నరకంలో విషసర్పాల, తేళ్ళ కాటుల ద్వారా కూడా శిక్షించటం జరుగుతుంది. పాములు, తేళ్ళు ఈ రెండూ మానవ శత్రువులుగా భావించబడతాయి. ఈ రెంటి పేరు వింటేనే భయమేస్తుంది. ఈ రెండు ఉన్న చోట ఎవరూ కూర్చోవటం కాదు కదా, అక్కడికి వెళ్ళడానికి కూడా సిద్ధపడరు. పాములు, తేళ్ళు ఎలా ఉంటాయంటే వాటిని చూడగానే మానవుని ఒళ్ళు జలదరిస్తుంది. భయంతో వణికిపోవడం జరుగుతుంది. పాములు, తేళ్ళు ఎంత వరకు విషం కలిగి ఉంటాయి? దీని గురించి కేవలం అల్లాహ్కే తెలుసు. కాని పరిశోధనల ద్వారా, ప్రయోగాల ద్వారా కొన్ని పుస్తకాల్లో ఉన్న వివరాలను బట్టి పాము అత్యంత విషపూరితమైనదని, మానవుని శత్రువని తేలింది.
ఫ్రాన్సులో ఉన్న పాముల ప్రదర్శనశాలలో ఉన్న ఒక విషసర్పాన్ని గురించి కొన్ని వివరాలు ప్రచురించబడ్డాయి. వీటి ప్రకారం 1 1/2 మీటర్ల పొడవైన ఈ పాము తన విషంతో ఒకేసారి అయిదుగురిని చంపగలదు.
1999 ఫిబ్రవరిలో కింగ్ సఊద్ యూనివర్శిటీలో విద్యార్థుల కొరకు ఒక విద్యా ప్రదర్శన ఏర్పాటయింది. ఇందులో ప్రపంచంలో ఉన్న వివిధ రకాలకు చెందిన విషసర్పాలను ప్రదర్శించటం జరిగింది. వీటిని గాజు పెట్టెలలో ఉంచడం జరిగింది. వీటిలో కొన్నిటిని గురించి ఈ క్రింది వివరాలు సేకరించబడ్డాయి.
అరబి కోబ్రా ఇది అరబ్ దేశాలలో ఉంది. ఇది ఎంత విషపూరితమైనదంటే దీని 20 మిల్లీ గ్రాముల విషం 70 కిలోల మానవుడ్ని వెంటనే చంపగలదు. అయితే ఈ కోబ్రా ఒకేసారి 200 మిల్లీగ్రాముల నుండి 300 మిల్లీగ్రాముల వరకు విషాన్ని శత్రువు పై విసరగలదు (ఉమ్మగలదు). భారతదేశం, పాకిస్తాన్లలో గల కింగ్ కోబ్రా ద్వారా కాటు వేయబడిన వ్యక్తి వెంటనే మరణిస్తాడు. పాశ్చాత్య దేశాలలో ఉండే వెస్ట్ డైమండ్ బేక్ర్ సర్పాలు కూడా అత్యంత విషపూరితమైనవే.
ఇండోనేషియాలోని ఉమ్మి విసిరే విషసర్పం రెండు మీటర్లు పొడవు ఉంటుంది. ఇది మూడు మీటర్ల దూరం నుండి మానవుని కళ్ళలోనికి విషాన్ని విసురుతుంది. దీనివల్ల మానవుడు వెంటనే మరణిస్తాడు.
నరకం కంటే ముందు అవిశ్వాసులను సమాధిలో కూడా పాము కాటుల ద్వారా శిక్షించటం జరుగుతుంది. సమాధి శిక్షను గురించి ప్రస్తావిస్తూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“అవిశ్వాసి మున్కర్ నకీర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనప్పుడు, వాడిపై 99 పాములు వదలివేయటం జరుగుతుంది. తీర్పుదినం వరకు అవి అతన్ని కాటు వేస్తూ మాంసాన్ని పీక్కుతింటూ ఉంటాయి. “
సమాధిలోని పాముల గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ఉపదేశిం చారు:
“ఒకవేళ ఆ పాము ఒకసారి భూమిని కాటు వేస్తే భూమిపై ఏ ఆకు కూరలు పండవు.” (ముస్నద్ అహ్మద్)
సమాధిలోని పాముల గురించి ఇబ్నె హిబ్బాన్ ఉల్లేఖనంలో ఈ విధంగా కూడా పేర్కొనబడింది:
“ఒక్కొక్క పాముకు, 70 ముఖాలు ఉంటాయి. వాటితో అవి అవిశ్వాసిని తీర్పుదినం వరకు కాటు వేస్తూ ఉంటాయి.”
నరకంలోని పాముల గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పేర్కొన్నారు:
“అవి ఒంటెలా ఎత్తుగా ఉంటాయి. అవి ఒకసారి కాటు వేస్తే అవిశ్వాసికి 40 సంవత్సరాల వరకు బాధ కలుగుతూ ఉంటుంది.” (ముస్నద్ అహ్మద్)
సమాధిలో, నరకంలో కాటు వేసే పాములు నిస్సందేహంగా ఇహలోకంలోని పాముల కంటే ఎన్నో రెట్లు విషం గలవి, ప్రమాదకరమైనవి, భయంకరమైనవి. ఇహ లోకంలో ఒక సామాన్య విషసర్పం కాటు వేస్తేనే మానవుడు గిలగిల విలపిస్తాడు. వెంటనే మానవుడు స్పృహ కోల్పోతాడు. విషం ప్రవేశించిన భాగం పనికిరాకుండా పోతుంది. ముక్కు ద్వారా, నోటి ద్వారా, చెవి ద్వారా, కళ్ళద్వారా రక్తం స్రవిస్తుంది. ఈ పరిస్థితి అంతా పాము ఒక్కసారి కాటు వేసినందుకే జరుగుతుంది. ఆ మానవుడ్నే వేల రెట్లు అధిక విషం గల పాములు కాటు వేస్తూ ఉంటే ఎంతటి వ్యధకు గురవుతాడో ఆలోచించండి!
తేలు కాటు ప్రభావం, పాము కాటు ప్రభావానికి వేరుగా ఉంటుంది. తేలు కాటు వేస్తే మానవుడు రెండు విధాల బాధలకు గురవుతాడు. మొదట శరీరం ఉబ్బిపోతుంది. తరువాత ఊపిరి పీల్చుకోవటం కష్టం అవుతుంది. ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది.
నరక తేళ్ళ గురించి ప్రస్తావిస్తూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:
“అవి అడవి గాడిదల్లా ఉంటాయి. ఒకసారి కాటు వేస్తే అవిశ్వాసి నలభై సంవత్సరాల వరకు దాని మంటను భరిస్తూ ఉంటాడు.” (ముస్నద్ అహ్మద్)
అంటే దీని అర్ధం తేలు నిరంతరం కాటు వేస్తూ ఉంటే నరకవాసుని శరీరం కూడా ఉబ్బుతూ ఉంటుంది. ఊపిరి పీల్చుకోవటంలోనూ బాధ పెరుగుతూ ఉంటుంది. ఇది నరకంలోని అవిశ్వాసికి ఇవ్వబడే శిక్షల్లో ఒకటి. అవిశ్వాసులు నరకంలోని పాములను తేళ్ళను చంపగలరా? ఎక్కడికైనా పారిపోగలరా? లేదా ఎక్కడైనా దాక్కోని రక్షణ పొందగలరా?
తిరస్కారులే అప్పుడు పశ్చాత్తాపపడుతూ, “అయ్యో! మేము ముస్లిములమయి ఉంటే ఎంత బాగుండేది” అని అంటారు. (అల్ హిజ్ర్ 15:2)
అయితే ఓ విశ్వాసులారా! నరక శిక్షలను విశ్వసించే ప్రజలారా! అల్లాహ్ శిక్షలకు భయపడండి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క అవిధేయతకు దూరంకండి. అల్లాహ్ శిక్షల గురించి తెలిసి కూడా ఆయనకు అవిధేయత చూపటం అల్లాహ్కు ఆగ్రహం కలిగించినట్టే అవుతుంది.
فَهَلْ أَنتُم مُّنتَهُونَ
“మరి మీరు అల్లాహ్ అవిధేయతను వదిలివేస్తారా?” (అల్ మాయిదహ్ 5:91)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
నేటి సమాజంలో రోజు రోజుకు మనిషి నాగరికతకు సంబంధించిన ఏదోఒక పేరుతో పండుగలను జరుపుకునే సంస్కృతి వచ్చింది. మరియు ఆ పండుగలు జరిపే విధానం అధర్మ రీతిలోనే కాకుండా, మానవ నైతిక గుణాలకు పూర్తిగా వ్యతిరేకంగా కూడా ఉన్నాయి. కనుక అలాంటి పండుగలను ముస్లిం సమాజం నిర్వహించరాదని ఇస్లామీయ పండితులు ఫత్వాలు జారి చేసారు. ఆ పండుగలలో నుండి ఒక పండుగ వాస్తవాన్ని ఇక్కడ మేము తెలియజేస్తున్నాము. కనుక మన ముస్లిం సమాజం అధర్మమైన సంస్కృతి నుండి అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము.
ప్రేమికుల రోజు
వాలెంటైన్స్ డే అంటే…?
ప్రేమానురాగాలు పరిమళించే, ప్రేమ కుసుమాలు గుభాళించే శుభ దినం అని అంటారు కొందరు. అయితే ఈ రోజు వెనుక గల కథనాలేమిటో తెలుసా?
1) రోమ్ దేశస్తులు ప్రతి ఏటా పిబ్రవరి 14వ తేదీని (యూనొ) అనే స్త్రీ దేవత కొరకు మహత్తరమైన శుభ దినంగా భావిస్తారు. వారు ఆమెను తమ దేవీలకు రాణిగా ఆరాధిస్తారు. వివాహం చేసుకునేవారి కోసం శుభ సూచకం అని నమ్ముతారు.
2) క్లోడియస్ 11వ పరిపాలన కాలంలో వాలెంటైన్ అనే వ్యక్తి ఉండేవాడు. పెళ్ళి, పిల్లలు, సంసారం మనిషిని పిరికివాణ్ణి చేశాయి అని తలచిన అప్పటి రాజు యుద్ధం నిమిత్తం సైనికులు పెళ్ళి చేసుకోకూడదన్న ఆజ్ఞ జారీ చేశాడు. వాలెంటైన్ అనే వ్యక్తి రాజుకి తెలియకుండా రహస్య పెళ్ళిళ్ళు జరిపించేవాడు. అది తెలుసుకున్న రాజు అతన్ని పట్టుకొని క్రీశ. 270వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేది లూబెర్ కీలియా అనే రోము దేశస్థులు పండుగ రాత్రి ఉరి తీయించాడు. అప్పటి నుండి వాలెంటైన్ పేరుతో పండుగ జరుపుకోవడం పరిపాటయింది. ఆ తర్వాత 1996 లో స్వయంగా చర్చి గురువులే ఈ పండుగ అశ్లీలతను, నీతిబాహ్యతను పెంపొందించే విధంగా ఉందని భావించి బహిష్కరించారు కూడా.
