ఈ ప్రసంగంలో, “ధర్మ అవగాహనం” అనే సిరీస్ యొక్క పదవ ఎపిసోడ్లో సహాయం కోరడం (ఇస్తిఆన) అనే అంశం గురించి వివరించబడింది. ఇస్లాంలో సహాయం కోరడంలో నాలుగు రకాలు ఉన్నాయని బోధకుడు వివరిస్తున్నారు. మొదటిది, అల్ ఇస్తిఆనతు బిల్లాహ్ – అల్లాహ్ యే సహాయం కోరడం, ఇది తౌహీద్ యొక్క పునాది. రెండవది, అల్ ఇస్తిఆనతు బిల్ మఖ్లూఖాత్ – పుణ్య కార్యాల కోసం సృష్టి జీవుల నుండి సహాయం తీసుకోవడం, ఇది ధర్మసమ్మతమే. మూడవది, అల్ ఇస్తిఆనతు బిల్ అమ్వాత్ – మరణించిన వారి నుండి సహాయం కోరడం, ఇది షిర్క్ (బహుదైవారాధన) మరియు తీవ్రమైన పాపం. నాల్గవది, అల్ ఇస్తిఆనతు బి అ’మాలే సాలిహా – సహనం, నమాజ్ వంటి సత్కర్మల ద్వారా అల్లాహ్ సహాయాన్ని అర్థించడం, ఇది ప్రోత్సహించబడింది. ప్రసంగం ముగింపులో, ఖుర్ఆన్ మరియు హదీసుల ప్రకారం సరైన మార్గంలో సహాయం కోరే సద్బుద్ధిని ప్రసాదించమని అల్లాహ్ ను ప్రార్థిస్తూ ముగించారు.
اَلسَلامُ عَلَيْكُم وَرَحْمَةُ اَللهِ وَبَرَكاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు)
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనంఅనే ఈ పదవ ఎపిసోడ్ లో మనం సహాయం కోరుకోవటం అనే విషయం గురించి తెలుసుకుందాం. మనిషి పలు రకాలుగా సహాయాన్ని కోరుకుంటాడు. ఈ ఎపిసోడ్లో మనం నాలుగు రకాలు తెలుసుకుందాం.
మొదటిది: అల్లాహ్ తో సహాయం కోరడం (అల్ ఇస్తిఆనతు బిల్లాహ్)
మొదటిది అల్ ఇస్తిఆనతు బిల్లాహ్, అల్లాహ్ తో సహాయాన్ని అర్థించటం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ ఫాతిహాలో ఇలా తెలియజేశాడు:
إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ (ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్త’ఈన్) “మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము..” (1:5)
ఈ ఆయత్ సూరహ్ ఫాతిహాలోని ఆయత్. దీనిని మనం ప్రతిరోజూ, ప్రతి నమాజులో, ప్రతి రకాతులో పఠిస్తాము. దీని అర్థం: ఓ అల్లాహ్, మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కోసం నిన్నే అర్థిస్తాము, నీతోనే సహాయం కోరుతాము, ఇతరులతో సహాయము కోరము అని అర్థం.
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
وَإِذَا اسْتَعَنْتَ فَاسْتَعِنْ بِاللَّهِ (వ ఇదస్త’అంత ఫస్త’ఇన్ బిల్లాహ్) “సహాయం కోసం అర్థిస్తే అల్లాహ్ తోనే అర్పించండి.”
దీని పరంగా, ఇతరులను సహాయం కోసం మొరపెట్టుకోవటం, సహాయం కోసం ఇతరులను పూజించటం ధర్మసమ్మతం కాదు. అది షిర్క్ అవుతుంది, ఇబాదాలో షిర్క్ అవుతుంది, తౌహీద్ ఉలూహియ్యతులో షిర్క్ అవుతుంది. ఇది మొదటి విషయం. ఇటువంటి సహాయం అల్లాహ్ తోనే కోరాలి, ఇతరులతో కోరకూడదు.
రెండవది: సృష్టితాల సహాయం (అల్ ఇస్తిఆనతు బిల్ మఖ్లూఖాత్)
ఇక రెండో విషయానికి వస్తే, అల్ ఇస్తిఆనతు బిల్ మఖ్లూఖాత్. అంటే, సృష్టితాల సహాయం. కారకాలకు లోబడి, ఒకరికొకరి సహాయాన్ని కోరటం. ఇది ధర్మసమ్మతమే. దీన్ని ఇస్లాంలో ప్రోత్సహించటం కూడా జరిగింది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ మాయిదాలో ఇలా తెలియజేశాడు:
మంచికి, దైవభీతికి సంబంధించిన విషయాలలో ఒకరికొకరికి అందరితోనూ సహకరించండి. మంచి విషయాలలో, పుణ్య విషయాలలో, దైవభీతికి పుట్టిన విషయాలలో అందరితోనూ సహకరించండి. వలా త’ఆవనూ అలల్ ఇస్మి వల్ ఉద్వాన్, అంటే పాప కార్యాలలో, అధర్మ విషయాలలో, ఖుర్ఆన్ మరియు హదీసులకి విరుద్ధమైన విషయాలలో సహకరించకండి. అంటే, కారకాలకు లోబడి, పరస్పరం మనము చేయగలిగే విషయాలలో సహాయం తీసుకోవటం, ఇది ధర్మసమ్మతమే.
మూడవది: మరణించిన వారి సహాయం (అల్ ఇస్తిఆనతు బిల్ అమ్వాత్)
ఇక మూడో విషయానికి వస్తే, అల్ ఇస్తిఆనతు బిల్ అమ్వాత్, చనిపోయిన వారి సహాయం తీసుకోవటం. ఇది షిర్క్, అధర్మం, అసత్యం, ఇది ఘోరమైన పాపం, ఇది షిర్క్ కిందికి వచ్చేస్తుంది, పెద్ద షిర్క్ అవుతుంది. ఎందుకంటే, చనిపోయిన వారు, తల్లిదండ్రులైనా, పితామహులైనా, స్నేహితులైనా, సజ్జనులైనా, గురువులైనా, పండితులైనా, ఔలియాలు అయినా, ప్రవక్తలు అయినా సరే, చనిపోయిన వారు చనిపోయిన తర్వాత మన పిలుపుని వారు వినలేరు. మన సమస్యల్ని వారు దూరం చేయలేరు. కావున చనిపోయిన వారి సహాయాన్ని కోరటం ఇది ధర్మసమ్మతం కాదు, షిర్క్ క్రిందికి వస్తుంది. ఈ విషయం గురించి మనము బాగా జాగ్రత్త పడాలి.
నాల్గవది: సత్కర్మల ద్వారా సహాయం (అల్ ఇస్తిఆనతు బి అ’మాలే సాలిహా)
ఇక నాలుగో విషయం, అల్ ఇస్తిఆనతు బి అ’మాలే సాలిహా, సత్కర్మల ద్వారా సహాయాన్ని కోరటం. ఇది ధర్మసమ్మతం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ బఖరాలో ఇలా తెలియజేశాడు:
وَٱسْتَعِينُوا۟ بِٱلصَّبْرِ وَٱلصَّلَوٰةِ (వస్త’ఈనూ బిస్సబ్రి వస్సలాహ్) “మీరు ఓర్పు ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి.” (2:45)
మీరు సహనం ద్వారా, సలాహ్, నమాజ్ ద్వారా అల్లాహ్ సహాయాన్ని అర్పించండి, కోరండి అని. దీన్ని బట్టి, మంచి పుణ్యాల ద్వారా, సత్కర్మల ద్వారా, సహనం నమాజుల ద్వారా సహాయాన్ని కోరవచ్చు.
అభిమాన సోదరులారా! ఈ సహాయం అనే విషయంలో, ఖుర్ఆన్ మరియు హదీస్ కి అనుగుణంగా నడుచుకునే, ఆచరించే సద్బుద్ధిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రసాదించుగాక. ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.
ధర్మ అవగాహనం– హబీబుర్రహ్మాన్ జామయి [వీడియోలు & టెక్స్ట్]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ‘ఔలియా అల్లాహ్’ (అల్లాహ్ యొక్క మిత్రులు) యొక్క నిజమైన అర్థం మరియు నిర్వచనంపై దృష్టి సారించారు. వక్త ‘వలీ’ (ఏకవచనం) మరియు ‘ఔలియా’ (బహువచనం) అనే పదాల భాషాపరమైన మరియు మతపరమైన అర్థాలను వివరిస్తారు. సూరహ్ యూనుస్ లోని 62 మరియు 63 ఆయతుల ద్వారా ఖురాన్ యొక్క నిర్వచనాన్ని స్పష్టం చేస్తారు, దీని ప్రకారం ఔలియా అల్లాహ్ అంటే విశ్వసించి, దైవభీతి (తఖ్వా)తో జీవించేవారు. మహిమలు లేదా కరామాతులు చూపించడం అనేది ఔలియాగా ఉండటానికి అవసరమైన ప్రమాణం కాదని, అది ఒక తప్పుడు భావన అని వక్త నొక్కి చెబుతారు. అల్లాహ్ సామీప్యం అనేది కల్మషం లేని విశ్వాసం మరియు భయభక్తులతో కూడిన జీవన విధానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, ప్రతి దైవభీతిపరుడూ అల్లాహ్ కు ప్రియతముడేనని స్పష్టం చేశారు.
అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, అమ్మా బాద్.
అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
ఔలియా అల్లాహ్ అంటే ఎవరు?
ఈరోజు మనం, ఔలియా అల్లాహ్ అంటే ఎవరు? తెలుసుకుందాం. వలీ, ఔలియా. వలియుల్లాహ్, ఔలియావుల్లాహ్ అంటే ఎవరో తెలుసుకుందాం.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర యూనుస్ ఆయత్ నెంబర్ 62లో ఇలా సెలవిచ్చాడు.
أَلَا إِنَّ أَوْلِيَاءَ اللَّهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ (అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలాహుమ్ యహ్ జనూన్) “వినండి! అల్లాహ్ మిత్రులకు ఎలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.” (10:62)
ఔలియా అల్లాహ్ గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చెప్పిన మాట ఇది, సూర యూనుస్ ఆయత్ నెంబర్ 62.
ఔలియా అనే పదం, వలీ అనే పదానికి బహువచనం. అంటే, వలీ ఏకవచనం, ఔలియా బహువచనం.
నిఘంటువు పరంగా వలీ అంటే సన్నిహితుడని అర్థం వస్తుంది. దీని ప్రకారం, ఔలియా అల్లాహ్ అంటే చిత్తశుద్ధితో, అల్లాహ్ కు విధేయత కనబరచి, చెడు నుండి తమను కాపాడుకుని దైవ సామీప్యం పొందేందుకు నిరంతరం పాటుపడిన వారు ఔలియాలు.
అల్లాహ్ స్వయంగా, ఈ ఆయత్ తర్వాత, “అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలాహుమ్ యహ్ జనూన్”, వినండి, ఔలియా అల్లాహ్ కు భయము గానీ, దుఃఖము గానీ ఉండదు అని చెప్పిన తర్వాత, ఔలియా అల్లాహ్ యొక్క నిర్వచనాన్ని అల్లాహ్ తెలియజేశాడు. స్వయంగా ఈ తర్వాతి ఆయత్ లో ఔలియా అల్లాహ్ ను నిర్వచించాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. ఎవరు వారు?
الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ (అల్లజీన ఆమనూ వ కానూ యత్తఖూన్) వారు విశ్వసించిన వారై, (చెడుల విషయంలో అల్లాహ్కు) భయపడేవారై ఉంటారు.(10:63)
ఔలియా అల్లాహ్ అంటే, విశ్వాసంతో పాటు తన పట్ల భయభక్తుల విధానాన్ని కలిగి ఉంటారని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వివరించాడు. అంటే విశ్వాసంతో పాటు తన పట్ల భయభక్తుల విధానాన్ని కలిగి ఉంటారు ఔలియాలు.
అభిమాన సోదరులారా, దీన్ని బట్టి అవగతమయ్యేది ఏమిటంటే, అల్లాహ్ సామీప్యం పొందగోరేవారు, నిష్కల్మషమైన విశ్వాసం కలిగి ఉండటంతో పాటు, భయభక్తులతో కూడుకున్న జీవితం గడపాలి. ప్రతి దైవభీతిపరుడూ అల్లాహ్ కు ప్రియతముడే. వలియుల్లాహ్ యే అవుతాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దైవభీతిపరుడూ, వలియుల్లాహ్ యే అవుతాడు, అల్లాహ్ కు ప్రియతముడే అవుతాడు.
ఔలియా గురించి తప్పుడు భావనలు
కానీ, ఇక్కడ ఒక విషయం మనము గమనించాలి. సమాజంలో ఏం జరుగుతోంది. జనులు మాత్రం, సమాజంలో ఒక వర్గం వారు, కొందరు, వారు మాత్రం దీనిని ఒక ప్రహసనంగా మార్చారు. వలీ, ఔలియా అల్లాహ్ అంటే దీనిని ఒక ప్రహసనంగా మార్చేశారు. మహిమలు చూపే వారే అల్లాహ్ ప్రియతములు కాగలుగుతారని వారు భాష్యం చెప్పారు. తమ భాష్యాన్ని సమర్థించుకోవటానికి, తాము ఇష్టపడే వలీలకు స్వకల్పిత మహిమలను ఆపాదించారు.
అభిమాన సోదరులారా, ఈ విషయం గమనించండి, అల్లాహ్ సామీప్యం పొందటానికి, మహిమలు ప్రదర్శించటానికి అసలు సంబంధమే లేదు. ఒకవేళ ఎవరి ద్వారానైనా ఏదైనా మహిమ ప్రదర్శితమైతే, అది అల్లాహ్ ప్రణాళిక, దైవేచ్ఛ అని అనుకోవాలి. అంతేగానీ, అది ఆ వలీ తరఫు నుంచి జరిగిందని ఏమీ కాదు.
అలాగే, ఒక ధర్మానిష్ఠాపరుని ద్వారా, ఒక విశ్వాసి ద్వారా, ఒక దైవభీతిపరుని ద్వారా ఏదైనా మహిమ ప్రదర్శితం కాకపోయినంత మాత్రాన వారి భక్తి తత్పరతకు శంకించనవసరం లేదు, శంకించకూడదు. ఎవరి అంతర్యాలలో ఎంత భక్తి ఉందో, అది అల్లాహ్ కే బాగా తెలుసు.
అభిమాన సోదరులారా, సారాంశం ఏమిటంటే, అల్లాహ్ సామీప్యం పొందగోరే వారు, నిష్కల్మషమైన విశ్వాసం కలిగి ఉండటంతో పాటు, భయభక్తులతో కూడుకున్న జీవితం గడిపే వారు ఔలియా అల్లాహ్ అవుతారు. అంటే ప్రతి దైవభీతిపరుడూ అల్లాహ్ కు ప్రియతముడే, అంటే వలియుల్లాహ్ యే అని అర్థమైంది. అలాగే ఈ మహిమలు, కరామాతులు ప్రదర్శితమైతేనే ఔలియా అల్లాహ్, లేకపోతే లేదు అనేది ఎటువంటి రూల్స్ లేదు. అలా వాటికి సంబంధం అసలు లేదు. మహిమలు, కరామాతులు, అది జరిగినా, జరగకపోయినా, ఔలియా అల్లాహ్ అవ్వటానికి సంబంధము లేదు. ఎవరి ఆంతర్యాలలో ఎంత భక్తి ఉందో అది అల్లాహ్ కే బాగా తెలుసు.
అభిమాన సోదరులారా, ఇది క్లుప్తంగా ఔలియా అల్లాహ్ అంటే ఎవరో మనం తెలుసుకున్నాం. ఇన్ షా అల్లాహ్, ఇంకా ఇతర విషయాలు వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.
వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
తఫ్సీర్ సూర అల్ ఆలా (Tafseer Sura Al A’ala) వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/5shT_PdxwNE [60 నిముషాలు]
ఈ ప్రసంగంలో, సూరహ్ అల్-ఆ`లా యొక్క వివరణ ఇవ్వబడింది. అల్లాహ్ యొక్క పవిత్రతను కీర్తించడం (తస్బీహ్) నాలుగు విధాలుగా ఉంటుందని వివరించబడింది: హృదయంలో, మాటలో, అల్లాహ్ నామాలు మరియు గుణాల విషయంలో, మరియు ఆచరణలో. అల్లాహ్ యే సృష్టికర్త, సృష్టిని తీర్చిదిద్ది, ప్రతిదాని విధిని నిర్ధారించి, మార్గదర్శకత్వం ఇచ్చేవాడని నొక్కి చెప్పబడింది. ప్రాపంచిక జీవితం తాత్కాలికమని, పచ్చిక బయళ్ళు ఎండిపోయినట్లు మానవ జీవితం కూడా ముగుస్తుందని, కానీ అల్లాహ్ పునరుత్థానం చేస్తాడని గుర్తుచేయబడింది. ఖుర్ఆన్ ను ప్రవక్త (స)కు అల్లాహ్ యే గుర్తుంచుకునేలా చేస్తాడని, దానిని అనుసరించడం సులభతరం చేయబడిందని చెప్పబడింది. అల్లాహ్ కు భయపడేవారే ఉపదేశాన్ని స్వీకరిస్తారని, దౌర్భాగ్యులు దానిని తిరస్కరించి ఘోరమైన నరకాగ్నిలో ప్రవేశిస్తారని హెచ్చరించబడింది. ఆత్మశుద్ధి చేసుకుని, అల్లాహ్ ను స్మరించి, నమాజ్ చేసేవారే సాఫల్యం పొందుతారని. ప్రాపంచిక జీవితం కంటే పరలోక జీవితమే శ్రేష్ఠమైనదని, శాశ్వతమైనదని, ఈ సందేశం ఇబ్రాహీం (అ.స) మరియు మూసా (అ.స) గ్రంథాలలో కూడా ఉందని సూరహ్ ముగుస్తుంది. ప్రసంగం తర్వాత, ఇషా నమాజ్ సమయం, ఉదూ లేకుండా ఖుర్ఆన్ పట్టుకోవడం, మరియు షిర్క్ కు సంబంధించిన ఆచారాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడ్డాయి.
