ఏడో ఆకాశం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అలాగే జరుగుతుంది. అప్పుడు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆదేశం వస్తుంది. నా యొక్క ఈ దాసుని యొక్క ఆ నామము عِلِّيِّينَ (ఇల్లియీన్) ఉన్నతమైన స్థానం లో రాయండి. మరో ఉల్లేఖన ప్రకారం, ఇతని యొక్క ఆత్మ అనేది ఏదైతే ఉందో, దీని ఇతడు స్వర్గపు యొక్క రుచులు, స్వర్గపు యొక్క మంచి అనుభవాలు పొందుతూ ఉంటాడు. కానీ, మళ్ళీ అతన్ని ప్రశ్నించడానికి తిరిగి ఆ మనిషిని ఏదైతే సమాధిలో ఖననం చేయడం జరుగుతుందో, ఆ అతని శరీరంలో పంపడం జరుగుతుంది. ఇది విశ్వాసుడు, పుణ్యాత్ముని యొక్క ఆత్మ ఏదైతే తీయడం జరుగుతుందో దాని యొక్క సంక్షిప్త విషయం.

ఇక మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కాఫిర్ (అవిశ్వాసుడు), ఫాసిఖ్ వ ఫాజిర్ (పాపాత్ములు) వారి యొక్క ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు ప్రాణం తీసే దూత వస్తాడు మరియు నరకం నుండి శిక్ష దూతలు దుర్వాసనతో కూడి ఉన్న చెడ్డ వస్త్రాలను తీసుకొని వస్తారు. ప్రాణం తీసే దూత ఓ చెడు ఆత్మా, వచ్చేసెయ్ అల్లాహ్ యొక్క కోపం, ఆగ్రహం వైపునకు అని అంటారు. అతని యొక్క ఆత్మ శరీరంలో తిరుగుతుంది. ఆ ప్రాణం తీసే దైవదూత చేతిలోకి రావడానికి రెడీగా ఉండదు. కానీ బలవంతంగా తీయడం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే ఆ దూతలు ఆ వస్త్రాల్లో చుట్టుకొని పైకి వెళ్తారు. కానీ ఆకాశపు ద్వారాలు తెరవబడవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ లోని ఈ ఆయత్ కూడా చదివారు:

لَا تُفَتَّحُ لَهُمْ أَبْوَابُ السَّمَاءِ
(లా తుఫత్తహు లహుమ్ అబ్వాబుస్ సమా’)
వారి కొరకు ఆకాశ ద్వారాలు తెరవబడవు. (7:40)

మళ్ళీ అక్కడి నుండే అతని యొక్క ఆత్మను క్రిందికి విసిరివేయడం జరుగుతుంది. మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరే హజ్ లోని ఆయత్ చదివారు:

وَمَن يُشْرِكْ بِاللَّهِ فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ فَتَخْطَفُهُ الطَّيْرُ أَوْ تَهْوِي بِهِ الرِّيحُ فِي مَكَانٍ سَحِيقٍ
(వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫక అన్నమా ఖర్ర మినస్ సమా’ఇ ఫతఖ్తఫుహుత్ తైరు అవ్ తహ్వీ బిహిర్ రీహు ఫీ మకానిన్ సహీఖ్)
అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించేవాడు ఆకాశం నుండి క్రింద పడిపోయిన వాని వంటివాడు. పక్షులు అతన్ని తన్నుకుపోతాయి, లేదా గాలి అతన్ని దూరప్రాంతానికి విసిరివేస్తుంది. (22:31)

అంటే అల్లాహ్ తో పాటు షిర్క్ చేసేవారు, ఇలా పాపాలలో తమ జీవితం పూర్తిగా గడిపేవారు, పాపాలలో విలీనమైన వారు, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వారి యొక్క ఉపమానం ఎలా తెలుపుతున్నాడంటే,

فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ
(ఫక అన్నమా ఖర్ర మినస్ సమా)
ఆకాశం నుండి పడిపోయిన వాని వలె.
ఆకాశం నుండి పడిపోయిన వారు, ఇక అతనిని పక్షులు తమ యొక్క చుంచులతో వేటాడుతాయి, లాక్కుంటాయి, లేదా గాలి అనేది అటు ఇటు ఎక్కడైనా విసిరి పారేస్తుంది. అక్కడి నుండి పారేయడం జరుగుతుంది. అయితే ఏడు భూముల కింద سِجِّين (సిజ్జీన్) ఖైదీల చిట్టా అనే ఏదైతే దఫ్తర్ (రిజిస్టర్), ప్రాంతం ఏదైతే ఉందో అందులో అతని నామం రాయడం జరుగుతుంది. ఇక అతన్ని, ఆ శరీరం, భౌతికాయాన్ని అతని బంధువులు ఖననం చేశారంటే, అక్కడ ప్రశ్నోత్తరాల గురించి అందులో పంపడం జరుగుతుంది.

ఇక ఆ తర్వాత, సమాధిలో ఏదైతే పెట్టడం జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుంది సంక్షిప్తంగా వినండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరంగా ఆ విషయాలు తెలిపారు. కానీ ఆ విషయాల యొక్క వివరణలో వెళ్ళేకి ముందు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోండి. అదేమిటంటే, సామాన్యంగా సమాధి యొక్క శిక్ష లేదా సమాధి యొక్క వరాలు అని ఏదైతే అనడం జరుగుతుందో, ఇక్కడ ఇలా ఎందుకు అనడం జరుగుతుంది అంటే, వాస్తవానికి మానవ చరిత్రలో మానవునికి ఇవ్వబడిన ఆదేశ ప్రకారం అతన్ని సమాధిలో పెట్టడమే. ఇక ఎవరైతే సమాధిలో పెట్టకుండా వేరే పద్ధతులు అవలంబిస్తున్నారో, వారు స్వభావానికి, ప్రకృతికి విరుద్ధమైన పని చేస్తున్నారు. ఇదొక మాట అయితే, రెండో మాట ఏమిటంటే, అధిక శాతం చనిపోయే వారిని సమాధిలో పెట్టడం జరుగుతుంది. అందుకొరకే ఈ పదాలు ఉపయోగించబడ్డాయి.

కానీ ఇక ఎవరైనా, ఎవరిదైనా కాల్చివేయడం జరిగితే, లేదా ఎవరైనా అగ్నికి ఆహుతి అయి పూర్తిగా బూడిదైపోతే, లేదా ఏదైనా మృగ జంతువు యొక్క ఆహారంగా మారిపోతే, ఇంకా సంక్షిప్తంగా చెప్పాలంటే, మనిషిని బొందలో పెట్టకుండా, సమాధిలో పెట్టకుండా ఏ విధంగా ఏది జరిగినా గానీ, ఈ శరీరం ఏదైతే ఉందో, భౌతికాయం అని ఏదైతే అంటామో అది నాశనమైపోతుంది. కానీ ఆత్మ అయితే ఉంటుంది. అల్లాహ్ త’ఆలా తలుచుకుంటే ఆత్మకైనా శిక్ష ఇవ్వవచ్చు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలై దీనికి సంబంధించిన ఎన్నో వివరాలు తెలిపి ఉన్నారు. అల్లాహ్ తలుచుకుంటే ఆ కుళ్ళిపోయిన, కాలిపోయిన, ఆహారంగా మారిపోయిన ఆ శరీరాన్ని మరోసారి ఉనికిలోకి తీసుకురావచ్చు. లేదా అల్లాహ్ త’ఆలా తలుచుకుంటే కొత్త శరీరం ప్రసాదించవచ్చు. అల్లాహ్ తలుచుకుంటే, సమాధి యొక్క శిక్షలు మరియు వరాలు ఏవైతే ఉన్నాయో, శిక్షలు అంటే అవిశ్వాసులకు పాపాత్ములకు, వరాలు అంటే, అనుగ్రహాలు అంటే విశ్వాసులకు మరియు పుణ్యాత్ములకు, ఈ సమాధి శిక్షలు లేదా అనుగ్రహాలు, వరాలు ఇవి ప్రతి ఒక్కరికీ జరిగి ఉంటాయి.

وَمِن وَرَائِهِم بَرْزَخٌ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
(వ మిన్ వరా’ఇహిమ్ బర్ జ ఖున్ ఇలా యౌమి యుబ్ ‘అసూన్)
వారి వెనుక పునరుత్థాన దినం వరకు ఒక అడ్డుతెర (బర్ జఖ్) ఉంటుంది. (23:100)

దీన్నే కొందరు మధ్య కాలం, ఇటు ఇహలోకం అటు పరలోకం, దాని మధ్య లోకం ఇది. మధ్య లోకంలో ఇవి తప్పకుండా జరిగి ఉంటాయి. తప్పకుండా జరిగి ఉంటాయి. ఈ విశ్వాసం మనం తప్పకుండా మనసులో నిశ్చయించాలి. ఈ విషయాలను నమ్మాలి.

ఇక సమాధిలో… సమాధి అంటే ఇక్కడ గుర్తు ఉంది కదా, ఒకవేళ ఎవరినైనా సమాధిలో పెట్టడం జరగకపోయినా గానీ వారిని ప్రశ్నించడం జరుగుతుంది. వచ్చి దైవదూత అడుగుతాడు, నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? మరియు నీ ప్రవక్త ఎవరు? అప్పుడు విశ్వాసుడు అయితే, నా ప్రభువు అల్లాహ్, నా యొక్క ధర్మం ఇస్లాం మరియు నా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని సమాధానం ఇస్తాడు. తర్వాత నాలుగో ప్రశ్న అడగడం జరుగుతుంది, ఈ విషయాలు నీవు ఎలా తెలుసుకున్నావు అని? అతడు చెబుతాడు, నేను ఖురాన్ ను చదివాను, ధర్మం నేర్చుకున్నాను అని.

ఇక ఎవరైతే అవిశ్వాసి లేదా పాపాత్ముడై ఉంటాడో, మహా ఘోరమైన పాపాత్ముడు, అలాంటి వారు ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వరు. అయ్యో, మాకు తెలియదు, ప్రజలు అన్నట్లుగా మేమన్నాము అని అంటారు. నువ్వు ఎందుకు తెలుసుకోలేదు, ఎందుకు చదువుకోలేదు, ఎందుకు చదువుకున్న వారిని అనుసరించి ఖురాన్ పారాయణం చేయలేదు అని చెప్పుకుంటూ వారిని కొట్టడం, శిక్షించడం జరుగుతుంది.

ఇక సమాధిలో, ఈ మధ్య లోకంలో జరిగే అటువంటి మరికొన్ని వివరాలు కూడా ఉన్నాయి. కానీ సమయం ఇప్పటికే ఎక్కువైనందుకు నేను ఇంతటితో ముగిస్తున్నాను. కానీ మీ యొక్క ప్రశ్నకు సమాధానం లభించింది అని ఆశిస్తున్నాను. సంక్షిప్తంగా మీ ప్రశ్న ఏముండే? ఎవరి చావు ఎట్లా వస్తుంది? హిందువులకు వేరే రకంగా యమదూత వస్తాడా, ప్రాణం తీసే దూత వస్తాడా? ఇంకా ముస్లింలకు వేరే దూతనా? మనలాంటి, మనకు జరిగే విధంగానే వారికి జరుగుతాయా? మరి వారినైతే సమాధిలో పెట్టడం జరగదు కదా, కాల్చేస్తారు కదా, మరి వారికి ఎలా జరుగుతుంది? ఇలాంటి ప్రశ్నలు ఏవైతే వచ్చాయో వాటన్నిటినీ కలుపుకొని ఈ సంక్షిప్త విషయం తెలపడం జరిగింది.

చనిపోయిన తర్వాత నుండి మొదలుకొని, మళ్ళీ అల్లాహ్ యొక్క మైదానే మహ్షర్ లో నిలబడే వరకు ఏ ఏ సంఘటనలు జరుగుతాయని ఖురాన్ మరియు సహీ హదీసులలో తెలపబడ్డాయో, వాటన్నిటినీ మనం విశ్వసించి ఆ ప్రకారంగా మన విశ్వాసాన్ని బలపరుచుకొని ఉంచేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా ఆఖరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు.

أَسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక

ఇస్బాల్ – మగవారు దుస్తులు చీలమండలం (Ankles) క్రిందికి ధరించడం నిషిద్ధం [వీడియో & టెక్స్ట్]

ఇస్బాల్ – మగవారు దుస్తులు చీలమండలం (Ankles) క్రిందికి ధరించడం నిషిద్ధం
https://youtu.be/RpDjA_KkfMo [11 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

దుస్తులు చీలమండలం క్రిందికి ఉంచుట men wearing below ankles

ప్రస్తుత ప్రసంగంలో, వస్త్రాలను చీలమండలాల క్రిందకు ధరించడం (ఇస్బాల్) ఇస్లాంలో తీవ్రమైన పాపంగా పరిగణించ బడుతుందని వివరించబడింది. గర్వంతో లేదా గర్వం లేకుండా పురుషులు తమ ప్యాంటు, లుంగీ లేదా మరేదైనా వస్త్రాన్ని చీలమండలాల క్రిందకు వేలాడదీయడం నిషిద్ధమని, అలా చేసిన వారికి ప్రళయ దినాన అల్లాహ్ కరుణ లభించదని హదీసుల ఆధారంగా స్పష్టం చేయబడింది. అయితే, స్త్రీలకు పరదృశ్యుల నుండి తమ పాదాలను కప్పి ఉంచే నిమిత్తం, తమ వస్త్రాలను చీలమండలాల నుండి ఒక మూరెడు వరకు క్రిందకు వేలాడదీయడానికి అనుమతి ఉంది, కానీ అంతకంటే ఎక్కువ పొడవు ఉండరాదు. ఆధునిక ఫ్యాషన్ల పేరిట స్త్రీలు పొట్టి దుస్తులు ధరించడం లేదా వివాహాలలో నేలపై ఈడ్చుకుంటూ వెళ్లే పొడవాటి గౌనులు ధరించడం కూడా ఇస్లాంలో నిషిద్ధమని హెచ్చరించబడింది.

దుస్తులు చీల మండలం క్రిందికి ఉంచుట. ఇక స్త్రీలు అనుకుంటున్నారు కావచ్చు, ఇందులో మాదేముందయ్యా, మగోళ్లకే కదా ఈ ఆదేశాలు? కొంచెం ఓపిక వహించండి శ్రద్ధగా వినండి.

