అన్నపానీయాల ఆదేశాలు -1 [వీడియో]

బిస్మిల్లాహ్

[14:55 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

అన్నపానీయాల ఆదేశాలు

అల్లాహ్ తన దాసులకు పవిత్రమైన వస్తువులు తినుటకు ఆదేశించి, అపవిత్రమైన వాటిని వారిం- చాడు. అల్లాహ్ ఆదేశం సూర బఖర 2:172లో:

[يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا كُلُوا مِنْ طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ]
ఓ విశ్వాసులారా! మేమొసంగిన పవిత్ర వస్తువులను భుజించండి“.  (2:172)

అన్నపానీయాల విషయంలో నియమం ఏమిటంటే: నిషేధింపబడిన కొన్ని వస్తువులు తప్ప అన్నియూ ధర్మసమ్మతమే (హలాల్). అల్లాహ్ తన దాసుల కొరకు పవిత్ర వస్తువులను ధర్మసమ్మతం చేసింది వారు వాటి నుండి ప్రయోజనం పొందాలని. అయితే వాటిని అల్లాహ్ అవిధేయత కొరకు ఉపయోగించుట ఎంత మాత్రం యోగ్యం కాదు.

తిను త్రాగు వస్తువుల్లో అల్లాహ్ తన దాసుల కొరకు నిషేధించిందేమిటో ఇలా స్పష్టపరిచాడు.

[وَقَدْ فَصَّلَ لَكُمْ مَا حَرَّمَ عَلَيْكُمْ إِلَّا مَا اضْطُرِرْتُمْ إِلَيْهِ ] {الأنعام:119}

వాస్తవానికి గత్యంతరంలేని సంకట పరిస్థితులలో తప్ప, మిగతా అన్ని పరిస్థితులలోనూ అల్లాహ్ ఏ వస్తువుల వినియోగాన్ని నిషేధించాడో, వాటి వివరాలను మీకు ఆయన ఇది వరకే తెలియజేశాడు“. (అన్ఆమ్ 6: 119).

ఏ వస్తువు నిషిద్ధం అని తెలుపబడలేదో అది ధర్మసమ్మతం అన్న మాట. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు:

إِنَّ اللهَ فَرَضَ فَرَائِضَ؛ فَلاَ تُضَيِّعُوْهَا، وَحَدَّ حُدُوْدًا؛ فَلاَ تَعْتَدُوهَا، وَحَرَّمَ أَشْيَاء؛ فَلاَ تَنْتَهِكُوْهَا، وَسَكَتَ عَنْ أَشْيَاءَ رَحْمَةً لَكُمْ مِنْ غَيْرِ نِسْيَانٍ؛ فَلاَ تَبْحَثُوا عَنْها. [سنن الدارقطني 4/184، حسنه النووي ].

“అల్లాహ్ మీపై కొన్ని విధులను విధించాడు; మీరు వాటిని వృధా చేయకండి. కొన్ని కట్టుబాట్లను నిర్ణయించాడు; వాటిని అతిక్రమించకండి. కొన్ని వస్తువులను నిషిద్ధపరిచాడు; వాటిని ఉల్లఘించకండి. మరికొన్ని విషయాల పట్ల మౌనం వహించాడు. మరచిపోయి కాదు, వాస్తవంలో మీపై కరుణిస్తూ; మీరు వాటి వెంటబడకండి”. (హాకిం 4/129. జామిఉల్ ఉసూల్ 5/59, నవవీ హసన్ అన్నారు).

తిను, త్రాగు, ధరించు ఏ విషయాలు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిషిద్ధం అని తెలుపలేదో వాటిని నిషేధించుట యోగ్యం కాదు.

నియమం ఏమిటంటేః నష్టం లేని పవిత్రమైన ప్రతి వస్తువు ‘ముబాహ్‘ (యోగ్యం). అపవిత్రమైన మరియు నష్టంగల వస్తువులు నిషిద్ధం. ఉదా: పీనుగు [1], రక్తం [2], మత్తుపదార్థాలు, ధూమపానం మరియు అపరిశుభ్రంతో కలుషితమైన వస్తువులన్నియూ నిషిద్ధం. ఎందుకనగా అవి అపవిత్రంతో పాటు హాని కలిగించునవి కూడాను.

  • [1] పీనుగు అంటే ధార్మిక పద్ధతితో జిబహ్ చేయకుండానే దానంతట అది చనిపోయినది.
  • [2] రక్తం అంటే జిబహ్ చేసేటప్పుడు స్రవించే రక్తం. ధార్మిక పద్ధతితో జిబహ్ చేసిన తర్వాత మాంసం మధ్యలో లేదా నరాల్లో ఉండిపోయే కొంతపాటి రక్తం ధర్మసమ్మతమే.

యోగ్యమైన ఆహారాలు రెండు రకాలు: జంతువులు (మాంసాహారాలు). కూరగాయలు. (శాఖాహారాలు). వీటిలో నష్టం లేనివి యోగ్యం.

జంతువులు రెండు రకాలు: జలనివాస జంతువులు. భూనివాస జంతువులు. జల నివాస జంతువులన్నీ ధర్మసమ్మతమే. వాటిని జిబహ్ చేయాలన్న నిబంధన కూడా లేదు. చివరికి అవి దానంతటవే చనిపోయినవైనా యోగ్యమే.

భూనివాస జంతువుల్లో ఇస్లాం నిషేధించినవి తప్ప మిగితవన్నీ ధర్మసమ్మతమే. (కాని వాటిని జిబహ్ చేయాలి). ఇస్లాం నిషేధించినవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • 1- పెంపుడు గాడిదలు.
  • 2- కోరలు గల మృగాలన్నియూ నిషిద్ధం, సివంగి (దుమ్ముల గొండి) తప్ప.

పక్షులన్నియూ ధర్మసమ్మతమే. ఈ క్రింది పక్షులు తప్పః

(1) కాళ్ళ గోళ్ళ ఆధారంగా వేటాడే పక్షులు. ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః

نَهَي رَسُولُ الله عَنْ كُلِّ ذِىْ نَابٍ مِنَ السِّبَاعِ، وَ عَنْ كُلِّ ذِيْ مِخْلَبٍ مِنَ الطُّيُوْر

కోరలు గల ప్రతి మృగ జంతువు, మరియు కాళ్ళతో పట్టుకొని భక్షించే ప్రతి పక్షిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నివారించారు“. (ముస్లిం 1934).

(2) గద్ద, కాకి, రాబందుల్లాంటి శవాలను తినే పక్షులు. అవి మలినము, అపరిశుభ్రమైనవాటిని తింటాయి గనుక నిషిద్ధం.

(3) పాము, ఎలుక మరియు పురుగులు, క్రిమికీటకాలు లాంటి అశుద్ధమైనవి కూడా నిషిద్ధం.

పైన తెలుపబడిన జంతువులు, పక్షులు తప్ప మిగితవన్నీ ధర్మసమ్మతమే: గుఱ్ఱం, ఒంటె, ఆవు, ఎద్దు, మేక, గొర్రె, బర్రె, కోడి, అడవిగాడిద, నిప్పుకోడి, కుందేలు, ఉడుం వగైరాలు.

జల్లాల‘ నిషిద్ధం. జల్లాల అంటే ఎక్కువ శాతం మలినం తినే పక్షి, పశువు అని అర్థం. కాని దానిని మూడు రోజులు అలాంటి పదార్థాలు తినకుండా ఆపి, పరిశుభ్రమైన తిను పదార్థాలు ఇస్తూ ఉంటే ఆ తర్వాత అది ధర్మసమ్మతం అమవుతుంది.

ఉల్లి, ఎల్లి లాంటి దుర్వాసన గల వస్తువులు (ధర్మసమ్మత మైనప్పటికీ) మస్జిదుకు వెళ్ళే ముందు అవి పచ్చివిగా తినుట ‘మక్రూహ్’ (ఇష్టం లేని కార్యం).

ప్రాణం పోవులాంటి పరిస్థితి ఏర్పడి నిషిద్ధ వస్తువు తప్ప మరేది లేనప్పుడు ప్రాణం కాపాడుటకు సరిపడునంత పరిమాణంలో నిషిద్ధ వస్తువు తినవచ్చు. కాని విషం తినకూడదు.

చుట్టూ గోడ లేని మరియు కాపలాదారుడు లేని పండ్ల తోట నుండి దాటుతూ క్రింద పడిన పండ్లు తినవచ్చు. కాని తన వెంట తీసుకెళ్ళ కూడదు. అలాగే రాళ్ళు విసిరి పండ్లు క్రింద పడగొట్టి, లేదా చెట్టు ఎక్కి తినడం యోగ్యం కాదు. అలాగే ఒక చోట కుప్పజేసియున్న దానిలో నుండి తీసుకోవడం కూడా యోగ్యం కాదు. కాని మరీ అత్యవసర పరిస్థితిలో ఆకలిని తీర్చు పరిమాణంలో తింటే తప్పు లేదు.