అయితే నేడు అనేక దేశాలలో ముస్లింలు సైతం ఈ పండుగ సంబరాల్లో పాల్గొనడం మనం చూస్తాం. ఇతర మతాలు ఈ పండుగను ఏ దృష్టితో చూస్తున్నాయి అన్న విషయం అప్రధానం. ఇస్లాం మాత్రం ఇటువంటి నీతికి అనుమతించదు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి వెకిలి చేష్టలు, వెర్రి పోకడలు ముస్లిం సమాజానికే మాయని మచ్చ.
ముస్లింలు వాలెంటైన్స్ డే ఎందుకు చేయకూడదు?
ఇస్లాంలో పర్వదినం అంటే ఆరాధన, పుణ్యార్జన మార్గం, పవిత్ర భావాల సమ్మేళనం. దైవ ప్రసన్నత కోసం, స్వర్గ ప్రాప్తి కోసం, పవిత్ర లక్ష్యంతో పర్వదినం జరుపుకోవాల్సి ఉంటుంది. పిచ్చిగా త్రాగి, పశువుల్లా ప్రవర్తించడం ఇస్లాం సంస్కృతి కానేకాదు. అదో పాశ్చాత్య దురాచారం. ఆ మాటకొస్తే ముస్లిం పండుగలు మూడే. రమజాన్ పండుగ, ఖుర్బానీ పండుగ, శుక్రవారం. వీటిని మినహాయించి, స్వయంగా ముస్లింలలో ప్రాచుర్యంలో ఉన్న మీలాదున్ నబీగానీ, షబెబరాత్గానీ, పీనుగుల పండుగ (ముర్దోంకి ఈద్) గానీ, ఇతరత్రా ఉత్సవాలు, ఉరుసులుగానీ, ఇస్లాం ప్రభోదించని వింత పోకడలే. మరలాంటప్పుడు సరదా కోసం, సహజీవనం (వివాహేతర సంబంధం) కోసం నిర్వహించబడే పండుగలకు ఎలా వీలుంటుంది?
కొందరు ముస్లింలు – మేము ఈ ఉత్సవంలో, ఇది ఇస్లామీయ పండుగ అన్న భావంతో పాల్గొనడం లేదు. పరస్పరం ప్రేమాభిమానాలను పంచుకునేందుకు పాల్గొంటున్నాము అంతే అని అంటారు. వారి ఈ వాదన పస లేనిది. ఎందుకంటే? ఈ పండుగ ముమ్మాటికి రోమ్ దేశానికి చెందిన విగ్రహారాధకులది, యూద, క్రైస్తవులది అన్న విషయం తెలిసిందే. ఇందులో ముస్లింలు వెళ్ళి పాల్గొనడం ఎంత వరకు సహేతుకం? మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రభోదించారు:
“ఎవడు ఏ జాతి వేషధారణను (విధానాన్ని) అవలంబిస్తాడో వాడు వారిలో ఒకడుగా పరిగణించబడతాడు.” (అబూదావూద్: 2831)
ప్రేమంటే ఇదేనా…?
పసుపు ఎరుపు గులాబీలు పట్టుకొని రోడ్లపై పడి తిరగడమా ప్రేమంటే…? అశ్లీల భావాలను రేకెత్తించేలా ప్యాషన్ దుస్తులు ధరించి కుర్రకారును రంజింపజేయడమా ప్రేమంటే…? బోయ్/గర్ల్ ఫ్రెండ్తో కలిసి కామోన్మాదంతో రగిలిపోతూ చిందులు తొక్కడమా ప్రేమంటే…? ఇంట్లో నుంచి పారిపోయి సహజీవనం (అక్రమ సంబంధం) సాగించడమా ప్రేమంటే…? ఇది ప్రేమంటే ‘ప్రేమ పవిత్రమైనది’ అని చెప్పడమైనా మానుకోవాలి. లేదా ఇలాంటి నీచ నికృష్ట చేష్టల్ని కూకటి వేళ్ళతో పెకళించాలి. నిజంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా సిగ్గూ, లజ్జ, అభిమానాన్ని, నీతిని తగులుబెడుతున్న సినిమాల చేదు ఫలం మాత్రమే. షైతాన్, షైతాన్ మనస్తత్వం గల మనుషులు, ‘మీరెప్పుడైనా లవ్లో పడ్డారా” అని కవ్విస్తారు. ఈ మాయదారి ట్రిక్కుల్ని అందిపుచ్చుకోమని మనల్ని ఉసిగొల్పుతారు. తల్లిదండ్రులు చూడటం లేదు లేదా వారే దీనికి ఆజ్యం పోస్తున్నారు అన్న అంశాన్ని ప్రక్కనబెడితే – అల్లాహ్ చూస్తున్నాడన్న భయం కలగటం లేదా? రేపు దేవుడు ఖచ్చితంగా దీని గురించి నిలదీస్తాడన్న ఆలోచన రావడం లేదా?
హజ్రత్ అబూ హురైరా (రజియల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హితోపదేశం చేశారు:
“గతించిన జాతులు చేసిన నీతిమాలిన పోకడలకు నా ఉమ్మత్ (సముదాయం) జానెడుకు జాన, మూరకు మూర అలవాటుపడనంత వరకు ప్రళయం సంభవించదు.”అది విన్న మేము (సహాబాలు) “యా రసూలుల్లాహ్! ఏమిటి మేము ‘రోమ్’ మరియు ‘ఈరాన్’ ప్రజలను అనుసరిస్తామా?” అని అన్నాము. అందుకు “వారు తప్ప మరెవర్ని అనుకుంటున్నారు?” అని సమాధానమిచ్చారు. (బుఖారి: 6774)
“అల్లాహ్ను పరలోకాన్ని విశ్వసించినవారు అల్లాహ్పై, ఆయన ప్రవక్తపై తిరుగుబాటు చేస్తున్నవారిని ఎన్నటికి ప్రేమించరు. చివరికి వారు తమ తండ్రులైనా, కొడుకులైనా, సోదరులైనా లేదా తమ కుటుంబసభ్యులైనా సరే, ససేమిరా ప్రేమించరు. అలా ప్రేమించడాన్ని నీవు ఎన్నటికీ చూడలేవు”. (సూరతుల్ ముజాదిలా:22)
మానవుల్లో ఒండొకరి పట్ల ప్రేమ, అభిమానం, గౌరవం ఉండవచ్చు. ఆ మాటకొస్తే పశువుల్ని, ఇతరత్రా జీవరాసుల్ని సైతం ప్రేమించమంటుంది ఇస్లాం. అలా ప్రేమించలేనివారు పరిపూర్ణ విశ్వాసులు కారు అని కూడా ఖరారు చేస్తుంది. కానీ నిజమైన ప్రేమ, అభిమానం మాత్రం మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ మీదే ఉండాలి. ఖుర్ఆన్లో ఇలా ఉంది:
“మరియు మీరు అల్లాహ్నే ఆరాధించండి. మరియు ఎవ్వరినీ ఆయనకు భాగస్వాములుగా సాటి కల్పించకండి. మరియు తల్లిదండ్రులతో, దగ్గరి బంధువులతో, అనాథులతో, నిరుపేదలతో, బంధువులైన పొరుగు వారితో, అపరిచితులైన పొరుగు వారితో ప్రక్కనున్న మిత్రులతో, బాటసారులతో మరియు మీ ఆధీనంలో ఉన్న బానిసలతో అందరితోనూ ఉదార స్వభావంతో వ్యవహరించండి. నిశ్చయంగా అల్లాహ్ గర్విష్టిని, బడాయిలు చెప్పుకునే వాణ్ని ప్రేమించడు” (సూరతున్ నిసా: ౩6)
మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“మీరు పరస్పరం కరుణతో మెలగనంత వరకు విశ్వాసులు కాలేరు”అది విన్న సహచరులు ‘యా రసూలుల్లాహ్! మేమందరం పరస్పరం కరుణతోనే మసులుకుంటున్నాము కదా! అన్నారు. అప్పుడు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “మీ ఈ పరస్పర కరుణవాత్సల్యాలు కేవలం మీ ఆప్తుల వరకే పరిమితం కాకూడదు. “రహ్మతన్నాసి” సమస్త మానవుల పట్ల కనికరం కలిగి ఉండాలి. “రహ్మతన్ ఆమ్మహ్” విశ్వమంతటి ప్రాణుల పట్ల సాత్విక కరుణతో మెలగాలి” అన్నారు. (సహిహ్ తర్గీబ్:2253)
మరో హదీసులో ఇలా ఉంది: “ఒక బంధువు ఉపకారం చేస్తే ప్రతిగా ఉపకారం చేసేవాడు (నిజమైన) బంధు ప్రియుడు కాడు. తెగతెంపులు చేసుకున్నప్పటికీ వారితో సత్సంబంధాన్ని కొనసాగించే వాడే (సిసలైన) బంధు ప్రియుడు.” (బుఖారి)
అల్లాహ్ పట్ల ప్రేమంటే…?
ఒక సారి ఒక పల్లెవాసి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పవిత్ర సన్నిధికి వచ్చి – “ప్రళయం ఎప్పుడొస్తుంది?” అని అడిగాడు. “దాని కోసం నువ్వు ఏమి ఏర్పాట్లు చేసుకున్నావు?” అని అడిగారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). దానికా వ్యక్తి “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త గారిని ప్రేమించడం అన్నాడు”. అతని సమాధానం విని “అయితే నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో వారితోనే ఉంటావు” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు. (బుఖారి, ముస్లిం)
ఖుర్ఆన్లో ఇలా ఉంది: (ఓ ప్రవక్తా!) ఇలా అను: “మీకు (నిజంగా) అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (అప్పుడు) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మరియు మీ పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ గొప్ప క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. (సూరతు ఆల ఇమ్రాన్:31)
మనకు ఏది మంచిదో, ఏది చెడ్డదో మనల్ని పుట్టించిన, 70 తల్లులకన్నా ఎక్కువ ప్రేమ గల పరమోన్నత ప్రభువుకి బాగా తెలుసు. మనం ఉత్తమ రీతిలో జీవితం గడపడానికి, ఇంకా ఇహపరాల్లో సాఫల్యం పొందడానికే ఆయన మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. ఒక వేళ మనం వాటిని నిర్లక్ష్యం చేస్తే దాని దుష్ఫలితాలను తప్పకుండా మనం అనుభవించాల్సి ఉంటుంది.
ఈనాడు మనం….
పాశ్చాత్య సంస్కృతి వెర్రి తలలు వేస్తున్నది. సమాజమంతా కలుషితమై పోతున్నది. విచిత్రమేమిటంటే మన ఇళ్ళకు మనమే నిప్పు పెట్టి మనమే ఆనందిస్తున్నాము. ఎంత విడ్డూరం!