దుస్తులు చీల మండలం క్రిందికి ఉంచుట, దీన్ని ప్రజలు చాలా చిన్నదిగా, విలువ లేనిదిగా భావిస్తారు. ఏమంత పెద్ద పాపం కాదయ్య, నాకైతే గర్వ ఉద్దేశ్యం లేదు కదా అనేస్తారు. కానీ ఇది అల్లాహ్ దృష్టిలో పెద్ద పాపాల్లో ఒకటి. అంటే, లుంగీ, ప్యాంట్ వగైరా చీల మండలం క్రిందికి ఉంచుట. కొందరి దుస్తులు నేలకు తాకుతూ ఉంటాయి. మరి కొందరివి భూమిపై వేలాడుతూ ఉంటాయి. దీనినే కొందరు ఏమంటారు? అయ్యా మున్సిపాలిటీ వాళ్ళు చప్రాసీ పని నీకు ఇచ్చారా, నీ ప్యాంటు ద్వారా గంత గలీజు ఊడ్చుకుంటూ వెళ్తున్నావు? ఎవరైనా ప్యాంటును ఈడ్చుకుంటూ వెళ్లేవారు కోపానికి రాకండి. కొందరు అలా జోక్ గా మాట్లాడుకుంటారు అని అంటున్నాను. వాళ్ళు అలా మాట్లాడుకునే పరిస్థితి మీరు తీసుకురాకండి, మీ ప్యాంట్లు, మీ యొక్క లుంగీలు, మీ యొక్క బట్టలు, పైజామాలు గిట్ల కిందికి వ్రేలాడదీసి.

హజ్రత్ అబూజర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించిన హదీద్ లో ఉంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

ثَلَاثَةٌ لَا يُكَلِّمُهُمُ اللَّهُ يَوْمَ الْقِيَامَةِ وَلَا يَنْظُرُ إِلَيْهِمْ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ : الْمُسْبِلُ ( وَفِي رِوَايَةٍ : إِزَارَهُ ) وَالْمَنَّانُ ( وَفِي رِوَايَةٍ : الَّذِي لَا يُعْطِي شَيْئًا إِلَّا مَنَّهُ ) وَالْمُنَفِّقُ سِلْعَتَهُ بِالْحَلِفِ الْكَاذِبِ
“మూడు రకాల వ్యక్తులున్నారు. అల్లాహ్‌ వారితో సంభాషించడు. దయాభావంతో కన్నెత్తి చూడడు. వారిని పరిశుద్ధ పరచడు. వారికి తీవ్రమైన శిక్ష విధిసాడు. తన లుంగి (ప్యాంటు…) ను చీలమండలానికి క్రింది వరకు ఉంచేవాడు. ఉపకారం చేసి మాటిమాటికి చెప్పుకునేవాడు. దెప్పి పొడిచేవాడు. తన సరుకును అసత్య ప్రమాణాలతో అమ్మేవాడు” (ముస్లిం 106).

అల్లాహు అక్బర్. నాలుగు రకాల ఘోరమైన విషయాలు, చూస్తున్నారా? అల్లాహ్ మాట్లాడడు, కన్నెత్తి చూడడు, పరిశుద్ధ పరచడు, పైగా వారికి తీవ్ర శిక్ష ఉంటుంది.

ఎవరు వారు? అల్ ముస్బిల్. తన లుంగీ, ప్యాంట్, పైజామా ఏదైనా, ఏది అయినా తొడిగేది, సాక్స్ కాకుండా, ఎందుకంటే సాక్స్ కింది నుండి పైకి వస్తాయి. పై నుండి కిందికి వచ్చేటివి ఏ వస్త్రాలైనా గానీ చీల మండలానికి కిందిగా ఉన్నాయి అంటే, అతడికి ఈ శిక్ష ఉంది. ఇంకా రెండో వాడు ఎవడు? ఉపకారం చేసి, ఎవరికైనా ఏదైనా మేలు చేసి, మాటిమాటికి చెప్పుకునేవాడు, దెప్పిపొడిచేవాడు. మూడో వాడు ఎవడయ్యా? తన సరుకును అసత్య ప్రమాణాలతో అమ్మేవాడు.

కొందరు, నేను గర్వకారణంగా తొడగడం లేదు అని చెప్పి తన పవిత్రతను చాటుకుంటాడు. కాని అతని మాట చెల్లదు. గర్వం ఉద్దేశ్యం ఉన్నా లేకపోయినా అన్ని స్దితుల్లో అది నిషిద్ధం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఈ హదీసును గమనించండి:

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసును గమనించండి:

مَا تَحْتَ الْكَعْبَيْنِ مِنَ الإِزَارِ فَفِي النَّارِ
(మా తహ్తల్ క’బైని మినల్ ఇజారి ఫఫిన్నార్)
“ఎవరి లుంగి (ప్యాంటు వగైరా) చీలమండలానికి క్రిందికి ఉండునో అది అగ్నికి ఆహుతి అవుతుంది”. (నిసాయీ 5330, ముస్నద్‌ అహ్మద్‌ 6/254).

ఒకవేళ గర్వంతో క్రిందికి వదిలితే. దాని శిక్ష ఇంకా పెద్దది, భయంకర మైనది. ఇదే తరహా స్పష్టీకరణ ప్రవక్తగారి ఈ ప్రవచనంలో ఉన్నది:

مَنْ جَرَّ ثَوْبَهُ خُيَلَاءَ لَمْ يَنْظُرِ اللَّهُ إِلَيْهِ يَوْمَ الْقِيَامَةِ
“ఎవరైతే తన వస్త్రాన్ని గర్వంతో వ్రేలాడ దీస్తాడో ప్రళయదినాన అల్లాహ్‌ అతని వైపు కన్నెత్తి చూడడు’. (బుఖారి 3665, ముస్లిం 2085).

ఎందుకనగా అందులో రెండురకాల నిషిద్ధతలున్నాయి. ఒకటి గర్వం, రెండవది చీలమండలం క్రిందికి ధరించడం.

చీలమండలానికి క్రింద ధరించే నిషిద్ధత అన్ని రకాల దుస్తులపై ఉంది. అబ్దుల్లాహ్ బిన్‌ ఉమర్‌ (రజియల్లాహు అన్హు)  ప్రవక్తతో ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

الْإِسْبَالُ فِي الْإِزَارِ وَالْقَمِيصِ وَالْعِمَامَةِ، مَنْ جَرَّ مِنْهَا شَيْئًا خُيَلَاءَ لَمْ يَنْظُرِ اللَّهُ إِلَيْهِ يَوْمَ الْقِيَامَةِ
“లుంగీని, చొక్కాను మరియు తలపాగను (చీలమండలానికి క్రిందకి) వ్రేలాడదీయుట (ఘోరపాపం). అయితే ఎవరైతే వీటిలో ఏ ఒక్కటినైనా గర్వంతో వ్రేలాడతీస్తాడో, ప్రళయ దినాన అల్లాహ్‌ అతనివైపు కన్నెత్తి చూడడు ‘. (అబూదావూద్‌ 4094, సహీహుల్‌ జామి 2770).

ఇక, కొందరు ఏమంటారు, నాకు గర్వం లేదు అని అంటారు కదా, ఆ మాట చెల్లదని ఇంతకు ముందే మనం తెలుసుకున్నాము. వారికి ప్రత్యేకమైన శిక్ష ఉంది. అయితే రండి, మరొక హదీస్, ఇది నిసాయి లో వచ్చి ఉంది.

وارْفَعْ إِزَارَكَ إِلَى نِصْفِ السَّاقِ، فَإِنْ أَبَيْتَ فَإِلَى الْكَعْبَيْنِ، وَإِيَّاكَ وَإِسْبَالَ الْإِزَارِ، فَإِنَّهَا مِنَ الْمَخِيلَةِ، وَإِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمَخِيلَةَ
“నీ లుంగీని సగం పిక్కల వరకు లేపి ఉంచు, అంతపైకి కుదరదనుకుంటే చీలమండలం వరకు, చీలమండలానికి క్రిందికి ధరించడం నుండి దూరముండు, అది గర్వాహంకారంలో లెక్కించబడుతుంది మరియు అల్లాహ్ గర్వాహంకారాలను ఇష్టపడడు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సహాబీకి చెప్పారు, “నీ లుంగీని సగం పిక్క వరకు లేపి ఉంచు. అంత పైకి కుదరదనుకుంటే, చీల మండలం వరకు.” చీల మండలం అంటే అందరికీ అర్థమైందా? గిట్టలు (ankles) అని అంటారు చూడండి, ఎక్కడైతే మన పాదం మొదలవుతుందో మరియు మన యొక్క పిక్క కింది కాలు భాగం పూర్తి అయి జాయింట్ ఏదైతే ఉంటుందో, రెండు వైపులా కొంచెం ఎక్కువగా వచ్చి ఉంటాయి ఆ ఎముకలు, గిట్టెలు అని కూడా కొందరు అంటారు, చీల మండలం అని అంటారు. దానిని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబీకి చెప్పారు, ఒకవేళ నీవు సగం పిక్క వరకు కుదరదు అనుకుంటే చీలమండలం వరకు, అంటే అది కనబడాలి. దానిపైకి ఉండాలి వస్త్రం.

وَإِيَّاكَ وَإِسْبَالَ الْإِزَارِ؛ فَإِنَّهَا مِنَ الْمَخِيلَةِ، وَإِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمَخِيلَةَ
(వ ఇయ్యాక వ ఇస్బాలల్ ఇజార్, ఫ ఇన్నహా మినల్ మఖీలా, వ ఇన్నల్లాహ లా యుహిబ్బుల్ మఖీలా)
“చీల మండలానికి క్రిందికి ధరించడం నుండి నువ్వు దూరం ఉండు. ఉద్దేశ్యం నీది లేకపోయినా గాని, ఇది గర్వ అహంకారం లో లెక్కించబడుతుంది. మరియు అల్లాహ్ త’ఆలా గర్వ అహంకారాలను ఇష్టపడడు.”

ఇక స్త్రీల మాటకు వస్తారా? ఈ నిషిద్ధత స్త్రీలకు కూడా వర్తిస్తుంది. అయితే, వారి శరీరంలో ఏ కొంత భాగం కూడా పరపురుషులకు కనబడకుండా ఉండుట తప్పనిసరి గనక, ఆమె తన పాదాలు కనబడకుండా క్రిందికి వ్రేలాడదీయవచ్చును. కానీ ఎంత? అంతకంటే ఎక్కువ ఉంటే ఆమెకు కూడా శిక్షనే మరి. ఎంత? ఈ హదీసుపై శ్రద్ధ వహించండి. తిర్మిజీలో ఉన్న సహీ హదీస్, అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హుమా ఉల్లేఖించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

مَنْ جَرَّ ثَوْبَهُ خُيَلَاءَ لَمْ يَنْظُرِ اللَّهُ إِلَيْهِ يَوْمَ الْقِيَامَةِ
(మన్ జర్ర సౌబహు ఖుయలాఅ లమ్ యందురిల్లాహు ఇలైహి యౌమల్ ఖియామా)
ఎవరైతే తమ యొక్క వస్త్రాలను చీలమండలానికి క్రిందిగా వేలాడదీస్తారో, హుయలా (గర్వ అహంకారాలతో), అల్లాహ్ అలాంటి వారి వైపున ప్రళయదినాన చూడడు. అక్కడ ఉమ్మె సలమా రదియల్లాహు త’ఆలా అన్హా అడిగినది, ప్రశ్నించినది:

فَكَيْفَ يَصْنَعْنَ النِّsسَاءُ بِذُيُولِهِنَّ؟
(ఫకైఫ యస్న’అన్నిసాఉ బి దుయూలిహిన్?)
“స్త్రీలు వారి యొక్క వస్త్రాలలో ఏదైతే కిందికి వేలాడి ఉంటాయో వారి పరిస్థితి ఏమిటి?”

يُرْخِينَ شِبْرًا
(యుర్ఖీన షిబ్రా)
ప్రవక్త చెప్పారు: “ఒక జానెడు వారు కిందికి వేలాడదీయవచ్చు.” ఈ జానెడు అంటే ఎక్కడి నుండి జానెడు? చీల మండలం నుండి జానెడు, ఎందుకంటే అక్కడి వరకే తొడగాలని ముందు చెప్పారు కదా.

ఈ హదీసును స్త్రీలు చాలా శ్రద్ధగా వినాలి. ప్రత్యేకంగా ఈ రోజుల్లో లెగ్గింగ్స్ వేసుకొని, జీన్స్ ప్యాంట్లు వేసుకొని, చర్మానికి, తోలుకు మొత్తం అతుక్కుపోయే విధంగా, చాలా టైట్ గా ఉండే అటువంటి ప్యాంట్లు, పైజామాలు ఏదైతే స్త్రీలు తొడుగుతున్నారో, బయటికి వెళ్తున్నారో, భయపడండి అల్లాహ్ తో, గమనించండి. వారి యొక్క ఆ పైజామాలు, ప్యాంట్లు, లెగ్గింగ్స్ అన్నీ పైకి ఉంటాయి. అలాంటి వారు ప్రత్యేకంగా ఈ హదీసును వినాలి.

స్త్రీలము మేము మా పాదాలు కూడా పర పురుషులకు కనబడకుండా ఉండాలి కదా, మరి ఎవరైతే చీలమండలానికి క్రిందిగా తొడుగుతారో వారికి నరకశిక్ష ఉన్నది అని, ప్రళయ దినాన అల్లాహ్ చూడడు అని మీరు అంటున్నారు కదా ప్రవక్తా, మరి మా స్త్రీల పరిస్థితి ఏమిటి అంటే, “ఒక జానెడు వేలాడదీయండి” అని చెప్పారు. అయితే ఉమ్మె సలమా రదియల్లాహు త’ఆలా అన్హా అడిగారు:

إِذًا تَنْكَشِفُ أَقْدَامُهُنَّ
(ఇదన్ తన్కషిఫు అఖ్దాముహున్నా)
“నిలబడి ఉండి జానెడు కిందికి తీస్తే పర్లేదు, కానీ నడుస్తున్నప్పుడు వాళ్ళ యొక్క పాదాలు తెరచిఉంటాయి క కదా?” అప్పుడు ప్రవక్త చెప్పారు:

فَيُرْخِينَهُ ذِرَاعًا لَا يَزِدْنَ عَلَيْهِ
(ఫ యుర్ఖీనహు దిరా’అన్, లా యజీద్న అలై)
“ఒక మూరెడు వారు కిందికి ఉంచవచ్చు. అంతకంటే ఇంకా ఎక్కువ పొడుగ్గా ఉంచడం ఇది కుదరదు.” అందువల్ల వారు కూడా శిక్షలకు గురి అవుతున్నారు.