తరువాతి పాఠం:
అన్నపానీయాల ఆదేశాలు – 2 : జిబహ్ & వేట [వీడియో]

పరలోక విశ్వాసం – 2 : ప్రళయం, దాని సూచనలు & తీర్పుదిన విశేషాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[29:27 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
పుస్తక మూలం: పరలోకం (Aakhir)

1- శాశ్వతంగా ఉండుటకు అల్లాహ్ ఈ లోకాన్ని సృష్టించలేదు. ఒక రోజు రానుంది అంతం కానుంది. ఆ రోజే “ఖియామత్” రోజు. ఏలాంటి సందేహం లేని యదార్థం అది. అల్లాహ్ ఆదేశం:

وَأَنَّ السَّاعَةَ آتِيَةٌ لَّا رَيْبَ فِيهَا

పునరుత్తాన దినము రానున్నది, అందెట్టి సందేహం లేదు“. (హజ్ 22: 7).

మరో చోట ఇలా చెప్పాడు:

وَقَالَ الَّذِينَ كَفَرُوا لَا تَأْتِينَا السَّاعَةُ ۖ قُلْ بَلَىٰ وَرَبِّي لَتَأْتِيَنَّكُمْ

మాకు ప్రళయ కాలం రాదు అని అవిశ్వాసులు పలుకుదురు. నీవు చెప్పు ఎందుకు రాదు అది తప్పక మీకు వచ్చును“. (సబా 34: 3).

ప్రళయ దినం సమీపములోనే ఉంది. దాన్ని అల్లాహ్ ఇలా తెలిపాడు:

[اقْتَرَبَتِ السَّاعَةُ ] {القمر:1}

తీర్పు కాలం సమీపించినది“. (ఖమర్ 54: 1).

మరో చోట:

اقْتَرَبَ لِلنَّاسِ حِسَابُهُمْ وَهُمْ فِي غَفْلَةٍ مُّعْرِضُونَ – 21:1

ప్రజలకు తీర్పు కాలం సమీపించినది. వారు అజాగ్రత్తలో పడి విముఖులై యున్నారు“. (అంబియా 21:1)

ఆ సమీపం అనేది మన అంచనా ప్రకారం లేదు. మానవులు దాన్ని తెలుసుకోలేరు. కాలము గడిసిన ప్రకారం అది కేవలం అల్లాహ్ కే తెలుసు.

ప్రళయదిన విషయం అగోచరమైనది. అది కేవలం అల్లాహ్ కే తెలుసు. ఆ విషయాన్ని ఆయన తన సృష్టిలో ఎవరికి తెలుపలేదు. అల్లాహ్ చెప్పెను:

يَسْأَلُكَ النَّاسُ عَنِ السَّاعَةِ ۖ قُلْ إِنَّمَا عِلْمُهَا عِندَ اللَّهِ ۚ وَمَا يُدْرِيكَ لَعَلَّ السَّاعَةَ تَكُونُ قَرِيبًا – 33:63

ప్రజలు ప్రళయకాలమును గూర్చి నిన్ను అడుగుచున్నారు. దాని విషయం అల్లాహ్ కే తెలియును అని ఓ ప్రవక్తా! పలుకుము. దాని విషయం నీకేమీ తెలుసు? ప్రళయకాలం సమీపములోనే కావచ్చు“. (అహ్ జాబ్ 33: 63).

ప్రవక్త దానికి ముందు వచ్చే సూచనలు సూచించారు. అందులో కొన్ని క్రింద తెలుపబడుచున్నవిః

అందులో ఒకటి: మసీహుద్దజ్జాల్ రానున్నాడు. అతని రాకతో ఘోరమైన అరాచకం ప్రభలిపోతుంది. అల్లాహ్ అతనికి ఇచ్చిన శక్తితో విచిత్ర కార్యక్రమాలు ప్రజలకు చూపిస్తాడు. అందుచేత అనేక మంది మోసబోతారు. ఆకాశానికి ఆజ్ఞ ఇస్తే అది వర్షం కురిపిస్తుంది. అతని ఆజ్ఞతో అప్పటికప్పుడే మొక్కలు మొలు స్తాయి. మృతుడ్ని జీవింపజేస్తాడు. తదితర వింతలు చూపిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: అతడు ఒంటి కన్ను వాడు. అతడు స్వర్గం నరకం లాంటి రెండు విషయాలు చూపిస్తాడు అతడు స్వర్గం అని చెప్పేది నరకం, అతడు నరకం అని చెప్పేది స్వర్గం. అతడు 40 రోజులు నివసిస్తాడు.ఒక రోజు ఒక సంవత్సరముగా, ఒక రోజు ఒక నెలగా, ఒక రోజు ఒక వారముగా ఉండును. మిగిత రోజులు సామాన్య రోజులుగా ఉండును. అతడు మక్కా, మదీనా తప్ప ప్రతి దేశం తిరుగును.

ప్రళయదిన సూచనల్లో రెండవది: ఈసా దిమిష్క్ (Damascus) (ఇది ఈనాడు సీరియా దేశం యొక్క రాజధాని) తూర్పున తెల్లని స్థంబం (మీనార్) నుండి ఫజ్ర్ నమాజ్ సమయంలో దిగి వచ్చును. సామూహికంగా (జమాఅత్ తో) ఫజ్ర్ నమాజ్ చేసుకొని దజ్జాల్ ను వెతికి సంహరించుదురు.

ప్రళయదిన సూచనల్లో మూడవది: పశ్చిమ దిశ నుండి సూర్యోదయమగును. అది చూసి భయకంపితులై అనేక మంది (ఇస్లామే సత్యమని) విశ్వసించుదురు. కాని ఆ సమయాన ఏమి లాభముండదు. తదితర ఎన్నో సూచనలున్నాయి.

2- ఈ భూమిపై కేవలం దుర్మార్గులు, దుష్టులు మిగిలి ఉన్నపుడు ప్రళయం సంభవించును. అది ఏ విధంగనగాః ప్రళయానికి ముందు ఒక మందమారుతమైన గాలి వీస్తుంది దానితో విశ్వాసులు చనిపోతారు. ఇక అల్లాహ్ సృష్టంతటిని చంపి ప్రపంచాన్ని నశింపజేయాలనుకున్నప్పుడు “సూర్” (పెద్ద శంకు) ఊదుటకు దానికి నియమింపబడిన దూతకు ఆజ్ఞ ఇస్తాడు. దాన్ని విన్న ప్రజలందరు సొమ్మసిల్లి పోతారు. అదే విషయం అల్లాహ్ ఈ వాక్యంలో తెలిపాడు:

وَنُفِخَ فِي الصُّورِ فَصَعِقَ مَن فِي السَّمَاوَاتِ وَمَن فِي الْأَرْضِ إِلَّا مَن شَاءَ اللَّهُ

“సూరు” (శంకు) ఊదబడును. కావున ఆకాశములలోను భూమిలోనున్న వారందరు సొమ్మసిల్లి పోవుదురు. కాని అల్లాహ్ కోరినవారు సొమ్మసిల్లరు. (జుమర్ 39: 68).

అది శుక్రవారము రోజగును. ఆ తర్వాత దైవదూతలు కూడా చనిపోయి పరమ పవిత్రుడైన అల్లాహ్ తప్ప ఎవరూ ఉండరు.

3- సమాధులలో ప్రవక్తల, ధర్మయుద్ధంలో మరణించిన అమర వీరుల తప్ప అందరి దేహములను మట్టి తినేస్తుంది. కాని వెన్నె ముకలో గల ఒక బీజము అట్లే మిగిలి యుంటుంది. అల్లాహ్ ప్రజలందరికి పునఃర్జన్మ ఇవ్వాలని కోరినపుడు శంకు ఊదుటకు నిర్ణయించబడిన దూత ఇస్రాఫీల్ ను ముందు జీవింపజేయును. అతను శంకు ఊదును. మానవులందరు తొలిసారి (తల్లి గర్భం నుండి) వచ్చిన తీరు నగ్నముగా, ఖత్న (సున్నతీలు) చేయ బడకుండా సమాధుల నుండి లేచి వచ్చుదురు. అల్లాహ్ ఆదేశం:

وَنُفِخَ فِي الصُّورِ فَإِذَا هُم مِّنَ الْأَجْدَاثِ إِلَىٰ رَبِّهِمْ يَنسِلُونَ – 36:51

సూరు ఊదబడును. అప్పుడే వారు తమ సమాధుల నుండి లేచి తమ ప్రభువు వద్దకు పరుగిడుదురు“. (యాసీన్ 36: 51).

