బిలాల్ (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర – సలీం జామిఈ [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

బిలాల్ (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర – సలీం జామిఈ [ఆడియో & టెక్స్ట్]
https://youtu.be/-deXYNu670Q [23 నిముషాలు]
సలీం జామిఈ హఫిజహుల్లాహ్

ఈ ప్రసంగం ఇస్లాం యొక్క మొట్టమొదటి ముఅజ్జిన్ అయిన హజ్రత్ బిలాల్ ఇబ్న్ రబాహ్ రదియల్లాహు అన్హు యొక్క స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని వివరిస్తుంది. అబిసీనియా (ఇథియోపియా) నుండి వచ్చిన ఒక బానిసగా, బిలాల్ గారు ఇస్లాంను స్వీకరించినందుకు తన యజమాని ఉమయ్య బిన్ ఖల్ఫ్ చేత ఎదుర్కొన్న భయంకరమైన హింసను మరియు అతని అచంచలమైన విశ్వాసాన్ని ఇది వివరిస్తుంది. అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు గారి ద్వారా విముక్తి పొందిన బిలాల్ గారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అత్యంత ప్రియమైన సహచరుడిగా మారి, మక్కా విజయం రోజున కాబా పై నిలబడి అజాన్ ఇచ్చే గౌరవాన్ని పొందారు. ప్రవక్త గారి పట్ల బిలాల్ గారికి ఉన్న అపారమైన ప్రేమను, ఆయన మరణానంతరం బిలాల్ పడిన వేదనను మరియు స్వర్గంలో ఆయనకు దక్కిన ఉన్నత స్థానాన్ని ఈ ప్రసంగం కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల ప్రభువు, సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి.

ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.

గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా, ఈనాటి జుమా ప్రసంగంలో ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆయన వాస్తవానికి అబిసీనియా అనగా ఇథియోపియా దేశస్థుడు. బానిసగా అరబ్బు దేశంలో జీవితం గడిపేవాడు. రంగు పరంగా చూస్తే నల్ల జాతి వాడు. కానీ ఆయన ఘనత ఏమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన అడుగుల చప్పుడు స్వర్గంలో చూశారు. ఆయనను ప్రపంచం ముఅజ్జినే రసూల్, ప్రియ ప్రవక్త వారి ముఅజ్జిన్ అనే బిరుదుతో గుర్తిస్తుంది. ఇస్లాం గురించి ఏ కొద్ది జ్ఞానం ఉన్న వారికైనా సరే మీరు ముఅజ్జినే రసూల్ అంటే ఎవరండి అని ప్రశ్నించండి, టక్కున ఆయన నోటి నుండి ఒకటే సమాధానం వస్తుంది – ఆయన మరెవరో కాదు మన ప్రియ ప్రవక్త వారి ప్రియ సహచరుడు బిలాల్ రదియల్లాహు అన్హు.

అభిమాన సోదరులారా, ఈనాటి జుమా ప్రసంగంలో బిలాల్ రదియల్లాహు అన్హు వారి గురించి తెలుసుకుందాం. ఆయన పేరు బిలాల్. తల్లి పేరు హమామా. తండ్రి పేరు రబాహ్. ఆయనను ముఅజ్జినే రసూల్ అనే బిరుదుతో ప్రపంచం గుర్తిస్తుంది. ఆయన మక్కాలో జన్మించారు. బానిస కుటుంబంలో జన్మించారు, బానిసగానే పెరిగారు. ఆయనగారి యజమాని ఉమయ్య బిన్ ఖల్ఫ్.

ఎప్పుడైతే బిలాల్ రదియల్లాహు అన్హు వారు పెరిగి పెద్దవారయ్యారో, ఆ రోజుల్లో ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రవక్త పదవి లభించిన తర్వాత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు రహస్యంగా కొద్దిమంది ప్రజలతో కలిసి ఇస్లాం సందేశాన్ని వినిపించారు. ప్రారంభంలో ఇస్లాం స్వీకరించిన వారిలో బిలాల్ రదియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు. ప్రారంభంలో చాలా తక్కువ మంది, పది ఇరవై మంది మాత్రమే ఇస్లాం స్వీకరించారు, వారిలో బిలాల్ రదియల్లాహు అన్హు వారు కూడా ఒకరున్నారు.

అభిమాన సోదరులారా, ఎప్పుడైతే బిలాల్ రదియల్లాహు అన్హు వారు ఇస్లాం స్వీకరించారో, ఆయన యజమాని ఉమయ్య బిన్ ఖల్ఫ్ కు వెంటనే ఆ విషయం తెలిసిపోయింది. యజమానికి ఆ విషయం తెలియగానే పట్టరాని కోపంతో యజమాని బిలాల్ రదియల్లాహు అన్హు వారిని కాళ్లు చేతులు బంధించేసి కొరడాలతో కొట్టాడు.

అభిమాన సోదరులారా, యజమాని అయిన కారణంగా అతని బానిస తాత ముత్తాతల ధర్మాన్ని వదిలేసి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించాడనే కోపంతో హింస ప్రారంభించాడు. ముందుగా తను స్వయంగా కొట్టాడు, ఆ తర్వాత బిలాల్ రదియల్లాహు అన్హు వారి మెడలో తాడు కట్టేసి కుర్రాళ్ల చేతులకి ఇచ్చేసాడు. ఆ యువకులు, కుర్రాళ్లు బిలాల్ రదియల్లాహు అన్హు వారి మెడలో ఉన్న ఆ తాడుని పట్టుకొని ఈడ్చుకుంటూ కొండల్లో, రాళ్ల ప్రదేశంలో తిరిగేవారు. అభిమాన సోదరులారా, ఎలాగైతే ఒక జంతువుని ఈడ్చేవారో ఆ విధంగా బిలాల్ రదియల్లాహు అన్హు వారిని ఆ కుర్రాళ్లు ఈడ్చేవారు. బిలాల్ రదియల్లాహు అన్హు వారి శరీరానికి గాయాలైపోయేవి. ఆయన మెడ మీద తాడు కట్టేసిన కారణంగా గుర్తులు పడిపోయేవి.

అంతటితో యజమాని కోపం చల్లారలేదు. అతను ఏం చేసేవాడంటే తన కసి తీర్చుకోవడానికి బిలాల్ రదియల్లాహు అన్హు వారిని ఎండా కాలంలో మిట్ట మధ్యాహ్న సమయంలో బాగా ఎండ, వేడి తీవ్రంగా ఉన్నప్పుడు – మనకందరికీ తెలిసిన విషయమే మనం అరబ్బు దేశంలో ఇక్కడ ఎండను, ఎండ తీవ్రతను చూసినవాళ్ళమే. అలాంటి సమయంలో ఇక్కడి నేల ఎంతగా వేడెక్కిపోతుందో మన అందరికీ తెలుసు అభిమాన సోదరులారా. అలాంటి నేల మీద బిలాల్ రదియల్లాహు అన్హు వారిని వారి యజమాని ఉమయ్య బట్టలు తీసి పడుకోబెట్టేవాడు. ఆ తర్వాత ఎద మీద పెద్ద పెద్ద రాళ్లు ఉంచేసేవాడు. కింద నుంచి కూడా వేడి తగిలేది, పైన ఉంచిన రాయి వేడి కూడా ఆయనకు తగిలేది. అలాంటి పరిస్థితుల్లో బిలాల్ రదియల్లాహు అన్హు వారి చెవి దగ్గరికి వచ్చి యజమాని ఒకే మాట అనేవాడు – “ఓ బిలాల్! నీవు ముహమ్మద్ ప్రవక్త ధర్మాన్ని వదిలివేయి, నేను నిన్ను హింసించడం వదిలేస్తాను.” బిలాల్ రదియల్లాహు అన్హు అంత బాధను భరిస్తూ కూడా అల్లాహ్ యే ప్రభువు అద్వితీయుడు అహద్! అహద్! అని పలికేవారు.