కానీ మన సమాజంలోని స్త్రీలలో రెండు రకాల ఫ్యాషన్లు వారిని నాశనానికి, వినాశనానికి గురి చేస్తున్నాయి. ఒకటి, ఆఫీసుల్లో జాబ్ చేసే స్త్రీలు అని గానీ, కాలేజీల్లో చదివే అమ్మాయిలు గానీ, స్కర్టులు వేసుకోవడం, ఇంకా ఏదేదో కొత్త కొత్త పేర్లతో ఏమేమో వేసుకోవడం, వారి యొక్క పాదాలు, చీలమండలు, సగం పిక్కలు, మోకాళ్ల వరకు కూడా కనబడి ఉండటం, ఇదొక ఫిత్నా అయిపోతుంది. ఇదొక చాలా వినాశనానికి వారు దారి తీస్తున్నారు. మరియు మరోవైపున, కొన్ని ఫంక్షన్లలో, కొన్ని ఫంక్షన్లలో, కొన్ని రకాల బట్టలు ఎలా కుట్టిస్తారంటే ఒక మీటర్, రెండు మీటర్లు, మూడు మీటర్లు వెనక్కి అది వేలాడుతూ ఉంటాయి. ఇది ఒక గర్వంగా, ఇది ఒక ఫ్యాషన్ గా, ఇది ఒక మోడల్ గా, ఆ, ఇది మా యొక్క పెళ్లికి ప్రత్యేక చిహ్నం అండి అన్నట్లుగా చెప్పుకుంటారు. కానీ ఈ హదీసు ఆధారంగా అది కూడా నిషిద్ధం. కొందరు పెళ్లికూతుర్లు ధరించే దుస్తులు మీటర్ కంటే ఎక్కువ కిందికి ఉంటాయి. ఒక్కోసారి ఎంతకంటే పొడుగ్గా ఉంటాయి, వెనక ఉన్నవారు ఎత్తి పట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి కూడా యోగ్యం కావు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=6512

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

అల్లాహ్ ఆరాధన (ఇబాదత్) అంటే ఏమిటి? ఆరాధన రకాలు [వీడియో & టెక్స్ట్]

https://youtu.be/bqXH8XAhqW8
[ 15 నిముషాలు]

అల్లాహ్ ఆరాధన (ఇబాదత్) అంటే ఏమిటి? ఆరాధన రకాలు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

విశ్వాస మూల సూత్రాలు పుస్తకం నుండి .

వీడియో లో ఈ విషయాలు చెప్ప బడ్డాయి:

  • అల్లాహ్ ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన రకాలు
  • అల్లాహ్ ఆరాధన యొక్క సామాన్య భావన
  • అల్లాహ్ ఆరాధన యొక్క ప్రత్యేక భావన
  • హృదయానికి సంబంధించిన ఆరాధనలు – ప్రేమించడం,భయపడడం ..
  • శరీరానికి సంబంధించిన ఆరాధనలు – నమాజు , హజ్ ,ఉపవాసం 
  • ధనానికి సంబంధించిన ఆరాధనలు – జకాత్ , సదఖా 
  • ఆరాధన అల్లాహ్ కు మాత్రమే చెయ్యాలి, లేనియెడల అది షిర్క్ అవుతుంది
  • దుఆ ఇబాదత్ (ఆరాధన)లో ఒక రకం , కేవలం అల్లాహ్ కు మాత్రమే చెయ్యాలి
  • తవక్కుల్  (నమ్మకం, భరోసా) అల్లాహ్ మీద మాత్రమే ఉంచాలి 
  • కష్ట సమయంలో కీడు నుంచి రక్షణ కోరడం, సహాయం అర్ధించడం  
  • మొక్కుబడులు

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ విశ్వాసంలోని ఆరు మూల స్తంభాల గురించి, ముఖ్యంగా మొదటి స్తంభమైన అల్లాహ్ పై విశ్వాసం గురించి వివరించబడింది. ఆరాధన అనేది కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించబడాలని, అందులో ఎవరినీ భాగస్వాములుగా చేయరాదని స్పష్టం చేయబడింది. దుఆ (ప్రార్థన), తవక్కుల్ (భరోసా), సహాయం మరియు శరణు వేడటం, మొక్కుబడులు వంటి ఆరాధనలన్నీ కేవలం అల్లాహ్ తోనే చేయాలని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో నొక్కి చెప్పబడింది. ప్రాపంచిక విషయాలలో జీవించి ఉన్న వారి నుండి, వారి శక్తి పరిధిలోని సహాయం కోరడానికి మరియు చనిపోయిన వారి నుండి సహాయం కోరడానికి మధ్య ఉన్న వ్యత్యాసం కూడా వివరించబడింది. చివరగా, అల్లాహ్ ను విశ్వసించడం ద్వారా కలిగే లాభాల గురించి తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ప్రస్తావించారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహీ అజ్మయీన్ అమ్మా బాద్.

సోదర మహాశయులారా! విశ్వాస మూల సూత్రాలు అనే ఈ ముఖ్యమైన శీర్షికలో మనం ఇప్పటివరకు అల్లాహ్ యొక్క దయవల్ల ఆరు పాఠాలు విని ఉన్నాము, తెలుసుకున్నాము. ఈనాటి ఏడవ పాఠం అర్కానే ఈమాన్, విశ్వాస మూల సూత్రాలు. విశ్వాస మూల సూత్రాలు ఎన్ని ఉన్నాయి? ఆరు ఉన్నాయి. ఆరిట్లో మొట్టమొదటిది, ఎక్కువ ప్రాముఖ్యత గలది అల్లాహ్ పై విశ్వాసం. అల్లాహ్ పై విశ్వాసంలో ఎన్నో విషయాలు వస్తాయి. వాటిలోనే ఒక ముఖ్యమైనది ఏమిటి? అల్లాహ్ ను ఆరాధించడం. అల్లాహ్ ఆరాధనలో ఎవరినీ కూడా భాగస్వామిగా చేయకపోవడం.

అయితే ఈ ఒక్క మాటనే సరిపోతుంది. మనల్ని అల్లాహ్ ఆరాధించడానికే పుట్టించాడు గనక ఆయన ఆరాధనలో మనం మరెవరినీ కూడా భాగస్వామిగా చేయకూడదు. అయినా ఆరాధన అని మనం అన్నప్పుడు ఏ ఏ విషయాలు అందులో వస్తాయి? వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.

అల్లాహ్ ఆరాధన అని మనం అన్నప్పుడు, ఇందులో ముందు రెండు విషయాలని మీరు అర్థం చేసుకోండి. ఒకటి, అల్లాహ్ ఆరాధన అని మనం అన్నప్పుడు ఒక సామాన్య భావన, మరొకటి ప్రత్యేక భావన. అల్లాహ్ ఆరాధన యొక్క సామాన్య భావం, మరొకటి ప్రత్యేక భావం. ప్రత్యేక భావం అంటే ఏంటి? కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ఎలాంటి భాగస్వామ్యం లేకుండా చేసేటువంటి పనులు. అవి మన హృదయానికి సంబంధించినవి ఉన్నాయి, మన ధనానికి సంబంధించినవి ఉన్నాయి, ఇంకా మన సామాన్య అవయవాలు, నాలుక, చేతులు, కాళ్ళు, శారీరక ఆరాధనలు కూడా ఉన్నాయి. ప్రత్యేకమైనవి.

ఉదాహరణకు, హృదయానికి సంబంధించినవి ముహబ్బత్, ఇఖ్లాస్, ఖౌఫ్, రజా. సంక్షిప్తంగా ఈ పేర్లు గత ఆరవ పాఠంలో కూడా వచ్చాయి. అంటే అల్లాహ్ ను ఎలా ప్రేమించాలో అలాగ మరెవ్వరినీ కూడా ప్రేమించరాదు. ఏ పనులు మనం అల్లాహ్ కొరకు చేస్తామో అందులో ఇఖ్లాస్, స్వచ్ఛత అనేది ఉండాలి. అంటే ఏ ప్రదర్శనా బుద్ధి, ఏదైనా ప్రపంచ లాభం పొందే ఉద్దేశం అట్లాంటిది ఏదీ కూడా ఉండకూడదు.

అల్లాహ్ తో ఏ రీతిలో మనం భయపడాలో ఆ రీతిలో ఇంకా ఎవరితోనీ కూడా భయపడకూడదు. అల్లాహ్ పట్ల మనం ఎలాంటి ఆశతో ఉండాలో అలాంటి ఆశ ఇంకా ఎవరితోనీ కూడా మనకు ఉండకూడదు. అర్థమైంది కదా?

మన శరీరానికి సంబంధించిన కొన్ని ఆరాధనలు, నమాజ్. నమాజ్ ఇది శరీరానికి సంబంధించిన ఇబాదత్. ధనానికి సంబంధించిన ఇబాదత్ లో దానధర్మాలు, ప్రత్యేకంగా బలిదానం, జిబహ్ చేయడం. ఈ విధంగా నాలుకకు సంబంధమైన ఖురాన్ యొక్క తిలావత్, జిక్ర్. విషయం కొంచెం అర్థమైంది కదా?

అయితే మరి కొన్ని ఆరాధనలు ఉన్నాయి. వాటిలో ఎంతోమంది అల్లాహ్ తో పాటు ఇతరులకు ఆ ఆరాధనలు చేస్తారు. మరియు ఖురాన్ లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఎంతో నొక్కి చెప్పాడు అల్లాహ్ తప్ప వేరే ఎవరికీ అవి చేయకూడదు అని. అయితే వాటి ప్రాముఖ్యత పరంగా, వాటి గురించి ప్రత్యేకమైన ఆధారాలు, దలీల్ ఖురాన్ హదీస్ లో వచ్చి ఉంది గనుక వాటిల్లో కొన్ని మీ ముందు నేను ఉంచి వాటి యొక్క దలీల్ కూడా తెలిపే ప్రయత్నం చేస్తాను.

ఉదాహరణకు, ఆరాధనలో ఒక రకం దుఆ. దుఆ కేవలం ఎవరితోని చేయాలి? అల్లాహ్ తో మాత్రమే చేయాలి. ఎందుకు? దీనికి సంబంధించిన ఖురాన్ లో ఎన్నో ఆయతులు ఉన్నాయి. కానీ సూరె ఘాఫిర్, సూరా నెంబర్ 40, ఆయత్ నెంబర్ 60 లో,

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ
మీ ప్రభువు చెప్పాడు మీతో కేవలం నాతో మాత్రమే దుఆ చేయండి, మీ దుఆలను అంగీకరించే వాడిని నేను మాత్రమే.

ఇక్కడ గమనించండి, ఈ ఆయత్ యొక్క ఆరంభం ఎలా ఉంది?

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي
మీరు నాతో దుఆ చేయండి. ఆ తర్వాత ఏమంటున్నాడు?

إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي
ఎవరైతే నా ఆరాధన పట్ల విముఖత చూపుతారో, గర్వానికి గురి అవుతారో.

అంటే ఏం తెలిసింది ఇక్కడ? దుఆ, ఇబాదత్. అసలైన ఇబాదత్. అందుగురించి తిర్మిజీ లోని ఒక సహీ హదీస్ లో ఉంది,

الدُّعَاءُ هُوَ العِبَادَةُ
(అద్దుఆవు హువల్ ఇబాదా)
దుఆ యే అసలైన ఇబాదత్

అల్లాహ్ ఏమంటున్నాడు? ఎవరైతే నాతో దుఆ చేయరో, నాతో దుఆ చేయడంలో గర్వానికి గురి అవుతారో, నాతో దుఆ చేయడంలో విముఖత చూపుతారో,

سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ
ఎంతో అవమానంతో, పరాభవంతో వారు నరకంలో ప్రవేశిస్తారు.

అల్లాహు అక్బర్. ఏం తెలిసింది ఇప్పుడు మనకు? దుఆ ఆరాధనలో ఒక రకం, అది కేవలం ఎవరితో చేయాలి? అల్లాహ్ తో మాత్రమే. అల్లాహ్ తోనే మనం దుఆ చేయాలి. ఫలానా బాబా సాహెబ్, ఫలానా పీర్ సాహెబ్, ఫలానా వలీ సాహెబ్, ఫలానా సమాధిలో ఉన్న చాలా పెద్ద బుజుర్గ్, ఆయన మన దుఆలను వింటాడు, మన అవసరాలను తీరుస్తాడు అని వారితో దుఆ చేయడంలో ఎన్నో రకాల పాపాలు ఉంటాయి.. అందుగురించి దుఆ కేవలం ఎవరికి ప్రత్యేకించాలి? అల్లాహ్ కు మాత్రమే.

అలాగే తవక్కుల్, భరోసా, నమ్మకం. అల్లాహ్ త’ఆలా సూరె మాయిదా, సూరా నెంబర్ 5, ఆయత్ నెంబర్ 23 లో తెలిపాడు,

وَعَلَى اللَّهِ فَتَوَكَّلُوا إِن كُنتُم مُّؤْمِنِينَ
(వ అలల్లాహి ఫతవక్కలూ ఇన్ కున్తుమ్ ము’మినీన్)
మీరు నిజమైన విశ్వాసులు అయితే కేవలం అల్లాహ్ పై మాత్రమే నమ్మకం కలిగి ఉండండి. అల్లాహ్ తో మాత్రమే మీరు భరోసా, తవక్కుల్ తో ఉండండి.

ఇంకా సోదర మహాశయులారా! ఇలాంటి ఆయతులు చూసుకుంటే ఖురాన్ లో ఈ భావంలో ఎన్నో ఆయతులు ఉన్నాయి.

అలాగే ఏదైనా ఆపద, కష్ట సమయాల్లో సహాయానికి అర్ధించడం మరియు ఏదైనా కీడు నుండి రక్షణ పొందడానికి శరణు వేడుకోవడం, ఇవి కూడా కేవలం ఎవరితో ఉండాలి? అల్లాహ్ తో పాటు, అల్లాహ్ తో మాత్రమే.

కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని లేదా చిన్న తేడా మరియు వ్యత్యాసాన్ని గమనించండి. అదేమిటంటే ఏదైనా అవసరానికి సహాయం కోరడం గానీ లేదా ఏదైనా కీడు నుండి రక్షణ పొందడానికి శరణు వేడుకోవడం గానీ కేవలం ఎవరితో చేయాలి అన్నాము? అల్లాహ్ తో. కానీ కొన్ని సందర్భాల్లో మనం బ్రతికి ఉన్న కొందరు మనుషులతో సహాయము కోరుతాము మరియు శరణు వేడుకుంటాము. ఇది ఎప్పుడు జాయెజ్, ఎప్పుడు యోగ్యమవుతుంది? ఎవరితోనైతే మనం సహాయం కోరుతున్నామో, ఎవరితోనైతే శరణు వేడుకుంటున్నామో అతను బ్రతికి ఉండాలి, దగ్గరగా ఉండాలి మరియు అది ఆ శక్తి అతనిలో ఉండాలి వాస్తవానికి.

ఉదాహరణకు, ఎవరైనా మిమ్మల్ని హత్య చేస్తాడు అని మీకు మెసేజ్ పంపాడు, బెదిరింపులు పంపాడు, ఫోన్ పై చెప్పాడు లేదా ఏదో రకంగా. లేదా నవూజుబిల్లాహ్, అల్లాహ్ త’ఆలా మనందరినీ కూడా కాపాడు గాక, మన ఏదైనా వస్తువు తీసుకొని లేదా కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని డిమాండ్ చేస్తారు, అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? పోలీసులకి వెళ్లి అక్కడ వారి యొక్క సహాయం, వారి యొక్క శరణు కోరుతామా లేదా? ఇది షిర్క్ అయిపోతుందా? కాదు. ఎందుకు? ఇలాంటి రక్షణ కొరకే వారు ఉన్నారు.

కానీ ఇక్కడ ఒక విషయం, అదేమిటి? అల్లాహ్ తో కోరడం అనేది మనం మరిచిపోకూడదు. అల్లాహ్ ఒక సబబుగా చేశారు వారిని, వారికి ఈ యొక్క అవకాశం ఇచ్చారు. అందుకొరకే మనం వారితో కోరుతున్నాము. కానీ అసలు కోరడం అల్లాహ్ తో అది మరవకూడదు. ఓ అల్లాహ్, ఈ శక్తి సామర్థ్యం అంతా సర్వమూ నీ చేతిలోనే ఉంది. నువ్వు నన్ను కాపాడు, నీవు నాకు సహాయపడు మరియు నీవు మాత్రమే నాకు శరణు ప్రసాదించు అని అల్లాహ్ తో వేడుకోవాలి. వేడుకొని బ్రతికి ఉన్న వారిలో దాని యొక్క శక్తి ఉండేది ఉంటే వారితోని మనం సహాయం కోరవచ్చు.

ఇప్పుడు ఎవరైనా ఎంత పెద్ద వలీయుల్లాహ్ గానీ, అల్లాహ్ యొక్క వలీ, ఎంత గొప్ప అల్లాహ్ యొక్క వలీ గానీ చనిపోయి ఉన్నారు. అయితే అలాంటి వారితో మనం నాకు సంతానం ఇవ్వండి, మాకు సహాయం చేయండి, మా కొడుకును పాస్ చేయండి, ఫలానా శత్రువు మాపై దండెత్తడానికి, మాకు నష్టం, కీడు చేయడానికి సిద్ధం పూనుకున్నాడు, మీరు ఏదైనా మాకు శరణు ఇవ్వండి. వారు అల్లాహ్ యొక్క ఎంత గొప్ప వలీ కావచ్చు. కానీ అలా వారితో మనం ఈ శరణు కోరడం, సహాయం కోరడం అల్లాహ్ మనకు ఖురాన్ లో దాని యొక్క అనుమతి ఇవ్వలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఆ పద్ధతి మనకు నేర్పలేదు. విషయం అర్థమవుతుంది కదా?

అయితే అల్లాహ్ ను విశ్వసించడంలో ఈ విషయాలు కూడా వస్తాయి. వాటిని మనం అర్థం చేసుకోవాలి. అదే ప్రకారంగా మన యొక్క జీవితం మనం గడపాలి.

మొక్కుబడులు ఉన్నాయి. ఈ రోజుల్లో ఎంతో మందిని మనం చూస్తున్నాము, సమాధుల వద్దకు వెళ్లి అక్కడ మొక్కుకుంటారు. నా ఈ పని జరిగేది ఉంటే నేను ఇక్కడ వచ్చి చాదర్ వేస్తాను, పూలు వేస్తాను, ఒక మేక కోస్తాను, లేదా ఒక కోడిపుంజును జిబహ్ చేస్తాను ఈ విధంగా. ఇవన్నీ షిర్క్ లోకి వచ్చేస్తాయి. ఎందుకు? మొక్కుబడులు కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి.

విషయం అర్థమైంది కదా? ఇంకా ఎన్నో ఇలాంటి ఆధారాలు, దలీల్ ఖురాన్, హదీస్ లో ఉన్నాయి. కానీ సమయం సరిపోదు గనుక నేను ఈ కొన్ని విషయాల ద్వారానే ఈ టాపిక్ ను ఇక్కడి వరకు ముగింపు చేస్తున్నాను. కానీ విషయం అర్థమైంది కదా మీకు? అల్లాహ్ ను విశ్వసించడం అనేది అర్కానే ఈమాన్, విశ్వాస మూల సూత్రాల్లో మొట్టమొదటిది, ముఖ్యమైనది. అల్లాహ్ పై విశ్వాసంలో ఆయన అస్తిత్వం, అంటే ఆయన ఒకే ఒక్కడు తన అస్తిత్వంలో కూడా మరియు ఆయనకు మంచి ఉత్తమ పేర్లు, గుణాలు ఉన్నాయి అని కూడా (అస్మా వ సిఫాత్) మరియు ఆయన మాత్రమే సర్వాన్ని సృష్టించువాడు, పోషించువాడు, నడిపించువాడు (రుబూబియత్) మరియు సర్వ ఆరాధనలకు అర్హుడు కూడా కేవలం ఆయన మాత్రమే.

అల్లాహ్ విషయంలో మనం ఈ విషయాలు, అల్లాహ్ పై విశ్వాసంలో మనం ఈ విషయాల్ని అర్థం చేసుకోవడం, ఈ ప్రకారంగా మన జీవితాన్ని గడపడం ఇది చాలా అవసరం.

అల్లాహ్ త’ఆలా మనందరికీ అల్లాహ్ పై విశ్వాసం సంపూర్ణ విధంగా పాటించేటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక. అల్లాహ్ పై విశ్వాసంలో ఏ రవ్వంత కొరత వచ్చేటువంటి చెడుల నుండి, పాపాల నుండి, లోపాల నుండి అల్లాహ్ మనల్ని కాపాడు గాక.

ఇన్ షా అల్లాహ్, దీని తర్వాత అల్లాహ్ యొక్క దయవల్ల, అల్లాహ్ పై విశ్వాసం, దీని యొక్క లాభాలు ఏమిటి? ఇది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. సమరాతుల్ ఈమాని బిల్లాహ్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతోమంది, అరే అల్లాహ్ నే నమ్మండి, అల్లాహ్ నే విశ్వసించండి అని మాటిమాటికి అంటా ఉంటారు. ఏంటి లాభం మాకు దీనితోని? కొందరితో అజ్ఞాన కారణంగా అడగవచ్చు, అడగకపోయినా గానీ మనసులో వారికి అల్లాహ్ ను మనం తప్పకుండా విశ్వసించి జీవించాలి అన్నటువంటి ఒక తపన, కోరిక ఎంతో మందిలో లేకుండా మనం చూస్తూ ఉన్నాము. అలాంటప్పుడు మనం అల్లాహ్ ను విశ్వసించడం ద్వారా ఏం లాభాలు మనకు కలుగుతాయి, అవి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇవి తెలుసుకొని వాటిని పాటించేటువంటి సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. వ ఆఖిరు ద’వాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.


పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)

ఇతరములు: [విశ్వాసము]

    పురుషులు బంగారం వేసుకొనుట | ఇస్లామీయ నిషిద్ధతలు [వీడియో | టెక్స్ట్]

    పురుషులు బంగారం వేసుకొనుట (ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు)
    https://youtu.be/7NYeGuNGHnk (6 నిముషాలు)
     ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
    ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

    ఈ ప్రసంగంలో, ఇస్లాంలో పురుషులు బంగారం ధరించడం పూర్తిగా నిషిద్ధం (హరామ్) అని స్పష్టంగా వివరించబడింది. బంగారం ఏ రూపంలో ఉన్నా – ఉంగరం, గొలుసు, బ్రాస్‌లెట్ వంటివి – పురుషులు వాడకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల ప్రకారం, బంగారం మరియు పట్టు స్త్రీలకు ధర్మసమ్మతం కానీ పురుషులకు నిషిద్ధం. ఒక సహాబీ చేతిలో బంగారు ఉంగరం చూసినప్పుడు ప్రవక్త దానిని తీసి పారేసి, అది నరక జ్వాల వంటిదని హెచ్చరించిన సంఘటన వివరించబడింది. ఆ సహాబీ, ప్రవక్త పారేసిన దానిని తిరిగి తీసుకోకపోవడం, ప్రవక్త పట్ల వారికున్న గౌరవం మరియు అనుసరణకు నిదర్శనం. ఆధునిక కాలంలో గడియారాలు, బటన్లు, పెన్నులు వంటి వస్తువులలో కూడా బంగారం వాడకంపై హెచ్చరిక చేయబడింది. చెడును శక్తి ఉన్నప్పుడు చేతితో ఆపాలని, నిషిద్ధమని తెలిసిన వెంటనే దానిని వదిలివేయాలని ఈ ప్రసంగం బోధిస్తుంది.

    బంగారం ఏ రూపంలో ఉన్నా, దానిని పురుషులు వాడుట నిషిద్ధం. శ్రద్దగా వినండి. బంగారం ఏ రూపంలో ఉన్నా, గొలుసు రూపంలో కొందరు వేసుకుంటారు, ఏదైనా ఒక బ్యాంగిల్ రూపంలో చేతిలో వేసుకుంటారు పురుషులు. మరి కొందరు ఉన్నారు, రెండు చెవులలో నుండి ఏదైనా ఒక చెవిలో, ఇలా కొందరు ఈనాటి కాలంలో అలవాటు పడుతున్నారు. అయితే బంగారం ఏ రూపంలో ఉన్నా, దానిని పురుషులు వాడుట నిషిద్ధం.

    అబూ మూసా అష్’అరీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

    أُحِلَّ لِإِنَاثِ أُمَّتِي الْحَرِيرُ وَالذَّهَبُ وَحُرِّمَ عَلَى ذُكُورِهَا
    బంగారం, పట్టు నా అనుచర సంఘంలోని స్త్రీలకు ధర్మసమ్మతం. పురు షులకు నిషిద్ధం”.
    (ముస్నద్ అహ్మద్: 4/393. సహీహుల్ జామి 207).

    ఈరోజు మార్కెట్లో గడియారాలు, అద్దాలు, బటన్లు, పెన్నులు, చైన్లు ఇంకా మెడల్ పేరుతో బంగారపు లేదా బంగారు వన్నె ఎక్కించినవి చాలా ఉన్నాయి. ఇంకా పురుషులకు స్వర్ణ గడియారం అని కొన్ని కాంపిటీషన్లలో ప్రకటించబడుతుంది. అయితే ఇవి నిషిద్ధం అని తెలుసుకోవాలి.

    సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చినటువంటి హదీస్. శ్రద్ధగా వింటారు, అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను.

    أنَّ رسُولَ الله ﷺ رَأَى خَاتَمًا مِنْ ذَهَبٍ فِي يَدِ رَجُلٍ فَنَزَعَهُ فَطَرَحَهُ وَقَالَ: يَعْمِدُ أَحَدُكُمْ إِلَى جَمْرَةٍ مِنْ نَارٍ فَيَجْعَلُهَا فِي يَدِهِ فَقِيلَ لِلرَّجُلِ بَعْدَ مَا ذَهَبَ رَسُولُ الله ﷺ خُذْ خَاتِمَكَ انْتَفِعْ بِهِ قَالَ لَا وَالله لَا آخُذُهُ أَبَدًا وَقَدْ طَرَحَهُ رَسُولُ الله ﷺ

    అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన ప్రకారం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక వ్యక్తి చేతికి బంగారపు ఉంగరం చూశారు. ఆయన దానిని తీసిపారేశారు. మళ్ళీ ఇలా హెచ్చరించారు: “మీలో ఎవరికైనా నరకజ్వాల కావాలని ఉంటే దీనిని తన చేతిలో తొడగవచ్చు”. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నవారన్నారు: ‘నీ ఉంగరాన్ని తీసుకో, వేరే విధంగా దానితో ప్రయోజనం పొందవచ్చు’. అప్పుడు అతనన్నాడు: ‘లేదు. అల్లాహ్ సాక్షిగా! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తీసిపారేసిన దాన్ని నేను ఎన్నడూ తీసుకోను’. (ముస్లిం 2090).

    ఎవరైతే చేతిలో బంగారపు ఏదైనా వస్తువు వేసుకుంటారో, ఉంగరం కానీ, గాజు కానీ, ఇంకా ఇలాంటిది ఏదైనా, అయితే వారు నరక శిక్షకు ఆహుతి అవుతారు అని హెచ్చరిక ఇది.

    అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అటు వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ ఉన్నవారు ఆ సహాబీకి చెప్పారు, “నీ ఉంగరాన్ని తీసుకో, వేరే విధంగా దానితో ప్రయోజనం పొందవచ్చు.” అప్పుడు ఆ సహాబీ అన్నారు, “లేదు. అల్లాహ్ సాక్షిగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసి పారేసిన దానిని నేను ఎన్నడూ తీసుకోను.” ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఉన్నటువంటి గౌరవ అభిమానం. ప్రవక్తకు ఏ విషయం ఇష్టం లేదో, ప్రవక్త తన చేతితో దానిని తీసి పారేశారో, అలాంటి దాని దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి? ఒక విషయాన్ని ప్రవక్త నిషిద్ధం అని అన్నప్పుడు, దానికి నేను ఎందుకు పాల్పడాలి? ఇలాంటి కాంక్ష ఎంత గొప్పగా ఉండిందో గమనించండి.