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబీయ్యినా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వసహ్బిహీ అజ్మయీన్ అమ్మా బాద్.
ప్రియ విద్యార్థులారా, ఈరోజు మనం అల్లాహ్ యొక్క దయతో సూరతుల్ ఆలా యొక్క తఫ్సీర్ ప్రారంభించబోతున్నాము. అయితే ఈ సూరకు సంబంధించి కొన్ని ప్రారంభ విషయాలు నేను ఇంతకుముందు క్లాస్ లో చెప్పి ఉన్నాను.
‘సబ్బిహ్’ – పవిత్రతను కొనియాడు, ‘సుబ్ హా నల్లాహ్’ అని పలుకుతూ ఉండు. దీని యొక్క భావం ఇంతకు ముందే నేను చెప్పాను, నాలుగు రకాలుగా ఉండాలి. మనం అల్లాహ్ యొక్క తస్బీహ్ నాలుగు రకాలుగా చేయాలి.
(1) ఒకటి, మన మనస్సులో అల్లాహ్ అన్ని రకాల షిర్క్, అన్ని రకాల లోపాలు, అన్ని రకాల దోషాలకు అతీతుడు అని బలంగా నమ్మాలి.
(2) మరియు ‘సుబ్ హా నల్లాహ్’ అని నోటితో పలుకుతూ ఉండాలి.
(3) మూడవది, అల్లాహ్ యొక్క ఉత్తమ నామాలు, అల్లాహ్ యొక్క మంచి గుణాలు అవి అల్లాహ్ కు మాత్రమే తగును, అందులో అల్లాహు త’ఆలా ఎలాంటి లోపాలు లేనివాడు అని కూడా స్పష్టంగా నమ్మాలి.
(4) ఇంకా, మన ఆచరణ ద్వారా అల్లాహ్ యొక్క పవిత్రతను కొనియాడాలి. అంటే, మనం ఏ పని చేయడం ద్వారా మనం అల్లాహ్ కు ఒక దోషాన్ని అంటగట్టిన వారం అవుతామో, అలాంటి పనులు చేయకూడదు. అల్లాహ్ అన్ని రకాల దోషాలకు, లోపాలకు అతీతుడు అని స్పష్టమయ్యే అటువంటి పనులు మనం చేయాలి. అంటే అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని చాటాలి మన యొక్క ఆచరణ ద్వారా కూడా.
ఒక చిన్న ఉదాహరణ చూడండి , మీకు విషయం అర్ధం అవుతుంది . మనం భారతీయులము గనక 15వ ఆగస్టు, 26 జనవరి ఇలాంటి సందర్భంలో మనం మన దేశ దేశానికి ఏదైతే స్వాతంత్రం లభించినదో, దానిని పురస్కరించుకొని ఒక సంబరం, ఒక సంతోషం వ్యక్తపరుస్తాము. కానీ మన తోటి భారతీయులు కొందరు ఏం చేస్తారు? ఆ సమయంలో అక్కడ నెహ్రూ గారి లేదా గాంధీ గారి యొక్క బొమ్మలు పెట్టి అక్కడ కొబ్బరికాయ కొడతారు. అయితే ఈ సందర్భంలో మనం అల్లాహ్ యొక్క పవిత్రతను కొనియాడాలి మన ఆచరణ ద్వారా. అయితే మనం, వారు అక్కడ టెంకాయ కొడుతున్నప్పుడు కేవలం ‘సుబ్ హా నల్లాహ్’ అనుకుంటే సరిపోదు. ఎప్పుడైతే ‘ఓ రండి, మీరు మా జమాత్ యొక్క పెద్ద, మీరు మా యొక్క స్కూల్ కు పెద్ద ఆర్గనైజర్, మీరు పెద్ద హెడ్ మాస్టర్’ ఈ విధంగా ఎవరైనా ఒక ముస్లింని ఆహ్వానించి ముందుకు తీసుకొచ్చి అతని చేతిలో ఓ టెంకాయ ఇచ్చి ‘కొట్టండి’ అని అంటే అక్కడ అతని యొక్క పరీక్ష. అతడు అల్లాహ్ కు కాకుండా వేరే వారికి ఈ టెంకాయ కొట్టి టెంకాయ సమర్పించినవాడు అవుతున్నాడు. అంటే అతను ‘సుబ్ హా నల్లాహ్’ నోటితో పలుకుతున్నా, ఆచరణతో వ్యతిరేకిస్తున్నాడు అని భావం. ఇప్పుడు అర్థమైందా అందరికీ క్లియర్ గా? మనం అల్లాహ్ యొక్క అల్లాహ్ యొక్క పవిత్రతను మన ఆచరణ ద్వారా మనం ఎలా కొనియాడాలి అన్న విషయం తెలిసింది కదా?
ఇక ‘రబ్బిక’ నీ ప్రభువు అన్నటువంటి పదం ఇక్కడ అల్లాహు త’ఆలా ఉపయోగించాడు. ‘సబ్బిహిల్లా’ అల్లాహ్ యొక్క పవిత్రత కొనియాడు అని అంటే కూడా మాట వస్తుంది. కానీ ‘రబ్బిక’ అనడంలో ఇక్కడ హిక్మత్, ఔచిత్యం అని కొందరు ధర్మవేత్తలు, వ్యాఖ్యానకర్తలు ఏం తెలిపారంటే, ఖుర్ఆన్ అవతరిస్తున్న సందర్భంలో ఏ ముష్రికులు అయితే ఉండేవారో చుట్టుపక్కన మొత్తం, వారు మనందరి సృష్టికర్త అయిన నిజమైన ప్రభువు అల్లాహ్ ను రబ్ అని, అల్లాహ్ ను ఖాలిఖ్ పుట్టించేవాడని, అల్లాహ్ ను రాజిఖ్ ఉపాధి ప్రదాత అని నమ్మేవారు. అయినా షిర్క్ చేసేవారు. అయితే ఇలాంటి వారికి మరీ నొక్కి చెప్పడం జరుగుతుంది. మీరు ఏ అల్లాహ్ నైతే ప్రభువు అని నమ్ముతున్నారో, ఆ ప్రభువు యొక్క పవిత్రతను కొనియాడండి. షిర్క్ కు దూరంగా ఉండిపోండి.
‘అల్-ఆలా’ అల్లాహ్ యొక్క పేరు కూడా మరియు ఇందులో అల్లాహ్ యొక్క గొప్పతనం, అల్లాహ్ ఉన్నతుడు అందుకొరకే ఇక్కడ అనువాదంలో ఉంది ‘సర్వోన్నతుడు’ అయిన. అల్లాహు త’ఆలా తన యొక్క అస్తిత్వం జాత్ కే ఏతిబార్ సే, తన యొక్క ఉత్తమ నామాలు, మంచి గుణాల విషయంలో కూడా సర్వోన్నతుడు. తన యొక్క పనులలో కూడా సర్వోన్నతుడు.
సూరహ్ అల్-ఆ`లా – 2 నుండి 5 ఆయతులు
ఈ మొదటి ఆయతులో రబ్ అంటే ఏంటి, ఆ`లా అంటే ఏంటి, తస్బీహ్ అంటే ఏంటి, ఇవన్నీ వివరాలు మనం తెలుసుకున్నాము. అయితే అల్లాహ్ యొక్క, నీ ప్రభువు యొక్క పవిత్రతను కొనియాడు. ఎందుకు పవిత్రతను కొనియాడాలి? మన యొక్క ‘సుబ్ హా నల్లాహ్’ అనడానికి తస్బీహ్ కి అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే ఎందుకు? ఇక్కడ అల్లాహు త’ఆలా ఆయతు నెంబర్ రెండు నుండి ఆయతు నెంబర్ ఐదు వరకు కొన్ని కారణాలు తెలుపుతున్నాడు. శ్రద్ధ వహించండి ఇప్పుడు.
وَالَّذِي قَدَّرَ فَهَدَىٰ (వల్లదీ ఖద్దర ఫహదా) ఆయనే (కావలసిన వాటిని తగురీతిలో) నిర్ధారించాడు. పిదప మార్గం చూపించాడు. (87:3)
ఆయనే సృష్టించాడు. ‘ఫసవ్వా’ మరి ఆపైన తీర్చిదిద్దాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అంతేకాదు, ఆ అల్లాహు త’ఆలా, ‘వల్లదీ ఖద్దర’ ఆయనే కావలసిన వాటిని తగు రీతిలో నిర్ధారించాడు. ‘తఖ్దీర్’ విధిరాత అని ఏదైతే అంటామో, దాని యొక్క ప్రస్తావన కూడా ఈ ‘ఖద్దర’ అన్న పదంలోనే వచ్చేస్తుంది. ‘ఫహదా’ పిదప మార్గం చూపించాడు.
నాలుగు పదాలు ఇక్కడ చూస్తున్నారు కదా. ఖలక, సవ్వా, ఖద్దర, హదా. ప్రియ విద్యార్థులారా, ఈ నాలుగు పదాల యొక్క అర్థమైతే ఇక్కడ ఉన్నది. ఖలక సృష్టించాడు, సవ్వా తీర్చిదిద్దాడు, ఖద్దర నిర్ధారించాడు, తఖ్దీర్ విధిరాత రాశాడు, హదా మార్గం చూపించాడు. కానీ వ్యాఖ్యానకర్తలు దీని గురించి చెప్పిన విషయాలను గమనిస్తే, అల్లాహు అక్బర్, అల్లాహ్ యొక్క గొప్పతనం మన ముందు ఎంత స్పష్టంగా వస్తుందో, మీరు ఒకసారి గమనించాలి ఈ విషయాన్ని.
ఖుర్ఆన్ లో ఇంకా అనేక సందర్భాల్లో వీటి యొక్క కొన్ని ఉదాహరణలు కూడా తెలుపబడ్డాయి. వీటి యొక్క ఈ నాలుగు పదాలు ఇక్కడ ఏవైతే వచ్చి ఉన్నాయో, వాటి యొక్క కొన్ని ఉదాహరణలు ఖుర్ఆన్ లోని వేరే సూరత్ లో. ఇంతకు ముందు మీరు ఉదాహరణకు చదివారు కదా సూరతుల్ ఇన్ఫితార్ లో? ఆయతు నెంబర్ ఏడులో.
يَا أَيُّهَا الْإِنسَانُ مَا غَرَّكَ بِرَبِّكَ الْكَرِيمِ (యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీమ్) ఓ మానవుడా! ఉదాత్తుడైన నీ ప్రభువు పట్ల ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది?(82:6)
الَّذِي خَلَقَكَ فَسَوَّاكَ فَعَدَلَكَ (అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక్) (యదార్థానికి) ఆయనే నిన్ను పుట్టించాడు, నిన్ను చక్కగా తీర్చిదిద్దాడు, ఆపైన నిన్ను తగు రీతిలో పొందికగా మలిచాడు. (82:7)
فِي أَيِّ صُورَةٍ مَّا شَاءَ رَكَّبَكَ (ఫీ అయి సూరతిమ్ మాషాఅ రక్కబక్) తాను కోరిన ఆకారంలో నిన్ను కూర్చాడు.(82:8)
గుర్తొచ్చిందా? అక్కడ చూడండి, సూరతుల్ ఇన్ఫితార్ లో మనం చదివి ఉన్నాము. అలాగే మీరు గమనించారంటే, సూరత్ అత్-తీన్ అని అంటాము కదా మనం? అక్కడ, అలాగే సూరత్ అస్-సజ్దాలో కూడా అల్లాహు త’ఆలా ఈ విషయాలను వివరించాడు.
సంక్షిప్తంగా, సారాంశంగా మనం చెప్పుకోవాలంటే, ఉదాహరణకు ఒక మనిషి విషయమే చూడండి. అల్లాహు త’ఆలా ఇక్కడ పూర్తి సృష్టి విషయం గురించి చెబుతున్నాడు. ఖలక అంటే అల్లాహు త’ఆలా పూర్తి సృష్టిని సృష్టించాడు. సవ్వా, ప్రతీ సృష్టిలో వారికి ఎలాంటి చక్కబాటు, తీర్చిదిద్దడం అవసరమో ఆ రీతిలో తీర్చిదిద్దాడు. ఖద్దర, ప్రతి ఒక్కరి విధిరాత రాసి ఉంచాడు. హదా, ప్రతి ఒక్కరికీ వారికి అవసరమైనది వారికి మార్గం చూపాడు.
కానీ ఈ విషయం కొంచెం వివరంగా ఒక్క మానవుని విషయంలోనే మనం గమనించామంటే, అల్లాహు త’ఆలా మానవుని సృష్టించాడు కదా. చూడండి ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఈ కళ్ళు మనకు వెనక వైపున ఉంటే? మన ఈ మూతి, ఫేస్ అనడం లేదు నేను, మౌత్ అని ఏదైతే అంటామో మూతి, ఇందులో నుండి అయితే పళ్ళు ఉన్నాయి, పెదవులు ఉన్నాయి, ఇది మన ఏదైనా ఒక వైపున ఉండేది ఉంటే? అలా కాకుండా కేవలం మనిషి ఒక తిండి విషయం ఆలోచించండి. మనిషి తినాలి. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం, మంచి ఆరోగ్యం ద్వారా మంచి శక్తి లభిస్తుంది, మంచి శక్తి లభిస్తే మంచిగా అల్లాహ్ ను ఆరాధించగలుగుతాడు.
ఉదాహరణకు ఒకటి తీసుకోండి. తినడానికి తన చేతిలో ఒక అన్నం ముద్దనే ఎత్తాడు అనుకోండి. చేతుల ద్వారా ముందు విషయం తెలుస్తుంది. ఆ అన్నం మెత్తగా ఉన్నదా, పాసిపోయినదా, మంచిగా ఉన్నదా, గట్టిగా ఉన్నదా? బియ్యం ఏవైతే మనం వండామో, అవి మంచిగా ఉడికాయా లేవా అన్న విషయాలు మనకు మన వేళ్ళ ద్వారా తెలుస్తుంది కదా. దానితోపాటు ఏదైనా కూర కలుపుకొని ముద్ద చేసుకొని మనం పైకి ఎత్తుతాము. అందులో ఏదైనా మనకు ఇష్టం లేని మిరపకాయ వచ్చినా కళ్ళతో కనబడుతుంది, పక్కకు తీసేస్తాము. ఒకవేళ అందులో ఏదైనా మనకు ఇష్టం లేని వాసన లాంటిది ఉండేది ఉంటే, ముక్కు కాడికి వచ్చేసరికి పక్కకు జరిపేస్తాము. ముక్కుతో మనం అది పీల్చి చూస్తాము గనక. అంతా కూడా బాగానే ఉంది అని పెదవుల వరకు తెచ్చి ఇలా నోట్లో పెడతాము. అంతలోనే నాలుక నోట్లో ఇలా పెట్టిన వెంటనే నాలుక దాని యొక్క రుచి చెబుతుంది. ఓ ఛీ ఛీ, ఇంత ఎక్కువ ఉప్పు అయిపోయిందా! కదా, నేను ఎలా నా కడుపులో దించాలి? లేదా ఇంకా వేరే ఏదైనా. అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఇస్తున్నాను నేను. ఈ విధంగా మీరు గమనించండి, అల్లాహు త’ఆలా మనకు ఎన్ని రకాల ఈ తీర్చిదిద్దడం అనే విషయంలోనే ఒక కేవలం మన శరీరంలోనే చూసుకుంటే, మళ్ళీ ఆ తర్వాత ఆ అన్నం ముద్ద మన గొంతు కిందికి దిగడానికి గొంతులో ఎలాంటి ప్రక్రియ ఉన్నది? అక్కడి నుండి మళ్ళీ కిందికి ఎప్పుడైతే వస్తుందో, జీర్ణాశయంలో వెళ్ళే వరకు మధ్యలో ఇంకా ఎక్కడెక్కడ మన యొక్క ఊపిరితిత్తులకు సంబంధించినవి, మన యొక్క లివర్ కార్యానికి సంబంధించినవి, ఈ విధంగా మీరు చూసుకోండి, ప్రతి ఒక్కటి ఎలా పనిచేస్తుంది? ఒక్కసారి మనం ఒక అన్నం ముద్ద లోపటికి వేస్తే, మన శరీరంలోని ఏ లోపలి, బయటి ఏ ఏ అవయవాలు ఏ రీతిలో పనిచేస్తాయి, ఒక పొందికగా, ఒక మంచి రీతిలో? అల్లాహు అక్బర్. నిజంగా చాలా ఆశ్చర్యపోతారు. అందుకొరకే అల్లాహ్ ఖుర్ఆన్ లో ఒక చోట ఏమంటున్నాడు? ‘వఫీ అన్ఫుసికుం అఫలా తుబ్సిరూన్’ ఏమిటి మీరు మీ యొక్క స్వయం మీ శరీరంలోనే గమనించరా? అల్లాహ్ యొక్క సృష్టి ప్రక్రియను మీరు గ్రహించండి.
ఖద్దరతఖ్దీర్ విషయం కూడా ఉన్నది, మరియు మనిషికి ఏ ఏ అవసరాలు ఏ రీతిలో నిర్ధారించాడో అల్లాహు త’ఆలా నిర్ధారించాడు. మనం మనుషులము గనుక నేను మనిషి యొక్క ఉదాహరణ ముందుగా చెబుతున్నాను, వేరే ఇంకా సృష్టిరాశుల గురించి చెప్పుకుంటూ వెళ్తే మరి ఈ రెండు ఆయతుల్లోనే ఇంకా గంటల తరబడి సమయం వెళ్ళిపోతుంది.