يَوْمَ يَخْرُجُونَ مِنَ الْأَجْدَاثِ سِرَاعًا كَأَنَّهُمْ إِلَىٰ نُصُبٍ يُوفِضُونَ خَاشِعَةً أَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ ۚ ذَٰلِكَ الْيَوْمُ الَّذِي كَانُوا يُوعَدُونَ

ఆ దినమున వారు సమాధుల నుండి లేచి ఒక గుర్తునకు పరిగెత్తి పోవునట్లు పరుగెత్తి పోవుదురు. అప్పుడు వారి కన్నులు క్రిందుగా నుండును. వారిపై అవమానము క్రమ్ముకొను చుండును. ఇదే వారితో వాగ్దానము చేయబడుచున్న దినము“. (మఆరిజ్ 70: 43,44).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం ప్రకారం, అందరికన్నా ముందు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భూమి నుండి వెలికి వస్తారు. అందరూ మహ్షర్ మైదానము వైపు పరిగెత్తుతారు. అది చాలా విస్తీర్ణము మరియు విశాలమైన భూమి. అవిశ్వాసులు తలక్రిందులైన ముఖముతో వస్తారు. ఈ విషయము విన్న సహచరులు తలక్రిందులైన ముఖముతో ఎలా వస్తారు? అని ప్రశ్నించారు. కాళ్ళతో నడిపించు శక్తి గలవాడు ముఖముతో కూడా నడిపించును” అని మహాప్రవక్త సమాధానమిచ్చారు”. (ముస్లిం 2806). అల్లాహ్ మాటను తిరస్కరించిన వారు గ్రుడ్డివానిగా లేపబడుతారు. సూర్యుడు చాలా దగ్గరుంటాడు. ప్రతి ఒకరు తమ కర్మల ప్రకారం చెమటలో మునిగి యుంటారు. కొందరు చీలమండల వరకు, మరి కొందరు నడుము వరకు, కొందరు పూర్తిగా మునిగి యుంటారు. కొందరికి అల్లాహ్ ఆ నాడు తన నీడలో స్థానమిస్తాడు. ఆ నాడు తన నీడ తప్ప మరే నీడ ఉండదు. ప్రవక్త చెప్పారు: ఏడు రకాల (గుణము గల) వారికి అల్లాహ్ ఆ నాడు తన నీడలో స్థానమిస్తాడు. ఆ నాడు తన నీడ తప్ప మరే నీడ ఉండదు. 1. న్యాయశీలుడైన పాలకునికి. 2. యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో మరియు ఆయన విధేయతలో గడిపిన యువకునికి. 3. మస్జిద్ లోనే తన మనుస్సు లగ్నం చేసుకున్న వ్యక్తికి. 4. కేవలం అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకు ప్రేమాభిమానాలు గల ఇద్దరు వ్యక్తులు వారు అల్లాహ్ కొరకే కలుసు కుంటారు. అల్లాహ్ కొరకే వేరు అవుతారు. 5. ఉన్నత వంశీయురాలైన, అందమైన స్త్రీ దుష్టక్రియకు అహ్యానిస్తే కేవలం అల్లాహ్ భయముతో తిరస్కరించిన వ్యక్తికి. 6. కుడి చెయ్యి దానం చేసినదేమిటో ఎడమ చెయ్యికి తెలియనంత రహస్యంగా దానా దర్మాలు చేసే వ్యక్తికి. 7. ఏకాంతములో అల్లాహ్ ధ్యానం చేస్తుండగా అతని కళ్ళ నుండి కన్నీరు కారినటువంటి వ్యక్తికి“. (బుఖారి 1423, మస్లిం 1031). ఇది పురుషులకే ప్రత్యేకం కాదు. స్త్రీలకు తమ కర్మల ప్రకారం లెక్క జరుగును. సత్కార్యములు గలవారికి మంచి ఫలితము, దుష్కార్యములు గలవారికి చెడు ఫలితము లభించును. మరియు వారికి పురుషులకు లభించినట్లు పూర్తి తీర్పు మరియు ప్రతిఫలము లభించును.

ప్రజలందరికి ఆ నాడు దాహము ఎక్కువగును. 50 వేల సంవత్సరాల ప్రమాణం గల ఒక రో జు అది. కాని విశ్వాసునికి అది ఫర్జ్ నమాజ్ చేసినంత సమయముగా అతి వేగంగా గడిసి పోవును. ఆ తరువాత విశ్వాసులు ప్రవక్తకు నొసంగబడిన “హౌజె కౌసర్” వద్దకు వచ్చి కౌసర్ నీరు త్రాగుదురు. (అది గౌరవము గల చాలా గొప్ప బహుమానము. అది అల్లాహ్ మన ప్రవక్తకే ప్రత్యేకించును. ప్రళయ దినాన ఆయన అనుచరులు అందు నుండి త్రాగుదురు. కౌసర్ నీరు పాలకన్నా తెలుపుగా, తేనేకన్నా తీపుగా మరియు కస్తూరి కన్నా ఎక్కువ సువాసన ఉండును. ఆకాశతారలకన్నా ఎక్కువ పాత్రలు అచ్చట ఉండును. ఒక్కసారి త్రాగిన వారికి మరెప్పుడూ దాహమవదు).

మహ్షర్ మైదానములో ప్రజలు తీర్పు కొరకు చాలా కాలము నిలుచుండి వారు తమ తీర్పు, లెక్క కొరకు ఎదురు చూచుదురు. అచ్చటి బాధలు మరియు ఎండతాపాన్ని భరించలేక దైవసన్నిధిలో తమ గురించి సిఫారసు చేయువారి కోసం వెతుకుతూ ఆదం వద్దకు వస్తే ఆయన నాతో కాదనగా నూహ్ వద్దకు వస్తారు. ఆయన కూడా మన్నించమంటారు. తర్వాత ఇబ్రాహీం, తర్వాత మూసా, తర్వాత ఈసా వద్దకు వస్తే వారు కూడా మాతో కాదని విన్నవించుకుంటారు. అప్పుడు ప్రవక్త వద్దకు వస్తే నేను దీనికి అర్హతగల వాన్నని ఆయన అల్లాహ్ అర్ష్ క్రింద సజ్దా చేసి అల్లాహ్ స్తోత్రములు పఠించి సిఫారసు చేయు అనుమతి కోరుతారు. అప్పుడు అల్లాహ్ “ఓ ముహమ్మద్ తలెత్తు నీ కోరిక తీర్చగలను అడుగు, సిఫారసు చెయ్యి స్వీకరించ బడును” అని లెక్క తీర్పు కొరకు అనుమతిస్తాడు. ముందు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతీల (అనుచరుల) తీర్పు అగును.

మానవుని కర్మల్లో మొదటి లెక్క నమాజ్ గురించి అగును. అందులో నెగ్గినవారి కర్మలను మాత్రమే చూడబడును. నెగ్గనివారి కర్మలు రద్దు చేయబడును. అదే విధముగా ఐదు విషయాలు గురించి ప్రశ్నించబడును. 1. నీ జీవిత కాలాన్ని ఏ కార్యాల్లో గడిపావు? 2. నీ యౌవ్వనాన్ని ఏ కార్యాల్లో కృశింపజేశావు? 3,4. ధనం ఎలా సంపాదించావు? ఎలా ఖర్చు చేశావు? 5. తెలుసుకున్న విషయాలపై ఎంత వరకు ఆచరించావు?. అతని దాసుల మధ్య జరిగే తీర్పులో మొదటిది అన్యాయంగా రక్తాలు చిందించిన వారి తీర్పు. అప్పుడు నష్టపరిహారాన్ని కట్టించుటకు సత్కర్యాలు లేక దుష్టకార్యాలు తప్ప మరేమీ ఉండవు. ఈ విధంగా పీడుతులకు అన్యాయము చేసినవాని సత్కార్యాలు పంచి పెట్టబడును. ఇతని సత్కార్యాలు అయిపోయి ఇంకా పీడితులు మిగిలి ఉంటె వారి పాపాలు అతనిపై వేయబడును.

