విధివ్రాత పై సహనం వహించుట కూడా అల్లాహ్ పై విశ్వాసంలో ఒక భాగం – ఇమామ్ అస్-సాదీ

బిస్మిల్లాహ్

35 వ అధ్యాయం
విధివ్రాత పై సహనం వహించుట కూడా అల్లాహ్ పై విశ్వాసంలో ఒక భాగం
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


అల్లాహ్ ఆదేశం: “ఎవడు అల్లాహ్ ను విశ్వసిస్తాడో, అల్లాహ్ అతని హృదయానికి మార్గదర్శకత్వం ప్రసాదిస్తాడు” (తగాబున్‌ 64:11).

పై ఆయతులో ప్రస్తావించబడిన వ్యక్తి ఎవరు అనేది “అల్‌ ఖమ” ఇలా ప్రస్తావించారు: “అతనిపై ఏదైనా ఆపద వస్తే, అది అల్లాహ్ తరఫు నుండి అని  అతను తెలుసుకొని, సంతోషిస్తాడు, మనఃపూర్వకంగా ఒప్పుకుంటాడు”.

అబు హురైరా (రది అల్లాహు అన్హు) కథనం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు: “కుఫ్ర్ కు (సత్యతిరస్కారానికి) సంబంధించిన రెండు గుణాలు ప్రజల్లో ఉన్నాయి. ఒకటి: ఒకరి వంశపరంపరను నిందించుట. రెండవది: చనిపోయినవారిపై శోకము చేయుట”.

అబ్దుల్లా బిన్‌ మస్ ఊద్‌ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు: “చెంపలను బాదుకుంటూ, దుస్తులు చించుకుంటూ అజ్ఞాన కాలపు అరుపులు పలుకులు పలికేవాడు మన (సంప్రదాయము అనుసరించే) వాడుకాడు”. (బుఖారి,ముస్లిం).

అనసు (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు: “అల్లాహ్ ఏ మానవునికి మేలు చేయగోరుతాడో, అతని పాపాలకు బదులు శిక్ష ఇహలోకంలోనే తొందరగా ఇచ్చేస్తాడు. ఏ మానవునికి మేలు చేయగోరడో, అతని పాపాలకు బదులు శిక్షను ప్రళయం వరకు వేచి ఉంచి అక్కడ ఇస్తాడు”. (తిర్మిజి).

మరో సారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో ప్రతిఫలం కూడా అంతే గొప్పగా ఉంటుంది. అల్లాహ్ ఏ సమాజం, సంఘాన్ని ప్రేమస్తాడో, దానిని పరీక్షకు గురి చేస్తాడు. ఎవరు దానిని సహనంతో (సహిస్తారో), వారిని అల్లాహ్ ఇష్టపడుతాడు.ఎవరు అసహనము చూపుతారో, అల్లాహ్ వారిపై ఆగ్రహస్తాడు”. (తిర్మిజి).

ముఖ్యాంశాలు:

1. తగాబున్‌ ఆయతు యొక్క భావం.

2. సహనం అల్లాహ్ పై విశ్వాసంలో ఒక భాగం.

3. వంశపరంపర లోని లోపాలను ఎంచుట మంచిది కాదు.

4.చెంపలు బాదుకుంటూ, దుస్తులు చించుకుంటూ, అజ్ఞానకాలపు పలుకులు పలికేవాని గురించి కఠినంగా హెచ్చరించబడింది.

5. అల్లాహ్ మేలు కోరిన వ్యక్తి లక్షణం తెలిసింది.

6. అల్లాహ్ మేలు కోరని వ్యక్తి లక్షణం తెలిసింది.

7. అల్లాహ్  ప్రేమించిన వ్యక్తి చిహ్నం.

8. పరీక్ష ఆపదపై అసంతృప్తి వ్యక్తం చేయుట నిషిద్ధం.

9. వాటిపై సహనం వహించుట వలన పుణ్యం లభిస్తుంది.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

ఓపికతో అల్లాహ్ కు విధేయులగుట, పాపం నుండి దూరంగా ఉండి సహనం వహించుట – ఇవి రెండూ విశ్వాసంలో లెక్కించబడుతాయి. అంతే కాదు అవి దాని పునాది. దాని భాగాలే. అల్లాహ్ ప్రేమించేవాటిని, ఆయనకు ఇష్టమున్న, ఆయన సన్నిధిలో చేర్పించేవాటిని ఓపికతో (ఆచరించుట), ఆయన నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండి సహనం వహించుటయే విశ్వాసం.

ఇస్లాం పునాది మూడు సూత్రాల పై ఉంది.

  1. అల్లాహ్ , ఆయన ప్రవక్త తెలిపిన వాటిని సత్యం అని నమ్ముట.
  2. అల్లాహ్ , ఆయన ప్రవక్త ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించుట.
  3. అల్లాహ్ , ఆయన ప్రవక్త నిషేధించినవాటి నుండి దూరంగా ఉండుట.

అల్లాహ్ వ్రాసిన విధివ్రాత బాధాకరమైనప్పటికి దానిపై ఓపిక వహించుట ఇందులోనే వస్తుంది. కాని దాన్ని తెలుసుకొనుట, ఆచరించుట చాలా అవసరం కాబట్టి దానిని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది.

ఆపద, కష్టం అల్లాహ్ తరఫు నుండియే వస్తుంది అని, అల్లాహ్ దాన్ని నిర్ణయించడంలో సంపూర్ణ వివేచణాపరుడని, దానిని మానవునిపై నిర్ణయించడం కూడా ఆయన సంపూర్ణ వరమేనని తెలుసుకున్న వ్యక్తి అల్లాహ్ వ్రాసిన విధివ్రాతతో సంతోషించి, దాన్ని మనఃపూర్వకంగా ఒప్పుకొని, అసంతృప్తికరమైన వాటిపై అల్లాహ్ సన్నిధానం కోరుతూ, పుణ్యాన్ని ఆశిస్తూ, ఆయన శిక్షతో భయపడుతూ మరియు సత్ప్రవర్తన అవలంబించే సమయం వచ్చిందని భావిస్తూ సహనం వహించాలి. అప్పుడు అతని హృదయానికి తృప్తి  శాంతి కలుగుతుంది. అతని విశ్వాసం, ఏకత్వంలో బలం వస్తుంది.


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]  

హస్తాన్ని పరిశీలించి లేదా తారాబలాన్ని చూసి అగోచర  జ్ఞానం ఉందని చెప్పటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

అగోచరం అంటే .. :

భూత భవిష్యత్ కాలాలకు చెందిన ఏ విషయాలైతే  జనుల దృష్టికి రావో – కంటికి కానరావో – వాటిని అగోచరాలని అంటారు.

అగోచర జ్ఞానాన్ని అల్లాహ్‌ తన కొరకు ప్రత్యేకించుకున్నాడు. ఆయన ఇలా సెలవిచ్చాడు :

قُل لَّا يَعْلَمُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ الْغَيْبَ إِلَّا اللَّهُ

“అల్లాహ్  తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర జ్ఞానం లేదు.” (అన్‌ నమ్ల్‌ 27: 65)

అల్లాహ్ కొన్ని సందర్భాలలో దైవప్రవక్తలలో కొందరికి, కొన్ని పరమార్థాల దృష్ట్యా తన అగోచర జ్ఞానంలోని కొన్ని విషయాలను తెలియజేస్తాడు. ఆ విషయాన్నే ఇక్కడ ప్రస్తావించటం జరిగింది.

عَالِمُ الْغَيْبِ فَلَا يُظْهِرُ عَلَىٰ غَيْبِهِ أَحَدًا إِلَّا مَنِ ارْتَضَىٰ مِن رَّسُولٍ

“ఆయన అగోచర జ్ఞానం కలవాడు. తన అగోచర విషయాలను ఆయన ఎవరికీ తెలుపడు – తాను ఇష్టపడిన ప్రవక్తకు తప్ప!” (అల్‌ జిన్న్‌ : 26, 27)

అంటే, అల్లాహ్ తనకు స్వంతమైన అగోచర జ్ఞానంలోని కొంత భాగాన్ని తన ప్రవక్తలలో తాను కోరిన వారికి, కొన్ని పరమార్థాల దృష్ట్వా తెలియపరచటం సంభవమే. ఎందుకంటే అతను (ఆ ప్రవక్త) ఆ అద్భుతాలను తన దైవదౌత్యానికి నిదర్శనంగా చూపుతాడు. ఇలాంటి అద్భుతాలలో, అగోచర విషయాలను (భవిష్యవాణి) తెలుపటం కూడా ఒకటి. ఈ అగోచర జ్ఞానంలో మానవ సందేశహరునికి, దైవదూతల సందేశవాహకునికి మాత్రమే ప్రమేయం ఉంటుంది. మూడో వ్యక్తికి ఇందులో ఎలాంటి దఖలు ఉండదు. ఎందుకంటే అల్లాహ్ అగోచర జ్ఞానాన్ని వారిరువురికే పరిమితం చేశాడు. కాబట్టి అల్లాహ్‌ దృష్టిలో మినహాయింపుకు నోచుకున్న ఆ సందేశహరులు తప్ప వేరెవరయినా తనకు అగోచర జ్ఞానం ఉందని అంటే అతను అసత్యవాది, అవిశ్వాసానికి ఒడిగట్టిన వాడవుతాడు. అతను హస్త సాముద్రికం ఆధారంగా చెప్పినా, తారాబలం చూసి చెప్పినా, క్షుద్రవిద్యలను ఆశ్రయించినా, జ్యోతిష్కం ద్వారా చెప్పినా, మరే వనరుల ఆధారంగా చెప్పినా అతను అబద్ధీకుడే. ఈ యుగంలో కూడా ఇలాంటి నయవంచకులు, మోసగాళ్లకు కొదువలేదు. వారు తమ వాక్చాతుర్యంతో, మాయమాటలతో అమాయక జనులను బుట్టలో వేసుకుని పోగొట్టుకున్న వస్తువుల ఆచూకీ తెలుపుతామని, రోగ కారణాలను తెలుపుతామని అంటుంటారు. ఫలానా వ్యక్తి నీకేదో చేసేశాడని, అందుకే నీవు ఈ విధంగా మంచాన పడ్డావని చెబుతుంటారు. ఈ విషయాలను వారు జిన్నాతుల నుండి, షైతానుల నుండి సేకరిస్తారు. అందుకోసం వారు ఆ పైశాచిక శక్తులను ప్రసన్నుల్ని చేస్తుంటారు. ఎవరయినా మీ వద్దకు క్షుద్రవిద్యను పొందిన మాటలంటే ఖచ్చితంగా వారు మాయలమారులని, మోసగాళ్లని గ్రహించాలి.

షేఖుల్‌ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు : “భవిష్యవాణి (సోదె) చెప్పేవారి పరిస్థితి ఎటువంటిదంటే, వారి వద్ద షైతాన్‌ సహచరుడు ఉంటాడు. ఆకాశాలలో దొంగచాటుగా. విన్న విషయాలను వాడు వారికి తెలియజేస్తుంటాడు. వాటిలో వారు మరికొన్ని అబద్ధాలను (మిర్చిమసాలాను) జోడించి వివరిస్తారు.”

ఆయన ఇంకా ఇలా అంటున్నారు : “ఈ సోదె చెప్పటంలో కొందరు ఆరితేరిన వారుండేవారు. వారి దగ్గరకు షైతానులు తినే త్రాగే పదార్థాలను కూడా తెచ్చేవారు. ఆ ప్రదేశాలలో లభ్యంకాని పండ్లను, మిఠాయిలను కూడా తెచ్చేవారు. వాటిలో కొన్నింటిని జిన్ను మక్కా లేదా బైతుల్‌ మఖ్దిస్ లేదా వేరే ఇతర స్థలాలకు తరలించేవాడు.” (మజ్మూ అత్ తౌహీద్ – పేజీ : 797, 801)

అగోచరాలకు సంబంధించి వారు జ్యోతిష్యశాస్త్రం ద్వారా కొన్ని విషయాలు అందజేస్తుంటారు. నక్షత్రాలను, రాసులను చూసి వారు భూమండలంపై సంభవించబోయే దానిని సూచిస్తుంటారు. గాలులు ఎంతవేగంగా వీస్తాయి, వర్షం ఎప్పుడు ఎక్కడ కురుస్తుంది తదితర విషయాలను అంచనా వేస్తారు. నక్షత్రాలు తమ తమ కక్ష్యల్లో చేసే పరిభ్రమణం, వాటి కలయిక, విడిపోవటాలను బట్టి జరిగే సంఘటనలను నిర్ధారిస్తారు. వారిలా అంటారు: ఇతను గనక ఫలానా నక్షత్రం సంచరించే సమయంలో వివాహమాడితే అతనికి ఈ ఈ సమస్యలు ఎదురవుతాయి. అతను గనక ఫలానా నక్షత్రం పొడసూపినపుడు ప్రయాణం చేస్తే ఫలానా ఫలానా గండాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అతను ఫలానా నక్షత్రం సమయంలో పుట్టాడు కనుక ఫలానా భాగ్యం వరిస్తుంది లేదా ఫలానా దరిద్రం చుట్టుకుంటుంది. ప్రస్తుతం కొన్ని చవుకబారు పత్రికలు సయితం ఇలాంటి రాశి ఫలాలను ముద్రించి మనుషుల జీవితాలలో సంభవించబోయే వాటిని గురించి విచ్చలవిడి రాతలు రాస్తున్నాయి.

కొంతమంది అజ్ఞానులు, బలహీన విశ్వాసులు జ్యోతిష్కుల వద్దకు వెళుతుంటారు. వారు తమ జీవితాలలో యెదురు కానున్న సంఘటనలను గురించి, ముఖ్యంగా వివాహాది శుభకార్యాల గురించి దర్యాప్తు చేస్తుంటారు.

ఎవడయితే తనకు అగోచర జ్ఞానముందని అంటాడో, మరెవరయితే అలాంటి వారిని సత్యవంతులని ధృవీకరిస్తాడో అతను ముష్రిక్కు, కాఫిర్‌ అవుతాడు. ఎందుకంటే వాడు అల్లాహ్  యొక్క ప్రత్యేక గుణాలలో తనకు భాగస్వామ్యం ఉందని దావా చేస్తున్నాడు. నిజానికి నక్షత్రాలు అల్లాహ్ కు సంపూర్ణ విధేయతను ప్రకటించే సృష్టితాలు. వాటి అధీనంలో ఏ శక్తీ లేదు. ఒకరి భాగ్యాన్నిగానీ, దరిద్రాన్ని గానీ శాసించే అధికారం వాటికి లేదు. జీవన్మరణాలతో కూడా వాటికి ఎలాంటి సంబంధం లేదు. ఇవన్నీ పైశాచిక చేష్టలు. ఆకాశాలలో దొంగచాటుగా విన్న విషయాలను అవి చేరవేస్తుంటాయి.


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (పేజీలు 120 – 121)

సోదరులారా! ఇలాంటి స్థలం (సమాధి) కోసం సన్నాహాలు చేసుకోండి!

బిస్మిల్లాహ్

grave

పచ్చని ప్రపంచంలో భోగభాగ్యాలతో కూడిన జీవితం గడుపుతున్నవారలారా! తియ్యటి, మధురమైన ప్రపంచపు సుఖాలు అనుభవిస్తున్న వారలారా! రంగు రంగుల మనోహర ప్రపంచపు ఎండమావుల్లో తచ్చాడుతున్నవారలారా! అందమైన ప్రపంచ అందచందాల ఆహూతుల్లారా! శాశ్వతలోకాన్ని విడిచిపెట్టి క్షణభంగుర లోకం కోసం వెంపర్లాడుతున్న వారలారా!

అతి త్వరలోనే మనం ఓ దుర్భేద్యమైన కనుమ… మరణం… గుండా వెళ్ళి ఒక సుదీర్గమైన అత్యంత ప్రమాదకరమైన లోయ గుండా ప్రయాణించబోతున్నాం.

ఈ ప్రమాదకర లోయలో రేచీకటి లాంటి అంధకారం ఉంటుంది. సూర్య కిరణాలు ఉండవు, చంద్రుని వెన్నెల ఉండదు, నక్షత్రాల కాంతి ఉండదు, దీపాల వెలుతురూ ఉండదు, ఆఖరికి మిణుగురు పురుగుల మిణుకు కూడా కనిపించదు.

ఈ ప్రమాదకరలోయ భయంకర అడవిలాగా నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడ తల్లిదండ్రులు ఉండరు, భార్యా పిల్లలు ఉండరు, దుఃఖాల్లో పాలుపంచుకునేవాడు, దుఃఖాన్ని ఓదార్చేవాడు ఎవడూ ఉండడు. పీర్లు, ముర్షిద్‌లు ఉండరు. ఆపదలు తొలగించేవాడు, అవసరాలు తీర్చేవాడు, అంగరక్షకులు, బాడీగార్డులు ఎవరూ ఉండరు. పార్టీలు, పార్టీ నాయకులూ ఉండరు. అధ్యక్షత, మంత్రిత్వం లాంటి ఉన్నత పదవుల పలుకుబడులూ ఉండవు. సెనెట్‌, అసెంబ్లీల డాబు దర్పాలూ ఉండవు, కోర్టు బోనుల కోలాహలం ఉండదు. పోలీసు పదవీ పందేరాల గర్వమూ ఉండదు. సైనిక సత్కారాలు, నక్షత్రాల వైభవాలూ ఉండవు. ప్రభుత్వ ఉన్నత పదవుల హంగామా ఉండదు. విశాల జాగీరుల ప్రభుత్వం ఉండదు. కబ్జా దారుల ఆక్రమణ హస్తాలు ఉండవు. కిరాయి హంతకుల ఉగ్రవాద చర్యలు ఉండవు. రికమండేషను చేయటానికి బాబాయి మామయ్యలు ఉండరు. లంచం ఇవ్వటానికి అధర్మ సొమ్ము చెలామణి ఉండదు.

ఈ ప్రమాదకర లోయలో భయంకర క్రూరమృగాల భయం ఉంటుంది.

మట్టి ఇల్లు, మట్టి పాన్పు, మట్టి పడక ఉంటాయి. భయాందోళనలు కలుగుతుంటాయి. పురుగులు పాములు ఉంటాయి. విషపూరితమైన సర్పాలు, తేళ్లు ఉంటాయి. గుడ్డి, చెవిటి దూతలు గదలతో నించొని ఉంటారు. అక్కడి నుంచి పారిపోవటానికీ అవకాశం ఉండదు. నిలకడగా నించోవటానికీ వీలు పడదు!

అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను విశ్వసించిన వారలారా!

శుభ వార్తాహరుడుగా, హెచ్చరికలు చేసేవాడిగా పంపబడిన దైవప్రవక్త… ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి మాట కాస్త జాగ్రత్తగా వినండి!

“నేను సమాధికంటే తీవ్ర భయాందోళనకరమైన చోటు మరొకటి చూడలేదు.” (తిర్మిజీ)

ఓ బుద్దీ జ్ఞానాలు కలవారలారా!

మనోమస్తిష్కాలు కలవారలారా!

ఒంటరితనం, అంధకారం, ప్రమాదకరమైన నిర్మానుష్య లోయలోకి అడుగు పెట్టబోతున్న వారలారా!

వినండి! నిరాధార, నిస్సహాయ ప్రమాదకర ఈ లోయ ప్రయాణంలో విశ్వాసం మరియు సత్కర్మలు.. నమాజ్‌, జకాత్‌, ఉపవాసాలు, హజ్‌, ఉమ్రా, ఖుర్‌ఆన్‌ పారాయణం, దుఆలు సంకీర్తనలు, దానధర్మాలు, నఫిల్‌ సత్కార్యాలు, తల్లిదండ్రులపట్ల విధేయత, బంధువులతో సత్సంబంధాలు, అనాథులు, వితంతువుల పట్ల సత్ప్రవర్తన, న్యాయం, ధర్మం, మంచిని గురించి ప్రబోధించటం, చెడుల నుంచి నిరోధించటం మొదలగు సత్కర్మలే ప్రయాణ సామగ్రి. ఇవి భయాందోళనలు దూరం చేస్తాయి, వెలుతురునూ ప్రసాదిస్తాయి. ఇవి చేసుకుంటే ఒంటరితనమూ ఉండదు. ప్రాణానికి హాయిగానూ ఉంటుంది.

కనుక ప్రమాదకర లోయ ప్రయాణీకుల్లారా!

బయలుదేరేముందు మానవ మహోపకారి, దయామయుడు, అతి గొప్ప శ్రేయోభిలాషి అందరికంటే పెద్ద సానుభూతిపరుడు అయిన కారుణ్య ప్రవక్త  హితవును ఒకసారి శ్రద్ధగా వినండి…!

ఒకసారి ఆయన ఈ ప్రమాదకర లోయ అంచున కూర్చొని విలపించసాగారు. ఆయన సమాధి మట్టి సయితం తడిచిపోయింది. ఆ సందర్భంలో ఆయన తన అనుచరులను ఉద్దేశించి ఇలా అన్నారు:

“సోదరులారా! ఇలాంటి ప్రదేశం (సమాధి) కోసం సన్నాహాలు చేసుకోండి” (ఇబ్నెమాజా),

మరి మనలో కారుణ్య ప్రవక్త మాట విని…

ఆయన పిలుపుకు హాజరు పలికి…

ఈ అపాయకరమైన లోయ గుండా ప్రయాణించటం కోసం సన్నాహాలు చేసుకునేవారెవరండీ?!

వసల్లల్లాహు అలా నబియ్యినా ముహమ్మదిం వ్వ ఆలిహీ వ సహ్‌బిహీ అజ్‌మయీన్‌.


ఇది క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

“సమాధి సంగతులు” [పుస్తకం] పరిచయ వాక్యాలు
కూర్పు : మౌలానా ముహమ్మద్‌ ఇఖ్‌బాల్‌ కైలానీ 
ప్రకాశకులు : హదీస్‌ పబ్లికేషన్స్‌. హైద్రాబాద్‌, ఏ.పి. ఇండియా

మృతులు (చనిపోయిన వారు) వింటారా? [ఆడియో & టెక్స్ట్]

మృతులు (చనిపోయిన వారు) వింటారా?
https://www.youtube.com/watch?v=96plKtzzef4 (51 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, సమాధులను సందర్శించే ప్రజలు చేసే షిర్క్ గురించి వివరించబడింది. గత ప్రసంగంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోని ముష్రికులు మరియు నేటి సమాధులను సందర్శించే ముస్లింల మధ్య నమ్మకాల పోలికను చర్చించారు. రెండు వర్గాలు అల్లాహ్‌ను ఏకైక సృష్టికర్తగా నమ్మినప్పటికీ, మధ్యవర్తుల ద్వారా ఆయనను చేరుకోవాలని ప్రయత్నించారు, దీనిని ఖుర్ఆన్ షిర్క్‌గా పరిగణిస్తుంది. మృతులు వినగలరనే నమ్మకం కూడా షిర్క్‌కు దారితీస్తుందని, దీనికి సరైన ఆధారం లేదని వక్త తెలిపారు. బద్ర్ యుద్ధం తర్వాత ప్రవక్త మృతులతో మాట్లాడటం మరియు సమాధిలోని వ్యక్తి పాదాల శబ్దాన్ని వినడం వంటి హదీసులు ప్రత్యేక సందర్భాలని, సాధారణ నియమం కాదని స్పష్టం చేశారు. మృతులు వినలేరని, వారికి సహాయం చేసే శక్తి లేదని ఖుర్ఆన్ ఆయతుల ద్వారా నిరూపించారు. ప్రళయ దినాన, ఈసా (అలైహిస్సలాం) మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా తమ అనుచరులు తమ తర్వాత ఏమి చేశారో తమకు తెలియదని చెప్పడం, మృతులకు ప్రపంచ విషయాలతో సంబంధం ఉండదనేదానికి నిదర్శనం. ప్రజలు ఖుర్ఆన్ మరియు సహీ హదీసులను చదివి, షిర్క్ నుండి తమను తాము రక్షించుకోవాలని వక్త పిలుపునిచ్చారు.

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِيْنَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِيْنَ، أَمَّا بَعْدُ.
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రములు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబంపై మరియు వారి అనుచరులందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆ తర్వాత.

సోదరులారా, గత పాఠంలో మనం సామాన్యంగా ప్రజలు సమాధుల వద్దకు ఎందుకు వెళ్తారు అనే దాని గురించి కొన్ని కారణాలు తెలుసుకున్నాము. వాటికి ఆధారంగా, నిదర్శనంగా, దలీల్‌గా వారు కొన్ని విషయాలు ఏదైతే ప్రస్తావిస్తారో వాటి యొక్క వాస్తవికత ఖుర్ఆన్ హదీసుల వెలుగులో తెలుసుకున్నాము.

సంక్షిప్తంగా మరోసారి మనం చెప్పుకోవాలంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలం నాటి ముష్రికులు ఏకైక అల్లాహ్‌ను సృష్టికర్తగా, ఉపాధి ప్రధాతగా, సర్వ జగత్తుకు నిర్వాహకారునిగా నమ్మినప్పటికీ, కొందరు వలీలను, ఔలియాలను, బాబాలను నిర్ణయించుకుని, అల్లాహ్‌కు చేయనటువంటి ఆరాధనలు వారికి చేసేవారు. ఎందుకు చేసేవారు? మేము చాలా పాపాత్ములం, డైరెక్ట్ అల్లాహ్ వద్ద వెళ్లడానికి మాకు ముఖం లేదు. ఈ బాబాలు, పీర్లు, ఈ ముర్షదులు, ఈ వలీలు, ఔలియాలు వీరి సాధనంగా, వీరి ఆధారంగా, వీరి యొక్క మధ్యవర్తిత్వం వసీలాతో మేము అల్లాహ్ వద్ద చేరుకుంటాము, వారు మా గురించి అల్లాహ్ వద్ద సిఫారసు చేస్తారు. వారి యొక్క ఈ సాకు ఏదైతే ఉండినదో, ఈ రోజుల్లో సామాన్యంగా మన ముస్లింలు ఎవరైతే సమాధుల వద్దకు వెళ్తున్నారో, బాబాల వద్దకు వెళ్తున్నారో వారి యొక్క సాకు, వారి యొక్క కారణం కూడా అదే. మేము పాపాత్ములం, డైరెక్ట్ అల్లాహ్ వద్ద వెళ్లడానికి మా దగ్గర ముఖం లేదు. అల్లాహ్ యొక్క ఈ పుణ్యాత్ములు, ఔలియాలు వారి యొక్క మధ్యవర్తిత్వంతోనే మనం పోగలుగుతాము. వారి యొక్క సిఫారసుతోనే మనం అల్లాహ్‌కు సన్నిహితులుగా కాగలుగుతాము.

అయితే, సూరె యూనుస్ ఆయత్ నెంబర్ 18, సూరె జుమర్ ఆయత్ నెంబర్ 3 వీటి ఆధారంగా ఇదే అసలైన షిర్క్. ఇలాంటి షిర్క్‌ను ఖండించడానికే ప్రతీ కాలంలో అల్లాహు త’ఆలా ప్రవక్తలను పంపాడు అని మనం తెలుసుకున్నాము.

అంతేకాకుండా ఈ ఆయతులు, ప్రత్యేకంగా సూరె జుమర్ మరియు సూరె యూనుస్‌లో తెలుపబడిన ఈ ఆయతులను మనం చదివినప్పుడు సామాన్యంగా ఈనాటి ముస్లింలు కొందరు ఏమంటారు, ఈ ఆయతులు మాలాంటి వారి గురించి కాదు అవతరించినవి. ఆ కాలంలో విగ్రహాలను పూజించేవారు. ఆ విగ్రహాలకు వ్యతిరేకంగా ఈ ఆయతులు అవతరించాయి. అయితే మనం ఇందులో మరికొన్ని ఆధారాలు తెలిపి ఉన్నాము. ఉదాహరణకు, సూరె ఆరాఫ్ లోని ఈ ఆయతులో అల్లాహు త’ఆలా చాలా స్పష్టంగా చెప్పాడు,

عِبَادٌ أَمْثَالُكُمْ
(ఇబాదున్ అమ్సాలుకుమ్)
మీలాంటి దాసులు మాత్రమే.

అల్లాహ్‌ను కాకుండా మీరు ఎవరైతే ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు మీలాంటి మానవులు మాత్రమే. మీలాంటి దాసులు మాత్రమే. అల్లాహు త’ఆలా చాలా స్పష్టంగా చెప్పారు, మీలాంటి దాసులు, మీలాంటి మానవులు. అంటే మక్కా యొక్క ముష్రికులు ఎవరినైతే వారికి మరియు అల్లాహ్‌కు మధ్య మధ్యవర్తిత్వంగా, సిఫారసుగా నిర్ణయించుకున్నారో వారు కేవలం విగ్రహాలు మాత్రమే కాదు. రాళ్లతో, చెట్లతో, లేక వేరే వాటితో చేసిన కేవలం మూర్తులు మాత్రమే కాదు. సమాధిలో ఉన్న కొందరు పుణ్యాత్ములు, ఔలియాలు వారిని ప్రవక్తల కాలం యొక్క ముష్రికులు పూజించేవారు.