హదా, ప్రతి ఒక్కరికీ వారి యొక్క హిదాయత్, ఇహలోకంలో వారు ఏ రీతిలో మంచిగా జీవించాలి, పరలోకంలో స్వర్గం పొందాలంటే ఏం చేయాలి, ఇవన్నీ విషయాల యొక్క మార్గదర్శకత్వం కూడా అల్లాహు త’ఆలా చేశాడు. అల్లాహ్ ఈ నాలుగు పనులు చేసిన వాడు కనుక మీరు ఈ అల్లాహ్ యొక్క తస్బీహ్ చేయాలి, ఇంకా వేరే ఎవరి తస్బీహ్ చేయకూడదు. అంతేకాదు,
وَالَّذِي أَخْرَجَ الْمَرْعَىٰ (వల్లదీ అఖ్రజల్ మర్ఆ`) మరియు ఆయనే పచ్చిక బయళ్ళను ఉత్పన్నం చేశాడు.
فَجَعَلَهُ غُثَاءً أَحْوَىٰ ఆపైన వాటిని నల్లని చెత్తకుప్పగా చేసేశాడు.
ఎందుకు? మీతో పాటు మీ జంతువులు కూడా, మీరు ఎలాగైతే అల్లాహ్ యొక్క అనుగ్రహాలను అనుభవిస్తూ తింటూ త్రాగుతూ హాయిగా ఉన్నారో, మీ సేవకు ఉన్న వేరే జంతువుల కొరకు కూడా అల్లాహు త’ఆలా ఆహారాన్ని పుట్టించాడు. కానీ ఈ పచ్చిక బయళ్ళు మనం ఏవైతే చూస్తామో, స్వయం మన కొరకు ఆహారంగా ఉన్నటువంటి ఈ పంటల విషయం మీరు ఒకసారి చూడండి. బియ్యమైనా, వేరే కూరగాయలైనా, వేరే పప్పు దినుసులైనా, ఇవన్నీ ఏ పచ్చని పైర్ల ద్వారా మనకు లభిస్తాయో, వాటి నుండి మనం ఆ ధాన్యాలు తీసుకున్న వెంటనే, ఆ తర్వాత అది గడ్డిగా అయిపోతుంది కదా? ఆ తర్వాత మళ్ళీ మిగిలినది కూడా నల్లగా అయిపోయి, అక్కడ ఏమైనా ఇంతకుముందు పండిందో లేదో అన్నటువంటి పరిస్థితి ఆ భూమిది అయిపోతుంది.
అల్లాహు త’ఆలా ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు తెలుపుతున్నాడు? ఈ విషయాన్ని అల్లాహ్ ఇక్కడ ఎందుకు తెలుపుతున్నాడు అంటే, ఓ మానవులారా, ఏ రీతిలోనైతే మీరు ఈ పంటలు చూస్తారో, అలాగే మీ యొక్క పరిస్థితి. మీ ఏ నామ నిషాన్, మీ యొక్క ఏ గుర్తు లేకుండా ఉండినది, కానీ మీ తల్లిదండ్రుల ద్వారా అల్లాహ్ మిమ్మల్ని పుట్టించాడు. మీరు పెరిగారు, మళ్ళీ చనిపోతారు. చనిపోయిన తర్వాత, ఎలాగైతే ఈ భూమి మొత్తం ఎండిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని చినుకులు పడడం ద్వారా ఇక్కడ పచ్చిక బయళ్ళు మనకు కనబడుతున్నాయో, అదే రీతిలో మిమ్మల్ని కూడా అల్లాహు త’ఆలా మరోసారి తప్పకుండా పుట్టిస్తాడు. మరోసారి మిమ్మల్ని అల్లాహ్ పుట్టించడంలో ఎలాంటి సందేహం, ఎలాంటి అనుమానం లేదు. గమనిస్తున్నారా? అందుకొరకే ఈ లాంటి ఈ శక్తి గల అల్లాహ్ ను మాత్రమే మీరు ఆరాధించాలి. ఆయన యొక్క పవిత్రత మాత్రమే మీరు కొనియాడాలి. మరియు మీరు ఆ అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఎవరినీ ఆరాధించకూడదు. మరియు ఆ అల్లాహ్ తొలిసారి మిమ్మల్ని పుట్టించినట్లుగా, మలిసారి పుట్టించే శక్తి గలవాడు అని కూడా నమ్మాలి.
సూరహ్ అల్-ఆ`లా – 6 నుండి 9 ఆయతులు
ఇక ఆ తర్వాత రండి. ఇహలోకంలో పుట్టించి అన్ని రకాల మార్గాలు మీకు సులభం చేసిన ఈ అల్లాహు త’ఆలా, చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ పుట్టిస్తాడు కదా? అయితే మీ హృదయాలలో విశ్వాసం యొక్క మొలక నాటడానికి, సత్కార్యాల పట్ల పుణ్యం, పుణ్యం యొక్క ప్రేమ కలిగించడానికి, అల్లాహ్ మీ హిదాయత్ కొరకు ఖుర్ఆన్ అవతరింపజేశాడు. అయితే దాని విషయం ఇప్పుడు మాట్లాడుతున్నాడు అల్లాహు త’ఆలా.
سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰ (సనుఖ్రిఉక ఫలా తన్సా) (ఓ ప్రవక్తా!) మేము నిన్ను చదివిస్తాము – మరి నువ్వు దానిని మరువలేవు. (87:6)
إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفَىٰ (ఇల్లా మాషా అల్లాహ్, ఇన్నహూ యఅ`లముల్ జహ్ర వమా యఖ్ఫా) అయితే అల్లాహ్ తలచినది మాత్రం (మరువగలవు). ఆయన బహిర్గతమయ్యే దానినీ, గోప్యంగా ఉన్నదానినీ ఎరిగినవాడు. (87:7)
وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ (వనుయస్సిరుక లిల్ యుస్రా) (ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) మేము నీకు సౌలభ్యాన్ని సమకూరుస్తాము.(87:8)
ఈ మూడు ఆయతులు గుర్తున్నాయి కదా? శ్రద్ధగా వినండి. ఈ మూడు ఆయతుల యొక్క భావాన్ని, ఈ మూడు ఆయతుల యొక్క అనువాదం, ఈ మూడు ఆయతుల యొక్క సంక్షిప్త వ్యాఖ్యానాన్ని.
ఇందులో స్పష్టమైన మనకు అనువాదంలో కనబడుతున్న రీతిలో మనం చూస్తే, ఎలాంటి అనుమానం లేకుండా ఇక్కడ ఒక విషయం చెప్పడం జరుగుతుంది. ఏంటి? ఖుర్ఆన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరిస్తున్నప్పుడు, శ్రద్ధ వినండి, అర్థం చేసుకోండి. ఈ మూడు ఆయతుల భావాలు ఏవైతే ఉన్నాయో, అందులో రెండు మాటలు నేను తెలియజేస్తున్నాను కనుక మీరు శ్రద్ధగా వింటే మాట మంచిగా అర్థమవుతుంది. ఆయతు నెంబర్ ఆరు, ఏడు, ఎనిమిది. ఇక్కడ అరబీ ఆయతులకు తెలుగు అనువాదం ఏదైతే ఉందో, దాని ప్రకారంగా బాహ్యమైన అర్థం ఒకటి ఏమిటి?
“మేము నిన్ను చదివిస్తాము మరి నువ్వు మరువలేవు. అయితే అల్లాహ్ తలచినది మాత్రం మరువగలవు. ఆయన బహిర్గతమయ్యే దానిని, గోప్యంగా ఉన్న దానిని ఎరిగిన వాడు. మేము నీకు సౌలభ్యాన్ని సమకూరుస్తాము.
దీని యొక్క బాహ్యమైన అర్థం ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఖుర్ఆన్ అవతరిస్తున్న సందర్భంలో, నాకు అల్లాహ్ ఈ ఖుర్ఆన్ ఏదైతే ప్రసాదిస్తున్నాడో, నేను మరువకూడదు, నేను ఎల్లవేళల్లో నేను బ్రతికి ఉన్నంతవరకు నాకు ఈ ఆయతులు కంఠస్థం ఉండడానికి నేను మంచిగా గుర్తు చేసుకోవాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట వెంటనే చదువుతూ ఉండేవారు. దీని ప్రస్తావన మనకు ఇక్కడ ఏదైతే సూరతుల్ ఆ`లాలో చూస్తున్నారో, అదే కాకుండా మనకు సూరతుల్ ఖియామాలో కూడా కనబడుతుంది ఈ విషయం. మరియు అలాగే ఖుర్ఆన్ లో మరొకచోట కూడా అల్లాహు త’ఆలా ఈ విషయాన్ని చాలా స్పష్టం చేశాడు, బహుశా సూరతుల్ ఇస్రా అనుకుంటా. అయితే ఓ ప్రవక్తా, ఫలా తాజల్, మీరు తొందర పడకండి. ఈ ఖుర్ఆన్ ను నీవు మరిచిపోకుండా భద్రంగా మీ మనసులో ఉండే విధంగా మేము నీకు సహాయపడతాము. ఆ విషయంలో నిన్ను మీకు మేము మీకు సులభతరం ప్రసాదిస్తాము. కనుక మీరు ఎలాంటి చింత లేకుండా మీకు ఎప్పుడైతే ఈ ఖుర్ఆన్ వహీ చేయడం జరుగుతుందో అప్పుడు కేవలం శ్రద్ధగా వినండి అంతే. తర్వాత దాన్ని కంఠస్థం మీ మనసులో, మీ హృదయంలో చేసే విషయంలో మేమే నీకు తోడు పడతాము. మరి నీవు మెల్లగా చదివినా, బహిరంగంగా చదివినా అంతా కూడా అల్లాహ్ కు చాలా మంచిగా తెలుసు.
అయితే ఇక్కడ ఏడవ ఆయతు ప్రారంభంలో ఏముంది? అయితే అల్లాహ్ తలచినది మాత్రం మరువగలవు. అంటే ఏమిటి ఇది? అల్లాహ్ తలచినప్పుడు కొన్ని ఆయతులు లేదా వాటి భావాన్ని ఏదైతే రద్దు పరుస్తాడో, దాని ప్రస్తావన సూరతుల్ బఖరాలో కూడా వచ్చి ఉంది. ఆ భావం. అది అల్లాహ్ యొక్క ఇష్టం. మనం ఎందుకు అల్లాహ్ ఇలా చేస్తాడు అని అల్లాహ్ ను అడిగే హక్కు మనకు లేదు. ఉదాహరణకు, సూరతున్నూర్ లో మనకు హదీసుల ద్వారా తెలుస్తుంది, పెళ్లి అయిన వారు వ్యభిచారానికి పాల్పడితే వారిని రాళ్లు రువ్వి చంపాలి అన్నటువంటి ఆదేశం కూడా ఉండింది. అయితే దానికి సంబంధించిన ఆ ఆయతులు కూడా ఉండినవి. అల్లాహు త’ఆలా ఆదేశాన్ని మిగిలి ఉంచాడు హదీసుల ద్వారా. కానీ ఆ ఆయతులు అల్లాహు త’ఆలా ఖుర్ఆన్ లో నుండి తీసేసాడు. అది అల్లాహ్ ఇష్టం.
ఇక సూర బఖరాలో ఉంది అల్లాహ్ తలచుకున్నప్పుడు ఆయతులలో రద్దు చేస్తాడు అన్నది విషయం, అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలోనే జరిగిపోయింది, ఆ రద్దు అన్నది ఇప్పుడు జరగదు. చూస్తున్నారా సూర బఖరా ఆయతు నెంబర్ 106.
(ఓ ప్రవక్తా!) ఏదేని ఒక వాక్యాన్ని మేము రద్దుపరచినా లేక మరపింపజేసినా (దాని స్థానంలో) దానికన్నా ఉత్తమమైన దానినీ లేదా కనీసం దానికి సమానమైన దానిని తీసుకువస్తాము. అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడన్న సంగతి నీకు తెలియదా? (2:106)
భూమ్యాకాశాల సార్వభౌమత్వం అల్లాహ్దేననీ, అల్లాహ్ తప్ప మరొకరెవరూ మీ రక్షకులూ, సహాయకులూ కారన్న విషయం నీకు తెలియదా? (2:107)
ఈ విధంగా అల్లాహు త’ఆలా తలచుకున్నప్పుడు రద్దు చేయగలుగుతాడు. అతన్ని ఎవరూ కూడా కాదు అనలేరు. కానీ ఈ ఆయతు యొక్క ఈ భావం, ఈ యొక్క బాహ్య భావమే కాకుండా మరొక భావం ఇందులో ఏముంది?
ఇందులో మరొక భావం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రత్యేకమైన అనుగ్రహం, ఆయన మరిచిపోకుండా ఆయన హృదయంలో ఖుర్ఆన్ ఆయతులు నాటుకుపోయి ఉండే విధంగా అల్లాహు త’ఆలా వారికి సహాయపడతాడు. కానీ మనం ఈ ఆయతులు మరిచిపోకుండా ఉండడానికి మన వంతు ప్రయత్నం, మన వంతు త్యాగం, ప్రయాసం మనం చేస్తూ ఉండాలి. ఒకవేళ ప్రయత్నం మనం చేశాము అంటే, ఆయతు నెంబర్ ఎనిమిది గమనించండి, మేము నీకు సౌలభ్యాన్ని సమకూరుస్తాము.
ఇక్కడ సౌలభ్యం అన్నది మనకు ఎప్పుడు ఏర్పడుతుంది? చిన్నపాటి కష్టం ఏదైనా మనం చేసిన తర్వాతనే సౌలభ్యం అన్నది మనకు ఏర్పడుతుంది కదా. అందుకొరకు ఖుర్ఆన్ యాద్ చేయడంలో కూడా మనం కష్టపడాలి. మన సమయాన్ని, మన నిద్రను, మన యొక్క ప్రయత్నాన్ని అందులో వెచ్చించాలి. అప్పుడు అది మనకు అల్లాహ్ యొక్క దయతో ఎంతో సులభతరం ఏర్పడుతుంది.
మరో రకంగా ఇందులో, నేను ప్రారంభంలోనే చెప్పినట్లు, శరీరపరంగా చూసుకుంటే ఇంకా వేరే రకంగా అల్లాహు త’ఆలా మనల్ని ఎంతో మంచిగా తీర్చిదిద్ది, ఎంతో మంచి రీతిలో పుట్టించిన వాడు, ‘ఫహదా’ అని చదివారు కదా, మూడవ ఆయతు చివరిలో ‘ఫహదా’. ఆ హిదాయత్ అల్లాహ్ ఎలా ఇచ్చాడు? ఖుర్ఆన్ ద్వారా, హదీస్ ద్వారా ఇచ్చాడు. కనుక మనం ఈ ఖుర్ఆన్, హదీస్ ను చదువుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటూ ఉన్న తర్వాత సరిపోతుందా? లేదు, ఇతరులకు బోధ చేస్తూ ఉండాలి.
فَذَكِّرْ إِن نَّفَعَتِ الذِّكْرَىٰ “కనుక నీవు ఉపదేశం లాభదాయకం అయితే, ఉపదేశిస్తూ ఉండు.” (87:9)
అదే విషయం గమనించండి ఆయతు నెంబర్ తొమ్మిదిలో, కనుక నీవు ఉపదేశం లాభదాయకం అయితే ఉపదేశిస్తూ ఉండు. ఈ లాభదాయకం అయితే అని ఏదైతే ఇక్కడ ఉన్నదో, లాభదాయకం లేకుంటే వదిలేయ్ అన్నటువంటి భావం కాదు. ఇక్కడ రెండు భావాలు కనీసం గుర్తుంచుకోండి.
ఒకటి, మీరు ఉపదేశం చేస్తూ ఉండండి, ఒకరికి బోధ చేస్తూ ఉండండి, ఈ బోధ అన్నది ఏదో ఒక రీతిలో లాభదాయకంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి విని అర్థం చేసుకొని ఆచరించకపోయినా, చెప్పేవారికి లాభమే కదా అందులో? చెప్పిన పుణ్యం లభిస్తుంది కదా? అవునా కాదా? మరియు రెండో భావం, ఈ ఎవరికైతే మనం చెప్పామో, విన్న వ్యక్తి, అది ఆ సమయంలో అతనికి లాభదాయకంగా ఏర్పడకపోయినా, ఒకానొక రోజు ‘అరే అవును, ఫలానా సమయంలో వాళ్ళు నాకు చెప్పారు కదా’ అన్నటువంటి ఒక సుబూత్, ఒక రుజువు అతని వద్ద ఉంటుంది. ఏదో ఒక రకంగా. కానీ గమనించండి. ఎవరైనా మనకు ఏదైనా ఉపదేశం చేస్తున్నారు, ఆ ఉపదేశం మనకు లాభదాయకం కావాలి అంటే ఏం ఉండాలి మనలో? ఆయతు నెంబర్ 10 గమనించండి.
చూస్తున్నారా? అందుకొరకే ఒక వ్యక్తి మనకు చెప్పాడు, ‘ఏంటయ్యా, నీవు కొంచెం నమాజ్ లో వెనక ఉన్నావు. ఏంటయ్యా, ఈ తాగుడు మానుకో. ఏంటయ్యా, ఈ పాపాన్ని వదులుకో.’ ‘అరే పోరా పో, నీది నువ్వు చూసుకో. నాకెందుకు చెబుతున్నావ్?’ ఇలా అనకూడదు. ఈ రోజుల్లో చాలా అలవాటు అయిపోయింది కదా ఎంతో మందికి ఇలా చెప్పడం. ఎందుకు? ఒక వ్యక్తి మనకు ఏదైనా ఉపదేశం చేశాడంటే, మనకు లాభం చేకూర్చడానికి ప్రయత్నం చేశాడు అతను. అంతేకాదు, అల్లాహ్ మనపై దయ తలిచాడు. మనకు సన్మార్గం చూపించడంలో ఒకరి యొక్క సహాయం అల్లాహ్ మనకు అందించాడు. ఇక నేను ఇలా అడ్డం తిరిగి, ఇలాంటి తప్పుడు సమాధానం ఇచ్చానంటే, నేను అల్లాహ్ యొక్క భయం నా మనసులో లేనట్లే కదా. అర్థమవుతుందా అవతలేదా? అందుకొరకే సూర బఖరాలో ఒక చోట ఏమున్నది? ఎవరైతే అల్లాహ్ తో భయపడండి.