అభిమాన సోదరులారా, యజమాని హింసిస్తూ హింసిస్తూ అలసిపోయాడు. కానీ బిలాల్ రదియల్లాహు అన్హు వారి నోటి నుండి ఒక్క పదము కూడా, ఒక్క మాట కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా ఆయన వినలేకపోయాడు. అభిమాన సోదరులారా, చరిత్రకారులు చెప్పిన విషయం ఏమిటంటే బిలాల్ రదియల్లాహు అన్హుతో పాటు ఇతర నవ ముస్లిములను కూడా మక్కా పెద్దలు పట్టుకొని హింసించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా మాటలు మాట్లాడండి అని బలవంతం చేశారు. చాలామంది మాట్లాడేశారు కానీ బిలాల్ రదియల్లాహు అన్హు ఎట్టి పరిస్థితుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

ఒకసారి అబూబకర్ రదియల్లాహు అన్హు మార్గం నుండి వెళ్తూ వెళ్తూ బిలాల్ రదియల్లాహు అన్హు వారికి ఇవ్వబడుతున్న శిక్షలు, బాధలు, హింసలు చూశారు. ఆ తర్వాత వెంటనే ఉమయ్య బిన్ ఖల్ఫ్ తో వచ్చి “ఓ ఉమయ్య! బిలాల్ కి నేను కొనాలనుకుంటున్నాను, నీవు వెంటనే అమ్మేయ్ నేను కొనేస్తాను” అన్నారు. అప్పుడు అతను ఉమయ్య ఏమన్నాడంటే “ఓ అబూబకర్! నేను బిలాల్ కి ఒక ఊకియా, అంటే ఇంచుమించు 70 దిర్హములు, ఆ రేటులో అమ్మాలనుకుంటున్నాను కొనగలవా?” అన్నాడు. అబూబకర్ రదియల్లాహు అన్హు వెంటనే ఆ ఒక ఊకియా (70 దిర్హములు) అతనికి ఇచ్చేసి బిలాల్ ను కొనేశారు. వ్యాపారం జరిగిపోయిన తర్వాత ఉమయ్య హేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ అబూబకర్ రదియల్లాహు అన్హు తో అన్నాడు “ఓ అబూబకర్! నీవు బిలాల్ కి బదులుగా ఒక్క దిర్హమ్ మాత్రమే ఇస్తాను అని నీవు అడిగి ఉన్నా నేను ఇచ్చేసేవాడిని. నీవు ఇంత పెద్ద సొమ్ము ఇచ్చేసావే, చెల్లించేసావే” అని ఎగతాళి చేశాడు. కానీ అబూబకర్ రదియల్లాహు అన్హు ఏమని సమాధానం ఇచ్చారో తెలుసా? అబూబకర్ రదియల్లాహు అన్హు అన్నారు “ఓ ఉమయ్య! నేను ఎక్కువ ఇచ్చేసానని నీవు ఎగతాళి చేస్తున్నావు. వాస్తవం ఏమిటో తెలుసా? నీవు ఒక ఊకియా మాత్రమే అడిగావు. ఒకవేళ నీవు వంద ఊకియాలు అడిగి ఉన్నా గాని నేను చెల్లించడానికి సిద్ధంగానే ఉన్నాను” అన్నారు. అల్లాహు అక్బర్! ఆ తర్వాత అబూబకర్ రదియల్లాహు అన్హు బిలాల్ రదియల్లాహు అన్హు గారిని కొన్న తర్వాత ఆయనకు స్వతంత్రుని చేసేసారు. ఆ తర్వాత నుండి బిలాల్ రదియల్లాహు అన్హు వారు స్వతంత్రులయ్యారు.

ఆ తర్వాత రోజులు గడిచాయి. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలకు, నవ ముస్లింలకు మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళిపోవాలని ఆదేశించినప్పుడు బిలాల్ రదియల్లాహు అన్హు వారు కూడా మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణం చేసి వెళ్ళిపోయారు. మదీనాకు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మసీదును నిర్మించారు. ఆ మసీదు పేరు మస్జిదే నబవీ. మసీదు నిర్మించబడిన తర్వాత అల్లాహ్ తరఫు నుండి ప్రజలకు నమాజ్ కొరకు పిలవడానికి అజాన్ ఇవ్వాలని ఆదేశం వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రథమంగా, అందరికంటే ముందు అజాన్ పలుకులు పలికించడానికి బిలాల్ రదియల్లాహు అన్హు వారిని పిలిపించి “ఓ బిలాల్! నీవు అజాన్ పలుకులు పలుకు” అని ఆదేశించినప్పుడు ఇస్లాం లో అజాన్ పలుకులు పలికిన ప్రథమ వ్యక్తి బిలాల్ రదియల్లాహు అన్హు. అభిమాన సోదరులారా, ఆనాటి నుండి ఆయనకు ప్రజలు బిలాల్ ముఅజ్జిన్ అనే పేరుతో పిలవటం ప్రారంభించారు.

అభిమాన సోదరులారా, మదీనాలో ఉంటున్నప్పుడు బిలాల్ రదియల్లాహు అన్హు ఐదు పూటల నమాజులకు అజాన్ పలికేవారు. తర్వాత సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేసేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణులకు కావాల్సిన పనులు చేసి పెట్టేవారు. అభిమాన సోదరులారా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉంటున్నప్పుడు మక్కా వాసులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరియు విశ్వాసులను అక్కడి నుండి తరిమి కొట్టాలని ప్రయత్నించినప్పుడు యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు బిలాల్ రదియల్లాహు అన్హు కూడా ప్రతి యుద్ధంలో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా హిజ్రీ శకం రెండవ సంవత్సరంలో మొదటి యుద్ధం జరిగింది ఆ యుద్ధం పేరు బద్ర్ సంగ్రామం. ఆ సంగ్రామంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు బిలాల్ రదియల్లాహు అన్హు యుద్ధ మైదానంలో వస్తే శత్రువులలో నుంచి ఉమయ్య వచ్చాడు. ఉమయ్య తెలుసు కదా బిలాల్ రదియల్లాహు అన్హు వారి యొక్క మాజీ యజమాని. మక్కాలో ఆయనకు హింసించిన వాడు, కొట్టినవాడు, బంధించినవాడు, జంతువులాగా ప్రవర్తించిన వాడు శత్రువుల సైన్యంలో వచ్చాడు. అభిమాన సోదరులారా, యుద్ధమైంది ఆ యుద్ధంలో బిలాల్ రదియల్లాహు అన్హు చేతికి చిక్కిపోయాడు. బిలాల్ రదియల్లాహు అన్హు ఆ రోజు అన్నారు “ఈ రోజు మిగిలితే ఈ భూమి మీద నేను మిగలాలి లేదంటే ఓ దైవ శత్రువా నీవైనా మిగలాలి లేదంటే నేనైనా మిగలాలి, నాతో తలపడు” అని చెప్పేసి బిలాల్ రదియల్లాహు అన్హు అతనితో ఎదుర్కొని అతన్ని హతమార్చేశారు.

అయితే అభిమాన సోదరులారా, మదీనాలో ఉన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరఫున ఇద్దరు అజాన్ పలుకులు పలికే వారు. ఒకరు బిలాల్ రదియల్లాహు అన్హు వారు అయితే రెండో వారు కళ్ళు లేని, కంటి చూపు లేని ఒక సహాబి ఆయన పేరు అబ్దుల్లా ఇబ్నే ఉమ్మే మఖ్తూమ్.

అభిమాన సోదరులారా, రోజులు గడిచాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వెళ్లిన ఎనిమిదవ సంవత్సరంలో మక్కాని మళ్ళీ జయించేసారు. విజయం పొందిన తర్వాత విజేతల్లాగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారి శిష్యులు మక్కాలో ప్రవేశించారు. మక్కాలో ప్రవేశించిన తర్వాత మక్కాలోని మస్జిదే హరామ్ లో ఆ రోజుల్లో అవిశ్వాసులు అక్కడ ఉంచిన విగ్రహాలన్నింటిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు శిష్యులు అందరూ కలిసి అక్కడి నుంచి తొలగించేశారు. తొలగించిన తర్వాత మళ్ళీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిలాల్ రదియల్లాహు అన్హు వారిని పిలిచి “ఓ బిలాల్! కాబా పైకి ఎక్కి ఈరోజు నీవు అజాన్ పలుకులు పలుకు” అన్నారు. అల్లాహు అక్బర్! అభిమాన సోదరులారా, బిలాల్ రదియల్లాహు అన్హు ఆ రోజు మక్కా విజయం జరిగిన రోజు కాబా పైకి ఎక్కి అక్కడి నుండి అజాన్ పలుకులు పలికారు.

أَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللهُ
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్)

أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ
(అష్ హదు అన్న ముహమ్మదుర్ రసూలుల్లాహ్)

బిలాల్ రదియల్లాహు అన్హు గారు ఈ పలుకులు నిర్మోహమాటంగా, ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి వణుకు లేకుండా పలికారు. ఒకప్పుడు అదే నగరంలో అల్లాహ్ పేరు తలుచుకోవాలంటే, అల్లాహ్ పేరు పలకాలంటే హింసలు ఎదుర్కోవలసి వచ్చేవి. ఒక్కసారి అల్లాహ్ అని పలకాలంటే యజమానితో భయపడేవారు. ఒక్కసారి అల్లాహ్ అని పలకాలంటే ఆ ఊరి పెద్దలతో భయపడేవారు. కానీ కొద్ది సంవత్సరాల్లోనే వాతావరణం ఎలాగ మారిపోయిందంటే ఆ రోజు బిలాల్ రదియల్లాహు అన్హు కాబా మీద నిలబడి ఈ పలుకులు పలుకుతూ ఉంటే ఏ ఒక్కడు కూడా వచ్చి అడ్డు పడటానికి సాహసించలేకపోయాడు. అలా మారిపోయాయి.

ఆ తర్వాత అభిమాన సోదరులారా, రోజులు గడిచాయి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 63 సంవత్సరాల వయసులో మరణించారు. ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించారో, మరుసటి రోజు నుంచే బిలాల్ రదియల్లాహు అన్హు వారు అజాన్ పలకటం మానేశారు. ప్రజలు వచ్చి ఏమండీ ఎందుకు మీరు అజాన్ పలకటం మానేశారు అని అడిగితే ఆయన ఒకే మాట అన్నారు “అయ్యా అజాన్ పలికేటప్పుడు అష్ హదు అన్న ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని చెప్పిన తర్వాత నేను ఎవరి మొహం చూడాలయ్యా? ఆ పలుకు పలికేటప్పుడు నాకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుర్తుకు వస్తారు కాబట్టి ఆ పలుకు పలికిన తర్వాత మరి వేరే పలుకులు నేను పలకలేను” అన్నారు. ఆ తర్వాత నుంచి బిలాల్ రదియల్లాహు అన్హు వారి అజాన్ అక్కడి నుంచి ఆగిపోయింది.

ఆ తర్వాత అబూబకర్ రదియల్లాహు అన్హు విశ్వాసులకు నాయకులైనప్పుడు ఆయన ఏమన్నారంటే “ఓ అబూబకర్ రదియల్లాహు అన్హు! నాకు అనుమతి ఇవ్వండి, నేను ఇక్కడ ఉండలేను. నేను వెళ్లి సరిహద్దుల్లో శత్రువులతో పోరాడి వీరమరణం పొందాలనుకుంటున్నాను” అన్నారు. కానీ ఆయనకు అప్పుడే ఎక్కువ వయసు అయిపోయింది కాబట్టి అబూబకర్ రదియల్లాహు అన్హు అనుమతి ఇవ్వలేదు. అబూబకర్ రదియల్లాహు అన్హు తర్వాత ఉమర్ రదియల్లాహు అన్హు నాయకునిగా ఎన్నికైన తర్వాత ఉమర్ రదియల్లాహు అన్హు వద్దకు వచ్చి కూడా బిలాల్ రదియల్లాహు అన్హు వారు అనుమతి కోరితే ఉమర్ రదియల్లాహు అన్హు వారు కూడా వయసు ఎక్కువ అయిపోయింది అని అనుమతి ఇవ్వలేదు. కాకపోతే పట్టుబట్టి ఆయన అనుమతి పొందారు, ఆ తర్వాత సరిహద్దుల్లోకి వెళ్ళిపోయారు. సరిహద్దులో వెళ్ళినప్పుడు ఒక సందర్భంలో కొన్ని ముఖ్య కారణాల వల్ల ఉమర్ రదియల్లాహు అన్హు వారు కూడా సరిహద్దుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ బిలాల్ రదియల్లాహు అన్హు తో ఉమర్ రదియల్లాహు అన్హు అన్నారు “ఓ బిలాల్! నా కోరిక మేరకు ఒక్కసారి అజాన్ పలకవయ్యా” అన్నారు. అప్పుడు బిలాల్ రదియల్లాహు అన్హు సరిహద్దుల్లో ఒక్కసారి అజాన్ పలికారు.

మరికొన్ని రోజుల తర్వాత బిలాల్ రదియల్లాహు అన్హు మదీనాకు వచ్చినప్పుడు మదీనాలో ఉంటున్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనవలు హసన్ మరియు హుస్సేన్ మరియు ఇతర సహాబాలు కలిసి బిలాల్ రదియల్లాహు అన్హు ని అజాన్ కోరాలని ప్రాధేయపడినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఒక్కసారి ఆయన జీవితంలో చివరిసారి మదీనాలో బిలాల్ రదియల్లాహు అన్హు వారు అజాన్ పలికారు. అభిమాన సోదరులారా, ప్రజలు బిలాల్ రదియల్లాహు అన్హు వారి అజాను మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ చదివించడానికి ఎంతగా కనెక్ట్ అయిపోయారంటే చాలా గ్యాప్ తర్వాత, చాలా విరామం తర్వాత ఎప్పుడైతే బిలాల్ రదియల్లాహు అన్హు వారు మదీనాలో అజాన్ పలికారో, మదీనాలో ఆయన అజాన్ పలుకులతో వీధి వీధుల్లో శబ్దం మోగిందో ఇళ్లలో నివసిస్తున్న పిల్లల దగ్గరి నుండి మహిళల దగ్గర నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తలుచుకొని కన్నీరు కార్చారు. అదే బిలాల్ రదియల్లాహు అన్హు జీవితంలో ఆయన ఇచ్చిన చివరి అజాన్. ఆ తర్వాత బిలాల్ రదియల్లాహు అన్హు దిమష్క్ అంటే ఈనాడు డెమస్కస్ అంటూ ఉంటారు ఆ నగరంలో 60 సంవత్సరాల కంటే ఎక్కువగా ఆయనకు వయసు అయిపోయిన సందర్భంలో ఆయన అక్కడే మరణం పొందారు. నేటికి కూడా ఆయన సమాధి ఆ నగరంలో ఉంది.

అయితే అభిమాన సోదరులారా, ఆయనకున్న ఘనతలను చెప్పేసి ఇన్ షా అల్లాహ్ నా మాటను ముగిస్తాను అదేమిటంటే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్ యాత్ర సందర్భంలో అల్లాహ్ తో కలవడానికి ఆకాశాల పైకి వెళ్ళినప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వర్గాన్ని కూడా చూపించాడు, నరకాన్ని కూడా చూపించాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గాన్ని చూస్తున్నప్పుడు అక్కడ బిలాల్ రదియల్లాహు అన్హు నడుస్తున్నట్టుగా వారి కాళ్ళ చప్పుడుని విన్నారు. ఆ యాత్ర నుండి తిరిగి వచ్చిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిలాల్ రదియల్లాహు అన్హుతో ఒక ప్రశ్న అడిగారు అదేమిటంటే “ఓ బిలాల్! నేను స్వర్గంలో నీ అడుగుల చప్పుడు విన్నాను, నీవు ఏ సత్కార్యము చేస్తున్నావో నాకు కొంచెం తెలుపవా” అన్నారు. దానికి బదులుగా బిలాల్ రదియల్లాహు అన్హు అన్నారు “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! నేను ఏదో ఒక పెద్ద సత్కారం ఏమి చేయట్లేదండి, కాకపోతే నా అలవాటు ఏమిటంటే నేను వుజూ చేసిన ప్రతిసారి రెండు రకాతుల నమాజ్ ఆచరిస్తాను. నా వుజూ భంగమైపోయిన వెంటనే మళ్ళీ నేను వుజూ చేసేస్తాను, వుజూ చేసిన వెంటనే మళ్ళీ నేను రెండు రకాతుల నమాజ్ ఆచరిస్తాను” అన్నారు. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన చేసిన ఆ సత్కార్యాన్ని మెచ్చుకున్నాడు కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అక్కడ బిలాల్ రదియల్లాహు అన్హు కాళ్ళ చప్పుడుని వినిపించాడు. ఒకరకంగా ఇక్కడ మనం మరొక విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి అదేమిటంటే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా బిలాల్ రదియల్లాహు అన్హు కి స్వర్గ శుభవార్త కూడా తెలియజేసేశాడు ఒకరకంగా ఇక్కడ.