నరకముపై వంతెన వేయబడును. (ఆ వంతెన వెంట్రుకకన్నా సన్నగా ఖడ్గం కన్నా వాడిగా ఉండును). ప్రతి ఒకరు తమ కర్మల ప్రకారం దానిపై దాటుదురు. కొందరు కనురెప్ప కొట్టినంతలో, కొందరు గాలి తీరు, కొందరు గుఱ్ఱపు రౌతు తీరు, కొందరు ప్రాకుచు పోవుదురు. దానికి కొండ్లుండును. అవి ప్రజలను నరకములో పడవేయును. అందులో పడువారు అవిశ్వాసులు మరియు విశ్వాసి అయినా పాపాత్ములు. అవిశ్వాసులు శాశ్వతంగా అందులో ఉందురు. కాని విశ్వాసులైన పాపాత్ములు అల్లాహ్ కోరినన్ని రోజులు శిక్ష పడిన తర్వాత స్వర్గానికి పంపబడుదురు. అల్లాహ్ తనిష్టపడిన ప్రవక్తలకు, మహాభక్తులకు తౌహీద్ సాక్ష్యమిచ్చిన పాపాత్ముల సిఫారసు చేయు అనుమతి ఇచ్చి, వీరి సిఫారసుతో వారిని నరకము నుంచి తీసి స్వర్గములో చేర్పించును. వంతెన దాటిన తర్వాత -స్వర్గానికి అర్హులైన వారు- నరకము స్వర్గము మధ్యలో ఆగి యుందురు. వారి పరస్పర అన్యాయాల తీర్పు వారు హృదయాల కల్ముషాలను దూరము చేసిన తర్వాత వారు స్వర్గములో చేరుదురు. స్వర్గస్తులు స్వర్గ ములో నరకవాసులు నరకంలో చేరిన పిదప వారి ముందు, వారు చూస్తుండగా మృత్యువును పొట్టేలు రూపంలో స్వర్గనరక ముల మధ్య జిబహ్ చేయ(కోయ) బడును. మళ్ళీ ఓ స్వర్గవాసులారా! శాశ్వతంగా ఉండండి మరణం లేదు. ఓ నరకవాసులారా! మీకూ శాశ్వతం మరణం లేదు అని అనబడును. ఒక వేళ ఎవరైనా సంతోషంతో చనిపోతే స్వర్గవాసులు అంతులేని సంతోషంతో చనిపోతారు. మరియు ఎవరైనా బాధ, చింతతో చనిపోతే నరకవాసులు చనిపోతారు.

పరలోకం (The Hereafter) మెయిన్ పేజీ : https://teluguislam.net/hereafter/

ఈ పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిన వీడియో పాఠాలు :

నమాజును భంగపరిచే కార్యాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[1:47 నిముషాలు]
నమాజును భంగపరిచే కార్యాలు
నమాజ్ పాఠాలు: 3 వ పాఠం: నమాజు ఆదేశాలు – పార్ట్ 1
https://teluguislam.net/?p=8594
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

నమాజును భంగపరుచు కార్యాలు:

  • 1- తెలిసి, కావాలని మాట్లడడం, అది కొంచమైనా సరే.
  • 2- పూర్తి శరీరముతో ఖిబ్లా దిశ నుండి పక్కకు మరలడం.
  • 3- వుజూను భంగపరిచే కారణాల్లో ఏ ఒకటైనా సంభవించడం.
  • 4- అనవసరంగా ఎడతెగకుండా ఎక్కువ చలనము చేయడం.
  • 5- కొంచం నవ్వినా నమాజు వ్యర్థమవుతుంది.
  • 6- తెలిసి కూడా ఎక్కువ రుకూ, సజ్దాలు, ఖియాం, జుల్సాలు చేయడం.
  • 7- తెలిసి కూడా (రుకూ, సజ్దా వగైరా) ఇమాంకు ముందు చేయడం.

నమాజ్ చేయరాని సమయాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[2:14 నిముషాలు]
నమాజ్ చేయరాని సమయాలు
నమాజ్ పాఠాలు: 3 వ పాఠం: నమాజు ఆదేశాలు – పార్ట్ 1
https://teluguislam.net/?p=8594
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

నమాజులు చేయరాని వేళలు:

కొన్ని సమయాల్లో నమాజు చేయుట యోగ్యం లేదు. అవి:

1- ఫజ్ర్ నమాజు తర్వాత నుండి సూర్యోదయం తర్వాత సూర్యుడు బారెడంత పైకి వచ్చే వరకు.

2- మిట్ట మధ్యానం, సూర్యుడు నడి ఆకాశంలో, తలకు సమానంగా ఉన్నప్పుడు. అది పశ్చిమాన వాలే వరకు.

3- అస్ర్ నమాజు తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు.

కాని ఈ సందర్భాల్లో కొన్ని నమాజులు చేయవచ్చు. ఉదాః తహియ్యతుల్ మస్జిద్ (మస్జిదులో ప్రవేశించిన వెంటనే చేయు నమాజ్). జనాజా నమాజ్. సూర్య గ్రహణ నమాజ్. తవాఫ్ సున్నతులు. తహియ్యతుల్ వుజూ లాంటివి.

అలాగే తప్పిపోయిన నమాజులు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసు ఆధారంగా:

 (مَنْ نَسِيَ صَلَاةً أَوْ نَامَ عَنْهَا فَكَفَّارَتُهَا أَنْ يُصَلِّيَهَا إِذَا ذَكَرَهَا)

“ఎవరైనా ఏదైనా నమాజు మరచిపోతే, లేదా దాని సమయంలో నిద్రపోతే గుర్తు వచ్చిన వెంటనే దాన్ని నెరవేర్చడమే దాని ప్రాయశ్చితం”. (ముస్లిం 684, బుఖారి 597).

జమాఅతు నుండి కొన్ని రకాతులు తప్పిపోయిన వ్యక్తి ఆదేశాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[2:24 నిముషాలు]
జమాఅతు నుండి కొన్ని రకాతులు తప్పిపోయిన వ్యక్తి ఆదేశాలు
నమాజ్ పాఠాలు: 3 వ పాఠం: నమాజు ఆదేశాలు – పార్ట్ 1
https://teluguislam.net/?p=8594
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

మస్బూఖ్:

జమాతుతో ఒకటి లేదా ఎక్కువ రకాతులు తప్పిపోయిన వ్యక్తిని మస్బాఖ్ అంటారు.

ఇమాం రెండవ సలాం త్రిప్పిన తర్వాత ఈ వ్యక్తి సలాం త్రిప్పకుండా తప్పిపోయిన రకాతులు వెరవేర్చాలి.

అతను ఇమాంతో ఏ రకాతులో కలిసాడో అదే అతనిది మొదటి రకాతు.

ఇమాంను రుకూ స్థితిలో పొందినవాని ఆ రకాతు అయినట్లే. ఇమాంను రుకూలో పొందకుంటే ఆ రకాత్ తప్పిపోయినట్లే లెక్క.

జమాతు నిలబడిన తర్వాత వచ్చేవారు జమాతును ఏ స్థితిలో చూసినా అదే స్థితిలో కలవాలి. వారు రుకూ, లేదా సజ్దా ఇంకే స్థితిలో ఉన్నా సరే. వారు మరో రకాతు కొరకు నిలబడే వరకు నిరీక్షించవద్దు.

నిలబడి తక్బీరె తహ్రీమ అల్లాహు అక్బర్ అనాలి. రోగి లాంటి ఏదైనా ఆటంకం ఉన్నవారు కూర్చుండి అల్లాహు అక్బర్ అంటే ఏమీ తప్పు లేదు.

బిదాఅత్ (కల్పిత ఆచారాల, దురాచారాల) వల్ల పరలోకంలో తీర్పుదినం రోజు జరిగే నష్టాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[6:53 నిమిషాలు ]
పరలోకంలో ఏలాంటి నష్టాలు వాటిల్లుతాయో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

బిద్అత్ (కల్పితాచారం) – Bidah
https://teluguislam.net/others/bidah/

బిద్అత్ (కల్పితాచారం) – Bidah


ముహర్రం పండుగ ఎలా జరుపుకోవాలి? [వీడియో]

బిస్మిల్లాహ్

[2:32 నిముషాలు]
మనం ముహర్రం పండుగ జరుపుకోవచ్చా?
జరుపుకో కూడదు అంటే ఏంటి సాక్ష్యం (దలీల్)?
జరుపుకొనేది ఉండి వుంటే ఎలా జరుపుకోవాలి?

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ముహర్రం & ఆషూరా (ముహర్రం 10 వ తేదీ)

సూరాహ్ మూమినూన్ 23:1 నుండి 11 అయతులలో ఆచరించదగిన ఆదేశాలు ఏమిటి? [వీడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 27, 2వ ప్రశ్న
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

సూరా అల్ మూ ‘మినూన్

23:1 قَدْ أَفْلَحَ الْمُؤْمِنُونَ
నిశ్చయంగా విశ్వాసులు సాఫల్యం పొందారు. [1]

23:2 الَّذِينَ هُمْ فِي صَلَاتِهِمْ خَاشِعُونَ
వారు ఎలాంటివారంటే తమ నమాజులో వారు అణకువ కలిగి ఉంటారు. [2]

23:3 وَالَّذِينَ هُمْ عَنِ اللَّغْوِ مُعْرِضُونَ
వారు పనికిమాలిన వాటిని పట్టించుకోరు [3]

23:4 وَالَّذِينَ هُمْ لِلزَّكَاةِ فَاعِلُونَ
వారు (తమపై విధించబడిన) జకాతు విధానాన్ని పాటిస్తారు. [4]

23:5 وَالَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَافِظُونَ
వారు తమ మర్మస్థానాలను కాపాడుకుంటారు.