పాశ్చాత్య దేశాలు దైవాజ్ఞల్ని ఉల్లంఘించి తమ సొంత జీవన విధానాలను అనుసరించాయి. దాని దుష్పరిణామాలను నేడు తమ కళ్ళారా చూస్తున్నారు. వారు మాత్రమే కాదు మొత్తం ప్రపంచం దాని దుష్ఫలితాలను చూస్తోంది.
నా ప్రియ సోదర సోదరిమణులారా! మనం స్తుతిని మాని ఆత్మ విమర్శ చేసుకోవలసిన తరుణమిది. మనం దేవుని చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే దాని చేదు ఫలాలు మన ముందు రాకుండా ఉంటాయా?
మనం దేవుని చట్టాలను ఉల్లంఘించి ఈ రోజు దాని దుష్పలితం ఏయిడ్స్ అనే ఒక పెద్ద రూపంలో చూస్తున్నాం. ఇదంతా కూడా నీతిబాహ్యత, అశ్లీలం లాంటి వ్యర్థ విషయాలతో నిండిన సంస్కృతిని ఆదరించిన పాప ఫలితమే.
మొత్తానికి చెప్పొచ్చేటేమిటంటే మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టయితే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పినట్టు మనం దైవాజ్ఞలకనుగుణంగా జీవితం గడపాలి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల మన ఈ నిజమైన ప్రేమే మనల్ని ఇహలోకంలోనూ, పరలోకంలోనూ సఫలీకృతుల్ని చేయగలదు.
అదే విధంగా మరి కొన్ని పండుగలు కూడా మన సమాజంలో వ్యాపించి ఉన్నాయి, వీటిలో నుండి ఏ ఒక్కటిని కూడా జరుపుకోవడం ధర్మం కాదు.
1- జన్మదిన వేడుకలు: తమ పేరున లేక తమ పిల్లల పేరున లేక ఇతరుల పేరున జన్మదిన వేడుకలు నిర్వహించడం ఇస్లాం సంప్రదాయం కాదు. ఆ రోజు చేసే పార్టీలు, మరియు సంతోషాలు అంతా క్రైస్తవులు మరియు ధర్మేతరుల కార్యాలు.
2- జనవరి ఫస్ట్: జనవరి మొదటి తేదిన లేక డిసెంబర్ 31 రాత్రిని పండుగ దినంగా చేసుకోవడం, లేక ఒకరికొకరు ఆ రోజున విష్ చెయ్యడం వంటి కార్యాలన్ని నిషేధించబడ్డాయి.
3- “మదర్స్ డే” లేక “ఫాదర్స్డే“ (అమ్మా లేక నాన్న పండుగ) అనే పండుగలు మరియు వారికి విష్ చేసే విధానాలన్ని అధర్మమైనవి.
4- “మ్యారేజ్డే“ కొంత మంది ప్రజలు ప్రతి ఏట ‘మ్యారేజ్ డే’ (పెళ్ళి దినోత్సవం) చేసుకుంటారు. ఆ రోజు ఒకరికొకరు బహుమానాలతో విష్ చేసుకుంటారు. మరియు కొంత మంది పార్టీలు కూడా చేస్తారు.
5- ‘ఏప్రిల్ ఫూల్’ఈ పదంలోనే ఫూల్ అని పేర్కొనబడినది. ఆ రోజున ఇతరులతో అబద్దాలు పలికి మోసగించడం, ఆ రోజున ఎగతాళిగా జరుపుకోవడం పూర్తిగా అధర్మమైనది. ఇలాంటి అబద్ధమైన మాటలకు మరియు నవ్వులాటలకు ఇస్లామీయ ధర్మంలో ఎలాంటి స్థానం లేదు.
ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 129-137). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్లాంకు చెందిన పలు ఇతర విషయాల వలె సృష్టికర్త అయిన అల్లాహ్ను దర్శించడానికి సంబంధించిన విషయంలోనూ ముస్లింలకు చెందిన పలు వర్గాలు హెచ్చు తగ్గులకు గురయ్యారు.
ఒక వర్గమయితే ధ్యానం ద్వారా, ఆధ్యాత్మిక దివ్యజ్ఞానం ద్వారా ఇహలోకంలోనే అల్లాహ్ ను దర్శించవచ్చని ప్రకటించింది. మరొక వర్గం ఖుర్ఆన్ లోని “చూపులు ఆయనను అందుకోలేవు. కాని ఆయన చూపులను అందుకోగలడు.” (103 :6) అనే వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఇహలోకంలోనే కాకుండా పరలోకంలోనూ అల్లాహ్ ను చూడలేమని ప్రకటించింది.అయితే పవిత్ర ఖుర్ఆన్ ద్వారా, హదీసుల ద్వారా నిరూపించబడే విశ్వాసమేమిటంటే ఇహలోకంలో ఏ వ్యక్తయినా, చివరకు దైవప్రవక్త అయినా అల్లాహ్ను చూడడం సాధ్యం కాదు.
ఖుర్ఆన్లో దైవప్రవక్త హజ్రత్ మూసా (అలైహిస్సలాం) వృత్తాంతం ఎంతో వివరంగా పేర్కొనబడింది. హజ్రత్ మూసా (అలైహిస్సలాం) ఫిర్ఔన్ నుంచి విముక్తిని పొందిన తర్వాత ఇస్రాయీల్ సంతతిని వెంటబెట్టుకొని సీనా ద్వీపకల్పానికి చేరుకున్న తర్వాత సృష్టికర్త అయిన అల్లాహ్ ఆయనను తూర్ పర్వతం మీదకు పిలిచాడు. హజ్రత్ మూసా (అలైహిస్సలాం) నలభై రోజులు అక్కడ ఉన్న తర్వాత అల్లాహ్ ఆయనకు పలకలను అందజేసాడు. అప్పుడు హజ్రత్ మూసా (అలైహిస్సలాం)కు అల్లాహ్ ను దర్శించాలనే కోరిక కలిగింది. అప్పుడు హజ్రత్ మూసా (అలైహిస్సలాం) “ఓ నా ప్రభువా! నేను నిన్ను చూడగలిగేందుకై నాకు నిన్ను చూడగలిగే శక్తిని ప్రసాదించు.” అప్పుడు అల్లాహ్ ఈ విధంగా పేర్కొన్నాడు: “ఓ మూసా! నీవు నన్ను ఏ మాత్రం చూడలేవు. అయితే కొంచెం నీ ముందు ఉన్న కొండ వైపు చూడు. ఒకవేళ అది తన స్థానంలో స్థిరంగా ఉన్నట్లయితే నీవు కూడా నన్ను చూడగలవు.” అప్పుడు అల్లాహ్ తన తేజోమయ కాంతిని ఆ కొండపై ప్రసరింపజేయగా అది పిండి పిండి అయిపొయింది. అది చూసి హజ్రత్ మూసా (అలైహిస్సలాం) స్పృహ తప్పి పడిపోయారు. ఆ తర్వాత ఆయన (అలైహిస్సలాం) పశ్చాత్తాపంతో ఈ విధంగా అర్ధించారు: “నీ అస్తిత్వం పవిత్రమైనది. నేను నీ వైపుకు (నా కోరిక పట్ల పశ్చాత్తాపంతో) మరలుతున్నాను. అలాగే నేను అందరికంటే ముందు (అగోచర విషయాలను) విశ్వసించేవాడిని. (మరిన్ని వివరాల కొరకు ఖుర్అన్లోని ‘ఆరాఫ్ అధ్యాయపు 143వ వాక్యాన్ని పఠించండి). ఈ వృత్తాంతాన్ని బట్టి ఇహలోకంలో అల్లాహ్ ను చూడటమనేది సాధ్యం కాదని రుజువవుతోంది.
ఇక దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మేరాజ్ ప్రయాణం విషయానికొస్తే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) “హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ప్రభువును దర్శించారని పలికే వ్యక్తి అసత్యవాది” అని పేర్కొన్న విషయం కూడా దీనిని ధృవికరిస్తోంది. (బుఖారీ, ముస్లిమ్) ఇహలోకంలో దైవ ప్రవక్తలు సైతం అల్లాహ్ను చూడలేకపొయినప్పుడు మామూలు దాసులు అల్లాహ్ను తాము చూశామని పేర్కొనడం అసత్యం తప్ప మరేమి కాగలదు?
పవిత్ర ఖుర్ఆన్ ద్వారా, ప్రామాణికమైన హదీసుల ద్వారా పరలోకంలో స్వర్గలోకవాసులు సృష్టికర్త అయిన అల్లాహ్ ను దర్శిస్తారని రుజువవుతోంది. ఖుర్ఆన్లో యూనుస్ అనే అధ్యాయపు 26 వ వాక్యంలో అల్లాహ్ ఈ విధంగా పేర్కొన్నాడు : “మంచి పనులు చేసేవారి కొరకు మంచి ప్రతిఫలంతో పాటు ఇంకా మరొక వరం ప్రసాదించబడు తుంది.” ఈ వాక్యానికి వ్యాఖ్యానంగా హజ్రత్ సుహైబ్ రూమి (రదియల్లాహు అన్హు) ద్వారా పేర్కొనబడిన ఒక ఉల్లేఖనం ఈ విధంగా ఉంది : దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ వాక్యాన్ని పఠించిన తర్వాత ఈ విధంగా పేర్కొన్నారు: “స్వర్గ వాసులు స్వర్గంలోకి, నరకవాసులు నరకంలోకి ప్రవేశించిన తర్వాత ప్రకటించే ఒక వ్యక్తి ఈ విధంగా ప్రకటిస్తాడు : “ఓ స్వర్గవాసులారా! అల్లాహ్ మీకు ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని నేడు ఆయన నెరవేర్చాలని కోరుకుంటున్నాడు” అప్పుడు వారు ఇలా ప్రశ్నిస్తారు: “ఆ వాగ్దానం ఏది? అల్లాహ్ (తన కరుణ ద్వారా) మా ఆచరణలను (త్రాసులో) బరువైనవిగా మార్చివేయలేదా? అల్లాహ్ మమ్మల్ని నరకాగ్ని నుంచి రక్షించి స్వర్గంలోకి ప్రవేశింపజేయలేదా?” అప్పుడు వారికి, అల్లాహ్ కు నడుమ ఉన్న పరదా తొలగించబడుతుంది. అప్పుడు స్వర్గలోకవాసులకు అల్లాహ్ ను దర్శించే మహద్భాగ్యం ప్రాప్తమవుతుంది. (హజ్రత్ సుహైబ్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా పేర్కొంటున్నారు) ‘అల్లాహ్ సాక్షిగా! అల్లాహ్ దర్శనానికి మించి ప్రియమైనది, కనులకు ఆనందకరమైనది స్వర్గవాసులకు మరేదీ ఉండబోదు. (ముస్లిమ్)
ఖుర్ఆన్ లో మరొకచోట అల్లాహ్ ఈ విధంగా పేర్కొన్నాడు ; “అ రోజు ఎన్నో వదనాలు తాజాగా కళకళలాడుతూ ఉంటాయి, తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటాయి. (ఖుర్ఆన్, ఖియామహ్ :22-23) ఈ ఆయతులో స్వర్గవాసులు అల్లాహ్ వైపు చూస్తూ ఉండటమనేది స్పష్టంగా పేర్కొనబడింది. హజ్రత్ జరీర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా ఉల్లేఖించారు: మేము దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో హాజరయి ఉన్నాము. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) పున్నమి నాటి చంద్రుని వైపు చూసి ఈ విధంగా పేర్కొన్నారు : “స్వర్గంలో మీరు నేడు ఈ చంద్రుని చూస్తున్న రీతిలోనే మీ ప్రభువును చూస్తారు. అల్లాహ్ ను చూడడం మీకు ఏమాత్రం కష్టం కాబోదు.” (బుఖారీ)
కనుక ఇహలోకంలోనే అల్లాహ్ను దర్శించవచ్చని ప్రకటించినవారు మార్గభ్రష్టులై పోయారు. అలాగే పరలోకంలోనూ అల్లాహ్ ను దర్శించడం అసాధ్యమని పేర్కొన్నవారూ మార్గభ్రష్టులై పోయారు. నిజమైన విశ్వాసమేమిటంటే ఇహలోకంలో అల్లాహ్ను దర్శించడం అసాధ్యం. అయితే స్వర్గంలో స్వర్గవాసులు అల్లాహ్ను చూస్తారు. ఆ విధంగా అల్లాహ్ సందర్శనమనే మహోన్నతమైన అనుగ్రహం ద్వారా స్వర్గలోకపు మిగిలిన వరానుగ్రహాల పరిపూర్తి జరుగుతుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“విశ్వాసులారా! మీరు మిమ్మల్ని మీ కుటుంబాలను మానవులు, రాళ్ళు, ఇంధనం కాగల అగ్ని నుండి కాపాడుకోండి. దానిలో ఎంతో బలిష్టులు, అత్యంత కఠినులు అయిన దైవదూతలు నియమించబడి ఉంటారు. వారు ఎంత మాత్రం అల్లాహ్ ఆజ్ఞను ఉల్లంఘించరు. వారు తమకు ఆదేశించిన దాన్నే పాటిస్తారు.”(అత్తహ్రీమ్:6)
ఈ వాక్యంలో అల్లాహ్ (త’ఆలా) రెండు విషయాలను గురించి ఆదేశించాడు:
1. మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి రక్షించుకోండి.