అలాగే బిలాల్ రదియల్లాహు అన్హు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేస్తున్న రోజుల్లో ఒకసారి పండుగ రోజు వచ్చింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులకు ఖుత్బా వినిపించేసారు. ఆ తర్వాత మహిళల వద్దకు వెళ్లి మహిళలకు కూడా అల్లాహ్ వాక్యాలు వినిపించారు ఆ తర్వాత దానధర్మాలు చేయాలని ఆదేశించినప్పుడు, కోరినప్పుడు అక్కడ ఉన్న మహిళలందరూ వారు తొడిగిన నగలు తీసి విరాళంగా ఇచ్చేస్తున్నారు. అప్పుడు బిలాల్ రదియల్లాహు అన్హు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పక్కనే ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిలాల్ రదియల్లాహు అన్హు చేయి పట్టుకొని అక్కడ మహిళలకు ఉపన్యాసం ఇచ్చారు. ఎప్పుడైతే మహిళలు విరాళాలు ఇచ్చారో బిలాల్ రదియల్లాహు అన్హు అక్కడ దుప్పట పరిచిన తర్వాత మహిళలందరూ అందులో విరాళాలు వేశారు.

ఇక చివరిగా మరొక విషయం ఏమిటంటే ఉమర్ రదియల్లాహు అన్హు బిలాల్ రదియల్లాహు అన్హు వారిని చూసినప్పుడల్లా ఒక మాట అనేవారు “అబూబకర్ సయ్యిదునా ఆతకా సయ్యిదనా” అంటే అబూబకర్ రదియల్లాహు అన్హు మాకు నాయకుడు, మా నాయకుడు మా నాయకుడైన బిలాల్ ని స్వతంత్రుని చేసేసారు అనేవారు. అంటే బిలాల్ రదియల్లాహు అన్హు వారిని చూసినప్పుడల్లా ఉమర్ రదియల్లాహు అన్హు వారు బిలాల్ రదియల్లాహు అన్హు వారిని “మా నాయకుడు మా నాయకుడు మా నాయకుడు” అని చెప్పేవారు. వాస్తవానికి ఆయన బానిసగా జీవించినవాడు. కానీ ఇస్లాం లో నల్ల వారికి, తెల్ల వారికి, బానిసకి, స్వతంత్రునికి ఎలాంటి భేదం లేదు అల్లాహ్ దృష్టిలో అందరూ సమానులే అని చెప్పటానికి ఇది ఒక మంచి ఉదాహరణ.

కాబట్టి అభిమాన సోదరులారా, ఇది బిలాల్ రదియల్లాహు అన్హు యొక్క విశిష్టత, ఆయన యొక్క క్లుప్తమైన జీవిత చరిత్ర.

చివరిగా నేను అల్లాహ్ తో దువా చేస్తున్నాను అల్లాహ్ మనకు కూడా బిలాల్ రదియల్లాహు అన్హు మాదిరిగా అలాగే ఇతర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల మాదిరిగా దృఢమైన విశ్వాసంతో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించు గాక. ఇస్లాం పై నిలకడగా జీవితం గడిపే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఎలాంటి కష్టనష్టాలు, బాధలు లేకుండా ఇస్లాం ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

أَقُولُ قَوْلِي هَذَا، وَأَسْتَغْفِرُ اللَّهَ لِي وَلَكُمْ وَلِسَائِرِ الْمُسْلِمِينَ، فَاسْتَغْفِرُوهُ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ
(అఖూలు ఖౌలీ హాజా, వ అస్తగ్ ఫిరుల్లాహ లీ వలకుమ్ వ లిసాయీరిల్ ముస్లిమీన్, ఫస్తగ్ ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీమ్)
నేను ఈ మాట చెబుతూ, నా కోసం, మీ కోసం మరియు ముస్లిములందరి కోసం అల్లాహ్ క్షమాభిక్ష కోరుతున్నాను. కాబట్టి ఆయన వద్ద క్షమాపణలు వేడుకోండి, నిశ్చయంగా ఆయన క్షమించేవాడు, అత్యంత దయగలవాడు.

సహాబా (రదియల్లాహు అన్హుమ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1KN6AyXdv30x30ykoVkyVt

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ఈద్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూచనలు, సలహాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[34 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈద్ నమాజ్ & ఈద్ సున్నతులు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0ZEOdAJlFpkageyWnxdFM_

ఈద్ పండుగ మరియు రక్త సంబంధాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[34 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈద్ నమాజ్ & ఈద్ సున్నతులు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0ZEOdAJlFpkageyWnxdFM_

త్రాసును బరువు చేసే సత్కార్యాలు – జనాజ వెంట వెళ్ళడం, జనాజ నమాజు చేయడం [ఆడియో]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 24 నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan

[6:43 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://bit.ly/3xYzpbN

4వ కార్యం: జనాజ వెంట వెళ్ళడం, జనాజ నమాజు చేయడం

గొప్ప పుణ్య కార్యాల్లో ఒకటి; జనాజ వెంట వెళ్ళడం, జనాజ నమాజు చేయడం, దానిపై లభించే పుణ్యం బరువు మానవుని త్రాసులో ఉహద్ పర్వతం కంటే అధికిమించి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉబై బిన్ కఅబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

مَنْ تَبِعَ جَنَازَةً حَتَّى يُصَلَّى عَلَيْهَا، وَيُفْرَغَ مِنْهَا، فَلَهُ قِيرَاطَانِ، وَمَنْ تَبِعَهَا حَتَّى يُصَلَّى عَلَيْهَا، فَلَهُ قِيرَاطٌ، وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَهُوَ أَثْقَلُ فِي مِيزَانِهِ مِنْ أُحُدٍ

“ఎవరు నమాజు మరియు (ఖననం) అయ్యే వరకు జానాజ వెంట ఉంటాడో అతనికి రెండు ఖీరాతులు, మరెవరయితే కేవలం నమాజు అయ్యే వరకు దాని వెంట ఉంటాడో అతనికి ఒక ఖీరాతు లభిస్తుంది. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన (అంటే అల్లాహ్) సాక్షి! ఒక్క ఖీరాత్ బరువు అల్లాహ్ వద్ద ఉన్న త్రాసులో ఉహద్ పర్వతంకంటే ఎక్కువ ఉండును”. (అహ్మద్ 5/ 131 ఇది సహీ హదీస్).

ప్రవక్త ﷺ తెలిపారని, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَنْ شَهِدَ الجَنَازَةَ حَتَّى يُصَلِّيَ، فَلَهُ قِيرَاطٌ، وَمَنْ شَهِدَ حَتَّى تُدْفَنَ كَانَ لَهُ قِيرَاطَانِ، قِيلَ: وَمَا القِيرَاطَانِ؟ قَالَ: مِثْلُ الجَبَلَيْنِ العَظِيمَيْنِ

“ఎవరు జనాజలో పాల్గొని నమాజు చేస్తాడో అతనికి ఒక ఖీరాత్, మరెవరయితే (నమాజు మరియు) ఖననం అయ్యే వరకు పాల్గొంటాడో అతనికి రెండు ఖీరాతులు లభించును”. రెండు ఖీరాతులంటే ఏమిటి? అని ప్రశ్న వచ్చినప్పుడు, ప్రవక్త చెప్పారుః “రెండు పెద్ద కొండల వంటివి”.

(బుఖారి 1325, ముస్లిం 945, తిర్మిజి 1040, నిసాయి 1940, ఇబ్ను మాజ 1539, అహ్మద్ 2/ 401, ఇబ్ను హిబ్బాన్ 3080)

ముస్లింలో ఉంది: ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హు జనాజ నమాజు చేసుకొని వెళ్ళేవారు, ఎప్పుడయితే వారికి అబూహురైరా రజియల్లాహు అన్హు గారి ఈ హదీసు చేరిందో ‘వాస్తవానికి మనం అనేక ఖీరాతులు పోగుట్టుకున్నాము’ అని బాధ పడ్డారు.

ఇతర లింకులు:

త్రాసును బరువు చేసే సత్కార్యాలు – అల్లాహ్ కొరకు కోపాన్ని దిగమింగుట [ఆడియో]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 24 నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan

[10 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

3వ కార్యం: అల్లాహ్ కొరకు కోపాన్ని దిగమింగుట

ప్రవక్త ﷺ ఉపదేశించారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَا مِنْ جُرْعَةٍ أَعْظَمُ أَجْرًا عِنْدَ اللهِ، مِنْ جُرْعَةِ غَيْظٍ كَظَمَهَا عَبْدٌ ابْتِغَاءَ وَجْهِ اللهِ

“అల్లాహ్ వద్ద పుణ్యపరంగా అతి గొప్ప గుటక, అల్లాహ్ అభీష్ఠానికై దాసుడు మింగే కోపాగ్ని గుటక”.