23:6 إِلَّا عَلَىٰ أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ
అయితే తమ భార్యల, (షరీయతు ప్రకారం) తమ యాజమాన్యంలోకి వచ్చిన బానిసరాళ్ళ విషయంలో మటుకు వారిపై ఎలాంటి నింద లేదు.

23:7 فَمَنِ ابْتَغَىٰ وَرَاءَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْعَادُونَ
కాని ఎవరయినా దీనికి మించి మరేదైనా కోరితే వారు హద్దు మీరిన వారవుతారు. [5]

23:8 وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ
వారు తమ అప్పగింతల, వాగ్దానాల పట్ల కడు అప్రమత్తంగా ఉంటారు. [6]

23:9 وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَوَاتِهِمْ يُحَافِظُونَ
వారు తమ నమాజులను పరిరక్షిస్తూ ఉంటారు. [7]

23:10 أُولَٰئِكَ هُمُ الْوَارِثُونَ
ఇలాంటి వారే వారసులు.

23:11 الَّذِينَ يَرِثُونَ الْفِرْدَوْسَ هُمْ فِيهَا خَالِدُونَ
(స్వర్గంలోని) ఫిర్‌దౌసు ప్రదేశానికి వారు వారసులవుతారు. వారక్కడ కలకాలం ఉంటారు. [8]


[1] “ఫలాహ్‌” అంటే చీల్చటం, నరకటం, కోయటం అని అర్థం. వ్యవసాయం చేసే వానిని కూడా ఫల్లాహ్‌ అని అంటారు. ఎందుకంటే రైతు నేలను దుక్కి లేదా త్రవ్వి విత్తనం నాటుతాడు. బంధనాలను త్రెంచుకుంటూ, అవరోధాలను అధిగమిస్తూ పోయి తన లక్ష్యాన్ని ఛేదించిన వ్యక్తిని ముఫ్లిహున్‌ (విజేత)గా వ్యవహరిస్తారు.

అయితే షరీయతు పరిభాషలో విజేత ఎవరంటే అతడు ప్రాపంచిక జీవితం గడుపుతూ తన ప్రభువును ప్రసన్నుణ్ణి చేసేవాడు. తద్వారా అతను పరలోకంలో తన నిజప్రభువు క్షమాభిక్షకు అర్హుడుగా ఖరారు చేయబడతాడు. దాంతోపాటు ప్రాపంచిక అనుగ్రహాలు కూడా అతనికి లభిస్తే ఇక చెప్పాల్సిందేముందీ!? సుబ్‌హానల్లాహ్‌! అయితే సిసలైన సాఫల్యం మాత్రం పరలోక సాఫల్యమే. కాని ప్రజలు ప్రాపంచిక జీవితంలో ఆస్తి పాస్తులు, అధికారాలు, పదవులు లభించిన వారినే భాగ్యవంతులుగా, విజేతలుగా భావిస్తుంటారు. సిసలైన విజేతలు ఎవరో, వారి గుణగణాలు ఎలా ఉంటాయో ఇక్కడ చెప్పటం జరిగింది. ఉదాహరణకు తరువాతి ఆయతులో చూడండి.

[2] “ఖాషివూన్‌” (خَاشِعُونَ) అని అనబడింది. “ఖుషూ‘ అంటే మానసిక ఏకాగ్రత, మనసును లగ్నం చేయటం, భక్తిభావంతో అణగారి పోవటం అని అర్థం. నమాజులో ఏకాగ్రత పొందటమంటే ఆలోచనలను ఇతరత్రా వ్యాపకాలపైకి పోనివ్వకుండా ఉంచాలి. మనసులో దేవుని ఔన్నత్యం, భయం పాదుకునేలా చేయాలి. అశ్రద్ధ, పరధ్యానం, చిరాకువంటి వాటిని దరికి చేరనివ్వరాదు. నమాజులో అటూ ఇటూ చూడటం, కదలటం, మాటిమాటికీ జుత్తును, దుస్తులను సరిచూసుకోవటం లాంటి వన్నీ అణకువకు విరుద్ధమైనవి. ఒక సాధారణ వ్యక్తి రాజ్యాధికారి సమక్షంలోకి వెళ్ళి నప్పుడు ఎంతో వినమ్రుడై నిలబడతాడు. అలాంటిది సర్వలోక ప్రభువు సమక్షంలో ప్రార్ధనకు నిలబడినపుడు ఇంకెంత వినయం, మరెంత వినమ్రత ఉట్టిపడాలో ఆలోచించండి!?

[3] “లఘ్‌వున్‌‘ అంటే నిరర్ధకమైన పనులు, పనికిరాని మాటలు, వ్యర్థ విషయాలు అని అర్థం. లేదా ప్రాపంచికంగాగానీ, ధార్మికంగాగానీ నష్టం చేకూర్చే విషయాలు అని భావం. వాటిని పట్టించుకోకపోవటం అంటే వాటికి పాల్పడకపోవటం అటుంచి కనీసం వాటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. పైగా అలాంటి వాటికి ఆమడ దూరాన ఉండాలి.

[4] అంటే అల్లాహ్‌ విధిగా చేసిన జకాత్‌ను చెల్లిస్తారని భావం. (జకాత్‌కి సంబంధించిన పరిమాణం, నిష్పత్తి తదితర తప్ప్సీళ్లు – మదీనాలో అవతరించినప్పటికీ మౌలిక ఆదేశం మాత్రం మక్కాలోనే అవతరించినదని పండితులు అంటున్నారు). ఆత్మ శుద్ధికి దోహదపడే, నడవడికను తీర్చిదిద్దే పనులను చేయాలన్నది ఈ ఆయతు భావమని మరి కొంతమంది విద్వాంసులు వ్యాఖ్యానించారు.

[5] దీనిప్రకారం ఇస్లాంలో ‘ముత్‌ఆ‘ పద్ధతికి ఇప్పుడు ఏమాత్రం అనుమతి లేదని విదితమవుతోంది. లైంగిక వాంఛల పరిపూర్తికి ధర్మసమ్మతమైన పద్ధతులు రెండే రెండున్నాయి. 1. ఇల్లాలితో సమాగమం జరపటం. 2. యాజమాన్యంలోకి వచ్చిన బానిసరాలితో సంభోగించటం. అయితే ప్రస్తుతం అలాంటి బానిసరాళ్ల ఉనికి ఎక్కడా లేదు. 14 వందల సంవత్సరాల క్రితం జరిగిన ధర్మయుద్దాల వంటివి జరిగే పరిస్థితి గనక ఏర్పడి, తద్వారా షరీయతు బద్ధంగా స్త్రీలు యాజమాన్యంలోకి వస్తే అట్టి పరిస్థితిలో అలాంటి బానిసరాళ్లతో సమాగమం జరపటం ధర్మసమ్మతం అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో “నికాహ్‌” ద్వారా దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన స్త్రీతో తప్ప మరొకరితో లైంగిక కోర్కె తీర్చుకోవటం నిషిద్ధం (హరామ్‌).

[6] అరబీలో ‘“అమానాత్‌‘ అంటే అప్పగించబడిన బాధ్యతలను సజావుగా నిర్వర్తించటం, ఇతరులకు చెల్లించవలసిన పైకాన్ని యధాతథంగా చెల్లించటం, రహస్య విషయాలను రహస్యంగానే ఉంచటం, అల్లాహ్‌తో చేసిన బాసలకు కట్టుబడి ఉండటం, ఎవరి సొమ్ములను వారికి ఇవ్వటం – ఇవన్నీ అమానతులుగా పరిగణించబడతాయి.

[7] ఆఖరిలో మళ్లీ ‘నమాజుల పరిరక్షణను సాఫల్యానికి సోపానంగా అభివర్ణించటం గమనార్హం. నమాజుల ప్రస్తావనతో మొదలైన విశ్వాసుల సుగుణాలు (ఆయత్‌ నెం. 2) నమాజుల ప్రస్తావనతోనే (ఆయత్‌ నెం.9) ముగియటాన్ని బట్టీ అల్లాహ్ దృష్టిలో నమాజుకు ఎంతటి ప్రాముఖ్యం ఉందో అవగతమవుతోంది. అయితే నేటి ముస్లిములు ఇతరత్రా సదాచరణలను విస్మరించినట్లే నమాజును కూడా విస్మరిస్తున్నారు. ఒకవేళ నమాజులు చేసినా లాంఛనప్రాయంగా చేస్తున్నారు. నమాజులలో ఏ అణకువ, మరే భక్తీ పారవశ్యం ఉండాలో అవి ఉండటం లేదు.