ఉదాహరణకు, హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు గారి యొక్క హదీస్ కూడా వినిపించడం జరిగింది. తాయిఫ్ నుండి తాయిఫ్‌కు దగ్గర మక్కా మార్గంలో ‘లాత్’ అనే ఒక పుణ్యాత్ముడు హజ్ కు వచ్చే వాళ్లకు సత్తువ ఇట్లా తాగించి తినిపించేవాడు. అతను చనిపోయిన తర్వాత అతను చనిపోయిన స్థలంలోనే అతన్ని సమాధి చేసి అక్కడే కొందరు ముజావర్గా కూర్చొని కొద్ది రోజుల తర్వాత వారిని అదే పూజించడం మొదలుపెట్టారు. ఇది సహీ హదీసులో ఉంది.

అంతేకాకుండా, హజ్రత్ నూహ్ అలైహిస్సలాం కాలంలో ఐదుగురు పుణ్యాత్ములు ఏదైతే చనిపోయారో, వద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీరి గురించి హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు ఏం చెప్పారు? నూహ్ అలైహిస్సలాం కాలంలో వీరు పుణ్యాత్ములు. నూహ్ అలైహిస్సలాం కాలంలో ఉన్నటువంటి ముష్రికులు వీరిని పూజించేవారు. అయితే తర్వాత నూహ్ అలైహిస్సలాం కాలంలో వచ్చిన ఏదైతే తూఫాన్ ఉందో ఆ తూఫాన్ తర్వాత ఈ ఐదు పుణ్యాత్ముల విగ్రహాలు ఏదైతే తయారు చేసి పెట్టుకున్నారో అవి ఎక్కడో దాగిపోయి ఉన్నాయి. కానీ షైతాన్ వాడు అమర్ బిన్ లుహై అనే ఒక నాయకుడు మక్కాలో అతనికి ఏదో రకంగా తెలిపి జిద్దా ఒడ్డున, జిద్దాలో సముద్రం ఉంది కదా, సముద్ర తీరాన ఎక్కడో పాతి ఉన్న ఆ విగ్రహాలను తీసి మళ్లీ మక్కాలో తీసుకొచ్చి వాటి విగ్రహారాధన మరోసారి మొదలుపెట్టారు. అయితే అక్కడ వారు పూజించేది కేవలం విగ్రహం అనే కాదు. వీరు పుణ్యాత్ములు. పుణ్యాత్ముల ఒక ఆకారం, ఒక వారి రూపాన్ని మేము పూజిస్తున్నాము. వీరు మాకు ప్రళయ దినాన సిఫారసు చేస్తారు. అటువంటి నమ్మకాలు వారు ఉంచుకునేవారు.

ఇంతవరకు మనం గత పాఠంలో ఏదైతే కొన్ని విషయాలు తెలుసుకున్నామో వాటి సంక్షిప్త విషయాలు ఇప్పుడు మరోసారి చెప్పడం జరిగింది. ఈరోజు పాఠంలో నేను మరో విషయం మీకు తెలుపబోతున్నాను. దానిని మీరు చాలా శ్రద్ధగా వినాలని ఆశిస్తున్నాను. అదేమిటి, చాలా ముఖ్యమైన విషయం. అనేకమంది ప్రజలు సమాధుల వద్దకు వెళ్ళడానికి ఇది కూడా ఒక కారణం. అదేమిటి, సమాధిలో ఉన్న వాళ్ళు మా యొక్క మొరలను వింటున్నారు. మేము ఏదైనా దుఆ చేస్తే మా దుఆలను వారు ఆలకిస్తారు అని వారి నమ్మకం ఉంది. అయితే వాస్తవానికి చనిపోయిన వారు, మృతులు, సమాధిలో ఉన్న వారు మనం బ్రతికి ఉన్న వాళ్ళు వీరి యొక్క మాటలను వింటారా? ఒకవేళ సమాధి వద్దకు వెళ్లి ఏదైనా మొరపెట్టుకుంటే, ఏదైనా దుఆలు చేస్తే, ఏదైనా అరిస్తే వారికి వినే శక్తి ఉందా? ఈ విషయం ఖుర్ఆన్ హదీస్ ఆధారంగా తెలుసుకుందాం.

అయితే, ఎవరైతే సమాధుల వద్దకు వెళ్తున్నారో వారి యొక్క గట్టి నమ్మకం, విశ్వాసం ఏంటి? సమాధిలో ఉన్న వాళ్ళందరూ వింటూ ఉంటారు. ప్రత్యేకంగా ఔలియా అల్లాహ్ ఈ బాబాలు వాళ్ళు మా యొక్క కష్టసుఖాలను మేము ఏదైతే చెప్పుకుంటామో, మొరపెట్టుకుంటామో వాటిని వింటారు అన్నటువంటి నమ్మకం ఉంది. వారి ఆ నమ్మకానికి ఖుర్ఆన్‌లో హదీసులో ఎక్కడైనా ఏదైనా ఆధారం ఉందా? అయితే హదీసు నుండి ఒక ఆధారం, ఒక దలీల్ వారు చూపిస్తారు. అదేమిటి, సహీ బుఖారీలో హదీస్ ఉంది.

ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వలస పోయి వచ్చిన తర్వాత రెండవ హిజ్రీలో, అంటే వలస పోయి వచ్చిన తర్వాత రెండవ సంవత్సరం, మక్కా యొక్క ముష్రికులతో ఒక యుద్ధం జరిగింది. దాని పేరు బద్ర్ యుద్ధం. గజ్వతె బద్ర్. ఆ యుద్ధంలో అల్హందులిల్లాహ్ అల్లాహ్ యొక్క దయ వల్ల ముస్లింలు జయించారు. ముష్రికులు ఓడిపోయారు. ముష్రికుల వైపు నుండి 70 మంది హతమయ్యారు. మరో 70 మంది ఖైదీలు అయ్యారు. అయితే ఆ బద్ర్ ప్రాంతంలో ఒక చిన్న సంఘటన జరిగింది. అదేంటి, ఆ మృతులను, ఎవరైతే ముష్రికులు హతులయ్యారో, చంపబడ్డారో వారిని పెద్ద పెద్ద గోతులు తవ్వి అందులో వారిని పడేయడం జరిగింది. అలాంటి సందర్భంలో ఒకసారి అబూ జహల్ ఇంకా పెద్ద పెద్ద కొందరు నాయకులను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక బావి లాంటిది లోతుగా కొంచెం తవ్వి అందులో వారిని వేసినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ నిలబడి ‘హల్ వజద్తుమ్ మా వఅద రబ్బుకుమ్ హక్కా’. ఏమిటి, అల్లాహ్ మీతో మీ ప్రభువు మీతో చేసిన వాగ్దానాన్ని మీరు పొందారా? అని వారిని అడిగారు. ఎవరిని అడుగుతున్నారు ప్రవక్త గారు అప్పుడు? ఆ చనిపోయిన వాళ్ళను. ఆ యుద్ధంలో ఎవరినైతే చంపడం జరిగిందో ముష్రికులను, వారిని ఒక బావిలో వేస్తున్నారు. అయితే వారిని వేసిన తర్వాత దాని ఒడ్డున మీద నిలబడి ప్రవక్త వారితో సంబోధిస్తూ, వారిని ఉద్దేశించి ఈ మాట అడుగుతున్నారు. అల్లాహు త’ఆలా, మీ యొక్క ప్రభువు మీతో ఏ వాగ్దానం అయితే చేశాడో దానిని మీరు పొందారా? అయితే కొందరు సహాబాలు అన్నారు, ప్రవక్తా వారు మృతులు కదా మీ మాటలను ఎలా వినగలుగుతారు? అప్పుడు ప్రవక్త అన్నారు,

إِنَّهُمْ الْآنَ يَسْمَعُونَ مَا أَقُولُ
(ఇన్నహుముల్ ఆన యస్మఊన మా అఖూల్)
నిశ్చయంగా వారు ఇప్పుడు నేను చెప్పేది వింటున్నారు.

నేను ఏ మాటనైతే అంటున్నానో ఆ మాటను వారు ఇప్పుడు వింటున్నారు అని ప్రవక్త చెప్పారు కదా. ఈ యొక్క హదీసు తోని ఈనాటి ఆ ముస్లింలు దలీల్ ఆధారం తీసుకుంటారు చూడండి. మృతులు వినరు అని మీరు అంటారు. ఇక్కడ ప్రవక్త స్వయంగా వారికి వినిపిస్తున్నారు. సహాబాలకు అనుమానం కలిగింది. అయితే ప్రవక్త వారికి సమాధానం చెప్పారు వింటున్నారు అని. అందుగురించి మృతులు వింటారు.

వారు సహీ బుఖారీలో ఉన్న హదీస్ మరొకటి వినిపిస్తారు. అదేమిటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు,

اَلْعَبْدُ إِذَا وُضِعَ فِي قَبْرِهِ، وَتُوُلِّيَ وَذَهَبَ أَصْحَابُهُ حَتَّى إِنَّهُ لَيَسْمَعُ قَرْعَ نِعَالِهِمْ، أَتَاهُ مَلَكَانِ فَأَقْعَدَاهُ
మనిషి చనిపోయిన తర్వాత అతన్ని సమాధిలో పెట్టి తిరిగిపోతున్న సందర్భంలో, ఎప్పుడైతే వారి బంధుమిత్రులందరూ వెళ్లిపోతూ ఉంటారో వారి చెప్పుల శబ్దాన్ని అతడు సమాధిలో ఉండి అతడు వింటాడు. అప్పుడే ఇద్దరు దేవదూతలు వచ్చి అతన్ని కూర్చోబెట్టి ప్రశ్న అడుగుతారు. 

ఇక్కడ ఏముంది హదీసులో, సమాధిలో ఉన్న ఆ వ్యక్తి అతని యొక్క బంధుమిత్రులు ఎవరైతే వెళ్తున్నారో వారి యొక్క చెప్పుల శబ్దాన్ని వింటారు అని హదీసులో స్పష్టంగా ఉంది. యస్మఉ ఖర్అ నిఆలిహిమ్. వారి చెప్పుల శబ్దాన్ని అతను వింటాడు. అందుగురించే ఈ మన సోదరులు ఎవరైతే సమాధుల వద్దకు వెళ్తూ ఉంటారో, సమాధిలో ఉన్న వాళ్ళు ఔలియాలు బాబాలు వింటారు, అందుగురించి ఈ హదీసులో ఆధారం అని చూపిస్తారు.

కానీ వాస్తవానికి ఈనాటి కాలంలో ఉన్న సమాధులలో లేక సామాన్యంగా ఎవరైనా మృతులు, చనిపోయిన వారు వింటారు అనడానికి ఈ రెండు హదీసులు దలీల్ ఏ మాత్రం కావు. ఎందుకు? మొదటి హదీస్ ఏదైతే ఉందో, ఈ హదీస్ సహీ బుఖారీలో ఇమామ్ బుఖారీ రహమతుల్లాహ్ అలైహ్ నాలుగు చోట్ల ప్రస్తావించారు. అంటే నాలుగుసార్లు వేరే వేరే స్థానాల్లో ఈ హదీసును ప్రస్తావించారు. ఒకటి కితాబుల్ జనాఇజ్‌లో, జనాజా అంతక్రియలకు సంబంధించిన చాప్టర్ ఏదైతే ఉంటుందో అక్కడ, ఇంకా మిగతా మూడుసార్లు కితాబుల్ మగాజి, యుద్ధాల విషయానికి సంబంధించిన హదీసులను ప్రస్తావించాడు ఎక్కడైతే అక్కడ.

అయితే మొదటిసారి కితాబుల్ జనాఇజ్ బాబు అజాబిల్ ఖబ్ర్ హదీస్ నెంబర్ 1370 లో ఎక్కడైతే ఈ హదీస్ వచ్చి ఉందో, ప్రవక్త ఎప్పుడైతే అన్నారో మీరు మీ ప్రభువు చేసిన వాగ్దానాన్ని మీరు పొందారా అని అప్పుడు సహాబాలు అన్నారు, తద్ఊ అమ్వాతన్? మీరు మృతులను పిలుస్తున్నారా? మృతులను సంబోధిస్తున్నారా? దాని యొక్క సమాధానంలో ప్రవక్త ఏం చెప్పారు, ‘మా అన్తుమ్ బి అస్మఅ మిన్హుమ్ వలాకిన్ లా యుజీబూన్’. మీరు వారి కంటే ఎక్కువ ఇప్పుడు వినడం లేదు. అంటే వారు మీ కంటే ఎక్కువ ఇప్పుడు వింటున్నారు. కానీ వారు సమాధానం ఇవ్వలేరు.

ఇదే హదీస్ మరోచోట ఉంది, అక్కడ హదీస్ నెంబర్ అది 4026. అక్కడ సహాబాలు అడిగారు, యా రసూలల్లాహ్ తునాది నాసన్ అమ్వాతా? ఓ ప్రవక్తా, మీరు చనిపోయిన వారిని మృతులను పిలుస్తున్నారా? అయితే ప్రవక్త చెప్పారు, ‘మా అన్తుమ్ బి అస్మఅ లిమా ఖుల్తు మిన్హుమ్’. నేను వారికి చెప్పే విషయం ఏదైతే ఉందో దానిని మీరు వారి కంటే ఎక్కువ వినడం లేదు. అంటే వారు మీ కంటే ఎక్కువ వింటున్నారు.

మూడోచోట హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు అడిగారు అని ఉంది. హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు, యా రసూలల్లాహ్ మా తుకల్లిము మిన్ అజ్సాదిన్ లా అర్వాహ లహా. ఆత్మలు లేని ఈ శరీరం వాటితో మీరు సంబోధిస్తున్నారా? వాటికి మీరు వాటితో మీరు వారిని పిలుస్తున్నారా? వారితో మాట్లాడుతున్నారా? అప్పుడు ప్రవక్త ఏమన్నారు, ‘వల్లది నఫ్సు ముహమ్మదిన్ బియదిహ్’. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణం ఎవరి చేతిలో ఉందో అతని సాక్షి ‘మా అన్తుమ్ బి అస్మఅ లిమా అఖూలు మిన్హుమ్’. నేను ఇప్పుడు చెప్పే మాటలు మీరు వారి కంటే ఎక్కువ వినలేరు.

అయితే ఇక్కడ ఒక విషయం మనం ఈ హదీస్ ను ఈ ఒక్క హదీస్ నాలుగు చోట్ల నాలుగు స్థానాల్లో ఏదైతే వచ్చి ఉందో అందులో ఏ ఏ పదాలతో విషయం చర్చించబడిందో వాటిని ఒకవేళ మనం శ్రద్ధ వహిస్తే, సహాబాలు ఏదైతే అడుగుతున్నారో, ఓ ప్రవక్తా మీరు మృతులను సంబోధిస్తున్నారా? ప్రాణం ఏమాత్రం లేని ఈ శవాలను, ప్రాణం లేని ఈ శరీరాలతో మీరు మాట్లాడుతున్నారా? అని ఈ అడగడం ద్వారా మనకు ఏం తెలుస్తుంది? అప్పటివరకు సహాబాల విశ్వాసం ఏమిటి? మృతులు వినరు. చనిపోయిన వాళ్ళు వినరు అన్న విశ్వాసమే ప్రబలి ఉండింది. ఇదే మాట అందరికీ తెలిసి ఉండింది. అందుగురించే ఎప్పుడైతే ప్రవక్త మృతులతో మాట్లాడుతున్నారో, ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యంగా వారు అడిగారు.

రెండో విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? ఇప్పుడు వీరు మీ కంటే ఎక్కువ వింటున్నారు.

اِنَّهُمُ الْآنَ
(ఇన్నహుముల్ ఆన్)
నిశ్చయంగా వారు ఇప్పుడు

అల్ ఆన్ అన్న పదం ఉన్నది అక్కడ. ఇప్పుడు వారు మీ కంటే ఎక్కువ వింటున్నారు. అయితే ఇప్పుడు వారు మీ కంటే ఎక్కువ వింటున్నారు అన్న ఈ పదంలోనే ఇది ఒక ప్రత్యేక సందర్భం అంతే మాత్రం గానీ చనిపోయిన ఏ వ్యక్తి కూడా బ్రతికి ఉన్న వారి, జీవరాశుల మాటలను వినరు అని స్పష్టం అవుతుంది. ఇది ఒక ప్రత్యేక సందర్భం.

మరి ఇదే హదీస్ గురించి హజ్రత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా గారు ఏం చెప్పారో ఒకసారి వినండి. దాని ద్వారా కూడా సహాబాల యొక్క విశ్వాసం మృతులు వింటారా లేదా అనే విషయం సహాబాలకు ఎలా ఉండింది అది కూడా మనకు తెలుస్తుంది. ఈ హదీస్ హజ్రత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా వద్దకు వచ్చినప్పుడు, హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హా గారు చెప్పారు, “ప్రవక్త యొక్క ఉద్దేశం ఇక్కడ ఏమిటంటే వారి యొక్క జీవితాల్లో నేను మాటిమాటికి ఏదైతే చెప్పేవాడినో, మీరు అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించండి, అల్లాహ్‌కు ఏ మాత్రం సాటి కల్పించకండి, షిర్క్ చేయకండి అని మాటిమాటికి ఏదైతే నేను చెప్పేవాడినో, ఒకవేళ మీరు నా మాటను వినేది ఉంటే అల్లాహ్ స్వర్గం యొక్క వాగ్దానం మీకు చేస్తున్నాడు, మీరు నన్ను తిరస్కరించేది ఉంటే మీరు నరకంలో వెళ్తారు, ఇలాంటి వారి జీవితంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ ఏ మాటలైతే చెప్పేవారో అవి సత్యం అని ఇప్పుడు వారికి తెలుస్తుంది. ‘హల్ వజద్తుమ్ మా వఅద రబ్బుకుమ్ హక్కా’. మీ ప్రభువు మీతో చేసిన వాగ్దానం ఏదైతే ఉందో అది నిజం అని మీకు ఇప్పుడు తెలిసిందా? దాన్ని మీరు పొందారా? అది సత్యమే అన్న విషయం ఇప్పుడు తెలిసిందా?”

ఇదే సంఘటన కాకుండా వేరే కొన్ని ఆయతులు ఖుర్ఆన్‌లో ఉన్నాయి. మనిషి చనిపోయినప్పుడు, ఓ దేవా నాకు కొంచెం అవకాశం ఇవ్వు, ఇప్పుడు నాకు తెలిసింది, నాకు కొంచెం అవకాశం దొరికిన గానీ నేను నా ధనాన్ని నీ మార్గంలో ఖర్చు పెడతాను అని కూడా కోరుకుంటారు కొందరు.

ఫిర్ఔన్ చనిపోయేటప్పుడు కూడా ఏమన్నాడు? ఆ, మూసా చెప్పిన మాటలన్నీ కూడా నిజమే. ఇప్పుడు నేను విశ్వాసం మార్గాన్ని అవలంబిస్తాను.

అయితే ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారికి ఆ సందర్భంలో గుర్తు చేస్తున్నారు. అయితే అప్పుడు అల్లాహు త’ఆలా వారికి ప్రవక్త యొక్క మాట వినిపించారు. అదేంటి, ప్రత్యేక సందర్భం. ఈ ప్రత్యేక సందర్భాన్ని మనం ప్రతీ శవం గురించి, ప్రతీ చనిపోయిన వారి గురించి, ప్రత్యేకంగా ఔలియాల గురించి, అంబియాల గురించి ఇంకా వేరే వారి గురించి ఈ మాటలు అక్కడ అతికించవద్దు. ఈ మాటతోని, ఈ యొక్క హదీసుతోని “అందరూ వింటారు” అన్నటువంటి దలీల్ పట్టుకోవడం, దీనిని ఒక ఆధారంగా తీసుకోవడం ఎంత మాత్రం నిజమైనది కాదు. అందుగురించి ఇదే హదీస్ సహీ బుఖారీలో 3976వ హదీస్ లో హజ్రత్ ఖతాదా రహమతుల్లాహ్ అలైహ్ ఏం చెప్తున్నారు,

أَحْيَاهُمُ اللَّهُ حَتَّى أَسْمَعَهُمْ
(అహ్యాహుముల్లాహు హత్తా అస్మఅహుమ్)
వారిని వినిపించేంత వరకు అల్లాహ్ వారికి జీవం పోసాడు

అల్లాహ్ వారిని ఆ సందర్భంలో వారికి జీవం పోసాడు. హత్తా అస్మఅహుమ్, ప్రవక్త యొక్క మాటను వారికి వినిపించాడు. తౌబీఖన్ వ తస్గీరన్ వ నఖీమతన్ వ హసరతన్ వ నదామతన్. ఎందుకు, వారికి ఆ సందర్భంలో బాధ, అయ్యో ప్రవక్త మాటను మేము వినలేదు కదా అన్నటువంటి ఒక బాధ, ఎంతో ఒక షర్మిందాపన్, పశ్చాత్తాపం లాంటిది కలగాలి, ఇంకింత వారికి ఆ ఆవేశం అనేది వారి యొక్క అఫ్సోస్ అనేది పెరిగిపోవాలి అన్న ఉద్దేశంతో ఆ సందర్భంలో అల్లాహు త’ఆలా వారిని మరోసారి లేపి ప్రవక్త యొక్క మాటను వినిపించాడు. అది అంత మటుకు మాత్రమే.

అందుగురించి, ఇప్పుడు నేను కొన్ని ఖుర్ఆన్ ఆయతులు వినిపిస్తాను వాటిని శ్రద్ధగా వినండి. ఖుర్ఆన్ ద్వారా మనకు ఏం తెలుస్తుంది అంటే సామాన్యంగా మృతులు, చనిపోయిన వారు బ్రతికి ఉన్న వారి ఏ మాటను వినలేరు. సూరె నమల్ ఆయత్ నెంబర్ 80లో అల్లాహ్ చెప్పాడు,

إِنَّكَ لَا تُسْمِعُ الْمَوْتَى
(ఇన్నక లా తుస్మిఉల్ మౌతా)
నిశ్చయంగా నువ్వు మృతులకు వినిపించలేవు.

నువ్వు మృతులకు, చనిపోయిన వారికి వినిపించలేవు. అలాగే సూరె రూమ్ ఆయత్ నెంబర్ 52లో ఇలాంటి ఆయతే ఉంది. అక్కడ కూడా ఉంది, ఓ ప్రవక్తా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మృతులకు వినిపించలేవు. అయితే మృతులు వినరు, బ్రతికి ఉన్న వారు తమ ఏ మాటను కూడా మృతులకు వినిపించలేరు అని ఈ ఆయత్ చాలా స్పష్టంగా ఉంది. అంతేకాకుండా అల్లాహు త’ఆలా కోరినప్పుడు, ఏదైనా అవసర సందర్భంగా అల్లాహు త’ఆలాకు ఇష్టమైతే వినిపించవచ్చు. ఆ శక్తి అల్లాహ్‌కు ఉంది. కానీ ఒక సామాన్య నియమం, ఒక రూల్, ఒక పద్ధతి ఏమిటి? మృతులు వినరు. కానీ అల్లాహ్ కోరినప్పుడు వినిపిస్తాడు. అల్లాహ్ స్వయంగా వినిపిస్తాడు. దానికి సాక్ష్యంగా ఈ హదీస్, ఈ ఖుర్ఆన్ యొక్క ఆయతును మనం తెలుసుకోవచ్చు. ఈ ఆయత్ సూరె ఫాతిర్ ఆయత్ నెంబర్ 22.

وَمَا يَسْتَوِي الْأَحْيَاءُ وَلَا الْأَمْوَاتُ
(వమా యస్తవిల్ అహ్యాఉ వలల్ అమ్వాత్)
బ్రతికి ఉన్న వారు, చనిపోయిన వారు ఇద్దరూ సమానులు కాలేరు.

إِنَّ اللَّهَ يُسْمِعُ مَنْ يَشَاءُ
(ఇన్నల్లాహ యుస్మిఉ మన్ యషా)
నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వారికి వినిపిస్తాడు

وَمَا أَنْتَ بِمُسْمِعٍ مَنْ فِي الْقُبُورِ
(వమా అంత బిముస్మిఇన్ మన్ ఫిల్ ఖుబూర్)
మరియు సమాధులలో ఉన్నవారికి నీవు వినిపించలేవు.

ఇక్కడ అల్లాహ్ కోరినప్పుడు వినిపిస్తాడు అని దీంతో కూడా కొందరు పెడమార్గంలో పడిపోతారు. అదేమిటి? అవును ఔలియా అల్లాహ్‌కు వినిపించే శక్తి అల్లాహ్‌కు ఉంది, అందుగురించి మేము మొరపెట్టుకునే మొరలను వారు ఇప్పుడు వింటున్నారు, అల్లాహ్ వినిపిస్తున్నాడు, వారు స్వయంగా వింటారని మేము అనుకుంటలేము. మళ్ళీ ఇలా తిప్పికొట్టి వారు తమ యొక్క విశ్వాసాన్ని మరింత గట్టి పరుచుకునే ప్రయత్నం చేస్తారు. అయితే బుఖారీలోని మొదటి హదీస్ బద్ర్‌లో చనిపోయిన ముష్రికులకు ఏదైతే ప్రవక్త వినిపించారో దానికి ఈ ఆయత్ సాక్ష్యం అవుతుంది.

అంతేకాకుండా చనిపోయిన ప్రతీ వ్యక్తిని సమాధిలో పెట్టినప్పుడు అతన్ని సమాధిలో పెట్టేసి వారి యొక్క బంధుమిత్రులు తిరిగి వస్తున్నప్పుడు అతను ఏదైతే వారి చెప్పుల శబ్దాన్ని వింటాడో, అయ్యో అందరూ నన్ను వదిలేసి నన్ను ఒక్కడిని వదిలేసి పోతున్నారా, నేను ఏకాంతంలో అయిపోయానా, అలాంటి రంది అతనికి కలగడానికి, ఎవరి ఎవరి యొక్క అండదండ నాకు ఉంది అన్న యొక్క ఆలోచనతో నేను ఎంతో అల్లాహ్‌కు వ్యతిరేకంగా కూడా జీవితం గడిపానో, ఇప్పుడు ఈ సమాధిలో నన్ను ఎవరూ కూడా కానడానికి చూడడానికి వస్తలేరు, నేను ఒక్కడిని అయిపోయాను, అలాంటి ఒక ఆవేదన అతనికి కలగడానికి కేవలం వారు వెళ్ళిపోతున్న చెప్పుల శబ్దాన్ని వినిపిస్తాడు, అంతే. ఇంకా వేరే మాటలను వినిపిస్తాడు అని అక్కడ ఇక్కడ లేదు మనకు. అలాంటి విషయం తెలుస్తలేదు.

అందుగురించి సోదరులారా, ఈ రెండు హదీసులను మనం తీసుకొని ఖుర్ఆన్ ఆయతులను మనం తిరస్కరించవద్దు. ఈ రెండు ఆయతులకు రెండు హదీసులను ఈ సూరె ఫాతిర్ యొక్క ఆయత్. ఒకవేళ వీరందరూ వింటున్నారు అని మనం అనుకుంటే, అల్లాహ్ వారిని వినిపిస్తున్నాడు అని అనుకుంటే, ‘ఇన్నల్లాహ యుస్మిఉ మన్ యషా’, అల్లాహ్ తాను కోరిన వారికి వినిపిస్తాడు అని చెప్పేకి ముందు బ్రతికి ఉన్న వారు, చనిపోయిన వారు ఇద్దరూ సమానులు కాజాలరు అని ఏదైతే అంటున్నాడో మరి దాని యొక్క భావం ఏంటి? ఒకవేళ అందరూ వినేది ఉంటే, వారు కూడా బ్రతికి ఉన్న వాళ్ళ మాదిరిగానే అయిపోయారు. అందుగురించి ఈ ఆయతులు ఈ హదీసులను మనం విన్న తర్వాత సామాన్యంగా మృతులు వినరు. ఏదైనా ప్రత్యేక సందర్భంలో, ఏదైనా ఒక ఉద్దేశంతో వినిపిస్తాడు అన్నటువంటి హదీస్ ఎక్కడైనా వచ్చి ఉంటే దానిని అక్కడి వరకే మనం నమ్మాలి గానీ, అంతకంటే ఇంకా ముందుకు వెళ్ళేసి అన్ని విషయాలను వింటారు అని మనం దాంట్లో కలుపుకోవడం ఇది పెడమార్గానికి తీసుకెళ్తుంది.

మరికొందరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఏం విశ్వసిస్తారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో తమ సమాధిలో ఉండి మనల్ని చూస్తున్నారు, మనం చేసే కార్యాలను చూస్తున్నారు, మనం చెప్పే మాట్లాడే మాటలను వింటున్నారు అని కొందరు విశ్వసిస్తారు. అది కూడా ఖుర్ఆన్ హదీసులకు వ్యతిరేకమైన విశ్వాసం.

ఏమిటంటారు తెలుసా వాళ్ళు? ఒక హదీసులో మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ చదివినప్పుడు ఆ దరూద్ దేవదూతలు తీసుకెళ్లి ప్రవక్త గారికి వినిపిస్తారు. అయితే సహీ హదీసుల్లో ఇంత విషయమే ఉంది. కానీ మరికొన్ని జయీఫ్ హదీసులలో ఏం వస్తుంది అంటే, ఎవరైనా ప్రవక్త సమాధి వద్దకు వచ్చి దరూద్ సలాం చేస్తే స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దరూద్ సలాంకు సమాధానం ఇస్తారు. కానీ ఇది నిరాధారమైన హదీస్. బలమైనది కాదు. అయితే హదీసులు కూడా బలహీనంగా ఉంటాయా? హదీస్ యొక్క పరంపరలో, హదీస్ యొక్క సనదులో పరంపరలో కొందరు అబద్దీకులు, కొందరు తప్పుగా ప్రవక్త వైపునకు మాటలు కల్పించే వాళ్ళు కూడా వస్తారు. హదీస్ యొక్క పండితులు అలాంటి కల్పిత హదీసులను వేరుగా చేసి ఉన్నారు. అయితే సహీ హదీసులో ఎక్కడా కూడా ప్రవక్త డైరెక్ట్ మన యొక్క సలాంను దరూదును వింటారు అని లేదు. ఏ సహీ హదీసులో లేదు. దూరమైనా దగ్గరైనా ఎక్కడ ఉండి మనం దరూద్ చదివినా గానీ ప్రవక్త డైరెక్ట్ గా వింటారు అని ఎక్కడా ఏ హదీసులో కూడా లేదు. అందుగురించి ప్రవక్త కూడా మన మాటలను వింటారు అని మనం ఎప్పుడూ కూడా నమ్మవద్దు విశ్వసించవద్దు.

అయితే, ఇంతవరకు ఈ విషయాలు మనం విన్న తర్వాత నేను ఖుర్ఆన్‌లోని ఒక ఆయత్, ఆ ఆయత్‌కు సాక్ష్యాధారంగా సహీ బుఖారీలోని ఒక హదీస్ వినిపిస్తాను. ఈ ఆయత్ మరియు ఈ హదీస్ విన్న తర్వాతనైనా ఇక మన విశ్వాసాలు కరెక్ట్, నిజమైనవి, శుద్ధమైనవి మరియు ప్రవక్త సహాబాల విశ్వాస ప్రకారంగా ఉండాలి. శవాలు వింటారు అని, వారి సమాధుల వద్దకు వెళ్లి అక్కడ ఎలాంటి షిర్క్ పనులకు, ఎలాంటి మనం తావు ఇవ్వకూడదు, ఎలాంటి మనం అక్కడ మోసాలకు గురికాకూడదు.

అదేవిటండీ ఆ ఆయత్ అంటే, సూరె మాయిదాలో అల్లాహు త’ఆలా ఈసా అలైహిస్సలాం కు సంబంధించిన ఒక సంఘటన తెలిపారు. అదేమిటి, ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త, తండ్రి లేకుండా అల్లాహు త’ఆలా మర్యమ్ అలైహిస్సలాం ద్వారా అతన్ని పుట్టించాడు. ఈ విషయం మనకు తెలిసిందే. అలాగే మనం విశ్వసించాలి. అయితే ఈ రోజుల్లో అనేకమంది క్రైస్తవులు స్వయంగా ఈసా అలైహిస్సలాంనే దేవునిగా పూజిస్తున్నారు. మరికొందరు మర్యమ్ అలైహిస్సలాంను కూడా పూజిస్తున్నారు. ఇంకొందరు ఈసా, పరిశుద్ధాత్మ, యెహోవా అని త్రైత్వ దైవాన్ని (Trinity) పూజిస్తున్నారు. ఇవన్నీ కూడా తప్పుడు విశ్వాసాలు. వారి యొక్క ఈ ఆరాధనలన్నీ కూడా షిర్క్‌లోకి వస్తాయి. స్వయంగా ఈసా అలైహిస్సలాం నన్ను కాదు ఏకైక దేవుణ్ణి పూజించండి అని స్పష్టంగా చెప్పారు. ఖుర్ఆన్ సూరె ఆలి ఇమ్రాన్‌లో ఉంది.

اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ
(ఉ’బుదుల్లాహ రబ్బీ వ రబ్బకుమ్)
నాకు మీకు ప్రభువైన అల్లాహ్‌ను మాత్రమే మీరు ఆరాధించండి.

అలాగే బైబిల్‌లో యోహాను సువార్తలో ఉంది. ఆకాశాల్లో ఉన్న ఆ దేవుణ్ణి పూజించేవారే నిత్య జీవితాన్ని పొందుతారు అని చాలా స్పష్టంగా ఉంది. అయితే ప్రళయ దినాన అల్లాహు త’ఆలా ఈసా అలైహిస్సలాంను పిలుస్తాడు. అక్కడ గట్టిగా ప్రశ్నిస్తాడు. ఆ విషయం ఏంటి? ఆ ప్రశ్నలు ఏంటి? కొంచెం శ్రద్ధగా వినండి.

وَإِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ أَأَنْتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُونِي وَأُمِّيَ إِلَٰهَيْنِ مِنْ دُونِ اللَّهِ
మరియు (ఆ రోజును గుర్తు చేసుకోండి), అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు: ఓ మర్యమ్ కుమారుడవైన ఈసా! నీవు ప్రజలతో, ‘అల్లాహ్‌ను వదలి నన్నూ, నా తల్లినీ ఆరాధ్య దైవాలుగా చేసుకోండి’ అని అన్నావా?

మరియం పుత్రుడైన ఓ ఈసా, అల్లాహ్‌ను వదలి నన్ను నా తల్లిని ఆరాధ్య దైవాలుగా చేసుకోండి అని నీవు ప్రజలకు చెప్పావా? అని అల్లాహ్ నీలదీసి అడిగే సందర్భం కూడా స్మరించుకోదగినది. అప్పుడు ఈసా అలైహిస్సలాం ఇలా విన్నవించుకుంటారు. ఏమని,

قَالَ سُبْحَانَكَ مَا يَكُونُ لِي أَنْ أَقُولَ مَا لَيْسَ لِي بِحَقٍّ
ఓ అల్లాహ్, నిన్ను పరమ పవిత్రుడిగా భావిస్తున్నాను. ఏ మాటను అనే హక్కు నాకు లేదో అలాంటి మాటను అనటం నాకే మాత్రం తగదు.

إِنْ كُنْتُ قُلْتُهُ فَقَدْ عَلِمْتَهُ تَعْلَمُ مَا فِي نَفْسِي وَلَا أَعْلَمُ مَا فِي نَفْسِكَ
ఒకవేళ నేను గనక అలాంటిది ఏదైనా అని ఉంటే అది నీకు తెలిసి ఉండేది. నా మనసులో ఏముందో కూడా నీకు తెలుసు. కానీ నీలో ఏముందో నాకు తెలియదు.

إِنَّكَ أَنْتَ عَلَّامُ الْغُيُوبِ
నిశ్చయంగా నీవు సమస్త గుప్త విషయాలను ఎరిగినవాడవు.

مَا قُلْتُ لَهُمْ إِلَّا مَا أَمَرْتَنِي بِهِ أَنِ اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ
నీవు నాకు ఆజ్ఞాపించిన దానిని తప్ప నేను వారికి మరేమీ చెప్పలేదు: ‘అల్లాహ్‌ను ఆరాధించండి, ఆయనే నా ప్రభువు మరియు మీ ప్రభువు.’

وَكُنْتُ عَلَيْهِمْ شَهِيدًا مَا دُمْتُ فِيهِمْ فَلَمَّا تَوَفَّيْتَنِي كُنْتَ أَنْتَ الرَّقِيبَ عَلَيْهِمْ وَأَنْتَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
నేను వారి మధ్య ఉన్నంత కాలం వారిపై సాక్షిగా ఉన్నాను. కానీ నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత, నీవే వారిపై పర్యవేక్షకుడవుగా ఉన్నావు. మరియు నీవు ప్రతి విషయానికి సాక్షిగా ఉన్నావు.

ఈసా అలైహిస్సలాం ప్రవక్త కదా, అయినా ఇప్పుడు వారందరూ అంటే క్రైస్తవులందరూ వారిని పూజిస్తున్నారు అన్న విషయం ఈసా అలైహిస్సలాంకు తెలుసా? తెలియదు. అందుగురించి ఏమంటున్నారు, నేను వారి మధ్యలో ఉన్నంత వరకే నేను సాక్ష్యంగా ఉన్నాను. ఎప్పుడైతే నీవు నన్ను నీ వద్దకు తీసుకున్నావో, నీవే వారిపై వారిని పర్యవేక్షించి ఉన్నావు. వారు ఏం చేస్తున్నారో నాకేం తెలుసు. ఇది సూరె మాయిదాలోని 116, 117వ ఆయత్.

దీనికి సాక్ష్యాధారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీస్ ఏంటి? అది కొంచెం శ్రద్ధగా వినండి. కానీ ఈ హదీసులో తెలిపే ముందు, ఈ రోజుల్లో ప్రపంచమంతటిలో ఎక్కడెక్కడ ఏ పెద్ద పెద్ద ఔలియాలు, పెద్ద పెద్ద బాబాలు, పీరీలు, ముర్షదులు ఎవరెవరైతే ఉన్నారో, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్థానం వారి కంటే గొప్పదా లేకుంటే వారందరూ మన ప్రవక్త కంటే గొప్పవారా? సమాధానం ఇవ్వండి. ప్రవక్తనే గొప్పవారు కదా. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు కదా మనకు. అయితే స్వయంగా ప్రవక్త సంగతి ఈ హదీసులో వినండి. ప్రవక్త ఎలా విన్నవించుకుంటున్నారు? ప్రవక్త తమ తర్వాత జరిగిన విషయాలను నాకు తెలియవు అన్నట్టుగా ఎలా ప్రస్తావిస్తున్నారో. మరి ఈ రోజుల్లో మనం ఎలాంటి తప్పుడు విశ్వాసాల్లో, పెడమార్గాల్లో పడి ఉన్నామో మనం మనకు మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ హదీస్ సహీ బుఖారీలో హదీస్ నెంబర్ 4625, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ హదీసును హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసంగించారు. ఖుత్బా ఇచ్చారు. అంటే ఏదో ఒక సహాబీతో ప్రత్యేకంగా చెప్పిన విషయం కాదు. 10 మంది 50 మంది 100 మంది ముంగట ఖుత్బాలో ప్రసంగంలో చెప్పిన విషయం. ఆ ప్రసంగంలో ఇలా చెప్పారు. యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా ఇన్నకుమ్ మహ్షూరున ఇలల్లాహి హుఫాతన్ ఉరాతన్ గుర్లా. మీరు అల్లాహ్ వైపునకు లేపబడతారు. మొదటిసారి పుట్టిన స్థితిలో, శరీరంపై బట్టలు లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా, సున్నతీలు చేయబడకుండా. మళ్లీ ప్రవక్త ఖుర్ఆన్ యొక్క ఆయత్ చదివారు. సూరె అంబియా ఆయత్ నెంబర్ 104.

كَمَا بَدَأْنَا أَوَّلَ خَلْقٍ نُعِيدُهُ وَعْدًا عَلَيْنَا إِنَّا كُنَّا فَاعِلِينَ
తొలిసారిగా మిమ్మల్ని పుట్టించిన రీతిలో మలిసారి మిమ్మల్ని మేము లేపుతాము. ఇది మా యొక్క వాగ్దానం. దీనిని మేము పూర్తి చేసి తీరుతాము.

ఇది సూరె అంబియా ఆయత్ నెంబర్ 104 యొక్క అనువాదం. మళ్లీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, వినండి, వ ఇన్న అవ్వలల్ ఖలాయిఖి యుక్సా యౌమల్ ఖియామతి ఇబ్రాహీమ్ అలైహిస్సలాతు వస్సలాం. అందరూ ఏ స్థితిలో లేస్తారు సమాధుల నుండి? నగ్నంగా. బట్టలు లేకుండా. చెప్పులు లేకుండా. సున్నతీలు చేయబడకుండా. అయితే, మొట్టమొదటిసారిగా హజ్రత్ ఇబ్రాహీమ్ అలైహిస్సలాంకు వస్త్రాలు ధరింపజేయబడతాయి. ఆ తర్వాత మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. అయితే, ఆ మైదానే మహ్షర్‌లో, ఆ పెద్ద మైదానంలో ఎక్కడైతే అందరూ, ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు వచ్చిన ఈ జన సమూహం అంతా ఒకే ఒక మైదానంలో సమూహం అవుతారు, జమా అవుతారు. అక్కడ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, వినండి, వ ఇన్నహు యుజాఉ బిరిజాలిన్ మిన్ ఉమ్మతీ ఫయు’ఖదు బిహిమ్ దాతశ్శిమాల్. నేను నా హౌదె కౌసర్ పై నా ఉమ్మతీయులు, నా అనుచర సంఘం వస్తుంది అని నేను వేచిస్తూ ఉంటాను. వారు కొన్ని కొన్ని గ్రూపుల రూపంలో వస్తూ ఉంటారు. కొందరు నా వైపునకు వస్తూ ఉంటారు, ఫయు’ఖదు బిహిమ్ దాతశ్శిమాల్, వారిని నా వద్దకు రానివ్వకుండా ఎడమ వైపునకు నెట్టేయడం జరుగుతుంది. ఫ అఖూల్, అప్పుడు నేను అంటాను, యా రబ్బీ ఉసైహాబీ, ఓ ప్రభువా వీరు నా యొక్క అనుచరులు, నన్ను విశ్వసించిన వారు. ఫ యుఖాల్, అప్పుడు అనబడడం జరుగుతుంది.

إِنَّكَ لَا تَدْرِي مَا أَحْدَثُوا بَعْدَكَ
(ఇన్నక లా తద్రీ మా అహదసూ బ’అదక)
నిశ్చయంగా, నీ తర్వాత వారు ఏ కొత్త కొత్త విషయాలు పుట్టించుకొని ధర్మం నుండి దూరమయ్యారో నీకు తెలియదు ఆ విషయం.

ఎప్పుడు అనబడుతుంది? ప్రళయ దినాన. హౌదె కౌసర్ వద్ద. హౌదె కౌసర్ వద్ద ప్రవక్త శుభ హస్తాలతో హౌదె కౌసర్ ఆ శుభ జలాన్ని త్రాగడానికి అందరూ గుంపులు గుంపులుగా వెళ్తూ ఉంటారు. ఒక గుంపు వచ్చినప్పుడు వారిని ప్రవక్త వద్దకు రానివ్వడం జరగదు. ఎడమ వైపునకు నెట్టేయడం జరుగుతుంది. అయ్యో నా వారు వాళ్ళు, రానివ్వండి నా దగ్గరికి అని ప్రభువును వేడుకుంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. కానీ ప్రభువు వైపు నుండి సమాధానం ఏమొస్తుంది? నీవు చనిపోయిన తర్వాత, నీ తర్వాత వారు ఏ కొత్త కొత్త విషయాలు పుట్టించుకొని ధర్మం నుండి దూరమయ్యారో (ఇన్నక లా తద్రీ) నీకు తెలియదు ఆ విషయం.

ఈ హదీస్ ఇంకా ముందుకు ఉంది. కానీ ఇక్కడ నేను ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నాను మరోసారి. ఇన్నక లా తద్రీ. నీకు తెలియదు. నీకు ఆ సందర్భంలో నీకు జ్ఞానం లేదు. నీవు చనిపోయిన తర్వాత నీ యొక్క ఈ నిన్ను విశ్వసించే వారు ఏ పెడమార్గంలో పడిపోయారో నీకు తెలియదు. ఈరోజు మనం ఏమనుకుంటున్నాము? ప్రవక్త మనల్ని చూస్తున్నారు, మనం చెప్పే మాట్లాడే మాటలన్నీ, మనం చేసే ప్రార్థనలన్నీ వింటున్నారు. ఇది తప్పు విషయం ఇది. ఈ హదీసుకి వ్యతిరేకంగా ఉందా లేదా వారి యొక్క ఈ విశ్వాసం? ఆ తర్వాత వినండి, ఫ అఖూల్, ప్రవక్త అంటున్నారు, అప్పుడు నేను అంటాను కమా ఖాలల్ అబ్దుస్సాలిహ్, ఎలాగైతే ఆ పుణ్య పురుషుడైన, సదాచరుడైన దాసుడు ఈసా అలైహిస్సలాం చెప్పాడో

وَكُنْتُ عَلَيْهِمْ شَهِيدًا مَا دُمْتُ فِيهِمْ فَلَمَّا تَوَفَّيْتَنِي كُنْتَ أَنْتَ الرَّقِيبَ عَلَيْهِمْ وَأَنْتَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
నేను వారి మధ్య ఉన్నంత కాలం వారిపై సాక్షిగా ఉన్నాను. కానీ నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత, నీవే వారిపై పర్యవేక్షకుడవుగా ఉన్నావు. మరియు నీవు ప్రతి విషయానికి సాక్షిగా ఉన్నావు.

నేను వారి మధ్యలో ఉన్నంత మాత్రం నేను వారిపై సాక్ష్యంగా ఉన్నాను. ఫలమ్మా తవఫ్ఫైతనీ, ఎప్పుడైతే నీవు నన్ను చంపివేశావో, ఎప్పుడైతే నువ్వు నన్ను నా ప్రాణం తీసుకున్నావో, కున్త అంతర్రఖీబ అలైహిమ్, నీవే వారిని పర్యవేక్షిస్తూ ఉన్నావు. వ అంత అలా కుల్లి షైఇన్ షహీద్, మరియు నీవే సర్వ విషయాలపై సర్వ జగత్తుపై సత్యమైన సాక్షివి.

అయితే సోదరులారా, ఈ హదీస్ ఎంత స్పష్టంగా ఉంది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సైతం ఆయన కూడా ఎవరి ఏ మాట వినరు ఇప్పుడు. ఎవరి యొక్క మొరలను ఆలకించలేరు. అలాంటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే తక్కువ స్థానంలో ఉన్న వారి గురించి వారు వింటారు, వారు చేస్తారు, మనకు అన్ని రకాల అనుగ్రహాలు ప్రసాదిస్తారు, ఇలాంటి విశ్వాసాలు, ఇలాంటి నమ్మకాలు మనల్ని ఎంత షిర్క్ లాంటి లోతుకు తీసుకెళ్తాయో మనమే ఆలోచించాలి. ఇ

లా చెప్పుకుంటూ పోతే సోదరులారా, ఖుర్ఆన్‌లో ఇంకా ఎన్నో ఆయతులు ఉన్నాయి, ఎన్నో హదీసులు ఉన్నాయి. ఇలాంటి తప్పుడు విశ్వాసాలకు వ్యతిరేకంగా. కానీ, కొంత సమయం ఉంది గనుక కేవలం ఒకే ఒక ఆయత్, దాని యొక్క అనువాదం మీ ముందు తెలిపి నేను ఈ యొక్క ప్రసంగాన్ని సమాప్తం చేస్తాను. ఇది సూరె ఫాతిర్. సూరె ఫాతిర్‌లోని ఆయత్ నెంబర్ 13, 14. అల్లాహ్ అంటున్నాడు,

ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ
(దాలికుముల్లాహు రబ్బుకుమ్ లహుల్ ముల్క్)
ఆయనే అల్లాహ్, మీ ప్రభువు, ఆధిపత్యం ఆయనదే.

وَالَّذِينَ تَدْعُونَ مِنْ دُونِهِ مَا يَمْلِكُونَ مِنْ قِطْمِيرٍ
(వల్లదీన తద్ఊన మిన్ దూనిహీ మా యమ్లికూన మిన్ ఖిత్మీర్)
మరియు ఆయనను వదలి మీరు పిలిచేవారు ఖర్జూరపు బీజంపై ఉండే పొరంత కూడా అధికారం కలిగి లేరు.

ఆయన్ని కాకుండా, ఆయన్ని వదలి మీరు ఎవరెవరినైతే మొరపెట్టుకుంటున్నారో, ఎవరెవరినైతే మీరు పిలుస్తున్నారో, దుఆలు చేస్తున్నారో, మా యమ్లికూన మిన్ ఖిత్మీర్, ఖర్జూరపు బీజంపై ఉన్నటువంటి మరీ పలుచని ఆ పొర అంత మాత్రం శక్తి కూడా వారికి లేదు. మీరు అల్లాహ్‌ను కాకుండా ఎవరినైతే పూజిస్తున్నారో, ఎవరినైతే మొరపెట్టుకుంటున్నారో వారి వద్ద ఖర్జూరపు గుట్లి, దాని యొక్క బీజంపై చాలా పలుచని పొర ఏదైతే ఉంటుందో అంత శక్తి కూడా వారి వద్ద లేదు.

إِنْ تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ
(ఇన్ తద్ఊహుమ్ లా యస్మఊ దుఆఅకుమ్)
ఒకవేళ నీవు వారిని మొరపెట్టుకుంటే మీ మొరలను వారు ఆలకించలేరు, వినలేరు.

وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ
(వలవ్ సమీఊ మస్తజాబూ లకుమ్)
ఒకవేళ వారు విన్నా, మీకు సమాధానం ఇవ్వలేరు.

లేదు వింటారు, వింటారు, వింటారు అని ఏదైతే మీ విశ్వాసం ఉందో, ఒకవేళ విన్నా గానీ మస్తజాబూ లకుమ్, మీకు ఎలాంటి జవాబ్, సమాధానం ఇవ్వలేరు. అల్లాహ్ అంటున్నాడు, ఒకవేళ మీ యొక్క బలహీన విశ్వాసం ఉంది కదా లేదు వింటున్నారు అని, ఒకవేళ విన్నా గానీ సమాధానం ఏ మాత్రం ఇవ్వలేరు. సహీ బుఖారీలోని మొదటి హదీస్ ఏదైతే వినిపించానో అక్కడ కూడా ప్రవక్త అదే చెప్పారు. ఇప్పుడు వారు వింటున్నారు కానీ జవాబు ఇవ్వలేరు. సమాధానం ఇవ్వలేరు. బదులు పలకలేరు. అల్లాహ్ ఏమంటున్నాడు ఇక్కడ? ఒకవేళ మీ విశ్వాస ప్రకారంగా, ఏదైనా అవసరం పడి, ఏదైనా సందర్భంలో మేము వారికి వినిపించినా గానీ వారు సమాధానం చెప్పలేరు, ఇవ్వలేరు.

وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ
మరియు ప్రళయ దినాన వారు మీ షిర్క్‌ను తిరస్కరిస్తారు.

మరియు ప్రళయ దినాన యక్ఫురూన బిషిర్కికుమ్. మీరు అల్లాహ్‌తో పాటు వారిని ఏదైతే సాటి కల్పించారో దీనిని వారు తిరస్కరిస్తారు. తిరస్కరిస్తారు. అల్లాహ్ మీరు అల్లాహ్‌తో పాటు మీరు వారిని ఏదైతే సాటి కల్పిస్తున్నారో వాటి దానిని వారు తిరస్కరిస్తారు. అంటే ఏంటి? అంటే వారికి ఈ విషయం తెలియదు. ఒకవేళ తెలిసేది ఉంటే ఎందుకు తిరస్కరిస్తారు? తెలిసేది ఉంటే ఎందుకు తిరస్కరిస్తారు? మీరు ఇక్కడ మొరపెట్టుకున్న విషయం, అల్లాహ్‌ను కాకుండా వారిని మీరు ఏదైతే దుఆ చేస్తున్నారో ఇవన్నీ విషయాలు వాస్తవానికి వారు వినలేరు, వారికి ఏమాత్రం తెలియదు. అందుగురించే ప్రళయ దినాన ఎప్పుడైతే వీరు వెళ్తారో, అక్కడ కూడా వారు వీరి యొక్క ఈ షిర్క్‌ను తిరస్కరిస్తారు. ఈ తిరస్కరిస్తారు అన్న విషయం బహుశా ఇంకొందరికి అర్థం అవతలేదు అనుకుంటా. సూరె బఖరాలో, సూరె అహ్కాఫ్‌లో 26వ పారా స్టార్టింగ్ ఆయతులలోనే ఐదు ఆరు ఆయతులలోనే అక్కడ విషయం ఉంది. సూరె బఖరాలో రెండవ అధ్యాయం అంటే రెండవ పారా ఏదైతే ఉందో, అందులో సగం అయిన తర్వాత ఇంచుమించు సుమారు ఒక క్వార్టర్ పారా అయిపోయిన తర్వాత

إِذْ تَبَرَّأَ الَّذِينَ اتُّبِعُوا مِنَ الَّذِينَ اتَّبَعُوا وَرَأَوُا الْعَذَابَ وَتَقَطَّعَتْ بِهِمُ الْأَسْبَابُ
(ఆ రోజును గుర్తు చేసుకోండి), ఎప్పుడైతే అనుసరించబడిన వారు తమను అనుసరించిన వారి నుండి వైదొలగిపోతారో, మరియు వారు శిక్షను చూస్తారో, మరియు వారి మధ్య సంబంధాలన్నీ తెగిపోతాయో.

ఆ ఆయతుల సంగతి ఆ ఆయతులను దాని యొక్క వ్యాఖ్యానం చదవండి. ఏమవుతుంది, సహీ బుఖారీలో వివరణ ఉంది. ప్రళయ దినాన ప్రజలందరూ ఆ మైదానే మహ్షర్‌లో జమా అవుతారు కదా, అక్కడ అల్లాహు త’ఆలా ఎవరెవరు ఎవరెవరిని మొరపెట్టుకునేవారో వారి వెంట వెళ్ళండి అని అన్నప్పుడు, ఈ ఇమాములను, పీరీలను, ముర్షదులను, బాబాలను వారందరినీ మొరపెట్టుకునేవారు వారి వారిని వెనుకులాడుతూ ఉంటారు. వెనుకులాడి ఆ మీరే కదా పీరానే పీర్ షేఖ్ అబ్దుల్ ఖాదర్ జీలాని, మీరే కదా పెద్ద గుట్ట వాళ్ళు, మీరే కదా ఈ విధంగా వారి వారి వద్దకు వెళ్లి వారి వెంట ఉండి వారి యొక్క సిఫారసు పొందడానికి వారి వెనక వెళ్లే ప్రయత్నం చేస్తారు ప్రళయ దినాన. అప్పుడు వారు వీరిని చూసి ఓ అల్లాహ్ వీరు మమ్మల్ని పూజించే వారు కాదు, మమ్మల్ని మొరపెట్టుకునే వారు కాదు, వీరు మాకు శత్రువులు, మమ్మల్ని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మాకు వీరికి ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టంగా చెప్తారు.

సోదరులారా, ఖుర్ఆన్‌లో ఈ ఆయతులు, హదీసుల్లో ఈ విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అసలైన రోగం, అసలైన పెద్ద సమస్య ఏంటంటే ఇలాంటి ఆయతులను ఇలాంటి హదీసులను మనం చదవడం లేదు. ఈ సమాధుల వద్ద ఉండే మౌల్వీలు, ఇలాంటి పండితులు మన సామాన్య ప్రజలకు తెలపడం లేదు. అందుగురించి సామాన్య ప్రజలు ఇలాంటి ఘోరమైన షిర్క్‌లో పడిపోతున్నారు.