(ఇబ్ను మాజ 4189, అహ్మద్ 2/ 128, అదబుల్ ముఫ్రద్ 1318, సహీహుత్తర్గీబ్: అల్బానీ 2752).

ఇలాంటి ఎన్ని సందర్భాలు మనకు ఎదురవుతాయి, అప్పుడు మనం ఈ హదీసును, ఈ గొప్ప పుణ్యఫలితాన్ని  గుర్తుకు తెచ్చుకుంటామా? అల్లాహ్ కొరకు మన కొపాన్ని మింగి పుణ్యాన్ని పొందుతామా?

అల్లాహ్ సుబ్ హానహు వతఆలా కోపం వచ్చినప్పుడు కోపం ప్రకారం ఆచరించడానికి శక్తి ఉండికూడా కోపాన్ని దిగమ్రింగేవారిని ప్రశంసించి, వారికి మన్నింపు, క్షమాపణ, స్వర్గప్రవేశ శుభవార్త ఇచ్చాడు.

الَّذِينَ يُنْفِقُونَ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ وَالكَاظِمِينَ الغَيْظَ وَالعَافِينَ عَنِ النَّاسِ وَاللهُ يُحِبُّ المُحْسِنِينَ * وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنْفُسَهُمْ ذَكَرُوا اللهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ وَمَنْ يَغْفِرُ الذُّنُوبَ إِلَّا اللهُ وَلَمْ يُصِرُّوا عَلَى مَا فَعَلُوا وَهُمْ يَعْلَمُونَ * أُولَئِكَ جَزَاؤُهُمْ مَغْفِرَةٌ مِنْ رَبِّهِمْ وَجَنَّاتٌ تَجْرِي مِنْ تَحْتِهَا الأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَنِعْمَ أَجْرُ العَامِلِينَ {آل عمران: 134-136}

“ఎవరు కలిమిలోనూ, లేమిలోనూ (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తారో మరియు కోపాన్ని దిగమ్రింగుతారో ఇంకా ప్రజలను మన్నిస్తారో, (ఇలాంటి) సజ్జనులను అల్లాహ్ ప్రేమిస్తాడు. మరెవరైతే (వారి ద్వారా) ఏదైనా అశ్లీల పని జరిగితే లేదా వారు తమపై అన్యాయం చేసుకుంటే, వెంటనే అల్లాహ్ ను స్మరించి తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. –నిజానికి అల్లాహ్ తప్ప పాపాలను క్షమించేవాడెవడున్నాడు?- వారి ద్వారా జరిగింది తప్పు అని తెలిసినప్పుడు దానిపై హటం చెయ్యరు (మంకుపట్టు పట్టరు). ఇలాంటి వారి ప్రతిఫలం, వారి ప్రభువు నుండి క్షమాభిక్ష మరియు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు. వారక్కడ శాశ్వతంగా ఉంటారు. సత్కార్యాలు చేసే వారికి ఎంతో శ్రేష్ఠమైన ప్రతిఫలం ఉంది”. (ఆలె ఇమ్రాన్ 3:134-136).

ఈ ఘనమైన ఫలం పైన మరో ప్రతిఫలం ఏమిటంటే; అతనికిష్టమైన హూరె ఐన్ (అందమైన పెద్ద కళ్ళుగల స్వర్గపు సుందర కన్య)ను ఎన్నుకునే స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. సహల్ బిన్ ముఆజ్ తన తండ్రితో ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః

مَنْ كَظَمَ غَيْظًا وَهُوَ قَادِرٌ عَلَى أَنْ يُنْفِذَهُ، دَعَاهُ اللهُ عَزَّ وَجَلَّ عَلَى رُءُوسِ الْخَلَائِقِ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يُخَيِّرَهُ اللهُ مِنَ الْحُورِ الْعِينِ مَا شَاءَ

“ఎవరు తన కోపాన్ని దిగమింగుతాడో, అతను దానిని అమలు పరచడానికి శక్తి ఉండి కూడా (దిగమింగుతాడో), అల్లాహ్ ప్రళయదినాన అతనిని ప్రజల ఎదుట పిలుస్తాడు, అతనికిష్టమైన హూరె ఐన్ ను ఎన్నుకునే అధికారం ఇస్తాడు”.

(అబూదావూద్ 4777, తిర్మిజి 2493, ఇబ్నుమాజ 4186, అల్బానీ సహీహుత్తర్గీబ్ 2753లో హసన్ అని చెప్పారు).

ఏదైనా ప్రాపంచిక వృధాకార్యం కోసం నీవు ఇంతటి గొప్ప పుణ్యాన్ని వదులుకుంటావా? ప్రజల్ని ఓటమికి గురి చేసేవాడు శక్తిశాలి కాదు, తన కోపాన్ని దిగమ్రింగేవాడు అసలైన శక్తిశాలి. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః

لَيْسَ الشَّدِيدُ بِالصُّرَعَةِ، إِنَّمَا الشَّدِيدُ الَّذِي يَمْلِكُ نَفْسَهُ عِنْدَ الغَضَب“

ఎదుటి వానిని చిత్తుచేసినవాడు శూరుడు కాదు, తాను ఆగ్రహానికి గురై నప్పుడు తన్ను తాను అదుపులో ఉంచుకున్నవాడే అసలైన శూరుడు”.

(బుఖారి 6114, ముస్లిం 2609, అహ్మద్ 2/ 236.).

ఇతర లింకులు:

త్రాసును బరువు చేసే సత్కార్యాలు – సత్ప్రవర్తన (Good Character) [ఆడియో]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 23 నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan

[9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

2వ కార్యం: సద్వర్తన

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సద్వర్తనను ప్రశంసించారు, త్రాసులో దాని గొప్ప పుణ్యాన్ని, ఘనతను స్పష్టంగా తెలిపారు. అందుకే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సద్వర్తన గురించి అల్లాహ్ ను అర్థించేవారు, దుష్ప్రవర్తన నుండి అల్లాహ్ శరణు కోరేవారు.

ప్రవక్త ﷺ ఇలా తెలియజేశారని, అబూ దర్దా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَا شَيْءٌ أَثْقَلُ فِي مِيزَانِ المُؤْمِنِ يَوْمَ القِيَامَةِ مِنْ خُلُقٍ حَسَنٍ، وَإِنَّ اللهَ لَيُبْغِضُ الفَاحِشَ البَذِيءَ

“ప్రళయదినాన విశ్వాసి త్రాసులో సద్వర్తన కంటే బరువైన వస్తువు మరొకటి ఉండదు. నిశ్చయంగా అల్లాహ్ దుర్భాషలాడేవాడిని, బూతు పలికేవాడిని అసహ్యించుకుంటాడు”. (తిర్మిజి 2002, అబూదావూద్ 4799, ఇబ్నుహిబ్బాన్ 5693, బైహఖీ 20587, సహీహుల్ జామిః అల్బానీ 5632).

ఆయనే ఉల్లేఖించిన మరో ఉల్లేఖనం ఇలా ఉందిః

أَثْقَلُ شَيئٍ فِي الْـمِيزَانِ الخُلُقُ الحَسَن

“త్రాసులో అన్నిటికంటే బరువైన వస్తువు ఉత్తమ నడవడికయే”. (ఇబ్ను హిబ్బాన్ 481, అహ్మద్ 6/ 452, సహీహుల్ జామిః అల్బానీ 134).

మరో ఉల్లేఖనంలో ఉంది, ప్రవక్త ﷺ తెలిపారు:

مَنْ أُعْطِيَ حَظَّهُ مِنَ الرِّفْقِ فَقَدْ أُعْطِيَ حَظَّهُ مِنَ الْخَيْرِ، وَمَنْ حُرِمَ حَظَّهُ مِنَ الرِّفْقِ، فَقَدْ حُرِمَ حَظَّهُ مِنَ الْخَيْرِ، أَثْقَلُ شَيْءٍ فِي مِيزَانِ الْمُؤْمِنِ يَوْمَ الْقِيَامَةِ حُسْنُ الْخُلُقِ، وَإِنَّ اللَّهَ لَيُبْغِضُ الْفَاحِشَ الْبَذِيَّ

“ఎవరికి మెతకవైఖరిలోని కొంత భాగం ప్రాప్తమయిందో అతనికి మంచితనం, మేలు కొంత వరకు ప్రాప్తమయినట్లే. మరెవరైతే మెతకవైఖరిలోని కొంత భాగాన్ని కూడా నోచకోలేదో అతనికి అంత మేలు కూడా ప్రాప్తం కాలేదన్న మాట. ప్రళయదినాన విశ్వాసి త్రాసులో బరువుగల వస్తువు ఉత్తమ నడవడిక. నిశ్చయంగా అల్లాహ్ దుర్భాషలాడేవాడిని, బూతు పలికేవాడిని అసహ్యించుకుంటాడు”. (అదబుల్ ముఫ్రద్: బుఖారి 464, సహీ అదబుల్ ముఫ్రద్: అల్బానీ 361, బైహఖీ 20587, ఇబ్ను హిబ్బాన్ 5695).