“అల్లాహ్కు భయపడు” అని వాడితో అన్నప్పుడు, వాడి గర్వం, దురభిమానం వాడ్ని పాపం వైపుకే పురికొల్పుతుంది. ఇలాంటి వారికి నరకమే గతి. అది అతి చెడ్డ నివాస స్థలం. (2:206)
అల్లాహ్ తో భయపడండి అని అంటే, అతడు విర్రవీగుతాడు. అహంకారానికి గురి అవుతాడు. నాకు చెప్పే వానివి ఎవనివి నువ్వు? అని ఎదురు తిరుగుతాడు. వాస్తవానికి ఇలాంటి వ్యక్తి ఎవడు? గమనించండి ఆ తర్వాత ఆయతు నెంబర్ 11.
وَيَتَجَنَّبُهَا الْأَشْقَى (వయతజన్నబుహల్ అష్ ఖా) “దౌర్భాగ్యుడు మాత్రమే దాన్ని దాట వేస్తాడు.” (87:11)
ఆ ఉపదేశాన్ని దౌర్భాగ్యుడు మాత్రమే దాటవేస్తాడు. అల్లాహు అక్బర్. ఏంటమ్మా, నువ్వు ఏదో పనికి బయటికి వెళ్తున్నావు కదమ్మా, కొంచెం పరదా చేసుకుంటూ వెళ్ళమ్మా. అల్లాహ్ ది ఈ ఆదేశం ఇచ్చాడు. ‘ఓ మౌల్సాబ్ మీరు మీ పని చూసుకోండి. మాకు ఇదంతా బోధ చేసే అవసరం లేదు.’ ఇలా ఉండకూడదు. ఎవరైనా ఇలా అడ్డం తిరిగారు, ఉపదేశాన్ని గ్రహించలేదు, ఉపదేశాన్ని స్వీకరించలేదు అంటే, నేను కాదండి చెప్పేది, అల్లాహ్ ఏమంటున్నాడో గమనించండి. అతడు అష్ ఖా, మహా దౌర్భాగ్యుడు అయిపోతాడు. ఇంతకుముందే నేను చెప్పాను కదా మీకు, షఖీ అంటే దౌర్భాగ్యుడు. అష్ ఖా అంటే మహా దౌర్భాగ్యుడు లేదా పెద్ద దౌర్భాగ్యుడు లేదా అత్యంత దౌర్భాగ్యుడు. ఈ విధంగా వస్తుంది భావం.
మనం ఇలాంటి ఏమైనా బోధనలు వింటేనే కదండీ మనకు అల్లాహ్ యొక్క భయం ఇంకింత ఎక్కువగా కలిగేది. మరి ఈ విషయాన్ని మనం తిరస్కరించేసాము అంటే, ఎవరైనా మనకు బోధ చేస్తున్నప్పుడు మనం అతని బోధను ఏమాత్రం గమనించకుండా, అర్థం చేసుకోకుండా ఉండేది ఉంటే, వాస్తవానికి మనకు మనం దౌర్భాగ్యాన్ని కొనుక్కున్న వాళ్ళం అయిపోతాము. ఇక ఇలా ఉపదేశాన్ని తిరస్కరించి, ఖుర్ఆన్, హదీసుల మాటలను మనం అర్థం చేసుకోకుండా, చెప్పిన వానికే అడ్డంగా తిరిగి ప్రవర్తించామంటే, దౌర్భాగ్యులైపోయాము. ఈ దౌర్భాగ్యుని పరిస్థితి ఏమవుతుంది? గమనించండి ఆయతు నెంబర్ 12 లో.
الَّذِي يَصْلَى النَّارَ الْكُبْرَىٰ (అల్లదీ యస్లన్-నారల్ కుబ్రా) వాడు పెద్ద (ఘోరమైన) అగ్నిలోకి ప్రవేశిస్తాడు. (87:12)
వాడు పెద్ద ఘోరమైన అగ్నిలోకి ప్రవేశిస్తాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరినీ కూడా ఇలాంటి ఈ దౌర్భాగ్యం నుండి కాపాడు గాక. అల్లాహు త’ఆలా నరక ప్రవేశం నుండి కూడా మనల్ని కాపాడు గాక. అయితే ప్రతిరోజు కనీసం మూడుసార్లు దువా చేసుకుంటూ ఉండాలి. ‘ఓ అల్లాహ్ నన్ను స్వర్గంలో ప్రవేశించు, ఓ అల్లాహ్ నన్ను నరకం నుండి కాపాడు’ అని కనీసం మూడుసార్లు మనం ఇలా దువా చేసుకుంటూ ఉండాలి. ఆ నరకం ఎలాంటిది? అక్కడ శిక్షలు భరించలేక చనిపోదామని మనిషి కోరుకుంటాడు. కానీ,
వాడు అందులో చావనైనా చావడు. చస్తే ఏమవుతుంది? ఈ కష్టాలన్నిటినీ కూడా చూడకుండా ఉంటాము. కానీ చావు రాదు. వలా యహ్యా, బ్రతకనైనా బ్రతకడు. అంటే ఈ శిక్షలను తప్పించుకొని ఏదైనా మంచి బ్రతుకు కూడా దొరకదు. ఏ స్థితిలో ఉంటాడు? కేవలం అనువాదం చదివి ఎవరికైనా కన్ఫ్యూజ్ కాకూడదు అని బ్రాకెట్లో అక్కడ రాశారు, రెంటికీ మధ్య దుర్భర స్థితిలో ఉంటాడు. అల్లాహు అక్బర్. అల్లాహు త’ఆలా ఈ నరక శిక్షల నుండి మనందరినీ కూడా కాపాడు గాక.
ఇక్కడ చూస్తున్నారా, మనిషి నరకంలో శిక్షలను భరించలేక ఏమంటాడు? చూడండి ఇక్కడ. సూర నెంబర్ 25, ఆయతు నెంబర్ 13, 14.
وَإِذَا أُلْقُوا مِنْهَا مَكَانًا ضَيِّقًا مُّقَرَّنِينَ دَعَوْا هُنَالِكَ ثُبُورًا నరకంలోని ఒక ఇరుకైన స్థలంలో వారిని కాళ్ళూ, చేతులూ బంధింపబడిన స్థితిలో పడవేయబడినప్పుడు వారు చావు కోసం అరుస్తారు. (25:13)
నరకంలోని ఒక ఇరుకైన స్థలంలో వారిని కాళ్లు, చేతులు బంధింపబడిన స్థితిలో పడవేయబడినప్పుడు, ద’అవ్ హునాలిక సుబూరా, వారు అక్కడ చావు కోసం అరుస్తారు. మాకు చావు రావాలని కోరుకుంటారు.
لَّا تَدْعُوا الْيَوْمَ ثُبُورًا وَاحِدًا وَادْعُوا ثُبُورًا كَثِيرًا (లా తద్ ఉల్ యవ్మ సుబూరవ్ వాహిదవ్ వద్ ఉ సుబూరన్ కసీరా) “ఈ రోజు ఒక్క చావు కోసం అరవకండి, అనేక చావుల కోసం అరుస్తూ ఉండండి” (అని వారితో అనబడుతుంది). (25:14)
ఈ రోజు ఒక్క చావు కోసం అరవకండి, అనేక చావుల కోసం అరుస్తూ ఉండండి అని వారితో అనబడుతుంది. అంటే ఏంటి? అనేక చావుల కోసం అరిస్తే చావు వస్తుందనా? కాదు. ఇక్కడ మీరు ఇక ఒర్రుకుంటూ ఉండాల్సిందే. ఇప్పుడు మీ మాట వినడం జరగదు. ఇహలోకంలో ఎంతమంది మంచి వాళ్ళు వచ్చి మీకు చెబుతూ ఉంటే మీరు ఇలాగే మా మాటలు తిరస్కరించారు కదా.
అలాగే మనం ఇంతకుముందు కూడా చదివి వచ్చాము సూరతుల్ ఇన్షిఖాఖ్ లో ఈ ఆయతు.
وَيَدْعُو ثُبُورًا (వ యద్ ఉ సుబూరా) అతను చావు కోసం కేకలు వేస్తాడు. (84:11)
మరెవరి కర్మల పత్రం అతని వీపు వెనక నుండి ఇవ్వబడుతుందో అతను చావు కోసం కేకలు వేస్తాడు.
إِنَّهُ كَانَ فِي أَهْلِهِ مَسْرُورًا (ఇన్నహూ కాన ఫీ అహ్లిహీ మస్రూరా) ఈ వ్యక్తి (ఇహలోకంలో) తన వారి మధ్య తెగ సంబరపడేవాడు. (84:13)
ఈ వ్యక్తి ఇహలోకంలో తన వారి మధ్య తెగ సంబరపడేవాడు. ఈ రోజుల్లో ముస్లింలకు బాధ కలిగిస్తూ తిరిగి వెళ్లి తమ యొక్క గ్యాంగ్ లో, గ్రూప్ లో, తమ యొక్క ఇంటివారు, తమ యొక్క ఫ్రెండ్స్ వారందరికీ ఎంతో సంతోషంగా చెప్పుకుంటూ తిరుగుతారు కదా. కానీ ప్రళయ దినాన పరిస్థితి చాలా గాంభీర్యంగా ఉంటుంది.
సూరహ్ అల్-ఆ`లా – 14 నుండి 19 ఆయతులు
ఇక రండి అల్లాహు త’ఆలా ఈ కొన్ని విషయాలు తెలిపిన తర్వాత మళ్ళీ ఏ రీతిలో మనకు బోధ చేస్తున్నాడో గమనించండి.
కచ్చితంగా సాఫల్యం పొందాడు. ఎవరండి? పవిత్రుడైన వాడు. మన్ తజక్కా. ‘తజక్కా’ పవిత్రత అంటే ఇక్కడ, మనిషి అన్ని రకాల షిర్క్, బిద్’అత్ ల నుండి. తజక్కా, అన్ని రకాల షిర్క్, బిద్’అత్ లకు దూరంగా ఉండాలి. తజక్కా, తన మనసును పరిశుభ్ర పరచుకోవాలి. ఏ కపటము, జిగత్సు, ఎలాంటి అసూయ లాంటి చెడు గుణాలు లేకుండా ఉండాలి.
وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ (వ-జకరస్మ రబ్బిహీ ఫసల్లా) అతను తన ప్రభువు నామాన్ని స్మరించాడు. నమాజు ఆచరించాడు.(87:15)
అతను తన ప్రభువు నామాన్ని స్మరించాడు. ఈ విషయంలో కూడా సర్వసామాన్యంగా మన వద్ద చాలా చాలా బద్ధకం ఉన్నది. ధర్మం తెలిసిన వాళ్లలో కూడా. కూర్చుంటూ, లేస్తూ, ఎల్లవేళల్లో అల్లాహ్ యొక్క నామస్మరణ చేయడం, సుబ్ హా నల్లాహ్, అల్హందులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, ఏదైనా సందర్భంలో ఎవరితోనైనా కలిసినప్పుడు ఆ ఏదైనా మాట సందర్భంలో ఏదైనా విషయం, ఇలాంటి సందర్భాల్లో అల్హందులిల్లాహ్, సుబ్ హా నల్లాహ్, బారకల్లాహు ఫీక్, అహసనల్లాహు ఇలైక్, ఇలాంటి దువాలు ఇచ్చుకుంటూ మనం ఉండడం, అల్లాహ్ ను గుర్తు చేసుకుంటూ ఉండడం ఎల్లవేళల్లో చాలా ముఖ్య విషయం.
అలాగే నమాజ్ ఆచరించాడు. ఆరాధనల్లో కలిమ లా ఇలాహ ఇల్లల్లాహ్ తర్వాత నమాజ్ యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది గనక అందుకొరకే ఇక్కడ దాని ప్రస్తావన వచ్చింది. ఈ రెండు ఆయతులు, ఆయతు నెంబర్ 14 మరియు 15 ఏదైతే మీరు చూస్తున్నారో, ఇందులో మరొక భావం కూడా ఉంది అని ధర్మవేత్తలు అంటారు. అదేమిటి?
ఈ ఆయతులలో ఈదుల్ ఫితర్, రమజాన్ ముగింపు, సదఖతుల్ ఫితర్, ఈద్ యొక్క నమాజ్, వీటి ప్రస్తావన ఉన్నది అని. ఏ రీతిలో? ఇదే క్రమంలో. మన్ తజక్కా వ-జకరస్మ రబ్బిహీ ఫసల్లా. రమజాన్ ముగించినది, నెలవంక కనబడినది, ఇప్పుడు మనం పండుగ జరుపుకోవాలి అని తెలిసిన వెంటనే తజక్కా, జకాతుల్ ఫితర్ ఇవ్వాలి, సదఖతుల్ ఫితర్ ఇవ్వాలి, ఫిత్రానా చెల్లించాలి. అప్పటి నుండే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్ చదువుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి. ఎప్పటి వరకు? పండుగ స్థలానికి చేరుకునే వరకు. ఆ తర్వాత ఖుత్బా కంటే ముందు నమాజ్ అదా చేయాలి. సూరతుల్ ఆ`లాలోని ఆయతు నెంబర్ 14 మరియు 15లో రమజాన్ ముగింపు, నెలవంక వెంటనే జకాతుల్ ఫితర్ చెల్లించడం మరియు అప్పటి నుండే తక్బీర్ చెప్పుకుంటూ ఉండడం, మరుసటి రోజు తెల్లారిన తర్వాత సూర్యోదయం అయ్యాక 15, 20 నిమిషాల తర్వాత నుండి పండుగ నమాజ్ చేయడం ప్రారంభించడం, వీటి ప్రస్తావన ఉన్నది. మరియు సూరతుల్ కౌసర్ లో
فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ (ఫసల్లి లిరబ్బిక వన్ హర్) కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి, ఖుర్బానీ కూడా ఇవ్వు. (108:2)
ముందు నమాజ్ చేయాలి, ఆ తర్వాత వచ్చి ఖుర్బానీ చేయాలి అన్నటువంటి ప్రస్తావన అందులో ఈదుల్ అద్హాకు సంబంధించిన ఆదేశం ఉన్నది.
ఈ విధంగా అల్లాహు త’ఆలా మనకు అల్లాహ్ మనపై చేసిన అనుగ్రహాలను గుర్తు చేస్తున్నాడు. శారీరక అనుగ్రహాలే కాకుండా మన ఆధ్యాత్మిక, మన యొక్క ఆత్మీయంగా మనకు కావలసిన హిదాయత్ ఖుర్ఆన్, హదీస్ ద్వారా దొరుకుతుంది, దాని గురించి చెప్పిన తర్వాత ఎవరైతే ఈ ఖుర్ఆన్, హదీస్ బోధనలు తిరస్కరిస్తారో వారికి ఈ చెడ్డ స్థానం ఉన్నదో అది తెలిపిన తర్వాత చెడ్డవారు అని చెప్పాడు కదా అల్లాహు త’ఆలా ఇక్కడ అష్ ఖా, అతడు నరకంలో ప్రవేశిస్తాడు అని. అందుకొరకే వెంటనే అల్లాహు త’ఆలా ఇక్కడ అఫ్లహ. దౌర్భాగ్యుడు నరకంలో వెళ్తాడు. మరి ఆ దౌర్భాగ్యునికి భిన్నంగా, ఆపోజిట్ లో ఉండేవాడు ఎవడు? సౌభాగ్యవంతుడు, సాఫల్యం పొందేవాడు. వారి యొక్క గుణాలు ఏంటి? ఇలా ఉంటాయి.
కానీ ఈ రోజుల్లో అనేకమంది తమకు తాము ముస్లింలు అనుకుంటూ కూడా ఎలా ప్రవర్తిస్తున్నారు? 16వ ఆయతులో అల్లాహ్ తెలిపాడు.
بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا (బల్ తు`సిరూనల్ హయాతద్-దున్యా) కాని మీరు మాత్రం ప్రాపంచిక జీవితానికే ప్రాముఖ్యమిస్తున్నారు. (87:16)
కానీ మీరు మాత్రం ప్రాముఖ్యతనిస్తున్నారు ప్రాపంచిక జీవితానికి. ఈ రోజుల్లో ఇలాగే జరుగుతుంది కదా మనలో అనేకమంది. కానీ వాస్తవం ఏమిటి?
وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ (వల్-ఆఖిరతు ఖైరువ్-వ అబ్ ఖా) వాస్తవానికి పరలోకం ఎంతో మేలైనది, ఎప్పటికీ మిగిలి ఉండేది.(87:17)
ఈ విషయాన్ని గమనించండి ఇక్కడ. ఇహలోకం ఎప్పటికీ మిగిలి ఉండేది కాదు. ఎప్పటికీ మిగిలి ఉండేది పరలోకం. ఇహలోకం మంచిది ఎప్పుడు? దానిని నీవు పరలోకం మంచి కొరకు ఉపయోగిస్తున్నప్పుడు. ఇహలోకంలో ఉండి పరలోకం గురించి నీవు ఆలోచించకుంటే, నీ ఇహలోకం కూడా పాడే, పరలోకం కూడా పాడైపోతుంది.
إِنَّ هَٰذَا لَفِي الصُّحُفِ الْأُولَىٰ (ఇన్న హాజా లఫిస్-సుహుఫిల్ ఊలా) ఈ విషయాలు మునుపటి గ్రంథాలలోనూ ఉన్నాయి. (87:18)
ఈ బోధనలు, ఈ విషయాలు మునుపటి గ్రంథాలలో ఉన్నాయి. ఎవరి గ్రంథాలు?