అల్లాహు త’ఆలా మనందరికీ సరియైన సన్మార్గం మరియు తౌహీద్, ఈ నిజమైన అఖీదా విశ్వాసానికి సంబంధించిన విషయాలు ఖుర్ఆన్ హదీస్ ఆధారంగా మరిన్ని ఎక్కువగా తెలుసుకునే భాగ్యం అల్లాహ్ కలిగించుగాక. ఈ రోజుల్లో ప్రజలు ఏదైతే షిర్క్‌లో పడి ఉన్నారో వాటి నుండి అల్లాహు త’ఆలా వారిని రక్షించుగాక. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ : https://teluguislam.net/?p=8426

ఇతరములు:

ధర్మ విద్య ఎందుకు నేర్చుకోవాలి? [ఆడియో & టెక్స్ట్]

ధర్మ విద్య ఎందుకు నేర్చుకోవాలి?
https://youtu.be/dkJiN7q3VZA (38నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం ఇస్లాంలో ధార్మిక విద్య యొక్క ప్రాముఖ్యత మరియు దాని విధిగా ఉండటంపై దృష్టి సారిస్తుంది. ప్రపంచ విద్యకు లభించే విలువను, ధార్మిక విద్య పట్ల ప్రజల నిర్లక్ష్యంతో పోల్చి చూపిస్తుంది. కంపెనీ నియమాలు పాటించడం ఉద్యోగానికి ఎలా అవసరమో, సృష్టికర్త నిర్దేశించిన మార్గాన్ని అనుసరించడం మానవ గౌరవాన్ని నిలబెట్టడానికి అంతకంటే ముఖ్యం అని వక్త ఉద్ఘాటించారు. ధార్మిక విద్య అంటే ఒక ఉత్తమ మానవునిగా ఎలా జీవించాలో సృష్టికర్త నేర్పిన పద్ధతి అని నిర్వచించారు. విద్యను అభ్యసించడం మొదలుపెట్టిన క్షణం నుండే పుణ్యాలు లభిస్తాయని, అది స్వర్గానికి మార్గాన్ని సులభతరం చేస్తుందని, మరియు విద్యార్థి కోసం సృష్టిలోని ప్రతి జీవి ప్రార్థిస్తుందని వివరించారు. ఇస్లాం యొక్క మొట్టమొదటి ఆదేశం “ఇఖ్రా” (చదువు) అని గుర్తుచేస్తూ, జ్ఞానం ఇస్లాంకు పునాది అని స్పష్టం చేశారు.

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం)
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బ’అద్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబంపై మరియు వారి అనుచరులందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆ తర్వాత.

మహాశయులారా, అల్లాహ్ దయతో ఈరోజు మనం, ధర్మ విద్య అభ్యసించడం, ధర్మ జ్ఞానం నేర్చుకోవడం దీనికి సంబంధించిన ఘనతలు ఏమిటి? మరియు ధర్మ జ్ఞానం నేర్చుకోవడం మనపై విధిగా ఉందా? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

సామాన్యంగా ఈ రోజుల్లో ప్రజలు, రండి ఒకచోట కూర్చుందాం, ఫలానా రోజు మనం మస్జిద్ లో ఒక కూటమి ఉంది, ఒక ఇజ్తిమా ఉంది, అక్కడికి వెళ్లి ధర్మ విద్య నేర్చుకుందాము, ధర్మ జ్ఞానం నేర్చుకుందాము అని ఎవరికైనా మనం ఆహ్వానిస్తే, ధర్మ విద్య సమావేశాల్లో పాల్గొనడానికి మనసు అంతగా ఆకర్షించదు. అదే వేరే ఏదైనా జనరల్ ప్రోగ్రాం గానీ లేక వేరే ఏదైనా ఆటపాటల ప్రోగ్రాం అయితే, చెప్పకున్నా గానీ కేవలం తెలిస్తే సరిపోతుంది. ప్రజలు తమకు తామే వచ్చేస్తారు.

అంతకు ముందు మనం ధర్మ విద్య నేర్చుకోవడం మనపై విధియా? నేర్చుకోకపోతే నష్టం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాము.

ఈ ప్రశ్నకు సమాధానం డైరెక్ట్ సూటిగా ఖురాన్ మరియు హదీసు ఆధారంగా ఇచ్చే ముందు ఒక చిన్న సంఘటన, ఒక చిన్న విషయం మనం మాట్లాడుకుందాము. అదేమిటంటే, ఈరోజు ఒక వ్యక్తి కలిశాడు, జుహర్ కంటే కొంచెం ముందు. నాకు తెలిసిన వ్యక్తి, అతని బావ గురించి చెప్తున్నాడు. ఏమని?

మొన్న మూడు నాలుగు రోజుల క్రితం నేను ఫోన్ చేశాను అతనికి, అంటే మా బావకు. ఒక ట్రైనింగ్ లో, ఏం ట్రైనింగ్ నాకు తెలియదు కానీ, ఆ ట్రైనింగ్ విషయంలో ఢిల్లీకి వచ్చాడు. ప్రాపర్ అసలు ఉండేది హైదరాబాద్. ఢిల్లీకి వచ్చాడు అని. ఈరోజు నేను ఫోన్ చేశాను, చేసేసరికి ఈరోజు నైట్ లో దమ్మాంకు ఫ్లైట్ ఉంది, అతను ఒక నెల విజిట్ వీసా మీద ఒక ఏదో పెద్ద కంపెనీలో ఏదో సాఫ్ట్వేర్ కు సంబంధించిన మంచి చదువు చదివి ఉన్నారు, మంచి డిగ్రీ చేసి ఉన్నారు. దాని మీద కంపెనీ అతన్ని పంపుతుంది. టికెట్, ఇక్కడికి వచ్చిన తర్వాత జీతం, అన్నీ వాళ్ళే భరిస్తున్నారు.

హైదరాబాద్ నుండి బయలుదేరే లేరి, ఇక్కడ దమ్మాంలో చేరుకునేసరికి ప్రయాణ ఖర్చులు ఏదైతే అంటాం కదా? టికెట్ కాదు, కేవలం జేబు ఖర్చుకు ప్రయాణ ఖర్చులు అంటాం కదా, 300 డాలర్లు ఇచ్చారంట. 300 డాలర్లా? మాషా అల్లాహ్. కేవలం ప్రయాణ ఖర్చులు. హైదరాబాద్ నుండి దమ్మాం వచ్చేసరికి ఎన్ని గంటలు పడుతుంది? మహా ఎక్కువ అంటే ఐదు, ఆరు గంటలు అంతే.

తర్వాత ఏం చెప్పాడంటే, వాస్తవానికి ఎవరు ఎంత గొప్ప విద్య అభ్యసించి, ఎంత పెద్ద డిగ్రీలు సంపాదించి, ఆ ప్రకారంగా జీవితం గడుపుతారో, అతనికి ఇహలోకంలో ఎంత హైఫై, అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి.

అయితే అతను చెప్పిన సంఘటన మీద కొంచెం గ్రహిస్తే, ఈ ప్రపంచంలో ప్రపంచానికి సంబంధించిన ఏదైనా విద్య చాలా ఎక్కువ మోతాదులో, పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించి నేర్చుకుంటే, దానికి అనుకూలంగా మంచి హోదా అంతస్తులు, మంచి జీతాలు, మంచి ఉద్యోగాలు లభిస్తాయి అన్నటువంటి ఆశ మనిషికి ఉంటుంది.

దీనిని బట్టి మీరు ఒక విషయం తెలుసుకోండి. ప్రపంచానికి సంబంధించిన విద్య నేర్చుకొని లక్షలు ఖర్చు పెట్టి అంతా నేర్చుకున్న తర్వాత, దానికి తగిన ఫలం కూడా మనకు లభిస్తుంది అన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో, మన సృష్టికర్త పంపించినటువంటి గ్రంథం, దాని యొక్క విద్య మనం నేర్చుకుంటే ఏం లాభం ఉంటుంది అని అనుకోవడం, ఇది మన సృష్టికర్త పట్ల మనకు ఎంతటి గొప్ప భావన మనసులో ఉందో అట్లాగే మనకు అర్థమైపోతుంది. ఆలోచించండి. మనుషులు, ప్రజలు తయారు చేసిన విద్యలు, వారు స్వయంగా పుస్తకాలు రచించి, ఇహలోకంలో కొన్ని విషయాలు కనుక్కొని, వాటికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకొని, మంచి హైఫై ఉద్యోగాలు దొరికినందుకు ఎంత సంతోషించిపోతున్నారు, ఎంత సంబరపడుతున్నారు.

అదే మన సృష్టికర్త అయిన అల్లాహ్ ఆయనకు సంబంధించిన విద్య, ఆయనకు సంబంధించిన విషయాలు, ఆయన ఇచ్చిన ఆదేశాలు, ఆయన తమ అతి గౌరవనీయులైన మహనీయ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చిన ఆదేశాలు నేర్చుకోవడం ఎంతో హీనంగా, ఎంతో తక్కువగా మనం భావిస్తున్నామంటే, మనమే ఆలోచించుకోవాలి, మన మనసులో, మన హృదయంలో అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అదే విధంగా నేను అల్లాహ్ తో కూడా మహబ్బత్ కర్తా హు, నాకు అల్లాహ్ పట్ల పిచ్చి ప్రేమ ఉంది, అని ఏదైతే మనం నోటితో అంటామో, అది ఎంతవరకు నిజమనేది అట్లాగే మనం తెలుసుకోవచ్చు.

రెండో విషయం. దీనికి సంబంధించిందే. ఏదైనా కంపెనీలో మంచి ఉద్యోగం మనం పొందిన తర్వాత, కేవలం ఇప్పుడు ఊహించండి, ఒక వ్యక్తి హైఫై డిగ్రీలు సంపాదించి మంచి ఉద్యోగం అతను పొందాడు. కంపెనీలోని రూల్స్ రెగ్యులేషన్స్, డ్యూటీ టైమింగ్స్, ఆ డ్యూటీ ఎలాంటిదో, దానికి సంబంధించిన మరి కరెక్ట్ గా చేసినప్పుడే కదా అతను అంత జీతం వేసేది? ఒకవేళ ఏమైనా దొంగ గ్యాంబ్లింగ్ చేసి, పని చక్కగా చేయకుంటే, ఏ విధంగా, ఏ పద్ధతిలో చేయాలో అలా చేయకుంటే, ఒక నెల, రెండేళ్లు ఏదైనా అట్లాంటి మిస్సింగ్ చేస్తే, తర్వాత అయినా గాని పట్టుబడవచ్చు కదా? అతని అంతటి గొప్ప ఉద్యోగం అంతా వృధా అయిపోవచ్చు కదా? సంవత్సరం, రెండు సంవత్సరాల క్రితం సత్యం కంప్యూటర్ యొక్క యజమాని, ఏం పేరు మర్చిపోయాను? రామలింగరాజు, అతని పరిస్థితి, కొందరు అంటారు అతను వాస్తవానికి డబ్బులు దోచాడు, దొంగలించడం, ఏదైనా గ్యాంబ్లింగ్ చేయడం అలాంటివి చేయలేదట. ఏదో కేవలం కంపెనీని ఇంకా డెవలప్ చేసే ఉద్దేశంతోనే ఏదో లెక్కలు కొంచెం అటూ ఇటూ చేశారు అని కొందరు అంటారు. వాస్తవం ఏంటో మనకు తెలియదు. కానీ ఒక ఉదాహరణ మీకు చూపిస్తున్నాను. సత్యం కంప్యూటర్ అంటే ఇండియాలోనే కాదు, హైదరాబాద్ లోనే కాదు, వరల్డ్ లెవెల్ లో ఇంత అతనికి హోదా అంతస్తు ఉండేది. కానీ చిన్నపాటి మిస్టేక్ చేసినందుకు, తప్పు చేసినందుకు,

అయితే, దేవుడు అల్లాహ్ త’ఆలా మనల్ని అంటే ముందు మనం మానవుల్ని, ఇహలోకంలో సర్వ సృష్టిలో ఒక అతి ఉత్తమమైన సృష్టిగా మనకు హోదా అంతస్తు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అందులో ఇంకా మనం ఎవరైతే మనకు మనం ముస్లింలము అని అనుకుంటామో, ఇస్లాం పై ఉన్న వాళ్ళం అని మనం భావిస్తామో, మనకు మనుషుల్లోనే, మానవుల్లోనే ఇతర జాతులపై ఒక హోదా అంతస్తు, ఒక గౌరవం అనేది ఉందా లేదా? ఉంది. మరి ఈ గౌరవం, ఈ హోదా అంతస్తు ఎలా వచ్చేస్తుంది? విద్య లేకుండా, ఎలాంటి మనకు జ్ఞానం లేకుండా అలాగే మనం సంపాదించాలంటే ఈ హోదా దానికి మనం అర్హులం అవుతామా? ఎంతమాత్రం కాము.

షరియత్ యొక్క ఇల్మ్, ధర్మ జ్ఞానం, ధర్మశాస్త్ర జ్ఞానం ఎంత మనకు అవసరం ఉన్నదో ఖురాన్, హదీసుల ఆధారంగా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కానీ అది తెలపడానికి ముందు నేను ఇలాంటి కొన్ని ఉదాహరణల ద్వారా మీకు తెలుపుతున్నాను విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది డైరెక్ట్ ఖురాన్ హదీస్ ఏం చెప్తే, ఆ ఇదేంటి ఖురాన్ హదీస్ తప్ప ఇంకా వేరే రానే రాదా? ఇది మాకు విని విని బోర్ అవుతుందయ్యా అని అంటుంటారు. కానీ ఇది చాలా బాధాకరమైన విషయం.

వాస్తవానికి ఈ 21వ శతాబ్దంలో సైన్స్, మెడికల్ సైన్స్, ఇంకా వేరే టెక్నాలజీలో ఏ డెవలప్మెంట్ అయితే మనం చూస్తున్నామో, కొందరు శాస్త్రార్థులు ఏమంటారో తెలుసా? సైన్స్, టెక్నాలజీ యొక్క డెవలప్ అనేది ఇంతకుముందు కాలాల్లో ఎందుకు జరగలేదు? ఇప్పుడు ఎందుకు జరిగింది? దానికి అసలు మూలం ఇది.

అల్లాహ్ పంపినటువంటి దివ్య గ్రంథం. అంటే ఈ బుక్, అంటే ఈ దివ్య గ్రంథం, సైన్స్ బుక్ అని నేను చెప్పడం లేదు. టెక్నాలజీకి సంబంధించిన దీని యొక్క ముఖ్య ఉద్దేశం, మానవుడు ఇహలోకంలో మంచి జీవితం ఎలా గడపాలి, పరలోకంలో స్వర్గం ఎలా పొందాలి. ఆ మార్గం చూపుతుంది. ఇంకా, మనిషి ఏ తప్పుడు మార్గాలను అవలంబిస్తే స్వర్గంను కోల్పోయి నరకం పాలవుతాడో అది తెలుపుతుంది. సంక్షిప్తంగా నేను తెలిపే విషయం. కానీ ఇందులో, ఈనాటి కాలంలో విద్యకు సంబంధించిన ఎన్ని రకాలు ఉన్నాయో వాటన్ని మూల విషయాలు ఇందులో ఉన్నాయి. దీని మీద రీసెర్చ్ చేస్తూ చేస్తూ చేస్తూ ఇంకా ముందుకు సాగుతున్నారు.

కానీ మనం, మనకు మనం ముస్లింలం అని అనుకునే వాళ్ళం, ఇల్లా మన్ రహిమ రబ్బు, చాలా అరుదైన, చాలా తక్కువ మంది తప్ప, అనేక మంది ముస్లింలం ఈ ధర్మ విద్య నుండి, ఖురాన్ యొక్క విద్య నుండి దూరం అయినందుకే దినదినానికి మన పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. ఇలాంటి సందర్భంలోనే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆ హదీసును గుర్తుంచుకోండి.

إِنَّ اللَّهَ يَرْفَعُ بِهَذَا الْكِتَابِ أَقْوَامًا وَيَضَعُ بِهِ آخَرِينَ
(ఇన్నల్లాహ యర్ఫ’ఉ బి హాదల్ కితాబి అఖ్వామవ్ వయద’ఉ బిహి ఆఖరీన్)
నిశ్చయంగా అల్లాహ్ ఈ గ్రంథం ద్వారా కొందరు ప్రజలను ఉన్నత స్థానానికి తీసుకువస్తాడు, మరియు దాని ద్వారానే మరికొందరిని పడగొడతాడు.

అల్లాహ్ త’ఆలా ఈ గ్రంథం ద్వారా ప్రజల్లో కొందరిని పై స్థానానికి తీసుకొస్తాడు. ఎవరు వారు? ఖురాన్ ను చదివేవారు, దీని విద్య అభ్యసించేవారు, దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారంగా ఆచరించేవారు. ఇంకా ఎవరైతే ఈ ఖురాన్, దీని నుండి వెనుతిరుగుతారో, దీన్ని నేర్చుకోకుండా దూరం అవుతారో, దీని మీద ఏ నమ్మకం, ఏ విశ్వాసం, దీని మీద ఎలా ఆచరించాలో అలా ఆచరించకుండా ఉంటారో, వారి గురించి ఏం చెప్పారు?

وَيَضَعُ بِهِ آخَرِينَ
(వయద’ఉ బిహి ఆఖరీన్)
మరియు దాని ద్వారానే మరికొందరిని పడగొడతాడు.

వారిని చాలా అధోగతికి పాలు చేస్తాడు. చాలా తక్కువ స్థానానికి. అందుగురించి సోదరులారా, ఈ హదీస్ ఇలాంటి సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి. మనిషికి ధర్మ విద్య, తను ఈ జఠర కడుపు గురించి ఏదైతే తింటాడో, త్రాగుతాడో, బ్రతకడానికి రేపటి రోజు మళ్లీ లేచి నిలబడి మంచి ఏదైనా మనం పని చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నాలుగు ముక్కలు తింటాడో, ఆ కూడు కంటే, ఆ భోజనం కంటే ధర్మ విద్య ఎంతో ముఖ్యమైనది.

ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం రహమతుల్లాహ్ అలైహ్ ఒక సందర్భంలో చెప్తారు, ధర్మ విద్య మనిషికి లభించే దొరికే ఉపాధి కంటే ఎంతో ముఖ్యం. ఒకవేళ మనిషికి తిండి లేకుంటే ఏం నష్టం జరుగుద్ది? ఇహలోకంలో జీవితం కోల్పోతాడు. తింటూ బతికినా గాని, ఉపవాసంతో ఉన్నా గాని ఒక రోజు చనిపోయేదే ఉంది. కానీ ధర్మ విద్య లేకుండా, విశ్వాసపరమైన జీవితం గడపకుండా అతను చనిపోయాడు అంటే, శాశ్వతంగా సదాకాలం నరకంలో ఉండే అలాంటి దుర్భాగ్యం కూడా కలగవచ్చు. అందుగురించి ఈ లోకం మనం సామాన్యంగా తెలుగులో ఎన్నో సామెతలు ఉన్నాయి, నీటి బుగ్గ లాంటిది. ఒక ముస్లిమేతర తెలుగు కవి, క్షణమైన మన జీవితం అని ఒక పాట కూడా పాడాడు.

ఈ తక్కువ వ్యవధి, కొద్ది రోజుల్లో అంతమైపోయే జీవితంలో ధర్మ విద్య నేర్చుకొని, మనం దీని ప్రకారంగా జీవితం గడిపితే, చనిపోయిన తర్వాత జీవితం ఏదైతే శాశ్వతంగా ఉందో అక్కడ మనం బాగుపడతాము.

మరో విషయం. మీరు ఈ ప్రాపంచిక జీవితంలో ఏ పని చేయాలన్నా, మన కడుపు గురించి, పొట్టలో మన కడుపులో రెండు ముక్కలు రావడానికి ఏ పని చేయాలన్నా దానికి సంబంధించిన జ్ఞానం నేర్చుకోవడం తప్పనిసరి. అవునా కాదా? లేనిదే అది మనం ఏమీ చేయలేము. అయితే ఈ నాలుగు ముక్కల గురించి, 50, 60 సంవత్సరాల జీవితం ఏదైతే మనం గడుపుతామో, అందులో కొంచెం సుఖంగా ఉండడానికి మనం ఎంత విద్య నేర్చుకొని, ఎంత సంపాదించి, ఎంత మనం కూడబెట్టుకుంటామో, ఆ సదాకాలమైన, శాశ్వతమైన ఆ జీవితం సుఖపడడానికి మనకు ఏ విద్య, ఎలాంటి ఆచరణ అవసరం లేదా?

ఎవరైతే ధర్మ విద్య అవసరం లేదు అని అనుకుంటున్నారో, వారు ఆలోచించాలి. ఇహలోకంలో ఒక్క పూట అన్నం దొరకడానికి మనం రెక్క ఆడనిది మన డొక్క నిండదు. అలాంటి పరిస్థితిలో పరలోకం, శాశ్వతమైన జీవితం, అక్కడి సుఖం మనం పొందాలంటే ఉక్కెక్కనే దొరకాలి? ఎలాంటి ఖర్చు లేకుండా దొరకాలి? ఏ విద్య అభ్యసించకుండా దొరకాలి? ఏ మంచి ఆచరణ లేకుండా దొరకాలి? కేవలం పేరుకు ముస్లిం అని మనం అనుకుంటే సరిపోతుంది అని అనుకోవడం ఇది ఎంత మూర్ఖత్వమో ఆలోచించాలి.

అందుకే సోదరులారా, బహుశా ఈ జనరల్ టాపిక్, ఇలాంటి కొన్ని ఉదాహరణల ద్వారా ధార్మిక విద్య అనేది ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది.

ధార్మిక విద్య అంటే ఏమిటి? సామాన్యంగా కొందరు ఏమంటారు, అరే నేను ఒక జనరల్ గా ఒక మనిషిగా మంచి మనిషిగా బ్రతకాలనుకుంటా కానీ, మస్జిద్ కి పోవడం, ధర్మ విద్య నేర్చుకోవడం ఈ.. నేను ఇది చాలా క్రిటికల్ ఇవన్నీ, ఇదంతా దీనివల్ల గొడవలు జరుగుతాయి అది ఇది అని కొందరు తప్పుడు భావనలో కూడా పడతారు. అసలు మనం ధార్మిక విద్య, ధర్మ విద్య, ధర్మ జ్ఞానం అని అంటున్నాం కదా, ధార్మిక విద్య అంటే ఏంటి?

వాస్తవానికి సోదరులారా, ధార్మిక విద్య అంటే మనం ఒక ఉత్తమ మనిషిగా, ఉత్తమ మనిషిగా ఎలా జీవించగలుగుతామో ఇహలోకంలో, ఆ పద్ధతి మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్త అల్లాహ్ తెలిపాడు. దానిని నేర్చుకొని ఆ ప్రకారంగా జీవితం గడపడమే ధార్మిక విద్య. అదే ధార్మిక జీవితం.

ఇంతకుముందు నేను ఒక విషయం చెప్పాను. ఏ కంపెనీలో పని చేయాలనుకున్నా గాని ఆ కంపెనీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. పాటించకుంటే మనకు దొరికే జీతం అనేది సరిగా రాదు. ఆ కంపెనీ ద్వారా ఏ సుఖం మనం పొందాలనుకుంటున్నామో పొందలేము. అలాగే ఒక ఉత్తమ మనిషిగా, ఉత్తమ మనిషిగా మనం జీవితం గడపాలనుకుంటే, మనకు ఏ డైరెక్షన్, ఏ రూల్స్, ఏ రెగ్యులేషన్స్, ఏ పద్ధతి, ఏ చట్టము, ఏ నియమము అవసరం లేదా? ఆలోచించండి.

ఏ మనం జాబ్ చేస్తామో, ఏ డ్యూటీ చేస్తామో, ఏ ఉద్యోగం చేస్తామో, అక్కడ ఏయే నియమాలు ఉంటాయో, ఏయే చట్టాలు ఉంటాయో, అవన్నీ పాటించడానికి సిద్ధపడతాం మనం. ఎందుకు? జీతం దొరకాలి మనకు.

అయితే, ఉత్తమ మనిషిగా జీవించి పరలోకంలో స్వర్గం పొందడానికి మనకు ఏ పద్ధతి, ఏ డైరెక్షన్స్, ఏ రెగ్యులేషన్స్ అవసరం లేకుండా ఎలా జీవించగలుగుతాము? అయితే ఈ డైరెక్షన్స్, ఈ రూల్స్, రెగ్యులేషన్స్ ఎవరు మనకు మంచి విధంగా చూపించగలుగుతారు? ఎవరైతే మనల్ని పుట్టించారో ఆయనే చూపించగలుగుతాడు. ఉదాహరణకు, మెకానికల్ లైన్ లో పనిచేసేవాళ్లు, టయోటా కంపెనీకి సంబంధించిన బండి, నిస్సాన్ కంపెనీకి సంబంధించిన పార్ట్స్ తీసుకువచ్చి దానిలో పెడితే ఫిట్ అవుతాయా? కావు. చూడడానికి నిస్సాన్ బండి మరియు టయోటా బండి, చూడడానికి సేమ్ ఒకే రకంగా ఉన్నప్పటికీ లోపల కూడా ఎన్నో విషయాలు వేరువేరుగా ఉండవచ్చు. నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నా. అది 100% ఈ ఉదాహరణ అక్కడ ఫిట్ అవుతుందా లేదా అది కాదు, నేను చెప్పే విషయం ఏంటంటే, అల్లాహ్ మనల్ని పుట్టించాడు. మన గురించి, మన భవిష్యత్తు గురించి అల్లాహ్ కు ఎంత మంచి విధంగా తెలుసునో, ఇంకా వేరే ఎవరికైనా తెలిసి ఉంటుందా? ఉండదు. ఆయన చూపిన విధానమే అది సంపూర్ణ విధానం అవుతుంది. ఆయన చూపిన విధానం మీద, ఆ ప్రకారం మనం జీవితం గడిపితేనే మనకు ఇహ-పర రెండు లోకాల సుఖాలు అనేటివి ప్రాప్తమవుతాయి. అందుగురించి అల్లాహ్ త’ఆలా, 28వ పారాలో,

يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ
(యర్ఫ’ఇల్లా హుల్లదీన ఆమనూ మిన్కుమ్ వల్లదీన ఊతుల్ ఇల్మ దరజాత్)
మీలో విశ్వసించిన వారికి, మరీ ముఖ్యంగా జ్ఞానం వొసగబడిన వారికి అల్లాహ్ ఉన్నతమైన హోదాలను ప్రసాదిస్తాడు. (58:11)

మీలో ఎవరైతే విశ్వసించారో మరియు ఎవరైతే విద్య అభ్యసిస్తారో, వీరిద్దరి స్థానాలను అల్లాహ్ త’ఆలా పెంచుతూ పోతాడు, హెచ్చింపు చేస్తూ పోతాడు.

يَرْفَعِ اللَّهُ
(యర్ఫ’ఇల్లాహ్)
అల్లాహ్ హెచ్చిస్తాడు.

హెచ్చుతూ పోతాడు, పైకి తీసుకెళ్తూ ఉంటాడు.

الَّذِينَ آمَنُوا مِنكُمْ
(అల్లదీన ఆమనూ మిన్కుమ్)
మీలో ఎవరైతే విశ్వసించారో వారిని

وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ
(వల్లదీన ఊతుల్ ఇల్మ్)
మరియు ఎవరికైతే విద్య ఇవ్వబడ్డారో,

ఎవరికైతే విద్య లభించినదో, వారిద్దరి స్థానాలను, దరజాత్, అల్లాహ్ త’ఆలా పైకి ఎత్తుతూ పోతాడు. ఇంతకుముందు నేను ఫస్ట్ లో, స్టార్టింగ్ లో ఒక ఉదాహరణ చెప్పాను కదా, ఒక వ్యక్తి తన బావ గురించి. అయితే, ఎంత మంచి విద్య నేర్చుకొని, ఎంత మంచి అతని దగ్గర ఒక పని, షార్ప్నెస్ ఉంటే, అతను అంత హాయిగా సుఖంగా జీవిస్తాడు అని ఏదైతే భావిస్తున్నామో, అల్లాహ్ పంపినటువంటి ధర్మ జ్ఞానం, అల్లాహ్ పంపినటువంటి విద్య, అది నేర్చుకొని చాలా నీచంగా ఉంటాము అని మనం ఎలా భావిస్తున్నాము? మరి అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో ఇంత స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరైతే విశ్వసించి నా విశ్వాస మార్గంలో ఉంటారో, ఎవరైతే నేను పంపిన విద్యను నేర్చుకొని ఆ ప్రకారంగా జీవితం గడుపుతారో, వారి స్థానాలను నేను ఇంకా మీదికి చేస్తూ ఉంటాను, వారికి హోదా అంతస్తులు ప్రసాదిస్తూ ఉంటాను అని అల్లాహ్ త’ఆలా చెప్తున్నాడు. అల్లాహ్ మాటలో ఏమైనా పొరపాటు, అనుమానం అనేది ఉంటుందా? ఉండదు.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అందుకే చెప్పారు,

طَلَبُ الْعِلْمِ فَرِيضَةٌ عَلَى كُلِّ مُسْلِمٍ
(తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం)
విద్యాన్వేషణ ప్రతి ముస్లింపై విధిగా ఉంది.

విద్యా అభ్యసించడం ప్రతి ముస్లిం పై, స్త్రీ అయినా, పురుషుడైనా, ప్రతి ఒక్కరిపై విధిగా ఉన్నది. విధిగా ఉన్నది.