2.మీ కుటుంబాన్నీ నరకాగ్ని నుండి రక్షించుకోండి.
కుటుంబం అంటే భార్యాబిడ్డలు అని అర్థం. అంటే ప్రతి వ్యక్తి తనతోపాటు తన భార్యాబిడ్డలను కూడా నరకాగ్ని నుండి రక్షించటం తప్పనిసరి అన్నమాట. భార్యా బిడ్డల పట్ల ఇదే నిజమైన శ్రేయోభిలాష మరియు అల్లాహ్ విధేయత కూడా. అల్లాహ్ (త’ఆలా) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను దీనిని గురించి ఆదేశించినప్పుడు:
(అంటే నీ బంధుమిత్రులను నరకాగ్ని పట్ల హెచ్చరించు) అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన కుటుంబం వారిని, తన తెగవారిని పిలిచారు. వారిని నరకాగ్ని పట్ల హెచ్చరించారు. చివరగా తన కుమార్తె హజ్రత్ ఫాతిమా(రదియల్లాహు అన్హా)ను పిలిచి ఇలా ఉపదేశించారు. “ఓ ఫాతిమా (రదియల్లాహు అన్హా)! నిన్ను నువ్వు నరకాగ్ని నుండి కాపాడుకో, అల్లాహ్కు వ్యతిరేకంగా (తీర్పు దినం నాడు) నేను నీకు దేనికీ పనికిరాను.” (ముస్లిమ్)
తన బంధుమిత్రులను, తన తెగవారిని నరకాగ్ని పట్ల హెచ్చరించిన తరువాత, తన కూతుర్ని నరకాగ్ని పట్ల హెచ్చరించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముస్లిములందరికీ తమ సంతానాన్ని నరకాగ్ని నుండి రక్షించటం కూడా తల్లిదండ్రుల బాధ్యతల్లో ఒక ముఖ్యమైన బాధ్యత అని చాటి చెప్పారు.
ఒక హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“ప్రతి శిశువు ప్రకృతి (ఇస్లాం) నియమానుసారం జన్మిస్తాడు. వాడి తల్లిదండ్రులు వాడిని యూదునిగానో, క్రైస్తవునిగానో, నాస్తికునిగానో మార్చి వేస్తారు.”(బుఖారి)
అంటే సాధారణంగా తల్లిదండ్రులే తమ సంతానాన్ని స్వర్గమార్గం లేదా నరక మార్గాన పెడతారు.
అల్లాహ్ (త’ఆలా) ఖుర్ఆన్లో మానవుని యొక్క అనేక బలహీనతలను గురించి పేర్కొ న్నాడు. ఉదా: “మానవుడు మహా అత్యాచారి మరియు కృతఘ్నుడు.” (ఇబ్రాహీమ్:34). “మానవుడు చాలా తొందరపాటుగలవాడు.” (బనీ ఇస్రాయీల్:11) మొదలైనవి. ఇతర బలహీనతల్లో ఒక బలహీనత ఏమిటంటే మానవుడు త్వరగా లభించే లాభాలకు ప్రాముఖ్యత ఇస్తాడు. అవి తాత్కాలికమైనవైనా, లేదా తక్కువ సంఖ్యలో ఉన్నా సరే. అయితే ఆలస్యంగా లభించే లాభాలను హీనంగా చూస్తాడు. అవి శాశ్వతమైనవైనా, అధిక సంఖ్యలో ఉన్నాసరే.
“వారు త్వరగా లభించే దాన్ని (ఇహలోకాన్ని) ప్రేమిస్తున్నారు. భవిష్యత్తులో రాబోయే కఠినమైన దినాన్ని విస్మరిస్తున్నారు.” (అద్దహ్ర:27)
మానవుల్లోని ఈ స్వాభావిక బలహీనతల వల్లే చాలా మంది తల్లిదండ్రులు తమ సంతానాన్ని ఇహలోకపు తాత్కాలిక జీవితంలో భోగభాగ్యాలు, గౌరవోన్నతులు పెద్దపెద్ద స్థానాలు ఇప్పించటానికి చదివించే ప్రయత్నం చేస్తారు. దానికి ఎంతకాలం పట్టినా, ఎంత ధనం ఖర్చు అయినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే. అయితే చాలా తక్కువ మంది తల్లిదండ్రులు తమ సంతానాన్ని పరలోక జీవితంలోని గొప్పగొప్ప స్థానాలు, గౌరవాలు ఇప్పించడానికి ధార్మిక విద్యను ఇప్పించే ఏర్పాటు చేస్తారు. పరలోక విద్య ప్రాపంచిక విద్యకన్నా ఎంతో సులువైనది. సులభమైనదీను. ఇది ఉభయ లోకాల దృష్ట్యా తల్లిదండ్రులకు లాభం చేకూర్చేదే.
ప్రాపంచిక విద్యను అభ్యసించే చాలా మంది యువకులు ఆచరణలో తల్లి దండ్రుల పట్ల ద్రోహులుగా, స్వతంత్రులుగా మారుతున్నారు. ధార్మిక విద్యను అభ్యసించే చాలా మంది యువకులు తమ తల్లిదండ్రుల పట్ల విధేయత చూపుతూ, వారి సేవ చేస్తున్నారు. ఇంకా పరలోకం దృష్ట్యా నిస్సందేహంగా సద్బుద్ధి, దైవభీతి, ధార్మికతగల ఇలాంటి సంతానమే లాభదాయకం కాగలదు. ఈ వాస్తవాలన్నింటినీ తెలిసి ఉండి, స్వీకరిస్తూ కూడా 99% మంది తల్లిదండ్రులు తము సంతానం కొరకు ధార్మిక విద్యకంటే ప్రాపంచిక విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. రండి! మానవుని యొక్క ఈ బలహీనతను మరో వైపు నుండి పరిశీలిద్దాం.
ఊహించండి! ఒక ఇంటికి నిప్పు అంటుకుంది. ఇంట్లో ఉన్న వారందరూ ఇంటి నుండి బయటికి వచ్చేస్తారు. పొరపాటున ఒక అబ్బాయి ఇంట్లో ఉండిపోతాడు. ఆ సమయంలో తల్లిదండ్రుల పరిస్థితి, ఆందోళన ఎలా ఉంటుంది? ప్రాపంచిక సమస్యలు, వ్యాపారం, ఉద్యోగం, అనారోగ్యం మొదలైనవి ఏవైనా ఆ అబ్బాయి నుండి మరల్చగలవా? ఎంతమాత్రం కాదు. తమ కుమారుడు ఆ నిప్పు నుండి రక్షించబడనంత వరకు తల్లిదండ్రులు రెప్పపాటుకైనా సుఖంగా ఉండలేరు. తమ సంతానాన్ని మంటల నుండి రక్షించటానికి తల్లిదండ్రుల ప్రాణాలు పణంగా పెట్టాలన్నా దానికి కూడా వారు సిద్ధపడతారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. తాత్కాలికమైన ఈ ఇహలోక జీవితంలో ప్రతి వ్యక్తీ తన సంతానాన్ని మంటల నుండి రక్షించాలని కోరుకుంటాడు. కానీ పరలోకంలో నరకాగ్ని నుండి తన సంతానాన్ని రక్షించాలని మాత్రం చాలా కొద్దిమందికే అర్థమవుతుంది.
وَقَلِيلٌ مِّنْ عِبَادِيَ الشَّكُورُ
అల్లాహ్ ఆదేశం : “నా దాసుల్లో చాలా కొద్ది మందే కృతజ్ఞత చూపేవారు.” (సబా:13)
నిస్సందేహంగా మానవుని ఈ బలహీనత పరీక్షలోని భాగమే. పరీక్ష కోసమే మానవుడి ఇహలోక జీవితంలోనికి పంపబడింది. ఈ పరీక్ష గురించి తెలివిగా ప్రవర్తించేవాడే బుద్ధిమంతుడు. తన సృష్టికర్త, ప్రభువుకు విధేయత చూపడమే మానవుని తెలివి తేటలకు నిదర్శనం. అల్లాహ్ (త’ఆలా) విశ్వాసులకు నరకాగ్ని నుండి తమ్ము తాము రక్షించుకోవాలని, తమ కుటుంబాన్ని నరకాగ్ని నుండి రక్షించుకోవాలని ఆదేశించాడు. ప్రతి ముస్లిం తనను, తన కుటుంబాన్ని నరకాగ్ని నుండి రక్షించు కోవడానికి ఇక్కడి తపన, ఆందోళన కంటే 69 రెట్లు అధికంగా ఆందోళన, తపనతో ఉండాలి. ఈ బాధ్యతను నిర్వర్తించటానికి ప్రతి ముస్లిం రెండు విషయాలను విధిగా పాటించాలి.