ఈ విధంగా ఇక్కడి వరకు సూరా సమాప్తమైనది. సోదర మహాశయులారా, ఈ సూరాలో మనకు ఉన్నటువంటి బోధనలు ఎంత చక్కగా అల్లాహు త’ఆలా తెలిపాడో అర్థం చేసుకొని, దాని ప్రకారంగానే మీరు ఆచరించే ప్రయత్నం చేయండి.
ప్రశ్నలు & సమాధానాలు
(1) ఒక చిన్న డౌట్ ఏంటంటేమనము ఇషా నమాజ్ చదివేటప్పుడు, కొంతమంది ఏమో ఫజర్ నమాజ్ వరకు కూడా ఇషా టైం ఉంటుంది అని చెప్తారు. కొందరేమో అంత టైం ఉండదు అంటారు. అంటే కొన్ని సందర్భాల్లో ఎక్కువ పని వల్ల కానీ, ఏదైనా ప్రయాణం వల్ల కానీ, ఏదైనా ఒక కారణం వల్ల మనం నమాజ్ చదవలేకపోతే, నమాజ్ టైం అనేది మనకు ఉదయం ఫజర్ నమాజ్ స్టార్ట్ అయ్యేంత వరకు ఉన్నట్టేనా సార్?
మీరు అడిగిన ఈ ప్రశ్నకు సంబంధించి నేను మూడు మాటలు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి మీరందరూ కూడా. అర్థం చేసుకోండి, ఇప్పుడు ఉన్నవారు, తర్వాత ఆన్లైన్ లో వినేవారు, YouTube లో వినేవారు. మొదటి విషయం, ప్రతీ నమాజ్ కొరకు ఒక ప్రారంభ సమయం, ఒక ముగింపు సమయం అనేది ఉంటుంది. ఇక మీరు ఇషా విషయంలో అడిగారు గనక, ఇషా యొక్క సమయం రాజిహ్ ఖౌల్, ప్రియారిటీ ప్రాధాన్యత లభించినటువంటి మాట ఆధారంగా, దేనికైతే ఎక్కువ హదీసులు ఆధారంగా ఉన్నాయో దాని పరంగా ఇషా ముగింపు సమయం అర్ధరాత్రి. ఇక్కడ అర్ధరాత్రి అంటే సర్వసామాన్యంగా రాత్రి 12 గంటలు మిడ్ నైట్ అని అంటారు అలా కాదు. సూర్యాస్తమయం నుండి ఫజర్ ప్రారంభ సమయం వరకు ఎన్ని గంటలు ఉంటాయో అందులో మీరు సగం చేయాలి. ఇది ఒక మొదటి మాట.
రెండో మాట ఏమిటంటే, కొన్ని హదీసుల ఆధారంగా ఫజర్ వరకు కూడా ఇషా సమయం ఉన్నది అని కొందరి అభిప్రాయం ఉన్నది. కానీ ఇంతకుముందే నేను చెప్పినట్టు మొదటి మాటలో రాజిహ్, ప్రాధాన్యత కలిగిన ప్రియారిటీ ఇవ్వబడిన ఆధారాల ప్రకారంగా, ప్రియారిటీ ఇవ్వబడినటువంటి మాట ఏమిటి? అర్ధరాత్రి మాట ఎక్కువ నిజం.
ఇక మూడో మాట, ప్రత్యేకంగా ఇషాకు సంబంధించి కానివ్వండి లేదా ఏ నమాజ్ అయినా, ఏదైనా ధర్మపరమైన కారణం వల్ల మనం ఏదైనా నమాజ్ దాని ముగింపు సమయానికంటే ముందే చేయలేకపోతే, అయ్యో ఇక సమయం అయిపోయింది కదా అని ఊరుకుండేది కాదు. ఆ నమాజ్ ను తప్పకుండా మనం చేయాలి. ఒకవేళ సమయం అయిపోయినప్పటికీ కూడా ఆ నమాజ్ తప్పకుండా చేయాలి. కానీ, సమయం దాటిన తర్వాత చేసిన నమాజ్ యొక్క పుణ్యం, దాని సమయం దాటక ముందే చేసిన నమాజ్ పుణ్యం మరియు నమాజ్ యొక్క దాని తొలి సమయంలో చేసే నమాజ్ పుణ్యం, ఈ మూడిటిలో తేడాలు ఉంటాయి. అయితే నేను ఇక్కడ మీతో అందరితో ఒక ప్రశ్న అడుగుతున్నాను, మూడు సమయాలు చెప్పాను నేను. ఒక మనిషి, ఉదాహరణకు ఒక మనిషి ఇషా నమాజ్ దాని తొలి సమయంలో చదివాడు. మరొక మనిషి దాని ఇషా నమాజ్ దాని చివరి సమయంలో చదివాడు. అంటే సమయం దాటక ముందే, ముగింపు కంటే కొంచెం ముందు. మూడో వ్యక్తి సమయం దాటిపోయిన తర్వాత చదివాడు. ఈ ముగ్గురిలో ఎవరికి ఎక్కువ పుణ్యాలు లభిస్తాయండి?
తొలి సమయంలో చేసిన వ్యక్తికి.
బారకల్లాహు ఫీ ఇల్మికుం. కరెక్ట్ సమాధానం. మాషాఅల్లాహ్, మాషాఅల్లాహ్. మన ఈ ఆన్లైన్ లో వింటున్న వారు ఏదో బండిపై లేదా బస్సులో లేదా వెహికల్ పై ప్రయాణం చేసుకుంటూ కూడా వింటున్నారు అన్నట్లుగా కనబడుతుంది. జజాకుముల్లాహు ఖైర్ వంట చేసుకుంటూ కూడా, ఇల్లు ఊడ్చుకుంటూ కూడా, బట్టలు ఉతుక్కుంటూ కూడా, మీ పనులు చేసుకుంటూ కూడా మాషాఅల్లాహ్ తబారకల్లాహ్ మీరు ఈ పాఠాలు వింటున్నారు అంటే అల్హందులిల్లాహ్ మంచి విషయం. మీ యొక్క సమయాన్ని ఒక పుణ్య కార్యంలో గడుపుతున్నారు. అయితే ఇషా సమయంకి నమాజ్ కి సంబంధించి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం లభించింది కదా?
అల్హందులిల్లాహ్ సార్. అర్థమైంది సార్. ఈ సందర్భాల్లో అప్పుడు చదువుదాము అనుకున్నప్పటికీ ఏదైనా చాలా పని కానీ ప్రయాణాలు ఉన్నప్పుడు అలసట అనిపిస్తుంది సార్. అప్పుడు ఇలా తెలిసింది అన్నమాట. అలా చదవకూడదు, మాక్సిమం అర్ధరాత్రి లోపు ఉంది అన్నప్పుడు అది కొద్దిగా భయం అనిపించింది సార్.
మీరు అడిగిన దానికి, మీరు ఇంత మాట చెప్పిన దానికి మరొక సలహాగా నేను ఒక మాట చెబుతున్నాను, బహుశా ఇంట్లో ఉండే ప్రతీ స్త్రీకి కానివ్వండి లేదా ఏదైనా నైట్ డ్యూటీ చేసేవారు లేదా కొందరు మధ్యాహ్న డ్యూటీ చేస్తారు, వారి డ్యూటీ అయిపోయేసరికి రాత్రి 11, 12 ఇలా అవుతుంది. అయితే ఆ విషయం ఏంటంటే, ఎవరైనా ఇషా నమాజ్ విషయంలో ప్రత్యేకంగా చాలా అలసిపోవడం వల్ల, చాలా పని ఉండడం వల్ల, చాలా ఇరుకులో చిక్కుకొని ఉన్నారు, ఆ నమాజ్ కొరకు సమయం కలగడం లేదు, అలాంటి వారు ఇషా ప్రాధాన్యత ఇవ్వబడిన సమయం అర్ధరాత్రి అని ఏదైతే తెలుసుకున్నామో, ఆ సమయం దాటక ముందు కనీసం ఫర్ద్ నాలుగు రకాతులు చేసుకోండి. కనీసం ఫర్ద్ నాలుగు రకాతులు చేసుకోండి. ఆ తర్వాత దాని యొక్క సున్నత్, విత్ర్, ఇవన్నీ మీరు ఆ తహజ్జుద్ కొరకు లేచినప్పుడు, ఫజర్ కు ముందు లేచినప్పుడు చేసుకున్నా ఇబ్బంది లేదు, పాపం ఏమీ లేదు ఇన్షాఅల్లాహ్.
(2) షేఖ్ గారు నాకు ఒక డౌట్. డౌట్ అంటే ఇప్పుడు క్లాస్ గురించి కాదు షేఖ్ గారు. ఖురాన్ గురించి. ఖురాన్ ఇప్పుడు నాకు కొన్ని కొందరు ఏమన్నారంటే, ఖురాన్ ని ఉదూ లేకుండా కూడా పట్టుకోవచ్చు కానీ ఓపెన్ చేయకూడదు అన్నారు షేఖ్. ఇప్పుడు మనకు ఉదూ పోతూ ఉంటాది కదా షేఖ్ గారు, బాత్రూమ్ పోయినప్పుడు ఇట్లా ఉదూ పోతూ ఉంటాది కదా. అలాంటప్పుడు మనం ఖురాన్ ఓన్లీ పట్టుకోవచ్చు, ఎవరైనా అడిగారు ఖురాన్ ఇవ్వొచ్చు అంటే ఓపెన్ చేయకూడదు అన్నారు. ఇది కరెక్టా కాదా అని నా డౌట్ షేఖ్ గారు.
అయితే ఇక్కడ కొందరు ఉలమాలు ఏదైతే పట్టుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు, తీసుకోవచ్చు కానీ తెరవకూడదు అని ఏదైతే అన్నారో, తెరవకూడదు అని అంటే అక్కడ భావం, ఆయతులు అరబీలో ఏవైతే రాసి ఉన్నాయో, ఆ ఆయతులు రాసి ఉన్న చోట తమ ఆ చెయ్యి, వేలు పెట్టకుండా ఉంటే మరీ మంచిది అని అంటారు. అది అసలు విషయం. పవిత్రత, పరిశుభ్రంగా లేని సమయంలో ఖురాన్ పట్టుకోకూడదు అని అంటే, ప్రత్యేకంగా ఆయతులు రాసి ఉన్న చోట మన ఆ శరీర భాగం తగలకుండా ఉండడం మంచిది అని అంటారు. కానీ వేరే దాని బైండింగ్ లేదా అది కవర్ లో ఉన్నది, ఆ రీతిలో పట్టుకొని మనం ఎవరికైనా ఇస్తున్నాము, తీసుకుంటున్నాము ఇబ్బంది లేదు అని అంటారు.
అల్హందులిల్లాహ్. అదే మేము ఇక్కడ మా కువైట్ లో మా మా ఇంట్లో ఆమె మా మామయ్య చెప్పిందంట ఖురాన్ ఇవ్వమంటే నేను ఉదూ లేదు మామ్మ అంటే ఏమీ పట్టుకోవచ్చు, ఇవ్వొచ్చు ఇబ్బంది లేదు. మనం ఓన్లీ ఓపెన్ చేసి చదవకూడదు అని చెప్పింది
(3) ఆ షేఖ్, స్టార్టింగ్ లో చెప్పారు కదా జెండా వందనం గురించి, కొబ్బరికాయ కొట్టి దండం పెడతారు కదా షేఖ్, అది ఒకసారి చెప్పరా మళ్ళీ?
నేను మరోసారి చెబుతున్నాను. నేను అక్కడ చెప్పిన ఉదాహరణ ఇచ్చాను నేను, ఏమి ఇచ్చాను? మనం అల్లాహ్ యొక్క పవిత్రతను మన ఆచరణ ద్వారా కూడా వ్యక్తపరచాలి. ఆచరణ ద్వారా ఎలా వ్యక్తపరచాలి? ఎన్నో సందర్భాలు ఉండవచ్చు మన జీవితంలో అలాంటివి రావచ్చు. కానీ సర్వసామాన్యంగా అందరికీ తెలుస్తది అని నేను ఒక ఉదాహరణ ఇచ్చాను. ఏంటి ఉదాహరణ అది? మీరు ఆ జెండా వందనం అని ఏదైతే అంటారో, అది కరెక్ట్ పదం ఏంటో నాకు తెలియదు. సర్వసామాన్యంగా ప్రజలు అంటూ ఉంటారు కానీ, 15th ఆగస్టు లేదా ఇలాంటి సందర్భంలో అక్కడ ఏదైతే జెండా వద్ద మన ఇందిరా గాంధీ లేకుంటే మన గాంధీజీ, నెహ్రూ గారి యొక్క ఫోటోలు ఏదైతే పెడతారో, అక్కడ ఎంతోమంది కొబ్బరికాయ కొడతారు. అయితే మన ముస్లింలలో కొందరు ఏమనుకుంటారు, నేను సుబ్ హా నల్లాహ్ అనుకుంటాను తర్వాత క్షమాపణ కోరుకుంటాను, కానీ ఒక నా టెంకాయ కొట్టేద్దాము. ఇలా టెంకాయ కొట్టడం మన ఆచరణ పరంగా మనం సుబ్ హా నల్లాహ్ కు వ్యతిరేకం చేస్తున్నట్లు. కనుక అలాంటి చోట టెంకాయ కూడా కొట్టకూడదు.
జజాకుముల్లాహు ఖైర, బారకల్లాహు ఫీకుం, కతబల్లాహు అజ్రకుం. అల్లాహు త’ఆలా ఖురాన్ ను మంచిగా అర్థం చేసుకొని, ప్రవక్త హదీసులను చదువుతూ అర్థం చేసుకొని, వాటి ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకునే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్, వ ఆఖిరు దావాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో షేక్ సలీం జామిఈ గారు హజ్ యొక్క ఘనత మరియు విశిష్టతలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరిస్తారు. హజ్ ఇస్లాం యొక్క ఐదు మూలస్తంభాలలో ఒకటని, దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు. స్వీకరించబడిన హజ్ యొక్క ప్రతిఫలం స్వర్గం అని, అది గడిచిన పాపాలన్నింటినీ మరియు పేదరికాన్ని కూడా తొలగిస్తుందని ప్రవక్త వచనాల ఆధారంగా వివరిస్తారు. హజ్ యాత్రికులు అల్లాహ్ యొక్క అతిథులు అని, వారి ప్రార్థనలు స్వీకరించబడతాయని పేర్కొంటారు. హజ్ కు వెళ్లే వారికి ముఖ్యమైన సూచనలు ఇస్తూ, స్తోమత కలిగిన వెంటనే హజ్ చేయాలని, హలాల్ సంపాదనతోనే చేయాలని మరియు హజ్ సమయంలో గొడవలు, అశ్లీలతకు దూరంగా ఉండాలని బోధిస్తారు. వ్యాధిగ్రస్తులు మరియు పసిపిల్లల తరఫున హజ్ చేసే విధానాలను కూడా ప్రస్తావిస్తారు. చివరగా, హజ్ నుండి నేర్చుకోవలసిన ఐక్యత, సమానత్వం మరియు ఏకేశ్వరోపాసన వంటి గుణపాఠాలను గుర్తుచేస్తూ ప్రసంగాన్ని ముగిస్తారు.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా మనందరి చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్
గౌరవనీయులైన పండితులు, పెద్దలు, ఇస్లామీయ సోదర సోదరీమణులారా, మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు
హజ్ ఘనత
ఇంతకుముందు మీరు విన్నట్టుగా, ఈనాటి ప్రసంగంలో మనం హజ్ ఘనత గురించి ఖురాన్ మరియు హదీసు గ్రంథాల వెలుగులో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం.
చూడండి, ఎప్పటి నుంచి అయితే రమజాను మాసము ముగిసిపోయిందో, షవ్వాల్ నెల కూడా ముగిసిందో, జిల్ ఖాదా నెల మొదలైనప్పటి నుండి ప్రపంచం నలుమూలల నుండి మనము ఒక వార్త పదేపదే వార్తా ఛానళ్లలో అలాగే అంతర్జాల మాధ్యమాలలో చూస్తూ వింటూ వస్తున్నాం, అదేమిటంటే దైవభక్తులు, అల్లాహ్ దాసులు ప్రపంచం నలుమూలల నుండి మక్కాకు చేరుకుంటున్నారు, పవిత్రమైన హజ్ యాత్ర చేసుకోవటానికి అని మనము కొన్ని దృశ్యాలు, కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాం.
కాబట్టి మిత్రులారా, ఇది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిర్ణయించిన హజ్ మాసాలలో ఒక మాసం జిల్ ఖాదా మాసం కాబట్టి ఈ సందర్భంలో మనము హజ్ గురించి తెలుసుకోబోతున్నాం, ఇన్ షా అల్లాహ్
హజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ, మనసులో మనమంతా అల్లాహ్ ను కోరుకుందాం. అదేమిటంటే, “ఓ అల్లాహ్, ఎవరెవరైతే ఇప్పుడు మనం ఇక్కడ హజ్ గురించి ప్రసంగం వింటూ ఉన్నామో, వారందరినీ కూడా నీవు ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా హజ్ యాత్ర చేసుకోవటానికి అన్ని రకాల సౌకర్యాలు ప్రసాదించు.”, ఆమీన్
హజ్ ప్రాముఖ్యత – ఇస్లాం యొక్క ఐదు మూలస్తంభాలలో ఒకటి
అయితే మిత్రులారా, ముందుగా ఇప్పుడు మనము హజ్ గురించి తెలుసుకునేటప్పుడు ఒక విషయం దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. అదేమిటంటే, హజ్ అనేది ఇస్లాం ధర్మంలో ఒక చిన్న విషయము కాదు. ఏ ఐదు విషయాల మీద అయితే ఇస్లాం నిలబడి ఉందో, ఆ ముఖ్యమైన ఐదు అంశాలలో ఒక ముఖ్యమైన అంశం అని మనము గుర్తించవలసి ఉంది.