فَرِيضَةٌ
(ఫరీదతున్)
విధి

ఈ ఫరీదా, నమాజ్ ఫర్జ్, రోజా ఫర్జ్ హై, జకాత్ ఫర్జ్ హై అని మనం అనుకుంటాం కదా? ఇక్కడ ప్రవక్త ఏమంటున్నారు?

طَلَبُ الْعِلْمِ فَرِيضَةٌ
(తలబుల్ ఇల్మి ఫరీదతున్)
విద్యాన్వేషణ విధి.

ఇల్మ్, విద్య తలబ్, అభ్యసించడం, నేర్చుకోవడం ఫరీదా, అది కూడా ఒక విధి. కానీ ఈ విధి నుండి మనం సామాన్యంగా ముస్లింలు ఎంత దూరం ఉన్నాము?

తొలిసారిగా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన సూరా ఏది? ఇఖ్రా.

اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ
(ఇఖ్ర’ బిస్మి రబ్బికల్లదీ ఖలఖ్)
చదువు, సృష్టించిన నీ ప్రభువు పేరుతో. (96:1)

خَلَقَ الْإِنسَانَ مِنْ عَلَقٍ
(ఖలఖల్ ఇన్సాన మిన్ అలఖ్)
ఆయన మానవుణ్ణి రక్తపు గడ్డతో సృష్టించాడు. (96:2)

اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ
(ఇఖ్ర’ వరబ్బుకల్ అక్రమ్)
చదువు, నీ ప్రభువు పరమ దయాశీలి. (96:3)

الَّذِي عَلَّمَ بِالْقَلَمِ
(అల్లదీ అల్లమ బిల్ ఖలమ్)
ఆయనే కలము ద్వారా జ్ఞానాన్ని నేర్పాడు. (96:4)

عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ
(అల్లమల్ ఇన్సాన మా లమ్ య’అలమ్)
మానవునికి అతను ఎరుగని విషయాలను నేర్పాడు. (96:5)

ఈ ఐదు ఆయతులు తొలిసారిగా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించాయి. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రవక్త పదవి, ప్రవక్త కిరీటం అనేది ప్రసాదించబడింది. ఈ ఆయతుల మీద శ్రద్ధ వహించండి. ఇఖ్రా, ఈ పదమే ఏమున్నది? చదవండి, చదువు. ఇస్లాం లోని మొట్టమొదటి విషయం చదువు. ఈ చదువు నుండి మనం ఎంత దూరం ఉన్నామో ఈ రోజుల్లో చూడండి.

అచ్చా, చదువులో అబ్బాయి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు అతనికి ముందు మనం ఏం నేర్పాలి? పిల్లవాడు స్కూల్ పోవడానికి మూడు, మూడున్నర, నాలుగు సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు స్కూల్ కి పంపుతాము. మొట్టమొదటిసారిగా ఏ చదువు ఇవ్వాలి మనం? ఆ విషయం కూడా దీని ద్వారా నేర్పడం జరిగింది. ఏంటది?

اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ
(ఇఖ్ర’ బిస్మి రబ్బికల్లదీ ఖలఖ్)
చదువు, సృష్టించిన నీ ప్రభువు పేరుతో. (96:1)

ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడో ఆ సృష్టికర్త పేరుతో మీ చదువును ఆరంభించండి.

خَلَقَ الْإِنسَانَ مِنْ عَلَقٍ
(ఖలఖల్ ఇన్సాన మిన్ అలఖ్)
ఆయన మానవుణ్ణి రక్తపు గడ్డతో సృష్టించాడు. (96:2)

మనిషి పుట్టుక ఎలా జరిగింది? మనిషి యొక్క సృష్టి ఎలా జరిగింది? ఆ విషయం ఇక్కడ తెలపాడు అల్లాహ్ త’ఆలా. ఆ తర్వాత మరోసారి,

اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ
(ఇఖ్ర’ వరబ్బుకల్ అక్రమ్)
చదువు, నీ ప్రభువు పరమ దయాశీలి. (96:3)

చదువు, అక్రం అంటే ఏంటి? మహా గౌరవనీయుడు. ఇజ్జత్ ఓ ఇక్రాం అన్న పదం ఉర్దూలో కూడా వాడుతూ ఉంటారు. ఇక్రాం, అక్రం అంటే అంతకంటే మించిన కరమ్ చేసేవాడు ఇక లేడు అని.

ఇక్కడ ఖురాన్ వ్యాఖ్యానకర్తలు, ముఫస్సిరీనె కిరామ్ ఒక చాలా సున్నితమైన విషయం అంటారా? బారీక్ నుక్తా ఏం తెలుపుతారో తెలుసా? ఇఖ్రా చదువు, వరబ్బుకల్ అక్రమ్, నీ ప్రభువు చాలా గౌరవప్రదమైనవాడు. అంటే ఏంటి? చదువు వల్ల నీకు గౌరవప్రదము లభిస్తుంది. చదువు లేకుంటే మరి తర్వాత,

الَّذِي عَلَّمَ بِالْقَلَمِ
(అల్లదీ అల్లమ బిల్ ఖలమ్)
ఆయనే కలము ద్వారా జ్ఞానాన్ని నేర్పాడు. (96:4)

ఆ అల్లాహ్ కలము ద్వారా మనిషికి విద్య నేర్పాడు.

عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ
(అల్లమల్ ఇన్సాన మా లమ్ య’అలమ్)
మానవునికి అతను ఎరుగని విషయాలను నేర్పాడు. (96:5)

మనిషికి తెలియని జ్ఞానాలు అల్లాహ్ త’ఆలా పంచి నేర్పాడు.

సోదరులారా, తొలిసారిగా అవతరించిన ఈ ఆయతులో మనం శ్రద్ధ వహిస్తే ఎంత గొప్ప విషయం మన గురించి ఉంది. అంతేకాదు. తొలి మానవుడు ఎవరు? ఆదం అలైహిస్సలాం. స్కూళ్లలో చదివిన డార్విన్ థియరీ, డార్విన్ సిద్ధాంతం, కోతి నుండి మనిషి వచ్చినాడు, అది తప్పుడు విషయం. స్వయంగా డార్విన్ దానిని తిరస్కరించాడు. తిరస్కరించి ఒక పెద్ద బోర్డ్ లాగా రాసి సైన్ కూడా చేశాడు. ఈ సిద్ధాంతం, ఈ థియరీ నేనే సృష్టించాను, కానీ దీనికి ఎలాంటి ఆధారం లేదు, ఇది తప్పు అని ఖండించాడు. కానీ ఈ రోజుల్లో అతని ఆ ఖండనను ముందు తీసుకురాకుండా అతని ఆ తప్పుడు సిద్ధాంతాన్ని ప్రజలకు నేర్పుతున్నారు సైన్స్ బుక్ లో. కానీ అల్లాహ్ యొక్క దయవల్ల మనం ముస్లింలము గాని, అలాగే క్రిస్టియన్లు గాని, వారి విశ్వాసం ఏంటి? తొలి మానవుడు ఆదం అలైహిస్సలాం.

ఆదం అలైహిస్సలాం విషయం చెప్పేకి ముందు, మనలో మనలాంటి, తిని త్రాగి సంభోగించి శ్వాస పీల్చుకొని జీవించే ఇంకా వేరే జీవరాసులు ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. వారిలో మనలో తేడా ఏంటి? మనలో వారిలో వ్యత్యాసం, వారికి లేకుండా మనకు అల్లాహ్ ఏదైతే,

وَلَقَدْ كَرَّمْنَا بَنِي آدَمَ
(వ లఖద్ కర్రమ్నా బనీ ఆదమ)
నిశ్చయంగా మేము ఆదం సంతతికి గౌరవాన్ని ప్రసాదించాము (17:70)

మానవులకు మేము ఒక గౌరవమైన, ఒక మంచి గౌరవం అనేది ప్రసాదించాము అని అల్లాహ్ ఏదైతే అంటున్నాడో, అది మనకు ఆ గౌరవం ఎలా లభించింది? అయితే సూర బఖరాలో చూడండి మీరు,

وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا
(వ అల్లమ ఆదమల్ అస్మా’అ కుల్లహా)
మరియు అల్లాహ్ ఆదమ్ కు అన్ని వస్తువుల పేర్లు నేర్పాడు. (2:31)

అల్లాహ్ త’ఆలా ఆదంకు అన్ని విషయాల పేర్లు నేర్పాడు. తర్వాత ఓ దేవదూతలారా, మీరు ఆదంకు సజ్దా చేయండి అని ఆదేశం ఇచ్చాడు. ఆదంకు ఇతరుల మీద గౌరవం అనేది ఏ విషయంలో ప్రసాదించబడింది? విద్య ద్వారా. అర్థమవుతుందా విషయం? విద్య ప్రసాదించి అల్లాహ్ త’ఆలా ఈ విద్య ద్వారా మానవునికి గౌరవం అనేది ప్రసాదించాడు. ఇలాంటి అల్లాహ్ స్వయంగా ప్రసాదించిన ఈ విద్యను ఈరోజు మనం తిరస్కరిస్తున్నాము అంటే, అనేక మంది అనేక మన ప్రజలు, మన ముస్లిం సోదరులు ప్రత్యేకంగా, సోదరులారా, ఇది మనకు మనం ఎంత నష్టంలో పోతున్నామో చాలా గంభీరంగా ఆలోచించవలసిన విషయం.

ఇంకా చెప్పుకుంటూ పోతే విద్య నేర్చుకోవడంలో ఉన్న ఘనతలు, లాభాలు నేర్చుకుంటే ఏం లాభాలు, అవన్నీ మరో పెద్ద టాపిక్ అవుతుంది. కానీ అవన్నీ విషయాలు చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు. కానీ ఒకే విషయం చెప్తాను, కొంచెం శ్రద్ధ వహించే ప్రయత్నం చేయండి.

ఇస్లాం ధర్మం చాలా సులభమైనది. మానవుల కొరకు అనుకూలమైనది. అల్లాహ్ ఇస్లాంకు సంబంధించిన ఏ ఆదేశం మనకు ఇచ్చినా, అందులో మన కొరకు ఇహ-పరలోకాల మేలే మేలు ఉన్నది తప్ప నష్టం లేదు. అయితే, ప్రపంచంలో ఏ ఉద్యోగం పొందడానికైనా, ఏ మీరు పని నేర్చుకున్నా, ఏ విద్య నేర్చుకున్నా, కొన్ని సంవత్సరాలు కష్టపడి ఆ పని, ఆ విద్య నేర్చుకున్న తర్వాత కొద్ది రోజులకు, కొన్ని సంవత్సరాలకు దాని ఫలితం మీకు ముందుకు వస్తుంది. అవునా లేదా? ఇప్పుడు ఈయన కంప్యూటర్ మీద పని చేస్తున్నారు, ఈయన వెళ్లి ఏదో ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు, అన్నయ్య గారు ఏదో ఆ పెయింటింగ్ విషయంలో పని చేస్తున్నారు, ఆ పనులు, మెకానిక్ లైన్ పనులు గాని, నేర్చుకోవడానికి కొంత కాలం పడుతుందా లేదా? ఆ నేర్చుకునే సమయం ఏదైతే ఉందో, ఆ నేర్చుకునేటప్పుడే దాని యొక్క ఫలితం మనకు తొందరగా కనబడుతుందా? కనబడదు. కనబడకుండా గానీ, ఉంటుందా అంత తొందరగా ఫలితం? ఉండదు. కానీ ధర్మ విద్య, ఇల్మె దీన్ దీని గురించి ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి.

ధర్మానికి సంబంధించిన మీరు విద్య నేర్చుకున్నప్పుడు, నేర్చుకొని ఏ విషయం ఎట్లా ఆచరించాలి అని ఆచరించినప్పుడు ఏదైతే మీకు పుణ్యం దొరుకుతుందో, అది తర్వాత దొరుకుతుంది. కానీ ఈ విద్య నేర్చుకునేటప్పుడు కూడా మీకు పుణ్యం దొరుకుతుంది. ఇప్పుడు ఉదాహరణకు, ఉదాహరణకు అన్నయ్య దగ్గర అనుకోండి ఒక లక్ష రూపాయలు ఉన్నాయి. దాంతో జకాత్ ఇవ్వడం విధి ఉందా లేదా? ఉంది. అరే జకాత్ విషయం నేను నేర్చుకోవాలి, జకాత్ నాపై విధి ఉంది అని అన్నయ్య ఇప్పుడు జకాత్ గురించి నేర్చుకోవడం మొదలుపెట్టాడు. జకాత్ ఇచ్చినప్పుడు జకాత్ ఇచ్చిన పుణ్యం దొరుకుద్ది కదా? కానీ జకాత్ కు సంబంధించిన జ్ఞానం ఏదైతే నేర్చుకుంటున్నారో అప్పుడు కూడా అల్లాహ్ అతనికి ఆ పుణ్యం ప్రసాదిస్తూ ఉన్నాడు. ఏ పుణ్యం? ఆ ఇల్మ్ నేర్చుకునే, ఆ విద్య ఏదైతే నేర్చుకుంటున్నారో, ఆ నేర్చుకునే యొక్క పుణ్యం. అంటే మనం నేర్చుకోవడానికి ఏ సమయం అయితే ఉపయోగిస్తున్నామో, వెచ్చిస్తున్నామో, అది కూడా మనకు వృధా పోతలేదు. అది కూడా మనకు లాభకరంగా ఉంది.

అందుగురించే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు? ఒక మహదీసులో,

مَنْ قَرَأَ حَرْفًا مِنْ كِتَابِ اللَّهِ فَلَهُ بِهِ حَسَنَةٌ، وَالْحَسَنَةُ بِعَشْرِ أَمْثَالِهَا
(మన్ ఖర’అ హర్ఫమ్ మిన్ కితాబిల్లాహి ఫలహు బిహి హసనతున్, వల్ హసనతు బి అష్రి అమ్సాలిహా)
ఎవరైతే అల్లాహ్ గ్రంథంలోని ఒక్క అక్షరాన్ని పఠిస్తారో, అతనికి ఒక పుణ్యం లభిస్తుంది, మరియు ఆ పుణ్యం పదింతలు చేయబడుతుంది.

ఎవరైతే ఖురాన్ గ్రంథంలోని ఒక్క అక్షరం చదువుతారో, అతనికి ఎన్ని పుణ్యాలు? ఒక్క అక్షరం పై పది పుణ్యాలు. ఇంకా ఎవరికైనా అర్థం చేసుకోవడంలో కన్ఫ్యూజ్ కావొద్దు అని ప్రవక్త ఇంకా ఒక ఉదాహరణ ఇచ్చి చెప్పారు. సూర బఖరా స్టార్టింగ్ లో ఏముంది?

الٓمٓ
(అలిఫ్ లామ్ మీమ్)
(2:1)

ఇన్ని లా అఖూలు అలిఫ్ లామ్ మీమ్ హర్ఫున్, అలిఫ్ లామ్ మీమ్ ఇది మొత్తం ఒక అక్షరం కాదు. అలిఫున్ హర్ఫున్, వ లామున్ హర్ఫున్, వ మీమున్ హర్ఫున్. అలిఫ్ ఒక అక్షరం, లామ్ ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం. అలిఫ్ లామ్ మీమ్ అని మనం చదివితే ఎన్ని పుణ్యాలు దొరుకుతాయి ఇన్షా అల్లాహ్? 30 పుణ్యాలు దొరుకుతాయి. ఆ తర్వాత,

ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ ۛ هُدًى لِّلْمُتَّقِينَ
(దాలికల్ కితాబు లా రైబ ఫీహి, హుదల్లిల్ ముత్తఖీన్)
ఇది అల్లాహ్ గ్రంథం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది దైవభీతి పరులకు మార్గదర్శకత్వం చూపుతుంది. (2:2)

الَّذِينَ يُؤْمِنُونَ بِالْغَيْبِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ
(అల్లదీన యు’మినూన బిల్ గైబి వ యుఖీమూనస్సలాత వ మిమ్మా రజఖ్నాహుమ్ యున్ఫిఖూన్)
వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు. నమాజును స్థాపిస్తారు. మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చు చేస్తారు. (2:3)

సలాత్, నమాజ్. నమాజ్ చేసినప్పుడు నమాజ్ పుణ్యం దొరుకుతుంది. కానీ నమాజ్ ఎలా చేయాలి? ఏయే నమాజులు విధిగా ఉన్నాయి? నమాజు ఏయే నమాజులు సున్నతులు ఉన్నాయి, నఫీల్లు ఉన్నాయి? నమాజ్ యొక్క కంప్లీట్ పద్ధతి ఏంటిది? నమాజ్ లో ఏమేం చదవాలి? ఇవన్నీ నేర్చుకోవటానికి మనం ఏ సమయం అయితే వెచ్చిస్తామో, అవి నేర్చుకునేటప్పుడు కూడా మనకు పుణ్యం లభిస్తూనే ఉంటుంది. అందుగురించి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక్క హదీస్ వినండి, చాలా శ్రద్ధగా వినండి.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు,

مَا اجْتَمَعَ قَوْمٌ فِي بَيْتٍ مِنْ بُيُوتِ اللَّهِ
(మా ఇజ్తమ’అ ఖవ్మున్ ఫీ బైతిమ్ మిన్ బుయూతిల్లాహ్)
అల్లాహ్ యొక్క గృహాలలో ఒక గృహంలో ఎప్పుడైతే ఒక సమూహం సమావేశమవుతుందో,

అల్లాహ్ యొక్క గృహాల్లో నుండి ఏదైనా ఒక గృహంలో కొందరు సమూహమై ఒకచోట వారు జమా అయి,

يَتْلُونَ كِتَابَ اللَّهِ وَيَتَدَارَسُونَهُ بَيْنَهُمْ
(యత్ లూన కితాబల్లాహి వ యతదారసూనహు బైనహుమ్)
వారు అల్లాహ్ గ్రంథాన్ని పఠిస్తూ, దానిని తమలో తాము బోధించుకుంటూ ఉంటారో,

అల్లాహ్ యొక్క గ్రంథాన్ని చదువుతారు, పరస్పరం దాని విద్య ఒకరికి ఒకరు చెప్పుకుంటారు, దానిని పాఠాలు ఒకరికి ఒకరు చెప్పుకుంటారు, ఏమవుతుంది?

إِلَّا نَزَلَتْ عَلَيْهِمُ السَّكِينَةُ
(ఇల్లా నజలత్ అలైహిముస్సకీనహ్)
వారిపై ప్రశాంతత అవతరించకుండా ఉండదు,

వారిపై ఒక శాంతి, ఒక తృప్తి, ఒక నెమ్మది, నిదానం అల్లాహ్ వైపు నుండి అవతరిస్తుంది.

وَغَشِيَتْهُمُ الرَّحْمَةُ
(వ గషియతుహుముర్రహ్మహ్)
వారిని కారుణ్యం ఆవరిస్తుంది,

అల్లాహ్ యొక్క కారుణ్యం అనేది వారిని చుట్టుకుంటుంది.

وَحَفَّتْهُمُ الْمَلَائِكَةُ
(వ హఫ్ఫత్ హుముల్ మలా’ఇకహ్)
దేవదూతలు వారిని చుట్టుముడతారు,

దేవదూతలు ఆ సమావేశంలో పాల్గొంటారు. ఎన్ని లాభాలని? మూడు కదా? సుకూనత్, రహ్మత్ మరియు దేవదూతలు.

وَذَكَرَهُمُ اللَّهُ فِيمَنْ عِنْدَهُ
(వ దకరహుముల్లాహు ఫీమన్ ఇందహ్)
మరియు అల్లాహ్ తన వద్ద ఉన్నవారి ముందు వారిని ప్రస్తావిస్తాడు.

అల్లాహ్ వద్ద అతి చేరువుగా ఏ దూతలైతే, ఏ గొప్ప సృష్టి అయితే ఉందో, వారి ముందు అల్లాహ్ త’ఆలా వీరిని ప్రశంసిస్తూ ఉంటాడు. ఇంతటి గొప్ప విషయమో, ఇన్ని లాభాలు మనకు ఉన్నాయో చూడండి. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరో హదీస్ లో చెప్పారు,

مَنْ سَلَكَ طَرِيقًا يَلْتَمِسُ فِيهِ عِلْمًا
(మన్ సలక తరీఖన్ యల్తమిసు ఫీహి ఇల్మన్)
ఎవరైతే విద్యాన్వేషణకై ఒక మార్గంలో పయనిస్తారో,

ఎవరైతే ఇల్మ్, విద్య నేర్చుకోవడానికి, అభ్యసించడానికి ఒక దారిలో నడుస్తారో,

سَهَّلَ اللَّهُ لَهُ بِهِ طَرِيقًا إِلَى الْجَنَّةِ
(సహ్హలల్లాహు లహు బిహి తరీఖన్ ఇలల్ జన్నహ్)
అల్లాహ్ దాని ద్వారా అతని కోసం స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని సులభతరం చేస్తాడు.

ఆ దారిని అల్లాహ్ త’ఆలా అతని గురించి స్వర్గం వైపునకు సుగమం చేస్తాడు, సులభం చేస్తాడు. మరో హదీస్ లో చెప్పారు, ఎవరైనా విద్య నేర్చుకోవడానికి ఒక దారి మీద వెళ్తూ ఉంటే దేవదూతలు వారి గురించి తమ రెక్కలను చాచుతారు. అంతేకాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వ సృష్టి, ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి, ప్రతి సృష్టి అతని గురించి, ఓ అల్లాహ్ ఇతన్ని క్షమించండి, ఓ అల్లాహ్ ఇతని మీద కరుణించండి, ఓ అల్లాహ్ ఇతని మీద నీ దయ చూపండి, అని దుఆ చేస్తూ ఉంటారు. పక్షులు గాని, చీమలు గాని, చేపలు గాని, ప్రతి సృష్టి. ఎందుకు?

رِضًا لِمَا يَصْنَعُ طَالِبُ الْعِلْمِ
(రిదల్ లిమా యస్న’ఉ తాలిబుల్ ఇల్మ్)
విద్యాన్వేషి చేసే పని పట్ల సంతృప్తితో.

ఈ తాలిబుల్ ఇల్మ్, ఈ ధర్మ విద్య అభ్యసించే ఈ వ్యక్తి ఏ మంచి ఉద్దేశంతో ఈ ధర్మ విద్య నేర్చుకుంటున్నాడో, దానికి సంతోషపడి. అందుగురించి సోదరులారా, చెప్పాలంటే ఇంకా ఘనతలు ఉన్నాయి, కానీ ഇന്നటితో ఇంతటి విషయాలపై మనం శ్రద్ధ వహించి, ఇంకా మనం మన సోదరులకు, మన మిత్రులకు, మన దగ్గరి బంధువులకు అందరికీ ఈ ఘనతలు తెలిపి, వారందరినీ కూడా ఇలాంటి సమావేశాల్లో పాల్గొనడానికి మనం ప్రయత్నం చేద్దాము. ఇందులో కూడా మనకు ఎంతో గొప్ప పుణ్యం, ఫలితం, అజర్, సవాబ్ ఉంది.

جَزَاكُمُ اللَّهُ خَيْرًا وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ
(జజాకుముల్లాహు ఖైరన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్)
అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చుగాక. మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ఇతరములు:

భార్య భర్తల పరస్పర హక్కులు [వీడియో]

వ్యవధి: 40 నిముషాలు 

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

తౌహీద్‌ ఘనత, అది పాపాల విమోచనానికి ఉత్తమ సాధనం – ఇమామ్ అస్-సాదీ| ఏకత్వపు బాటకు సత్యమైన మాట [వీడియో]

2వ అధ్యాయం
తౌహీద్‌ ఘనత, అది పాపాల విమోచనానికి ఉత్తమ సాధనం
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.

యూట్యూబ్ ప్లే లిస్ట్ (ఏకత్వపు బాటకు సత్యమైన మాట)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0VrU7pg90uGfghChg9Bptl


అల్లాహ్ ఆదేశం:

الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُم بِظُلْمٍ أُولَٰئِكَ لَهُمُ الْأَمْنُ وَهُم مُّهْتَدُونَ

“ఎవరయితే విశ్వసించి, తమ విశ్వాసాన్ని “జుల్మ్‌” (షిర్క్‌) తో కలుషితం చేయలేదో, వారికే శాంతి ఉంది. వారు మాత్రమే రుజుమార్గంపై ఉన్నవారు.”(అన్‌ ఆమ్‌ 6 : 82).

ఉబాద బిన్‌ సామిత్‌ (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:

“(1) అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడని, ఆయన ఒక్కడేనని, 2) ఆయనకు మరెవ్వరూ సాటిలేరని మరియు ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన దాసుడు, ప్రవక్త అని; (3) అలాగే ఈసా (అలైహిస్సలాం) కూడా అల్లాహ్ దాసుడు, ఆయన ప్రవక్త అని, కాకపోతే ఆయన హజ్రత్‌ మర్యం (గర్భం)లో అవతరించిన అల్లాహ్ వాక్కు, అల్లాహ్ యొక్క ఆత్మ అని; (4,5) స్వర్గ నరకాలు ఉన్నాయి అన్నది యదార్ధమని, ఎవడైతే సాక్ష్యమిస్తాడో ఆ వ్యక్తి కర్మలు ఎలాంటివయినా సరే అల్లాహ్ అతడ్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు”. (బుఖారి, ముస్లిం).

ఇత్బాన్ (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలాసెలవిచ్చారు:

“అల్లాహ్ సంతృప్తి కొరకు “లాఇలాహ ఇల్లల్లాహ్” చదివే వారిపై అల్లాహ్ నరకం నిషేధించాడు”. (బుఖారి, ముస్లిం).

అబూ సఈద్‌ ఖుద్రీ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారని:

ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ తో  ఇలా విన్నవించుకున్నారు: ‘ఓ అల్లాహ్!  నాకు కొన్ని వచనాలు నేర్పు. వాటితో నేను నిన్ను స్మరిస్తాను. నీతో అర్ధిస్తాను”. “ఓ మూసా! “లాఇలాహ ఇల్లల్లాహ్” పలుకు” అని అల్లాహ్ నేర్పాడు. మూసా (అలైహిస్సలాం) అన్నారు: “అల్లాహ్! నీ దాసులందరూ ఇదే వచనముతో స్మరిస్తారు?” “ఓ మూసా! ఏడు ఆకాశాలు, నేను తప్ప అందులో ఉన్న సృష్టి, ఇంకా ఏడు భూములను త్రాసు యొక్క ఒక పళ్లెంలో, “లాఇలాహ ఇల్లల్లాహ్” ను ఇంకొక పళ్లెంలో ఉంచితే “లాఇలాహ ఇల్లల్లాహ్” ఉన్న పళ్లెం క్రిందికి వంగిపోవును” అని అల్లాహ్ (దాని విలువను) తెలిపాడు.

(ఇబ్ను హిబ్బాన్‌ మరియు హాకిం సేకరించారు. హాకిం నిజపరిచారు).

అల్లాహ్ ఇలా సెలవిచ్చారని  ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా నేను విన్నాను అని అనస్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“ఓ మానవుడా! నీవు భూమి నిండా పాపాలు చేసినప్పటికీ నాతో మరెవ్వరినీ సాటి కల్పించకుండా (చనిపోయి) నాతో కలిసినప్పుడు, ‘నేను అంతే (భూమి నిండా) క్షమాపణలతో నీతో కలుస్తాను (నిన్ను క్షమిస్తాను).(తిర్మిజి. ఈ హదీసు హసన్‌).

ముఖ్యాంశాలు:

1.  అల్లాహ్ దయ, కరుణ చాలా విశాలమైనది.

2. తౌహీద్‌ యొక్క పుణ్యం అల్లాహ్ వద్ద చాలా ఎక్కువగా ఉంది.

3. దానితో పాటు అది పాపాలను తుడిచి వేయును.

4. సూరయే అన్‌ఆమ్‌ లోని ఆయతులో “జుల్మ్‌” అంటే షిర్క్‌ అని భావం.

5. ఉబాద బిన్‌ సామిత్‌ (రది అల్లాహు అన్హు) హదీసులో ఉన్న ఐదు విషయాల్ని గమనించండి.

6. ఉబాద హదీసు, ఇత్బాన్ హదీసు మరియు అబూ సఈద్‌ ఖుద్రీ (రది అల్లాహు అన్హుమ్) హదీసులను కలిపితే “లాఇలాహ ఇల్లల్లాహ్ ” యొక్క అసలు అర్ధం నీకు తెలుస్తుంది. మరియు దాని సరియైన భావాన్ని తెలుసు కొనక మోసబోయి తప్పులో పడియున్నవారి విషయం కూడా స్పష్టం అవుతుంది.

7. ఇత్బాన్ హదీసులో ఉన్న షరతు (అల్లాహ్ ఇష్టం కొరకు)పై చాలా శ్రద్ధ వహించాలి.