[8] పై ఆయతులలో ప్రస్తావించబడిన సుగుణాలు కల విశ్వాసులు మాత్రమే స్వర్గానికి వారసులవుతారు. అదీ దేనికి?! స్వర్గంలోని అత్యున్నత ప్రదేశమైన జన్నతుల్‌ ఫిర్‌దౌస్‌కి! స్వర్గంలోని సెలయేళ్లు ఆ స్ధలం నుంచే వెలువడతాయి (సహీహ్‌ బుఖారీ – కితాబుల్‌ జిహాద్‌, కితాబుత్‌ తౌహీద్‌).

[అయతులు మరియు వ్యాఖ్యానం అహ్సనుల్ బయాన్ నుండి తీసుకోబడింది.]

ఐదు విషయాల కంటే ఎంతో మేలైన, ఉత్తమ ఆ ఒక్క విషయమేమిటి? [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ఐదు విషయాల కంటే ఎంతో మేలైన, ఉత్తమ ఆ ఒక్క విషయమేమిటి?
https://youtu.be/w7ANEdrN2IU [6:53 నిమిషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఈ ప్రసంగంలో యజమాని-దాసుడి సంబంధాన్ని ఉదాహరణగా తీసుకుని, మానవునికి మరియు సృష్టికర్త అయిన అల్లాహ్‌కు మధ్య ఉండవలసిన దాస్యత్వం గురించి వివరించబడింది. నిజమైన దాస్యత్వం అంటే ప్రతి క్షణం, ప్రతి స్థితిలో అల్లాహ్‌ను స్మరించుకోవడం (ధిక్ర్ చేయడం) మరియు ఆయనకు ఇష్టమైన పనులే చేయడం. అల్లాహ్ స్మరణ (ధిక్ర్) యొక్క గొప్పతనాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఒక హదీథ్ ద్వారా నొక్కిచెప్పబడింది. బంగారం, వెండి దానం చేయడం మరియు ధర్మయుద్ధంలో పాల్గొనడం కన్నా అల్లాహ్ స్మరణ ఎంతో ఉత్తమమైనదని, అది హోదాలను పెంచి, ప్రభువు వద్ద అత్యంత పరిశుద్ధమైనదిగా పరిగణించబడుతుందని ఈ హదీథ్ స్పష్టం చేస్తుంది.

అబూ దర్దా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అడిగారు:

మీ సదాచరణాల్లో అత్యుత్తమమైనది, మీ చక్రవర్తి అయిన అల్లాహ్ వద్ద ఎంతో పరిశుద్ధమైనది, మీ స్థానాలను ఎంతో రెట్టింపు చేయునది, మరి మీరు వెండి బంగారాలు ఖర్చు పెట్టే దాని కంటే ఉత్తమమైనది మరియు మీరు మీ శత్రువులను కలిసి మీరు వారి మెడలను వారు మీ మెడలను నరుకుతూ ఉండే దానికంటే ఉత్తమమైనది తెలియజేయనా?” వారన్నారు ఎందుకు లేదు! తప్పకుండా తెలియజేయండి, అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు: అల్లాహ్ స్మరణ

[సహీహ్ హదీథ్] [సునన్ ఇబ్నె మాజ 3790, మువత్త మాలిక్ 564, ముస్నద్ అహ్మద్ 21702,21704,27525]

سنن الترمذي أبواب الدعوات عن رسول الله صلى الله عليه وسلم | باب منه

3377 – عَنْ أَبِي الدَّرْدَاءِ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ : قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ : ” أَلَا أُنَبِّئُكُمْ بِخَيْرِ أَعْمَالِكُمْ، وَأَزْكَاهَا عِنْدَ مَلِيكِكُمْ، وَأَرْفَعِهَا فِي دَرَجَاتِكُمْ، وَخَيْرٌ لَكُمْ مِنْ إِنْفَاقِ الذَّهَبِ وَالْوَرِقِ، وَخَيْرٌ لَكُمْ مِنْ أَنْ تَلْقَوْا عَدُوَّكُمْ، فَتَضْرِبُوا أَعْنَاقَهُمْ، وَيَضْرِبُوا أَعْنَاقَكُمْ “. قَالُوا : بَلَى. قَالَ : ” ذِكْرُ اللَّهِ تَعَالَى “.

حكم الحديث: صحيح
سنن ابن ماجه ( 3790 )، موطأ مالك ( 564 )، مسند أحمد ( 21702, 21704, 27525 ).

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

الْحَمْدُ لِلَّهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ اللَّهِ، أَمَّا بَعْدُ
(అల్ హందులిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి, అమ్మా బాద్)
సర్వస్తోత్రాలు అల్లాహ్ కే శోభాయమానం. అల్లాహ్ యొక్క ప్రవక్తపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఇక ఆ తర్వాత…

ప్రియ వీక్షకుల్లారా, యజమాని మరియు దాసుడు. వారిద్దరి మధ్యలో సంబంధం ఎలాంటిది ఉంటుంది? దాసుడు ఎల్లవేళల్లో చాలా చురుకుగా, ఎప్పుడు ఏ సమయంలో యజమాని ఆదేశం ఏముంటుంది, నేను దానిని పాటించాలి, ఆజ్ఞాపాలన చేయాలి అన్నటువంటి ధ్యానంలో ఉంటాడు. అలాంటి వారినే మనం మెచ్చుకుంటాము. అవునా కాదా?

అయితే ఈ రోజుల్లో మనం మన అసలైన యజమాని, సర్వ సృష్టికి సృష్టికర్త, ఈ సర్వ సృష్టికి పోషణకర్త అల్లాహ్, ఎంతటి గొప్పవాడు! ఆయనే సార్వభౌమాధికారుడు. ఆయనే చక్రవర్తి. సోదర మహాశయులారా, ఎల్లవేళల్లో మనం అల్లాహ్ యొక్క ధ్యానంలో ఉండటం, అల్లాహ్‌ను గుర్తు చేసుకుంటూ ఉండటం, అల్లాహ్ యొక్క స్మరణలో ఉండటం, మనం ఎక్కడ ఉన్నా ఏ సందర్భంలో ఉన్నా గానీ అక్కడ ఆ సందర్భంలో, ఆ స్థితిలో మన సృష్టికర్త అల్లాహ్ మనం ఎలా ఉండటం, మనం ఎలా మాట్లాడటం, మనం ఎలా చూడటం, మనం ఎలా వినడం ఇష్టపడతాడో, ఆయనకు ఇష్టమైనవే మనం చేసుకుంటూ ఉండటం, ఇదే అసలైన నిజమైన దాస్యత్వం. దీన్నే ఈ రోజుల్లో చాలా మంది మరిచిపోయి ఉన్నారు.

అయితే, ఇలాంటి స్మరణలో ఉంటూ ప్రత్యేకంగా ఆయన యొక్క గొప్పతనాలను కీర్తిస్తూ, ఆయన యొక్క పరిశుద్ధత, పవిత్రతలను కొనియాడుతూ, ఆయన యొక్క ప్రశంసలు, పొగడ్తలను మనం స్తుతిస్తూ,

سُبْحَانَ اللَّهِ
(సుబ్ హా నల్లాహ్)
అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు.

الْحَمْدُ لِلَّهِ
(అల్ హందులిల్లాహ్)
సర్వస్తోత్రాలు అల్లాహ్ కే శోభాయమానం.

اللَّهُ أَكْبَرُ
(అల్లాహు అక్బర్)
అల్లాహ్ యే గొప్పవాడు.

لَا إِلَهَ إِلَّا اللَّهُ
(లా ఇలాహ ఇల్లల్లాహ్)
అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు.

ఇంకా ఇలాంటి పలుకులు పలుకుతూ ఉంటే, ఇహలోకంలో మనకు ఎంత లాభం కలుగుతుందో, పరలోకంలో దీని యొక్క సత్ఫలితం ఎంత గొప్పగా లభిస్తుందో మనం ఊహించలేము.

అల్లాహ్ స్మరణ (ధిక్ర్) యొక్క గొప్పతనం

రండి, ఒకే ఒక హదీథ్ వినిపిస్తాను. ఆ తర్వాత మీరు సెలవు తీసుకోవచ్చు. శ్రద్ధగా వినండి. హజ్రత్ అబూ దర్దా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు. సునన్ తిర్మిజీలో వచ్చిన హదీథ్, 3377 హదీథ్ నంబర్. షేఖ్ అల్బానీ రహిమహుల్లా దీనిని ప్రామాణికమైనదిగా చెప్పారు.