మొదటిది ఖుర్ఆన్, హదీసుల విద్యను అభ్యసించడం
ఖుర్ఆన్, హదీసుల విద్యను అభ్యసించడం. అజ్ఞానం అనేది ప్రాపంచిక విషయాల దైనా, ధార్మిక విషయాలదైనా మానవున్ని నష్టాలకు, కష్టాలకు గురిచేస్తుంది. అల్లాహ్ దీన్ని గురించి ఇలా ఆదేశించాడు:
“జ్ఞానమున్నవారూ, జ్ఞానం లేనివారూ ఇద్దరూ సమానులు కాగలరా?” (అజ్జుమర్:9)
మనం చూస్తూ ఉంటాం తీర్పు దినాన్ని విశ్వసించే వ్యక్తి, ప్రళయ మైదానం గురించి తెలిసిన వ్యక్తి, స్వర్గనరకాల శిక్షా ప్రతిఫలాలను గురించి తెలిసే వ్యక్తి యొక్క జీవితం వేరుగా ఉంటుంది. మరో వ్యక్తి కేవలం సాంప్రదాయంగా తీర్పు దినాన్ని విశ్వసిస్తాడు. కాని తీర్పు మైదానంలోని పరిస్థితులను గురించి స్వర్గనరకాల శిక్షా ప్రతిఫలాల గురించి ఏ మాత్రం అవగాహన ఉండదు. ఇటువంటి వ్యక్తి జీవితం వేరుగా ఉంటుంది. ఖుర్ఆన్ హదీసుల జ్ఞానం గలవారు ఇతరుల కన్నా ఎంతో మంచి నడవడిక కలిగి, సత్యవంతులై, భీతిపరులై, ఎల్లప్పుడూ అల్లాహ్కు భయపడుతూ ఉంటారు.
అల్లాహ్ ఆదేశం: “వాస్తవం ఏమిటంటే అల్లాహ్ దాసుల్లో కేవలం (ఖుర్ఆన్ హదీసుల) విద్యగలవారే అల్లాహ్కు భయపడతారు.”(ఫాతిర్:28)
తమ సంతానాన్ని ప్రాపంచిక విద్య కోసం ధార్మిక విద్యకు దూరం చేసే తల్లి దండ్రులు వాస్తవంగా తమ సంతానం యొక్క పరలోక జీవితాన్ని నాశనం చేసి చాలా పెద్ద అపరాధాన్ని చేస్తున్నారు. ఇంకా తమ సంతానాన్ని ప్రాపంచిక విద్యతోపాటు ధార్మిక విద్యా శిక్షణ ఇప్పిస్తున్న తల్లిదండ్రులు కేవలం తమ సంతానం యొక్క పరలోక జీవితాన్నే అలంకరించటం లేదు. తమ పరలోక జీవితాన్ని కూడా అలంకరించు కుంటున్నారు.
రెండవది – ఇంట్లో ఇస్లామీయ వాతావరణ స్థాపన:
పిల్లల వ్యక్తిత్వాన్ని ఖుర్ఆన్ హదీసుల బోధనల రూపంలో తీర్చిదిద్దడానికి ఇంట్లో ఇస్లామీయ వాతావరణం తప్పనిసరి. అయిదు పూటలూ నమాజు తప్పనిసరిగా పాటించటం, ఇంట్లో వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు సలాం చేయటం, సత్యం పలికే అలవాటు చేయటం, ఆహార సమయాల్లో ఇస్లామీయ నియమాలను దృష్టిలో ఉంచటం, దానధర్మాల అలవాటు చేయటం, పడుకునేటప్పుడు, మేల్కొనేటప్పుడు దుఆలను పఠించటం నేర్పించాలి. సంగీతం, పాటలు డప్పులు వాయించటం, చిత్రాలు, సినీ పత్రికలు, నగ్న చిత్రాలు గల వార్తాపత్రికలు మొదలైన వాటి నుండి ఇంటిని దూరంగా ఉంచాలి. అసత్యం, పరోక్ష నింద, దుర్భాషలాడటం, పొట్లాటలు, వివాదాలకు దూరంగా ఉంచాలి. ప్రవక్తల జీవిత చరిత్రలు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత చరిత్ర ఖుర్ఆన్ గాధలు, యుద్దాలు, ప్రవక్త అనుచరుల (స్త్రీ పురుషుల) జీవిత చరిత్రలు గల పుస్తకాలు పిల్లలకు అందివ్వడం, పరస్పరం మంచిగా ప్రవర్తించటం ఈ విషయాలన్ని పిల్లల వ్యక్తిత్వ వికాసానికి ప్రధాన పాత్ర వహిస్తాయి. అందువల్ల తమ సంతానాన్ని నరకాగ్ని నుండి రక్షించే బాధ్యతను నిర్వర్తించాలనుకునే తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ సంతానాన్ని ధార్మిక విద్యా శిక్షణ ఇవ్వటంతోపాటు ఇంట్లో పరిపూర్ణ ఇస్లామీయ వాతావరణాన్ని కూడా స్థాపించాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
493. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కధనం :-
శుక్రవారం రోజు ఎవరు జనాబత్ గుస్ల్ (పూర్తి స్థాయి స్నానం) చేసి (పెందలాడే) జుమా నమాజు చేయడానికి వెళ్తాడో, అతను ఒక ఒంటెను బలి ఇచ్చిన వాడవుతాడు. (తర్వాత) రెండవ వేళలో ఇలా వెళ్ళిన వ్యక్తికి ఒక ఆవును బలి ఇచ్చిన పుణ్యం లభిస్తుంది. మూడవ వేళలో వెళ్ళే వాడికి ఒక పోట్టేలును బలిచ్చిన పుణ్యం, నాల్గవ వేళలో వెళ్ళే వాడికి ఒక కోడిని బలిచ్చిన పుణ్యం లభిస్తుంది. అయిదవ వేళలో వెళ్ళేవాడు దైవమార్గంలో ఒక కోడిగ్రుడ్డును దానం చేసిన వాడవుతాడు. ఆ తరువాత ఇమామ్ మస్జిదులో ప్రవేశించగానే దైవదూతలు కూడా అతని ప్రసంగం వినడానికి వస్తారు. (ఆ తరువాత వచ్చే వారికి దైవదూతలు హాజరు వేయరు).
[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 4 వ అధ్యాయం -ఫజ్లిల్ జూముఆ]
జుమా ప్రకరణం – 2 వ అధ్యాయం – శుక్రవారం రోజు సువాసనలు పూసుకోవడం, మిస్వాక్ చేయటం మంచిది.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
ఇతరములు:
జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగం శుక్రవారం ఖుత్బా (ప్రసంగం) సమయంలో నిశ్శబ్దం పాటించడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఖుత్బా జరుగుతున్నప్పుడు ఇతరులను నిశ్శబ్దంగా ఉండమని చెప్పడం కూడా నిషేధించబడినదని, అలా చేయడం శుక్రవారం నమాజ్ యొక్క పుణ్యాన్ని కోల్పోయేలా చేస్తుందని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది. శుక్రవారం నాడు త్వరగా వచ్చి, స్నానం చేసి, నఫిల్ నమాజ్ చేసి, మౌనంగా ఖుత్బా విన్నవారికి పది రోజుల పాపాలు క్షమించబడతాయని చెప్పబడింది. ఖుత్బా వినడం అనేది అజాన్కు సమాధానం ఇవ్వడం కంటే ముఖ్యమైనదని, ఆలస్యంగా వచ్చినవారు కూడా సంక్షిప్తంగా రెండు రకాతుల నమాజ్ చేసి ఖుత్బా వినడంలో నిమగ్నం కావాలని ఈ ప్రసంగం బోధిస్తుంది.
السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الله، أما بعد. (అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్.) (అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీపై వర్షించుగాక. సర్వస్తోత్రాలు అల్లాహ్కే శోభాయమానం. అల్లాహ్ యొక్క ప్రవక్తపై శాంతి మరియు శుభాలు కలుగుగాక.)
باب الإنصات للخطبة يوم الجمعة (బాబుల్ ఇన్సాతి లిల్ ఖుత్బతి యౌమల్ జుమా) (శుక్రవారం రోజు ఖుత్బాకు మౌనంగా వినడం అనే అధ్యాయం.)
జుమా రోజు ఖుత్బా జరుగుతున్న సమయంలో మౌనం వహించడం, గమ్మున ఉండడం.
عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: إذا قلت لصاحبك يوم الجمعة أنصت والإمام يخطب، فقد لغوت (అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల్: ఇదా ఖుల్త లిసాహిబిక యౌమల్ జుముఅతి అన్సిత్ వల్ ఇమాము యఖ్తుబు, ఫఖద్ లగౌత)
అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “జుమా రోజు ఇమామ్ ఖుత్బా ఇస్తున్న సందర్భంలో నీవు నీ పక్కన ఉన్న సోదరునితో ‘మౌనం వహించు’ అని అంటే, నీవు ఒక లగ్వ్ (వ్యర్థమైన) పని చేసినవానివి అవుతావు.”
ఈ హదీస్ ద్వారా మనకు బోధపడే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒకటి, ఇమామ్ ఖుత్బా ఇస్తున్న సందర్భంలో, జుమా రోజు, మనం సైలెంట్గా ఉండాలి, మౌనం వహించాలి. ఏ కార్యకలాపాలు చేయకూడదు, ఏ మాట మాట్లాడకూడదు.
రెండో బోధ మనకిందులో, మన పక్కన ఎవరినైనా మనం చూస్తున్నాము, కొందరు మాట్లాడుకుంటున్నారు, ఏదైనా వృధా కార్యకలాపాల్లో ఉన్నారు, వారికి కూడా మనం చెప్పకూడదు. “అరే ఇలా చేయకు,” “ఓ బాయ్, ఖామోష్ రహో,” “మౌనం వహించు,” “ప్లీజ్ సైలెంట్గా ఉండు” అని మనం చెప్పకూడదు. ఇది ఇమామ్ యొక్క బాధ్యత, ఇమామ్ చెప్పాలి.
ఇక అతి ముఖ్యమైన విషయం ఇందులో మనకు తెలిసింది మరొకటి ఏమిటంటే, ఒకవేళ మనం ఇమామ్ ఖుత్బా ఇస్తున్న సందర్భంలో వేరే ఎవరితోనైనా, “మీరు గమ్మున ఉండండి,” “మాట్లాడకండి,” “ప్లీజ్ సైలెంట్” అని మనం చెప్పామంటే, మనం లగ్వ్ చేసిన వాళ్ళం అయ్యాము అని ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు.