8. “లాఇలాహ ఇల్లల్లాహ్” ఘనత తెలుసుకునే అవసరం ప్రవక్తలకు సయితం ఉండేది.

9. “లాఇలాహ ఇల్లల్లాహ్” సర్వ సృష్టికన్నా ఎక్కువ బరువుగలదైనప్పటికీ, దాన్ని చదివేవారిలో చాలా మంది యొక్క త్రాసు తేలికగా (విలువలేనిదిగా) ఉండును.

10. ఆకాశాలు ఏడు ఉన్నట్లు భూములు కూడా ఏడు ఉన్నవని రుజువయింది.

11. అందులో కూడా నివసించువారున్నారు. (జీవించువారున్నారు).

12. అల్లాహ్ యొక్క అన్ని గుణగణాలను నమ్మాలని రుజువవుతుంది. కాని “అష్‌ ఆరీయ్యా” అను ఒక వర్గం వారు కొన్ని గుణగణాలను తిరస్కరిస్తారు.

13. అనస్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసును నీవు అర్థం చేసుకుంటే, ఇత్బాన్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు: “అల్లాహ్ సంతృప్తి కొరకు “లాఇలాహ ఇల్లల్లాహ్ ” చదివే వారిపై అల్లాహ్ నరకం నిషేధించాడు” లో అది కేవలం నోటితో చదవటం కాదు షిర్కు వదులుకోవాలి అని కూడా అర్ధం చేసుకుంటావు.

14. ఉబాద (రది అల్లాహు అన్హు) హదీసులో ఈసా (అలైహిస్సలాం) మరియు ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇద్దరిని “అల్లాహ్ దాసులు, ప్రవక్తలు” అని చెప్పబడింది.

15. ప్రతీది అల్లాహ్ ఆజ్ఞ తోనే పుడుతుంది గనుక అది అల్లాహ్ వాక్కు. కాని ఇక్కడ ప్రత్యేకంగా ఈసా (అలైహిస్సలాం) ను అల్లాహ్ వాక్కు అని చెప్పబడింది .

16. (ఆత్మ అల్లాహ్ యొక్క సృష్టి అయినప్పటికీ) ప్రత్యేకంగా ఈసా (అలైహిస్సలాం) అల్లాహ్ యొక్క ఆత్మ అని చెప్పబడింది.

17. స్వర్గ నరకాలను విశ్వసించు ఘనత కూడా తెలిసింది.

18. ఉబాద హదీసులో “కర్మలు ఏలాంటివైనా సరే” అన్నదానితో (అతడు ఏక దైవోపాసకుడు అయి ఉండుట తప్పనిసరి అనే) భావం తెలుస్తుంది.

19. (ప్రళయదినాన కర్మలు తూకము చేయబడే) త్రాసుకు రెండు పళ్ళాలుండును అని తెలిసింది.

20. ఇత్బాన్ హదీసులో అల్లాహ్ కు “వజ్‌హ్” ఉంది అని వచ్చింది. దాని అర్ధం  “ముఖం” (Face).

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

తౌహీద్ మానవులందరిపై విధిగా ఉన్నదని మొదటి అధ్యాయంలో తెలుపబడింది. ఇందులో దాని ఘనత, ఔన్నత్యం, దాని మంచి ప్రభావాన్ని మరియు దాని సత్ఫలితాన్ని తెలుపడం జరిగింది. తౌహీద్ లో ఉన్నటువంటి వివిధ ఘనతలు, మంచి ప్రభావాలు మరే దానిలో లేవు. ఇహపరాల మేళ్లు అన్నియూ తౌహీద్‌ ఫలితము, దాని ఘనత తోనే లభించును. పాపాల మన్నింపు, వాటి విమోచనం కూడా తౌహీద్‌ ఘనత వలనే. దానికి ఆధారం కూడా పైన తెలుపబడింది. (దాని అనేక ఘనతల్లో కొన్ని క్రింద చూడండి).

1. ఇహపరాల కష్టాలు, విపత్తులు దూరమగుటకు ఇది గొప్ప కారణం.

2.తౌహీద్‌ హృదయంలో ఆవగింజంత ఉన్నా, అది నరకాగ్నిలో శాశ్వతంగా ఉండకుండా కాపాడుతుంది.

3. అది సంపూర్ణంగా ఉంటే నరక ప్రవేశం నుండే కాపాడుతుంది.

4. తౌహీద్ గల వ్యక్తికి ఇహపర లోకాల్లో సంపూర్ణ సన్మార్గం, పూర్తి శాంతి ప్రాప్తి యగును.

5. అల్లాహ్ సంతృప్తి, దాని సత్ఫలితం పొందుటకు అది ఏకైక కారణం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసుకు అర్హుడయ్యే అదృష్టవంతుడు “లాఇలాహ ఇల్లల్లాహ్” నిర్మలమైన మనుస్సుతో చదివేవాడు.

6. బాహ్య, ఆంతర్య, సర్వ మాటల, కర్మల అంగీకారం, వాటి సంపూర్ణత, వాటి సత్ఫలితం తౌహీద్‌ పై ఆధారపడియుంది. తౌహీద్‌ లో ఎంత బలం, స్వచ్ఛత ఉంటే, అంతగా ఆ విషయాలు సంపూర్ణం అవుతాయి.

7.సత్కార్యాలు చేయడం, దుష్కార్యాల నుండి దూరముండడం తౌహీద్‌ మూలంగా సులభమగును. బాధ కలిగినప్పుడు తృప్తి లభించును. తౌహీద్‌, విశ్వాసంలో అల్లాహ్ కొరకు స్వచ్ఛత చూపేవాడు సత్కార్యాలపై సత్ఫలితం, అల్లాహ్ ప్రసన్నతను ఆశిస్తాడు. కనుక అవి అతనికి చాలా తేలికగా ఏర్పడుతాయి. దుష్కార్యాలపై ఉన్న శిక్షతో భయపడుతాడు కనుక అవి వదలుకోవడం కూడా అతనికిచాలా తేలికగా ఉంటుంది.

8.హృదయాంతరంలో తౌహీద్‌ సంపూర్ణమయితే అల్లాహ్ వారికి విశ్వాసం పట్ల ప్రేమను కలుగజేస్తాడు, దాన్ని మనోరంజకమైనదిగా చేస్తాడు.అవిశ్వాసం, దుర్మార్గం, అవిధేయతల పట్ల అసహ్యం కలిగేలా చేస్తాడు. అతన్ని సన్మార్గం పొందువారిలో చేర్చుతాడు.

9.ఏ దాసునిలో తౌహీద్‌, విశ్వాసం సంపూర్ణంగా ఉంటుందో అతడు అసహ్యమైన సంఘటనలను, కష్ట బాధలను ఎంతో విశాలమైన, సంతృప్తికరమైన మనుస్సుతో సహిస్తాడు. అల్లాహ్ వ్రాసి ఉంచిన అదృష్టంపై సంతోషంగా ఉంటాడు.

10) ఇంకా దాని ఘనత: అది మానవ దాస్యం నుంచి అతన్ని విముక్తి కలిగిస్తుంది. అతడు అల్లాహ్ తప్ప ఇతరుల పై ఆధారపడి, వారితో భయపడుతూ ఉండడు. వారి దయదాక్షిణ్యాల వైపు కన్నెత్తి చూడడు. అతడు చేసేది వారి కొరకూ కాదు. వాస్తవానికి ఇదే నిజమైన పరువు ప్రతిష్ట, మాన్యత. దీనితో పాటు అతడు అల్లాహ్ నే ఆరాధిస్తాడు. ఆయనకు తప్ప మరెవ్వరికి భయపడడు. మరెవ్వరితో కరుణను ఆశించడు. ఇలా అతడు సంపూర్ణ సాఫల్యం పొందుతాడు.

11. తౌహీద్‌ తప్ప ఇంకే దానికీ లభించని ఘనత: అతని మనసులో తౌహీద్‌, ఇఖ్లాసు తో కూడుకొని సంపూర్ణం అయితే, అతని చిన్న కర్మ కూడా అసంఖ్యాక ఫలితాన్ని పొందుతుంది. అతని మాటల, చేష్టల ఫలితం లెక్క లేకుండా పెరుగుతుంది. అబూ సయీద్ (రది అల్లాహు అన్హు) హదీసులో వచ్చిన ప్రకారం “ఇఖ్లాసుతో కూడుకున్న అతని ఆ సద్వచనం (లాఇలాహ ఇల్లల్లాహ్) భూమ్యాకాశాలు, (అల్లాహ్ తప్ప) అందులో ఉన్న సర్వం కన్నా బరువుగా ఉంటుంది”. ఇలాంటి విషయమే “హదీసుల్‌ బితాఖ” అన్న పేరుతో ప్రసిద్ది చెందిన హదీసులో కూడా ఉంది: “లాఇలాహ ఇల్లల్లాహ్” వ్రాసి ఉన్న చిన్న ముక్క తొంభై తొమ్మిది రిజిస్టర్ల (Records) కంటే ఎక్కువ బరువు గలదై పోతుంది. అందులో ప్రతీ ఒక్క రిజిస్టర్ దాని పొడవు, మనిషి దృష్టి ఎంత దూరము చేరుకుంటుందో అంత దూరముంటుంది. మరో  వైపు కొందరుంటారు; తౌహీద్‌, ఇఖ్లాసు మనసులో సంపూర్ణం లేనివారు. వారికి ఈ స్థానం, ఘనత ప్రాప్తి కాదు.

12) ఇహపరాల్లో తౌహీద్‌ వారలకు అల్లాహ్ విజయం, సహాయం, గౌరవం నొసంగుతాడు. సన్మార్గం ప్రసాదిస్తాడు. మంచి పనులు చేయుటకు సౌకర్యం కలుగజేస్తాడు. మాటలను, చేష్టలను సంస్కరించుకునే భాగ్యం ప్రసాదిస్తాడు.

13) విశ్వాసులైన  తౌహీద్‌ వారల నుండి ఇహపరాల బాధలను దూరము చేసి, శాంతి, సుఖ ప్రదమైన జీవితం అనుగ్రహిస్తాడు. దీని ఉదాహరణలు, సాక్ష్యాలు ఖుర్‌ ఆన్‌, హదీసులో చాలా ఉన్నవి.


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]  

సహాబాలు – వారి గొప్పతనం, వారి గురించి మనకు ఉండ వలసిన అఖీదా (విశ్వాసము) [ఆడియో & టెక్స్ట్]

సహాబా : ‘సహాబీ‘కి బహువచనం ‘సహాబా‘. విశ్వాస (ఈమాన్‌) స్థితిలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను కలుసుకుని, విశ్వాసస్థితిలో తనువు చాలించిన వారంతా సహాబా (సహచరులు- రది అల్లాహు అన్హుమ్) అనబడతారు.

వారు ముస్లిం సమాజంలో అందరికన్నా శ్రేష్టులని, ఇస్లాం వైపు ముందంజవేసిన వారని, ప్రవక్త సహచర్య భాగ్యం పొందినవారని, ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)తో కలిసి జిహాద్‌ చేసినవారని, షరీయత్‌ బరువు బాధ్యతలను మోయటమే గాకుండా దానిని తమ తరువాతి తరాల వారికి అందించిన ధన్యజీవులని, ఈ కారణంగా వారు ప్రపంచంలోనే అత్యుత్తమ సమూహం అని మనం విశ్వసించటం తప్పనిసరి (వాజిబ్‌). – [నుండి: సహాబా అంటే ఎవరు? వారి గురించి ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలి? – డా. సాలెహ్ అల్ ఫౌజాన్]


వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

భాగం 01: సహాబా అంటే ఎవరు? (2:06నిముషాలు)

భాగం 02: సహాబా యొక్క ప్రాముఖ్యత  (1:11నిముషాలు)

భాగం 03: ఇస్లాంలో సహాబాల గొప్పతనం (1:43నిముషాలు)

భాగం 04: తౌరాతు మరియు ఇంజీలు గ్రంధాలలో సహాబాల ప్రస్థావన (3:28నిముషాలు)

భాగం 05: సహాబాల గురించి ప్రవక్త గారు ఏమి చెప్పారు? (1:48 నిముషాలు)

భాగం 06: మన మీద సహాబాల హక్కులు ఏమిటి? (2:05 నిముషాలు)

భాగం 07: సహాబాల గురించి ఖురాన్ ఏమి చెబుతుంది? (0:49నిముషాలు)

భాగం 08: సహాబాల స్వర్ణయుగపు రోజులు (1:31నిముషాలు)

భాగం 09: సలఫ్ సాలిహీన్ దృష్టిలో సహాబాల గొప్పతనం (3:21 నిముషాలు)

భాగం 10: సహాబాలను ప్రేమించడం విశ్వాసంలో ఒక భాగం (2:04నిముషాలు)

భాగం 11: ఇమాం అహ్మద్ సహాబాల గురుంచి ఏమి చెప్పారు? (1:09నిముషాలు)

పూర్తి ఆడియో క్రింద వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి 

సహాబా : పూర్తి ఆడియో (21:21నిముషాలు)

ఈ ప్రసంగంలో, సహాబాల (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు) యొక్క నిర్వచనం, వారి ఉన్నత స్థానం మరియు ప్రాముఖ్యత వివరించబడింది. వారి జీవిత చరిత్రను తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమో హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనతో స్పష్టం చేయబడింది. సహాబాల యొక్క సద్గుణాలను మరియు వారి పట్ల అల్లాహ్ యొక్క ప్రసన్నతను సూరతుల్ ఫతహ్ వంటి ఖుర్ఆన్ ఆయతుల ద్వారా వివరించారు. సహాబాలను దూషించడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రంగా ఖండించిన హదీసులు, వారి పట్ల విశ్వాసులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు మరియు వారి మధ్య ఉన్న వివిధ స్థాయిల గురించి చర్చించబడింది. సలఫె సాలెహీన్ (పూర్వపు సత్పురుషులు) సహాబాలను ఎలా గౌరవించేవారో అబ్దుల్లా బిన్ ఉమర్ మరియు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ వంటి వారి ఉదాహరణలతో వివరించబడింది. సహాబాలను దూషించే వారి పట్ల ఇమామ్ అహ్మద్ వంటి ఇస్లామీయ పండితుల కఠినమైన వైఖరిని కూడా ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.

సోదర సోదరీమణులారా, సహాబీ ఇది ఏకవచనం, సహాబా ఇది బహువచనం. సహాబియా ఇది ఏకవచనం, స్త్రీలను అంటారు. సహాబియాత్ ఇది బహువచనం, స్త్రీలను అంటారు. ఏ స్త్రీలు? ఏ పురుషులు? సహాబీ అంటే ఎవరైతే విశ్వాస స్థితిలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి, కలిసి, విశ్వాస స్థితిలోనే చనిపోయారో వారిని సహాబీ అంటారు. ఇక ఒక్కరు పురుషులైతే సహాబీ, ఇద్దరు పురుషులైతే సహాబియాన్, అంతకంటే ఎక్కువ వారిని సహాబా లేదా అస్హాబు ముహమ్మద్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మిత్రులు అని అనబడుతుంది. ఒక స్త్రీ అయ్యేది ఉంటే, ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లం వారిని చూసి, ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లం వారిపై విశ్వసించి, విశ్వాస స్థితిలో చనిపోయిన స్త్రీ సహాబియా, సహాబియతాన్, సహాబియాత్.

అయితే సోదర సోదరీమణులారా, వారి జీవిత గాథ తెలుసుకోవడం, వారి జీవిత విషయాలు తెలుసుకోవడం ఎందుకు ముఖ్యము అన్నటువంటి ఒక ప్రశ్న మీరు అడగవచ్చు. అయితే సమాధానం చాలా శ్రద్ధగా వినండి. ఈ సమాధానం నేను నా ఇష్టంతో, నేను నా ఆలోచనతో చెప్పేది కాదు. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మిత్రులలో, సహాబాలలో ఒక గొప్ప సహాబీ. ఆయన తెలుపుతున్నారు. ఏమన్నారు ఆయన?

“అల్లాహు తాలా మానవుల హృదయాల పట్ల దృష్టి వేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదయాన్ని అందరి హృదయాల కంటే ఎంతో ఉత్తమంగా చూశాడు. ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆ తర్వాత, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రజల హృదయాలను వెతికాడు, చూశాడు. సహాబాల హృదయాలను ఎంతో పరిశుద్ధంగా పొందాడు. అల్లాహ్ ఆ సహాబాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్నేహితులుగా, అండదండగా, వారికి వారి ఈ ప్రచార కార్యక్రమంలో దోహదపడేవారుగా ఎన్నుకున్నాడు

ఈ సహాబాలు ఎంత గొప్పవారు, ఎంత గొప్ప శ్రేణికి చెందినవారు. అల్లాహు తాలా స్వయంగా ప్రళయ దినం వరకు సురక్షితంగా ఉండేటటువంటి సత్య గ్రంథం, దివ్య గ్రంథం ఖుర్ఆన్ లో వంద కంటే పైగా ఆయతులలో వారిని ప్రశంసించాడు. వారి యొక్క ఉన్నత గుణాలను ప్రస్తావించాడు. వారి యొక్క ఎన్నో మంచి విషయాలను ప్రళయం వరకు వచ్చే ప్రజలందరి కొరకు ఒక మంచి ఆదర్శంగా ఉంటాయని కూడా తెలిపాడు.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన ఈ సహాబాలు, వారిని విశ్వసించడం మన విశ్వాసంలోని ఒక ముఖ్యమైన భాగం. మనం అల్లాహ్ ను విశ్వసిస్తున్నాము, అల్లాహ్ యొక్క ప్రవక్తలను, వారిలో ప్రత్యేకంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తాము. ఇంకా విశ్వాసానికి సంబంధించిన ఏ ఏ విషయాలు ఉన్నాయో, వాటిలో ఒక ముఖ్యమైన విషయం సహాబాలను కూడా విశ్వసించడం.

హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు చెప్పిన ఒక విషయాన్ని గమనించండి,

أَبَرُّ هَذِهِ الْأُمَّةِ قُلُوبًا
(అబర్రు హాదిహిల్ ఉమ్మతి ఖులూబా)
సహాబాలు సర్వ విశ్వాసులలో, సర్వ విశ్వాసులలో అతి పరిశుద్ధమైన హృదయాలు గలవారు.

وَأَعْمَقُهَا عِلْمًا
(వ అ’మఖుహా ‘ఇల్మా)
చాలా లోతుగల జ్ఞానం, విద్య గలవారు.

وَأَقَلُّهَا تَكَلُّفًا
(వ అఖల్లుహా తకల్లుఫా)
చాలా తక్కువగా వారు ఏదైనా పని చేయడంలో వారి నుండి కావాలని ఏదీ పొరపాటు జరిగేది కాదు మరియు కావాలని ఎలాంటి బాధలలో చిక్కుకునే ప్రయత్నం చేసేవారు కారు.

وَأَقْوَمُهَا هَدْيًا
(వ అఖ్వముహా హద్యా)
సన్మార్గంపై, సన్మాగంపైన అందరికంటే ఎక్కువగా ఉత్తమంగా నడిచేవారు.

وَأَحْسَنُهَا حَالًا
(వ అహ్సనుహా హాలా)
అందరికంటే ఉత్తమ స్థితిలో జీవితం గడిపేవారు.

اخْتَارَهُمُ اللَّهُ لِصُحْبَةِ نَبِيِّهِ وَلِإِقَامَةِ دِينِهِ
(ఇఖ్తారహుముల్లాహు లిసుహబతి నబియ్యిహి వలి ఇఖామతి దీనిహి)
అల్లాహు తాలా వారిని తన ప్రవక్తకు స్నేహితులుగా ఎన్నుకున్నాడు మరియు తన ఈ ధర్మాన్ని స్థాపించబడటానికి వారిని ఎన్నుకున్నాడు

గమనించారా? అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కాలో ఉండగానే విశ్వసించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ జీవితం గడిపారు. తొలి రోజుల్లో ఇస్లాం స్వీకరించిన సహాబాలను చూశారు. మదీనా వలస వచ్చిన తర్వాత సహాబాలను చూశారు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చివరి దశలో ఇస్లాం స్వీకరించిన వారిని కూడా చూశారు. అయితే గమనించండి, వారు సహాబాల గురించి ఎంత గొప్ప విషయం తెలిపారు.

సూరతుల్ ఫతహ్ లో:

مُّحَمَّدٌ رَّسُولُ اللَّهِ ۚ وَالَّذِينَ مَعَهُ أَشِدَّاءُ عَلَى الْكُفَّارِ رُحَمَاءُ بَيْنَهُمْ ۖ تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ ۚ ذَٰلِكَ مَثَلُهُمْ فِي التَّوْرَاةِ ۚ وَمَثَلُهُمْ فِي الْإِنجِيلِ كَزَرْعٍ أَخْرَجَ شَطْأَهُ فَآزَرَهُ فَاسْتَغْلَظَ فَاسْتَوَىٰ عَلَىٰ سُوقِهِ يُعْجِبُ الزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ الْكُفَّارَ ۗ وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنْهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا

ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ ప్రవక్త. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వెంట ఉన్నవారు అవిశ్వాసులకు కొరుకుడు పడనివారు. ఒండొకరి పట్ల మాత్రం దయార్ద్ర హృదయులు. దైవకృపను, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగపడటాన్ని నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖారవిందాలపై తొణకిస లాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో ఉంది. ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు. (48:29)

గమనించండి, ఈ రోజుల్లో ఎవరైతే సహాబాలను అగౌరవపరుస్తున్నారో, సహాబాలలో ఏ ఒక్కరి ప్రస్తావన వచ్చినా వారి పట్ల అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారో, ఒకసారి ఈ ఖుర్ఆన్ ఆయత్ ల పట్ల శ్రద్ధ వహించాలి. అల్లాహ్ వారిని ప్రశంసిస్తున్నాడు. వారిలో ఉన్నటువంటి ఉత్తమ గుణాలను ప్రస్తావిస్తున్నాడు. వారి యొక్క ఈ ఉత్తమ గుణాలు కేవలం ఖుర్ఆన్ లోనే కాదు, ఖుర్ఆన్ కంటే ముందు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో తౌరాత్ మరియు ఇంజీల్, వాటిలో కూడా వీరి ఉత్తమ గుణాలు ఉన్నాయి అని స్వయంగా అల్లాహ్ సాక్ష్యం పలుకుతున్నాడో, అలాంటి వారిని మనం దూషించడం, అలాంటి వారి గురించి మనం చెడుగా ఆలోచించడం, అలాంటి వారి పట్ల మనం ఏదైనా దుర్భాషలాడటం, ఇది మన విశ్వాసంలో కొరత, మన విశ్వాసానికి చాలా భయంకరమైన ముప్పు కలుగజేస్తుంది.

అల్లాహ్ తాలా వారిని ప్రశంసిస్తూ ఇస్లాం మరియు ఇస్లాం స్వీకరించిన వారి పట్ల ఎంత మృదువుగా, ఎంత ఆప్యాయతతో, కరుణా కటాక్షాలతో వారు జీవితం గడుపుతారంటే, అవిశ్వాసానికి సంబంధించిన విషయాలు మరియు సత్య ధర్మమైన ఇస్లాంకు వ్యతిరేకమున్న విషయాలు వారికి ఏమాత్రం ఇష్టం ఉండవు. నీవు వారిని రుకూ చేస్తూ, సజ్దా చేస్తూ చూస్తూ ఉంటావు. వారు అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని, అల్లాహ్ యొక్క సంతృప్తిని కోరుతూ ఉంటారు. మరియు వారి యొక్క సజ్దా గుర్తులు, చిహ్నాలు వారి ముఖాలపై ఎంతో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమన్నాడో గమనించండి అల్లాహు తాలా,

تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ ۚ ذَٰلِكَ مَثَلُهُمْ فِي التَّوْرَاةِ

ఇదంతా వారి గురించి ప్రస్తావించి, ప్రశంసించి, “వారి ఈ ఉపమానం తౌరాతులో ఉంది.” ఈ ఉదాహరణలు, ఈ పోలికలు, ఈ ఉత్తమ గుణాలు వారి గురించి ఏవైతే ప్రస్తావించబడ్డాయో, ఇవన్నీ కూడా తౌరాతులలో కూడా ఉన్నాయి. అంటే వీరి గుణాలు ఇలా ఉంటాయి, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తారో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాలు ఎవరైతే ఉన్నారో, వారి యొక్క ఈ ఉత్తమ గుణాలు అని తౌరాత్ లో ప్రస్తావన వచ్చి ఉంది. అంతే కాదు, ఇంజీల్ లో ఎలా ఉంది?

وَمَثَلُهُمْ فِي الْإِنجِيلِ كَزَرْعٍ أَخْرَجَ شَطْأَهُ فَآزَرَهُ فَاسْتَغْلَظَ فَاسْتَوَىٰ عَلَىٰ سُوقِهِ يُعْجِبُ الزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ الْكُفَّارَ ۗ وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنْهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا

ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు“.” (48:29)

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో స్పష్టంగా తెలిపారు:

لَا تَسُبُّوا أَصْحَابِي
(లా తసుబ్బూ అస్ హాబీ)
నా సహాబాలను మీరు దూషించకండి.

అంతేకాదు, వారి యొక్క స్థానం ఎంత గొప్పదో అది కూడా ఇదే హదీసులో తెలియబరిచారు. అదేమిటి?

“లవ్ అన్ఫఖ అహదు మిన్కుమ్ మిస్ల ఉహుదిన్ జహబా, మా బలగ ముద్ద అహదిహిమ్ వలా నసీఫహు.”
మీలో ఎవరైనా ఉహద్ పర్వతం ఎంత పెద్దగా ఉందో అంత బంగారం అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసినా, సహాబాలు సామాన్యంగా ఏదైనా విషయం, ఏదైనా వస్తువు, వారు ఒక ముప్పావు కిలో, 600 గ్రాములు, లేదా 300 గ్రాముల వరకు ఏదైతే ఖర్చు పెట్టారో దానికి సమానం కూడా కాజాలదు. అల్లాహు అక్బర్.

గమనించండి సోదరులారా. ఉహద్ పర్వతం ఎంత పెద్దదో తెలుసా? ఇంచుమించు 7 నుండి 8 కిలోమీటర్ల పొడవు, 2 నుండి 3 కిలోమీటర్ల వెడల్పు మరియు 700 మీటర్ల ఎత్తు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీలో ఎవరైనా ఉహద్ పర్వతం అంత బంగారం ఖర్చు పెట్టినా, సహాబాలు ఒక 300 గ్రాముల వరకు లేదా ఒక 600, 650 గ్రాముల వరకు ఏదైనా వస్తువు ఖర్చు పెట్టి ఉంటే, మీ ఈ ఉహద్ పర్వతం లాంటి బంగారం అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం సహాబాలు చేసిన ఈ పుణ్యానికి, దానానికి సమానంగా కాజాలదు. సహాబాల స్థానంలో, మీ స్థానంలో ఇంత పెద్ద గొప్ప వ్యత్యాసం ఉంది. మీరు ఏ నోట వారిని దూషిస్తారు? ఏ నోట వారిని మీరు చెడుగా ప్రస్తావిస్తారు?

మొదటి హక్కు సహాబాల గురించి మనపై ఉన్నది ఏమిటి? అల్లాహు తాలా లేదా చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఏ ఘనతలు తెలిపారో వాటిని నమ్మడం. వారిలో ఎంతో గొప్ప స్థానంలో, వారి స్థానాల్లో హెచ్చుతగ్గులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, మొట్టమొదటి స్థానంలో హజ్రత్ అబూబకర్, రెండవ స్థానంలో హజ్రత్ ఉమర్, మూడవ స్థానంలో హజ్రత్ ఉస్మాన్, నాలుగో స్థానంలో హజ్రత్ అలీ రదియల్లాహు అన్హుమ్ వరద్వు అన్. ఇక ఈ నలుగురి తర్వాత, ఇహలోకంలో ఏ పది మంది గురించైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చారో వారిలో ఈ నలుగురు వస్తారు, మిగిలిన ఆరుగురు, ఆ తర్వాత బద్ర్ లో పాల్గొన్నవారు. కానీ మొట్టమొదటి హక్కు ఏమిటి? ఎవరి గురించి ఏ ఏ ఘనతలు ఖుర్ఆన్ లో లేదా హదీసుల్లో వచ్చి ఉన్నాయో వాటిని మనం నమ్మాలి. వాటిలో ఏ ఒక్కటిని కూడా తిరస్కరించకూడదు.