దీనికి ఆధారం మనం చూసినట్లయితే, బుఖారీ, ముస్లిం గ్రంథాలలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు:
“ఇస్లాం ఐదు మూలస్తంభాలపై నిర్మించబడింది: అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్య దేవుడు లేడని మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యం పలకడం, నమాజు స్థాపించడం, జకాత్ ఇవ్వడం, అల్లాహ్ గృహం (కాబా) యొక్క హజ్ చేయడం మరియు రమదాన్ ఉపవాసాలు పాటించడం.“
ఇస్లాం ఐదు ముఖ్యమైన అంశాల మీద నిర్మితమై ఉంది. అంటే, మన ఇస్లాం ధర్మం, ఏ ధర్మాన్ని అయితే మనం అంతా అవలంబిస్తూ ఉన్నామో, అది ఐదు ముఖ్యమైన అంశాల మీద నిర్మించబడి ఉంది. పిల్లర్స్ లాంటివి అవి. ఆ ఐదు విషయాలు, ఏంటి అవి? ప్రవక్త వారు తెలియజేస్తున్నారు: అల్లాహ్ ఒక్కడే నిజమైన ఆరాధ్య దేవుడు, ఆయన తప్ప మరెవ్వరూ నిజమైన ఆరాధ్య దేవుళ్ళు కాదు అని సాక్ష్యం పలకాలి. ఇది మొదటి ముఖ్యమైన అంశం. అలాగే, రెండవది, నమాజు ఆచరించటం. అలాగే, జకాతు చెల్లించటం. అల్లాహ్ పుణ్యక్షేత్రమైన, పవిత్ర అల్లాహ్ గృహమైన కాబతుల్లా యొక్క హజ్ ఆచరించటం. వసౌమి రమదాన్, రమదాన్ నెల ఉపవాసాలు పాటించటం.
ఇక్కడ మిత్రులారా, మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఐదు ముఖ్యమైన అంశాల మీద ఇస్లాం ధర్మం నిర్మించబడి ఉంది, నిలబెట్టబడి ఉంది, అందులో ఒక విషయం హజ్ ఆచరించటం అని తెలియజేశారు కాబట్టి, హజ్ ఆచరించటం ఒక చిన్న ఆరాధన కాదు, ఒక చిన్న విషయం కాదు, ఇస్లాం నిర్మించబడి ఉన్న పునాదులలో ఒక పునాది అని, ముఖ్యమైన అంశము అని, గొప్ప కార్యము అని ముందుగా మనమంతా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవలసి ఉంది.
హజ్ ఎవరిపై విధి?
ఇక ఆ తర్వాత, హజ్ ఎవరి మీద విధి చేయబడింది అంటే, ధార్మిక పండితులు ఐదు, ఆరు విషయాలు ప్రత్యేకంగా తెలియజేసి ఉన్నారు. ఎవరి మీద హజ్ విధి చేయబడింది అంటే, ఆ వ్యక్తి ముస్లిం అయి ఉండాలి. అంటే ముస్లిమేతరుల మీద హజ్ విధి చేయబడలేదు అన్నమాట. అలాగే, ఆ వ్యక్తి బుద్ధిమంతుడై ఉండాలి. జ్ఞానం లేని వారు, పిచ్చి వారు ఉంటారు కదండీ, అలాంటి వారి మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి యవ్వనుడై ఉండాలి, అంటే పసి పిల్లల మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి స్వతంత్రుడై ఉండాలి, అంటే బానిసత్వంలో ఉన్న వారి మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి స్తోమత గలవాడై ఉండాలి, అంటే స్తోమత లేని నిరుపేదల మీద హజ్ విధి చేయబడలేదు.
ఏమండీ? ఇక్కడ నేను ఐదు విషయాలు ప్రస్తావించాను. ముస్లిం అయి ఉండాలి, బుద్ధిమంతుడై ఉండాలి, యవ్వనస్తుడై ఉండాలి, స్వతంత్రుడై ఉండాలి, స్తోమత కలిగి ఉన్న వాడై ఉండాలి. ఇవి పురుషులు, మహిళలకు అందరికీ వర్తించే నిబంధనలు.
అయితే మహిళలకు ప్రత్యేకంగా మరొక నిబంధన కూడా పండితులు తెలియజేసి ఉన్నారు. ఏంటది? మహిళలకు హజ్ చేయటానికి వారికి తోడుగా ‘మహరమ్’ కూడా జతగా ఉండాలి. మహరమ్ అంటే ఎవరు? ఆ మహిళతో ఆ పురుషునితో ఎప్పటికీనీ ఏ విధంగాను, ఏ కారణంగాను వివాహం జరగదు, అసంభవం అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిర్ణయించారో కదా, అలాంటి వారిని ‘మహరమ్’ అంటారు. ఉదాహరణకు, మహిళ ఉంది, ఆ మహిళ యొక్క తండ్రి. తండ్రితో ఆ మహిళ యొక్క వివాహము ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ కారణంగాను జరగదు కాబట్టి తండ్రి ఆ మహిళకు మహరమ్ అవుతాడు. ఆ విధంగా చాలా ఉన్నాయండి, అవన్నీ ఇన్ షా అల్లాహ్ సందర్భం వచ్చినప్పుడు మనం ప్రత్యేకంగా దాని గురించి చర్చించుకుందాం. ఇప్పుడు మనము హజ్ ఘనత గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మన మాటను ముందుకు కొనసాగిద్దాం.
హజ్ ఘనతలు మరియు విశిష్టతలు
ఇక రండి, హజ్ యొక్క విశిష్టతలు, ఘనతలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇన్ షా అల్లాహ్ మీ ముందర ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. శ్రద్ధగా వినండి, ఇన్ షా అల్లాహ్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరించు గాక.
స్వీకరించబడిన హజ్ యొక్క ప్రతిఫలం స్వర్గం
హజ్ యొక్క విశిష్టత ఏమిటంటే, మనిషి చేసే ప్రతి సత్కార్యానికి, ప్రతి ఆరాధనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని కొన్ని పుణ్యాలు నిర్ణయించి ఉన్నాడు. అయితే, కొన్ని సత్కార్యాలు, పుణ్య కార్యాలు, ఆరాధనలు ఎలా ఉన్నాయి అంటే, వాటికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పుణ్యము అపరిమితం చేసేశాడు. లేదంటే కొన్ని ఆరాధనలు, సత్కార్యాలు ఎలా ఉన్నాయి అంటే, దానికి బదులుగా ఇక స్వర్గము తప్ప మరొకటి కానుకగా ఇవ్వబడదు అని తేల్చేసి ఉన్నాడు. అందులో హజ్ కూడా ఉంది. హజ్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు, బుఖారీ, ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం అండీ, ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:
الْحَجُّ الْمَبْرُورُ لَيْسَ لَهُ جَزَاءٌ إِلَّا الْجَنَّةُ (అల్ హజ్జుల్ మబ్రూరు లైస లహూ జజావున్ ఇల్లల్ జన్నాహ్) “స్వీకరించబడిన హజ్ కు బదులుగా స్వర్గం తప్ప మరే ప్రతిఫలము లేదు.“
అంటే, ఎవరి హజ్ అయితే అల్లాహ్ వద్ద ఆమోదించబడుతుందో, దానికి ప్రతిఫలంగా అతనికి ఇక స్వర్గమే. స్వర్గం తప్ప ఇంకా వేరే కానుక అతనికి ఇవ్వడానికి లేదు. హజ్ స్వీకరించబడితే చాలు, హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే చాలు, ఆ భక్తునికి ఇక ఇన్ షా అల్లాహ్ స్వర్గం తప్పనిసరిగా ఇవ్వబడుతుందన్న విషయం ప్రవక్త వారు ఇక్కడ తెలియజేశారు. అంటే, హజ్ ఆమోదించబడిందా, ఆ దాసుడు స్వర్గవాసి అయిపోతాడు ఇన్ షా అల్లాహ్. ఎంత గొప్ప విషయం కదండీ? ఇది మొదటి ఘనత.
హజ్ పాపాలను తుడిచివేస్తుంది
రెండవ ఘనత ఏమిటంటే, హజ్ చేయటం వలన భక్తుని యొక్క పాపాలన్నీ తుడిచివేయబడతాయి, క్షమించవేయబడతాయి. దీనికి మన దగ్గర ఒక ఆధారం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఒక చిన్న సంఘటన చోటు చేసుకునింది, దాని వల్ల మనకు ఈ విషయం బోధపడుతుంది.
ఆ సంఘటన ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఎవరైనా ఇస్లాం స్వీకరించాలంటే ప్రవక్త వారి వద్దకు వచ్చి ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేసేవారు. దానిని మనము అరబీ భాషలో ‘బైఅత్‘ చేయటం అని అంటాం. ఆ ప్రతిజ్ఞ చేసిన తర్వాత వారు సాక్ష్యవచనం పఠించి ప్రతిజ్ఞ చేసి ఇస్లాం ధర్మంలోకి ప్రవేశించేవారు.
ఆ విధంగా అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఇస్లాం స్వీకరించటానికి వచ్చి ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ‘బైఅత్’ (ప్రతిజ్ఞ) చేసే సమయాన చెయ్యి పెట్టి మళ్లీ వెనక్కి తీసేసుకున్నారు. ప్రవక్త వారికి ఆశ్చర్యం కలిగింది. ఏంటయ్యా, చెయ్యి మీద చెయ్యి పెట్టేశావు, మళ్లీ ఎందుకు చెయ్యి వెనక్కి తీసేసుకున్నావు, ఏంటి నీ సందేహము అని ప్రవక్త వారు అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, “ఓ దైవ ప్రవక్త, నేను ప్రతిజ్ఞ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇస్లాం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే, నాది ఒక షరతు అండీ. ఆ షరతు ఏమిటంటే, నా గత పాపాలన్నీ క్షమించవేయబడాలి. నేను ఇస్లాం స్వీకరిస్తున్నప్పటికీ, నేను ఇంతకు ముందు నా జీవితంలో ఎన్ని పాపాలైతే చేసేశానో అవన్నీ అల్లాహ్ మన్నించేయాలి, క్షమించేయాలి. అలా అయితే నేను ఇస్లాం స్వీకరిస్తాను,” అన్నారు.
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు:
“నీకు తెలియదా, ఇస్లాం (స్వీకరించడం) దాని ముందున్న (పాపాలన్నింటినీ) తుడిచివేస్తుందని? మరియు హిజ్రత్ (వలస) దాని ముందున్న (పాపాలన్నింటినీ) తుడిచివేస్తుందని? మరియు హజ్ దాని ముందున్న (పాపాలన్నింటినీ) తుడిచివేస్తుందని?” ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం.
ప్రవక్త వారు ఏమంటున్నారంటే, “ఓ అమ్ర్, నీకు తెలియదా, ఎప్పుడైతే వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తాడో, ఇస్లాం స్వీకరించగానే అతని గత పాపాలన్నీ మన్నించవేయబడతాయి.” అల్లాహు అక్బర్. అలాగే రెండవ విషయం చూడండి. ఎప్పుడైతే మనిషి అల్లాహ్ కొరకు వలస ప్రయాణము చేస్తాడో, హిజ్రతు చేస్తాడో, హిజ్రతు చేయగానే, వలస ప్రయాణం చేయగానే అతని గత పాపాలన్నీ మన్నించవేయబడతాయి, ఈ విషయం నీకు తెలియదా? అలాగే, ఎప్పుడైతే మనిషి హజ్ ఆచరిస్తాడో, అతని హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, అతని గత పాపాలన్నీ మన్నించవేయబడతాయి, ఈ విషయము నీకు తెలియదా?” అని ప్రవక్త వారు మూడు విషయాల గురించి ప్రస్తావించారు.
మన అంశానికి సంబంధించిన విషయం ఏముంది ఇక్కడ? ఇక్కడ ప్రవక్త వారు ప్రస్తావించిన మూడు విషయాలలో ఒక విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మనిషి హజ్ ఆచరిస్తాడో, ఆ హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, ఆ దాసుని యొక్క, ఆ భక్తుని యొక్క గత పాపాలన్నీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన్నించేస్తాడు. ఎంత గొప్ప విషయం అండి. మనం చూస్తున్నాం, ఒక వ్యక్తి 80 సంవత్సరాల వయసులో హజ్ చేస్తున్నాడు, 70 సంవత్సరాల వయసులో హజ్ చేస్తున్నాడు, 60 సంవత్సరాల వయసులో, 50 సంవత్సరాల వయసులో, 40 సంవత్సరాల వయసులో, 30 సంవత్సరాల వయసులో, ఆ విధంగా వేరే వేరే వాళ్ళు వేరే వేరే వయసులలో హజ్ ఆచరిస్తూ ఉన్నారు. అన్ని సంవత్సరాలలో వారికి తెలిసి, తెలియక ఎన్ని పాపాలు దొర్లిపోయి ఉంటాయండి? అన్ని పాపాలు కూడా ఆ హజ్ చేయడం మూలంగా, ఆ హజ్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరించిన కారణంగా అన్ని పాపాలు తుడిచివేయబడతాయి, కడిగివేయబడతాయి, క్షమించవేయబడతాయి అంటే ఎంత గొప్ప వరం కదండీ. కాబట్టి, హజ్ యొక్క ఘనత ఏమిటంటే ఎవరి హజ్ అయితే అల్లాహ్ వద్ద స్వీకరించబడుతుందో, ఆమోదించబడుతుందో, వారి గత పాపాలన్నీ కూడా క్షమించవేయబడతాయి. అల్లాహు అక్బర్.
హజ్ పాపాలను & పేదరికాన్ని తొలగిస్తుంది
అలాగే ప్రాపంచిక ప్రయోజనం కూడా ఉందండోయ్. అదేంటంటే, ప్రాపంచిక ప్రయోజనం అంటే అందరూ యాక్టివ్ అయిపోతారు. చెప్తాను చూడండి. ప్రవక్త వారు తెలియజేసిన విషయం కాబట్టి మనమంతా దాన్ని గమనించాలి, విశ్వసించాలి. ఎవరైతే హజ్ ఆచరిస్తారో, ఉమ్రాలు ఆచరిస్తారో, పదేపదే ఆచరించుకుంటూ ఉంటారో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి పాపాల క్షమాపణతో పాటు, వారి పేదరికాన్ని కూడా తొలగించేస్తాడు. అల్లాహు అక్బర్. దీనికి ఆధారం తబరానీ గ్రంథంలోని ప్రామాణికమైన సహీ ఉల్లేఖనం, ప్రవక్త వారు తెలియజేశారు:
మీరు హజ్ మరియు ఉమ్రాలను నిరంతరం చేస్తూ ఉండండి. ఎందుకంటే అవి రెండూ పేదరికాన్ని మరియు పాపాలను తొలగిస్తాయి, కొలిమి ఇనుము యొక్క మాలిన్యాన్ని తొలగించినట్లుగా.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, “మీరు పదేపదే హజ్ లు, ఉమ్రాలు ఆచరించుకుంటూ ఉండండి.” అంటే, పదేపదే మీకు అవకాశం దొరికినప్పుడల్లా, సౌకర్యం దొరికినప్పుడల్లా హజ్ లు, ఉమ్రాలు ఆచరించుకుంటూ ఉండండి. అలా చేయటం వలన ఏమి జరుగుతుంది? పదేపదే హజ్ మరియు ఉమ్రాలు ఆచరించటం వలన భక్తుని యొక్క పాపాలు తొలగిపోతాయి, అలాగే ఆ దాసుని యొక్క పేదరికము కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తొలగించేస్తాడు. ప్రవక్త వారు ఉదహరించారు. ఎలాగైతే అగ్నిలో కాల్చినప్పుడు ఇనుముకి పట్టిన తుప్పు ఎలాగైతే రాలిపోతుందో, మనం చూస్తున్నాం కదా, ఇనుముని ఎప్పుడైతే అగ్నిలో పెట్టి కాలుస్తారో, దానిని బయటికి తీసి విదిలిస్తే దానికి పట్టిన తుప్పు మొత్తం రాలిపోతుంది. ఆ విధంగా ప్రవక్త వారు వివరిస్తూ, ఉదహరిస్తూ ఏమంటున్నారంటే, ఇనుముకి పట్టిన తుప్పు అగ్నిలో కాల్చిన కారణంగా ఎలాగైతే రాలిపోతుందో, అలాగా హజ్ చేయటం వలన, పదేపదే హజ్ ఉమ్రాలు ఆచరించటం వలన భక్తుని యొక్క పాపాలు తొలగిపోతాయి, భక్తుని యొక్క పేదరికము కూడా తొలగిపోతుంది. మాషా అల్లాహ్. ఇది కూడా ఒక గొప్ప ఘనత అండీ.
గొప్ప సత్కార్యాలలో హజ్ ఒకటి
అలాగే, ఇంతకుముందు మనం విన్నట్టుగా, హజ్ ఇస్లామీయ ఆరాధనల్లో, ఇస్లామీయ సత్కార్యాలలో చిన్న సత్కార్యము, చిన్న ఆరాధన కాదు, గొప్ప గొప్ప ఆరాధనల్లో ఒక ఆరాధన, గొప్ప గొప్ప సత్కార్యాలలో ఒక సత్కార్యము అని కూడా మనము తెలుసుకోవాలి. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి అడుగుతూ ఉన్నాడు:
أَيُّ الْعَمَلِ أَفْضَلُ (అయ్యుల్ అమలి అఫ్దల్) ఏ సత్కార్యము గొప్పది?
అని అడిగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇస్తూ అంటున్నారు:
إِيمَانٌ بِاللَّهِ وَرَسُولِهِ (ఈమాను బిల్లాహి వ రసూలిహి) అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించడం.