    ఈ రోజుల్లో, “అరే ఈ తాయెత్తు వేసుకోవద్దు, ఈ ఉంగరం బంగారపుది పురుషులు వేసుకోకూడదు” అని చెప్పినప్పుడు, “సరే, నేను తర్వాత తీసేస్తాను, లేదు ఇంట్లో నేను మా అమ్మతోని ఒకసారి మాట్లాడి ఆ తర్వాత తీస్తాను” ఈ విధంగా మన యొక్క సాకులు ఉంటాయి. కానీ సహాబీ, గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసి పారేసిన విషయానికి దగ్గరగా పోదలుచుకోలేదు.

    1. బంగారపు ఉంగరం వేసుకొనుట నరక శిక్షకు కారణమవుతుంది.
    2. తన శక్తి పరిధిలో ఉన్నప్పుడు మనిషి చెడును తన చేతితో ఖండించాలి. ఎవరికి అధికారం ఉన్నదో వారే చేయాలి, వేరే వారు చేసి ఇంకా నష్టానికి గురికాకూడదు.
    3. పురుషుడు బంగారపు ఉంగరం వేసుకొని ఉంటే, తెలిసిన వెంటనే, ఏ ఆలస్యం చేయకుండా తన చేతిలో నుండి తీసి కనీసం జేబులోనైనా వేసుకోవాలి. కానీ ఇక ఆ చేతిలో ఉంచుకోకూడదు. మెడలో ఉంటే మెడలో నుండి తీసేయాలి. తర్వాత తన ఇంట్లోని స్త్రీలకు ఇవ్వచ్చు, స్త్రీలు దాన్ని ఉపయోగించవచ్చును.
    4. సహాబాలు ప్రవక్త అనుకరణలో ఎంత ముందుగా ఉండేవారన్న విషయం తెలిసింది.

    అయితే ఇక్కడ గమనించండి మరొక విషయం. అదేమిటంటే, ఈ రోజుల్లో కొందరు ఏమంటున్నారు? సరే ఇక బంగారం నిషిద్ధం అన్నారు కదా, మరి వెండిది వేయవచ్చా? “లేదు మా అబ్బాయి వాళ్ళ స్నేహితులు క్లాస్మేట్లు ఎవరో వేసుకున్నారంట, ఇంట్లో వచ్చి అడుగుతున్నాడు, నాకు కూడా ఒక చిన్న ఏదైనా వెండి యొక్క చైన్ ఇవ్వమని, లేదా చేతిలో ఏదైనా చైన్ వేసుకుంటా” అని. లేదు. ఇన్ షా అల్లాహ్ ఆ మాట తర్వాత కూడా వస్తుంది. స్త్రీలు పురుషుల పోలిక, పురుషులు స్త్రీల పోలిక అవలంబించకూడదు అని. కానీ ఇక్కడ ఒక మాట వచ్చింది గనక నేను దాన్ని గుర్తు చేశాను, చెప్పేశాను.

    ఈ పోస్ట్ లింక్ :
    https://teluguislam.net/?p=5351

    ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

    స్త్రీ సుగంధం (సెంట్) పూసుకొని బైటికి వెళ్ళుట [వీడియో| టెక్స్ట్]

    https://youtu.be/kfJHzMYHTnE [7 నిముషాలు]
    వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
    ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

    ఈ ప్రసంగంలో, ఒక స్త్రీ సుగంధం పూసుకుని బయటికి వెళ్లడం ఇస్లాంలో తీవ్రంగా పరిగణించబడే పాపమని హెచ్చరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ప్రకారం, పురుషులు తన సువాసనను ఆఘ్రాణించాలని బయటికి వెళ్లే స్త్రీ వ్యభిచారిణిగా పరిగణించబడుతుందని చెప్పబడింది. ఇంట్లో సుగంధం పూసుకున్న స్త్రీ మస్జిద్ వంటి పవిత్ర స్థలానికి వెళ్లాలనుకున్నా సరే, బయటికి వెళ్లే ముందు తప్పనిసరిగా జనాబత్ స్నానం (సంపూర్ణ స్నానం) చేయాలని, లేకపోతే ఆమె నమాజ్ అంగీకరించబడదని స్పష్టం చేయబడింది. ఆధునిక కాలంలో వివాహాలు, పండుగలు, బజార్లకు, చివరకు రమదాన్‌లో తరావీహ్ నమాజ్‌కు కూడా మహిళలు బలమైన పరిమళాలను ఉపయోగించడం పట్ల విచారం వ్యక్తం చేయబడింది. ఈ చర్యల యొక్క తీవ్రతను అర్థం చేసుకుని, పురుషులు తమ కుటుంబంలోని స్త్రీలకు మార్గనిర్దేశం చేయాలని మరియు స్త్రీలు స్వయంగా ఈ నిషిద్ధతలకు దూరంగా ఉండాలని ఉపదేశించబడింది.

    స్త్రీ సుగంధం పూసుకొని బయటికి వెళ్లుట

    నేను ఆఫీసులో జాబ్ చేస్తున్నానండీ. నేను ఫలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాను, ఫలానా ఫ్యాక్టరీలో పెద్ద మంచి పోస్ట్ ఉంది నాది. అక్కడికి వెళ్ళేటప్పుడు నేను కనీసం ఏదైనా సువాసన పూసుకోకుంటే ఎలా? నేను ఇప్పుడు ఫంక్షన్లో వెళ్లాలి. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వస్తాయి కదా. శ్రద్ధగా వినండి.

    ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో కఠినంగా హెచ్చరించినప్పటికీ స్త్రీలు సువాసనలు పూసుకొని ఇంటి బయటికి వెళ్లుట, పురుషుల ముందు నుండి దాటుట ఈ కాలంలో చాలా ప్రబలిపోతుంది. ప్రవక్త వారి ఆదేశం ఏంటి?

    أَيُّمَا امْرَأَةٍ اسْتَعْطَرَتْ ثُمَّ مَرَّتْ عَلَى الْقَوْمِ لِيَجِدُوا رِيحَهَا فَهِيَ زَانِيَةٌ
    “ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని ఆమె సువాసన పురుషులు ఆఘ్రాణించాలని వారి ముందు నుండి దాటుతుందో ఆమె వ్యభిచారిణి “ (ముస్నద్‌ అహ్మద్‌ 4/418, సహీహుల్‌ జామి 105).

    అవూదుబిల్లాహ్, అవూదుబిల్లాహ్. వింటున్నారా? చూస్తున్నారా?

    కొందరు స్త్రీలు నిర్లక్ష్యపు భావనతో దీనిని చాలా చిన్న విషయం అనుకొని డ్రైవర్, సేల్స్‌మేన్ మరియు పాఠశాలల వాచ్‌మేన్‌ల ముందు నుండి వెళ్తారు, అయితే సువాసన పూసుకున్న స్త్రీ బయటికి వెళ్లదలచినప్పుడు, ఆ బయటికి వెళ్లడం మస్జిద్ లాంటి పవిత్ర స్థలానికైనా సరే, అర్థమవుతుందా?

    ఒక స్త్రీ సువాసన పూసుకొని ఉంది, ఇంట్లో ఉంది. కొంతసేపటి తరవాత అచానక్, యేకాయేక్యిగా బయటికి వెళ్లాలనిపించింది ఏదైనా పని మీద గానీ, లేదా జుమా నమాజ్ సమయం అయితుంది లేదా జుమా ఈరోజు మస్జిద్లో ఏదో పెద్ద ఆలిమ్ వచ్చి ప్రసంగిస్తున్నారు, అక్కడ స్త్రీలకు కూడా పర్దా ఏర్పాటు ఉంది, అయితే మస్జిద్కు వెళ్లాలనుకుంటుంది. ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని ఉన్నదో, ఆ తర్వాత ఆమె బయటికి వెళ్లాలనుకుంటుందో, చివరికి ఆమె మస్జిదుకు వెళ్లాలి అని కోరినా, అక్కడికి వెళ్లేకి ముందు, బయటికి వెళ్లేకి ముందు గుస్లే జనాబత్ చెయ్యాలి. గుస్లే జనాబత్ అంటే పెద్దవారికి తెలిసిన విషయమే. స్వప్న స్థలనం వల్ల లేదా భార్యాభర్తలు కలుసుకోవడం వల్ల ఏ స్థితిలో మనిషి ఉంటాడో దానిని జనాబత్, అశుద్ధత, నాపాకీ అంటారు. దాని వల్ల స్నానం చేయడం విధి అవుతుంది. దానికి స్నానం ఎలా చేయాలి? ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. ఆ రీతిలో స్నానం చేయనంతవరకు ఆమె బయటికి వెళ్లకూడదు. కఠినంగా దీని గురించి ఆదేశం వచ్చింది. శ్రద్ధగా వినండి.

    أَيُّمَا امْرَأَةٍ تَطَيَّبَتْ ثُمَّ خَرَجَتْ إِلَى الْمَسْجِدِ لِيُوجَدَ رِيحُهَا لَمْ يُقْبَلْ مِنْهَا صَلَاةٌ حَتَّى تَغْتَسِلَ اغْتِسَالَهَا مِنْ الْجَنَابَةِ
    “ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని అక్కడ ఉన్నవారు ఆమె సువాసన ఆఘ్రాణించాలని మస్టిద్‌ వస్తుందో, ఆమె జనాబత్‌ వల్ల చేసే విధంగా స్నానం చేసిరానంత వరకు ఆమె నమాజు అంగీకరింపబడదు”. (ముస్నద్‌ అహ్మద్‌ 2/444, సహీహుల్‌ జామి 2703).

    అల్లాహు అక్బర్. నమాజ్ ఎందువల్ల అంగీకరింపబడదు? ఎవరైనా స్త్రీ సువాసన పూసుకొని బయటికి వస్తుంది, పురుషులు ఉంటారు, వారు కూడా ఆ సువాసన పీలుస్తారు, ఇవన్నీ తెలిసి కూడా, స్త్రీ వాటి నుండి జాగ్రత్తపడి రాకుంటే ఎంత భయంకరమైన విషయమో గమనించండి.

    ఈ రోజుల్లో స్త్రీలు ఉపయోగించే సుగంధాలు ఏవైతే కొన్ని రకాలు తెలపడం జరుగుతున్నాయో, ఈ సుగంధాల విషయంలో ఇక అల్లాహ్ తోనే మొరపెట్టుకోవాలి. అల్లాహ్, మా ఈ స్త్రీలకు హిదాయత్ ఇవ్వు అని ఇలా దుఆ చేసుకోవాలి. ఆయనే మనకు మార్గం చూపువాడు. ఎందుకనగా, ఈనాటి స్త్రీలు పెళ్లిళ్లలో, ఉత్సవాల్లో వెళ్లేముందు ఉపయోగించే సాంబ్రాణి ధూపములు, అదేవిధంగా బజారుల్లో, వాహనాల్లో అందరూ ఏకమై కలిసేచోట, చివరికి రమదాన్ మాసంలో తరావీహ్‌ల కొరకు ఏదైతే మస్జిదులో వస్తారో, ఇతర రోజుల్లో మస్జిదులో వెళ్లేటప్పుడు కూడా చాలా సేపటి వరకు మరియు దూరం వరకు ఆఘ్రాణించగల, పీల్చబడే అటువంటి సుగంధములు వాడుతూ ఉంటారు. అయితే ఈ సందర్భాలు ఏవైతే ఇప్పుడు తెలపబడ్డాయో, ఇలాంటి సందర్భాల్లో అలాంటి సువాసనలు వాడడం నిషిద్ధం అని వారు తెలుసుకోవడం లేదు.

    ధర్మపరంగా స్త్రీలు ఉపయోగించవలసిన పరిమళాలు ఎలా ఉండాలి? వాటి రంగు కానరావాలి. కానరావాలి అంటే పర పురుషులకు కాదు. ఇంట్లో ఉన్న స్త్రీలకు లేదా భర్తకు. కానీ సువాసన రాకూడదు. అల్లాహ్, మాలోని కొందరు మూర్ఖ ప్రజలు చేసిన తప్పుల వల్ల మాలోని పుణ్యాత్ములను శిక్షించకు, మా అందరికీ సన్మార్గం ప్రసాదించు ఓ అల్లాహ్. ఆమీన్.

    విషయం అర్థమైందా? మనం మన స్త్రీలను జాగ్రత్తలో, వారి యొక్క అన్ని రకాల పరువు మానాలు భద్రంగా ఉండేందుకు, వారి యొక్క విశ్వాసం కూడా బలంగా ఉండేందుకు, ఇలాంటి నిషిద్ధతలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉంచే ప్రయత్నం మనం పురుషులము, భర్తలము చేయాలి, తండ్రులము చేయాలి. మరియు స్త్రీలు కూడా స్వయంగా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు, భర్తలు గానీ, తండ్రులు గానీ, సోదరులు గానీ మాటిమాటికి చెప్పే అటువంటి పరిస్థితి రానివ్వకూడదు.

    ఈ పోస్ట్ లింక్ :
    https://teluguislam.net/?p=5314

    ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

    అల్లాహ్ యేతరులతో దుఆ చేయు నష్టాలు [వీడియో & టెక్స్ట్]

    అల్లాహ్ యేతరులతో దుఆ చేయు నష్టాలు (خطورة الدعاء مع غير الله)
    వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

    https://www.youtube.com/watch?v=k3vxVbMjq6g [27 నిముషాలు]

    ఈ ప్రసంగంలో, వక్త దుఆ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత మరియు దానిని సరైన పద్ధతిలో ఎలా చేయాలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివరిస్తున్నారు. దుఆ కేవలం అల్లాహ్ కే చెందాలని, ఆయనను కాకుండా ఇతరులను ప్రార్థించడం షిర్క్ (బహుదైవారాధన) మరియు కుఫ్ర్ (అవిశ్వాసం) అవుతుందని స్పష్టం చేస్తున్నారు. దుఆయే అసలైన ఇబాదత్ (ఆరాధన) అని, ఇతరులతో దుఆ చేయడం మహా అన్యాయం మరియు దౌర్జన్యం అని నొక్కిచెప్పారు. అల్లాహ్ ను వదిలి ప్రార్థించబడే వారికి ఎలాంటి శక్తి లేదని, వారు మన మొరలు వినలేరని, సహాయం చేయలేరని మరియు ప్రళయ దినాన మనకు శత్రువులుగా మారిపోతారని ఖురాన్ ఆయతుల ద్వారా హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ప్రతి ఒక్కరూ తమ కష్టసుఖాలలో కేవలం ఏకైక అల్లాహ్ ను మాత్రమే వేడుకోవాలని ఈ ప్రసంగం యొక్క సారాంశం.

    అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
    అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

    సోదర సోదరీమణులారా! దుఆ అల్లాహ్ యేతరులతో చేయడం ఎంత నష్టమో ఎప్పుడైనా మనం గమనించామా? ఈరోజు ఈ అతి ముఖ్యమైన శీర్షికకు సంబంధించిన కొన్ని ఆయతులు దివ్య ఖురాన్ ద్వారా మరియు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక రెండు హదీసులు కూడా మనం విందాము.

    మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఎందరు ప్రవక్తలు గతించారో, వారందరి జాతి వారు ఏ రకమైన షిర్క్ కు పాల్పడ్డారో అందులో అతి భయంకరమైనది, వారిని నరకంలో పడవేసినది అది దుఆ మిన్ దూనిల్లాహ్. అల్లాహ్ తప్ప ఇతరులతో దుఆ చేయడం. ఉదాహరణకు ఎవరైనా అనారోగ్యానికి గురవుతారు, ఎవరిపైనా ఏదైనా కష్టాలు ఆపదలు వస్తాయి, ఎవరికైనా సంతానం కలగదు. ఈ రోజు మనం సమాజంలో చూస్తున్నాము, వారు అల్లాహ్ ను కాకుండా ఇతరులను అర్ధిస్తారు, ఇతరులను ప్రార్థిస్తారు, ఇతరులతో దుఆ చేస్తారు. వారికి సంతానం కలగాలని, వారికి ఆరోగ్యం ప్రాప్తించాలని, వారి కష్టాలు దూరమైపోవాలని. ఇది ఎంత ఘోరమైన పాపమో ఎప్పుడైనా మనం ఆలోచించామా? అయితే నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఖురాన్ ఆయతుల ఆధారంగా కొన్ని ముఖ్య విషయాలు చెబుతున్నాను, ఈ ముఖ్యమైన శీర్షికకు సంబంధించినది. మీరు శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను.

    ఇందులో మొదటి విషయం, అసలు దుఆ ఎవరి హక్కు? అంటే మనం దాసులము, ఎవరితో దుఆ చేయాలి? దీని గురించి ఖురాన్ చాలా స్పష్టంగా మనకు తెలియజేసింది.

    సూరతుర్ రాద్, సూర నెంబర్ 13, ఆయత్ నెంబర్ 14 లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు:

    لَهُ دَعْوَةُ الْحَقِّ
    (లహు ద’వతుల్ హఖ్)
    దుఆ యొక్క హక్కు కేవలం అల్లాహ్ ది మాత్రమే.” (13:14)

    ఆయన తప్ప ఇంకా ఎవరితో దుఆ చేయడం ఇది న్యాయం, ధర్మం ఎంత మాత్రం కాదు.

    ఇంకా, సూరె లుఖ్మాన్, ఆయత్ నెంబర్ 30 లో అల్లాహ్ తెలిపాడు:

    وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ الْبَاطِلُ
    (వ అన్న మా యద్ఊన మిన్ దూనిహిల్ బాతిల్)
    అల్లాహ్ తప్ప వారు ఎవరెవరితో దుఆ చేస్తున్నారో ఇదంతా కూడా వ్యర్థం, వృధా, అసత్యం.” (31:30)

    అల్లాహు అక్బర్, గమనించారా? స్వయంగా మన సృష్టికర్త అయిన అల్లాహ్, మనం ఎవరితో దుఆ చేయాలని మనకు ఆదేశించాడు? ఈ విషయానికి వస్తే, ఖురాన్ లో ఒక సందర్భంలో కాదు, ఎన్నో చోట్ల. ఉదాహరణకు, సూరతు గాఫిర్, దాని యొక్క మరొక పేరు సూరతుల్ మూమిన్, ఆయత్ నెంబర్ 60 లో తెలిపాడు:

    وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ
    (వ ఖాల రబ్బుకుముద్ ఊనీ అస్తజిబ్ లకుమ్)
    మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను (40:60)

    వ ఖాల రబ్బుకుమ్, మీ ప్రభువు మీకు ఈ ఆదేశం ఇస్తున్నాడు, ఉద్’ఊనీ, మీరు నాతో మాత్రమే దుఆ చేయండి, అస్తజిబ్ లకుమ్, నేను మీ దుఆలను అంగీకరిస్తాను. అల్లాహు అక్బర్, గమనించారా? నేను మీ దుఆలను అంగీకరిస్తాను అంటున్నాడు అల్లాహ్ త’ఆలా.

    ఇంకా సోదర మహాశయులారా, దుఆ ఇది అసలైన ఇబాదత్, అసలైన ఆరాధన, అసలైన ప్రార్థన, దుఆ. ఇదే సూరత్, సూరత్ గాఫిర్, సూరతుల్ మూమిన్ ఆయత్ నెంబర్ 60 లో, అల్లాహ్ ఇలా తెలియజేశాడు:

    وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ ۖ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ

    మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే, “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా దాస్యం పట్ల గర్వాహంకారం ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించటం తథ్యం.”( 40:60)

    దుఆ యొక్క ఆదేశం ఇచ్చిన వెంటనే, నా ఆరాధన పట్ల ఎవరైతే అహంకారానికి గురి అవుతాడో అని అంటున్నాడు అల్లాహ్ త’ఆలా, దుఆను ఆరాధన, దుఆ అసలైన ఇబాదత్ అని తెలిపాడు. ఎవరైతే దుఆ చేయరో అల్లాహ్ త’ఆలా తో, ఏం జరుగుతుంది? సయద్ ఖులూన జహన్నమ దాఖిరీన్. అవమానకరంగా వారు నరకంలో ప్రవేశిస్తారు. అల్లాహు అక్బర్. ఇంకా సోదర మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

    الدُّعَاءُ هُوَ الْعِبَادَةُ
    (అద్దుఆఉ హువల్ ఇబాదహ్)
    దుఆ అసలైన ఇబాదత్.

    మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే సూర గాఫిర్ యొక్క ఆయత్ పారాయణం చేశారు.

    అంతేకాదు సోదరులారా, ఒకవైపున అల్లాహ్ త’ఆలా నాతోనే దుఆ చేయండి అని ఏదైతే ఆదేశించాడో, ఇతరుల ఎవరితోనీ దుఆ చేయకండి అని కూడా చెప్పాడు. ఇతరులతో దుఆ చేయడం నిషేధించాడు, వారించాడు. ఉదాహరణకు, సూరత్ యూనుస్ ఆయత్ నెంబర్ 106 లో తెలిపాడు:

    وَلَا تَدْعُ مِن دُونِ اللَّهِ
    (వలా తద్’ఉ మిన్ దూనిల్లాహ్)
    అల్లాహ్ ను వదిలి మీరు ఎవరినీ అర్ధించకండి, ఎవరితో దుఆ చేయకండి.” (10:106)

    సూరతుల్ ఖసస్ ఆయత్ నెంబర్ 88 లో చెప్పాడు:

    وَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ
    (వలా తద్’ఉ మ’అల్లాహి ఇలాహన్ ఆఖర్)
    అల్లాహ్‌తో పాటు మరే దేవుణ్ణీ మొరపెట్టుకోకు. (28:88)

    అల్లాహ్ తో పాటు ఇంకా ఎవరితోనీ కూడా, అల్లాహ్ తో పాటు వేరే ఏ దైవమైనా ఉన్నాడు అని భావించి వారితో మీరు దుఆ చేయకండి. సోదర మహాశయులారా, సూరత్ యూనుస్ మరియు సూరతుల్ ఖసస్ లోని ఈ రెండు ఆయతుల ద్వారా మనకు విషయం ఏం తెలిసింది? అల్లాహ్ తో దుఆ చేయడంతో పాటు ఇతరులతో చేయడం ఇది కూడా నిషేధం. అల్లాహ్ ను వదిలి వేరే ఎవరితోనైనా చేయడం ఇది కూడా నిషిద్ధం. మరి చేయవలసింది ఏంటిది? సూర గాఫిర్ లో మనం తెలుసుకున్నాము, కేవలం అల్లాహ్ తో మాత్రమే దుఆ చేయాలి.

    అయితే, అల్లాహ్ తప్ప ఇతరులతో దుఆ చేయడం వల్ల మనకు నష్టం ఏమిటి? మహా భయంకరమైన నష్టం. అల్లాహ్ తో పాటు ఇతరులతో దుఆ చేయడం గాని, అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేయడం గాని, ఇది షిర్క్ మరియు కుఫ్ర్ లోకి వస్తుంది. బహుదైవారాధనలో లెక్కించడం జరుగుతుంది. సత్య తిరస్కారంలో లెక్కించడం జరుగుతుంది.

    సూరతున్ నహల్ ఆయత్ నెంబర్ 86 గమనించండి.

    وَإِذَا رَأَى الَّذِينَ أَشْرَكُوا شُرَكَاءَهُمْ
    (వ ఇదా ర అల్లజీన అష్రకూ షురకాఅహుమ్)
    ఈ ముష్రిక్కులు తాము (అల్లాహ్‌కు) భాగస్వాములుగా నిలబెట్టే వారిని చూడగానే..”

    షిర్క్ చేసినటువంటి వారు, అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వాములుగా కల్పించిన వారు తమ భాగస్వాములను చూస్తారు. ఎప్పుడు ఇది? ప్రళయ దినాన. చూసి ఏమంటారు?

    قَالُوا رَبَّنَا هَٰؤُلَاءِ شُرَكَاؤُنَا الَّذِينَ كُنَّا نَدْعُو مِن دُونِكَ
    (ఖాలూ రబ్బనా హాఉలాఇ షురకాఉనల్లజీన కున్నా నద్’ఊ మిన్ దూనిక్)
    “ఓ మా ప్రభూ! మేము నిన్ను వదిలేసి మొరపెట్టుకున్న మా భాగస్వాములు వీరే” అని అంటారు” (16:86)

    గమనిస్తున్నారా సోదరులారా? చదవండి మీరు సూరతున్ నహల్, సూర నెంబర్ 16, ఆయత్ నెంబర్ 86. ప్రళయ దినాన అందరూ హాజరవుతారు కదా, దుఆ చేసిన వారు ఎవరితోనైతే దుఆ చేయడం జరిగిందో. ఎప్పుడైతే వారిని చూస్తారో, “ఓ మా ప్రభువా, నిన్ను వదిలి మేము వారితో దుఆ చేసాము, వారిని మేము నీకు భాగస్వామిగా చేసాము. ఈరోజు వారు మాకు ఏమీ లాభం చేయడం లేదు” అని మొరపెట్టుకుంటారు. అయితే ఈ ఆయత్ లో మనకు చాలా స్పష్టంగా తెలిసింది, వారు స్వయంగా ఒప్పుకుంటున్నారు మేము ఈ షిర్క్ పని చేసాము అని.

    అయితే, సూరతుల్ ఆరాఫ్, సూర నెంబర్ 7, ఆయత్ నెంబర్ 37 కూడా మీరు గమనించండి. మీరు కూడా స్వయంగా తెలుగు ఖురాన్ అనువాదాలు తీసి చదవండి, చూడండి, పరిశీలించండి. ఒక విషయం.. క్షమించండి, నేను నా టాపిక్ కు కొంచెం దూరమై ఒక విషయం మీకు అర్థం కావడానికి తెలియజేస్తున్నాను. మనం జానెడు కడుపులో పోయే కూడు తినడానికి మార్కెట్ లోకి వెళ్లి బియ్యం ఏ రకమైనది, ఈ టమాటాలు పాడు అయినాయా, మంచియా, ఉల్లిగడ్డ మంచిగుందా లేదా, ఈ కూరగాయలు మంచియా లేవా, ఒక్కొక్కటి ఏరుకొని మంచి మంచివి తీసుకొని వస్తాము కదా. మన స్వర్గం విషయానికి, ఏ ధర్మ జ్ఞానం మనం నేర్చుకోవాల్సి ఉందో దానిని కూడా మనం వెతకాలి, పరిశీలించాలి, సత్యం ఏదో తెలుసుకోవాలి. సూరతుల్ ఆరాఫ్ ఆయత్ నెంబర్ 37:

    حَتَّىٰ إِذَا جَاءَتْهُمْ رُسُلُنَا يَتَوَفَّوْنَهُمْ قَالُوا أَيْنَ مَا كُنتُمْ تَدْعُونَ مِن دُونِ اللَّهِ ۖ قَالُوا ضَلُّوا عَنَّا وَشَهِدُوا عَلَىٰ أَنفُسِهِمْ أَنَّهُمْ كَانُوا كَافِرِينَ

    ఆఖరికి మా దూతలు వారి ప్రాణాలు స్వాధీనం చేసుకోవటానికి వారివద్దకు వచ్చినప్పుడు “అల్లాహ్‌ను వదలి మీరు ఆరాధిస్తూ ఉన్నవారు ఇప్పుడెక్కడున్నారు?” అని అడుగుతారు. “వారంతా మా వద్ద నుంచి మటుమాయమై పోయారు” అని వాళ్ళు చెబుతారు. తాము అవిశ్వాసులుగా ఉండేవారన్న విషయాన్ని గురించి వారు స్వయంగా సాక్ష్యమిస్తారు.. (7:37)

    అప్పుడు వారు తమకు తాము సాక్ష్యం పలుకుతారు, “అయ్యో, మేము ఎంత కుఫ్ర్ పని చేసాము, ఎంత అవిశ్వాసానికి పాల్పడే పని చేసాము, సత్య తిరస్కారంలో మేము పడి ఉన్నాము“. అయితే ఏం తెలిసింది? అల్లాహ్ తో కాకుండా లేదా అల్లాహ్ తో పాటు ఇతరులతో దుఆ చేయడం షిర్క్, కుఫ్ర్ లో వస్తుంది మరియు వారు ఏమీ వారికి లాభం చేకూర్చలేదు. వారు ఏమీ లాభం చేకూర్చరు అన్న విషయం ఇంకా ఎన్నో ఆయతుల ద్వారా ఇన్ షా అల్లాహ్ నేను తెలియజేస్తున్నాను.