ఎందుకో తెలుసా? ఉదాహరణకు, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క ఘనతలో ఖుర్ఆన్ లో కొన్ని ఆయతులు అవతరింపజేయబడ్డాయి. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో హదీసుల్లో ఆయన గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. వాటిలో ఏ ఒక్కటినీ కూడా మనం తిరస్కరిస్తే, ఇందులో అబూబకర్ స్థానంలో ఏ కొరత ఏర్పడదు. కానీ మనం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటలు తిరస్కరించిన వారిలో, అల్లాహ్ యొక్క ఆయతులను తిరస్కరించిన వారిలో అయిపోతాము. ఎప్పుడైతే మనం వారికి ఏ స్థానం ఇవ్వబడినదో దానిని మనం విశ్వసిస్తున్నామో, నమ్ముతున్నామో, అక్కడే వారిలోని ఏ ఒక్కరి పట్ల కూడా మన మనసులో ఏ కీడు కానీ, ఏ కపటం గానీ, ఎలాంటి దోషం కానీ ఉండకూడదు. మన హృదయంలో ఎలాంటి కపటము, ద్వేషము, జిగస్సు ఏదీ కూడా ఉండకూడదు. మన హృదయం వారి గురించి ఎంతో తేటతెల్లగా, స్పష్టంగా ఉండాలి. ఎలాంటి కీడు లేకుండా ఉండాలి.

సూరతుల్ అహ్జాబ్, ఆయత్ నంబర్ 58లో అల్లాహు తాలా తెలిపాడు:

وَالَّذِينَ يُؤْذُونَ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ بِغَيْرِ مَا اكْتَسَبُوا فَقَدِ احْتَمَلُوا بُهْتَانًا وَإِثْمًا مُّبِينًا

ఎవరైతే విశ్వాస స్త్రీ పురుషులను వారి ఏ పాపం లేకుండా, ఏ కారణం లేకుండా వారిని బాధ పెడతారో, వారికి హాని కలుగజేస్తారో, వారు చాలా భయంకరమైన పాపాన్ని మరియు ఒక భయంకరమైన అపనిందను, స్పష్టమైన పాపాన్ని తమ మెడకు కట్టుకున్నవారైపోతారు.

అందు గురించి అలాంటి వారు భయపడాలి. ఇక్కడ సామాన్యంగా విశ్వాసుల పదం ఏదైతే వచ్చిందో, ఎవరో విశ్వాసులని అనుకోకండి. విశ్వాసుల్లో మొట్టమొదటి స్థానంలో సహాబాలు వస్తారు అన్న విషయం మరవకండి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? సహీ బుఖారీ, సహీ ముస్లిం ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో ఈ హదీస్ ఉంది:

خَيْرُ النَّاسِ قَرْنِي ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ
(ఖైరున్నాసి ఖర్నీ, సుమ్మల్లజీన యలూనహుమ్, సుమ్మల్లజీన యలూనహుమ్)
అన్ని కాలాల్లో అతి ఉత్తమమైన కాలం నాది, మళ్లీ ఆ తర్వాత వచ్చే కాలం, మళ్లీ ఆ తర్వాత వచ్చే కాలం.

అల్లాహు అక్బర్. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఆ కాలాన్ని అన్ని కాలాల్లో అతి శ్రేష్టమైనదని తెలుపుతున్నారు. ఎందుకు? ఎందుకంటే ప్రజలు తిరస్కరించినప్పుడు ఈ సహాబాలు ఇస్లాంను స్వీకరించారు, విశ్వాస మార్గాన్ని అవలంబించారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వదిలేశారో, చివరికి స్వయంగా వారి కుటుంబంలోని కొందరు, అప్పుడు ఈ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చేరువుగా అయ్యారు, దగ్గరగా అయ్యారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ ఇంటి నుండి వెళ్లగొట్టారో, అప్పుడు ఈ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహాయమందజేసి, తమకు దగ్గరగా తీసుకున్నారు. ఈ విధంగా ఇస్లాం పట్ల సహాబాల త్యాగాలు ఇంతా అంతా కావు, ఎంతో గొప్పమైనవి.

మన సలఫె సాలెహీన్ రహిమహుముల్లాహ్ సహాబాలను ఎలా గౌరవించేవారు? సహాబాల గురించి వారి యొక్క విశ్వాసం, వారి యొక్క ప్రేమ, వారి యొక్క గౌరవ మర్యాదలు ఎలా ఉండేవి? వాటిని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము.

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు, హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు గారి యొక్క కుమారుడు. ఒక సందర్భంలో అతను తెలిపాడు, “ప్రజలారా, సహాబాలను దూషించకండి. సహాబాలు కొంతసేపు, ఒక చిన్నపాటి గడియ, వారు ఏదైతే అల్లాహ్ ఆరాధనలో గడిపారో, మీరు మీ జీవితాంతం చేసే మీ ఆరాధన వారి ఆ గడియపాటు ఆరాధనకు చేరుకోదు.” వారి స్థానం అంత గొప్పది కనుక మీరు వారిని దూషించకండి.

అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ రహిమహుల్లాహ్, చాలా గొప్ప ముహద్దిస్, ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చాడు. వచ్చి, ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ఎక్కువ ఘనత గలవారా, లేకుంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజా అని ప్రశ్నించాడు. అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ ఏం సమాధానం చెప్పారు? దానికంటే ముందు ఒక విషయం తెలుసుకోండి. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ సహాబీ కాదు, తాబియీన్లలో వస్తారు. ఆయన చాలా ఉత్తమమైన వారు, ఆయన ఒక ఖలీఫా, వారిని ఐదవ ఖలీఫా అని అంటారు. కానీ ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ఆయనకు ఎన్నో ఘనతలు ఉన్నాయి. అట్టి ముఖ్యమైన ఘనత ఏమిటి? సహాబీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ కళ్లారా చూశారు, విశ్వసించారు, విశ్వాస స్థితిలో మరణించారు. అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఏ వహీ వచ్చేదో దానిని రాసేవారు ఏ సహాబాలైతే ఉన్నారో, కాతిబీనె వహీ, వారిలో ఒకరు. అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బావమరిది. అంటే, హజ్రత్ అమీరె ముఆవియా రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క సోదరి ఉమ్మె హబీబా రదియల్లాహు తాలా అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర భార్య. విశ్వాసం మరియు సహాబీ కావడం తో పాటు ఇన్ని రకాల ఇంకా మరెన్నో ఘనతలు కూడా ఉన్నాయి. అయితే అతి ముఖ్యమైన విషయం అతను సహాబీ. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ చాలా ఉత్తమమైన వారు కానీ సహాబీ కాదు.

అయితే ఒక వ్యక్తి వచ్చి ఏమడుగుతున్నాడు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ తో? అమీరె ముఆవియా ఎక్కువ ఘనత గలవారా లేకుంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఎక్కువ ఘనత గలవారా? అప్పుడు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ రహిమతుల్లాహి అలైహి చెప్పారు, “ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉండగా, ఆయన ముక్కులో పోయినటువంటి దుమ్ము, ధూళి, దాని స్థానానికి కూడా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ చేరుకోడు, నీవేం మాట్లాడుతున్నావు?

అల్లాహు అక్బర్. ఇక్కడ గమనించండి, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమతుల్లాహి అలైహి గారికి ఉన్న ఘనత, వారికి ఉన్న విద్య, ఆయన ఒక ఖలీఫా, ఆ విషయాల్లో మనం ఏ కొరత చూపి ఆయన్ని అవమానించడం కాదు. సహాబాల ఘనత ఎంత గొప్పదో అది తెలియజేస్తున్నాము. ఇది మనమే కాదు, మనకంటే ముందు పూర్వీకులు సలఫె సాలెహీన్ రహిమహుల్లాహ్, వారిలో అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ ఎలాంటి ముహద్దిస్ అంటే, ఎందరో ముహద్దిసులు చెప్పారు, ఈయనపై ఎలాంటి దోషం లేని, జరహ్ లేని ముహద్దిస్ అని.

సహాబాల యొక్క స్థానం, వారి యొక్క ఘనత విషయంలో సహీ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

اللَّهَ اللَّهَ فِي أَصْحَابِي ، اللَّهَ اللَّهَ فِي أَصْحَابِي
(అల్లాహ అల్లాహ ఫీ అస్హాబీ, అల్లాహ అల్లాహ ఫీ అస్హాబీ)
నా సహాబాల ప్రస్తావన వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అల్లాహ్ ను గుర్తు చేస్తున్నాను, మీరు అల్లాహ్ తో భయపడండి. నా సహాబాల ప్రస్తావన వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అల్లాహ్ ను గుర్తు చేస్తున్నాను, మీరు అల్లాహ్ తో భయపడండి.

ఆ తర్వాత చెప్పారు, “మీరు వారిలో ఏ ఒక్కరిని కూడా తమ మనోవాంఛల కొరకు, తమ మనసులోని చెడు కోరికల కొరకు ఒక సాకుగా తీసుకోకండి”

فَمَنْ أَحَبَّهُمْ فَبِحُبِّي أَحَبَّهُمْ، وَمَنْ أَبْغَضَهُمْ فَبِبُغْضِي أَبْغَضَهُمْ
(ఫమన్ అహబ్బహుమ్ ఫబిహుబ్బీ అహబ్బహుమ్, వమన్ అబ్గదహుమ్ ఫబిబుగ్దీ అబ్గదహుమ్)
ఎవరైతే వారి పట్ల ప్రేమగా ఉంటాడో అతడు నా పట్ల ప్రేమగా ఉన్నట్లు. మరియు ఎవరైతే వారి పట్ల ద్వేషంగా ఉంటాడో, అతడు నా పట్ల ద్వేషంగా ఉన్నట్లు

وَمَنْ آذَاهُمْ فَقَدْ آذَانِي، وَمَنْ آذَانِي فَقَدْ آذَى اللَّهَ، وَمَنْ آذَى اللَّهَ يُوشِكُ أَنْ يَأْخُذَهُ
(వమన్ ఆదాహుమ్ ఫఖద్ ఆదానీ, వమన్ ఆదానీ ఫఖద్ ఆదల్లాహ తబారక వ తాలా)
ఎవరైతే నా సహాబాలను హాని కలిగించాడో, వారికి కీడు కలుగజేశాడో, అతడు నాకు కీడు కలుగజేసినట్లు, నాకు బాధ కలుగజేసినట్లు. మరి ఎవరైతే నన్ను బాధ పెట్టాడో, అతడు అల్లాహ్ ను బాధ పెట్టినవాడవుతాడు.

గమనించారా? సహాబాల యొక్క స్థానం ఎంత గొప్పగా ఉందో? వారిని ప్రేమించడం, వారి పట్ల ద్వేషంగా ఉండకుండా ప్రేమగా ఉండడం ఎంత ముఖ్యమో మన జీవితంలో, అర్థమవుతుంది కదా ఈ హదీసుల ద్వారా?

మరొక హదీస్, హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు దీనిని:

مَنْ سَبَّ أَصْحَابِي فَعَلَيْهِ لَعْنَةُ اللَّهِ وَالْمَلائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ
(మన్ సబ్బ అస్హాబీ ఫఅలైహి ల’నతుల్లాహి వల్ మలాఇకతి వన్నాసి అజ్మయీన్)
ఎవరైతే నా సహాబాలను దూషిస్తాడో, అతనిపై అల్లాహ్ యొక్క శాపం, దైవదూతల శాపం మరియు సర్వ ప్రజల యొక్క శాపం పడుగాక.

ఇమామ్ అహ్మద్ రహిమతుల్లాహి అలైహి, నాలుగు ఇమాములలో ఒక గొప్ప ఇమాం కదా. ఆయన ఏమన్నారో తెలుసా? సహాబాల విషయంలో, “నీవు ఎప్పుడైనా ఏదైనా వ్యక్తిని చూశావు, అతడు సహాబాలలో ఏ ఒక్కరినైనా దూషిస్తున్నాడు అంటే, అతడు నిజమైన ముస్లిమో కాదో అని శంకించవలసి వస్తుంది, అనుమాన పడే అటువంటి పరిస్థితి వస్తుంది.”

ఇలాంటి మాట ఎందుకు చెప్పారు ఇమామ్ అహ్మద్ రహిమతుల్లాహి అలైహి? ఎందుకంటే నిజమైన ముస్లిం, ఖుర్ఆన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ హదీసుల జ్ఞానం ఉన్న ముస్లిం, ఏ సహాబీని కూడా దూషించడు.

ఇంకా మరో సందర్భంలో హజ్రత్ ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లాహ్ తెలిపారు, “ఏ వ్యక్తికి కూడా సహాబాలను దూషించడం దూరం, సహాబాలను అగౌరవంగా ప్రస్తావించడం కూడా తగదు. ఎవరైనా అలా చేశాడంటే ఆ వ్యక్తి కాలంలో, ఆ వ్యక్తి ఉన్నచోట ఏ ముస్లిం నాయకుడు ఉన్నాడో అతడు అలాంటి వ్యక్తికి శిక్ష ఇవ్వాలి. ఎందుకంటే సహాబాలను దూషించడం ఇది చిన్నపాటి పాపం కాదు, ఘోర పాపాల్లో లెక్కించబడుతుంది

ఇతరములు:

సహాబా అంటే ఎవరు? వారి గురించి ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలి? – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

తాహీదె అస్మా వ సిఫాత్‌ (అల్లాహ్ నామాలు, గుణ గుణాలలో ఏకత్వం) – డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

 తౌహీదె అస్మావ సిఫాత్‌ (దైవ నామాలు, దైవగుణాలలో ఏకత్వం)

ఈ విషయం క్రింది అంశాలతో కూడుకుని ఉంది.

  • మొదటిది: దైవ నామాలు, గుణగణాలకు సంబంధించి ఖుర్‌ఆన్‌, హదీసుల వెలుగులో ఆధారాలు, బుద్ధి పరమైన నిదర్శనాలు.
  • రెండవది: అల్లాహ్‌ పేర్లు గుణగణాల గురించి అహ్లే సున్నత్‌ వల్‌ జమాఅత్‌ విధానం.
  • మూడవది: అల్లాహ్‌ నామాలను, గుణగణాలను లేదా వాటిలో కొన్నింటిని నిరాకరించే వారి ధోరణిని ఖండించటం.

మొదటిది: దైవనామాలు, గుణాల గురించి ఖుర్‌ఆన్‌, హదీసుల ఆధారాలు, బుద్ధిపరమైన ఆధారాలు.

(అ) ఖుర్‌ఆన్‌ హదీసుల ఆధారాలు :

ఇంతకుముందు మేము తౌహీదె ఉలూహియత్‌, తౌహీదె రుబూబియత్‌, తౌహీదె అస్మా వ సిఫాత్‌ అనే మూడు రకాలను గురించి ప్రస్తావించి ఉన్నాము. వాటిలో మొదటి రెండింటి ఆధారాలను, నిదర్శనాలను గురించి కూడా చర్చించాము. ఇప్పుడు తౌహీద్‌ మూడవ రకమయిన ‘అస్మా వ సిఫాత్‌’ (దైవనామాలు, గుణగణాల)ను రూఢీచేసే ఆధారాలను తెలుసుకుందాము.

(1) దివ్య ఖుర్‌ఆన్‌ ద్వారా కొన్ని ఆధారాలు

وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا ۖ وَذَرُوا الَّذِينَ يُلْحِدُونَ فِي أَسْمَائِهِ ۚ سَيُجْزَوْنَ مَا كَانُوا يَعْمَلُونَ

“అల్లాహ్‌కు మంచి పేర్లున్నాయి. కాబట్టి మీరు ఆయన్ని ఆ పేర్లతోనే పిలవండి. ఆయన పేర్ల విషయంలో వక్రంగా వాదించే వారిని వదలిపెట్టండి. వారు చేస్తూ ఉండిన దానికి వారు తప్పకుండా శిక్షించబడతారు.” (అల్‌ ఆరాఫ్‌ 7:180)

ఈ సూక్తి ద్వారా అల్లాహ్ తనకు కొన్ని పేర్లున్నాయని, అవి అత్యుత్తమమయిన పేర్లని తెలియజేస్తున్నాడు. ఆ పేర్లతోనే తనను పిలవమని కూడా ఆదేశించాడు. ఉదాహరణకు : ఓ రహ్మాన్‌ (ఓ దయాకరా!), ఓ రహీమ్‌ (ఓ కృపాశీలుడా!), ఓ హై (ఓ సజీవుడా!), ఓ ఖయ్యూమ్‌ (ఓ ఆధారభూతుడా!), ఓ రబ్బిల్‌ ఆలమీన్‌ (ఓ లోకేశ్వరుడా!) మొదలగునవి. తన నామాల విషయంలో వక్రవైఖరి అవలంబించే వారిని, నిరాకరించేవారి గురించి హెచ్చరించాడు. ఎందుకంటే వారు అల్లాహ్‌ పేర్ల విషయంలో సత్యం నుండి తొలగిపోతారు లేదా అల్లాహ్‌కు గల పేర్లను పూర్తిగా నిరాకరిస్తారు. లేదా వాటి అర్ధాలను వక్రీకరిస్తారు లేదా నాస్తికతకు సంబంధించిన మరేదైనా దారి తెరుస్తారు. అలాంటి వారికి, తమ స్వయంకృతానికి తగిన శిక్ష లభిస్తుందని కూడా అల్లాహ్‌ హెచ్చరించాడు.

అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు :

اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ لَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ

“ఆయనే అల్లాహ్‌. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. సుందరమైన పేర్లన్నీ ఆయనవే.” (తాహా 20:8)

هُوَ اللَّهُ الَّذِي لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ ۖ هُوَ الرَّحْمَٰنُ الرَّحِيمُ هُوَ اللَّهُ الَّذِي لَا إِلَٰهَ إِلَّا هُوَ الْمَلِكُ الْقُدُّوسُ السَّلَامُ الْمُؤْمِنُ الْمُهَيْمِنُ الْعَزِيزُ الْجَبَّارُ الْمُتَكَبِّرُ ۚ سُبْحَانَ اللَّهِ عَمَّا يُشْرِكُونَ هُوَ اللَّهُ الْخَالِقُ الْبَارِئُ الْمُصَوِّرُ ۖ لَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ ۚ يُسَبِّحُ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ

“ఆయనే అల్లాహ్‌. ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు – గోప్యంగా ఉన్నవాటికి, బహిర్గతమై ఉన్నవాటిని ఎరిగినవాడు. ఆయన కరుణామయుడు, ఆయనే అల్లాహ్‌ – ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే రాజాధిరాజు, పరమ పవిత్రుడు, లోపాలన్నింటికి అతీతుడు, శాంతిప్రదాత, పర్యవేక్షకుడు, సర్వశక్తుడు, బలపరాక్రమాలు గలవాడు, పెద్దరికం గలవాడు. ప్రజలు (ఆయనకు) కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్‌ పవిత్రంగా ఉన్నాడు. ఆయనే అల్లాహ్‌ – సృష్టికర్త, ఉనికిని ప్రసాదించేవాడు, రూపకల్పన చేసేవాడు. అత్యుత్తమమైన పేర్లన్నీ ఆయనకే ఉన్నాయి. భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువూ ఆయన పవిత్రతను కొనియాడుతోంది. ఆయనే  సర్వాధికుడు, వివేకవంతుడు.” (అల్‌ హషర్ 59 : 22 – 24)

(2) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తుల వెలుగులో దైవ నామాలకు సంబంధించిన ఆధారాలు :

హజ్రత్‌ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :

“అల్లాహ్‌కు 99 పేర్లున్నాయి – ఒకటి తక్కువ వంద పేర్లు. ఇవి ఎటువంటి నామాలంటే, వాటిని (జ్ఞానపరంగానూ, క్రియాత్మకం గానూ) గ్రహించినవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు.”(ముత్తఫఖున్‌ అలై)

అల్లాహ్‌ యొక్క అత్యుత్తమ నామాలు కేవలం ఈ సంఖ్య (99)కే పరిమితం కావు. దీనికి ఆధారం హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ మస్‌ఊద్‌ (రది అల్లాహు అన్హు) గారి ఈ ఉల్లేఖనం:

మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వేడుకున్నారు:

“(ఓ అల్లాహ్‌!) నేను నీకు గల ప్రతి నామం ఆధారంగా నిన్ను అర్థిస్తున్నాను – దేని  ద్వారానయితే నిన్ను నీవు పిలుచుకున్నావో! లేదా నీ గ్రంథంలో అవతరింపజేశావో! లేదా నీ సృష్టితాలలో ఎవరికయినా నేర్పావో! లేదా దానిని నీ వద్దనే – అగోచర జ్ఞానంలో భద్రపరచి ఉంచావో! అలాంటి ప్రతి నామం ఆధారంగా నిన్ను వేడుకుంటున్నాను (ప్రభూ!) మహత్తరమైన ఖుర్‌ఆన్‌ను నా హృదయ వసంతం గావించు!”

(ఈ హదీసును ఇమాం అహ్మద్ తన ముస్నద్ – 3528 లో పొందుపరిచారు. ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైన హదీసుగా ఖరారు చేశాడు. అల్లాహ్ పేర్లు కేవలం 99 కే  పరిమితమై లేవని ఈ హదీసు నిరూపిస్తోంది. కనుక ఈ హదీసు ద్వారా విదితమయ్యేదేమిటంటే – నిజము దేవుడెరుగు – ఈ 99 పేర్లను నేర్చుకున్నవాడు, వాటి ఆధారంగా అర్థించినవాడు, వాటి ఆధారంగా దైవారాధన చేసినవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఈ విశిష్టత ఈ పేర్లకే స్వంతం – సహీహుల్ జామి – 2622)

అల్లాహ్‌ యొక్క ప్రతి నామం ఆయన గుణగణాలలోని ఒకానొక గుణాన్ని సూచిస్తోంది. ఉదాహరణకు : ‘అలీమ్‌‘ అనే నామం ఆయనలోని ఇల్మ్ (జ్ఞానం) గుణానికి నిదర్శనంగా ఉంది. అలాగే ‘హకీమ్‌‘ అనే పేరు ఆయనలోని హిక్మత్‌ (యుక్తి, వివేకం)ను సూచిస్తోంది. ‘సమీ” అనే పేరు ఆయన ‘సమ్‌అ’ (వినే) గుణానికి తార్కాణంగా ఉంది. ‘బసీర్‌‘ అనే ఆయన నామం ఆయనలోని ‘బసర్‌’ (చూసే, గమనించే) గుణానికి నిదర్శనంగా ఉంది. ఇదేవిధంగా ప్రతి పేరు అల్లాహ్‌ గుణ విశేషాలలో ఏదో ఒక గుణానికి ఆధారంగా ఉన్నది.

అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు :

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ اللَّهُ الصَّمَدُ لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ

(ఓ ముహమ్మద్‌!) వారికి చెప్పు : “ఆయన అల్లాహ్‌ (నిజ ఆరాధ్యుడు) ఒకే ఒక్కడు. అల్లాహ్‌ నిరపేక్షాపరుడు (ఏ అక్కరా లేనివాడు). ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు (సరితూగేవాడు, పోల్చదగినవాడు) ఎవడూ లేడు.” (అల్‌ ఇఖ్లాస్‌ : 1 – 4)

హజ్రత్‌ అనస్‌ (రది అల్లాహు అన్హు) కథనం : ఒక అన్సారీ వ్యక్తి మస్జిదె ఖుబాలో వారికి ఇమామత్‌ చేసేవాడు (వారి సామూహిక నమాజుకు సారథ్యం వహించేవాడు). అతనెప్పుడు నమాజ్‌ చేయించినా (ఫాతిహా సూరా అనంతరం) ‘ఖుల్‌హు వల్లాహు అహద్‌” సూరా పారాయణం మొదలెట్టేవాడు. ఆ తరువాత ఏదైనా మరో సూరా పఠించేవాడు. అతను ప్రతి రకాత్‌లో అలాగే చేసేవాడు. సహాబా (సహచరు)లలో ఇది చర్చనీయాంశం అయింది. వారంతా కలసి అతనితో మాట్లాడారు. “నీవు ఇదే సూరాతో ఖిరాత్‌ మొదలెడుతున్నావు. పోనీ దీంతో సరిపెట్టుకుంటావా అంటే అదీ లేదాయె. దీంతో పాటు మరో సూరా కూడా పఠిస్తున్నావు. నీవు పఠిస్తే ఈ ఒక్క సూరాయే పఠించు. లేదంటే దీనిని వదిలేసి వేరే సూరా ఏదన్నా పఠించు” అని అతన్ని కోరారు. దానికతను ఇలా జవాబిచ్చాడు : “నేను ఈ సూరాను వదలనుగాక వదలను. మీకిష్టముంటే నేనిలాగే ఇమామత్‌ చేస్తాను. ఇలా చేయటం ఇష్టం లేదనుకుంటే చెప్పండి, మీ సారథ్య బాధ్యతలు వదలుకుంటాను.” కాని వారంతా ఆ వ్యక్తిని తామందరిలోకెల్లా ఉత్తమునిగా పరిగణించేవారు. కనుక అతను తప్ప వేరొక వ్యక్తి తమకు ఇమామత్‌ చేయటం వారికిష్టం లేదు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ వద్దకు ఏతెంచినపుడు, పరిస్థితుల స్వరూపాన్ని క్షుణ్ణంగా వివరించారు. అప్పుడాయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ వ్యక్తినుద్దేశించి,

“ఓ ఫలానా వ్యక్తీ! నీ సహచరులు అడుగుతున్నట్లుగా మసలుకోవటంలో నీకు వచ్చిన చిక్కేమిటీ? అంటే ప్రతి రకాతులో ఇదే సూరా పఠించటానికి నిన్ను ప్రేరేపిస్తున్నదేది?” అని ప్రశ్నించారు.

దానికా వ్యక్తి, “నేనీ సూరాను ప్రగాఢంగా ఇష్టపడుతున్నాను” అన్నాడు.

“ఈ సూరాపట్ల నీకు గల ప్రేమ నిన్ను స్వర్గానికి చేరుస్తుంది” అని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు. (సహీహ్‌ బుఖారీ)

హజ్రత్‌ ఆయిషా (రది అల్లాహు అన్హా) కథనం ఇలా ఉంది : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక వ్యక్తిని ఓ చిన్న సైనిక బృందానికి అమీర్‌ (నాయకుని)గా నియమించి పంపారు. ఆ వ్యక్తి తన బృందానికి నమాజ్‌ చేయించేవాడు. ఈ సందర్భంగా ఖిరాత్‌ చివర్లో ఎలాగయినాసరే “ఖుల్‌హు వల్లాహు అహద్‌” సూరా చదివేవాడు. ఆ బృందంలోని సభ్యులు తిరిగి వచ్చాక, ఈ సంగతిని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ప్రస్తావించగా,

“అతనలా ఎందుకు చేసేవాడో అతన్నే అడగండి” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సూచించారు.

జనులు ఈ విషయమై అతన్ని దర్యాప్తు చేయగా అతనిలా అన్నాడు : “ఈ సూరా పారాయణం అంటే నాకెంతో ఇష్టం.” ఇది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :

“అల్లాహ్‌ అతన్ని ఇష్టపడుతున్నాడని అతనికి తెలియజేయండి.” (సహీహ్‌ బుఖారీ).

అంటే: ఈ సూరా కరుణామయుడైన అల్లాహ్‌ గుణగణాలతో కూడుకుని ఉంది.

తనకు ముఖం కూడా ఉందని అల్లాహ్‌ తెలియజేశాడు. దీనికి నిదర్శనం ఈ ఆయత్ :

وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو الْجَلَالِ وَالْإِكْرَامِ

“ఎప్పటికీ మిగిలి ఉండేది వైభవోపేతుడైన, గౌరవనీయుడైన నీ ప్రభువు ముఖారవిందమే.” (అర్‌ రహ్మాన్‌ 55: 27)

అలాగే – అల్లాహ్‌కు రెండు చేతులున్నాయి :

خَلَقْتُ بِيَدَيَّ

“నేనతన్ని (ఆదమును) నా రెండు చేతులతో సృష్టించాను.” (సాద్‌ 38 : 75)

بَلْ يَدَاهُ مَبْسُوطَتَانِ

“వాస్తవానికి అల్లాహ్‌ చేతులు రెండూ తెరచుకుని ఉన్నాయి.” (అల్‌ మాయిద 5: 64)

ఇంకా – అల్లాహ్‌ సంతోషిస్తాడు, ప్రేమిస్తాడు, కినుక వహిస్తాడు, ఆగ్రహిస్తాడు – ఇవన్నీ ఆయన లక్షణాలే. ఇవిగాక మరెన్నో లక్షణాలున్నాయి. వాటిని గురించి ఆయన స్వయంగా చెప్పుకున్నాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాల ద్వారా కూడా ఆయన లక్షణాలు తెలుస్తున్నాయి –

(ఆ) అల్లాహ్‌ నామాలను, లక్షణాలను నిరూపించే బుద్ధిపరమయిన ఆధారాలు

అల్లాహ్ నామాలు, గుణగణాలకు సంబంధించి షరీయత్‌ పరమయిన ఆధారాలున్నట్లే బుద్ధిపరమయిన ఆధారాలు, నిదర్శనాలు కూడా ఉన్నాయి :

1. రకరకాల సృష్టితాలు అసంఖ్యాకంగా ఉనికిలోనికి రావటం. తమ సృష్టికి వెనుక ఉన్న పరమార్థాలను నెరవేర్చటంలో అవి పకడ్బందీగా పనిచేయటం, తమ కొరకు నిర్ధారించబడిన కక్ష్యలో – పరిధిలో – ఉండి మరీ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించటం, ఇవన్నీ అల్లాహ్ ఘనత్వానికి, శక్తికి, యుక్తికి, జ్ఞానానికి, ఆయన ఇచ్చకు నిలువుటద్దంగా ఉన్నాయి.