లగ్వ్ అంటే ఇక్కడ ఏంటి? లగ్వ్ అంటే ఇక్కడ పనికిమాలిన, వృధా మాట. అయితే, చూడటానికి ఇక్కడ గమనించండి, గమనించండి, చూడటానికి మనం ఒక మంచి పని చేశామని అనిపిస్తుంది కదా? ఒక ఇద్దరు మాట్లాడుకుంటే, “ష్, సైలెంట్ ప్లీజ్” ఈ విధంగా మెల్లగా చెప్పేశాము. మనం ఒక మంచి పని చేశాము అనే భావన మనకు ఏర్పడింది. కానీ ప్రవక్త ఏమంటున్నారు? فقد لغوت (ఫఖద్ లగౌత) – “నీవు ఒక లగ్వ్ పని చేశావు” అని. మరియు ఇక్కడ లగ్వ్ అన్నదానికి భావం, ఇమామ్ హాఫిజ్ ఇబ్నె హజర్ అస్కలానీ రహ్మతుల్లా అలై తెలిపినట్లు,
خبت من الأجر (ఖిబ్త మినల్ అజ్ర్) నీవు జుమా యొక్క పుణ్యాన్ని కోల్పోయావు.
بطلت فضيلة جمعتك (బతలత్ ఫజీలతు జుముఅతిక్) జుమాకు సంబంధించిన ఏ ఘనత, ఏ గొప్పతనం అయితే ఉందో దాన్ని నీవు కోల్పోయావు అని భావం. అల్లాహు అక్బర్.
حرم فضيلة الجمعة (హురిమ ఫజీలతల్ జుమా) జుమా యొక్క ఫజీలత్ ఏదైతే ఉందో దాని నుండి అతడు మహ్రూమ్ అయిపోయాడు
అందుకొరకు సోదర మహాశయులారా, కొన్ని ప్రాంతాల్లో మనం ఏం చూస్తూ ఉన్నాము, ప్రత్యేకంగా అరబ్ ప్రాంతాల్లో, అనేకమంది మన సోదరులు, మిత్రులు ఖుత్బా అరబీలో జరుగుతుంది, మనకేం అర్థమవుతుంది అది అని చిన్నపాటిగా గుంపులుగా చేసుకొని ఇద్దరు, ముగ్గురు, నలుగురు వెనుక కూర్చుండి పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటారు. అల్లాహు అక్బర్, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఇది ఇంకా మహా ఘోరమైన విషయం.
గమనించండి ఇక్కడ. ఇద్దరు మాట్లాడుకునే వారిని, “మీరు సైలెంట్గా ఉండండి” అని చెప్పడంలోనే పాపం ఉన్నది, జుమా యొక్క సవాబ్ (పుణ్యం) కోల్పోతున్నారంటే, ఇక ఎవరైతే మాట్లాడుతున్నారో వారు ఎంత ఘోరమైన పాపంలో ఉన్నారో గమనించండి. ఈ హదీస్ ఏదైతే మీకు వినిపించానో, సహీ బుఖారీలో ఉంది, హదీస్ నంబర్ 934, అలాగే సహీ ముస్లిం, హదీస్ నంబర్ 851.
ఇక సంక్షిప్తంగా మరొక హదీస్ కూడా మనం విందాము.
عن أبي هريرة رضي الله عنه أن النبي صلى الله عليه وسلم قال: من اغتسل ثم أتى الجمعة، فصلى ما قدر له، ثم أنصت حتى يفرغ من خطبته، ثم يصلي معه، غفر له ما بينه وبين الجمعة الأخرى، وفضل ثلاثة أيام
(అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు అన్న నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల్: మనిగ్తసల సుమ్మ అతల్ జుముఅత, ఫసల్లా మా ఖుద్దిర లహు, సుమ్మ అన్సత హత్తా యఫ్రుగ మిన్ ఖుత్బతిహి, సుమ్మ యుసల్లీ మఅహు, గుఫిర లహు మా బైనహు వ బైనల్ జుముఅతిల్ ఉఖ్రా, వ ఫద్లు సలాసతి అయ్యామ్)
ఎవరైతే మంచి రీతిలో స్నానం చేశారో, జుమా నమాజు కొరకు హాజరయ్యారో మరియు ఖుత్బా కంటే ముందు వచ్చి అల్లాహ్ అతని అదృష్టంలో రాసినన్ని రకాతులు చేశాడో (ఇది జుమా ఖుత్బా కంటే ముందు, సామాన్యంగా వీటిని మనం నఫిల్ అంటాము. జుమా కంటే ముందు ఇన్ని రకాతులు అని ఫిక్స్ లేదు. కనీసం రెండు రకాతులు, కానీ అంతకంటే ఎక్కువగా ఎన్నైనా చదవవచ్చు. ఇమామ్ ఖుత్బా స్టార్ట్ చేసేకి ముందు వరకు), ఆ తర్వాత, ఎప్పుడైతే ఇమామ్ ఖుత్బా మొదలు పెడతాడో అప్పటి నుండి ఖుత్బా పూర్తి అయ్యే వరకు అన్సత (أنصت) – సైలెంట్గా ఉన్నాడు, మౌనం వహించాడు, గమ్మున ఉండిపోయాడు. ఆ తర్వాత ఇమామ్తో నమాజ్ చేశాడు. ఇలాంటి వ్యక్తికి ఈ జుమా నుండి మళ్ళీ వచ్చే జుమా వరకు, అంతకంటే మూడు రోజులు ఇంకా అదనంగా, అంటే మొత్తం పది రోజుల పాపాలు అల్లాహ్తాలా మన్నిస్తాడు. అల్లాహు అక్బర్.
గమనించండి, పది రోజుల పాపాలు జుమా రోజు నమాజుకు హాజరై, త్వరగా వచ్చి ఎన్ని రకాతులు అంటే అన్ని చేసుకొని, ఇమామ్తో ఖుత్బా వినడంలో శ్రద్ధ వహించడం, మౌనం వహించడం, అలాంటి వారి కొరకు ఈ గొప్ప ఘనత ఉంది. అంటే దీని ద్వారా తెలిసింది ఏమిటి? ఒకవేళ ఎవరైనా మాట్లాడారో, మధ్యలో ఏదైనా వృధా కార్యకలాపాలు చేశారో అంటే వారు జుమా యొక్క సవాబును కోల్పోయారు.
ఇక కొందరు ఒక ప్రశ్న అడుగుతారు. వచ్చేసరికి ఏదైనా ఆలస్యం అయిపోయింది, మేము మస్జిద్లోకి వచ్చాము, ఇమామ్ అజాన్ ఇస్తున్నాడు. ఆ సందర్భంలో ఏం చేయాలి? రెండు రకాతులు సున్నతులు చేసుకోవాలా? లేకుంటే అజాన్ అయ్యేవరకు మేము వేచి ఉండాలా, అజాన్ యొక్క జవాబు ఇవ్వడానికి? అయితే సోదర మహాశయులారా, అజాన్ యొక్క జవాబు ఇవ్వడం చాలా పుణ్యకార్యం, కానీ ఇమామ్ యొక్క ఖుత్బా వినడం అనేది అజాన్ యొక్క జవాబు కంటే ఎక్కువ ప్రాముఖ్యత గలది గనక, సంక్షిప్తంగా రెండు రకాతులు చేసుకొని కూర్చోవాలి, ఇమామ్ యొక్క ఖుత్బా శ్రద్ధగా వినాలి.
అల్లాహ్ మనందరికీ మన జీవితంలోని ప్రతీ సమస్యలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపినటువంటి పరిష్కారాన్ని స్వీకరించి ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక.
—
494. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-
“శుక్రవారం రోజు ఇమామ్ జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు, మీరు గనక మీ (ప్రక్కన కూర్చున్న) సహచరునితో ‘నిశ్శబ్దంగా’ ఉండు అని అంటే మీరొక పనికిమాలిన పనికి పాల్పడినవారవుతారు.”
[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 36 వ అధ్యాయం – అల్ ఇన్సాతి యౌముల్ జుమా వల్ ఇమాము యఖ్తుబ్]
జుమా ప్రకరణం – 3 వ అధ్యాయం – జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1 సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
ఇతరములు:
జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
دروس الصلاة -2- صفة الصلاة
నమాజ్ పాఠాలు: 2 వ పాఠం: నమాజు విధానం
వ్యవధి: 15 నిముషాలు
11:21 నిమిషాలు నమాజు విధానం తెలుపడం జరిగింది. తర్వాత 3:36 నిమిషాలు నమాజు చేసి చూపించడం జరిగింది. శ్రద్ధగా విని, చూసి నమాజు విధానం నేర్చుకోండి ఎక్కడ ఏ దుఆ చదవాలో కూడా నేర్చుకోండి
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
నమాజ్ చేస్తున్నప్పుడు నియ్యత్ తప్పనిసరి, అలాగే ప్రతి ఆరాధనలో కూడా. అయితే నియ్యత్ మనుస్సులో చేయాలి. నోటితో కాదు.
1- పూర్తి శరీరము మరియు పూర్తి శ్రద్ధాభక్తులతో ఖిబ్లా దిశలో నిలబడాలి. చూపులు, శరీరము అటూ ఇటూ ఉండకూడదు. (చూపులు సజ్దా చేసే చోట కేంద్రికరించాలి).
2- ‘తక్బీరె తహ్రీమ’ అల్లాహు అక్బర్ అంటూ రెండు చేతులు భుజాల వరకు లేదా చెవుల వరకు ఎత్తాలి.
3- కుడి అర చెయ్యిని ఎడమ అర చెయ్యిపై పెట్టి ఛాతిపై కట్టుకోవాలి.
4- దుఆయె ఇస్తిఫ్ తాహ్ చదవాలి:
అల్ హందులిల్లాహి హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్. (ముస్లిం 600).
(ఓ అల్లాహ్ నీవు పరమ పవిత్రునివి, నీకే సర్వ స్తోత్రములు, నీ నామము శుభం గలది. నీ మహిమ చాలా ఘనమయినది. నీవు తప్ప సత్య ఆరాధ్యుడెవడూ లేడు.)
ఇవి రెండే గాకుండా ఇతర దుఆలు కూడా చదవవచ్చును. ఎల్లప్పుడూ ఒకే దుఆ కాకుండా వేరు వేరు సమయాల్లో వేరు వేరు దుఆలు చదవడం ఉత్తమం. ఇలా నమాజులో నమ్రత, శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది.
(అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో * ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు, * అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు. * ప్రతిఫల దినానికి (అంటే ప్రళయ దినానికి) యజమాని. * మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము. * మాకు రుజుమార్గం (సన్మార్గం) చూపించు. * నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోనుకాని వారి మార్గం).
7- కంఠస్తం చేసి ఉన్న ఖుర్ఆనులోని ఏదైనా సూరా లేదా కొన్ని ఆయతులు పఠించాలి.
8- చేతులు భుజాల వరకు ఎత్తి, అల్లాహు అక్బర్ అంటూ రుకూ చేయాలి. రుకూలో అరచేతులతో మోకాళ్ళను పట్టుకోవాలి. వ్రేళ్ళు దగ్గరదగ్గరగా కాకుండా విడిగా ఉండాలి. సుబ్ హాన రబ్బియల్ అజీం మూడు సార్లు చదువుట సున్నత్. అంతకంటే ఎక్కువ చదవవచ్చు. ఒక్కసారి చదివినా సరిపోవును.