గమనించండి. మళ్లీ ఆ వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, “ఆ తర్వాత గొప్ప సత్కార్యం ఏది?” అంటే, ప్రవక్త వారు అంటున్నారు:
جِهَادٌ فِي سَبِيلِ اللَّهِ (జిహాదున్ ఫీ సబీలిల్లాహ్) అల్లాహ్ మార్గంలో జిహాద్ (ధర్మయుద్ధం) చేయడం.
మళ్లీ ఆ వ్యక్తి మూడవ సారి ప్రశ్నిస్తూ ఉన్నాడు, “ఆ తర్వాత ఏది గొప్ప సత్కార్యము దైవప్రవక్త?” అంటే, ప్రవక్త వారు తెలియజేస్తున్నారు:
అంటే, అల్లాహ్ మరియు ప్రవక్తను విశ్వసించటము మొదటి ప్రథమ గొప్ప కార్యము అయితే, జిహాద్ చేయటం, అల్లాహ్ మార్గంలో యుద్ధము చేయటం రెండవ గొప్ప కార్యము అయితే, ఆ రెండు కార్యాల తర్వాత మూడవ గొప్ప స్థానాన్ని పొందిన గొప్ప కార్యం హజ్ అని ఈ ఉల్లేఖనంలో ప్రవక్త వారు మనకు బోధించి ఉన్నారు కాబట్టి, హజ్ గొప్ప కార్యాలలో, గొప్ప సత్కార్యాలలో ఒక గొప్ప సత్కార్యము, గొప్ప ఆరాధన అని మనమంతా గ్రహించాలి.
వృద్ధులకు, బలహీనులకు మరియు మహిళలకు హజ్ ఒక జిహాద్
అలాగే మిత్రులారా, మన సమాజంలో వృద్ధులు ఉన్నారు, అలాగే మహిళలు ఉన్నారు. వృద్ధులు యుద్ధ మైదానంలో పాల్గొంటారండి? పాల్గొనలేరు. అలాగే మహిళలు యుద్ధం చేస్తారండి వెళ్లి యుద్ధ మైదానంలో? వాళ్లు చేయలేరు. అలాంటి వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన శుభవార్త ఏమిటంటే, వృద్ధులకు, మహిళలకు హజ్ చేయటం వలన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా జిహాద్ లో పాల్గొన్నంత పుణ్యము, ప్రతిఫలము ప్రసాదిస్తాడు అని శుభవార్త తెలియజేశారు. దీనికి ఆధారంగా మనం చూసినట్లయితే, నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి అయిన, విశ్వాసుల మాతృమూర్తి అయిన అమ్మ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. “ఓ దైవ ప్రవక్త, పురుషులు జిహాద్ లో పాల్గొని బాగా పుణ్యాలు సంపాదించుకుంటున్నారు కదా, మరి మన మహిళలకు కూడా మీరు యుద్ధంలో జిహాద్ లో పాల్గొని బాగా పుణ్యాలు సంపాదించుకోవడానికి అనుమతి ఇవ్వరా?” అని అడుగుతున్నారు. దానికి బదులుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు:
لَكُنَّ أَفْضَلُ الْجِهَادِ: حَجٌّ مَبْرُورٌ (లకున్న అఫ్దలుల్ జిహాది హజ్జున్ మబ్రూర్) “మీ కొరకు స్వీకృతి పొందిన హజ్ జిహాద్ తో సమానమైనది.” [బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం.]
మహిళలు హజ్ చేస్తే, మహిళలు చేసిన ఆ హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, ఆ మహిళలకు జిహాద్, అల్లాహ్ మార్గంలో యుద్ధం సలిపినంత పుణ్యము దక్కుతుంది అని ప్రవక్త వారు శుభవార్త తెలియజేశారు. అలాగే నసాయి గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేస్తున్నారు:
جِهَادُ الْكَبِيرِ وَالضَّعِيفِ وَالْمَرْأَةِ: الْحَجُّ وَالْعُمْرَةُ (జిహాదుల్ కబీరి వజ్జయీఫి వల్ మర’అతి అల్ హజ్జు వల్ ఉమ్రా) వృద్ధుని, బలహీనుని మరియు స్త్రీ యొక్క జిహాద్: హజ్ మరియు ఉమ్రా.
అంటే, ఈ పూర్తి ఉల్లేఖనాల యొక్క సారాంశం ఏమిటంటే, ఎవరైతే బలహీనులు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే మహిళలు ఉన్నారో, వారు హజ్ ఆచరిస్తే వారికి అల్లాహ్ మార్గంలో జిహాద్ లో పాల్గొన్నంత పుణ్యము దక్కుతుందన్నమాట. చూశారా హజ్ అంటే ఎంత గొప్ప విషయమో.
హజ్ యాత్రికులు అల్లాహ్ యొక్క అతిథులు
అలాగే ఎవరైతే హజ్ చేయడానికి వెళ్తారో, ఇంటి నుంచి ఎవరైతే బయలుదేరి హజ్ చేయడానికి మక్కా చేరుకుంటారో, పుణ్యక్షేత్రానికి చేరుకుంటారో, వారికి దక్కే ఒక గొప్ప గౌరవం ఏమిటంటే వారు అల్లాహ్ అతిథులు అనిపించుకుంటారు. అల్లాహు అక్బర్. ఇబ్నె హిబ్బాన్ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు:
“అల్లాహ్ మార్గంలో పోరాడే యోధుడు, హజ్ చేసేవాడు మరియు ఉమ్రా చేసేవాడు అల్లాహ్ యొక్క అతిథులు. ఆయన వారిని పిలిచాడు, వారు సమాధానమిచ్చారు. వారు ఆయనను అడిగారు, ఆయన వారికి ఇచ్చాడు.“
అల్లాహ్ మార్గంలో యుద్ధము చేయు వ్యక్తి, అలాగే హజ్ చేసే వ్యక్తి, అలాగే ఉమ్రా ఆచరించే వ్యక్తి. ముగ్గురి గురించి ప్రస్తావన ఉంది గమనించండి. అల్లాహ్ మార్గంలో జిహాద్ చేసే వ్యక్తి, హజ్ ఆచరించే వ్యక్తి, ఉమ్రా ఆచరించే వ్యక్తి, ఈ ముగ్గురూ కూడా అల్లాహ్ అతిథులు. సుబ్ హానల్లాహ్. ఏమవుతుందండి అల్లాహ్ అతిథులుగా వెళితే? ప్రవక్త వారు తెలియజేస్తున్నారు, అల్లాహ్ వారిని వచ్చి ఇక్కడ హజ్ ఆచరించమని, ఉమ్రా ఆచరించమని పిలిచాడు కాబట్టి, అల్లాహ్ పిలుపుని పురస్కరించుకొని వారు అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అల్లాహ్ తో ఏమి అడిగితే అది అల్లాహ్ వారికి ఇచ్చేస్తాడు. యా అల్లాహ్, యా సుబ్ హానల్లాహ్.
మిత్రులారా, ప్రపంచంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మనకు అతిథిగా పిలిస్తే, లేదా ఒక చిన్న రాజ్యానికి రాజు మనకు ఆతిథ్యం ఇచ్చి మనకు రాజభవనానికి ఆతిథులుగా పిలిస్తే, దానిని మనం ఎంత గౌరవంగా భావిస్తాం, అవునా కాదా చెప్పండి? అబ్బా, రాజు మనకు పిలిచాడు, రాజు ఆతిథ్యము దక్కించుకున్న వ్యక్తి అని అతను ఎంతో సంబరిపడిపోతాడు, గౌరవంగా భావిస్తాడు. పూర్తి విశ్వానికి రారాజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆతిథ్యం ఇస్తున్నాడండీ. అలాంటి పూర్తి విశ్వానికి రారాజు అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పిలుపుని పురస్కరించుకొని హజ్ చేయడానికి, ఉమ్రా చేయడానికి వెళితే, అల్లాహ్ దాసులు అల్లాహ్ అతిథులుగా గౌరవం పొందుతారు. అక్కడికి వెళితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారు అడిగిందల్లా వారికి ఇస్తాడు అని ప్రవక్త వారు తెలియజేశారు.
దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయండి, ప్రవక్త వారి జీవిత కాలంలోని ఉదాహరణలు ఉన్నాయి, నేటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. నేను కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో అడిగాను, నాకు కూడా అల్లాహ్ ఇచ్చాడు. అంతెందుకు, సోషల్ మీడియాలో మొన్న ఈ మధ్యనే ఒక వీడియో చాలా బాగా వైరల్ అయిపోయింది. ఒక వ్యక్తి అక్కడికి వెళ్లి అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ధనం గురించి పదేపదే అడుగుతూ ఉన్నాడు. ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది, మనమంతా చూశాం. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత అదే వ్యక్తిని మళ్ళీ చూపిస్తూ ఉన్నారు, అతను వెళ్లి అక్కడ అల్లాహ్ తో ధనం అడిగాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ఎంత ధనం ఇచ్చాడంటే, ఇప్పుడు అతను గొప్ప ధనికుడు అయిపోయాడు, Mercedes-Benz లలో అతను తిరుగుతూ ఉన్నాడు, చూడండి అల్లాహ్ పుణ్యక్షేత్రానికి వెళ్లి అడిగితే అల్లాహ్ ఇస్తాడు అనటానికి గొప్ప సాక్ష్యము ఈ వ్యక్తి, చూడండి అని చూపిస్తూ ఉన్నారు మిత్రులారా. కాబట్టి అక్కడికి వెళితే అల్లాహ్ అతిథులు అవుతారు, అక్కడికి వెళ్లి అడిగితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇస్తాడు. ప్రవక్త వారు చెప్పినారు, అలాగే ప్రవక్త వారి కాలం నాటి సంఘటనలు ఉన్నాయి, నేటికి కూడా జరుగుతున్న అనేక సంఘటనలు ఉన్నాయి మిత్రులారా.
హజ్ మార్గంలో మరణించిన వారి పుణ్యం
అలాగే హజ్ గురించి మనం తెలుసుకుంటున్నాము కాబట్టి హజ్ ఘనతలలో మరొక ఘనత ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే హజ్ చేయడానికి ఇంటి నుండి బయలుదేరుతాడో, బయలుదేరిపోయిన తర్వాత మార్గంలో గాని, అక్కడికి చేరుకున్నప్పుడు గాని అతను మరణిస్తే అతనికి పూర్తి హజ్ చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది అని చెప్పడం జరిగింది. మరొక ఉల్లేఖనంలో అయితే ప్రళయం వరకు అతను హజ్ చేస్తూ ఉన్నంత పుణ్యము ఇవ్వబడుతుంది అని చెప్పబడింది. రెండు ఉల్లేఖనాలు కూడా నేను మీ ముందర పంచుతున్నాను చూడండి. సహీ అత్-తర్గిబ్ గ్రంథంలో ప్రవక్త వారు తెలియజేస్తూ ఉన్నారు:
ఏ వ్యక్తి అయితే హజ్ ఆచరించటానికి, ఉమ్రా ఆచరించటానికి ఇంటి నుండి బయలుదేరుతాడో, ఆ తర్వాత దారిలోనే అతను మరణిస్తాడో, అతనికి ప్రళయం వరకు హజ్ లు చేసినంత, ప్రళయం వరకు ఉమ్రాలు చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది. (సహీ అత్-తర్గిబ్ గ్రంథం)
“అతనికి పూర్తి హజ్ చేసినంత పుణ్యము, పూర్తి ఉమ్రా చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది” అని మరొక ఉల్లేఖనంలో ఉంది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకునింది. బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనంలో తెలియజేయటం జరిగింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఉమ్రా చేయటానికి సహబాలతో పాటు కలిసి వెళుతూ ఉంటే ఒక వ్యక్తి, ప్రవక్త వారితో పాటు వెళ్ళిన ఒక శిష్యుడు ఒంటె పైనుంచి జారి కింద పడ్డాడు. గమనించండి. ప్రవక్త వారితో పాటు ఉమ్రా ఆచరించటానికి వెళుతూ ఉన్న ఒక శిష్యుడు ఒంటె పైనుంచి జారి కింద పడిపోయాడు. కింద పడినప్పుడు అతని మెడ విరిగింది, అందులోనే అతను ప్రాణాలు వదిలేశాడు. అతను మరణించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహబాలకు ఈ విధంగా ఆదేశించారు:
“అతనికి రేగి ఆకులతో కలిపిన నీటితో స్నానం చేయించండి, అతని రెండు వస్త్రాలలోనే అతనికి కఫన్ చుట్టండి, అతని తలను కప్పకండి, అతనికి సుగంధం పూయకండి, ఎందుకంటే అతను ప్రళయం రోజున తల్బియా పఠిస్తూ లేపబడతాడు.”
అతనికి మీరు నీళ్ళలో రేణి ఆకులు వేసి కాంచిన నీళ్ళతో గుసుల్ చేయించండి, స్నానము చేయించండి. అతను ఏ బట్టలైతే ఉమ్రా కోసము ధరించి ఉన్నాడో, అదే బట్టల్లో అతని శవవస్త్రాలుగా చుట్టండి. అతని తలను కప్పకండి, అతని శరీరానికి, బట్టలకు సువాసనలు పూయకండి. ఎందుకంటే, ఇతను రేపు పరలోకంలో అల్లాహ్ ఎప్పుడైతే భక్తులందరికీ పరలోకంలో మళ్లీ రెండవ సారి నిలబెడతాడో, ఆ రోజు అతను
لَبَّيْكَ اللَّهُمَّ لَبَّيْكَ (లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక్) “ఓ అల్లాహ్, నేను హాజరయ్యాను”
అని తల్బియా పఠిస్తూ లేస్తాడు అని చెప్పారు. అల్లాహు అక్బర్. అంటే ఎంత గౌరవం చూడండి. ఎవరైతే హజ్ ఉమ్రాలు చేయడానికి బయలుదేరి దారిలోనే ప్రాణాలు వదిలేస్తారో, వారు ఎంత గౌరవం దక్కించుకుంటారంటే వారికి హజ్ చేసిన పుణ్యము ఇవ్వబడుతుంది, ఉమ్రా చేసిన పుణ్యము ఇవ్వబడుతుంది, వారు రేపు పరలోకంలో అల్లాహ్ ఎప్పుడైతే మళ్లీ రెండవ సారి లేపుతారో, ఆ రోజు తల్బియా పఠిస్తూ అల్లాహ్ ముందరికి చేరుకుంటారు, తల్బియా పఠిస్తూ లేస్తారు. అల్లాహు అక్బర్.
హజ్ లోని ప్రతి క్రియకు లభించే పుణ్యం
ఇక మిత్రులారా, హజ్ లో అనేక కార్యాలు ఉన్నాయి. మనిషి ప్రయాణిస్తాడు, ఆ తర్వాత ఇహ్రామ్ ధరిస్తాడు, ఆ తర్వాత మళ్ళీ తల్బియా పఠించుకుంటూ పుణ్యక్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ వెళ్లి తవాఫ్ ఆచరిస్తాడు, నమాజులు ఆచరిస్తాడు, జమ్ జమ్ నీరు తాగుతాడు, సయీ చేస్తాడు, తలనీలాలు సమర్పించుకుంటాడు, అరఫా మైదానానికి వెళ్తాడు, ముజ్దలిఫాకు వెళ్తాడు, అలాగే కంకర్లు జమరాత్ కి కొడతాడు, తర్వాత తవాఫ్ లు చేస్తారు, సయీ చేస్తారు, దువాలు చేస్తారు, ఇక అనేక కార్యాలు చేస్తారు కదా, మరి ఇవన్నీ ఆచరిస్తే వారికి ఏమి దక్కుతుంది అంటే ఒక సుదీర్ఘమైన పెద్ద ఉల్లేఖనం ఉంది. అది నేను అరబీలో కాకుండా, దాన్ని అనువాదాన్ని, సారాంశాన్ని మాత్రమే మీ ముందర చదివి వినిపిస్తాను. చూడండి శ్రద్ధగా వినండి. హజ్ చేసిన వారు, హజ్ ఆచరించే వారు అడుగడుగునా, ప్రతి చోట ఎన్ని సత్కార్యాలు, ఎన్ని విశిష్టతలు, ఘనతలు దక్కించుకుంటారో గమనించండి.
ఉల్లేఖనాన్ని చదువుతున్నాను వినండి, దాని సారాంశం అండి ఇది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విషయాలండీ, “మీరు అల్లాహ్ గృహం వైపు హజ్ యాత్ర సంకల్పంతో బయలుదేరితే మీ సవారీ వేసే ఒక్కొక్క అడుగుకు బదులుగా అల్లాహ్ ఒక పుణ్యం రాస్తాడు, ఒక పాపం క్షమిస్తాడు.” అల్లాహు అక్బర్. ఎంత దూరం ప్రయాణిస్తాడండి భక్తుడు, అంత దూరము అతను ఎన్ని అడుగులు వేస్తాడో, అతని సవారీ ఎన్ని అడుగులు వేస్తుందో, అన్ని పుణ్యాలు లిఖించబడతాయి, అన్ని పాపాలు తొలగించబడతాయి.
ఆ తర్వాత ప్రవక్త వారు అంటున్నారు: “మీరు తవాఫ్ తర్వాత చదివే రెండు రకాతుల నమాజ్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వంశంలోని ఒక బానిసను స్వతంత్రుని చేసిన దానికి సమానం అవుతుంది.” అల్లాహు అక్బర్. ఆ తర్వాత చూడండి,
“మీరు సఫా మర్వాల మధ్య చేసే సయీ 70 బానిసలను స్వతంత్రులుగా చేసిన దానికి సమానం అవుతుంది. అరఫా రోజు సాయంత్రము మొదటి ఆకాశంపై అల్లాహ్ వచ్చి మీ పట్ల గర్విస్తూ ఇలా అంటాడు: ‘చూడండి, నా ఈ భక్తులు దూర ప్రదేశాల నుండి శ్రమించి దుమ్ము ధూళిలను భరించి నా వద్దకు వచ్చారు. వీరు నా అనుగ్రహాలను ఆశిస్తున్నారు. కావున భక్తులారా, మీ పాపాలు ఇసుక కంకరు అన్ని ఉన్నా, లేదా వర్షపు చినుకులన్ని ఉన్నా, లేక సముద్రపు నురుగు అన్ని ఉన్నా వాటన్నింటినీ నేను క్షమించేస్తున్నాను. వినండి నా దాసులారా, ఇక మీరు ముజ్దలిఫా వైపు వెళ్ళండి. నేను మిమ్మల్ని క్షమించేసాను. అలాగే మీరు ఎవరి కోసం ప్రార్థించారో వారిని కూడా క్షమించేసాను.” అల్లాహు అక్బర్.