2. అనుగ్రహించటం, మేలు చేయటం, కష్టాలను, ఆపదలను తొలగించటం – ఇవన్నీ దైవకారుణ్యానికి, ఉదాత్త గుణానికి నిదర్శనంగా ఉన్నాయి.

3. అవిధేయులను శిక్షించటం, ధిక్కారులపై ప్రతీకారం తీర్చుకోవటం – ఇది దైవాగ్రహ గుణానికి తార్కాణం.

4. విధేయులను, విశ్వాసపాత్రులను సత్కరించటం, కటాక్షించటం, వారికి పుణ్యఫలం ప్రసాదించటం – ఇవి రెండూ దైవ ప్రసన్నతకు, ప్రేమైక గుణానికి దర్పణంగా ఉన్నాయి.

రెండవది : దైవనామాలు, దైవగుణాల విషయంలో అహ్లే సున్నత్‌ వల్‌ జమాఅత్‌ విధానం :

అహ్లే సున్నత్‌ వల్‌ జమాఅత్‌ వారు, సలఫె సాలెహ్‌  కోవకు చెందినవారు, వారి అనుయాయులు – అల్లాహ్‌ నామాలు, గుణగణాల విషయంలో వీరందరి విధానం ఒక్కటే. దైవగ్రంథంలో, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్‌లో తెలుపబడినట్లుగా వారు వాటిని యధాతథంగా విశ్వసిస్తారు. వారి పద్ధతి క్రింది నిబంధనలను అనుసరించి ఉంటుంది.

(1) వీరు దైవనామాలను, గుణగణాలను దైవగ్రంథానుసారం, ప్రవక్త విధానానుసారం నమ్ముతారు. తదనుగుణంగానే వాటిని రూఢీ చేస్తారు. వాటి బాహ్య స్వరూపానికి విరుద్ధంగా అర్థాలు తీయరు. వాటిని మార్చే ప్రయత్నం కూడా చేయరు.

(2) ఆయన నామాలను, లక్షణాలను సృష్టితాల లక్షణాలతో పోల్చి చెప్పటాన్ని వ్యతిరేకిస్తారు. ఉదాహరణకు : అల్లాహ్‌ సెలవిచ్చినట్లు:

 لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ ۖ وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ

“ఆయన్ని పోలిన వస్తువేదీ లేదు. ఆయన వినేవాడు, చూసేవాడు.” (అష్‌ షూరా 42 : 11)

(3) దైవనామాలను, దైవిక గుణాలను రుజువు చేయటానికి ఏ ఏ ఆధారాలు, నిదర్శనాలు ఖుర్‌ఆన్‌, హదీసులలో ఇవ్వబడ్డాయో, వాటిని సుతరామూ ఉల్లంఘించరు.అల్లాహ్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏ ఏ ఆధారాలను, రుజువులను చూపారో, వాటిని ఖచ్చితంగా అంగీకరిస్తారు.అల్లాహ్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తోసిపుచ్చిన వాటిని వీరు కూడా త్రోసిరాజంటారు. ఏ విషయాలపై అల్లాహ్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మౌనం వహించారో వాటిపై వీరు కూడా మౌనం వహిస్తారు.

(4) దైవనామాలు, గుణగణాలకు సంబంధించిన దైవసూక్తులను వీరు తిరుగులేనివిగా, స్పష్టమైనవి (ముహ్కమాత్)గా విశ్వసిస్తారు. వాటి భావార్థాన్ని గ్రహించవచ్చునని, వాటిని గురించి కూలంకషంగా విడమరచి చెప్పటం సాధ్యమేనని భావిస్తారు. ఈ ఆయతులను వారు అస్పష్టమైనవిగా, నిగూఢమైనవి (ముతషాబిహాత్‌) గా పరిగణించరు. అందుకే వారు – అభినవ రచయితలు కొంతమంది లాగా తప్పుడు ప్రకటనలు ఇవ్వటంగానీ, విషయాన్ని దృష్టి మళ్లించే ప్రయత్నం చేయటం గానీ చేయరు. మొత్తానికి వీరి వ్యవహారం ఈ విషయంలో నిర్దిష్టంగా, నిర్ధ్వంధ్వంగా, సూటిగా ఉంటుంది.

(5) గుణగణాల వైనం ఎలా ఉంటుంది? అన్న ప్రశ్న జనించినపుడు ఆ జ్ఞానం అల్లాహ్ కే ఉందని చెబుతారు. ఈ విషయంలో వితండ వాదనకు దిగరు. అనవసరంగా విషయాన్ని సాగదీయరు.

మూడవది : మొత్తం పేర్లను, గుణగణాలను లేదా వాటిలో కొన్నింటిని నిరాకరించే వారి ధోరణిని ఖండించటం:

దైవ నామాలను, గుణగణాలను నిరాకరించే వారిలో మూడు రకాల వారున్నారు.

1. జహ్‌మియా వర్గం: వీరు జహమ్‌ బిన్‌ సఫ్వాన్‌ అనుయాయులు. వీళ్లు అల్లాహ్ పేర్లన్నింటినీ, గుణగణాలన్నింటినీ నిరాకరిస్తారు.

2. మోతజిలా వర్గం: వీళ్లు వాసిల్‌ బిన్‌ అతా అనుయాయులు. వాసిల్‌ ఇమామ్‌ హసన్‌ బస్రీ సమావేశాల నుండి వేరైపోయారు. వీరు కేవలం అల్లాహ్‌ నామాలను మాత్రమే రూఢీ చేస్తారు. అయితే ఆ నామాలు కేవలం పదాలేనని, వాటికి అర్ధం అనేది ఏమీ లేదని వాదిస్తారు. ఇక అల్లాహ్ గుణగణాల విషయానికివస్తే, ఆసాంతం వాటీని నిరాకరిస్తారు.

3. అషాఅరా [1] , మాతరీదీయ [2] వర్గీయులువారి అనుయాయులు: వీరు దైవనామాలు, గుణగణాలలో కొన్నింటిని అంగీకరిస్తారు. కొన్ని గుణాలను మాత్రం నిరాకరిస్తారు.

[1] వీరు అబుల్ హసన్ అష్అరీ అభిమతాన్ని అనునరించేవారు . అయితే అబుల్ హసన్ తరువాతి కాలంలో తన విధానానికి స్వస్తి పలికి అహఁలే సున్నత్‌ అభిమతాన్ని అవలంబించాడు. కాని అతని అనుయాయులు మరలి రాలేదు. కాబట్టి వీళ్లను అబుల్ హసన్ అష్అరీ వర్గీయులని  అనటం నరికాదు.

[2] వీరు అబూ మన్సూర్‌ మాతురీదీ అనుయాయులు.

వీరి అభిమతానికి పునాది ఇది :

అల్లాహ్‌ను ఆయన సృష్టితాలతో పోల్చే చేష్ట నుండి తాము సురక్షితంగా ఉండాలి. ఎందుకంటే ప్రాణులలో కొందరున్నారు. వారు తమను అల్లాహ్ నామాలతో పిలుచుకుంటున్నారు. అల్లాహ్ గుణాలలో కొన్ని గుణాలను తమ కొరకు ప్రత్యేకించుకుంటున్నారు. ఇది సరైనది కాదు. ఎందుకంటే దీనివల్ల పేర్లు, గుణగణాల విషయంలో సృష్టికర్త – సృష్టితాలు కలగాపులగం అవుతున్నాయి. తత్కారణంగా ఆ రెండింటి వాస్తవికతలో కూడా “భాగస్వామ్యానికి” తావు ఏర్పడుతున్నది. ఆ విధంగా సృష్టితాలను కూడా సృష్టికర్తతో పోల్చేందుకు ఆస్కారం కలుగుతోంది – ఇదీ వారి వాదన. అందువల్ల వారు క్రింద పేర్కొనబడిన రెండు విషయాలలో ఏదో ఒకదానిని మాత్రమే అవలంబిస్తారు.

(అ) వారు అల్లాహ్ నామాలు, అల్లాహ్ గుణాలకు సంబంధించిన ‘మూలాల’ను వాటి బాహ్యార్థాల ద్వారా గ్రహిస్తారు. ఉదాహరణకు : (అల్లాహ్) ‘ముఖము’ను ‘అల్లాహ్  అస్తిత్వం’ అనే అర్థంలో తీసుకుంటారు. (అల్లాహ్) ‘చేతులు’ను ‘అల్లాహ్ అనుగ్రహం’ అన్న భావంలో తీసుకుంటారు.

(ఆ) లేదా ఈ ‘మూలాల’  భావార్ధాన్ని అల్లాహ్‌కే వదలివేస్తారు. అదేమంటే, వాటి అర్ధం అల్లాహ్ కే తెలుసు అంటారు. ఈ నామాలు మరియు గుణాలు వాటి బాహ్యార్ధంలో లేవని కూడా నమ్ముతారు.

అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు :

“(ఓ ముహమ్మద్‌!) ఇదేవిధంగా మేము నిన్ను ఈ సమాజం లోకి పంపాము – ఇంతకు మునుపు ఎన్నో సమాజాలు గతించాయి – మా తరఫున నీపై అవతరించిన వాణిని వారికి వినిపించటానికి! వారు కరుణామయుని (అల్లాహ్‌ను) తిరస్కరిస్తున్నారు.” (అర్‌ రాద్‌ 13:20)

ఈ సూక్తి అవతరణ వెనుక గల నేపథ్యం ఇది :

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కరుణామయుని (రహ్మాన్‌) ప్రస్తావన తీసుకువచ్చినప్పుడు, వారు దానిని స్పష్టంగా త్రోసిపుచ్చారు. అప్పుడు అల్లాహ్‌ వారి గురించి  “వారు కరుణామయుని (అల్లాహ్‌ను) తిరస్కరిస్తున్నారు” అనే ఆయతును అవతరింపజేశాడు.

ఇది హుదైబియా ఒడంబడిక సందర్భంగా ఎదురైన సంఘటన అని అల్లామా ఇబ్నె జరీర్‌ అభిప్రాయపడ్డారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అరబ్బు ముష్రికులకు మధ్య జరిగిన ఒడంబడికను లిఖించటానికి పూనుకున్నప్పుడు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్‌” అని వ్రాయించారు. దానికి ఖురైషులు అభ్యంతరం తెలుపుతూ “రహ్మాన్‌ ఎవరో మాకు తెలీదు” అన్నారు.

ఇబ్నె జరీర్‌ గారు హజ్రత్‌ ఇబ్నె అబ్బాస్‌ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖనాన్ని ఈ సందర్భంగా ఉదాహరించారు. దీని ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దా  స్థితిలో దుఆ చేస్తూ “యా రహ్మాన్‌! యా రహీమ్‌!” అనేవారు. అది విన్న ముష్రిక్కులు, ‘ఈయన గారు ఒక ఆరాధ్య దైవాన్ని మొర పెట్టుకుంటున్నట్టు భావిస్తున్నాడు. కాని ఆయన మొరపెట్టుకునేది ఇద్దరు ఆరాధ్యులను’ అని ఎద్దేవా చేశారు. అప్పుడు అల్లాహ్‌ ఈ సూక్తిని అవతరింపజేశాడు.

قُلِ ادْعُوا اللَّهَ أَوِ ادْعُوا الرَّحْمَٰنَ ۖ أَيًّا مَّا تَدْعُوا فَلَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ

వారికి చెప్పు : “అల్లాహ్‌ను అల్లాహ్‌ అని పిలిచినా, రహ్మాన్‌ అని పిలిచినా – ఏ పేరుతో పిలిచినా-మంచి పేర్లన్నీ ఆయనవే.” (అల్‌ ఇస్రా 17 : 110)

అల్‌ ఫుర్ఖాన్‌ సూరాలో అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు :

وَإِذَا قِيلَ لَهُمُ اسْجُدُوا لِلرَّحْمَٰنِ قَالُوا وَمَا الرَّحْمَٰنُ

“కరుణామయునికి సాష్టాంగపడండి” అని వారితో అన్నప్పుడు, “కరుణామయుడంటే ఏమిటి? (ఇంతకీ ఆయనెవరు?) అని వారంటారు. (అల్‌ ఫుర్ఖాన్‌ 25 : 60)

కనుక అల్లాహ్ నామాలను, అల్లాహ్ గుణాలను – ఏ విధంగానయినా నిరాకరించే ఈ ముష్రిక్కులు, జహ్‌మియా వర్గీయులు, మోతజిలా వర్గీయులు, అషాఅరా అనుంగు అనుచరులు, ఇంకా ఈ ధోరణిని అనుసరించే వారి పూర్వీకులు – వీరంతా నిరసించదగిన వారు.

దైవనామాలను, గుణగణాలను నిరాకరించేవారి ధోరణి క్రింది పద్ధతుల ద్వారా ఖండించబడుతుంది –

మొదటి పద్ధతి :

మొదటి పద్ధతి ఏమిటంటే అల్లాహ్‌ తన కొరకు నామాలను, గుణాలను రూఢీ చేశాడు. ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా ఆయనకు పేర్లు, గుణాలున్నాయని రుజువు చేశాడు. కనుక అల్లాహ్‌ నామాలను, గుణాలను పూర్తిగాగానీ, పాక్షికంగా గానీ నిరాకరించటమంటే అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిరూపించిన వాటిని ఏకంగా త్రోసిపుచ్చటమే అవుతుంది. ఆ విధంగా ఇది అల్లాహ్ తోనూ, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తోనూ వ్యతిరేకతను, శత్రుత్వాన్ని కొనితెచ్చుకునే చేష్టే.

రెండవ పద్ధతి:

రెండవ పద్ధతి ఏమిటంటే; మనుషులలో అల్లాహ్ లోని సుగుణాలు కానవచ్చినంత మాత్రాన లేదా మనుషులలో కొందరికి అల్లాహ్‌ పేర్లున్నంతమాత్రాన సృష్టికర్తకు – సృష్టితాలకు (అల్లాహ్ కు – మనుషులకు) మధ్య సామ్యం, పోలిక ఉండాల్సిన ఆవశ్యకత ఏమీ లేదు. ఎందుకంటే అల్లాహ్ నామాలు, గుణ విశేషాలు అల్లాహ్ కే స్వంతం. అల్లాహ్ కే పరిమితం, ప్రత్యేకం. మనుషులకు గల పేర్లు, గుణాలు మనుషులకే పరిమితం. ఏ విధంగానయితే అల్లాహ్‌ అస్థిత్వం ఇతర సృష్టితాల అస్థిత్వంతో పోలిక కలిగిలేదో, అదేవిధంగా అల్లాహ్‌ నామాలు, గుణగణాలు కూడా సృష్టితాల పేర్లతో, గుణాలతో పోలిక కలిగి లేవు. అల్లాహ్ పేరు – మనుషుల పేరు ఒకటై ఉన్నంత మాత్రాన వారికి భాగస్వామ్యం ఉన్నట్లు లెక్క కాదు. ఉదాహరణకు : అల్లాహ్‌కు అలీమ్‌, హకీమ్‌ అనే పేర్లున్నాయి. అయితే ఆయన తన దాసుల్లో కొందరికి ‘అలీమ్‌’ అనే పేరు పెట్టాడు.

وَبَشَّرُوهُ بِغُلَامٍ عَلِيمٍ

“వారు (దైవదూతలు) అతని (ఇబ్రాహీమ్‌)కి జ్ఞాన సంపన్నుడైన అబ్బాయి పుడతాడని శుభవార్త వినిపించారు.” (అజ్‌ జారియాత్‌ 51 : 28)

ఇక్కడ ‘అలీమ్‌’ అంటే ఇస్‌హాఖ్‌ (రది అల్లాహు అన్హు) అన్నమాట. మరొక దాసునికి ‘హలీమ్‌’ అనే నామకరణం చేశాడు :

فَبَشَّرْنَاهُ بِغُلَامٍ حَلِيمٍ

“అందువల్ల మేమతనికి, సహనశీలుడైన ఒక అబ్బాయి గురించిన శుభవార్త వినిపించాము” (అస్‌ సాఫ్ఫాత్‌ 37 : 101)

ఇక్కడ ‘హలీమ్‌” అంటే ఇస్మాయీల్‌ (రది అల్లాహు అన్హు) అని భావం. అయితే ఈ ‘అలీమ్‌” గానీ, ‘హలీమ్‌’గానీ అల్లాహ్‌కు గల పేర్ల (అలీమ్‌, హలీమ్‌) వంటివి కావు.

అలాగే అల్లాహ్‌ తనకు సమీ, బసీర్‌ అనే పేర్లు పెట్టుకున్నాడు. ఆయన తన గురించి ఇలా చెప్పుకున్నాడు:

إِنَّ اللَّهَ كَانَ سَمِيعًا بَصِيرًا

“నిశ్చయంగా అల్లాహ్‌ అంతా వింటున్నాడు, అంతా చూస్తున్నాడు.” (అన్‌ నిసా 4 : 58)

అయితే ఆయన తన దాసుల్లో కూడా కొందరిని సమీగా, బసీర్‌గా అభివర్ణించాడు.

ఉదాహరణకు ఒకచోట మనిషిని గురించి ఇలా సెలవిచ్చాడు :

إِنَّا خَلَقْنَا الْإِنسَانَ مِن نُّطْفَةٍ أَمْشَاجٍ نَّبْتَلِيهِ فَجَعَلْنَاهُ سَمِيعًا بَصِيرًا

“నిశ్చయంగా మేము మానవుణ్ణి పరీక్షించడానికి  ఒక మిశ్రమ బిందువుతో పుట్టించాము. మరి  మేము అతన్ని వినేవాడుగా, చూసేవాడుగా చేశాము.” (అల్‌ ఇన్సాన్‌ 76 : 2)

అయితే ఒక వినేవాడు (సమీ) మరో వినేవాని (సమీ) వంటివాడు కాడు. ఒక చూసేవాడు (బసీర్‌) మరో చూసేవాని (బసీర్‌) వంటివాడు కాడు.

ఇంకా చెప్పాలంటే అల్లాహ్ తనకు రవూఫ్‌, రహీమ్‌ అనే పేర్లు పెట్టుకున్నాడు. ఉదాహరణకు : ఆయన ఒకచోట ఇలా సెలవిచ్చాడు.

إِنَّ اللَّهَ بِالنَّاسِ لَرَءُوفٌ رَّحِيمٌ

“నిశ్చయంగా అల్లాహ్‌ మనుషుల యెడల మృదుత్వం గలవాడు, జాలిచూపేవాడు.” (అల్‌ హజ్జ్‌ 22 : 65)

అయితే అల్లాహ్  తన దానుల్లో కూడా కొందరిని రవూఫ్‌గా, రహీమ్‌గా వ్యవహరించాడు. ఉదాహరణకు : ఒక చోట ఇలా సెలవిచ్చాడు :

لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ

“మీ దగ్గరకు స్వయంగా మీలో నుండే ఒక ప్రవక్త వచ్చాడు. మీకు కష్టం కలిగించే ప్రతిదీ అతనికి బాధ కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంతగానో కోరుకుంటున్నాడు. విశ్వాసుల యెడల అతను మృదు స్వభావి (రవూఫ్‌), దయాశీలి (రహీమ్‌).” (అత్‌ తౌబా 9 : 128)

అయితే ఒక “రవూఫ్‌” మరో “రవూఫ్‌” వంటివాడు కాడు. ఒక “రహీమ్‌” మరో “రహీమ్‌” వంటివాడు కాడు.

అలాగే అల్లాహ్‌ తనకు ఎన్నో గుణ విశేషాలున్నాయని చెప్పుకున్నాడు. దాంతో తన దాసులలో కూడా అలాంటి గుణగణాలున్నాయని పేర్కొన్నాడు. ఉదాహరణకు : ఒకచోట ఈ విధంగా సెలవీయబడింది :

وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ

“ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్య పరిధిలోకి రాదు” (అల్‌ బఖర 2 : 255)

ఈ సూక్తిలో ఆయన తనలోని జ్ఞాన విశేషాన్ని గురించి చెప్పుకున్నాడు. దాంతో పాటే తన దాసుల జ్ఞాన విశేషాన్ని గురించి కూడా ప్రస్తావించాడు. ఈ విధంగా సెలవిచ్చాడు:

وَمَا أُوتِيتُم مِّنَ الْعِلْمِ إِلَّا قَلِيلًا

“మీకు ఒసగబడిన జ్ఞానం బహు స్వల్పం.” (అల్‌ ఇస్రా 17 : 85)

మరోచోట ఇలా సెలవిచ్చాడు :

 وَفَوْقَ كُلِّ ذِي عِلْمٍ عَلِيمٌ

“ప్రతి జ్ఞానినీ మించిన జ్ఞాని ఒకడున్నాడు.” (యూసుఫ్‌ 12 : 76)

వేరొకచోట ఇలా అనబడింది:

.. وَقَالَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ

“అప్పుడు (ధర్మ) జ్ఞానం వొసగబడినవారు వారికి ఇలా బోధపరచ సాగారు ….” (అల్‌ ఖసస్‌ : 80)

అలాగే అల్లాహ్‌ తనకు గల శక్తి గుణాన్ని గురించి చెప్పుకున్నాడు.

إِنَّ اللَّهَ لَقَوِيٌّ عَزِيزٌ

“నిశ్చయంగా అల్లాహ్‌ మహాబలుడు, సర్వాధిక్యుడు.” (అల్‌ హజ్జ్‌ 22:40)

ఈ విధంగా కూడా చెప్పుకున్నాడు :

إِنَّ اللَّهَ هُوَ الرَّزَّاقُ ذُو الْقُوَّةِ الْمَتِينُ

“అల్లాహ్‌యే స్వయంగా అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు. ఆయన మహాశక్తిశాలి, మహాబలుడు.” (అజ్‌ జారియాత్‌ : 58)

దాంతోపాటే తన దాసుల శక్తిని గురించి ఆయన ఇలా విశ్లేషించాడు :

اللَّهُ الَّذِي خَلَقَكُم مِّن ضَعْفٍ ثُمَّ جَعَلَ مِن بَعْدِ ضَعْفٍ قُوَّةً ثُمَّ جَعَلَ مِن بَعْدِ قُوَّةٍ ضَعْفًا وَشَيْبَةً

“అల్లాహ్‌ – ఆయనే మిమ్మల్ని బలహీన స్థితిలో పుట్టించాడు. మరి ఈ బలహీనత తరువాత (మీకు) బలాన్ని ఇచ్చాడు. ఈ బలం తరువాత మళ్లీ మీకు బలహీనతను ఇచ్చాడు. (మిమ్మల్ని) వృద్ధాప్యానికి చేర్చాడు.” (అర్‌ రూమ్‌ 30 : 54)

దీనిద్వారా తెలిసిందేమిటంటే అల్లాహ్‌ నామాలు, గుణాలు ఆయనకే స్వంతం. ఆయనకే శోభాయమానం. మనుషుల పేర్లు గుణాలు వారికే ప్రత్యేకం, వారికే అవి తగినవి. పేర్లు, గుణాలు ఒకేవిధంగా కనిపించినంతమాత్రాన వాస్తవంలో అవి ఒకటి కావు. రెండింటి మధ్య ఎలాంటి సామ్యంగానీ, పోలికగానీ లేదు. ఇది చాలా స్పష్టమయిన విషయం. సర్వస్తోత్రాలు అల్లాహ్‌కే శోభాయమానం.

మూడవ పద్ధతి 

ఎవరయితే గుణగణాల రీత్యా పరిపూర్ణుడు కాడో అతనికి ఆరాధ్య దేవుడయ్యే అర్హత లేదు. అందుకే దైవప్రవక్త హజ్రత్‌ ఇబ్రాహీం ( అలైహిస్సలాం) తన తండ్రితో ఇలా అన్నారు:

يَا أَبَتِ لِمَ تَعْبُدُ مَا لَا يَسْمَعُ وَلَا يُبْصِرُ

“(ఓ నాన్నా!) వినలేని, కనలేని వాటిని మీరు ఎందుకు పూజిస్తారు?” (మర్యమ్‌ : 42)

ఆవు దూడను పూజించే వారి చర్యను ఖండిస్తూ అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు :

أَلَمْ يَرَوْا أَنَّهُ لَا يُكَلِّمُهُمْ وَلَا يَهْدِيهِمْ سَبِيلًا ۘ

“అది తమతో మాట్లాడలేదనీ, తమకు ఏ దారీ చూపదన్న సంగతిని గురించి వారు ఆలోచించలేదా?” (అల్‌ ఆరాఫ్‌ 7 : 148)

నాల్గవ పద్దతి:

గుణాలను రూఢీ చేయటం పరిపూర్ణతకు చిహ్నం. నిరాకరించటం లోపానికి ఆనవాలు. ఎందుకంటే గుణములు లేనివాడు నశించినవానితో సమానం లేదా లోపభూయిష్టతకు తార్కాణం. అల్లాహ్‌ ఈ రెండింటికీ అతీతుడు, పవిత్రుడు.

ఐదవ పద్ధతి:

దైవగుణాలకు మనం మనవైన భాష్యాలు చెప్పటానికి ఎలాంటి ఆధారం లేదు. పైగా ఈ ధోరణి ఒక మిథ్య. వాటి అర్ధాలను అల్లాహ్ కే అప్పగించటం కూడా సరైనది కాదు. ఇలా చేస్తే, ఖుర్‌ఆన్‌లో మనకు ఏమీ తెలియని విషయాల గురించి అల్లాహ్‌ మనకు ఆజ్ఞలు జారీచేసినట్లవుతుంది. కాగా; తనను తన పేర్లతోనే పిలవమని అల్లాహ్‌ మనల్ని ఆదేశించాడు. మరి మనకు అర్థమే తెలియనపుడు ఎలా పిలిచేది? మరోవైపు అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌లో అనేకచోట్ల ఆజ్ఞాపిస్తున్నాడు – ఖుర్‌ఆన్‌పై చింతన చేయమని! మనకు భావార్దాలే తెలియనపుడు వాటిపై మనం చింతన ఎలా చేయగలుగుతాము?

కనుక బోధపడేదేమిటంటే అల్లాహ్‌ యొక్క నామాలను, ఆయన గుణగణాలను మనుషులతో పోల్చకుండా యధాతథంగా అంగీకరించటం అనివార్యం. ఎందుకంటే ఆయన నామాలు, ఆయన గుణగణాలు ఆయన స్టాయికి, వైభవానికి తగినట్లుగానే ఉన్నాయి. ఉదాహరణకు : అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు :

 لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ ۖ وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ

“ఆయన్ని పోలిన వస్తువేదీ లేదు. ఆయన వినేవాడు, చూసేవాడు.” (అష్‌ షూరా 42 : 11)

ఈ ఆయతులో అల్లాహ్ తనను ఏ వస్తువుతోనయినా సరే పోల్చటాన్ని త్రోసిపుచ్చాడు. అలాగే తనలోని వినే, చూచే గుణాలను రుజువు చేశాడు. దీన్నిబట్టి విదితమయ్యేదేమిటంటే దైవగుణాలను అంగీకరించటం వల్ల వాటికి పోలికలను ఆపాదించినట్టు అర్థం కాదు. పోలికలను త్రోసిపుచ్చటంతో పాటు, గుణగణాలను అంగీకరించటం అవశ్యమని కూడా దీనిద్వారా అవగతమవుతోంది. అల్లాహ్ నామాల, గుణాల విషయంలో అహఁలే  సున్నత్‌ వల్‌ జమాఅత్‌ చెప్పేదొక్కటే : “పోలికలతో నిమిత్తం లేకుండా వీటిని ఒప్పుకోవాలి. కాదు, కూడదు అని అనకుండా వాటిని స్వచ్చమైనవిగా ఖరారు చేయాలి.”


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (75 – 87పేజీలు)

దుఆ స్వీకరించబడే సమయంలో ఏ దుఆ చేయడం మంచిది? [ఆడియో]

బిస్మిల్లాహ్

(5:29 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/