    అంతేకాదు సోదర మహాశయులారా, అల్లాహ్ ను వదిలి లేదా అల్లాహ్ తో పాటు ఇంకా వేరే వారితో కూడా దుఆ చేయడం ఇది మహా అన్యాయం, మహా దౌర్జన్యం. ఏ కొందరు యువకులు తమ జాతి వారిని ఎదిరించి, జాతి వారందరూ కూడా షిర్క్ పనులు చేస్తున్నారు, తౌహీద్ కు దూరమై ఉన్నారు, వారు కేవలం అల్లాహ్ ను మాత్రమే, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి అన్న తపనతో తమ గ్రామం నుండి కూడా దూరమయ్యారు. ఆ సందర్భంలో వారు ఏమంటారు, సూరతుల్ కహఫ్ ఆయత్ నెంబర్ 14:

    لَّن نَّدْعُوَ مِن دُونِهِ إِلَٰهًا ۖ لَّقَدْ قُلْنَا إِذًا شَطَطًا
    (లన్ నద్’ఉవ మిన్ దూనిహి ఇలాహన్, లఖద్ ఖుల్నా ఇదన్ షతతా)
    మేము ఆయన్ని తప్ప వేరొక ఆరాధ్య దైవాన్ని పిలవటమన్నది జరగని పని. ఒకవేళ మేము గనక అలా చేస్తే ఎంతో దుర్మార్గపు మాటను పలికిన వారమవుతాము.” (18:14)

    లన్ నద్’ఉవ మిన్ దూనిహీ ఇలాహా. మేము అల్లాహ్ ను వదిలి వేరే ఏ భూటకపు దైవాలను మేము ఆరాధించము. అల్లాహ్ ను వదిలి వేరే ఏ దైవంతో మేము దుఆ చేయము. ప్రజలు ఎవరెవరినైతే దైవాలుగా భావిస్తున్నారో, వారి దృష్టిలో, వారి యొక్క అభిప్రాయం ప్రకారం వారు దేవుళ్ళు కావచ్చు, కానీ సత్యమైన దేవుడు కేవలం అల్లాహ్. సత్యమైన ఆరాధ్యుడు కేవలం అల్లాహ్. ఆయన్ని తప్ప మేము ఇంకా ఎవరితో దుఆ చేయము. లఖద్ ఖుల్నా ఇజన్ షతతా. ఒకవేళ మేము ఇలా చేసి ఉంటే ఇది మహా దౌర్జన్యం అయిపోతుంది. గమనించారా? 

    అంతేకాదు, అల్లాహ్ ను తప్ప వేరే ఎవరితోనైనా దుఆ చేయడం, అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఎవరితోనైనా దుఆ చేయడం… మహాశయులారా, ఇది అల్లాహ్ యొక్క శిక్షకు గురి చేసే విషయం. అవును, అల్లాహ్ యొక్క శిక్షకు గురి చేసే విషయం. చదవండి ఖురాన్ లో. సూరతుష్ షుఅరా ఆయత్ నెంబర్ 213 లో అల్లాహ్ తెలిపాడు:

    فَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَكُونَ مِنَ الْمُعَذَّبِينَ
    (ఫలా తద్’ఉ మ’అల్లాహి ఇలాహన్ ఆఖర ఫతకూన మినల్ ము’అద్దబీన్)
    కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు అల్లాహ్‌తోపాటు మరే ఇతర దైవాన్నీ మొరపెట్టుకోకు. నువ్వుగాని అలా చేశావంటే శిక్షించబడేవారిలో చేరిపోతావు సుమా!” (26:213)

    ఫలా తద్వు మఅల్లాహి ఇలాహన్ ఆఖర్. అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఏ దైవంతో మీరు దుఆ చేయకండి. ఫతకూన మినల్ ముఅజ్జబీన్. అలా చేశావంటే, అలా చేశారంటే శిక్ష ఇవ్వబడిన వారిలో ఎవరికైతే శిక్ష పడుతుందో వారిలో మీరు కలిసిపోతారు. అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరిని ఇహలోకం, పరలోకం అన్ని రకాల శిక్షల నుండి దూరం చేయుగాక, దూరం ఉంచుగాక. మరియు శిక్షలకు గురి చేసే ప్రతి పాపం నుండి కూడా అల్లాహ్ మనల్ని దూరం ఉంచుగాక.

    అంతేకాదు, చివరిలో ఒక రెండు ముఖ్యమైన విషయాలు అవేమిటంటే, అల్లాహ్ ను కాకుండా ఎవరినైతే ఆరాధిస్తారో, అల్లాహ్ ను కాకుండా లేదా అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఎవరితోనైతే దుఆ చేస్తారో, వారిలో ఏ శక్తి లేదు. మన మొరలు వినడానికి, మనం వేడుకునే వాటిని ఇవ్వడానికి, మన కష్ట దుఃఖాలు దూరం చేయడానికి, సుఖాలు ప్రసాదించడానికి, ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వడానికి వారిలో ఏ శక్తి లేదు అని అల్లాహ్ చాలా స్పష్టంగా తెలిపాడు. ఒకవేళ వాస్తవంగా అల్లాహ్ ను నమ్మేవారయ్యేది ఉంటే ఈ ఆయతులను చాలా శ్రద్ధగా మనం అర్థం చేసుకోవాలి. సూరత్ ఫాతిర్, ఆయత్ నెంబర్ 13, 14.

    وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍ
    (వల్లదీన తద్’ఊన మిన్ దూనిహి మా యమ్లికూన మిన్ ఖిత్మీర్)
    ఆయన్ని వదలి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారో వారు ఖర్జూరపు టెంకపై ఉండే పొరకు కూడా యజమానులు కారు.” (35:13)

    إِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ ۚ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍ
    ఒకవేళ మీరు వారిని మొర పెట్టుకున్నా, వారు మీ మొరను ఆలకించరు. ఒకవేళ ఆలకించినా, మీ అక్కరను తీర్చలేరు. పైపెచ్చు ప్రళయదినాన మీరు కల్పించే భాగస్వామ్యాన్ని (షిర్క్‌ను) వారు (సూటిగా) త్రోసిపుచ్చుతారు. అన్నీ తెలిసిన దేవుని మాదిరిగా (సావధానపరిచే సమాచారాన్ని) నీకు తెలిపే వాడెవడూ ఉండడు సుమా! (35:14)

    (వల్లజీన తద్వూన మిన్ దూనిహీ). మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే దుఆ చేస్తారో, ఎవరితోనైతే దుఆ చేస్తారో, (మా యమ్లికూన మిన్ కిత్మీర్). ఖర్జూరపు బీజము మీద ఉండేటువంటి సన్నని ఆ పొర. అంతమాత్రం కూడా వారికి ఏ శక్తి లేదు. (ఇన్ తద్వూహుం లా యస్మవూ దుఆఅకుం). మీరు వారితో దుఆ చేస్తే మీ దుఆలను వారు వినలేరు. గమనించండి. సూరత్ ఫాతిర్ ఆయత్ 13, 14. మీరు అల్లాహ్ ను వదిలి ఎవరితోనైతే దుఆ చేస్తారో, వారు ఖర్జూరపు బీజము మీద ఉండేటువంటి సన్నని ఆ పొర ఏదైతే ఉంటుందో అంత మందం కూడా శక్తి కలిగి లేరు. మీరు వారిని అడిగితే, వారితో దుఆ చేస్తే వారు వినరు. కానీ ఈ రోజుల్లో ఎంతో మంది ఉన్నారు కదా, వింటారు అన్నటువంటి మూఢనమ్మకంలో. అయితే అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి. (వలవ్ సమీవూ మస్తజాబూ లకుం). మీ మూఢనమ్మకాల ప్రకారంగా వారు వింటారు అని ఏదైతే అనుకుంటున్నారో, అలా జరిగినా ఎప్పుడైనా, ఏదైనా సందర్భంలో ఒక పరీక్షగా మేము వారికి వినిపించినా, వారు మీ దుఆలకు సమాధానం చెప్పలేరు.

    (వ యౌమల్ ఖియామతి యక్ఫురూన బిషిర్కికుం). మీరు ఈ షిర్క్ ఏదైతే చేస్తున్నారో, దుఆ ఇతరులతో చేసి ఏ భాగస్వామ్యం కల్పింపజేస్తున్నారో, దీనిని వారు ప్రళయ దినాన తిరస్కరిస్తారు. (వలా యునబ్బిఉక మిస్లు ఖబీర్). సూక్ష్మ జ్ఞాని అయిన అల్లాహ్ ఆయన తెలిపినటువంటి విషయాలు మీకు తెలిపేవాడు ఇంకా వేరే ఎవడు లేడు.

    అలాగే సోదర మహాశయులారా, సూరత్ సబా ఆయత్ నెంబర్ 22 ఒకసారి గమనించండి మీరు.

    قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِن شِرْكٍ وَمَا لَهُ مِنْهُم مِّن ظَهِيرٍ

    (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవంత అధికారంగానీ, వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్‌కు సహాయకుడు కూడా కాడు. (34:22)

    (ఖులిద్ వుల్లజీన జఅంతుం మిన్ దూనిల్లాహ్). మీ మూఢనమ్మకం ప్రకారం అల్లాహ్ ను వదిలి ఎవరెవరిని మీరు ఆరాధిస్తారో, ఎవరెవరిని పూజిస్తారో, ఎవరెవరితో దుఆ చేస్తారో, (ఉద్వూ), మీరు దుఆ చేసి చూడండి. వారిలో ఏముంది? (లా యమ్లికూన మిస్కాల జర్రతిన్ ఫిస్సమావాతి వలా ఫిల్ అర్జ్). ఆకాశాల్లో, భూమిలో రవ్వంత దానికి వారు అధికారం కలిగి లేరు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఇంతకుముందు ఏం చెప్పాడు? సూరె ఫాతిర్ లో, ఖర్జూరపు బీజం మీద ఉండేటువంటి ఒక పొర అంతటి అధికారం కూడా వారికి లేదు. ఇక్కడ జర్రహ్, అణువు. కళ్ళతో కనబడదు మనకు. అంతటి అధికారం కూడా వారిలో లేదు. ఇంకా, (వమాలహుం ఫీహిమా మిన్ షిర్క్). భూమి ఆకాశాల్లో వారికి ఏ భాగస్వామ్యం లేదు.

    అల్లాహ్ క్షమించుగాక, అల్లాహ్ కు కాదు ఒక ఉదాహరణ, పోలిక, మనకు అర్థం కావడానికి ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాను. కొన్ని సందర్భంలో ఏమవుతుంది? నా వద్ద ఒక్క పైసా కూడా లేకపోవచ్చు. కానీ నేను ఒకరితో బిజినెస్ లో పార్ట్నర్ కావచ్చు కదా. ఏదైనా పనిలో నేను పొత్తు కలవవచ్చు కదా. ఈ విధంగా ప్రజలు ఏమనుకుంటారు? అరే, అతడు ఫలానా కంపెనీలో ఒక పార్ట్నర్ గా ఉన్నాడు, ఎంతటి మహానుభావుడో అని అనుకుంటాం కదా. అయితే అల్లాహ్ ఇలాంటి భావాన్ని కూడా ఎట్లా దూరం చేస్తున్నాడో గమనించండి. వారికి అణువంత అధికారం కూడా లేదు ఆకాశాల్లో గాని, భూమిలో గాని. అంతేకాదు వారు ఈ భూమి ఆకాశాల్లో అల్లాహ్ కు ఏ పార్ట్నర్ కారు, ఏ భాగస్వామి కారు. అంతెందుకు, కొందరు ఇహలోకం ప్రకారంగా చూసుకుంటే ఏ అధికారం ఉండదు, పార్ట్నర్ ఉండడు. కానీ ఒకరి కంపెనీ నడపడానికి, ఒకరి పని పూర్తి అవ్వడానికి ఏదో తన ఛాయాశక్తి కొంచెం సపోర్ట్ అయినా ఇస్తాడు కదా. అల్లాహ్ ఇలాంటి దానిని కూడా ఖండించాడు. ఏం చెప్పాడు? (వమాలహుం మిన్హుం మిన్ జహీర్). మీరు ఎవరెవరితోనైతే దుఆలు చేస్తున్నారో వారిలో ఏ ఒక్కడు కూడా అల్లాహ్ కు ఎలాంటి మద్దతునిచ్చేవాడు కాదు, ఎలాంటి సహాయం అందించేవాడు కాదు.

    ఇక మీరు అలాంటి వారితో ఎందుకు దుఆ చేస్తున్నారు అని అల్లా రబ్బుల్ ఆలమీన్ హెచ్చరిస్తున్నాడు. అల్లాహు అక్బర్. గమనించండి సోదరులారా.

    ప్రత్యేకంగా ఎవరైతే అల్లాహ్ ను కాకుండా వేరే ఎవరెవరినైతే ఆరాధిస్తున్నారో, పూజిస్తున్నారో, దుఆలు చేస్తున్నారో, అర్ధిస్తున్నారో, వారి యొక్క స్థితి ఏమిటి? ఇంకా, వారు ఏమైనా ప్రళయ దినాన మనకు లాభం కలగజేస్తారా? ఉపయోగపడతారా? అది కూడా జరగదు. సూరతుల్ అహ్కాఫ్ ఆయత్ నెంబర్ ఐదు, ఆరు వినండి.

    وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ
    అల్లాహ్ ను వదలి ప్రళయదినం వరకూ తన మొరను ఆమోదించలేని వారిని, పైగా తను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని మొరపెట్టుకునేవానికన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు? (46:5)

    وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ
    మానవులంతా సమీకరించబడినపుడు వారు వారికి (తమ భక్తులకు) శత్రువులై పోతారు. వీళ్ళ పూజాపురస్కారాలను కూడా వాళ్ళు త్రోసిపుచ్చుతారు. (46:6)

    (వ మన్ అదల్లు మిమ్మన్ యద్వూ మిన్ దూనిల్లాహ్). ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేస్తున్నారో వారి కంటే మార్గభ్రష్టులు ఇంకా వేరే ఎవరు లేరు. నేననడం లేదు, ఖురాన్ తీసి చూడండి మీరు. వ మన్ అదల్లు, అతని కంటే మార్గభ్రష్టత్వంలో ఇంకా ఎవరు లేరు. ఎవరు? ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేస్తున్నాడో. ఎలాంటి వారితో దుఆ చేస్తున్నాడు? (మల్లా యస్తజీబు లహు ఇలా యౌమిల్ ఖియామ). ప్రళయ దినం వరకు అతని దుఆలను అంగీకరించడం గాని, దుఆకు సమాధానం గాని చెప్పలేని వారు. అంతేకాదు, (వహుం అన్ దుఆఇహిం గాఫిలూన్). వారు వీరు చేసే దుఆలకు ఏ సంబంధం లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. వారికి తెలియనే తెలియదు, ఎవరో వచ్చి మా సమాధుల వద్ద, ఎవరో మా పేరును తీసుకొని దుఆలు చేస్తున్నారు అని.

    (వ ఇజా హుషిరన్నాస్). ప్రళయ దినాన ఎప్పుడైతే సమూహ పరచడం జరుగుతుందో, (కానూ లహుం అదాఅ). ఈ దుఆ చేసేవారు, ఎవరితోనైతే దుఆ చేయడం జరిగిందో వారందరూ పరస్పరం శత్రువులైపోతారు. (వ కానూ బి ఇబాదతిహిం కాఫిరీన్). మరియు వారి యొక్క ఆరాధనలో, వారి యొక్క దుఆలు వాటి గురించి ఇంకార్ చేస్తారు, రద్దు చేస్తారు. వీరు మమ్మల్ని ఆరాధించలేదు, మాతోని దుఆ చేయలేదు అని స్పష్టంగా తెలియజేస్తారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహ్ క్షమించుగాక, ఇహలోక ప్రకారంగా నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను, గమనించండి.

    ఉదాహరణకు నీవు ఏదైనా ఆపదలో ఇరుక్కున్నావు. కోర్టులో వెళ్ళవలసి వచ్చింది. ఏం జరిగింది? ఫలానా వకీల్ చాలా పేరు గలవాడు. ఫలానా లాయర్ ఎంతో పేరు గాంచిన వాడు. అతనిని నేను పిలిపించుకుంటే నన్ను ఎట్లనైనా ఈ కేసులో నుండి బయటికి తీసేస్తాడు అని అనుకున్నావు. అతడు వచ్చాడు. వచ్చిన తర్వాత, నీవు అనుకుంటున్నావు ఈ కేసు ఈ కోర్టులో ఆ వకీల్, ఆ లాయర్ నీకు సపోర్ట్ చేసి నీ తరఫు నుండి మాట్లాడి నిన్ను జైలు పాలు కాకుండా, శిక్షకు గురి కాకుండా కాపాడుకుంటాడు అని. తీరా సమయం వచ్చే వరకు ఏం జరిగింది? నీకు వ్యతిరేకమైపోయాడు. అతడు నీకు వ్యతిరేకమైపోయాడు. నీవు ఇంకా పాపంలో ఉన్నావు, నీ పై ఈ అపరాధం అన్నట్టుగా ఎన్నో సాక్షాలు తెచ్చి ఇరికించే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఏమవుతుంది పరిస్థితి గమనించండి. ఇంతకంటే మరీ భయంకరమైన, ఘోరమైన పరిస్థితి అక్కడ రానుంది. అల్లాహ్ మనందరిని కూడా కాపాడుగాక.

    ఖురాన్ లో మనం గమనిస్తే, ఆదం అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, యూనుస్ అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాం, సులేమాన్ అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం, యూసుఫ్ అలైహిస్సలాం, షుఐబ్ అలైహిస్సలాం, హూద్ అలైహిస్సలాం, జకరియా అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సుమారు 16 ప్రవక్తలు, వారు అల్లాహ్ తో ఏ దుఆ చేశారో, ఎలా ఎలా మొరపెట్టుకున్నారో ఆ దుఆల ప్రస్తావనలన్నీ కూడా ఖురాన్ లో ఉన్నాయి. ఎక్కడా కూడా వారు అల్లాహ్ తప్ప ఇతరులతో మొరపెట్టుకోలేదు. నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను? ఈ ప్రవక్తల సరైన మార్గాన్ని మనం అవలంబించినప్పుడే కదా మనకు మోక్షం లభించేది.

    అంతేకాదు, అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో ఎందరో పుణ్యాత్ముల గురించి కూడా తెలిపాడు. ఉదాహరణకు, ఇమ్రాన్ యొక్క భార్య, ఫిరౌన్ యొక్క భార్య మరియు బిల్ఖీస్ రాణి మరియు ఆ గుహలో, సూర కహఫ్ లో వచ్చిన ప్రస్తావన ఉన్నవారు. ఇంకా విశ్వాసులు, ఎవరైతే ఒక తోటకు అధికారి అయ్యారో వారి యొక్క సంఘటన ఉంది. ఈ విధంగా ఇంకా ఎందరో సంఘటనలు ఖురాన్ లో ఉన్నాయి. వారందరూ కూడా వారి కష్ట సమయాల్లో కేవలం ఏకభాగస్వామ్యం లేకుండా అల్లాహ్ తోనే దుఆ చేశారు, అల్లాహ్ నే మొరపెట్టుకున్నారు.

    అందు గురించి సోదరులారా, ఇదే పని మనం కూడా చేయాలి. ఒకవేళ అల్లాహ్ ను కాకుండా వేరే ఎవరినైనా మనం మొరపెట్టుకున్నామో, వేరే ఎవరితోనైనా దుఆ చేసాము అంటే షిర్క్ లో పడిపోతాము, కుఫ్ర్ లో పడిపోతాము, మహా దౌర్జన్యం చేసిన వారమవుతాము, అల్లాహ్ యొక్క శిక్షకు గురి కావలసి వస్తుంది. అంతేకాకుండా అల్లాహ్ ను కాదని మనం ఎవరెవరినీ మొరపెట్టుకుంటామో ఎవరూ కూడా మనకు ఇహలోకంలో పనికిరారు. పరలోకంలోనైతే ఏమాత్రం మనకు లాభం చేకూర్చరు.

    అల్లాహ్ మనందరినీ కాపాడుగాక, రక్షించుగాక. ఎల్లవేళల్లో కేవలం అల్లాహ్ తో మాత్రమే దుఆ చేస్తూ ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తప్ప వేరే ఎవరెవరితో మనం ఇంతవరకు తెలిసి తెలియక, అజ్ఞానంలో ఉండి ఏమైతే చేసామో, అల్లాహ్ ఆ పాపాలన్నిటినీ కూడా క్షమించి, మన్నించి మనల్ని తన యొక్క పవిత్రమైన పుణ్య దాసుల్లో చేర్చుగాక.

    వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

    వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

    ఈ పోస్ట్ లింక్ :
    https://teluguislam.net/?p=5159


    ఇస్లాం ధర్మం సంపూర్ణమయింది. కొత్త పోకడలు , నూతన ఆచారాలను సృష్టించరాదు [వీడియో, టెక్స్ట్ ]

    ఇస్లాం ధర్మం సంపూర్ణమయింది, కొత్త పోకడలు , నూతన ఆచారాలను సృష్టించరాదు
    కూర్పు : ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
    https://www.youtube.com/watch?v=s1wHqzntmgE [5 నిముషాలు]

    ఈ ప్రసంగంలో వక్త, సూరహ్ అల్ మాయిదాలోని 3వ ఆయతును వివరిస్తూ, అల్లాహ్ ఇస్లాం ధర్మాన్ని ఎలా సంపూర్ణం చేశాడో తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణానికి సుమారు 83-84 రోజుల ముందు, అరఫా మైదానంలో అవతరించిన ఈ ఆయతు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, దీని గురించి ఒక యూదు పండితుడు మరియు ఉమర్ (రదియల్లాహు అన్హు) మధ్య జరిగిన సంభాషణను సహీహ్ బుఖారీ హదీసు ద్వారా ఉదహరించారు. నిండుగా ఉన్న గ్లాసులో నీరు ఎలాగైతే ఇంకా పట్టదో, అలాగే సంపూర్ణమైన ఇస్లాంలో కొత్తగా చేర్చడానికి ఏమీ లేదని స్పష్టం చేశారు. చివరగా, ధర్మంలో లేని మొహర్రం పీరీలు, రజబ్ కుండల వంటి బిద్అత్ (నూతన కల్పనల) కు ఆస్కారం లేదని, ఖురాన్ మరియు హదీసులను మాత్రమే అనుసరించాలని హెచ్చరించారు.

    ధర్మం పరిపూర్ణం చేయబడింది

    అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

    మహాశయులారా ! సూరతుల్ మాయిదా ఆయతు నంబర్ మూడులోని ఒక భాగం:

    అల్లాహ్ ఏమంటున్నాడు?

    الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا
    [అల్ యౌమ అక్ మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్ మమ్తు అలైకుమ్ నిఅమతీ వ రజీతు లకుముల్ ఇస్లామ దీనా]
    ఈరోజు నేను మీ ధర్మాన్ని సంపూర్ణం చేశాను మరియు నా యొక్క అనుగ్రహాన్ని మీపై పరిపూర్ణం చేశాను మరియు మీ కొరకు ఇస్లాంను మీ ధర్మంగా ఇష్టపడ్డాను”.(5:3)

    ఈ ఆయతు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణాని కంటే 83, 84 రోజుల ముందు మాత్రమే అవతరించింది. అంటే ఇంచుమించు ప్రవక్త జీవితంలోని చివరి రోజుల్లో అవతరించింది. ఈ ఆయతు ఎంత గొప్ప ఆయతు, ఇందులో ఎంత గొప్ప సందేశం ఇవ్వబడింది అంటే, సహీహ్ బుఖారీలో ఈ హదీస్ వచ్చి ఉంది.

    యూదులలోని ధర్మ పండితుడు హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హుతో కలిసి, “ఓ ఉమర్! మీ ఖురాన్ లో ఒక ఆయతు ఉంది, అది గనక తౌరాత్ లో అవతరించి ఉంటే, ఆ అవతరించిన దినాన్ని మేము పండుగ రోజుగా చేసుకునేవాళ్ళము” అన్నాడు. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు అడిగారు, “ఏ ఆయతు గురించి నీవు అంటున్నావు?”. ఆ యూదుడు:

    الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا
    [అల్ యౌమ అక్ మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్ మమ్తు అలైకుమ్ నిఅమతీ వ రజీతు లకుముల్ ఇస్లామ దీనా]

    అని చదివి వినిపించాడు.

    హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు తెలిపారు: “నాకు తెలుసు, ఇది ఏ రోజు అవతరించింది, ఏ సందర్భంలో అవతరించింది, ఏ ప్రదేశంలో అవతరించింది, అప్పుడు ప్రవక్త ఎక్కడ ఏ స్థితిలో ఉన్నారో నాకు బాగా తెలుసు. అది విశ్వాసుల కొరకు ఒక వీక్లీ ఫెస్టివల్ (వారాంతపు పండుగ) లాంటిది, అంటే వారము రోజుల్లో ఒక రోజు ఏదైతే పండుగ రోజుగా ఉందో, ‘ఈదుల్ మోమినిన్’ జుమా రోజు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అరఫాత్ మైదానంలో లక్ష కంటే పైగా సహాబాల మధ్యలో నిలబడి ఉన్నారు. ఆ సందర్భంలో ఈ ఆయతు అవతరించింది. ఈ రకంగా ఆ రోజు ముస్లింల కొరకు రెండు రెండు పండుగలు ఉండేవి, అప్పుడు అవతరించింది”.

    అంటే దీని భావం ఏంటో అర్థమైందా మీకు? అల్లాహ్ యే ఇస్లాం ధర్మాన్ని ఇక సంపూర్ణం చేశాడు. ఇస్లాం ధర్మమే సర్వ మానవాళి కొరకు అతి పెద్ద అనుగ్రహం, అతి గొప్ప వరం. దీనిని అల్లాహ్ యే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై పరిపూర్ణం చేశాడు. ఇక సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా, ఒక గ్లాస్ ఈ గ్లాస్ నీళ్లతో సంపూర్ణంగా నిండి ఉన్నది అని ఎప్పుడైతే మనం అంటామో, అందులో ఇంకా నీళ్లు చేర్చడానికి ఏదైనా అవకాశం ఉంటుందా? ఉండదు కదా.

    అలాగే ఈ ధర్మం సంపూర్ణమైనది అని అంటే, ఇందులో ఏ విషయాన్ని కూడా మనం ధర్మం పేరుతో కలపడానికి, యాడ్ చేయడానికి అవకాశం లేదు, అలాంటి అవసరం లేనే లేదు. మరియు సంపూర్ణమైనది అన్నదానికి మరొక భావం, ఇందులో నుండి ఏ విషయం కూడా తీయకూడదు. అందుగురించే ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి ఏం తెలిపారు? “ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణాని కంటే ముందు ఏదైతే ధర్మంగా ఉండినదో, అదే ధర్మం. ఆ తర్వాత ఏవైనా విషయాలు పుట్టుకొచ్చాయి అంటే అవి ధర్మంలోనివి కావు. ఎందుకంటే అల్లాహ్ అంటున్నాడు, “ఈరోజు నేను మీ ధర్మాన్ని సంపూర్ణం చేశాను”.

    ఇక మొహర్రం మాసంలో నిలబెట్టే పీరీలు గాని, వాటికి సంబంధించిన ఎన్ని దురాచారాలు, షిర్క్ పనులు ఉన్నాయో. రజబ్ మాసంలో రజబ్ కే కుండే అని, లేదా ఇంకా వేరే రోజుల్లో ఏ ఏ ఉత్సవాలు పండుగల పేరు మీద ముస్లింలు జరుపుకుంటున్నారో, అవి వాస్తవానికి వాటి ప్రస్తావన ఖురాన్ లో ఉన్నాయా? హదీసులో వాటి ప్రస్తావన ఉందా? మనం తప్పకుండా తెలుసుకోవాలి. లేని విషయాల్ని వదిలేసేయాలి. లేదా అంటే మనం చాలా నష్టానికి గురవుతాము.

    వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.