ఏంటి హదీథ్? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ స్మరణ గురించి, అల్లాహ్ ధ్యానంలో ఉండటం గురించి ఎంత గొప్ప శుభవార్త ఇస్తున్నారో మీరే గమనించండి. ఐదు రకాలుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి ఎలా ప్రోత్సహిస్తూ చెబుతున్నారో గమనించండి.

أَلَا أُنَبِّئُكُمْ بِخَيْرِ أَعْمَالِكُمْ
(అలా ఉనబ్బిఉకుమ్ బి ఖైరి అఅమాలికుమ్)
మీ కర్మలలో అత్యుత్తమమైనది ఏమిటో మీకు తెలుపనా?

وَأَزْكَاهَا عِنْدَ مَلِيكِكُمْ
(వ అజ్కాహా ఇంద మలీకికుమ్)
మీ ప్రభువైన అల్లాహ్ వద్ద అత్యంత పరిశుద్ధమైనది,

وَأَرْفَعِهَا فِي دَرَجَاتِكُمْ
(వ అర్ఫఇహా ఫీ దరజాతికుమ్)
మీ హోదాలను అత్యున్నతంగా చేయునది,

وَخَيْرٌ لَكُمْ مِنْ أَنْ تُنْفِقُوا الذَّهَبَ وَالْوَرِقَ
(వ ఖైరుల్ లకుమ్ మిన్ అన్ తున్ఫికూ అజ్జహబ వల్ వరిఖ్)
మీరు వెండి బంగారాలు ఖర్చు పెట్టే దానికంటే కూడా ఉత్తమమైనది,

وَخَيْرٌ لَكُمْ مِنْ أَنْ تَلْقَوْا عَدُوَّكُمْ فَتَضْرِبُوا أَعْنَاقَهُمْ وَيَضْرِبُوا أَعْنَاقَكُمْ
(వ ఖైరుల్ లకుమ్ మిన్ అన్ తల్ ఖౌ అదువ్వకుమ్ ఫ తజ్రిబూ అఅనాఖహుమ్ వ యజ్రిబూ అఅనాఖకుమ్)
మరియు మీరు మీ యొక్క శత్రువులను ధర్మపరమైన యుద్ధంలో కలుసుకోవడం, వారు మీ మెడలను నరుకుతూ ఉండటం, మీరు వారి మెడలను నరుకుతూ ఉండటం, దీనికంటే కూడా ఎంతో ఉత్తమమైనది.

అల్లాహు అక్బర్! అల్లాహు అక్బర్! గమనించారా? ఎన్ని విషయాలు చెప్పారు ప్రవక్త? ఐదు విషయాలు. మీ సదాచరణల్లో అన్నిటికంటే ఉత్తమమైనది, మరియు ప్రభువు అల్లాహ్ వద్ద ఎంతో పరిశుద్ధమైనది, మరియు మీ యొక్క స్థానాలను ఉన్నతంగా చేయునది, మీరు వెండి బంగారాలు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టే దానికంటే ఉత్తమమైనది, మీరు అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయడానికి కంటే కూడా ఎంతో ఉత్తమమైనది, మీకు తెలుపనా? అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు.

ఈ ఐదు విషయాల కంటే ఉత్తమమైన మరో విషయం మీకు తెలపాలా? అని ప్రశ్నించారు. సహాబాలు, ప్రవక్త సహచరులు ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆతృత కలిగి ఉండేవారు. వారందరూ ఏకంగా అన్నారు,

بَلَى يَا رَسُولَ اللَّهِ
(బలా యా రసూలల్లాహ్)
తప్పకుండా, ఓ అల్లాహ్ ప్రవక్తా! ప్రవక్తా ఎందుకు తెలుపరు? తప్పకుండా తెలుపండి!

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

ذِكْرُ اللَّهِ
(ధిక్రుల్లాహ్)
అల్లాహ్ యొక్క ధిక్ర్. అల్లాహ్ యొక్క స్మరణ.

చూశారా? గమనించారా? ఈ హదీథ్‌ను ఎల్లవేళల్లో మదిలో నాటుకోండి. ఇలాంటి ఈ ధిక్ర్ ద్వారా ఈ ఐదు రకాల మంచి విషయాల కంటే గొప్ప పుణ్యం పొందగలుగుతారు. అల్లాహ్ మనందరికీ ఎల్లవేళల్లో, అన్ని సమయ సందర్భాల్లో, అన్ని స్థితుల్లో కేవలం అల్లాహ్‌ను మాత్రమే గుర్తు చేసుకుంటూ ఉండేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. అన్ని రకాల షిర్క్‌ల నుండి, అన్ని రకాల బిద్అత్‌ల నుండి అల్లాహ్ మనల్ని దూరం ఉంచుగాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా చివరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ
(వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై శాంతి, అల్లాహ్ కారుణ్యం మరియు ఆయన శుభాలు వర్షించుగాక.

జిక్ర్ (అల్లాహ్ నామ స్మరణ)

ప్రవక్త ﷺ గారి జీవిత చరిత్ర (సీరత్) పాఠాలు 12: ప్రవక్త ﷺ గురించి ఎవరేమన్నారు? [వీడియో]

బిస్మిల్లాహ్

[14:28 నిముషాలు]

సీరత్ పాఠాలు – 12: ప్రవక్త ﷺ గురించి ఎవరేమన్నారు?

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [14:27 నిముషాలు]

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం] నుండి :

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గురించి ఎవరేమన్నారు?

కొందరు తత్వవేత్తలు, ఇస్లాం స్టడీ చేసిన పాశ్చాత్య నిపుణులు (orientalists) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఇచ్చిన స్టేట్ మెంట్స్ తెలుపుతున్నాము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గొప్పతనాన్ని, ఆయన ప్రవక్తపదవిని, ఆయన ఉత్తమ గుణాలను వారు ఒప్పుకున్న విషయాల్ని స్పష్టం చేస్తున్నాము. కొందరు ఇస్లామీయ విరోధులు, శత్రువులు చేస్తున్న దుష్ప్రచారానికి, పక్షపాతానికి ఈ ఇస్లాం ధర్మం దూరంగా ఉంది అని వారు తెలిపిన ఇస్లాం ధర్మ వాస్తవికతలను మీ ముందుంచుతున్నాము. (అయితే ఇస్లాంగానీ, ప్రవక్తగానీ వారి ప్రశంసలకు, సాక్ష్యాలకు ఆధారపడిలేరు. మరి ఇవి తెలిపే కారణం ఏమిటంటే; ఇస్లాంను అర్థం చేసుకోకుండా, దానిని చెడుగా భావించేవారు, వారి వంశం, లేదా వారి లాంటి మతాలపై ఉన్నవారిలో కొందరు ఇస్లాంను చదివి ఎలా అర్థం చేసుకున్నారో అదే విధంగా ఇస్లాం అధ్యాయనం చేసి, న్యాయంపై ఉండాలన్నదే మా ఉద్దేశం).

జోర్జ్ బర్నార్డ్ షా:

George Bernard Shaw. జననం 26/7/1856.
మరణం 2/11/1950. జన్మ స్థలం Ireland.

జోర్జ్ బర్నార్డ్ షా తన రచన “ముహమ్మద్”లో (బ్రిటిష్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని కాల్చేసింది) ఇలా వ్రాశాడుః “ఈ నాటి సమాజానికి ముహమ్మద్ లాంటి మేధావి అవసరం చాలా ఉంది. ఈ ప్రవక్త ఎల్లప్పుడూ తన ధర్మాన్ని గౌరవ స్థానంలో ఉంచాడు. ఆయన తీసుకొచ్చిన ధర్మం ఇతర నాగరికతలను అంతమొందించే అంతటి శక్తి గలది. శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండునది. నా జాతి వాళ్ళల్లో చాలా మంది స్పష్టమైన నిదర్శనంతో ఈ ధర్మంలో ప్రవేశిస్తున్నది నేను చూస్తున్నాను. సమీపం లోనే ఈ ధర్మం యూరపు ఖండంలో విశాలమైన చోటు చేసుకుంటుంది”.