ముల్లా అలీ ఖారీ రహిమహుల్లాహ్ చెప్పారుః అల్లాహ్ కు అసహ్యకరమైన ప్రతీది బరువు రహితంగా, విలువ లేనిది, అలాగే  అల్లాహ్ కు ఇష్టమైన, ప్రీతికరమైన ప్రతీది అతని వద్ద చాలా గొప్పది. అల్లాహ్ అవిశ్వాసుల, సత్యతిరస్కారుల విషయంలో ఇలా చెప్పాడుః “మేము ప్రళయదినాన వారి త్రాసును బరువుగా చేయము”. (కహఫ్ 18:105). ప్రఖ్యాతిగాంచిన ఓ హదీసులో ఇలా ఉందిః “రెండు పదాలున్నాయి, అవిః నాలుకపై చాలా సులభంగా, త్రాసులో బరువుగా ఉన్నాయి మరియు కరుణామయునికి చాలా ప్రియమైనవి కూడా. అవేః సుబ్ హానల్లాహి వబిహందిహీ సుబ్ హానల్లాహిల్ అజీం”. (మిర్ఖాతుల్ మఫాతీహ్ షర్హు మిష్కాతుల్ మసాబీహ్: ముల్లా అలీ ఖారీ 8/ 809).

ఉత్తమ నడవడిక అలవర్చుకొనుటకు అధికంగా దోహదపడే విషయాలు ఇవిః ఖుర్ఆన్ పారాయణం ఎక్కువగా చేయడం, వాటి భావార్థాలను గ్రహించడం, పుణ్యపురుషుల సన్నిధిలో ఉండడం, వారికి సన్నిహుతులుగా ఉండడం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులను పఠించడం, ఇంకా సద్వర్తన ప్రసాదించాలని అల్లాహ్ ను వేడుకోవడం.

ఇబ్ను మస్ఊద్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) అద్దంలో చూసినప్పుడు ఇలా అనేవారుః

اللَّهُمَّ كَمَا حَسَّنْتَ خَلْقِي فَحَسِّنْ خُلُقِي
అల్లాహుమ్మ కమా హస్సంత ఖల్ఖీ ఫ హస్సిన్ ఖులుఖీ
“ఓ అల్లాహ్! నీవు నా సృష్టిని (ఆకారాన్ని) సరిదిద్దినట్లు నా నడవడికను కూడా సరిదిద్దు”.

(ఇబ్ను హిబ్బాన్ 959, అహ్మద్ 1/ 403, అబూ యఅలా 5075, సహీహుల్ జామిః అల్బానీ 1307. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ ఇర్వాఉల్ ఘలీల్74లో వ్రాసారు: అద్ధం చూస్తూ దుఆ చదవాలని వచ్చిన హదీసులన్నీ జఈఫ్, అయితే సామాన్య స్థితుల్లో చదవవచ్చును).

ప్రవక్త( సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా దుఆ చేసేవారని ఖుత్బా బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ مُنْكَرَاتِ الأَخْلَاقِ، وَالأَعْمَالِ وَالأَهْوَاءِ

అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ మున్ కరాతిల్ అఖ్లాఖి వల్ అఅమాలి వల్ అహ్వా.

“ఓ అల్లాహ్! దుష్ ప్రవర్తన నుండి, దుష్కార్యాల నుండి మరియు చెడు కోరికల నుండి నీ శరణులోకి వస్తున్నాను”.

(తిర్మిజి 3591, ఇబ్ను హిబ్బాన్ 960, హాకిం 1949, సహీహుల్ జామిః అల్బానీ 1298).

తెలుసుకోండి! విశ్వాసుల్లో సంపూర్ణ విశ్వాసం గలవారు; తమ సద్వర్తనలో అతిఉత్తమంగా ఉన్నవారే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

أَكْمَلُ الْـمُؤْمِنِينَ إِيمَانًا أَحْسَنُهُمْ خُلُقًا، وَإِنَّ حُسْنَ الْـخُلُقِ لَيَبْلُغُ دَرَجَةَ الصَّوْمِ وَالصَّلَاةِ

“విశ్వాసుల్లో సంపూర్ణ విశ్వాసం గలవారు అతిఉత్తమ సద్వర్తన గలవారే, నిశ్చయంగా ఉత్తమ నడవడిక నమాజ్, ఉపవాసాల స్థానానికి చేరుకుంటుంది”. (సహీహుల్ జామిః అల్బానీ 1578, బజ్జార్ 7445, అబూయాలా 4166).

ఇతర లింకులు:

త్రాసును బరువు చేసే సత్కార్యాలు – 01| సంకల్పశుద్ధి [ఆడియో]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 23 నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం]
https://teluguislam.net/books/deeds-heavy-meezan

[12:25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ముస్లిం తన పుణ్యాల అకౌంట్ పెరుగుతూ ఉండాలని చాలా కాంక్షిస్తాడు, అందుకు మరియు ప్రళయదినాన తన పుణ్యాల త్రాసు బరువుగా ఉండుటకు తన ఇహలోక జీవితంలో సాధ్యమైనంత వరకు అధికంగా పుణ్యాలు సమకూరుస్తూ ఉంటాడు. సాధ్యమైనంత వరకు తక్కువ పాపాలు చేస్తూ ఉంటాడు. ఎవరి పుణ్యాల త్రాసు బరువుగా ఉంటుందో వారే గొప్ప అదృష్టం పొందుతారు, ఆ తర్వాత ఎప్పుడూ అతనికి దురదృష్టం అనేది ఉండదు, తద్వారా మనసు మెచ్చిన విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉన్నతమైన స్వర్గవనంలో ఉంటాడు. అల్లాహ్ ఇలా తెలిపాడుః

فَأَمَّا مَنْ ثَقُلَتْ مَوَازِينُهُ * فَهُوَ فِي عِيشَةٍ رَاضِيَةٍ * وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ * فَأُمُّهُ هَاوِيَةٌ * وَمَا أَدْرَاكَ مَا هِيَهْ * نَارٌ حَامِيَةٌ

ఎవరి త్రాసు పళ్ళాలు బరువుగా ఉంటాయో అతను మనసు మెచ్చిన భోగభాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు. మరెవరి త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో అతని నివాస స్థానం ‘హావియా’ అవుతుంది, అదేమిటో (హావియా అంటేమిటో) నీకేం తెలుసు? అది దహించివేసే అగ్ని. (ఖారిఅహ్ 101:6-11).

అనేక మంది ఇహలోకంలో ధనవంతులు కావాలనుకుంటారు, అందుకోసం తమ సిరిసంపదల పెంపుదల మరియు త్వరగా ఐశ్వర్యవంతులు అయ్యే సూచనలు సూచించే పుస్తకాలు ఎన్నుకొని శ్రద్ధగా చదువుతూ ఉండడం చూస్తుంటాము. అలాంటప్పుడు మనం కూడా ఎన్నటికీ అంతం కాని, దోచుకోబడని ధనం గురించి తెలుసుకోవడం చాలా మంచిది, ధనం సమకూర్చ- డానికి కాంక్షించే విధంగా సత్కార్యాలు సమకూర్చడానికి కాంక్షించాలి. ఇహలోక సంపద అంతం అవుతుంది, సదా ఉండదు, పరలోక సంపద శాశ్వాతమైనది, అంతం కానిది. ఇహలోకంతో పాటు పరలోకంలో కూడా మనం ధనికులవడం ఏ మాత్రం పాపం కాదు. అల్లాహ్ గొప్ప నిరపేక్షాపరుడు, ధనవంతుడు, ఉదారుడు.

నీవు త్వరగా పరలోక దనవంతుడివి కాదలచుకుంటే త్రాసును బరువుగా చేసే సత్కార్యాల వెంట పడాలి. అల్లాహ్ దయతో ఈ పుస్తకం నీ త్రాసును బరువుగా చేసే సత్కార్యాల వైపునకు నీకు దారి చూపుతుంది.

అందుకు ప్రతి ముస్లిం, విద్యనభ్యసించడం మరియు అభ్యసించిన విద్యను ఆచరణలోకి తీసుకురావడంలో అలసటకు, అశ్రద్ధకు గురికాకూడదు. ఎంతో మంది నీ ముందు ఉన్న ఈ పుస్తకంలోని ఘనతల పట్ల అజ్ఞానంలో ఉన్నారు, వాటిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు, వాటి గురించి ప్రశ్నించే, వెతికే ప్రయత్నమూ చేయరు. అందుకు అల్లాహ్ యొక్క గొప్ప వరం; అల్లాహ్ మనకు ధర్మం, సత్యం నేర్పాడు, దాని వైపునకు మార్గం చూపాడు, ఇక ఆ ధర్మం, సత్యం పట్ల మనకు సంపూర్ణ ప్రేమ కలగాలని, అది మన హృదయాలకు శోభాయమానంగా అవ్వాలని వాటిని ఎల్లవేళల్లో ఆచరణలో ఉంచుటకు అల్లాహ్ తో దుఆ చేయాలి, ఇది మనకు ఆ రోజు తప్పకుండా లాభాన్నిస్తుంది ఏ రోజయితే దుర్మార్గుడు, విద్య నేర్చుకోనివాడు, మరియు ఆచరించనివాడు తన చేతులను కొరుకుతూ ఇలా అంటాడు: అయ్యో! నేనీ పరలోక జీవితం కోసం ముందుగానే సత్కార్యాలు చేసుకొని ఉంటే ఎంత బావుండేది? ఇది గంభీరమైన (Serious) విషయం, పరిహాసం (Joke) కాదు, శాశ్వతంగా స్వర్గంలో లేదా శాశ్వతంగా నరకంలో ఉండవలసి ఉంటుంది. అల్లాహ్ ఆ నరకం నుండి మనందరినీ రక్షించుగాక!

1వ కార్యం: మాటల్లో, చేతల్లో సంకల్పశుద్ధి

ప్రతి కార్యానికి పునాది సంకల్పశుద్ధి. ఏ కార్యం  ఎంత సంకల్ఫశుద్ధితో కూడుకొని ఉంటుందో త్రాసులో అంతే బరువుగా ఉంటుంది, అది కొంచమైనా సరే. ఒకవేళ చూపుగోలు, పేరు, ప్రఖ్యాతులతో సమ్మిళితమై ఉంటే త్రాసు తేలికగా ఉంటుంది, అది ఎంత ఎక్కువగా అయినప్పటికీ సూక్ష్మకణాలుగా, దుమ్ము, ధూళివలే అయిపోతుంది (అంటే రవ్వంత పుణ్యం లభించదు). అల్లాహ్ సుబ్ హానహు వతఆలా వద్ద కర్మల ఘనత, వాటిని చేసేవారి మనస్సులో ఉండే సంకల్పశుద్ధిని మరియు వారిలో ఉండే అల్లాహ్ పట్ల ప్రేమను బట్టి పెరుగుతూ, తరుగుతూ ఉంటుంది.

عَنْ أَبِي أُمَامَةَ الْبَاهِلِيِّ t، قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ ﷺ، فَقَالَ: أَرَأَيْتَ رَجُلًا غَزَا يَلْتَمِسُ الْأَجْرَ وَالذِّكْرَ، مَالَهُ؟ فَقَالَ رَسُولُ اللَّهِ ﷺ: لَا شَيْءَ لَهُ فَأَعَادَهَا ثَلَاثَ مَرَّاتٍ، يَقُولُ لَهُ رَسُولُ اللَّهِ ﷺ: لَا شَيْءَ لَهُ ثُمَّ قَالَ: إِنَّ اللهَ لَا يَقْبَلُ مِنَ الْعَمَلِ إِلَّا مَا كَانَ لَهُ خَالِصًا، وَابْتُغِيَ بِهِ وَجْهُهُ

అబూ ఉమామహ్ బాహిలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఓ మనిషి వచ్చి, ‘ఒక వ్యక్తి పుణ్యఫలం మరియు పేరుప్రఖ్యాతులనుద్దేశించి పోరాడుతుంటే అతనికి ప్రాప్తమయ్యేదేమిటి?’ అని అడిగాడు. “అతనికి ఏ పుణ్యమూ దక్కదు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానమిచ్చారు. ఆ మనిషి తిరిగి మూడు సార్లు అదే ప్రశ్న అడిగాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అతనికి ఏ పుణ్యమూ దక్కదు” అని మూడు సార్లు జవాబిచ్చారు, మళ్ళీ ఆ తర్వాత ఇలా చెప్పారుః “అల్లాహ్ సంకల్పశుద్ధితో, ఆయన అభీష్టాన్ని కోరుతూ చేసిన సత్కార్యాన్ని మాత్రమే స్వీకరిస్తాడు”. (నిసాయి 3140, తబ్రానీ కబీర్ 7628, సహీహుల్ జామి 1856).

అబ్దుల్లాహ్ బిన్ ముబారక్ రహిమహుల్లాహ్ చెప్పారుః ‘ఒక చిన్న కార్యాన్ని సంకల్పం గొప్పదిగా, పెద్దదిగా చేయవచ్చు, ఒక పెద్ద కార్యాన్ని సంకల్పం చిన్నదిగా చేయవచ్చు’. (జామిఉల్ ఉలూమి వల్ హికం, రచయితః ఇబ్ను రజబ్ అల్ హంబలీ 1/71).

మైమూన్ బిన్ మహ్రాన్ రహిమహుల్లాహ్ చెప్పారుః ‘మీ ఆచరణలు ఉన్నవే చాలా తక్కువ, ఆ తక్కువవాటిని సంకల్పశుద్ధితో ఆచరించండి’. (హిల్ యతుల్ ఔలియా వ తబ్ ఖతుల్ అస్ఫియా, రచయితః అబూ నుఐమ్ 4/92).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారని అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

الصَّلَاةُ فِي جَمَاعَةٍ تَعْدِلُ خَمْسًا وَعِشْرِينَ صَلَاةً فَإِذَا صَلَّاهَا فِي فَلَاةٍ فَأَتَمَّ رُكُوعَهَا وَسُجُودَهَا بَلَغَتْ خَمْسِينَ صَلَاةً

“సామూహికంగా చేసే నమాజు (ఒంటరిగా చేసే) పాతిక నమాజులకు సమానంగా ఉంటుంది. ఒకవేళ అతను అదే నమాజు ఏదైనా ఎడారి ప్రాంతంలో చేస్తూ, రుకూ, సజ్దాలు సంపూర్ణంగా చేస్తే యాబై నమాజులకు సమానంగా చేరుతుంది”. (అబూదావూద్ 560, ఇబ్ను హిబ్బాన్ 1749, హాకిం 753, సహీహుల్ జామిః అల్బానీ 3871).

అతను (ఎడారిలో) ఒంటరిగా ఎందుకు నమాజు చేశాడు? నమాజు గురించి అతనికి గుర్తు చేయడానికి ఏ ముఅజ్జిన్ యొక్క అజాన్ మరియు తోటి స్నేహితుడు అంటూ లేడు? రుకూ, సజ్దాలు సంపూర్ణంగా, ఎంతో హుందాతనంతో, తృప్తిగా నమాజు చేశాడు? ఎందుకనగా అతడు సంకల్ఫశుద్ధితో, అల్లాహ్ కొరకు మాత్రమే చేశాడు, అల్లాహ్ అతడ్ని కనిపెట్టి ఉన్నాడన్న భావన కలిగి ఉన్నాడు అందుకే అతనికి అధిక రెట్లు ప్రతిఫలం లభించింది.

అందుకే సలమా బిన్ దీనార్ రహిమహుల్లాహ్ చెప్పారు: “నీవు నీ పాపాలను ఎంత గుప్తంగా చేస్తావో అంతకంటే ఎక్కువ గుప్తంగా పుణ్యకార్యాలు చేయు.” (హిల్యతుల్ ఔలియా వ తబ్ ఖతుల్ అస్ఫియాః అబూ నుఐమ్ 3/240).

అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః

بَيْنَمَا كَلْبٌ يُطِيفُ بِرَكِيَّةٍ، كَادَ يَقْتُلُهُ العَطَشُ، إِذْ رَأَتْهُ بَغِيٌّ مِنْ بَغَايَا بَنِي إِسْرَائِيلَ، فَنَزَعَتْ مُوقَهَا فَسَقَتْهُ فَغُفِرَ لَهَا بِهِ

“మరణావస్థకు చేరబోతున్న ఓ కుక్క ఒక బావి చుట్టూ తిరగసాగింది, ఇస్రాఈల్ సంతతికి చెందిన వ్యభిచారిణిల్లో ఒకామె ఆ కుక్కను చూసింది, వెంటనే తన కాలిజోడులో నీళ్ళు నింపి ఆ కుక్కకు త్రాగించింది. అందుకై ఆమెను మన్నించడం జరిగింది”. (బుఖారి పదాలు 3467, ముస్లిం 2245).

ఇబ్ను తైమియ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు: “స్వచ్ఛమైన విశ్వాసంతో ఆమె కుక్కకు త్రాగించింది. అందుకని క్షమించబడింది. అలా అని కుక్కకు నీళ్ళు త్రాగించే ప్రతి వ్యక్తి మన్నింపు జరగదు“. (మిన్ హాజ్…3/ 183, మదారిజ్…1/ 332).

పూర్తి భాగాలు క్రింద వినండి 

ప్రళయదినాన త్రాసులో తూకం చేయబడేటివి ఏమిటి? [మరణానంతర జీవితం – పార్ట్ 21 & 22] [ఆడియో & టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

మరణాంతర జీవితం – పార్ట్ 21 & 22 [ఆడియో] [43:19 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మాబాద్.. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. మహాశయులారా, ఈనాటి శీర్షిక ప్రళయ దినాన త్రాసులో తూకం చేయబడేటివి ఏమిటి?

దీనికి సంబంధించిన ఖురాన్ ఆయతులు మరియు హదీసులను పరిశీలిస్తే, అందులో తూకం చేయబడేటివి మూడు విషయాలు అని మనకు తెలుస్తున్నాయి. మొదటిది, స్వయంగా మనిషిని కూడా తూకం చేయడం జరుగుతుంది. రెండవది, మనిషి యొక్క కర్మలను తూకం చేయడం జరుగుతుంది. మూడవది, మనిషి కర్మ పత్రాలు, వాటిని కూడా తూకం చేయడం జరుగుతుంది.

ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా మనకు లాభం ఏమిటి? లాభం ఏమిటంటే, ఈ మూడిటిలో ఏ ఒకటైనా గాని లేదా ఈ మూడిటిని కూడా తూకం చేయబడే సందర్భంలో, ఇంతకుముందే కొంచెం మనం తెలుసుకున్నట్లు, విశ్వాసం మరియు సత్కార్యాలు ఉన్నప్పుడే మన పల్యాలు బరువుగా ఉంటాయి. మరియు ఎవరి పల్యాలు బరువుగా ఉంటాయో వారే సాఫల్యం పొందుతారు. మరి ఎవరి పల్యాలు తేలికగా ఉంటాయో వారు నరకంలో చేరుతారు.

దీని గురించి ఆయతులు సూరె అన్ఆమ్ లో, సూరె అంబియాలో, సూరతుల్ ముఅ్‌మినూన్ లో మరియు అల్ ఖారిఆ సూరాలో ఉన్నాయి:

فَاَمَّا مَنْ ثَقُلَتْ مَوَازِيْنُهٗ فَهُوَ فِيْ عِيْشَةٍ رَّاضِيَةٍ
“ఎవరి కర్మ పళ్ళాలు బరువుగా ఉంటాయో అతను తనకు నచ్చిన, మెచ్చిన జీవితం గడుపుతూ ఉంటాడు స్వర్గంలో.”

وَاَمَّا مَنْ خَفَّتْ مَوَازِيْنُهٗ فَاُمُّهٗ هَاوِيَةٌ
“మరియు ఎవరి కర్మ పళ్ళాలు తేలికగా ఉంటాయో అతని స్థానం హావియా ఉంటుంది.”

وَمَآ اَدْرٰىكَ مَا هِيَهْ
“ఆ హావియా అంటే ఏమి తెలుసు నీకు?”

نَارٌ حَامِيَةٌ
“అది భగభగ మండే నరకాగ్ని.”

అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరినీ దాని నుండి రక్షించు గాక. ఇలాంటి విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఒక దొంగ, ఇక్కడే దగ్గర ఎక్కడో కెమెరాలు ఉన్నాయి, పోలీసు వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు అని అర్థం అవుతుందో, అతడు దొంగతనానికి మరీ ప్రయత్నం చేస్తాడా? చేయడు కదా. అలాగే ఎల్లప్పుడూ ఆ సృష్టికర్త మనల్ని చూస్తూ ఉన్నాడు, కర్మ పత్రాల్లో మనం చేసే ప్రతి పని రాయబడుతూ ఉన్నది, రేపటి రోజు వీటన్నిటినీ కూడా తూకం చేయడం జరుగుతుంది—ఇలాంటి భయం ఎంత మనకు ఎక్కువగా ఉంటుందో, ఇలాంటి విషయాలు ఎంత మనకు ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయో, అంతే మనం పాపాల నుండి దూరం ఉండి పుణ్యాలు చేయగలుగుతాము. ఈ పరలోకానికి సంబంధించిన, మరణానంతర జీవితానికి సంబంధించిన ఈ సబ్జెక్టులన్నీ కూడా ఇన్ని ఎపిసోడ్లు మీ ముందు తెలియజేయడానికి ముఖ్య కారణం కూడా ఏంటి? ఇహలోక జీవితం మనకు ఒకేసారి లభిస్తుంది. దీన్ని గనక మనం సద్వినియోగం చేసుకొని విశ్వాస మార్గం అవలంబించి సత్కార్యాలలో ఇంకా ముందుకు ఎగసిపోతూ ఉంటేనే మనకు లాభం ఉంటుంది లేదా అంటే మనం చాలా నష్టంలో పడిపోతాము.

సూరతుల్ బఖర వ్యాఖ్యానం (తఫ్సీర్) [వీడియోలు]

బిస్మిల్లాహ్

యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2dRu8fRCd0UKGyWqqmdKwk

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఖుర్’ఆన్ – మెయిన్ పేజీ
https://teluguislam.net/quran/

ఖురాన్ వ్యాఖ్యానం (తఫ్సీర్): సూరా బఖర:

 

రమదాన్ ప్రశ్నోత్తరాలు -1441 (2020) [వీడియో క్లిప్స్]

బిస్మిల్లాహ్

రమదాన్ ప్రశ్నోత్తరాలుయూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3mzGxNLLy0jrSx_hUz86gq

ఉపవాసమున్నప్పుడు నోటిలో వచ్చే ఉమ్మిని మింగవచ్చా? మిస్వాక్ చేసుకుంటే నోటిని నీళ్లతో కడగవచ్చా?
https://bit.ly/3cT6o95

లాక్ డౌన్లో ఇంట్లో తరావీ & మిగతా నమాజులు ఫామిలీ జమాత్ తో ఎలా చేయాలి?
https://bit.ly/3rO2rGQ

మహ్రమ్ కానీ స్త్రీలు ఉంటే ఇంట్లో తరావీ నమాజు ఎలా చేయాలి? పరదా ఉండాలా?
https://bit.ly/3sVpwsC

తరావీ నమాజు సున్నత్ లేక నఫిల్ నమాజా?
https://bit.ly/3mkYkRA

తరావీ నమాజు లో ప్రతి నాలుగు రకాతుల తర్వాత రెస్ట్ లో చేసుకొనే ప్రవక్త గారి దుఆ ఎమన్నా ఉందా?
https://bit.ly/3fRjy8x

తరావీ నమాజులో ఖురాన్ చూసి చదవచ్చా?
https://bit.ly/2PGoh23

గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే స్త్రీలు ఉపవాసం ఉండకుండా ఫిద్య (fidyah) ఇవ్వవచ్చా?
https://bit.ly/31PlSo7

లాక్ డౌన్ వల్ల మసీదులలో నమాజు నిషేధిస్తే, మనం కొంతమంది కూడి జమాత్ చేస్తుంటే జాయిన్ కావచ్చా?
https://bit.ly/3mm6SHM

తరావీ నమాజు పద్ధతి ఎలా చేయాలో చెప్పగలరు
https://bit.ly/3rTljUX

ఫిద్య అనేది ఆహార రూపంలోనే ఇవ్వాలా? డబ్బు రూపంలో ఇవ్వవచ్చా?
https://bit.ly/3wwGIXt