9- ఒంటరి నమాజు చేయు వ్యక్తి మరియు ఇమాం రుకూ నుండి తల లేపుతూ సమిఅల్లాహు లిమన్ హమిద అంటూ భుజాల వరకు చేతులెత్తాలి. నిలబడిన తర్వాత ముఖ్తదీ, ఒంటరి వ్యక్తి సమిఅల్లాహు లిమన్ హమిదహ్ కు బదులుగా రబ్బనా వలకల్ హమ్ ద్ అనాలి.
10- రుకూ తర్వాత నిలబడి ఉన్నప్పుడు ఈ దుఆ కూడా చదవవచ్చును:
అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్ దు మిల్ఉస్ సమావాతి వ మిల్ఉల్ అర్జి వ మిల్ఉ మాషిఅత మిన్ షైఇమ్ బఅదు.
(ఓ అల్లాహ్, మా ప్రభువా! నీకే ఆకాశముల నిండుగాను, భూమి నిండుగాను, అవి గాకా నీవు కోరిన వస్తువుల నిండుగాను స్తుతి గలదు. (ముస్లిం 476).)
11- అల్లాహు అక్బర్ అంటూ మొదటి సజ్దాలో వెళ్ళాలి. ఏడు అంగములపై సజ్దా చేయాలిః (1) నొసటి, ముక్కు. (2,3) రెండు అరచేతులు. (4,5) రెండు మోకాళ్ళు. (6,7) రెండు పాదముల వ్రేళ్ళు. చేతులను పక్కల నుండి దూరముంచాలి. కాళ్ళ వ్రేళ్ళను ఖిబ్లా దిశలో ఉంచి, సజ్దాలో సుబ్ హాన రబ్బియల్ అఅలా మూడు సార్లు పలుకుట సున్నత్. ఎక్కువ పలుకుట మంచిదే. ఒక్క సారి చదివినా సరిపోతుంది. ఈ స్థితిలో ఎక్కువ దుఆ చేయాలి. ఎందుకనగా ఇది దుఆ అంగీకార స్థితుల్లో ఒకటి.
12- అల్లాహు అక్బర్ అంటూ సజ్దా నుండి తలెత్తి ఎడమ పాదముపై కూర్చోవాలి. కుడి కాలు పాదమును నిలబెట్టాలి. కుడి చెయ్యి కుడి మోకాలుకు దగ్గరగా తోడపై, ఎడమ చెయ్యి ఎడమ మోకాలుకు దగ్గరగా తోడపై పెట్టాలి. చేతి వ్రేళ్ళను విడిగా పరచి ఉంచాలి. రబ్బిగ్ ఫిర్లీ రబ్బిగ్ ఫిర్లీ అని చదవాలి.
13- రెండవ సజ్దా మొదటి సజ్దా మాదిరిగా చేసి, సజ్దాలో అదే దుఆ చదవాలి.
14- అల్లాహు అక్బర్ అంటూ రెండవ సజ్దా నుండి లేస్తూ నిటారుగా నిలబడాలి.
15- రెండవ రకాత్ మొదటి రకాత్ మాదిరిగా చేయాలి. అందులో చదివిన దుఆలే ఇందులో చదవాలి. దుఆయె ఇస్తిఫ్ తాహ్ మరియు అఊజు బిల్లాహి…. తప్ప. ఈ రెండవ రకాత్ లోని రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అంటూ లేచి రెండు సజ్దాల మధ్యలో కూర్చున్న విధంగా కూర్చోని, కుడి చెయి వ్రేళ్ళను ముడుచుకొని నడిమి వ్రేళిని బొటన వ్రేళి మధ్యలో పెట్టి, చూపుడు వ్రేళితో సైగా చేస్తూ, కదలిస్తూ తషహ్హుద్ చదవాలి:
(నా వాక్కు, దేహా, ధన సంబంధమైన ఆరాధనలన్నియూ అల్లాహ్ కొరకే ఉన్నవి. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆయన శుభాలు కురువుగాకా. అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవరడూ లేడని సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు, ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను).
ఇక్కడి వరకు చదివిన తరువాత, చేతులు భుజాల వరకు ఎత్తుతూ అల్లాహు అక్బర్ అంటూ నిలబడాలి, ఒక వేళ మగ్రిబ్ లాంటి మూడు రకాతుల నమాజు లేదా జొహ్ర్, అస్ర్ మరియు ఇషా లాంటి నాలుగు రకాతుల నమాజు చేస్తుంటే, రెండవ రకాతు మాదిరిగా మిగిత నమాజు పూర్తి చేయాలి. అయితే ఖియామ్ (నిలబడి ఉన్న స్థితి)లో కేవలం సూరె ఫాతిహ చదువుతే సరిపోతుంది.
చివరి రకాతు రెండవ సజ్దా నుండి లేచి కూర్చోని తషహ్హుద్, దరూద్ ఇబ్రాహీమ్ మరియు ప్రవక్త నేర్పిన తనికిష్టమైన దుఆలు అధికంగా చదవడం మంచిది. (ఇది కూడా దుఆ అంగీకార సందర్భాల్లో ఒకటి). క్రింద దరూద్ మరియు ఒక దుఆ ఇవ్వబడుతుంది.
(ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీంను, వారి కుటుంబీకులను కరుణించినట్లు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు వారి కుటుంబీకులను కరుణించు. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి, ఘనుడివి. ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేసినట్లు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), వారి కుటుంబీకులకు శుభాలు దయ చేయుము. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి, ఘనుడివి. ఓ అల్లాహ్ నేను సమాధి శిక్షల నుండి, నరక యాతన నుండి, జీవన్మరణ పరీక్షల నుండి మరియు దజ్జాల్ మాయ నుండి రక్షణకై నీ శరణు కోరుతున్నాను).
16- అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అంటూ కుడి వైపున మెడ త్రిప్పాలి. అలాగే అంటూ ఎడమ వైపున మెడ త్రిప్పాలి.
17- జొహ్ర్, అస్ర్, మగ్రిబ్, ఇషా నమాజుల్లోని చివరి తషహ్హుద్ లో కూర్చుండే పద్ధతి ఇలా ఉండాలి. కుడి పాదాన్ని నిలబెట్టి ఎడమ పాదాన్ని కుడి కాలి పిక్క క్రింది నుంచి బైటికి తీయాలి. ఎడమ పిరుదును భూమిపై ఆనించాలి. కుడి చెయ్యి కుడి తోడపై, ఎడమ చెయ్యి ఎడమ తోడపై మోకాలుకు దగ్గరగా పెట్టాలి.
వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
అబ్దుర్-రెహ్మాన్ బిన్` ఔఫ్ (రదియల్లాహు అన్ హు) వారు ఇలా అన్నారు: మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా బోధించారు:
“ఒక దేశంలో ప్లేగు వ్యాధి వ్యాపించిందని మీరు విన్నట్లయితే, అక్కడికి వెళ్లవద్దు. కానీ మీరు ఉన్న దేశంలో అది విచ్ఛిన్నమైతే దాని నుండి తప్పించుకొని బయటకు వెళ్లవద్దు.” (సహీహ్ బుఖారి 5730)
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రార్థించేవారు:
اللهم إني أعوذ بك من البرص والجنون، والجذام، وسيئ الأسقام
ఓ అల్లాహ్! తెల్లమచ్చల రోగం నుండి, పిచ్చితనం నుండి, కుష్టు వ్యాధి నుండి, ఇతర హీనమైన రోగాల నుండి నేను నీ శరణు వేడుతున్నాను.
(ముస్నద్ ఆహ్మద్: 12592, అబూ దావూద్: 1554, సునస్ నసాయీ: 5493, అల్లామా అల్బానీ ఈ హథీసు సహీహ్ అని ధృవీకరించారు)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వస్త్రధారణ ఆదేశాలు [పుస్తకం & వీడియో పాఠాలు] https://youtu.be/7zmusYcXwMA [22 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
ఇస్లాం ధర్మం పరిశుభ్రత మరియు సౌందర్యాలను ప్రేమించు, ప్రోత్సహించు ధర్మం. ప్రతి ముస్లింకి (హద్దు లోపల ఉండి) అంద సౌందర్యాలను ప్రదర్శించే వస్త్రాలు ధరించే అనుమతిచ్చింది, ప్రోత్సహించింది. మర్మావయవాలను కప్పి ఉంచడానికి, అలంకరణగా ఉపయోగించుకోడానికి అల్లాహ్ వస్త్రాలను (తయారు చేసుకునే సాధానాలను) సృష్టించాడు. ఆయన ఆదేశం ఇలా వుంది:
“ఓ ఆదము సంతానమా! మేము మీపై దుస్తులను అవతరింపజేశాము. అవి మీరు సిగ్గుపడే మీ శరీర భాగాలను కప్పుతాయి. మీ శరీర రక్షణకు, శోభకు సాధనంగా ఉంటాయి.” (ఆరాఫ్ 7: 26).
వస్త్రధారణ విషయంలో ఏవి నిషిద్ధం అని స్పష్టమైన ఆధారం గలదో అవి తప్ప మిగతా వన్నియూ ధర్మసమ్మతమే. అలాగే ఇస్లాం వస్త్రధారణకు సంబంధించిన ఏదైనా ఒక ప్రత్యేక విధానాన్ని పరిమితం చేయలేదు. అయితే కొన్ని నియమ నిబంధనలు మాత్రం తెలిపింది. ప్రతీ ముస్లిం వస్త్రాలు ధరించినప్పుడు వాటిని ఆచరణలో ఉంచడం తప్పనిసరి. అవి ఈ విధంగా ఉన్నాయి:
1- శరీరంలో తప్పనిసరిగా దాచి ఉంచవలసిన భాగం మొత్తంపై వస్త్రం ఉండాలి. ధరించినప్పటికీ శరీరం కనబడునటువంటి పలచగా ఉండకూడదు. శరీరావయవాల పరిమాణాన్ని తెలుపునటువంటి ఇరుకుగా ఉండకూడదు.
2- ముస్లిమేతరుల ప్రత్యేక వస్త్రాల మాదిరిగా ఉండకూడదు. అలాగే సమాజంలో చెడు కార్యాలకు పాల్పడే వారికి ప్రత్యేక చిహ్నంగా ఉండే దుస్తుల మాదిరిగా కూడా ఉండకూడదు. (వారు హీరో, హీరోయిన్ల పేరుతో పిలువబడేవారయినా, వేశ్యావృత్తి అవలంభించువారైనా, మరెవరైనా సరే).
3- వృధా ఖర్చులతో కూడినవై ఉండకూడదు.
పై నియమాలను పాటిస్తూ మనిషి తనకిష్టమైన తనకు అవసరమైన, తన సమాజంలో వాడుకలో ఉన్న ఏ దుస్తులు ధరించినా మంచిదే. దుస్తుల విషయంలో వచ్చిన నివారణలు, నిషిద్ధతలకు సంబంధించిన వివరాలు క్రింద తెలుపబడుతున్నవి:
1- పురుషుల కొరకు బంగారం, పట్టు వస్త్రాలు నిషిద్ధం. అయితే అవి స్త్రీల కొరకు ధర్మసమ్మతమే. అలీ బిన్ అబూ తాలిబ్ (రజియల్లాహు అన్హు) హదీసులో ఉంది:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్టు వస్త్రాన్ని తమ కుడి చెయిలో, బంగారాన్ని తమ ఎడమ చెయిలో తీసుకొని ఇలా చెప్పారు:
“ఇవి రెండూ నా అనుచర సమాజంలోని పురుషుల కొరకు నిషేధించబడ్డాయి” అని చెప్పారు. (అబూ దావూద్/ ఫిల్ హరీరి లిన్నిసా 4057, నసాయి/ తహ్రీముజ్జహబి అలర్రిజాల్ 5053).
కాని పురుషులు వెండితో లేదా వెండి కలిపి మరేదానితోనైనా చేయబడిన ఉంగరం తమ అలవాటు ప్రకారం తొడగడంలో అభ్యంతరం లేదు.
2- ప్రాణం గల చిత్రం ఉన్న వస్త్రాలు: అంటే మనుషులు, జంతువుల చిత్రాలు గల వస్తువులు ధరించడం యోగ్యం కాదు. అవి దుస్తులయినా, నగలయినా మరేవైనా సరే.
ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం, ఆమె బొమ్మలు గీసి యున్న ఒక దిండు కొన్నది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బయటి నుండి వచ్చి దానిని చూడగానే తలుపు దగ్గరే ఆగిపోయారు. లోపలికి ప్రవేశించలేదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముఖంలో ఏదో ఇష్టం లేని చిహ్నాలు చూసి, ప్రవక్తా! నేను అల్లాహ్ వైపునకు తర్వాత ఆయన ప్రవక్త వైపునకు మరలుతున్నాను (క్షమాపణ కోరుకుంటున్నాను). నాతో జరిగిన తప్పేమిటో సెలవియ్యండి అని అన్నాను. అందుకు ఆయన “ఈ దిండు సంగతేమిటి?” అని మందలించారు. దీనికి మీరు ఆనుకొని కూర్చుంటారనే ఉద్దేశంతో నేను కొన్నాను అని చెప్పాను. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
“ఈ బొమ్మలు, చిత్రాలు చిత్రించేవారు ప్రళయదినాన శిక్షించబడుతారు. మీరు సృష్టించిన వాటిలో ప్రాణం పోయండి అని వారితో అనబడుతుంది”.
మళ్ళీ చెప్పారు:
“ఏ ఇంట్లో బొమ్మలు, చిత్రాలు ఫోటోలు ఉంటాయో ఆ ఇంట్లో దైవదూతలు ప్రవేశించరు”.
3- పురుషులపై నిషిద్ధమున్న మరో విషయం వారు తమ వస్త్రాలను చీలమండలం క్రిందికి తొడగుట.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారని అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“చీలమండలానికి క్రింద ఉన్న లుంగి (వస్త్రం) వారి ఆ భాగం నరకంలో ఉండును”. (బుఖారి/మా అస్ఫల మినల్ కాబైని… 5787).
అది పైజామా, పైంటు, దుప్పటి తదితర ఏ వస్త్రం అయినా సరే. కొందరి భ్రమ ప్రకారం ‘గర్వంతో తొడిగే వారికి ఈ శిక్ష’ అన్న మాట సరికాదు. గర్వం లేకుండా తొడిగే వారికే ఈ శిక్ష. గర్వంతో తొడిగే వారికి ఇంతకంటే మరీ ఘోరమైన శిక్ష గలదు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు:
“అహంకారంతో తన వస్త్రాన్ని (లుంగి, పైంటు వగైరాలు) ఈడుస్తూ నడిచే వ్యక్తిని అల్లాహ్ పరలోకంలో కన్నెత్తి కూడా చూడడు”.
కాని స్త్రీలు తమ వస్త్రాలను క్రింది వరకు వ్రేలాడదీయాలి. పాదాలు కూడా కనబడకుండా ఉండాలి.
4- తొడిగి కూడా నగ్నంగా కన్పించేటటువంటి పలచని, సన్నటి వస్త్రాలు యోగ్యం కావు. అలాగే శరీరావయవాల పరిమాణాన్ని వర్ణించే విధంగా ఇరుకుగా తొడుగుట యోగ్యం కాదు. ఈ ఆదేశం స్త్రీ పురుషులందరికీ వర్తిస్తుంది.ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
“ధరించికూడా నగ్నంగా కన్పించే దుస్తులు ధరించే స్త్రీలు స్వర్గంలో ప్రవేశించరు, దాని సువాసన కూడా పొందరు”. (ముస్లిం 2128).
5-. పురుషులు స్త్రీల లాంటి మరియు స్త్రీలు పురుషుల్లాంటి బట్టలు తొడుగుట నిషేధం.
ఇబ్ను అబ్బాస్ (రజియల్లాహు అన్హు) ఇలా చెప్పారు:
“స్త్రీల వేషాధారణ వేసుకునే పురుషులను, పురుషుల వేషాధారణ వేసుకునే స్త్రీలను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శపించారు”. (బుఖారి/అల్ ముతషబ్బిహూన బిన్నిసా… 5885).
6- అవిశ్వాసులు తమ ధార్మిక చిహ్నంగా ప్రత్యేకించుకున్న వేషాధారణ ముస్లిం ధరించడం నిషిద్ధం.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా ఒంటిపై కాషాయ రంగుతో కూడిన రెండు బట్టలు చూసి, “ఇవి అవిశ్వాసులు ధరించే బట్టల్లో ఒక రకమైనవి, నీవు వీటిని ధరించకు” అని చెప్పారు. (ముస్లిం/ అన్నహ్ యు అన్ లుబ్బిర్రజులి… 2077).
వస్త్రధారణ ధర్మములు
1- ముస్లిం పాటించవలసిన ధర్మాల్లో ఒకటి, కొత్త బట్టలు ధరించేటప్పుడు ఈ దుఆ చదవడం.
అబూ సఈద్ ఖుద్రీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొత్త బట్టలు ధరించేటప్పుడు చొక్కా, తలపాగ మరేదైనా దాని పేరు చెప్పి ఈ దుఆ చదివేవారు:
అల్లాహుమ్మ లకల్ హందు అంత కసౌతనీహి అస్అలుక మిన్ ఖైరిహీ వ ఖైరి మా సునిఅ లహూ వఅఊజు బిక మిన్ షర్రిహీ వషర్రి మా సునిఅ లహూ(*).
(భావం: ఓ అల్లాహ్! నీకే సర్వ స్తోత్రములు, నీవే నాకు ఈ బట్టలు ధరింపజేశావు. దీనిలోని మేలును మరియు దేని కొరకు అది నేయబడిందో దాని మేలును నీతో కోరుతున్నాను. దాని కీడు నుండి మరియు దేని కొరకు అది నేయబడిందో దాని కీడు నుండి నీ శరణు జొచ్చుచున్నాను). (అబూ దావూద్ 4020, తిర్మిజి 1767).
(*) పైన ఇవ్వబడిన దుఆ కొత్త బట్టలు ధరించేటప్పుడు చదివేది. అయితే రోజువారి బట్టలు ధరించేటప్పుడు “అల్ హందు లిల్లాహిల్లజీ కసానీ హజస్ సౌబ వరజఖనీహి మిన్ ఘైరి హౌలిమ్ మిన్నీ వలా ఖువ్వహ్” చదివే వారి పూర్వపు పాపాలన్నీ మన్నించబడతాయి. (అబూ దావూదు 4023).
2- బట్టలు తొడుక్కునేటప్పుడు కుడి వైపు నుండి తొడగడం ధర్మం.
ఆయిష (రజియల్లాహు అన్హా) చెప్పారు:
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాధ్యమైనంత వరకు మంచి కార్యాలు కుడి వైపు నుండి చేయడం మరియు మొదలు పెట్టటం ఇష్టపడేవారు. అది వుజూలోనైనా, తల దువ్వుకునేటప్పడైనా మరియు చెప్పులు తొడిగేటప్పుడైనా”. (బుఖారి 426, ముస్లిం 268).
చెప్పులు తొడిగేటప్పుడు ముందు కుడి కాలులో తొడగాలి కాని తీసేటప్పుడు ముందు ఎడమ కాలి నుండి తీయాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఆదేశించారని, అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“మీలో ఎవరయినా చెప్పులు తొడిగేటప్పుడు కుడి కాలు నుండి తొడగాలి. తీసేటప్పుడు ఎడమ కాలు నుండి తీయాలి. తొడిగితే రెండూ తొడగాలి. తీస్తే రెండూ తీయాలి”. (ముస్లిం 2097, బుఖారి 5856).
మరొక హదీసులో ఒక చెప్పు తొడిగి నడవడం నుండి నివారించబడింది. (బుఖారి 5855).
3- ప్రతీ ముస్లిం తన శరీరాన్ని, దుస్తులను పరిశుభ్రంగా, అశుద్ధతకు దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. పరిశుభ్రత ప్రతి అలంకారాణికి, అందానికి మూలం లాంటిది.ఇస్లాం పరిశుభ్రత గురించి ప్రోత్సహించడంతో పాటు శరీర, దుస్తుల శుభ్రతపై శ్రద్ధ చూపాలని కూడా చాలా ప్రోత్సహించింది.
తెల్లని బట్టలు ధరించడం మంచిది. ఇబ్ను అబ్బాస్ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖించిన హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
“మీరు తెల్లని దుస్తులు ధరించండి. మీ దుస్లులలోకెల్లా అతి ఉత్తమమైనవి ఇవే. మీ మృతులకు కూడా ఈ తెల్లని వస్త్రాలతోనే కఫన్ ఏర్పాటు చేయండి”. (అబూ దావూద్/అత్తిబ్/ ఫిల్ అమ్రి బిల్ కొహ్ లి 3878, తిర్మిజి/మా యుస్తహబ్బు మినల్ అక్సాన్ 994).
ఇతర రంగులు యోగ్యమే.
5- దుస్తులు ఇతర అలంకరణ వస్తువుల ఖరీదులో దుబార ఖర్చులు చేయకుండా, మరీ పిసినారితనం వహించకుండా మధ్యేమారాన్ని అవలంబించాలి. అల్లాహ్ ఇలా ఆదేశించాడు:
“వారు తమ సంపద వినియోగిస్తున్నప్పుడు దుబారా ఖర్చు చేయరు. ఇటు పిసినారితనం కూడా వహించరు. వారి ఖర్చు ఆ రెండు అతిచర్యలకు మధ్యస్తంగా ఉంటుంది.” (ఫుర్ఖాన్ 25: 67).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
“తినండి, త్రాగండి, ధరించండి మరియు దాన దర్మాలు చేయండి. అయితే దుబారా ఖర్చులు చేయకండి. అహంకారానికి గురికాకండి”. (బుఖారి/ కితాబుల్లిబాస్).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.