ఇంకా ఇలా వ్రాశాడు: “అజ్ఞానం, లేదా పక్షపాతం వల్ల మధ్య శతాబ్థి (Middle Ages) లోని క్రైస్తవ మత పెద్దలు ముహమ్మద్ తీసుకొచ్చిన ధర్మాన్ని అంధవికారంగా చిత్రీకరించి, అది క్రైస్తవ మతానికి శత్రువు అని ప్రచారం చేశారు. కాని నేను ఈ వ్యక్తి (ముహమ్మద్) గురించి చదివాను. అతను వర్ణనాతీతమైన, అపరూపమైన వ్యక్తి. ఆయన క్రైస్తవమతానికి శత్రువు ఎంత మాత్రం కారు. ఆయన్ను మానవ జాతి సంరక్షకుడని పిలవడం తప్పనిసరి. నా దృష్టిలో ఆయన గనక నేటి ప్రపంచ పగ్గాలు తన చేతిలో తీసుకుంటే మన సమస్యల పరిష్కార భాగ్యం ఆయనకు లభిస్తుంది. నిజమైన శాంతి, సుఖాలు ప్రాప్తమవుతాయి. అవి పొందడానికే మానవులు పరితపిస్తున్నారు.

థోమస్ కార్లైల్:

Thomas Carlyle జననం 4/12/1795 స్కాట్లాండ్ లోని Ecclefechan గ్రామంలో. మరణం 5/2/1881.
లండన్ లో. ప్రఖ్యాతిగాంచిన చరిత్ర కారుడు, సాహిత్య పరుడు.

థోమస్ కార్లైల్ తన ప్రఖ్యాతిగంచిన రచన “On Heroes, HeroWorship, and the Heroic in History”లో ఇలా వ్రాశాడు: “ముహమ్మద్ కుయుక్తుడు, మోసగాడు, అసత్యరూపి మరియు అతని ధర్మం కేవలం బూటకపు, బుద్ధిహీన విషయాల పుట్ట అన్న ప్రస్తుత మన వ్యూహం, మరియు ఇలాంటి వ్యూహాలను వినడం నేటి విద్యాజ్ఞాన యుగంలో మన కొరకే సిగ్గు చేటు. ఇలాంటి మూఢ, సిగ్గుచేటు విషయాలు ప్రభలకుండా పోరాడడం మన విధి. ఈ ప్రవక్త అందజేసిన సందేశం 12 వందల సంవత్సరాల నుండి రెండు వందల మిలియన్లకంటే ఎక్కువ మంది కొరకు ప్రకాశవంతంగా ఉంది. ఈ సందేశాన్ని విశ్వసించి, దాని ప్రకారం తమ జీవితాలను మలచుకొని దానిపై చనిపోయిన ప్రజలు అసంఖ్యాకులు. ఇంతటి గొప్ప వాస్తవం అబద్ధం, బూటకం అని భావించగలమా?”.

రామక్రిష్ణ రావు:

Prof. K. S. Ramakrishna Rao, Head of the Department
of Philosophy, Government College for Women, University of Mysore.

మన ఇండియా తత్వవేత్త రామక్రిష్ణారావు గారు ఇలా చెప్పారు: “అరబ్ ద్వీపంలో ముహమ్మద్ ప్రకాశమయినప్పుడు అది ఓ ఎడారి ప్రాంతం. అప్పటి ప్రపంచ దేశాల్లో నామమాత్రం గుర్తింపు లేని ప్రాంతం అది. కాని ముహమ్మద్ తన గొప్ప ఆత్మ ద్వారా క్రొత్త యుగాన్ని, నూతన జీవితాన్ని, కొత్త సంస్కృతి, సభ్యతను ఏర్పరిచారు. మరియు కొత్త రాజ్యాన్ని నిర్మించారు. అది మొరాకో నుండి ఇండియా ద్వీపకల్పం వరకు విస్తరించింది. అంతే కాదు ఆయన ఆసియా, ఆఫ్రికా మరియు యూరప్ ఖండాల్లోని జీవనశైలి, విచారణా విధానాల్లో గొప్ప మార్పు తేగలిగాడు.

S.M.జ్వీమర్:

Samuel Marinus Zwemer. జననం 12/4/1867.
Michigan. మరణం 2/4/1952. New York.

(S.M. Zweimer) ఇలా వ్రాశాడు: “నిశ్చయంగా ముహమ్మద్ ధార్మిక నాయకుల్లో అతి గొప్పవారు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఆయన శక్తివంతుడైన సంస్కరణకర్త, అనర్గళవాగ్ధాటి, ధైర్యంగల అతిసాహసి, సువిచారం చేయు గొప్ప మేధావి అని అనడమే సమంజసం. ఈ సద్గుణాలకు విరుద్ధమైన విషయాలు ఆయనకు అంకితం చేయుట ఎంత మాత్రం తగదు, యోగ్యం కాదు. ఆయన తీసుకొచ్చిన ఈ ఖుర్ఆన్ మరియు ఆయన చరిత్ర ఇవి రెండూ ఆయన సద్గుణాలకు సాక్ష్యం.

విలియం మోయిర్:

Sir William Muir. జననం 27/4/1819. UK.
మరణం 11/7/1905. UK.

సర్ విలియమ్ యోయిర్ (Sir William Muir) ఇలా చెప్పాడు: “ముహమ్మద్ -ముస్లిముల ప్రవక్త- చిన్నప్పటి నుండే అమీన్ అన్న బిరుదు పొందారు. ఆయన ఉత్తమ నడవడిక, మంచి ప్రవర్తనను బట్టి ఆయన నగరవాసులందరూ ఏకంగా ఇచ్చిన బిరుదు ఇది. ఏదీ ఎట్లయినా, ముహమ్మదు వర్ణనాతీతమైన శిఖరానికి ఎదిగి యున్నారు. ఏ వ్యక్తి ఆయన గురించి వర్ణించగలడు?. ఆయన్ను ఎరగనివాడే ఆయన గౌరవస్థానాన్ని ఎరగడు. ఆయన గురించి ఎక్కువగా తెలిసినవాడు ఆయన గొప్ప చరిత్రను నిశితంగా పరిశీలించినవాడు. ఈ చరిత్రనే ముహమ్మదును ప్రవక్తల్లో మొదటి స్థానంలో మరియు విశ్వమేధావుల్లో ఉన్నతునిగా చేసింది.

ఇంకా ఇలా అన్నాడుః “ముహమ్మద్ తన స్పష్టమైన మాట, సులభమైన ధర్మం ద్వారా సుప్రసిద్ధులయ్యారు. మేధావుల మేధను దిగ్ర్భమలో పడవేసిన పనులు ఆయన పూర్తి చేశారు. అతి తక్కువ వ్యవధిలో అందరినీ జాగరూక పరచిన, అప్రమత్తం చేసిన, నశించిపోయిన సద్గుణాల్లో జీవం పోసిన, గౌరవ మర్యాదల ప్రతిష్ఠను చాటి చెప్పిన ఇస్లాం యొక్క ప్రవక్త ముహమ్మద్ లాంటి సంస్కరణకర్త చరిత్రలో ఎవ్వరూ మనకు కనబడరు.

లియో టోల్స్ టాయ్:

Leo Tolstoy Nikolayevich. జననం 9/9/1828
Tula Oblast, Russia. మరణం 20/11/1910
ప్రపంచపు గొప్ప నవలా రచయిత, తత్త్వవేత్త

గొప్ప నవలారచయిత, తత్వవేత్త రష్యాకు చెందిన లియో టోల్స్ టాయ్ ఇలా చెప్పాడు: “ముహమ్మద్ విఖ్యాతి, కీర్తి గౌరవానికి ఇది ఒక్క విషయం సరిపోతుంది: ఆయన అతి నీచమైన, రక్తపాతాలు సృష్టించే జాతిని, సమాజాన్ని దుర్గుణాల రాక్షసి పంజాల నుండి విడిపించారు. వారి ముందు అభివృద్ధి, పురోగతి మార్గాలు తెరిచారు. ముహమ్మద్ ధర్మశాస్త్రం కొంత కాలంలో విశ్వమంతటిపై రాజ్యమేలుతుంది. ఎందుకనగా ఆ ధర్మానికి బుద్ధిజ్ఞానాలతో మరియు మేధ వివేకాలతో పొందిక, సామరస్యం ఉంది.

ఆస్ట్రియా దేశస్తుడైన షుబ్రుక్ చెప్పాడుః ముహమ్మద్ లాంటి వ్యక్తి వైపు తనకు తాను అంకితం చేసుకోవడంలో మానవజాతి గర్వపడుతుంది. ఎందుకనగా ఆయన చదువరులు కానప్పటికీ కొద్ది శతాబ్ధాల క్రితం ఒక చట్టం తేగలిగారు. మనం ఐరోపాకు చెందిన వాళ్ళం గనక దాని శిఖరానికి చేరుకున్నామంటే మహా అదృష్టవంతులమవుతాము.

వస్సలాము అలైకు వరహ్మతుల్లాహి వబరకాతుహు

సీరత్ ముందు పాఠాలు :

ఇతరములు: