ముహర్రం నెల వాస్తవికత

బిస్మిల్లాహ్

ముహర్రం నెల విశిష్టత:

అరబీలో పదోవ తేదిని ‘ఆషూరా’ అని అంటారు. ముహర్రం నెలలో పదవ తేదిన పాటించే ఉపవాసాన్ని ఆషూరా ఉపవాసం అని అంటారు.

అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌ గ్రంథంలో ఇలా తెలియజేశాడు:

إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ

“నెలల సంఖ్య అల్లాహ్‌ దగ్గర అల్లాహ్‌ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజు నుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతున్నది) వాటిలో నాలుగు మాసాలు నిషిద్దమైనవి (గౌరవప్రదమైనవి) ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి.” (సూరతు తౌబా:336).

నాలుగు మాసాల గురించి ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు;

ముహర్రం నెల వాస్తవికత

“కాలం తరిగి తిరిగి యధాస్థితికి – అల్లాహ్ భూమ్యాకాశాలను సృష్టించిన  నాటి స్థితికి – వచ్చేసింది. ఏడాదిలో పన్నెండు మాసాలుంటాయి. వాటిలో నాలుగు మాసాలు విశిష్టమైనవి (పవిత్రమైనవి) వాటిలో మూడు మాసాలు ఒక దాని తరువాత ఒకటి వస్తాయి. అవే జుల్‌ ఖాదా, జుల్‌ హజ్‌, ముహర్రం. నాల్లవ మాసం రజబ్‌. ఇది జమాదివుల్‌ ఆఖిర్‌ నెలకీ – షాాబాన్‌ నెలకీ మధ్యన ఉంటుంది.” (బుఖారి:2958, ముస్లిం:3179)

హజ్రత్ అబూ హురైరా (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు;

ముహర్రం నెల వాస్తవికత

“రమజాన్‌ తరువాత అల్లాహ్‌ మాసమయిన ముహర్రం నెలలో పాటించబడే ఉపవాసాలు అత్యంత శ్రేష్టమైనవి. అలాగే ఫర్జ్ నమాజుల తరువాత పాటించబడే (నఫిల్‌) నమాజుల్లో తహజ్జుద్ నమాజు అత్యంత శేష్టమైనది.” (ముస్లిం :1982)

ముహర్రం మాసపు ఘనతను తెలియజేయటానికి దానిని “అల్లాహ్‌ మాసం” అని అనటం జరిగింది. ఉదాహరణకు అల్లాహ్‌ గృహం, అల్లాహ్‌ ఒంటె అని ఖుర్‌ఆన్‌లో పేర్కొనడం జరిగింది. అల్లాహ్‌ అలా పేర్కొనంత మాత్రన అవి అల్లాహ్‌కు అవసరమైన వస్తువులు అని అర్ధం కాదు. కాని అల్లాహ్‌ వాటి విశిష్టతను వివరించటము దాని ఉద్దేశం.

ముహర్రం నెలలో ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) సాంప్రదాయం

హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హా) కథనం ప్రకారం ఖురైష్‌ జాతి ప్రజలు ఇస్లాం రాక మునుపు అజ్ఞాన కాలంలో ముహర్రం నెలలో ఆషూరా నాటి ఉపవాసం పాటించేవారు. మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు కూడా ఆ ఉపవాసాన్ని పాటించేవారు. తరువాత ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) మదినాకు వచ్చినప్పుడు కూడా ఆ ఉపవాసాన్ని పాటించేవారు, సహాబాలను కూడా ఆ ఉపవాసాన్ని పాటించమని ఆదేశించేవారు. ఆ తరువాత రమాజాన్‌ ఉపవాసాలు విధి గావించబడ్డాయి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆషూరా ఉపవాసం గురించి:

ముహర్రం నెల వాస్తవికత

“ఇది ఆషూరా రోజు అల్లాహ్‌ మీపై ఈ ఉపవాసాన్ని విధిగావించలేదు. అయినా నేను ఉపవాసం ఉంటున్నాను. కనుక మీలో ఎవరైనా ఆ ఉపవాసాన్ని పాటించాలనుకున్న వారు పాటించండి, లేదంటే మానుకోండి” అని అన్నారు. (బుఖారి:1864, ముస్లిం: 1909)

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్‌ అబ్బాస్‌ (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) మక్కా నుండి మదినాకు వలస వచ్చినప్పుడు మదినాలోని యూదులు ముహర్రం మాసపు పదొవ తేదీన ఉపవాసం పాటించటాన్ని గమనించారు. వారిని ఉద్దిశించి, “మీరు ఈ రోజు ఉపవాసం ఎందుకు పాటిస్తున్నారు?” అని అడిగారు. దానికి యూదులు, అల్లాహ్‌ ఈ రోజు మూసా ప్రవక్తకు ఫిరౌన్‌ ఆగడాల నుండి విముక్తి ప్రసాదించాడు. ఆ సంతోష ఘడియల్ని పురస్కరించుకొని మేము ఈ రోజు ఉపవాసం పాటిస్తాం” అని చెప్పారు. అది విని ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) “మూసా ప్రవక్త సంతోషంలో పాలుపంచుకోవటానికి మీకంటే మేము ఎక్కువ హక్కుదారులం” అంటూ ఆయన కూడా ఆ రోజు ఉపవాసం పాటించారు. మరియు సహాబాలను కూడా ఉపవాసం పాటించమని ఆదేశించారు. (బుఖారి:1865,ముస్లిం:1911)

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్‌ అబ్బాస్‌ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

ముహర్రం నెల వాస్తవికత

“ఒక వేళ నేను వచ్చే సంవత్సరం వరకు బతికుంటే ముహర్రం మాసపు తొమ్మిదో తేదిన కూడా ఉపవాసం పాటిస్తాను.” (ముస్లిం:1917)

హజ్రత్ ఇబ్నె అబ్బాస్‌ (రజియల్లాహు అన్హు) కథనం ప్రకారం: “ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆషూరా రోజు (ముహర్రం నెల పదో తేదీన స్వయంగా ఉపవాసం ఉన్నారు. మరియు ఆ రోజు ఉపవాసం పాటించమని ఆదేశించారు” (బుఖారి:1865, ముస్లిం: 1911)

హజ్రత్ అబూ ఖతాదా (రజియల్లాహు అన్హుు) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని ఆషూరా నాటి ఉపవాసం (ఘనతను) గురించి అడగటం జరిగింది. అందుకాయన సమాధానమిస్తూ, “అది గత సంవత్సరపు పాపాలన్నిటినీ తుడిచిపెట్టేస్తుంది” అని చెప్పారు. (ముస్లిం :1977)

అహ్లె బైత్‌ (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటివారి) విశిష్టత:

అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌ గ్రంథంలో ఇలా తెలియజేశాడు:

إِنَّمَا يُرِيدُ اللَّهُ لِيُذْهِبَ عَنكُمُ الرِّجْسَ أَهْلَ الْبَيْتِ وَيُطَهِّرَكُمْ تَطْهِيرًا

“ఓ ప్రవక్త ఇంటివారలారా! మీ నుండి (అన్నిరకాల) మాలిన్యాన్ని దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలన్నది అల్లాహ్‌ అభిలాష.”(సూరతుల్‌ అహజాబ్ :33)

ఈ ఆయతు ద్వారా మరియు ఖుర్‌అన్‌లో ఉన్న అనేక ఆయతుల ద్వారా కూడా తెలిసేదేమంటే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సతీమణులందరూ ‘అహ్లెబైత్‌’ విశిష్ట స్థానానికి చెందినవారు. మరియు హజ్రత్ అలీ, ఫాతిమా, హసన్‌, మరియు హుసైన్‌ వారందరు కూడా ‘అహ్లెబైత్‌’ కి చెందినవారే.

హజ్రత్ ఉమ్మె సల్మా (రజియల్లాహు అన్హు ఉల్లేఖనం): ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నా ఇంట్లో ఉండగా:

ముహర్రం నెల వాస్తవికతఓ ప్రవక్త ఇంటివారలారా! మీ నుండి (అన్ని రకాల) మాలిన్యాన్ని దూరం చేయాలన్నది,…..

అనే ఖుర్‌ఆన్‌ ఆయతు అవతరించింది. తరువాత ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు, ఒక వ్యక్తిని “అలీ, ఫాతిమా, హసన్‌ మరియు హుసైన్‌ (రజిఅల్లాహు అన్‌హుం) వైపు పంపిస్తూ ఇలా అన్నారు: “ఓ అల్లాహ్‌! వారందరూ ‘అహ్లెబైత్‌’ చెందినవారు. అంతలో హజ్రత్ ఉమ్మే సల్మా (రజియల్లాహు అన్హ) ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని; నేను ‘అహ్లెబైత్‌’ చెందిన దానిని కానా? అని ప్రశ్నించారు. దానికి  ప్రవక్త గారు: “నీవు నాకు మంచి భార్యవి, వారు నా ‘అహ్లెబైత్‌’ చెందినవారు. ఓఅల్లాహ్! నా ‘ఇంటివారలు’ ఎక్కువ హక్కుదారులు, అని అన్నారు.

(అల్‌ ముస్తద్‌రక్‌ అలస్‌ సహీ హైన్‌ లిల్‌ హాకిమ్‌,తఫ్సీర్ సూరతుల్‌ అహ్‌జాబ్‌:3517)

ఎందుకంటే? ఒక రోజున ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉదాయాన్నే బయలుదేరారు, అప్పుడు ఆయన వద్ద ఒక నల్లటి దుప్పటి యున్నది. అంతలో ఆయన వద్దకు హసన్‌(రజియల్లాహు అన్హు) వచ్చారు, ఆయనను దుప్పటిలోపలికి తీసుకున్నారు, తరువాత హుసైన్‌ (రజియల్లాహు అన్హు) వచ్చారు, ఆయననూ లోపలికి తీసుకున్నారు, తరువాత ఫాతిమా (రజియల్లాహు అన్హ) వచ్చారు, ఆమెను లోపలికి తీసుకున్నారు, తరువాత హజ్రత్ అలి (రజియల్లాహు అన్హు) వచ్చారు ఆయనను కూడా ఆ దుప్పటి లోపలికి తీసుకున్నారు. ఆ తరువాత ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం): “ఇంటివారలారా! మీ నుండి (అన్ని రకాల) మాలిన్యాన్ని దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలన్నది అల్లాహ్‌ అభిలాష”  అని పఠించారు. (ముస్లిం)

హజ్రత్ హసన్‌ మరియు హుసైన్‌ (రజియల్లాహు అన్హుమా) విశిష్టత :

ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, వారు వీరిద్దరి (హసన్‌,హుసైన్‌)ని తప్పక ప్రేమించాలి.” (నసాయీ,ఇబ్ను ఖుజైమా, హాకిమ్‌, సిల్ సిల తుస్సహీహా :312)

హజ్రత్ ఉసామా బిన్‌ జైద్‌ (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “వీరిద్దరు నా పుత్రులు, నా కూతురు పుత్రులు, ఓ అల్లాహ్‌ నేను వీరిని ప్రేమిస్తున్నాను, ఓ అల్లాహ్‌ నీవు కూడా వీరిని ప్రేమించు, వీరిని ప్రేమించే వారిని కూడా నీవు ప్రేమించు.” (తిర్మిజీ:3 769)

హజ్రత్ హసన్‌ మరియు హజ్రత్ హుసైన్‌ (రజియల్లాహు అన్హుమా) స్వర్గంలో యువకులకు నాయకులుగా ఉంటారు. (తిర్మిజి:3 768, ఇబ్ను మాజా:118)

కర్బలా సంఘటన:

ముహర్రం నెలలో హజ్రత్ అలీ (రజియల్లాహు అన్హు) నలభై హిజ్రీ శకం, రమాజన్‌ నెలలో 21వ తేదిన షహీద్ చేయబడ్డారు. ఆ తరువాత ముఆవియా (రజియల్లాహు అన్హు) గారు హజ్రత్ హసన్‌ (రజియల్తాహు అన్హు) అంగీకారంతో ఏకగ్రీవంగా ఖలీఫాగా ఎన్నుకోబడ్డారు. ఆ తరువాత హజ్రత్ హసన్‌ (రజియల్లాహు అన్హు) గారు ద్రోహాల కుట్రలో భాగంగా విషంతో కూడిన భోజనం తిని షహాదత్‌ మరణాన్ని పొందారు. ఆ తరువాత హజ్రత్ ముఆవియా (రజియల్లాహు అన్హు) గారు అరవై హిజ్రీ శకంలో మరణించారు. ఆయన మరణించే ముందు తమ కుమారుడైన యజీద్ ను ఖలీఫాగా నియమించారు. యజీద్‌ గుణహీనుడైన ఒక రాజు అని చరిత్ర చెబుతుంది. అందుచేత కూఫా ప్రజలు యజీద్‌కు బదులుగా హజ్రత్ హుసైన్‌ (రజియల్లాహు అన్హు) గారిని ఖలీఫాగా నియమించడానికి ప్రయత్నాలు చేసారు. మరియు కూఫాలో ఉన్న కొంత మంది ప్రజలు హజ్రత్ హుసైన్‌ (రజియల్లాహు అన్హు) ను ఖలిఫాగా ఎన్నుకుంటామనీ అనేక విధాలుగా ఆహ్వానించారు. అందువలన హజ్రత్ హుసైన్‌ (రజియల్లాహు అన్హు) మరియు ఆయన కుటుంబీకులు, మరియు అనుచరులతో కలిసి కూఫాకు చేరుకున్నారు. ఆయన కూఫాకు చేరుకున్న తరువాత హజ్రత్ హుసైన్‌ (రజియల్లాహు అన్హు) గారికి కూఫా ప్రజలు ద్రోహం చేసారు. ఆయనకు ఎలాంటి సహాయం చేయలేదు. మరియు యజీద్‌ తన ఖిలాఫత్‌ పదవిని వదులుకోవడం ఇష్టంలేని కారంణంగా, హజ్రత్ హుసైన్‌ మరియు వారితో వచ్చినవారిని బందీలుగా తమ వద్దకు తీసుకొరావలసిందిగా తన సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. తరువాత యజీద్‌ సైన్యం హజ్రత్ హుసైన్‌ (రజియల్లాహు అన్హు) మరియు వారి కుటుంబీకులను సులభంగా బందీలుగా చేసుకున్నారు. యజీద్‌ ఆజ్ఞ మేరకు హజ్రత్ హుసైన్‌ (రజియల్లాహు అన్హు) గారిని యజీద్‌కు అప్పగించకుండా ఆ సైన్యం వారందరిని ఘోరాతి ఘోరంగా చంపివేసారు.

61వ హిజ్రి శకం ముహర్రం నెలలో 10వ తేదిన (ఆషూరా) ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్ల౦) మనుమడు హజ్రత్ హుసైన్‌ (రజియల్లాహు అన్హు) మరియు వారి అక్కచెల్లెళ్ళను అన్నదమ్ముళ్ళను, అన్న హసన్‌ గారి బార్యబిడ్డలను, జాఫర్‌ మరియు అఖీల్‌ భార్యబిడ్డలను మరియు అనేక కూఫా ప్రజలను చంపడం జరిగింది.

హజ్రత్ హుసైన్‌ (రజియల్లాహు అన్హు) గారు ఫురాత్‌ అనే సముద్రం ఒడ్డున కర్బలా మైదానంలో చంపబడ్డారు. వారి భౌతికకాయాన్ని కర్బలా మైదానంలోనే ఖననం చేసారు. ఆయన మొండాన్ని అబ్దుల్లాహ్ బిన్‌ జియాద్‌ వద్దకు తీసుకువచ్చారు. అలా జరగకూడని ఒక దురదృష్టకరమైన సంఘటన కర్బలాలో జరిగింది. మరియు హజ్రత్ హుసైన్‌(రజియల్లాహు అన్హు) షహాదత్‌ అనే పుణ్యపరమైన మరణాన్ని పొందారు.

హజ్రత్ హుసైన్‌ (రజియల్లాహు అన్హు) గారిని చంపినవారు లేక వారిని చంపుటకై ప్రోత్సహించినవారు సంతోషించారు. కాని అలాంటి వారిని అల్లాహ్‌ హీనమైన స్థితికి నెట్టివేసాడు, వారు కూడా భయంకరమైన మరణాన్ని పొందారు.

కర్బలా సంఘటన అనంతరం:

హజ్రత్ హుసైన్‌ (రజియల్లాహు అన్హు) మరణానంతరం ముస్లిం సమాజం విభేదాలకు గురికాబడి అనక వర్గాలుగా చీలిపోయి, స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడిపోయి, ఇస్లామీయ రుజుమార్గాన్ని తప్పిపోయారు.

1- కొంత మంది మూర్ఖులు  హజ్రత్ హుసైన్‌ (రజియల్లాహు అన్హు) గారి మరణాన్ని కోరుకున్నారు. చివరికి వారు హజ్రత్ హుసైన్‌ మరియు వారి కుటింబీకులను షహీద్ చేసారు. వారి నాయకుడు ఉబైదుల్లాహ్‌ బిన్‌ జియాద్‌. హజ్రత్ హుసైన్‌ (రజియల్లాహు అన్హు) షహీద్ చేయబడిన తరువాత ప్రతి ఏట సంతోష కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మరియు వారు అసత్యమైన హదీసులను రచించారు. ఉదాహారణకు: ఎవరైతే ఆషూరా రోజు తమ కుటుంబీకుల పట్ల ఎక్కువగా ఖర్చు చేస్తారో, వారికి ఆ సంవత్సరమంతా అల్లాహ్‌ అధికంగా ప్రసాదిస్తాడు. మరియు ఎవరైతే ఆ రోజున తమ కళ్ళలో సుర్మా రాసుకుంటాడొో అతనికి జీవితంలో ఎన్నడు కళ్ళవ్యాధి రాదు. మరియు ఎవరైతే ఆ రోజున స్నానం చేస్తాడో అతను ఆ సంవత్సరమంతా అస్వస్థకు గురికాడు. అలా అనేక తప్పుడు విషయాలను ప్రజల్లో వ్యాపింపజేశారు. వారినే నాసిబీయా ముస్లింలు అంటారు. ప్రస్తుత కాలంలో వారు లేనట్టుగానే భావించాలి. కాని వారి అసత్యమైన ప్రవచనాలు ఇప్పటికీ ప్రజల్లో ఉన్నాయి.

2- కొంతమంది ప్రజలు  అహ్లె బైత్‌ అభిమానులంటూ అతిగా వ్యవహరించారు. వారి నాయకుడు ముఖ్తార్‌ బిన్‌ ఉబైద్‌ అల్‌ కజ్జాబ్‌. అతని వర్గానికి చెందినవారు. కర్బలా షహీదుల పట్ల శోకాన్ని, దుఃఖాన్ని వెలిబుచ్చడానికి విలపించడం, మాతం చేయడం వంటి ఆచారాలను పుణ్యమైన ఆచారాలుగా భావించి ప్రతి ఏట “మాతం” పేరుతో ధర్మానికి విరుద్ధమైన కార్యాలను నిర్వహించి ఆరాధనలుగా భావిస్తున్నారు.

హజ్రత్ హుసైన్‌ మరియు వారి కుటింబీకుల షహాదత్‌ (మరణాంతరం) తరువాత అధర్మ పద్దతిలో శోకాన్ని, దుఃఖాన్ని వెలబుచ్చడానికి సభలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏట వారి షహాదత్‌ రోజును శోకదినంగా భావించారు, ఆ శోకాన్ని బహిరంగంగా వెలబుచ్చుట కొరకై అనేక విధాలుగా చేస్తున్నారు. చివరికి ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణులను, హజ్రత్ అబూబకర్‌ (రజియల్లాహు అన్హు), హజ్రత్ ఉమర్‌ (రజియల్తాహు అన్హు), హజ్రత్ ఉస్మాన్‌ (రజియల్లాహు అన్హు), మరియు అనేక ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ప్రాయమైన సహాబాలను, వారి కుటుంబీకులను అసభ్యకరమైన పదజాలాలతో కించపరుస్తున్నారు. మరియు వారి గౌరవోన్నతలు భంగమయ్యేటట్టు కట్టుకథలు రచించారు. ముహర్రం నెల రాగానే ఆ కట్టుకథలను తమ సమావేశాలలో ప్రసంగిస్తుంటారు. మరియు అహ్లె బైత్‌ అభిమానులంమంటూ ముసలి కన్నీళ్ళు కురిపిస్తారు. వారంతా “కర్బలా” బాధితుల పట్ల తమ గోడును ఇలా తెలిపే ప్రయత్నాలు చేస్తారు: “ముహర్రం నెలలో నల్ల దుస్తులు ధరిస్తారు, యా హసన్‌, యా హుసైన్‌ అంటూ తమ ఛాతీలపై బాదుకుంటుంటారు. కత్తులతో ఖడ్లాలతో కోసుకుంటారు. రక్తం కారేలా బ్లేడ్లతో గాయం చేసుకుంటారు. అగ్ని గుండం తయారు చేసి దానిలో పరుగులు పెడతారు. సామూహికంగా విలపించి మహా సభలను నిర్వహించి కేకలు పెడుతుంటారు. ముహర్రం నెల పవిత్రమైనప్పటికి అపవిత్రంగా, శుభప్రదమైనప్పటికి అశుభమైనదిగా భావిస్తున్నారు. అందుచేత వారు ఆ నెలంతా ఎలాంటి సంతోషమైన కార్యాన్ని నిర్వహించరు, వివాహాలు చేసుకోరు. మరియు పంజాలను (పీర్లను) స్థాపిస్తారు. వాటిని అనేక విధాలుగా ఆరాధిస్తారు” వారినే షియా ముస్లింలు అంటారు.

భారత దేశంలో లక్నో, హైదరాబాద్‌, ఢిల్లీ, మరియు ముంబై వంటి మహా నగరాలలో ‘షియా’ జాతులు ఉన్నారు. మరియు వారు ఇరాన్‌లో అతి ఎక్కువగా ఉన్నారు. వారీ ఇరాన్‌ దేశాన్ని పరిపాలిస్తున్నారు. మరియు అమెరికా యుధ్ధం తరువాత ఇరాఖ్లో కూడా షియా ముస్లింలు పరిపాలన చేస్తున్నారు. అలాగే వారు లెబనాన్ మరియు సిరియా, బహ్‌రైన్‌ దేశాలలో కూడా ఉన్నారు.

మరణానంతరం భాధను తెలిపే ధర్మ విధానం:

హజ్రత్ హుసైన్‌ (రజియల్లాహు అన్హు) గారి మరణం మనందరికీ దుఃఖింపబడే మరియు బాధపడే సంఘటన. అయినా మనం సమంజసమైన రీతిలో, ధర్మ విధానంలో శోకాన్ని తెలుపడం ధర్మం. కనుక అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌ గ్రంథంలో ఇలా తెలియజేసాడు:

الَّذِينَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ أُولَٰئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُهْتَدُونَ

“వారికెప్పుడు ఏ ఆపదవచ్చిపడినా, నిశ్చయంగా “మేము స్వతహాగా అల్లాహ్‌కు చెందినవారము, మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకేకదా!” అని అంటారు. వారిపై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందినవారు కూడా వీరే.” (సూరతుల్‌ బఖరా:156-15 7)

మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

ముహర్రం నెల వాస్తవికత

ఎవరికైనా కష్టం వాటిల్లినపుడు “ఇన్నాలిల్లాహి వఇన్నా ఇలైెహి రాజివూన్‌” మరియు “అల్లాహుమ్మ అజుర్‌ని ఫీ ముసీబతీ వఖ్లిఫ్‌ లీ ఖైరమ్‌ మిన్‌హా‘ పఠించడం ఎంతో మహత్ పూర్వకమైనది . (ముస్లిం:1525)

అలాగే మనకు ఎప్పుడైతే దుఃఖమైన సంఘటనలు గుర్తుకు వస్తాయో అప్పుడల్లా మనం “ఇన్నాలిల్లాహి వఇన్నా ఇలైహి రాజివూన్‌” అని చదువుకుంటే ఆ దుఃఖానికి బదులు మనకు పుణ్యం లభిస్తుంది” అని హజ్రత్ హుసైన్‌ (రజియల్లాహు అన్హు) తెలియజేసారు.

హజ్రత్ జైనబ్‌ బిన్తె జహష్ (రజి యల్లాహు అన్హు) గారి సోదరుడు మరణించారు. మూడు రోజుల తరువాత ఆమె పరిమళాన్ని తెప్పించి పూసుకున్నారు. తరువాత ఇలా ప్రవచించారు: “నాకు పరిమళం అవసరమేమీ లేదు కాని నేను ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించగా ఇలా విన్నాను: “ఏ మహిళ అయితే అల్లాహ్‌ను, పరలోక దినాన్ని విశ్వసిస్తుందో! ఆమె మూడు రోజులకంటే ఎక్కువగా శోకం చెయ్యడం నిషిద్ధం. కాని తన భర్త శోకం గడవు నాలుగు నెలల పది రోజుల వరకు ఉంది” (బుఖారి:1202, ముస్లిం: 2731).

అతిశయిల్లటం (హద్దు మీరటం):

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అతిశయిల్లటం నుండి ఇలా హెచ్చరించారు: “జాగ్రత్త! మీరు ధర్మం విషయంలో అతిశయిల్ల (హద్దు మీరి ప్రవర్తించ) కండి. నిశ్చయంగా మీకంటే ముందు జాతులు ధర్మం విషయంలో అతిశయిల్లటం వల్లనే నాశనమయ్యారు.” (అహ్మద్‌, ఇబ్ను మాజా:3029)..

మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఇలా హెచ్చరించారు: “మీరు నన్ను పొగడటంలో హద్దు మీరకండి, ఎలాగైతే క్రైస్తవులు మర్యమ్‌ కుమారుడగు ఈసా (అలైహిస్సలాం) గారి పట్ల హద్దు మీరి పొగడ్తల్లో ముంచారో! నిశ్చయంగా నేను అల్లాహ్‌ దాసుడను మాత్రమే. కనుక మీరు నన్ను అల్లాహ్‌ దాసుడు మరియు ఆయన ప్రవక్త అని మాత్రమే అనండి.” (బుఖారి: 3189)

హజ్రత్ అబూ హురైరా(రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

ముహర్రం నెల వాస్తవికత

“మీ ఇండ్లను స్మశానవాటిక చేయకండి, నా సమాధిని మీరు (ప్రజలు) ఉత్సవ కేంద్రంగా చేయకండి. అయితే నా కొరకు దరూద్‌ దుఆ చేయండి, మీరు ఎక్కడ ఉన్నా మీ ప్రార్ధన నాకు చేరుతుంది.” (అబూదావూద్‌: 2042)

హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణ సమయాన ఇలా ప్రవచించారు:

ముహర్రం నెల వాస్తవికత

“అల్లాహ్‌ యూదుల్ని, క్రైస్తవుల్ని శపించాడు. వారు తమ ప్రవక్తల సమాధుల్ని సజ్‌దా (ఆరాధ్య) నిలయాలుగా చేసుకున్నారు.” (బుఖారి:1301, ముస్లిం:823)

కాని విచారకరమైన విషయం ఏమంటే, ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంత హెచ్చరించినప్పటికి ముస్లిం సమాజం ఈ “అతి“కి దూరంగా ఉండలేకపోయింది. హజ్రత్ హుసైన్‌ మరియు వారి కుటింబీకుల షహాదత్‌ (మరణం) తరువాత అధర్మ పద్దతిలో శోకాన్ని, దుఃఖాన్ని వెలబుచ్చడానికి సభలు నిర్వహిస్తున్నారు. మరియు అహ్లెబైత్‌ అభిమానులంమంటూ అధర్మరీతిలో అతిశయిస్తున్నారు.

ముహర్రం నెలలో అధర్మ ఆచారాలు:

౩- “అహ్‌లుస్‌ సున్నత్‌ వల్‌ జమాఅత్‌” కు చెందిన కొంత మంది ప్రజలు అజ్ఞానంతో ముహర్రం పండుగ పేరుతో అనేక కార్యాకలాపాలు నిర్వహిస్తున్నారు. వారు తమను తాము సున్నీలుగా పేర్కొంటారు. అయినా రుజు మార్గాన్ని తప్పిన వర్గాల (షియా ముస్లింలు మరియు నాసిబియా ముస్లింలు)కు అనుగుణంగా మన పట్టణాలలో,  పల్లెలలో ప్రతి ఏట అవే కార్యాలను పుణ్యంగా భావించి ముహర్రం ఉత్సవాలను నిర్వవాస్తుంటారు.

1- మొదటి ముహర్రం రోజున పంజాలను “మకాన్‌” అనే ప్రత్యేకమైన స్థలంలో నిలబెట్టటం జరుగుతుంది.

2-కొంత మంది ప్రజలు క్రొత్తగా పంజాను నిలబెడ్తానని మొక్కుబడులు చేసుకుంటారు.

౩-పది రోజుల వరకు పంజాలను పూల హారాలతో అలంకరిస్తారు మరియు ఆ పదిరోజులు ఫాతిహాలు (అర్పణాలు) చేస్తుంటారు.

4-ఏడవ రోజు నుండి ప్రతి రాత్రి స్నానం చేసి అగ్ని గుండంలో నడుస్తుంటారు. పీర్లకు ఫాతిహాలు కూడా సమర్పిస్తారు.

5-ఏడవ రోజునుండి బెల్లం లేక ఇతర షర్బత్ కడవలు కడవలుగా తయారు చేస్తారు. స్వయంగా త్రాగుతారు, ఇతరులకు కూడా తాపిస్తారు.

6-ముహర్రం బతాసాలు, మరియు చోంగాలు (తీపు అప్పట్లు) ఆచారంగా చేసి తింటారు, ఇతరులకు కూడా పంచుతారు.

7-పంజాల (పీర్లను)ను నిలబెట్టిన కొంతమంది పుణ్యాత్ముల ఆత్మలు తమ శరీరంలో వచ్చిందంటూ ఊగుతుంటారు. మరియు తమ పంజాను ఎత్తుకొని అగ్ని గుండంలో నడుస్తారు.

8-పంజాలు ఎత్తుకొని వీధులంతా ఊరేగిస్తూ, అనేక కనికట్టు నాటకాలు చేస్తూ, ఇంటింటా నిలబడి ఫాతిహాలు చేస్తూ, విరాళములు సేకరిస్తారు.

9-పంజాలను పట్టణము పొలిమేరకు తీసుకుపోయి, వాటిపై ఉన్న పూలహారాలను తీసి చెరువులలో లేక బావులలో పడేస్తారు.

10-చివరిగా “అల్‌విదా యా షుహదావు హుసైన్‌” అంటూ “మర్‌సియా” గీతాలు పాడుకుంటూ తిరిగి అదే ‘మకాన్‌’కు వస్తారు. తరువాత ఆ పంజాలను ఆ ‘మకాన్‌‘ లోనే భద్రపరుచుకుంటారు.

11-కొంత మంది సున్నీ ముస్లింలు కూడా ముహర్రం నెలను అపశకునంగా భావిస్తారు. ఈ నెలంతా పెళ్ళిళ్ళు చేయరు, కొత్త పనులను ప్రారంభించరు.

ముస్లిం ప్రజలారా! మనం “అహ్‌లుస్‌ సున్నత్‌ వల్‌ జమాఅత్‌”కు చెందినవారము. మనం అల్లాహ్‌ను మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) విధానానికి అనుగుణంగా అనుసరించేవారము. ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించిన 50 సంవత్సరాల తరువాత అధర్మ వ్యక్తుల చేత జొప్పించబడిన తప్పుడు ఆచారాలను ఎలా ధర్మంగా మనం భావించాలి? వాటిని మనం ఎలా ఆచరించాలి? ఒక వేళ మనం వాటిని ఆచరించినా పుణ్యం మాత్రం లభించదు, పైగా మహా పాపాలకు గురికాబడుతాము సుమా.


ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 52-66). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)

పరస్త్రీతో కరచాలనం (ముసాఫహా) చేయుట

బిస్మిల్లాహ్

మన సమాజంలోని కొన్ని ఆచారాలు అల్లాహ్‌ ధర్మం యొక్క హద్దులను మీరాయి. ప్రజల అలవాట్లు, వారి అంధవైఖరి అల్లాహ్‌ ఆదేశాలకు వ్యతిరేకంగా మితిమీరుతున్నాయి. చివరికి పరిస్థితి ఎంతవరకు చేరిందంటే నీవు వారిలోని ఏ ఒక్కరికైనా అల్లాహ్‌ ధర్మం ఆదేశం తెలిపి, దాని నిరూపణలు, నిదర్శనాలు చూపిస్తే వారు నిన్ను ప్రగతివిరోధి, సంకీర్ణవాది, బంధుత్వం తెంచువాడు మరియు సత్సంకల్పాల్లో అనుమానపడేవాడు అని నానారకాలుగా దూషిస్తారు. పినతండ్రి మరియు పెత్తండ్రి కూతుళ్ళతో, మేనత్త కూతుళ్ళతో, చిన్నమ్మ మరియు పెద్దమ్మ కూతుళ్ళతో, సోదరుల భార్యలతో, పినతండ్రి మరియు పెత్తండ్రి భార్యలతో మరియు మేనమామ భార్యలతో కరచాలనం చేయడం మన సమాజంలో నీళ్ళు త్రాగడం లాంటి తేలికగా మారింది. కాని ఇందులో ధార్మికంగా ఉన్న నష్టాలను తెలివైన దృష్టితో చూస్తే ప్రజలు అలా చేయడం మానుకుంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ హదీసు శ్రద్దగా చదవండి:

పరస్త్రీతో కరచాలనం (ముసాఫహా) చేయుట

“మీలో ఒకరి తలపై పెద్దసూది లేదా మొలతో గుచ్చడం పరస్త్రీని ముట్టుకునేదానికంటే ఎంతో మేలు”. (తబ్రానీ 20/212, సహీహుల్‌ జామి 4921).

ఇది చేతుల ద్వారా వ్యభిచారం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ ప్రవచనం చదవండి:

పరస్త్రీతో కరచాలనం (ముసాఫహా) చేయుట

రెండు కళ్ళు వ్యభిచారం చేస్తాయి. రెండు చేతులు వ్యభిచారం చేస్తాయి. రెండు కాళ్ళు వ్యభిచారం చేస్తాయి. మర్మాంగం వ్యభిచారం చేస్తుంది“. (అహ్మద్‌ 1/412, సహీహుల్‌ జామి 4126).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కన్నా పవిత్రహృదయం గలవాడు ఎవరైనా ఉన్నారా? (సమాధానం ఎవరూ లేరు  అనే వస్తుంది.) అయన ఏమన్నారో చదవండి:

పరస్త్రీతో కరచాలనం (ముసాఫహా) చేయుట

“నేను స్త్రీలతో కరచాలనం చేయను”.

(ముస్నద్‌ అహ్మద్‌ 6/357, సహీహుల్‌ జామి 2509).

మరో సందర్భంలో ఇలా అన్నారు:

పరస్త్రీతో కరచాలనం (ముసాఫహా) చేయుట

నేను స్త్రీల చేతులను తాకను“.

(తబ్రానీ కబీర్‌ 24/342, సహీహుల్‌ జామి 7054. ఇంకా చూడండి: ఇసాబ 4/354, దారుల్‌ కితాబిల్‌ అరబీ ముద్రణ).

ఆయిషా (రది అల్లాహు అన్హా) ఇలా చెప్పారు:

పరస్త్రీతో కరచాలనం (ముసాఫహా) చేయుట

“ఎన్నడూ లేదు, అల్లాహ్‌ సాక్షిగా! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హస్తం ఎన్నడూ ఏ పరస్త్రీ చేతిని కొంచమైనా తాకలేదు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో మాట ద్వారా బైఆత్‌ (విధేయత ప్రమాణం) చేసేవారు”. (ముస్లిం 1866, బుఖారి 5288).

జాగ్రత్త! తమ సోదరులతో కరచాలనం చేయని భార్యలను విడాకుల బెదిరింపులు ఇచ్చే భర్తలు ఇకనైనా అల్లాహ్‌తో భయపడాలి. అలాగే ఏదైనా వస్త్రము అడ్డుగా పెట్టి కరచాలనం చేయడం ఏ మాత్రం యోగ్యం కాదు. డైరక్ట్‌గా కరచాలనం చేసినా, ఏదైనా అడ్డుగా పెట్టి చేసినా అన్ని స్దితుల్లో పరస్త్రీలతో  కరచాలనం నిషిద్దమే అవుతుంది .


[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన “ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలుఅను పుస్తకం నుంచి తీసుకుబడింది. పదాలలో కొన్ని చిన్న మార్పులు చేశాము ]

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/

ఖుర్‌ఆన్‌ పారాయణం చేసేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు

బిస్మిల్లాహ్

అల్లాహ్‌ త ఆలా ఇలా తెలియజేశాడు:

أَقِمِ الصَّلَاةَ لِدُلُوكِ الشَّمْسِ إِلَىٰ غَسَقِ اللَّيْلِ وَقُرْآنَ الْفَجْرِ ۖ إِنَّ قُرْآنَ الْفَجْرِ كَانَ مَشْهُودًا وَمِنَ اللَّيْلِ فَتَهَجَّدْ بِهِ نَافِلَةً لَّكَ عَسَىٰ أَن يَبْعَثَكَ رَبُّكَ مَقَامًا مَّحْمُودًا

నమాజు నెలకొల్పు. సూర్యుడు నెత్తి నుండి వాలినప్పటి నుండి రాత్రి చీకటి అలుముకునే వరకు. తెల్లవారు జామున ఖుర్‌ఆన్‌ పారాయణం చెయ్యి. నిశ్చయంగా తెల్లవారు జామున చేసే ఖుర్‌ఆన్‌ పారాయణానికి సాక్ష్యం ఇవ్వబడుతుంది. రాత్రిపూట కొంత భాగం తహజ్ఞుద్‌ (నమాజులో ఖుర్‌ఆన్‌ పఠనం చెయ్యి. ఇది నీ కొరకు అదనం. త్వరలోనే నీ ప్రభువు నిన్ను మఖామె మహ్‌మూద్‌కు (ప్రశంసనీయమైన స్థానానికి) చేరుస్తాడు.”  (సూరతు ఇస్రా /బనీ ఇస్రాయీల్‌: 78-79).

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “నిశ్చయంగా తెల్లవారు జామున చేసే ఖుర్‌ఆన్‌ పారాయణానికి సాక్ష్యం ఇవ్వబడుతుంది” అంటే ఫజ్ర్ వేళ అల్లాహ్‌ దూతలు దివి నుండి భువికి దిగివస్తారు. (సహీహ్‌ తిర్మిజీ: 3135, సహీహ్‌ ఇబ్నుమాజా:670)

మరో హదీసులో ఇలా ఉంది: ‘రాత్రి వేళ విధుల్ని నిర్వహించిన దూతలు అల్లాహ్‌ సన్నిధికి చేరుకున్నపుడు – తనకంతా తెలిసినప్పటికీ – మీరు నా దాసుల్ని ఏ స్థితిలో వదలి వచ్చారు? అని అల్లాహ్‌ ప్రశ్నిస్తాడు. దానికి వారు: “మేము వారి వద్దకు వెళ్ళినప్పుడు కూడా వారు నమాజులో లీనమై ఉన్నారు. మేము వారివద్ద నుంచి తిరిగి వస్తున్నప్పుడు కూడా వారు నమాజులోనే నిమగ్నులై ఉన్నారు” అని సమాధానమిస్తారు.’ (బుఖారీ:522,ముస్లిం:1001).


హజ్రత్ అనస్‌ (రదియల్లాహు అన్హు) కథనం: “ప్రజలలో కొంత మంది అల్లాహ్‌కు అతి దగ్గరవారై ఉన్నారు .” అని ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు.

యా రసూలుల్లాహ్ ! వారెవరూ? అని కొందరు అడిగారు.

దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం): “వారు అహ్‌లుల్‌ ఖుర్‌ఆన్‌ (ఖుర్‌ఆన్‌ (గంథాన్ని పారాయణం చేసేవారు, దానిని నేర్పేవారు, నేర్చుకునేవారు) మరియు వారే అల్లాహ్‌కు అతి దగ్గరవారై ఉంటారు, వారు ఆయనకు ప్రత్యేకులు” అని అన్నారు.

[నసాయి, ఇబ్ను మాజా, హాకిమ్‌: సహీహ్‌ అత్తర్గీబ్‌ వత్తర్హీబ్‌: 1432]


హజ్రత్ ఉస్మాన్‌ బిన్‌ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “మీలో ఖుర్‌ఆన్‌ నేర్చుకొని ఇతరులకు నేర్పించినవారే అందరికంటే ఎక్కువగా మేళ్లు కలిగి ఉన్నవారు.” (బుఖారీ:4639)


హజ్రత్ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “నిశ్చయంగా అల్లాహ్‌ ఈ గ్రంథం కారణంగా కొన్ని జాతుల్ని ఉన్నతమైన స్థితికి పెంచుతాడు. మరికొన్ని జాతుల్నిదీని కారణంగానే అధోగతికి దిగజార్చుతాడు.” (ముస్లిం1353)


ప్రవక్త ముహమ్మద్‌(సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజత్‌ అబూహురైరా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు:

“సుమధుర స్వరంతో గొంతెత్తి ఖుర్‌ఆన్‌ పారాయణం చేసే దైవప్రవక్త కంఠ శ్వరాన్ని శ్రద్ధగా ఆలకించినట్లుగా అల్లాహ్‌ మరే స్వరాన్నీ ఆలకించడు.” (బుఖారీ:4636, ముస్లిం:1319).

సమధుర స్వరంతో ఖుర్‌ఆన్‌ పారాయణం చేసేవాని పట్ల అల్లాహ్‌ ప్రసన్నుడయి అతని ఆచరణను అంగికరిస్తాడు అని అర్ధం.


హజ్రత్ అనస్‌ (రదియల్లాహు అను) కథనం: అన్సార్‌ జాతికి చెందిన ఒక సహాబీ (అనుచరుడు) మస్జిద్ ఖుబాలో ఇమామత్‌ చేసేవారు. ఆయన ప్రతి రకాతు ఆరంభంలో ‘ఖుల్‌హువల్లాహు అహద్‌” సూరా పఠించిన తరువాత మరొక సూరా చదివేవారు. ఇలాగే ఆయన ప్రతి రకాతులో చేసేవారు.

కొందరు ఆయనను ఇలా అడిగారు? “నీవు ఆ సూరాను నమాజులో చదవకుంటే నమాజు కానట్టుగా ప్రతి రకాతులో నిత్యం చదువుతుంటావు, నీవు చదివేటుగా ఉంటే ఆ సూరను మాత్రమే చదువు లేకుంటే ఇతర సూరాలను చదువు అని అన్నారు.”

తరువాత ఆయన ఇలా సమాధానమిచ్చారు: “‘చూడండి! నేను ఇలాగే నమాజు చదువుతాను .మీకిష్టమైతే నేను మీ కొరకు ఇమామత్‌ చేస్తాను, మీకు ఇష్టం లేదంటే చెప్పండి ఇమామత్‌ మానుకుంటాను” అని అన్నారు. వారిలో అందరికంటే గొప్ప వ్యక్తిగా ఆయనను వారు భావించేవారు. కనుక ఇతరులు ఇమామత్‌ చేయడం వారికి ఇష్టముండేది కాదు.

చివరికి కొంత మంది ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు పోయి ఈ సమస్య గురించి తెలియజేశారు.

తరువాత ప్రవక్త ముహమ్మద్‌(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ వ్యక్తితో: “వారి కోరిక ప్రకారం (ఇమామత్‌) చేయుటకై నీకు ఏ విషయం అడ్డు? ఆ సూరానే నీవు ఎందుకు ప్రతి రకాతులో చదవాలనుకుంటున్నావు?” అని అడిగారు.

దానికి ఆ వ్యక్తి: “యా రసూలల్లాహ్‌! “నేను ఆ సూరా (ఖులహువల్లాహు అహద్‌) ను ఇష్టపడుతున్నాను అని అన్నారు.

అది విని ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనితో: “ఆ సూరాను నీవు ఇష్టపడుతున్నావంటే అది నీన్ను స్వర్గానికి తీసుకెళ్తుంది? అని చెప్పారు.

[సహీహ్‌ తిర్మిజీ:2901]


హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

ఖుర్‌ఆన్‌లో ముప్పై వాక్యాలు గల, ఒక సూరా ఉంది. అది (అల్లాహ్‌ సన్నిధిలో) ఒక వ్యక్తి గురించి సిఫారసు చేసి ఆఖరికి అతనికి క్షమాభిక్ష లభించేలా చేసింది.” అదే, “తబారకల్లిజీ బియదిహిల్‌ ముల్కు.” (తిర్మిజీ: 2891, ఇబ్నుమాజా: 3786, అబూదావూద్‌).

మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “దివ్య ఖుర్‌ఆన్‌లో ఒక సూరా ఉంది. అది తనను పఠించేవాని తరఫున వాదిస్తుంది. కడకు అతన్ని స్వర్గంలో చేర్పిస్తుంది.” (మజ్‌మవుజ్‌ జవాయిద్‌).

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్‌ మస్‌వూద్‌ (రదియల్లాహు అన్జ్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు; “తబారకల్లజీ బియదిహిల్‌ ముల్క్‌ ప్రతి రాత్రి చదివిన కారణంగా అల్లాహ్‌ వారిని సమాధి శిక్షనుండి కాపాడుతాడు.” [హాకిమ్‌, సహీహ్‌ తర్గీబ్‌ వత్‌ తర్హీబ్ : 1589]

హజ్రత్ జాబిర్‌ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం): “అలిఫ్ లామ్‌ మీమ్‌ తంజీల్ అస్‌ సజ్దా’  మరియు ‘తబారకల్లజీ’ సూరాలు పారాయణం చేసేవరకు నిద్రపోయేవారు కాదు.” అని తెలిపారు. [సహీహ్‌ తిర్మిజీ: 2892]

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం): “సూరతుల్ జుమర్  మరియు “బనీ ఇస్రాయిల్”  సూరాలు పారాయణం చేసేవరకు నిదపోయేవారు కాదు.” అని తెలిపారు.” [సహీహ్‌ తిర్మిజీ: 2892]

హజ్రత్ అబ్దుల్లాహ్ ఇబ్ను మస్‌వూద్‌ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఎవరైనా ఖుర్‌ఆన్‌ గ్రంథంలోని ఒక అక్షరాన్ని చదివితే అతనికి ఒక పుణ్యం లభిస్తుంది. ఆ ఒక్క పుణ్యం పది పుణ్యాలకు సమానంగా ఉంటుంది.” నా అభిప్రాయం ప్రకారం: ‘అలిఫ్‌ లామ్‌ మీమ్‌” అనేది ఒకే అక్షరం కాదు. పైగా ‘అలిఫ్‌’ ఒక అక్షరం, లామ్‌’ ఒక అక్షరం,మీమ్  ఒక అక్షరం అని అన్నారు.  (సహీహ్‌ తిర్మిజీ: 2910, సహీహ్‌ నసాయి: 2391, హాకిమ్‌).


[ఇది జఫరుల్లాహ్ ఖాన్ హఫిజ హుల్లాహ్ గారు రాసిన అల్లాహ్ ను ప్రేమించండి – స్వర్గాన్ని చేరుకోండి అను పుస్తకం నుండి తీసుకోబడింది]

వుజూ తర్వాత దుఆ ఘనత (فضل الذكر بعد الوضوء) [వీడియో]

బిస్మిల్లాహ్

వుజూ తర్వాత చిన్న పాటి దుఆ చదవడం ద్వారా ఎంత గొప్ప పుణ్యం పొందగలరో ఇందులో నేర్చుకోండి.

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/x3mr]
[2 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia


వుజూ తర్వాత దుఆ

ఈ దుఆ  హిస్న్ అల్ ముస్లిం (తెలుగు) అను పుస్తకం నుండి తీసుకోబడింది


ఇతరములు:

అజాన్ తర్వాత చేసే రెండు దుఆల ఘనత [వీడియో & టెక్స్ట్]

అజాన్ తర్వాత చేసే రెండు దుఆల ఘనత (فضل الذكر بعد الآذان)
https://www.youtube.com/watch?v=IUyKck4lvfI [ 2 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

అజాన్ తర్వాత చెదివే ఈ రెండు దుఆల ఘనత చాలా గొప్పగా ఉంది
ప్రతి అజాన్ తర్వాత చదవండి, అనేకానేక పుణ్యాలు, లాభాలు పొందండి

ఈ వీడియో లో చెప్పబడిన దుఆలు ఇక్కడ నేర్చుకోవచ్చు: అజాన్ తర్వాత చేయు దుఆలు 

ఈ ప్రసంగంలో అజాన్ తర్వాత పఠించవలసిన రెండు ముఖ్యమైన దువాల గురించి వివరించబడింది. మొదటి దువా సహీహ్ ముస్లిం నుండి ఉల్లేఖించబడింది, దీనిని పఠించడం ద్వారా గత పాపాలు క్షమించబడతాయి. రెండవ దువా సహీహ్ బుఖారీ నుండి తీసుకోబడింది, దీనిని పఠించిన వారికి ప్రళయ దినాన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సిఫారసు లభిస్తుంది. ఈ రెండు దువాల యొక్క ప్రాముఖ్యత మరియు వాటి ద్వారా లభించే గొప్ప ప్రయోజనాలను వక్త నొక్కి చెప్పారు.

మహాశయులారా, ఇప్పుడు మనం అజాన్ తర్వాత రెండు రకాల దువాలు మనకు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పారు. ప్రతీ ఒక్క దువాలో మన గురించి ఎంతో గొప్ప లాభం ఉంది.

మొదటి హదీస్ సహీహ్ ముస్లిం లోనిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ఎవరైతే అజాన్ విన్న తర్వాత, అజాన్ కు సమాధానం చెబుతూ అజాన్ పూర్తిగా విన్న తర్వాత

أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ، وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، رَضِيتُ بِاللهِ رَبًّا، وَبِمُحَمَّدٍ رَسُولًا، وَبِالْإِسْلَامِ دِينًا

(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వహ్ దహూ లా షరీక లహూ, వ అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, రదీతు బిల్లాహి రబ్బన్, వబి ముహమ్మదిన్ రసూలన్, వబిల్ ఇస్లామి దీనా)

“అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్య దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఏకైక దేవుడు, ఆయనకు భాగస్వాములు లేరు మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. నేను అల్లాహ్ ను ప్రభువుగా, ముహమ్మద్ ను ప్రవక్తగా మరియు ఇస్లాంను నా ధర్మంగా స్వీకరించాను.”

అని చదువుతారో,

غُفِرَ لَهُ ذَنْبُهُ
(గుఫిర లహూ దన్బుహూ)

వారి యొక్క పాపాలు క్షమించబడతాయి, మన్నించబడతాయి అని శుభవార్త ఇవ్వడం జరిగింది.

ఇది ఒక దువా. మరోసారి విని మీరు దీన్ని జ్ఞాపకం ఉంచుకునే ప్రయత్నం చేయండి. సామాన్యంగా మనం దీనిలో సగ భాగం అంతకంటే ఎక్కువగా నేర్చుకునే ఉంటాము ఇంతకుముందు.

ఇక రెండవ దువా, సహీహ్ బుఖారీలోని పదాలు ఈ విధంగా ఉన్నాయి. జాబిర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే అజాన్ విన్న తర్వాత ఈ దువా చదువుతారో, ప్రళయ దినాన వారికి నా సిఫారసు తప్పకుండా లభిస్తుంది. అల్లాహు అక్బర్! ఎంత గొప్ప అదృష్టమో గమనించండి. ప్రళయ దినాన ప్రవక్తలు సిఫారసు చేయాలి అని మనం తహతహలాడుతూ ఉంటాము. ఆ రోజు మనకు ఈ సిఫారసు పొందడానికి ఈ రోజు ఐదు పూటల నమాజులు చేయాలి. అజాన్ విన్నప్పుడు, అజాన్ అయిన తర్వాత దువా మనం చదవాలి.

اللَّهُمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ، وَالصَّلَاةِ الْقَائِمَةِ، آتِ مُحَمَّدًا الْوَسِيلَةَ وَالْفَضِيلَةَ، وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي وَعَدْتَهُ

(అల్లాహుమ్మ రబ్బ హాదిహి ద్దావతి త్తామ్మ, వస్సలాతిల్ ఖాయిమ, ఆతి ముహమ్మదన్ అల్ వసీలత వల్ ఫదీల, వబ్ అత్ హు మఖామమ్ మహ్మూదన్ అల్లదీ వ అత్తహ్)

“ఓ అల్లాహ్! ఈ సంపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడిన నమాజుకు ప్రభువా! ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మధ్యవర్తిత్వం మరియు శ్రేష్టతను ప్రసాదించు. మరియు నీవు వాగ్దానం చేసిన ప్రశంసనీయమైన ఉన్నత స్థానానికి ఆయనను చేర్చు.”

అల్లాహ్ త’ఆలా ఈ దువాలను ప్రతీ అజాన్ తర్వాత చదువుతూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక. వీటి యొక్క బరకత్ లో, శుభంలో అల్లాహ్ మన పాపాలను మన్నించి ప్రళయ దినాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు మనకు ప్రాప్తి చేయుగాక.

ఈ పోస్ట్ లింక్: https://teluguislam.net/?p=5568

అజాన్ తర్వాత చేయు దుఆలు

బిస్మిల్లాహ్

అజాన్ తర్వాత చేయు దుఆలు
అజాన్ తర్వాత చేయు దుఆలు
అజాన్ తర్వాత చేయు దుఆలు
అజాన్ తర్వాత చేయు దుఆలు

ఈ దుఆలు  హిస్న్ అల్ ముస్లిం (తెలుగు) అను పుస్తకం నుండి తీసుకోబడింది

మన ఇష్టంతో పుట్టామా? మన ఇష్టంతో చనిపోతామా? మనం ఇష్టం వచ్చినట్లు జీవనం సాగిద్దామా? [వీడియో]

బిస్మిల్లాహ్

[సురక్షిత యూట్యూబ్ లింక్: ]
[ 46 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

క్రింద విషయాలు ఈ వీడియోలో చర్చించబడ్డాయి: 

  • మనం మన ఇష్టంతో పుట్టామా? లేదు..
  • మన ఇష్టంతో మనం చనిపోతామా? లేదు..
  • మరి మన ఇష్టప్రకారం జీవితం గడుపుదామా? ఒక్కసారి వినండి వాస్తవం ఏమిటో తెలుస్తుంది

ఇతరములు:

అల్లాహ్ ఆరాధన (ఇబాదత్) అంటే ఏమిటి? ఆరాధన రకాలు [వీడియో & టెక్స్ట్]

https://youtu.be/bqXH8XAhqW8
[ 15 నిముషాలు]

అల్లాహ్ ఆరాధన (ఇబాదత్) అంటే ఏమిటి? ఆరాధన రకాలు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

విశ్వాస మూల సూత్రాలు పుస్తకం నుండి .

వీడియో లో ఈ విషయాలు చెప్ప బడ్డాయి:

  • అల్లాహ్ ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన రకాలు
  • అల్లాహ్ ఆరాధన యొక్క సామాన్య భావన
  • అల్లాహ్ ఆరాధన యొక్క ప్రత్యేక భావన
  • హృదయానికి సంబంధించిన ఆరాధనలు – ప్రేమించడం,భయపడడం ..
  • శరీరానికి సంబంధించిన ఆరాధనలు – నమాజు , హజ్ ,ఉపవాసం 
  • ధనానికి సంబంధించిన ఆరాధనలు – జకాత్ , సదఖా 
  • ఆరాధన అల్లాహ్ కు మాత్రమే చెయ్యాలి, లేనియెడల అది షిర్క్ అవుతుంది
  • దుఆ ఇబాదత్ (ఆరాధన)లో ఒక రకం , కేవలం అల్లాహ్ కు మాత్రమే చెయ్యాలి
  • తవక్కుల్  (నమ్మకం, భరోసా) అల్లాహ్ మీద మాత్రమే ఉంచాలి 
  • కష్ట సమయంలో కీడు నుంచి రక్షణ కోరడం, సహాయం అర్ధించడం  
  • మొక్కుబడులు

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ విశ్వాసంలోని ఆరు మూల స్తంభాల గురించి, ముఖ్యంగా మొదటి స్తంభమైన అల్లాహ్ పై విశ్వాసం గురించి వివరించబడింది. ఆరాధన అనేది కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించబడాలని, అందులో ఎవరినీ భాగస్వాములుగా చేయరాదని స్పష్టం చేయబడింది. దుఆ (ప్రార్థన), తవక్కుల్ (భరోసా), సహాయం మరియు శరణు వేడటం, మొక్కుబడులు వంటి ఆరాధనలన్నీ కేవలం అల్లాహ్ తోనే చేయాలని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో నొక్కి చెప్పబడింది. ప్రాపంచిక విషయాలలో జీవించి ఉన్న వారి నుండి, వారి శక్తి పరిధిలోని సహాయం కోరడానికి మరియు చనిపోయిన వారి నుండి సహాయం కోరడానికి మధ్య ఉన్న వ్యత్యాసం కూడా వివరించబడింది. చివరగా, అల్లాహ్ ను విశ్వసించడం ద్వారా కలిగే లాభాల గురించి తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ప్రస్తావించారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహీ అజ్మయీన్ అమ్మా బాద్.

సోదర మహాశయులారా! విశ్వాస మూల సూత్రాలు అనే ఈ ముఖ్యమైన శీర్షికలో మనం ఇప్పటివరకు అల్లాహ్ యొక్క దయవల్ల ఆరు పాఠాలు విని ఉన్నాము, తెలుసుకున్నాము. ఈనాటి ఏడవ పాఠం అర్కానే ఈమాన్, విశ్వాస మూల సూత్రాలు. విశ్వాస మూల సూత్రాలు ఎన్ని ఉన్నాయి? ఆరు ఉన్నాయి. ఆరిట్లో మొట్టమొదటిది, ఎక్కువ ప్రాముఖ్యత గలది అల్లాహ్ పై విశ్వాసం. అల్లాహ్ పై విశ్వాసంలో ఎన్నో విషయాలు వస్తాయి. వాటిలోనే ఒక ముఖ్యమైనది ఏమిటి? అల్లాహ్ ను ఆరాధించడం. అల్లాహ్ ఆరాధనలో ఎవరినీ కూడా భాగస్వామిగా చేయకపోవడం.

అయితే ఈ ఒక్క మాటనే సరిపోతుంది. మనల్ని అల్లాహ్ ఆరాధించడానికే పుట్టించాడు గనక ఆయన ఆరాధనలో మనం మరెవరినీ కూడా భాగస్వామిగా చేయకూడదు. అయినా ఆరాధన అని మనం అన్నప్పుడు ఏ ఏ విషయాలు అందులో వస్తాయి? వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.

అల్లాహ్ ఆరాధన అని మనం అన్నప్పుడు, ఇందులో ముందు రెండు విషయాలని మీరు అర్థం చేసుకోండి. ఒకటి, అల్లాహ్ ఆరాధన అని మనం అన్నప్పుడు ఒక సామాన్య భావన, మరొకటి ప్రత్యేక భావన. అల్లాహ్ ఆరాధన యొక్క సామాన్య భావం, మరొకటి ప్రత్యేక భావం. ప్రత్యేక భావం అంటే ఏంటి? కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ఎలాంటి భాగస్వామ్యం లేకుండా చేసేటువంటి పనులు. అవి మన హృదయానికి సంబంధించినవి ఉన్నాయి, మన ధనానికి సంబంధించినవి ఉన్నాయి, ఇంకా మన సామాన్య అవయవాలు, నాలుక, చేతులు, కాళ్ళు, శారీరక ఆరాధనలు కూడా ఉన్నాయి. ప్రత్యేకమైనవి.

ఉదాహరణకు, హృదయానికి సంబంధించినవి ముహబ్బత్, ఇఖ్లాస్, ఖౌఫ్, రజా. సంక్షిప్తంగా ఈ పేర్లు గత ఆరవ పాఠంలో కూడా వచ్చాయి. అంటే అల్లాహ్ ను ఎలా ప్రేమించాలో అలాగ మరెవ్వరినీ కూడా ప్రేమించరాదు. ఏ పనులు మనం అల్లాహ్ కొరకు చేస్తామో అందులో ఇఖ్లాస్, స్వచ్ఛత అనేది ఉండాలి. అంటే ఏ ప్రదర్శనా బుద్ధి, ఏదైనా ప్రపంచ లాభం పొందే ఉద్దేశం అట్లాంటిది ఏదీ కూడా ఉండకూడదు.

అల్లాహ్ తో ఏ రీతిలో మనం భయపడాలో ఆ రీతిలో ఇంకా ఎవరితోనీ కూడా భయపడకూడదు. అల్లాహ్ పట్ల మనం ఎలాంటి ఆశతో ఉండాలో అలాంటి ఆశ ఇంకా ఎవరితోనీ కూడా మనకు ఉండకూడదు. అర్థమైంది కదా?

మన శరీరానికి సంబంధించిన కొన్ని ఆరాధనలు, నమాజ్. నమాజ్ ఇది శరీరానికి సంబంధించిన ఇబాదత్. ధనానికి సంబంధించిన ఇబాదత్ లో దానధర్మాలు, ప్రత్యేకంగా బలిదానం, జిబహ్ చేయడం. ఈ విధంగా నాలుకకు సంబంధమైన ఖురాన్ యొక్క తిలావత్, జిక్ర్. విషయం కొంచెం అర్థమైంది కదా?

అయితే మరి కొన్ని ఆరాధనలు ఉన్నాయి. వాటిలో ఎంతోమంది అల్లాహ్ తో పాటు ఇతరులకు ఆ ఆరాధనలు చేస్తారు. మరియు ఖురాన్ లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఎంతో నొక్కి చెప్పాడు అల్లాహ్ తప్ప వేరే ఎవరికీ అవి చేయకూడదు అని. అయితే వాటి ప్రాముఖ్యత పరంగా, వాటి గురించి ప్రత్యేకమైన ఆధారాలు, దలీల్ ఖురాన్ హదీస్ లో వచ్చి ఉంది గనుక వాటిల్లో కొన్ని మీ ముందు నేను ఉంచి వాటి యొక్క దలీల్ కూడా తెలిపే ప్రయత్నం చేస్తాను.

ఉదాహరణకు, ఆరాధనలో ఒక రకం దుఆ. దుఆ కేవలం ఎవరితోని చేయాలి? అల్లాహ్ తో మాత్రమే చేయాలి. ఎందుకు? దీనికి సంబంధించిన ఖురాన్ లో ఎన్నో ఆయతులు ఉన్నాయి. కానీ సూరె ఘాఫిర్, సూరా నెంబర్ 40, ఆయత్ నెంబర్ 60 లో,

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ
మీ ప్రభువు చెప్పాడు మీతో కేవలం నాతో మాత్రమే దుఆ చేయండి, మీ దుఆలను అంగీకరించే వాడిని నేను మాత్రమే.

ఇక్కడ గమనించండి, ఈ ఆయత్ యొక్క ఆరంభం ఎలా ఉంది?

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي
మీరు నాతో దుఆ చేయండి. ఆ తర్వాత ఏమంటున్నాడు?

إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي
ఎవరైతే నా ఆరాధన పట్ల విముఖత చూపుతారో, గర్వానికి గురి అవుతారో.

అంటే ఏం తెలిసింది ఇక్కడ? దుఆ, ఇబాదత్. అసలైన ఇబాదత్. అందుగురించి తిర్మిజీ లోని ఒక సహీ హదీస్ లో ఉంది,

الدُّعَاءُ هُوَ العِبَادَةُ
(అద్దుఆవు హువల్ ఇబాదా)
దుఆ యే అసలైన ఇబాదత్

అల్లాహ్ ఏమంటున్నాడు? ఎవరైతే నాతో దుఆ చేయరో, నాతో దుఆ చేయడంలో గర్వానికి గురి అవుతారో, నాతో దుఆ చేయడంలో విముఖత చూపుతారో,

سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ
ఎంతో అవమానంతో, పరాభవంతో వారు నరకంలో ప్రవేశిస్తారు.

అల్లాహు అక్బర్. ఏం తెలిసింది ఇప్పుడు మనకు? దుఆ ఆరాధనలో ఒక రకం, అది కేవలం ఎవరితో చేయాలి? అల్లాహ్ తో మాత్రమే. అల్లాహ్ తోనే మనం దుఆ చేయాలి. ఫలానా బాబా సాహెబ్, ఫలానా పీర్ సాహెబ్, ఫలానా వలీ సాహెబ్, ఫలానా సమాధిలో ఉన్న చాలా పెద్ద బుజుర్గ్, ఆయన మన దుఆలను వింటాడు, మన అవసరాలను తీరుస్తాడు అని వారితో దుఆ చేయడంలో ఎన్నో రకాల పాపాలు ఉంటాయి.. అందుగురించి దుఆ కేవలం ఎవరికి ప్రత్యేకించాలి? అల్లాహ్ కు మాత్రమే.

అలాగే తవక్కుల్, భరోసా, నమ్మకం. అల్లాహ్ త’ఆలా సూరె మాయిదా, సూరా నెంబర్ 5, ఆయత్ నెంబర్ 23 లో తెలిపాడు,

وَعَلَى اللَّهِ فَتَوَكَّلُوا إِن كُنتُم مُّؤْمِنِينَ
(వ అలల్లాహి ఫతవక్కలూ ఇన్ కున్తుమ్ ము’మినీన్)
మీరు నిజమైన విశ్వాసులు అయితే కేవలం అల్లాహ్ పై మాత్రమే నమ్మకం కలిగి ఉండండి. అల్లాహ్ తో మాత్రమే మీరు భరోసా, తవక్కుల్ తో ఉండండి.

ఇంకా సోదర మహాశయులారా! ఇలాంటి ఆయతులు చూసుకుంటే ఖురాన్ లో ఈ భావంలో ఎన్నో ఆయతులు ఉన్నాయి.

అలాగే ఏదైనా ఆపద, కష్ట సమయాల్లో సహాయానికి అర్ధించడం మరియు ఏదైనా కీడు నుండి రక్షణ పొందడానికి శరణు వేడుకోవడం, ఇవి కూడా కేవలం ఎవరితో ఉండాలి? అల్లాహ్ తో పాటు, అల్లాహ్ తో మాత్రమే.

కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని లేదా చిన్న తేడా మరియు వ్యత్యాసాన్ని గమనించండి. అదేమిటంటే ఏదైనా అవసరానికి సహాయం కోరడం గానీ లేదా ఏదైనా కీడు నుండి రక్షణ పొందడానికి శరణు వేడుకోవడం గానీ కేవలం ఎవరితో చేయాలి అన్నాము? అల్లాహ్ తో. కానీ కొన్ని సందర్భాల్లో మనం బ్రతికి ఉన్న కొందరు మనుషులతో సహాయము కోరుతాము మరియు శరణు వేడుకుంటాము. ఇది ఎప్పుడు జాయెజ్, ఎప్పుడు యోగ్యమవుతుంది? ఎవరితోనైతే మనం సహాయం కోరుతున్నామో, ఎవరితోనైతే శరణు వేడుకుంటున్నామో అతను బ్రతికి ఉండాలి, దగ్గరగా ఉండాలి మరియు అది ఆ శక్తి అతనిలో ఉండాలి వాస్తవానికి.

ఉదాహరణకు, ఎవరైనా మిమ్మల్ని హత్య చేస్తాడు అని మీకు మెసేజ్ పంపాడు, బెదిరింపులు పంపాడు, ఫోన్ పై చెప్పాడు లేదా ఏదో రకంగా. లేదా నవూజుబిల్లాహ్, అల్లాహ్ త’ఆలా మనందరినీ కూడా కాపాడు గాక, మన ఏదైనా వస్తువు తీసుకొని లేదా కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని డిమాండ్ చేస్తారు, అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? పోలీసులకి వెళ్లి అక్కడ వారి యొక్క సహాయం, వారి యొక్క శరణు కోరుతామా లేదా? ఇది షిర్క్ అయిపోతుందా? కాదు. ఎందుకు? ఇలాంటి రక్షణ కొరకే వారు ఉన్నారు.

కానీ ఇక్కడ ఒక విషయం, అదేమిటి? అల్లాహ్ తో కోరడం అనేది మనం మరిచిపోకూడదు. అల్లాహ్ ఒక సబబుగా చేశారు వారిని, వారికి ఈ యొక్క అవకాశం ఇచ్చారు. అందుకొరకే మనం వారితో కోరుతున్నాము. కానీ అసలు కోరడం అల్లాహ్ తో అది మరవకూడదు. ఓ అల్లాహ్, ఈ శక్తి సామర్థ్యం అంతా సర్వమూ నీ చేతిలోనే ఉంది. నువ్వు నన్ను కాపాడు, నీవు నాకు సహాయపడు మరియు నీవు మాత్రమే నాకు శరణు ప్రసాదించు అని అల్లాహ్ తో వేడుకోవాలి. వేడుకొని బ్రతికి ఉన్న వారిలో దాని యొక్క శక్తి ఉండేది ఉంటే వారితోని మనం సహాయం కోరవచ్చు.

ఇప్పుడు ఎవరైనా ఎంత పెద్ద వలీయుల్లాహ్ గానీ, అల్లాహ్ యొక్క వలీ, ఎంత గొప్ప అల్లాహ్ యొక్క వలీ గానీ చనిపోయి ఉన్నారు. అయితే అలాంటి వారితో మనం నాకు సంతానం ఇవ్వండి, మాకు సహాయం చేయండి, మా కొడుకును పాస్ చేయండి, ఫలానా శత్రువు మాపై దండెత్తడానికి, మాకు నష్టం, కీడు చేయడానికి సిద్ధం పూనుకున్నాడు, మీరు ఏదైనా మాకు శరణు ఇవ్వండి. వారు అల్లాహ్ యొక్క ఎంత గొప్ప వలీ కావచ్చు. కానీ అలా వారితో మనం ఈ శరణు కోరడం, సహాయం కోరడం అల్లాహ్ మనకు ఖురాన్ లో దాని యొక్క అనుమతి ఇవ్వలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఆ పద్ధతి మనకు నేర్పలేదు. విషయం అర్థమవుతుంది కదా?

అయితే అల్లాహ్ ను విశ్వసించడంలో ఈ విషయాలు కూడా వస్తాయి. వాటిని మనం అర్థం చేసుకోవాలి. అదే ప్రకారంగా మన యొక్క జీవితం మనం గడపాలి.

మొక్కుబడులు ఉన్నాయి. ఈ రోజుల్లో ఎంతో మందిని మనం చూస్తున్నాము, సమాధుల వద్దకు వెళ్లి అక్కడ మొక్కుకుంటారు. నా ఈ పని జరిగేది ఉంటే నేను ఇక్కడ వచ్చి చాదర్ వేస్తాను, పూలు వేస్తాను, ఒక మేక కోస్తాను, లేదా ఒక కోడిపుంజును జిబహ్ చేస్తాను ఈ విధంగా. ఇవన్నీ షిర్క్ లోకి వచ్చేస్తాయి. ఎందుకు? మొక్కుబడులు కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి.

విషయం అర్థమైంది కదా? ఇంకా ఎన్నో ఇలాంటి ఆధారాలు, దలీల్ ఖురాన్, హదీస్ లో ఉన్నాయి. కానీ సమయం సరిపోదు గనుక నేను ఈ కొన్ని విషయాల ద్వారానే ఈ టాపిక్ ను ఇక్కడి వరకు ముగింపు చేస్తున్నాను. కానీ విషయం అర్థమైంది కదా మీకు? అల్లాహ్ ను విశ్వసించడం అనేది అర్కానే ఈమాన్, విశ్వాస మూల సూత్రాల్లో మొట్టమొదటిది, ముఖ్యమైనది. అల్లాహ్ పై విశ్వాసంలో ఆయన అస్తిత్వం, అంటే ఆయన ఒకే ఒక్కడు తన అస్తిత్వంలో కూడా మరియు ఆయనకు మంచి ఉత్తమ పేర్లు, గుణాలు ఉన్నాయి అని కూడా (అస్మా వ సిఫాత్) మరియు ఆయన మాత్రమే సర్వాన్ని సృష్టించువాడు, పోషించువాడు, నడిపించువాడు (రుబూబియత్) మరియు సర్వ ఆరాధనలకు అర్హుడు కూడా కేవలం ఆయన మాత్రమే.

అల్లాహ్ విషయంలో మనం ఈ విషయాలు, అల్లాహ్ పై విశ్వాసంలో మనం ఈ విషయాల్ని అర్థం చేసుకోవడం, ఈ ప్రకారంగా మన జీవితాన్ని గడపడం ఇది చాలా అవసరం.

అల్లాహ్ త’ఆలా మనందరికీ అల్లాహ్ పై విశ్వాసం సంపూర్ణ విధంగా పాటించేటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక. అల్లాహ్ పై విశ్వాసంలో ఏ రవ్వంత కొరత వచ్చేటువంటి చెడుల నుండి, పాపాల నుండి, లోపాల నుండి అల్లాహ్ మనల్ని కాపాడు గాక.

ఇన్ షా అల్లాహ్, దీని తర్వాత అల్లాహ్ యొక్క దయవల్ల, అల్లాహ్ పై విశ్వాసం, దీని యొక్క లాభాలు ఏమిటి? ఇది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. సమరాతుల్ ఈమాని బిల్లాహ్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతోమంది, అరే అల్లాహ్ నే నమ్మండి, అల్లాహ్ నే విశ్వసించండి అని మాటిమాటికి అంటా ఉంటారు. ఏంటి లాభం మాకు దీనితోని? కొందరితో అజ్ఞాన కారణంగా అడగవచ్చు, అడగకపోయినా గానీ మనసులో వారికి అల్లాహ్ ను మనం తప్పకుండా విశ్వసించి జీవించాలి అన్నటువంటి ఒక తపన, కోరిక ఎంతో మందిలో లేకుండా మనం చూస్తూ ఉన్నాము. అలాంటప్పుడు మనం అల్లాహ్ ను విశ్వసించడం ద్వారా ఏం లాభాలు మనకు కలుగుతాయి, అవి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇవి తెలుసుకొని వాటిని పాటించేటువంటి సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. వ ఆఖిరు ద’వాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.


పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)

ఇతరములు: [విశ్వాసము]

    నమాజ్ చేయవలసిన మరియు చేయరాని సమయాలు [వీడియో]

    బిస్మిల్లాహ్

    [సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/gbir]
    [ 30 నిముషాలు]

    వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
    Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

    ఏ నమాజు యొక్క ఏ సమయం ఉంది, మరియు నమాజు చేయరాని సమయాలు ఏమిటి తెలుసుకోండి, ఇతరులకు తెలుపండి

    నమాజు సమయాలు

    عَنِ ابْنِ عَبَّاسٍ t قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: أَمَّنِي جِبْرِيلُ عَلَيْهِ السَّلَام عِنْدَ الْبَيْتِ مَرَّتَيْنِ، فَصَلَّى بِيَ الظُّهْرَ حِينَ زَالَتِ الشَّمْسُ وَكَانَتْ قَدْرَ الشِّرَاكِ، وَصَلَّى بِيَ الْعَصْرَ حِينَ كَانَ ظِلُّهُ مِثْلَهُ، وَصَلَّى بِيَ يَعْنِي الْمَغْرِبَ حِينَ أَفْطَرَ الصَّائِمُ، وَصَلَّى بِيَ الْعِشَاءَ حِينَ غَابَ الشَّفَقُ، وَصَلَّى بِيَ الْفَجْرَ حِينَ حَرُمَ الطَّعَامُ وَالشَّرَابُ عَلَى الصَّائِمِ، فَلَمَّا كَانَ الْغَدُ صَلَّى بِيَ الظُّهْرَ حِينَ كَانَ ظِلُّهُ مِثْلَهُ، وَصَلَّى بِي الْعَصْرَ حِينَ كَانَ ظِلُّهُ مِثْلَيْهِ، وَصَلَّى بِيَ الْمَغْرِبَ حِينَ أَفْطَرَ الصَّائِمُ، {وفي رواية أبي موسى: وَصَلَّى الْمَغْرِبَ قَبْلَ أَنْ يَغِيبَ الشَّفَقُ} وَصَلَّى بِيَ الْعِشَاءَ إِلَى ثُلُثِ اللَّيْلِ، وَصَلَّى بِيَ الْفَجْرَ فَأَسْفَرَ»

    ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః జిబ్రీల్ అలైహిస్సలాం కాబా వద్ద రెండు సార్లు నాకు నమాజు చేయించారు;

    • పొద్దు వాలి, నీడ చెప్పు గూడంత ఉన్నప్పుడు నాకు జొహ్ర్ నమాజు చేయించారు,
    • ప్రతి వస్తువు నీడ దానంత అయినప్పుడు నాకు అస్ర్ నమాజు చేయించారు,
    • ఉపవాసమున్న వ్యక్తి ఉపవాసం విరమించే- టప్పుడు మగ్రిబ్ నమాజ్ చేయించారు,
    • ఎర్రని కాంతులు మరుగైన తర్వాత ఇషా నమాజ్ చేయించారు,
    • ఉపవాసముండే వ్యక్తిపై తినత్రాగడం నిషిద్ధం అయినప్పడు నాకు ఫజ్ర్ నమాజు చేయించారు.

    మరుసటి రోజు;

    • ప్రతి వస్తువు నీడ దానంత అయినప్పుడు జొహ్ర్ నమాజ్ చేయించారు,
    • ప్రతి వస్తువు నీడ దాని రెండింతలు అయినప్పుడు అస్ర్ నమాజ్ చేయించారు,
    • ఉపవాసమున్న వ్యక్తి ఉపవాసం విరమించే- టప్పుడు మగ్రిబ్ నమాజ్ చేయించారు, [అబూ మూసా ఉల్లేఖనంలో ఉందిః ఎర్రని కాంతి మరుగుపడే ముందు మగ్రిబ్ నమాజ్ చేయించారు]
    • రాత్రి మూడవ భాగం గడిశాక ఇషా నమాజ్ చేయించారు,
    • తెలుపుగా ఉన్నప్పుడు ఫజ్ర్ నమాజు చేయించారు.  (అబూ దావూద్ 393, 395).

    ప్రతి నమాజు తొలి సమయంలో చేయడం ఉత్తమం

    عنْ أُمِّ فَرْوَةَ، قَالَتْ: سُئِلَ رَسُولُ اللهِ ﷺ أَيُّ الْأَعْمَالِ أَفْضَلُ؟ قَالَ: «الصَّلَاةُ فِي أَوَّلِ وَقْتِهَا»

    ఉమ్మె ఫర్వా ఉల్లేఖనం ప్రకారం, కార్యాల్లో ఏదీ అతిఉత్తమమైనదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించబడినప్పుడు, నమాజు దాని తొలి సమయంలో చేయడం అని సమాధానం ఇచ్చారు. (అబూ దావూద్ 426).

    తెలిసీ సమయం దాటనివ్వకూడదు

    عَنْ أَبِي ذَرٍّ، قَالَ: قَالَ لِي رَسُولُ اللهِ ﷺ: «كَيْفَ أَنْتَ إِذَا كَانَتْ عَلَيْكَ أُمَرَاءُ يُؤَخِّرُونَ الصَّلَاةَ عَنْ وَقْتِهَا؟ – أَوْ – يُمِيتُونَ الصَّلَاةَ عَنْ وَقْتِهَا؟» قَالَ: قُلْتُ: فَمَا تَأْمُرُنِي؟ قَالَ: «صَلِّ الصَّلَاةَ لِوَقْتِهَا، فَإِنْ أَدْرَكْتَهَا مَعَهُمْ، فَصَلِّ، فَإِنَّهَا لَكَ نَافِلَةٌ»

    హజ్రత్ అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: మీ నాయకులు నమాజులను ఆలస్యంగా చేసినప్పుడు నీ పరిస్థితి ఏముంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, అలాంటప్పుడు నేనేమి చేయాలో మీరే ఆదేశించండి అని విన్నవించుకున్నాను, అప్పుడు ఆయన చెప్పారు: నీవు నమాజు దాని సమయంలో చేసుకో, వారితో కూడా నీకు అదే నమాజు మరోసారి చేయవలసి వచ్చినప్పుడు, వారితో కూడా చేయి, అది నీకు నఫిల్ అవుతుంది. (ముస్లిం 648).

    ఇషా నమాజు ఆలస్యం చేయవచ్చును

    عَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ النَّبِيُّ ﷺ: «لَوْلَا أَنْ أَشُقَّ عَلَى أُمَّتِي لَأَمَرْتُهُمْ أَنْ يُؤَخِّرُوا العِشَاءَ إِلَى ثُلُثِ اللَّيْلِ أَوْ نِصْفِهِ»

    ప్రవక్త సల్లల్ల్లాహు అలైహి వసల్లం చెప్పారని హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః నా అనుచర సంఘానికి కష్టతరంగా ఉంటుందన్న భయం నాకు లేకుంటే రాత్రి మూడవ భాగం లేదా అర్థ రాత్రి వరకు ఇషా నమాజును ఆలస్యంగా చేయండని ఆదేశించేవాడిని. (తిర్మిజి 167).

    అయితే జమాఅతు (సామూహిక) నమాజు వదలి ఆలస్యం చేయకూడదు. ఏదైనా మస్జిదు వారందరూ ఏకమై ఆలస్యం చేస్తే అభ్యంతరం లేదు.

    పడుకున్న లేదా మరచిపోయిన వ్యక్తి ఎప్పుడు నమాజు చేయాలి?

    عَنْ أَنَسِ بْنِ مَالِكٍ t، قَالَ: قَالَ نَبِيُّ اللهِ ﷺ: «مَنْ نَسِيَ صَلَاةً، أَوْ نَامَ عَنْهَا، فَكَفَّارَتُهَا أَنْ يُصَلِّيَهَا إِذَا ذَكَرَهَا»

    ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని హజ్రత్ అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఎవరైనా ఏదైనా నమాజు మరచిపోతే లేదా ఆ నమాజు సమయంలో నిద్రిస్తూ ఉంటే దాని పరిహారం ఏమిటంటే గుర్తు వచ్చిన (లేదా మేల్కొన్న) వెంటనే ఆ నమాజు చేసుకోవాలి. (ముస్లిం 684).

    నమాజు చేయరాని సమయాలు

    عن عُقْبَةَ بْنِ عَامِرٍ الْجُهَنِيَّ t يَقُولُ: ثَلَاثُ سَاعَاتٍ كَانَ رَسُولُ اللهِ ﷺ يَنْهَانَا أَنْ نُصَلِّيَ فِيهِنَّ، أَوْ أَنْ نَقْبُرَ فِيهِنَّ مَوْتَانَا: «حِينَ تَطْلُعُ الشَّمْسُ بَازِغَةً حَتَّى تَرْتَفِعَ، وَحِينَ يَقُومُ قَائِمُ الظَّهِيرَةِ حَتَّى تَمِيلَ الشَّمْسُ، وَحِينَ تَضَيَّفُ الشَّمْسُ لِلْغُرُوبِ حَتَّى تَغْرُبَ» {مسلم 831}

    హజ్రత్ ఉక్బా బిన్ ఆమిర్ అల్ జుహనీ రజియల్లాహు అన్హు కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మేము మూడు వేళల్లో నమాజు చేయడం మరియు శవాలను ఖననం చేయడం నుండి వారించేవారుః

    • సూర్యోదయం అయ్యే వేళ అది పైకెక్కే వరకూ,
    • నడి నెత్తిన మీది కొచ్చిన సూర్యుడు వాలే వరకూ,
    • సూర్యాస్తమయం అయ్యే వేళ పూర్తిగా ఆస్తమించే వరకు. (ముస్లిం 831).

    عن أَبي سَعِيدٍ الخُدْرِيّ t يَقُولُ: سَمِعْتُ رَسُولَ اللهِ ﷺ يَقُولُ: «لاَ صَلاَةَ بَعْدَ الصُّبْحِ حَتَّى تَرْتَفِعَ الشَّمْسُ، وَلاَ صَلاَةَ بَعْدَ العَصْرِ حَتَّى تَغِيبَ الشَّمْسُ»

    నేను ప్రవక్త ﷺ ఉద్బోధించగా విన్నాను అని హజ్రత్ అబూ సఈద్ ఖుద్రీ t ఉల్లేఖించారుః ఉదయం నమాజు నెరవేర్చిన తర్వాత సూర్యోదయం వరకూ మరే నమాజు లేదు. అలాగే అస్ర్ నమాజ్ నెరవేర్చిన తర్వాత సూర్యాస్తమయం వరకూ ఏ నమాజూ లేదు. (బుఖారి 586, ముస్లిం 827).

    *  ఫజ్ర్ కు ముందు గల సున్నతులు ముందే చేయ లేక పోతే ఫజ్ర్ తర్వాత చేయవచ్చును (తిర్మిజి 422).

    కూర్పు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ

    ఇతరములు:

    పరలోక చింతన, దాని ప్రాముఖ్యత (تذكر الآخرة) [వీడియో & టెక్స్ట్]

    పరలోక చింతన, దాని ప్రాముఖ్యత (تذكر الآخرة)
    https://www.youtube.com/watch?v=EI46WtFBd8U [39 నిముషాలు]
    వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

    మనిషి ఇహలోకంలో శాశ్వతంగా ఉండడు,శాశ్వత జీవితం పరలోక జీవితం. అయితే ఇక్కడ ఉండీ అక్కడి జీవితం గురించి ఎలా ఆలోచించగలం, ఊహించగలమో తెలుసుకొనుటకు ఈ వీడియో చూడండి.

    ఈ ప్రసంగంలో, వక్త పరలోక జీవితం మరియు దాని కోసం సిద్ధం కావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఇహలోక జీవితం ఒక పరీక్ష అని, శాశ్వతం కాదని, మోసంతో కూడుకున్నదని ఖురాన్ ఆయతుల ద్వారా వివరించారు. మరణ సమయం ఎవరికీ తెలియదని, కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వాసంతో, సత్కార్యాలు చేస్తూ ఉత్తమమైన స్థితిలో మరణాన్ని పొందాలని కోరుకోవాలని, కేవలం కోరుకుంటే సరిపోదని, దానికి తగ్గ ఆచరణ కూడా ఉండాలని ఉద్బోధించారు. కష్టాలు, సుఖాలు రెండూ అల్లాహ్ నుండే వచ్చే పరీక్షలని, వాటిని సహనంతో, నమాజ్ తో ఎదుర్కోవాలని సూచించారు. యువత, ఆరోగ్యం, సంపద, తీరిక సమయం మరియు జీవితం వంటి ఐదు అమూల్యమైన వరాలను అవి చేజారిపోకముందే సద్వినియోగం చేసుకోవాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసును ఉటంకించారు. సమయాన్ని వృధా చేయకుండా, అల్లాహ్ ధ్యానంలో మరియు సత్కార్యాలలో గడపడం ద్వారా పరలోక సాఫల్యం కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

    بِسْمِ ٱللَّٰهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
    అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

    అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ సహ్బిహీ అజ్మయీన్, అమ్మా బాద్.

    أَعُوذُ بِٱللَّهِ ٱلسَّمِيعِ ٱلْعَلِيمِ مِنَ ٱلشَّيْطَانِ ٱلرَّجِيمِ
    శపించబడిన షైతాన్ నుండి నేను సర్వశ్రోత మరియు సర్వజ్ఞుడైన అల్లాహ్ శరణు వేడుతున్నాను.

    كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ ۗ وَإِنَّمَا تُوَفَّوْنَ أُجُورَكُمْ يَوْمَ الْقِيَامَةِ ۖ فَمَن زُحْزِحَ عَنِ النَّارِ وَأَدْخِلَ الْجَنَّةَ فَقَدْ فَازَ ۗ وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا مَتَاعُ الْغُرُورِ
    ప్రతి ప్రాణీ మరణ రుచి చూడవలసిందే. మరి నిశ్చయంగా ప్రళయ దినాన మీరు మీ పూర్తి ప్రతిఫలాలు పొందగలరు. కనుక ఎవరైతే నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశింపజేయబడతాడో అతనే సాఫల్యం పొందినవాడు. ఈ ఐహిక జీవితం కేవలం మోసపు సామాగ్రి తప్ప మరేమీ కాదు.

    అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వ జగత్తుకు ఏకైక యజమాని, మన ఆరాధనలకు నిజమైన ఆరాధనీయుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు స్తుతులు, పొగడ్తలు అన్నీయు చెల్లును. అంతిమ ప్రవక్త, దయామయ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ యొక్క అనేక అనేక కరుణలు, శాంతులు, శుభాలు కురియుగాక.

    సోదర మహాశయులారా! ఈరోజు మనం ‘పరలోక జీవితం, దాని గురించి మనం ఏం సిద్ధపరుస్తున్నాము’ అనే శీర్షికపై కొన్ని విషయాలు విందాము, గ్రహిద్దాము, ఆచరణకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆచరించే ప్రయత్నం చేద్దాము ఇన్షా అల్లాహ్. అల్లాహ్ త’ఆలా అలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అయితే, నా ఈ చిన్న ప్రసంగంలో కొన్ని ప్రశ్నలు కూడా నేను అడుగుతాను. మీరు త్వరగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. ఇన్షా అల్లాహ్.

    మొదటి ప్రశ్న ఏంటంటే, మనం ఎప్పుడు చనిపోతాము అన్న విషయం మనకు తెలుసా? లేదు. మనం ఎప్పుడు చనిపోతాము అన్న విషయం మనలో ఎవరికీ తెలియదు. స్వయంగా అల్లాహ్ త’ఆలా సూరె లుఖ్మాన్ చివరిలో,

    وَمَا تَدْرِي نَفْسٌ مَّاذَا تَكْسِبُ غَدًا ۖ وَمَا تَدْرِي نَفْسٌ بِأَيِّ أَرْضٍ تَمُوتُ
    తాను రేపు ఏం చేయనున్నదో ఏ ప్రాణీ ఎరుగదు. తాను ఏ గడ్డపై మరణిస్తాడో కూడా ఎవరికీ తెలీదు (31:34)

    మనకు చావు ఎప్పుడు వస్తుందో అన్న విషయం తెలియనప్పుడు, చావు ఏ పరిస్థితిలో వస్తే బాగుంటుంది అన్న విషయం ఎప్పుడైనా ఒక్కసారైనా మనం ఆలోచించామా? ఉదాహరణకు, రెండో ప్రశ్న అనుకోండి.

    ఒక వ్యక్తి లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుతూ చదువుతూ చనిపోతున్నాడు. మరో వ్యక్తి అవిశ్వాస మాటలు లేదా ఏదైనా పాటలు పాడుకుంటూ చనిపోతున్నాడు. ఒక వ్యక్తి నమాజ్ చేస్తూ సజ్దా స్థితిలో ఉండి చనిపోతున్నాడు. మరో వ్యక్తి నమాజ్ సమయాన్ని వృధా చేసి పాటలు వినుకుంటూ, ఫిలింలు చూసుకుంటూ, ఇంకా వేరే ఏదైనా చెడు కార్యాలు చూస్తూ ఆ స్థితిలో చనిపోతున్నాడు. ఒక వ్యక్తి ఎవరైనా బీదవారికి దానం చేస్తూ లేక ఎవరికైనా సహాయం చేస్తూ ఆ స్థితిలో చనిపోతున్నాడు. మరో వ్యక్తి ఎవరైనా బీదవాళ్ళను తన చేతి కింద పనిచేసే వాళ్ళను, వారిపై అన్యాయం చేస్తూ, ఏదైనా దౌర్జన్యం చేస్తూ ఆ స్థితిలో చనిపోతున్నాడు. ఒక వ్యక్తి ప్రయాణంలో వెళ్తున్నాడు, వాహనంలో ఉన్నాడు, నోటి మీద అల్లాహ్ యొక్క జిక్ర్ ఉంది, యాక్సిడెంట్ అయిపోయింది, ఆ సందర్భంలో కూడా అతనికి కలిమా నోటి మీద వచ్చేసింది. మరో వ్యక్తి తన ఫ్రెండ్లతో, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసుకుంటూ ప్రయాణం చేస్తున్నాడు, ఆ స్థితిలో అతనికి చావు వచ్చేసింది, యాక్సిడెంట్ అయింది, ఆ స్థితిలో చావు వచ్చింది.

    ఇప్పుడు మీరే ఆలోచించండి, స్వయంగా మీరు, అంటే నేను, మీలో ప్రతి ఒక్కరు, స్వయంగా నేను కూడా, నేను ఏ స్థితిలో నాకు చావు వస్తే బాగుంటుంది అని ఆలోచించాలి. దేని గురించి నేను సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి? కుడి వైపున చెప్పిన విషయాలకా లేకుంటే ఎడమ వైపున చెప్పిన విషయాలకా? మీ అందరిలో ప్రతి ఒక్కరు ఇదే కోరుకుంటున్నారా? ఇన్షా అల్లాహ్. అల్లాహ్ త’ఆలా మన ఈ కోరిక ప్రకారం అలాంటి ఆచరణ ప్రసాదించుగాక, మరి మన కోరిక ప్రకారం మన యొక్క చావు అదే స్థితిలో అల్లాహ్ త’ఆలా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.

    అయితే సోదరులారా! మాట్లాడుకున్నప్పుడు ఇది కోరుకుంటున్నాము. కుడివైపున సైగ చేసి ఏ విషయాలైతే చెప్పబడ్డాయో అవి కోరుకుంటున్నాము అని మాట్లాడేటప్పుడు, ఎవరైనా ప్రశ్న ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పడం సులభం. కానీ దానిని ఆచరణ రూపంలో కూడా మనం ఉంచాలి. ఎందుకంటే కలిమా చదువుతూ, నమాజ్ చేసుకుంటూ, ఇంకా వేరే ఉత్తమ కార్యాలు చేస్తూ మన చావు రావాలి అని కోరుకోవడం ఇది ఒక అంతు అయితే, ఎగ్జాక్ట్లీ దాని ప్రకారం లేదా కనీసం దానికి దగ్గరగా అలాంటి మంచి ఆచరణలు అవలంబించడం ఇది మరో అంతు.

    కేవలం కోరికల మీద మేడలు కడతామా? ఇప్పుడు మనం ఇక్కడ విదేశ జీవితం గడుపుతున్నాము. ఇక్కడ సంపాదిస్తున్నాము. మనకన్ని కోరికలు ఉన్నాయా లేదా? ఉదాహరణకు ఇప్పుడు పెళ్లి కాని యువకులు, ఇలాంటి స్త్రీతో, ఇలాంటి అమ్మాయితో వివాహం చేయాలి, ఆ అమ్మాయిలో ఇలాంటి, ఇలాంటి గుణాలు ఉండాలి, నేను ఇక్కడ మంచిగా సంపాదించాలి, ఇంత మంచి ఒక ఇల్లు కట్టాలి, ఒక గృహం నిర్మించాలి, ఇలాంటి కోరికలు ఉన్నాయా లేవా? మనం ప్రతిరోజు పడుకునే ముందు ఇలాంటి కోరికల్ని గుర్తు చేసుకుంటూ, వాటిని వల్లించుకుంటూ, మళ్ళించుకుంటూ, తిరిగి తిరిగి వాటిని గుర్తు చేసుకుంటూ మనం పడుకున్నప్పటికీ, ఓ పది సంవత్సరాల తర్వాత ఆ మేడ కట్టి అక్కడ తయారు ఉంటుందా? బిల్డింగ్ కట్టి అక్కడ రెడీ ఉంటుందా? ఏం చేయాల్సి ఉంటుంది? దాని గురించి ప్రయత్నం చేయాలి, సంపాదించాలి, ఇల్లు కట్టడానికి దానికి సంబంధించిన మనుషులు ఎవరైతే ఉంటారో వారితో కలవాలి, ఆ పనులు చేయాలి. అలాగే కలిమా చదువుతూ, నమాజ్ చేస్తూ, మంచి స్థితిలో, ఉత్తమ రీతిలో నాకు చావు రావాలి అని కోరుకున్నంత మాత్రాన కోరిక తీరుతుందా? లేదు.

    మౌత్ కా బయాన్’ అని ఉర్దూలో ఒక పుస్తకం ఉంది. దాని యొక్క రచయిత ఒక సంఘటన గుర్తు చేశాడు. ఒక వ్యక్తి రోడ్డు మీద నిలబడి సామాను అమ్ముకుంటూ ఉంటాడు. ఇలాంటి మనుషులను మనం ఎంతో మంది చూస్తూ ఉంటాం కదా. పొద్దుటి నుండి సాయంకాలం వరకు, “పాంచ్ రియాల్, పాంచ్ రియాల్, పాంచ్ రియాల్, ఐదు రూపాయలు, ఐదు రూపాయలు, ఐదు రూపాయలు, ఖంస రియాల్, ఖంస రియాల్, ఖంస రియాల్”. మార్కెట్లో ఎప్పుడైనా విన్నారా లేదా ఇట్లాంటిది? అదే పాట. నమాజ్ లేదు, అల్లాహ్ యొక్క జిక్ర్ లేదు, ఇంకా వేరే ఉత్తమ కార్యాలు ఏవీ లేవు. ముస్లిం. చనిపోయేటప్పుడు, చావు దగ్గరికి వచ్చినప్పుడు, అతని బంధువులు దగ్గరగా ఉండి, “నానా, లా ఇలాహ ఇల్లల్లాహ్ చదవండి” అని అంటున్నారు. “లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పక్కన అక్కడ మెల్లమెల్లగా పలుకుతున్నారు కనీసం విని అంటారని. కొంచెం మాట్లాడడానికి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, “ఐదు రూపాయలు, ఐదు రూపాయలు, ఐదు రూపాయలు, పాంచ్ రియాల్, పాంచ్ రియాల్, పాంచ్ రియాల్, పాంచ్ రియాల్” అదే మాట వస్తుందట. ఎందుకు?

    ఈ విధంగా మనిషి ఏదైనా ఉద్యోగపరంగా ఏదైనా ఒక మాటను మాటిమాటికీ చెప్పడం, అది తప్పు అని కాదు ఇక్కడ చెప్పే ఉద్దేశం. కానీ అల్లాహ్ యొక్క జిక్ర్, ఈమాన్, విశ్వాసం, నమాజ్, ఇతర సత్కార్యాలకు ఏ స్థానం అయితే ఇవ్వాలో, ఇతర సత్కార్యాలు ఎంతగా పాటించాలో, వాటిని పాటించడం కూడా తప్పనిసరి.

    చావు ఎప్పుడు వస్తుంది మనకు తెలియదు. చావు మంచి స్థితిలో రావాలి మనందరి కోరిక. కానీ జీవితం గడుపుతున్నప్పుడు, “అరే! యవ్వనం ఉంది కదా, మనం యువకులం కదా, ఇప్పుడే కదా, ఒకేసారి కదా జీవితం, ఒకేసారి కదా ఛాన్స్” అనుకుంటూ మన కోరికలు మంచిగా ఉన్నప్పటికీ, ఆచరణను మంచిగా ఉంచకుంటే, చావు మంచిగా వస్తుంది అన్న ఆశ ఏదైనా ఉంటుందా? అందుగురించి సోదరులారా!

    كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ
    (కుల్లు నఫ్సిన్ జాఇఖతుల్ మౌత్)
    ప్రతి జీవికీ మరణ రుచి చూడక తప్పదు. (సూరె ఆలి ఇమ్రాన్ లో ఉంది ఆ ఆయత్)

    وَإِنَّمَا تُوَفَّوْنَ أُجُورَكُمْ يَوْمَ الْقِيَامَةِ
    (వ ఇన్నమా తువఫ్ఫౌన ఉజూరకుమ్ యౌమల్ ఖియామహ్)
    ప్రళయ దినాన మీరు చేసుకున్న కర్మలకు సంపూర్ణ ఫలితం మీరు పొందుతారు.

    అయితే వినండి,

    فَمَن زُحْزِحَ عَنِ النَّارِ وَأَدْخِلَ الْجَنَّةَ فَقَدْ فَازَ
    (ఫమన్ జుహ్జిహ అనిన్నారి వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్)
    ఎవరైతే నరకం నుండి దూరం చేయబడ్డారో, స్వర్గంలో ప్రవేశింపబడ్డారో, విజయం అతనిది. సాఫల్యం అతనికి లభించింది.

    ఇక్కడి వరకు విషయం అర్థమైంది కదా? ఏం చెప్పాడు అల్లాహ్ త’ఆలా? ప్రతి జీవి మరణించక తప్పదు, తప్పకుండా చనిపోతారు. ఆ తర్వాత చెప్పాడు అల్లాహ్ త’ఆలా, మీరు చేసుకున్న ప్రతి కర్మలకు సంపూర్ణ ఫలితం లభిస్తుంది. ఆ తర్వాత చెప్పాడు, నరకం నుండి దూరం చేయబడి, స్వర్గంలో ప్రవేశించిన వారు వారే సాఫల్యం పొందిన వారు. కానీ ఆ మరణం రాకముందు మనం ఎక్కడున్నాము? ఈ భూమి మీదే కదా, ఈ లోకంలో కదా. ఇక్కడ ఉండే కదా మనం ఆ స్వర్గం గురించి ఏదైనా ప్రయత్నం చేయాలి? ఇక్కడ ఉండే మనం సత్కార్యాలు చేయాలి, అప్పుడు నరకం నుండి దూరం చేయబడతాము, స్వర్గంలో ప్రవేశింపజేయబడతాము. అయితే అల్లాహ్ త’ఆలా ఎంత గొప్ప విషయం ఆ తర్వాత చెప్పాడో గమనించండి, ‘ఫఖద్ ఫాజ్’, సాఫల్యం పొందాడు అని మాట అయిపోయింది, కాలేదు. ఆ తర్వాత అల్లాహ్ చెప్పాడు,

    وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا مَتَاعُ الْغُرُورِ
    (వ మల్ హయాతుద్దున్యా ఇల్లా మతావుల్ గురూర్)
    వినండి, ఇహలోక జీవితం మోసపు సామాగ్రి.

    ఇహలోక జీవితం, ఇందులో ఎన్నో రకాల మీకు మోసాలు జరుగుతాయి. ఒక వ్యక్తి వ్యాపారంలో మోసపోతాడు, ఇంకో వ్యక్తి తన వ్యవసాయంలో మోసపోతాడు, ఇంకో వ్యక్తి ఉద్యోగంలో మోసపోతాడు, ఇంకో వ్యక్తి ఏదైనా పని చేసుకుంటూ మోసపోతాడు. ఇవన్నీ మోసాలు చాలా తేలికగా, ఏ లెక్క లేనివి. అతి గొప్ప మోసం, ఎలాంటి మోసం? మనిషి స్వర్గం గురించి ఆలోచిస్తూ, స్వర్గం గురించి కోరికలు ఊహించుకుంటూ దాని గురించి ఏమీ చేయకుండా, ఏ సత్కార్యం పాటించకుండా, విశ్వాస మార్గం అవలంబించకుండా జీవితం గడపడం ఇది మహా మోసం.

    ఇలాంటి మోసం అర్థమవుతుందా? ఉదాహరణకు, రోజూవారీగా కూలి తీసుకొని పనిచేసే వాళ్ళ విషయం గమనించండి, “ఈరోజు నా దగ్గర నువ్వు పని చేయాలి. ఎంత? ఈరోజు పనిచేస్తే 200 రియాల్ నీకు ఇస్తాను.” ఒప్పందం అయిపోయింది. సాయంకాలం వరకు మీకు డబ్బు ఇవ్వకుండా వెళ్ళిపోతే ఏమంటారు? మోసం చేశాడు వీడు అని నాలుగు తిడతారా లేదా? ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాము. కొందరు ఇలాంటి మోసాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ మనకు మనం ముస్లింలమనుకొని, విశ్వాసులమన్నటువంటి సంతృప్తిలో ఉండి, విశ్వాస మార్గం మీద స్థిరంగా ఉండకుండా, సత్కార్యాలు చేస్తూ మనం జీవితం గడపకుండా ఆ స్వర్గం మన తాతముత్తాతల ఏదైనా ఆస్తి ఉన్నట్లుగా మనం దొరుకుతుందిలే, ఎప్పుడో ఒకసారి స్వర్గంలో పోవాల్సిందే కదా అన్నటువంటి ఆలోచనల్లో పడి, సత్కార్యాలను వదులుకోవడం, ఇష్టం వచ్చినట్లు పాపాలు చేసుకుంటూ జీవితం గడపడం, ఇది మనకు మనం మోసంలో పడిపోతలేమా? స్వర్గం యొక్క కోరిక ఉంది, చేస్తున్న కార్యాలు ఏంటి? స్వర్గంలో తీసుకెళ్ళేటివా? కాదు.

    ఇప్పుడు ఎండకాలం రాబోతుంది. రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. ఏం కనబడుతుంది? ముంగట రోడ్డు మీద నీళ్లు ఉన్నట్లు కనబడుతుంది. జరుగుతుంది కదా అలాంటిది? అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటాయా నీళ్లు? మీరు అనుకోండి, ఉదాహరణకు మీరు ఒక ఎడారిలో ఉన్నారు. ఎండలో తపించిపోయి మీకు చాలా దాహం కలుగుతుంది. నీళ్లు లేక మీరు తపిస్తున్నారు. మీకు ఎండమావులు కనబడతాయి. ఎండమావులే అంటారు కదా, సురాబ్. ఆహ్! ఇంకొంచెం నేను నడిచిపోతే ఇక నాకు నా ప్రాణంలో ప్రాణం వచ్చేస్తది, ఇక నీళ్లు దొరుకుతాయి, అన్నటువంటి ఆశతో అలసిపోయి, నడవలేని శక్తి, శక్తి ఏ మాత్రం లేదు నడవడానికి, కానీ అలాంటి ఎండమావులు, ఎండమావులు కాదు దాన్ని నీళ్లు అనుకుంటున్నాం మనం. ఇంకొంచెం కష్టపడి నాలుగు అడుగులు వెళ్దాము అని అనుకొని అక్కడికి వెళ్ళేసరికి అక్కడ నీళ్లు ఉండకుండా ఎండమావులు అని మీకు అనిపించినప్పుడు ఎంత బాధ కలుగుతుంది? ఇక ఎందుకు జీవితం, ఛా! ఇక్కడే చనిపోతే బాగుంటది. అనిపిస్తదా లేదా?

    ఎవరైతే అల్లాహ్ ను కాకుండా వేరే దేవతలను ఆరాధిస్తారో, అలాంటి వారికి ప్రళయ దినాన ఇలాంటి మోసపు శిక్ష కూడా జరుగుతుంది. సహీ బుఖారీలో హదీస్ వచ్చి ఉంది. అందుగురించి సోదరులారా, ఇకనైనా మనం ఉన్న కొత్త జీవితాన్ని మనం అదృష్టంగా భావించి దాన్ని విశ్వాస మార్గంలో, సత్కార్యాలు చేసుకుంటూ గడిపే ప్రయత్నం చేద్దాం. ఇన్షా అల్లాహ్.

    చూడండి, ఇహలోకంలో అల్లాహ్ ఎందుకు పంపాడు మనల్ని? హాయిగా స్వర్గం లాంటి జీవితం గడపడానికా లేకుంటే పరీక్ష గురించా? ఇది మూడో ప్రశ్న అనుకోండి మీరు. ఇహలోకంలో మనం ఎందుకు వచ్చాము? హాయిగా, లగ్జరీ లైఫ్ గడపడానికా లేకుంటే ఒక పరీక్ష పరమైన జీవితం గడపడానికా? పరీక్ష. ఎలాంటి అనుమానం లేదు కదా? అలాంటప్పుడు ఇక్కడ ఎదురయ్యే కష్టాలు, ఇక్కడ మనకు కలిగే బాధలు, వాటికి మనం చిన్నబోయి లేక మనస్తాపం చెంది, ఎంతో మనకు మనం కుళ్ళిపోయాము, ఇక ఎందుకురా నా జీవితం అన్నటువంటి భావనలో వెళ్లి, విశ్వాస మార్గం, స్వర్గంలో చేర్పించే సత్కార్యాలు, వాటిని ఎందుకు మరిచిపోతాము మనం?

    మన విశ్వాస మార్గాన్ని వదలకుండా ఇలాంటి కష్టాల్ని, ఇలాంటి బాధల్ని ఎదుర్కొంటే ఇంకా మనకు స్వర్గాలలో స్థానాలు రెట్టింపు అవుతాయి, పెరుగుతూ పోతాయి. ఖురాన్ లో ఒక ఆయత్ ఉంది:

    وَجَعَلْنَا بَعْضَكُمْ لِبَعْضٍ فِتْنَةً
    (వ జ’అల్నా బ’అదకుమ్ లి బ’అదిన్ ఫిత్న)
    పరస్పరం ఒకరినొకరిని అల్లాహ్ మీకు పరీక్షగా చేశాడు.

    మరో ఆయత్ ఉంది:

    وَنَبْلُوكُم بِالشَّرِّ وَالْخَيْرِ فِتْنَةً
    (వ నబ్లూకుమ్ బిష్షర్రి వల్ ఖైరి ఫిత్న)
    ఇహలోకంలో మీకు సుఖము, శాంతి, అన్ని రకాల మంచితనాలు ఇచ్చి పరీక్షిస్తాను, బాధ, కఠోర జీవితం, ఎన్నో రకాల ఆపదల్లో మిమ్మల్ని ఇరికించి కూడా మిమ్మల్ని పరీక్షిస్తాను.

    బిష్షర్రి వల్ ఖైర్. షర్ర్, ఖైర్ ఇక్కడ పదాలు వింటూ ఉంటారు కదా. షర్ర్ అంటే కీడు, చెడు. ఖైర్ అంటే మంచితనం. ఈ రెండు రకాలుగా కూడా మిమ్మల్ని నేను పరీక్షిస్తాను అని అల్లాహ్ త’ఆలా అంటున్నాడు.

    కొందరు కఫీల్ (employer) యొక్క ఇబ్బంది వల్ల గాని, జీతాలు సరిగ్గా దొరకవని వల్ల గాని, లేక జీతాలు బాగానే ఉన్నాయి, కఫీల్ తోని కిరికిరి ఏం లేదు, కానీ తోడుగా పనిచేసే వాళ్ళతోని కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు, ఈర్ష్య, జిగత్సలు, ఇంకా వేరే రకాల ఏవే. సామాన్యంగా మనం ఇక్కడ చూసుకున్న కొన్ని కష్టాల గురించి నేను చెప్తున్నాను. ఇలాంటి కష్టాల్లో కొందరు ఎంతో పెద్ద కష్టంగా భావించి నమాజ్ వదులుతారు. ఇలాంటి కష్టాల్ని దూరం చేసుకోవడానికి సరైన మార్గం ఏంటో తెలుసుకోకుండా ఇంకెంత పాపాల్లో చిక్కుకుంటూ పోతారు.

    సోదరులారా! ఎప్పుడు ఏ కష్టం వచ్చినా గాని, ఆ కష్టం దూరం చేసేవారు ఎవరు? అల్లాహ్. అయితే, కష్టాలు దూరం చేయమని అల్లాహ్ ను మొరపెట్టకుండా, అల్లాహ్ కు ఇష్టమైన కార్యాలు చేయకుండా, ఇంకా పాపాల్లో మనం చిక్కుకుంటూ పోతే కష్టాలు పెరుగుతాయా, తరుగుతాయా? ఆలోచించండి, ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? “ఎందుకయ్యా నమాజ్ కు రావటం లేదయ్యా?” అంటే, “అరే! నాకు ఉన్నటువంటి బాధలు మీకు ఉంటే తెలుస్తది. మీరు ఎప్పుడు నమాజ్, నమాజ్ అనే అంటా ఉంటారు.” నమాజ్ అన్ని రకాల మేళ్లు, అన్ని రకాల మంచితనాలకు మూలం. ఎలాంటి కష్టం, ఎలాంటి బాధ ఉన్నా గాని, అది దూరం కావాలి అంటే అల్లాహ్ ఏమంటున్నాడు?

    وَاسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ
    (వస్త’ఈనూ బిస్సబ్రి వస్సలాహ్)
    సహనం ద్వారా మరియు నమాజ్ ద్వారా సహాయం అర్థించండి.

    ఇంకా మీరు సూరహ్ బఖరాలో చూస్తే, రెండో పారాలో, “ఫద్కురూనీ అద్కుర్కుమ్ వష్కురూలీ వలా తక్ఫురూన్. యా అయ్యుహల్లజీన ఆమనూ…

    اسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ ۚ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ
    (ఇస్త’ఈనూ బిస్సబ్రి వస్సలాహ్, ఇన్నల్లాహ మ’అస్సాబిరీన్)
    ఓ విశ్వాసులారా! మీరు సహాయాన్ని కోరండి, సహనం ద్వారా మరియు నమాజ్ ద్వారా. నిశ్చయంగా అల్లాహ్ సహనం పాటించే వారితో ఉన్నాడు.

    ఆ తర్వాతనే వెంటనే చూడండి. సూరహ్ బఖరా, ఆయత్ నెంబర్ 153. “ఇన్నల్లాహ మ’అస్సాబిరీన్” ఆ తర్వాత, “వలా తఖూలూ లిమయ్ యుఖ్తలు ఫీ సబీలిల్లాహి అమ్వాత్, బల్ అహ్యావున్ వలాకిల్లా తష్’ఉరూన్”. అల్లాహ్ మార్గంలో ఎవరైతే హత్య చేయబడతారో వారి గురించి చెప్పబడింది, సామాన్య మృతి చెందిన వారి లాగా మీరు భావించకండి. ఆ తర్వాత అల్లాహ్ అంటున్నాడు, ఆయత్ నెంబర్ 155లో:

    وَلَنَبْلُوَنَّكُم بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ
    (వ లనబ్లువన్నకుమ్ బిషైఇమ్ మినల్ ఖౌఫి వల్ జూఇ’)
    మేము తప్పకుండా మిమ్మల్ని పరీక్షిస్తాము కొంత భయంతో మరియు ఆకలి ద్వారా.

    وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَالثَّمَرَاتِ
    (వ నఖ్సిమ్ మినల్ అమ్వాలి వల్ అన్ఫుసి వస్సమరాత్)
    మీ ధనాల్లో, మీ ప్రాణాల్లో, మీ ఉత్పత్తుల్లో కొరత చేసి, తక్కువ చేసి

    మీరు ఎంత మీ ధనం పెరగాలి అని, మీ వ్యాపారం ఎంత డెవలప్ కావాలని మీరు ఆలోచిస్తారో అది అంత పెరగకుండా దాన్ని తరిగించి, మీ సంతానంలో గాని, మీ బంధువుల్లో గాని ఎవరికైనా చావు వచ్చి, వస్సమరాత్, ఇంకా మీ వ్యవసాయ పరంగా ఏదైనా ఫలాలు, ఫ్రూట్స్ అలాంటివి ఉంటే వాటిలో మీకు ఏదైనా నష్టం చేగూర్చి మిమ్మల్ని పరీక్షిస్తాము.

    وَبَشِّرِ الصَّابِرِينَ
    (వ బష్షిరిస్సాబిరీన్)
    సబర్ విషయం గడిచింది కదా. సబర్ చేస్తే వాళ్లతోనే అల్లాహ్ ఉన్నాడు అని అన్నాడు కదా ఇంతకుముందే. ఇక్కడ ఏమన్నాడు? అలాంటి సబర్ చేసే వారి గురించి, ఇలాంటి కష్టాలు ఎవరిపై వస్తాయో, ఆ కష్టాల్లో ఎవరైతే సబర్ చేస్తారో, సహనం పాటిస్తారో, వారికి శుభవార్త ఇవ్వండి అని అల్లాహ్ అంటున్నాడు.

    అయితే, చిన్నపాటి కష్టాలు వచ్చినందుకు మనం అల్లాహ్ కు ఇంకా దగ్గరగా కాకుండా, దూరమవుతూ ఉంటే, ఇది ఎలాంటి ఉదాహరణ? ఒక వ్యక్తికి కడుపు నొప్పి వేసింది, లేక బాగా తల తిరుగుతుంది, తల నొప్పి ఉంది, ఎలాంటి పరిస్థితిలోనైనా ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాలి. చూసే వారందరూ అంటున్నారు, “తొందరగా ఇప్పుడే ఆంబులెన్స్ ని పిలవండి.” అతను ఏమంటున్నాడు, “వద్దు, వద్దు. అటు వెళ్తే నాకు ఇంకా రోగం పెరుగుద్ది.” అలాంటి వారిని ఏమంటారు? ఎవరికైనా అపెండిక్స్ అయింది అనుకోండి, ఒక వైపున చాలా నొప్పులు వేస్తుంది కదా, విపరీతమైన నొప్పి. నిలబడలేడు, పడుకోలేడు, కూర్చోలేడు, ఎలాంటి స్థితిలో కూడా అతనికి విశ్రాంతి అనేది దొరకదు. అలాంటి వ్యక్తికి హాస్పిటల్ తీసుకెళ్లకుండా, డాక్టర్ ను కల్పించకుండా అలాగే వదిలేస్తారా?

    సోదరులారా! అలాగే కష్టాలు ఎన్ని మనకు వచ్చినా గాని, ఎటు వైపునకు మనం మరలాలి? అల్లాహ్ వైపునకు మరలాలి. అందుగురించి అల్లాహ్ త’ఆలా ఏమంటున్నాడు?

    وَأَخَذْنَاهُم بِالْبَأْسَاءِ وَالضَّرَّاءِ لَعَلَّهُمْ يَتَضَرَّعُونَ
    (వ అఖద్నాహుమ్ బిల్ బ’సాఇ వద్దర్రాఇ ల’అల్లహుమ్ యతదర్ర’ఊన్)
    వారిని మేము కష్టాల్లో, ఆపదల్లో పట్టుకున్నాము, పరీక్షలకు గురిచేశాము. వారు అల్లాహ్ వైపునకు మరలి ఇంకా ఎక్కువగా మొరపెట్టుకోవాలని.

    కానీ ఈ రోజుల్లో ఆ పని చేస్తున్నామా మనం? సోదరులారా! అందుగురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీసును ఎల్లవేళల్లో మనం మన దృష్టిలో ఉంచుకోవాలి. మహనీయ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

    اغتنم خمسا قبل خمس
    (ఇగ్‌తనిమ్ ఖమ్సన్ ఖబ్ల ఖమ్సిన్)
    ఈ ఐదు స్థితులు రాకముందు ఈ ఐదు స్థితులను మీరు అదృష్టంగా భావించి దాన్ని మీరు వినియోగించుకోండి.

    حَيَاتَكَ قَبْلَ مَوْتِكَ
    (హయాతక ఖబ్ల మౌతిక)
    మీ జీవితాన్ని చావు రాకముందు. చావు వచ్చిన తర్వాత ఏమైనా సత్కార్యాలు చేయగలుగుతామా? చేయలేము.

    وَشَبَابَكَ قَبْلَ هَرَمِكَ
    (వ షబాబక ఖబ్ల హరమిక)
    రెండవది, మీ యవ్వనాన్ని వృద్ధాప్యం రాకముందు. “జవానీ మే క్యా జీ, తౌబా కర్తే సో బుడ్డే హోనే కే బాద్ కర్నా.” ఇది ఒక సామెతగా అయిపోయింది చాలా మంది ప్రజల్లో ఇది. హజ్ ఎప్పుడు చేయాలి అంటే మన సామాన్యంగా ఇండియా, పాకిస్తాన్ నుండి హజ్ గురించి వచ్చే వచ్చేవాళ్లు ఎక్కువ శాతం ఎవరు ఉంటారు? ముసలివాళ్లు. ఇక్కడ కూడా కొందరు ఉన్నారు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు గడిచాయి, ఒక ఉమ్రా కూడా నసీబ్ లేదు. “ఉమ్రా చేయండి, హజ్ చేయండి” అంటే, “అరే! ఇంత తొందరగా ఎందుకు? మళ్ళీ ఏమైనా పాపాలు జరుగుతాయి కదా.” అస్తగ్‌ఫిరుల్లాహ్. అయితే ఇంకా జీవితం ముందుకు దొరుకుతుంది, ఆ తర్వాత హజ్ చేసిన తర్వాత ఇక మనం పుణ్యాల్లోనే జీవితం గడిపే అంతటి అవకాశం ఉంటుంది అన్నటువంటి నమ్మకం ఉందా మనకు? మరి అలాంటప్పుడు ఆలస్యం దేని గురించి? తౌబా ప్రతి ఒక్కరు చేస్తూ ఉండాలి. షబాబక్, యవ్వనం, ఇగ్‌తనిమ్, దీన్ని అదృష్టంగా భావించు, ఖబ్ల హరమిక్, వృద్ధాప్యానికి చేరుకునే ముందు.

    సోదరులారా! ఇంతకుముందు 55, 60, 60 దాటిన తర్వాత వాళ్లను ముసలివాళ్లు అని అనేవారు, వృద్ధులు అనేవారు. కానీ ఈ రోజుల్లో 40 వరకే డల్ అయిపోతున్నారు అందరూ. అవునా లేదా? అందుగురించి, యవ్వనంలో చేసే అటువంటి ఆరాధన, దాని పుణ్యం వృద్ధాప్యంలో చేసే ఆరాధన కంటే ఎక్కువ గొప్పగా ఉంటుంది. అందుగురించి ప్రవక్త ఏం చెప్పారు? నీ యవ్వనాన్ని నీవు అదృష్టంగా భావించు వృద్ధాప్యం రాకముందు.

    وَصِحَّتَكَ قَبْلَ سَقَمِكَ
    (వ సిహ్హతక ఖబ్ల సఖమిక)
    ఆరోగ్యాన్ని అనారోగ్యానికి గురి కాకముందే నీవు అదృష్టంగా భావించు.

    وَغِنَاكَ قَبْلَ فَقْرِكَ
    (వ గినాక ఖబ్ల ఫఖ్‌రిక)
    అల్లాహ్ ఏదైనా ధనం ఇచ్చి ఉన్నాడు, దాన్ని బీదరికానికి గురి కాకముందే అదృష్టంగా భావించు.

    وَفَرَاغَكَ قَبْلَ شُغْلِكَ
    (వ ఫరాగక ఖబ్ల షుగులిక)
    ఏదైనా సమయం దొరికింది, దాన్ని అదృష్టంగా భావించి సత్కార్యాలలో గడుపు, నీవు ఏదైనా పనిలో బిజీ కాకముందు.

    ఇప్పుడు మనలో ఎంతో మంది యువకులు తమ యవ్వనాన్ని, తమ ఆరోగ్యాన్ని, తమ యొక్క ఫ్రీ టైమ్ ఏం చేస్తున్నారు అంటే, టైం పాస్ చేస్తున్నాను. ఏం చేస్తున్నారు? టైం పాస్ చేస్తున్నారు. పాస్ అన్నదానికి ఒక అర్థం, గడుపుతున్నాము అని కూడా వస్తుంది, కొడుకు ఎగ్జామ్ లో పాస్ అయిండా ఫెయిల్ అయిండా? ఆ భావం కూడా వస్తుంది. కానీ ఒకసారి ఆలోచించాలి. సామాన్యంగా అనుకునేవారు, టైం గడుపుతున్నాము అనే భావం తీసుకుంటున్నారు. కానీ ఎందులో? ఫిలింలు చూస్తూ, పాటలు వింటూ, లేదా క్యారమ్ బోర్డులు ఆడుకుంటూ, దాన్ని ఏమంటారు ఏదో, రాజా, రాణి, చోర్, ఏదో కాగితాలు ఉంటాయి కదా, పేకాట? పేకాట అంటారా? ఇట్లాంటి ఆటల్లో గడుపుతూ ఉంటారు. ఏం చేస్తున్నారు అంటే, అతను టైం పాస్ చేస్తున్నాము. కానీ వాస్తవానికి, ఇక్కడ టైం పాస్ అయితలేదు, ఇందులో నీవు గడిపే టైం అంతా ఫెయిల్ అవుతుంది. రేపటి రోజు అల్లాహ్ ముందు చేరుతావు, ఈ సమయం ఏదైతే నీవు వృధాగా గడిపావో, అల్లాహ్ యొక్క స్వయంగా నీకు విద్యాపరంగా, నీ మేధాపరంగా, నీ ఇహలోక పరంగా, నీ పరలోక పరంగా లాభం చేగూర్చలేని దానిలో నువ్వు ఏదైతే గడిపావో, దాని గురించి నీవు సమాధానం చెప్పవలసి ఉంది. అందుగురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఏం చెప్తారు?

    మనిషి ఏ సమయాన్నైతే పడుకొని ఉండి గాని, కూర్చొని ఉండి గాని, నడుస్తూ ఉండి గాని అల్లాహ్ యొక్క ధ్యానంలో గడపకుంటే, అతని ఆ నడక, అతని ఆ కూర్చోవడం, అతని ఆ పడుకోవడం అదంతా పాపభరితంగా మరియు ఎంతో బాధకరమైన సమయంగా గడుస్తుంది. ప్రళయ దినాన దాని గురించి విచారణ, లెక్క అనేది జరుగుతుంది.

    అందుగురించి సోదరులారా! ప్లీజ్, ఇక టైమ్ ను వృధా చేసుకోకండి. అల్లాహ్ త’ఆలా ఖురాన్ లోని ఒక్కో అక్షరానికి పది పది పుణ్యాలు ఇస్తానని వాగ్దానం చేస్తున్నప్పుడు, రోజు మనం ఖురాన్ చదవడంలో ఎంత సమయం గడుపుతున్నాము? ఇవన్నీ పరలోకంలో పనికి వచ్చే వస్తువులా కాదా? లేక పేకాటలా, ఫిలింలు చూడడమా, పాటలు వినడమా? అవి పనికి వస్తాయా? అందుగురించి సోదరులారా! మనం సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాము. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ధర్మపరంగా మన విద్య పెరగకుంటే, మనం చేస్తున్న ఆచరణలో, సత్కార్యాల్లో ఇంకా కొన్ని సత్కార్యాలు పెరగకుంటే, చెప్పండి మన జీవితం వృధా కాకుంటే ఇంకేమవుతుంది?

    సౌదీలో పది సంవత్సరాలు ఉండి వచ్చిన తర్వాత, మీరు స్వదేశానికి తర్వాత మీ ఫ్రెండ్ గాని, లేక మీ బంధువులో ఎవరైనా గాని, “ఏం చేసినావురా పది సంవత్సరాలు ఉండి?” అంటే, “పని చేశాను.” “అవునురా పని చేశావు, ఇక్కడ కూడా ఎడ్లు, ఆవులు, గాడిదలు అన్నీ కూడా అవి కూడా పనిచేస్తున్నాయి. నువ్వు అక్కడికి పోయి పరదేశానికి పోయి ఏం సంపాదించావు అక్కడ, ఏం చేశావు? చెల్లె పెళ్లి చేశావా? బిడ్డ పెళ్లి చేశావా? ఇల్లు కట్టావా?” అడుగుతారా లేదా? అప్పుడు నువ్వు ఏమీ చేయలేదు అనుకో. ఇల్లు కట్టలేకపోయావు, చెల్లె పెళ్లి చేయలేకపోయావు, ఒక్క డబ్బు ఇక్కడ కూడబెట్టి ఒక పైసా అక్కడ నువ్వు ఏమీ చిన్న లాభం చేయలేకపోయావు. శబాష్ అని అంటారా లేకుంటే నాలుగు తిడతారా? కువైట్ పోయి వచ్చినా గాని, సౌదీయా పోయి వచ్చినా గాని, మలేషియా పోయి వచ్చినా గాని, అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా ఏమీ చేయకుంటే, కనీసం నీ తల్లిదండ్రులకు ఉండడానికి ఒక చిన్న గూడైనా, చిన్నవాడి ఇల్లన్నా మంచిగా తయారు చేస్తే బాగుండకపోవునారా? అని నాలుగు తిడతారా లేదా?

    ఎగ్జాక్ట్లీ ఇదే ఉదాహరణ మనది. ఇహలోక జీవితం మనకు టెంపరరీగా ఇచ్చాడు దేవుడు, పరీక్ష సమయంగా ఇచ్చాడు దేవుడు, అల్లాహ్ త’ఆలా. ఇక్కడ మనం సత్కార్యాలు సమకూర్చుకోవాలి ఎక్కడి గురించి? పరలోకం గురించి. ఇప్పుడు మనం ఆలోచించండి, ఇక్కడికి వచ్చి జాలియాత్ క్లాసులలో పాల్గొని సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు గడిచాయి, సూరహ్ ఫాతిహా కరెక్ట్ కాలేదు, రుకూలో సుబ్హాన రబ్బియల్ అజీమ్ తప్ప ఇంకా వేరే కొత్త ఒక దుఆ నేర్చుకోలేదు, అత్తహియాత్ సరిగా రాదు, దాని తర్వాత దరూద్-ఎ-ఇబ్రాహీం గురించి ఇప్పుడు ఆలోచించలేదు. ఆలోచించండి, లాభంలో మన జీవితం గడుస్తున్నట్లా లేకుంటే నష్టంలో గడుస్తున్నట్లా? సంవత్సరాల తరబడి మనం క్లాసులలో వస్తాము లేక సంవత్సరాల తరబడి మనం జుమా ఖుత్బాలు వింటాము, కానీ పాటలు వినడం మానుకుంటలేము, ఫిలింలు చూడడం మానుకుంటలేము, గడ్డాలు వదలడం మనం మొదలుపెట్టలేము, ఇంకా అల్లాహ్ యొక్క మార్గంలో మనం మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి, మలుచుకోవాలి అన్నటువంటి భావన మనకు కలుగుతలేదు అంటే, ఇహలోక ప్రేమ మనలో ఎక్కువ ఉన్నట్లా, పరలోక ప్రేమ ఎక్కువ ఉన్నట్లా? చెప్పండి. ఇయ్యాల ఏదో తిన్నచ్చాడు, తాగచ్చాడు, బాగానే వర్షానికి ముందు ఉరుములు ఉరిమినట్టుగా జరుగుతుంది అనుకోకండి. ఇది మన వాస్తవ జీవితం. చెప్పే విషయాలు మీ అందరికంటే ముందు స్వయంగా నా ఆత్మకు, నా ఇస్లాహ్, నాకు నేను సరిదిద్దుకోవడానికి చెప్తున్నాను. ఆ తర్వాత మీ గురించి చెప్తున్నాను. ఆలోచించాలి. ఈ విషయాల్ని మనం పరస్పరం ఆలోచించుకోకుంటే, పరస్పరం మనలో మనం చర్చించుకుంటూ మనకు మనం బాగు చేసుకునే ప్రయత్నం చేయకుంటే, మరి ఎప్పుడు మన యొక్క క్లారిఫికేషన్, మన ఇస్లాహ్, మనకు సంబంధించిన అన్ని రకాల చెడు నుండి దూరం అవ్వడం ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? చనిపోయిన తర్వాతనా? అయ్యో, పాపం, ఇన్ని రోజులు వచ్చి వచ్చి ఇదే పాప స్థితిలో చనిపోయాడు అని నలుగురు ఎన్ని దుఆలు ఇచ్చినా గాని, దుఆకు ముందు అర్హుడు కాకుంటే మనిషి, వంద మంది కాదు, వెయ్యి మంది దుఆ చేసినా గాని లాభం ఉండదు.

    అబ్దుల్లా బిన్ ఉబై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఉన్నటువంటి మునాఫిక్, వంచకుడు, ప్రవక్త వెనక నమాజ్ చేసేవాడు, ప్రవక్తతోని జిహాద్ లో కూడా పాల్గొనేవాడు. కానీ అతనికి యొక్క మగ్ఫిరత్, అతనికి క్షమాపణ అయితే లభించిందా? లేదు. అల్లాహ్ త’ఆలా చెప్పాడు:

    إِنَّ الْمُنَافِقِينَ فِي الدَّرْكِ الْأَسْفَلِ مِنَ النَّارِ
    (ఇన్నల్ మునాఫిఖీన ఫిద్దర్కిల్ అస్ఫలి మినన్నార్)
    మునాఫిక్ లు నరకంలోని అతి అధమ స్థానంలో ఉంటారు.

    చివరికి అతని కొడుకు కోరాడు, ప్రవక్తా, మీరు వచ్చి మా నాన్నగారి యొక్క జనాజా చేయించండి అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని జనాజా నమాజ్ చేయించడానికి కూడా వెళ్లారు. అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో ఆయత్ అవతరింపజేశాడు,

    وَلَا تُصَلِّ عَلَىٰ أَحَدٍ مِّنْهُم مَّاتَ أَبَدًا
    (వలా తుసల్లి అలా అహదిమ్ మిన్హుమ్ మాత అబదా)
    అలాంటి వంచకులకు నమాజ్-ఎ-జనాజా కూడా మీరు చేయించకండి అని.

    ప్రవక్త నమాజ్ చేయించారు కూడా, ప్రవక్త దుఆ అతని గురించి కబూల్ అయిందా? లేదు, కాలేదు. అందుగురించి మనలో కొందరు ఏమనుకుంటారు, ఏదో చిన్నపాటి పాపాలు జరుగుతూ ఉండి, తప్పులు జరుగుతూ ఉండి, ఆ, ఏదో ఇట్లా జీవితం గడుపితే ఏమైతంది, రేపటి రోజు కొద్ది రోజుల తర్వాతనైనా స్వర్గం పోతాం కదా, అయ్యో మా ఊర్లో ఇంత మంది మౌలీ సాబులు ఉన్నారు కదా, సౌదీలో ఒకవేళ చనిపోతే ఇంకా బాగుంటుంది, ఇక్కడ ఎక్కువ మంది జనాజా నమాజ్ చదువుతారు కదా. ఇట్లాంటి ఆలోచనల్లో కూడా ఉంటారు. అయితే దాని గురించి నేను చెప్తున్నాను. స్వయంగా మనం అల్లాహ్ క్షమాపణకు అర్హులు కాకుంటే, వంద మంది కాదు, వెయ్యి మంది కాదు, లక్షల మంది నమాజ్ చేసినా గాని, మన ఊర్లే కాదు, ఇక్కడ సౌదీలో కాదు, హరమ్ షరీఫ్ లో జనాజా జరిగినా గాని, మదీనాలో జరిగినా గాని, అతని యొక్క క్షమాపణ అనేది అర్హత లేకుంటే ఎంత మంది దుఆలు కూడా పనికి రావు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆ కూడా అబ్దుల్లా బిన్ ఉబై గురించి పనికి వచ్చిందా? రాలేదు.

    అందుగురించి సోదరులారా, చెప్పే విషయం ఏంటంటే ఇహలోక జీవితం చాలా చిన్నగా ఉంది. నాలుగు రోజుల ఈ జీవితాన్ని మనం కేవలం తిండి, ఇంకా మన కోరికలు గడుపుకోవడంలోనే గడుపితే, పరలోకంలో చాలా నష్టం చూసుకోవాల్సి ఉంటుంది. అల్లాహ్ త’ఆలా అలాంటి నష్టాల నుండి మనందరినీ కాపాడుగాక. అందుగురించి ఖురాన్ యొక్క ఈ ఆయత్ ద్వారా నేను ఈనాటి ఈ ప్రసంగాన్ని సమాప్తం చేస్తాను. అల్లాహ్ త’ఆలా ఎవరైతే పరలోకానికి ప్రాధాన్యత ఇస్తారో, అల్లాహ్ వారి గురించి ఏం చెప్పారు?

    إِنَّ هَٰؤُلَاءِ يُحِبُّونَ الْعَاجِلَةَ وَيَذَرُونَ وَرَاءَهُمْ يَوْمًا ثَقِيلًا
    (ఇన్న హా ఉలాఇ యుహిబ్బూనల్ ఆజిలత వ యదరూన వరాఅహుమ్ యౌమన్ సఖీలా)
    వీరు ఇహలోకానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు, ఇహలోకాన్ని ప్రేమిస్తున్నారు, మరియు ఆ భారీ, బరువైన ఆ రోజు ఏదైతే ఉందో దాన్ని వదిలేస్తున్నారు. (సూరహ్ ఇన్సాన్, ఆయత్ నెంబర్ 27)

    ఆ రోజు చాలా శిక్ష కఠిన, ఎంతో భయంకరమైన ఆ రోజు. అది మన గురించి సులభతరంగా కావాలంటే, ఎంతో హాయిగా, మంచితనంగా గడవాలంటే, ఇహలోకంలో సత్కార్యాలు చేసుకోవాలి, సత్కార్యాల్లో జీవితం గడపాలి. అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్.

    ఈ పోస్ట్ లింక్ :
    https://teluguislam.net/?p=5502

    అంతిమ దినం (తీర్పు దినం)