ఆ తర్వాత ప్రవక్త వారు అంటున్నారు: “ఆ తర్వాత మీరు జమరాత్ రాళ్ళు కొడితే, మీరు కొట్టే ప్రతి రాయికి బదులుగా ఒక పెద్ద పాపము తుడిచివేయబడుతుంది. మీరు ఖుర్బానీ చేస్తే దాని పుణ్యం మీ ప్రభువు అల్లాహ్ వద్ద మీ కోసం భద్రపరచబడుతుంది. మీరు తలనీలాలు సమర్పించినప్పుడు అల్లాహ్ ప్రతి వెంట్రుకకు బదులు ఒక పుణ్యం రాసేస్తాడు, ఒక పాపం తుడిచివేస్తాడు. ఆ తర్వాత మీరు తవాఫ్ చేస్తే మీరు పాపాలు లేకుండా పూర్తిగా ఎలా కడిగివేయబడతారంటే మీరు తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు ఎలాగైతే మీ కర్మపత్రాల్లో పాపాలు ఉండవో, అలా అయిపోతారు. తర్వాత ఒక దూత వచ్చి మీ రెండు భుజాల మధ్య చెయ్యి పెట్టి ఇలా అంటాడు: వెళ్ళండి, ఇక మీ భవిష్యత్తు కొరకు సత్కార్యాలు చేయండి. ఎందుకంటే మీ గత పాపాలు అన్నీ క్షమించవేయబడ్డాయి.” అల్లాహు అక్బర్.
మిత్రులారా, ఎన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి, ఎన్ని పుణ్యాలు ఏ ఏ సందర్భంలో భక్తునికి దక్కుతున్నాయో చూడండి. తలనీలాలు సమర్పిస్తే, తల వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అన్ని పుణ్యాలు ఇవ్వబడుతూ ఉన్నాయి, అన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి. వర్షపు చినుకులన్ని పాపాలు క్షమించవేయబడుతూ ఉన్నాయి. ఇసుక కంకరు అన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి. ఇసుక కంకరు ఎంత ఉందో లెక్కించగలమా? వర్షపు చినుకులు ఎన్ని ఉన్నాయో లెక్కించగలమా? తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో లెక్కించగలమా? అంటే, లెక్క చేయనన్ని పాపాలు ఉన్నా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా క్షమించేస్తాడు.
ఎవరైతే హజ్ ఆచరిస్తున్నారో, వారిని క్షమించడమే కాకుండా వారు ఎవరి కోసమైతే అక్కడ దుఆ చేస్తారో, వారి తల్లిదండ్రుల గురించి కావచ్చు, వారి భార్యాబిడ్డల గురించి కావచ్చు, బంధుమిత్రుల గురించి కావచ్చు, ఉపాధ్యాయుల గురించి కావచ్చు, ఇక ముస్లిం సమాజం గురించి కావచ్చు, వారు ఎవరి గురించి అయితే అక్కడ క్షమాపణ కోరుతారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని కూడా ఆ రోజు క్షమించేస్తాడు అని ప్రవక్త వారు తెలియజేస్తున్నారు కాబట్టి, ఎవరెవరైతే హజ్ కోసం వెళుతూ ఉంటారో భక్తులు వెళ్లి వారితో, “ఏమండీ మా కోసం కూడా దుఆ చేయండి, ఏమండీ మా కోసం కూడా దుఆ చేయండి,” అని విన్నవించుకుంటారు, ఇందుకోసమే మిత్రులారా.
కాబట్టి హజ్ చేయడం, హజ్ చేసే వారు ప్రతి చోట వారు నడుస్తున్నంత సేపు, వారు పలుకుతున్నంత సేపు, వారు దువాలు చేస్తున్నంత సేపు ఎన్నో పుణ్యాలు దక్కించుకుంటారు, వారు అనేక పాపాలు క్షమించవేయబడతాయి. అలాంటి విశిష్టతలు, ఘనతలు దక్కించుకోబడే ఏకైక ఆరాధన ఈ హజ్ ఆరాధన. కాబట్టి మిత్రులారా, ఈ హజ్ కు అనేక విశిష్టతలు, ఘనతలు ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పటివరకు కొన్ని ఆధారాలతో సహా మీ ముందర ఉంచాను.
హజ్ యాత్రికుల కొరకు ముఖ్యమైన సూచనలు
అయితే ఇప్పుడు హజ్ చేయడానికి ఎవరైతే వెళుతూ ఉన్నారో వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు ధార్మిక పండితులు ఖురాన్, హదీసుల గ్రంథాల వెలుగులో తెలియజేసి ఉన్నారు. అవి కూడా ఇన్ షా అల్లాహ్ నేను చెప్పేసి నా మాటను ముగించేస్తాను.
హజ్ చేయు వారి కోసము ధార్మిక పండితులు తెలియజేసిన సలహాలు, సూచనలలో మొదటి సలహా ఏమిటంటే:
స్తోమత ఉన్నప్పుడు హజ్ చేయడంలో ఆలస్యం చేయరాదు
స్తోమత గలవారు వెంటనే హజ్ చేయాలి, ఆలస్యము చేయరాదు. ఎందుకు? అహ్మద్ గ్రంథంలోని ప్రామాణికమైన హదీసులో ప్రవక్త వారు తెలియజేస్తున్నారు:
ఎవరికైతే హజ్ చేయడానికి సౌకర్యం ఉంటుందో వారు వెంటనే హజ్ ఆచరించేయండి. ఎందుకంటే, తెలియదు, ఆలస్యము చేస్తే మీరు వ్యాధి బారిన పడవచ్చు, ఆ తర్వాత మీకు హజ్ చేయడం కుదరకపోవచ్చు. అలాగే, మీ దగ్గర ఉన్న సొమ్ము మీ దగ్గర నుంచి దూరమైపోవచ్చు, ఆ తర్వాత మీకు హజ్ చేయడానికి అవకాశం దొరక్కపోవచ్చు. అలాగే వేరే ఏదైనా కారణము మీకు ఏర్పడవచ్చు, ఆ కారణంగా మీరు మళ్లీ హజ్ వెళ్ళడానికి సౌకర్యం దక్కకపోవచ్చు.
కాబట్టి, సౌకర్యం దొరకగానే వెంటనే హజ్ ఆచరించేయాలి అని ప్రవక్త వారు తెలియజేశారు కాబట్టి, హజ్ చేయటంలో ఆలస్యం చేయరాదు.
చాలామంది ఏమంటారంటే, “ముసలివాళ్ళం అయిపోయాక, బాగా వృద్ధ్యాపానికి చేరుకున్నాక అప్పుడు చేద్దాం లేండి, ఇప్పుడే ఎందుకు తొందర ఎందుకు,” అంటారు. లేదు లేదు, అప్పటి వరకు బ్రతుకుతామని గ్యారెంటీ లేదు, అప్పటి వరకు ఆరోగ్యంగా ఉంటాము అని గ్యారెంటీ లేదు, ఎలాంటి మనకు అవసరాలు పడవు, గడ్డు పరిస్థితులు దాపురించవు అని గ్యారెంటీ లేదు కాబట్టి, సౌకర్యం ఉన్నప్పుడు వెంటనే హజ్ ఆచరించుకోవాలి. ఇది మొదటి సలహా.
అయితే, మనం సమాజంలో చూస్తూ ఉన్నాం, చాలా మంది లక్షాధికారులు, కోటీశ్వరులు ఉన్నారు. యవ్వనంలో ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. అవకాశం ఉంది వెళ్లి హజ్ ఆచరించడానికి, అయినా గానీ వెళ్ళట్లేదు. అలాంటి వారి కొరకు హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు చాలా కోపగించుకుని ఉన్నారు. ఆ మాట కూడా వినిపిస్తున్నాను చూడండి.
ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు ఈ విధంగా తెలియజేశారు: “ఎవరైతే స్తోమత ఉండి కూడా, అవకాశం ఉండి కూడా హజ్ కి వెళ్ళట్లేదో, హజ్ ఆచరించట్లేదో, అలాంటి వారిని గుర్తించి, వారి మీద ‘జిజ్యా’ ట్యాక్స్ విధించాలి. ఎందుకంటే, ఇలా అశ్రద్ధ వహించేవారు నిజమైన ముస్లింలు కారు” అని చెప్పారు.”
అల్లాహు అక్బర్. చూశారా? ఏమంటున్నారు? అవకాశం ఉండి కూడా వెళ్లి హజ్ ఆచరించట్లేదు అంటే, అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు అంటే వారు నిజమైన ముస్లింలు కాదు, వారి మీద జిజ్యా ట్యాక్స్ వేయండి అని ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు కోపగించుకుంటున్నారంటే జాగ్రత్త పడవలసి ఉంది సుమా.
ధర్మసమ్మతమైన (హలాల్) సంపాదనతోనే హజ్ చేయాలి
ఇక రెండవ సలహా ఏమిటంటే, హజ్ చేసేవారు ధర్మసమ్మతమైన హలాల్ సంపాదనతోనే హజ్ చేయాలి. అధర్మమైన సంపాదనతో చేసిన హజ్ స్వీకరించబడదు. హజ్ కాదు, ఏ సత్కార్యము స్వీకరించబడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:
يَا أَيُّهَا النَّاسُ، إِنَّ اللَّهَ طَيِّبٌ، وَلَا يَقْبَلُ إِلَّا طَيِّبًا (యా అయ్యుహన్నాస్, ఇన్నల్లాహ తయ్యిబున్, వలా యఖ్బలు ఇల్లా తయ్యిబన్) “ఓ ప్రజలారా, నిశ్చయంగా అల్లాహ్ పరిశుద్ధుడు, మరియు ఆయన పరిశుద్ధమైన దానిని తప్ప మరేదీ స్వీకరించడు.”
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరిశుద్ధుడు కాబట్టి ధర్మసమ్మతమైన విషయాలనే ఆయన ఆమోదిస్తాడు, స్వీకరిస్తాడు. అధర్మమైన విషయాలను ఆయన స్వీకరించడు, ఆమోదించడు. అధర్మమైన సంపాదనతో హజ్ చేస్తే అది ఆమోదించబడదు కాబట్టి హలాల్, ధర్మసమ్మతమైన సంపాదనతోనే హజ్ చేయాలి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక వ్యక్తి గురించి తెలియజేశారు. ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం,
“ఒక వ్యక్తి దూరము నుంచి ప్రయాణము చేసుకొని వస్తాడు. దుమ్ము, ధూళి నింపుకొని అక్కడికి చేరుకుంటాడు. ఆ తర్వాత దీనమైన స్థితిలో రెండు చేతులు పైకెత్తి “యా రబ్బీ, యా రబ్బీ” (“ఓ నా ప్రభువా, ఓ నా ప్రభువా”) అని అల్లాహ్ తో వేడుకుంటూ ఉంటాడు. ప్రవక్త వారు అంటున్నారు, అతను అంత శ్రమించినా, అంత దీనంగా వేడుకున్నా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని ప్రార్థనను, అతని సత్కార్యాన్ని ఆమోదించడు. ఎందుకంటే:
“అతని ఆహారం హరాం, అతని పానీయం హరాం, అతని వస్త్రం హరాం, మరియు అతను హరాంతో పోషించబడ్డాడు, కాబట్టి అతని ప్రార్థన ఎలా స్వీకరించబడుతుంది?“
అతను భుజించింది హరాం, అధర్మమైనది. అతను త్రాగింది హరాం, అధర్మమైనది. అతను తొడిగింది హరాం, అధర్మమైనది. అతను తిన్న తిండి కూడా అధర్మమైనది కాబట్టి అతని ప్రార్థన, అతని ఆరాధన ఎలా స్వీకరించబడుతుంది చెప్పండి? అన్నారు ప్రవక్త వారు. కాబట్టి అధర్మమైన సంపాదనతో చేసిన హజ్ స్వీకరించబడదు కాబట్టి జాగ్రత్త, ధర్మసమ్మతమైన హలాల్ సంపాదనతోనే హజ్ చేయాలి.
హజ్ సమయంలో గొడవలు మరియు అశ్లీలతకు దూరంగా ఉండాలి
అలాగే, మూడవ సలహా ఏమిటంటే, హజ్ యాత్ర చేస్తున్నప్పుడు గొడవలకు దిగకూడదు, దూషించకూడదు, అసభ్యకరమైన పనులు చేయకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా తెలియజేశాడు, సూర బఖరా 197వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:
مَنْ حَجَّ فَلَمْ يَرْفُثْ وَلَمْ يَفْسُقْ، رَجَعَ كَمَا وَلَدَتْهُ أُمُّهُ (మన్ హజ్జ ఫలమ్ యర్ఫుస్ వలమ్ యఫ్సుఖ్ రజ’అ కమా వలదత్హు ఉమ్ముహు) “ఎవరైతే హజ్ చేసి, అసభ్యకరంగా మాట్లాడకుండా, పాపం చేయకుండా ఉంటాడో, అతను తన తల్లి గర్భం నుండి పుట్టిన రోజున ఉన్నట్లుగా తిరిగి వస్తాడు.”
ఎవరైతే హజ్ చేయడానికి వెళ్లారో వారు దుర్భాషలాడకూడదు, అలాగే అసభ్యమైన కార్యాలు చేయకూడదు, గొడవలకు పాల్పడకూడదు. అలా ఎవరైతే గొడవలకు పాల్పడకుండా, అసభ్యమైన కార్యాలు చేయకుండా, దూషించకుండా హజ్ యాత్ర ముగించుకొని వస్తారో, అప్పుడే తల్లి గర్భం నుంచి జన్మించిన శిశువు ఖాతాలో ఎలాగైతే పాపాలు ఉండవో, వారి ఖాతాలో నుంచి కూడా అలాగే పాపాలు తొలగివేయబడి ఎలాంటి పాపాలు ఉండవు అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.
జీవితంలో ఒక్కసారి హజ్ విధి
అలాగే మిత్రులారా, ముఖ్యమైన ఒక విషయం ఏమిటంటే, జీవితంలో ఒక్కసారి మాత్రమే స్తోమత గలవారి మీద హజ్ విధి చేయబడింది. కాబట్టి జీవితంలో ఒక్కసారి మాత్రమే చేయటానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఫర్జ్ చేసిన ఆ హజ్ ను చేయటంలో ఆలస్యం చేయకూడదు. ఒక్కసారి మాత్రమే హజ్ విధి అయింది అనటానికి ఆధారం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ప్రజల ముందర బోధిస్తూ ఇలా అన్నారు:
يَا أَيُّهَا النَّاسُ، قَدْ فَرَضَ اللَّهُ عَلَيْكُمُ الْحَجَّ فَحُجُّوا (యా అయ్యుహన్నాస్, ఖద్ ఫరదల్లాహు అలైకుముల్ హజ్జ ఫహుజ్జూ) “ఓ ప్రజలారా, నిశ్చయంగా అల్లాహ్ మీపై హజ్ ను విధిగా చేశాడు, కాబట్టి హజ్ చేయండి.”
ఒక వ్యక్తి లేచి, “ఓ దైవ ప్రవక్త, ప్రతి సంవత్సరం చేయవలసిందేనా?” అన్నాడు. ప్రవక్త వారు సమాధానం ఇవ్వలేదు. రెండవ సారి అడిగాడు, సమాధానం ఇవ్వలేదు. మూడు సార్లు అడిగినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాకీదు చేస్తూ ఏమన్నారంటే:
لَوْ قُلْتُ نَعَمْ لَوَجَبَتْ وَلَمَا اسْتَطَعْتُمْ (లౌ ఖుల్తు నఅమ్ లవజబత్ వలమస్తత’తుమ్) “నేను అవును అని చెప్పి ఉంటే, అది విధిగా అయ్యేది, మరియు మీరు దానిని చేయలేకపోయేవారు.”
నేను అవును అని చెప్పేస్తే, మీ మీద విధి అయిపోతుంది, ప్రతి సంవత్సరం చేయడం విధి అయిపోతుంది. కాబట్టి అలాంటి ప్రశ్నలు మీరు ఎందుకు అడుగుతారు? మిమ్మల్ని మీరు కష్టంలోకి నెట్టుకునేటట్లుగా నాతో ప్రశ్నలు చేయకండి అని ప్రవక్త వారు తాకీదు చేశారన్నమాట. అంటే ఈ పూర్తి ఉల్లేఖనం యొక్క సారాంశం ఏమిటంటే, జీవితంలో ఒక్కసారి మాత్రమే హజ్ విధి చేయబడింది. ఒక్కసారి కంటే ఎక్కువ చేయకూడదా అంటే చేయవచ్చు, అది ‘నఫిల్’ అవుతుంది. ఎక్కువ సార్లు హజ్ లు చేయవచ్చు, అది నఫిల్ అవుతుంది. అలా చేయటం వలన అనేక విశిష్టతలు ఉన్నాయి. పాపాలు కడిగివేయబడతాయి, దువాలు స్వీకరించబడతాయి, కోరికలు తీర్చబడతాయి, అలాగే పేదరికము తొలగిపోతుంది, అనేక ప్రయోజనాలు ఉన్నాయి మిత్రులారా, చేయవచ్చు కాకపోతే అది నఫిల్ అవుతుంది అన్న విషయాన్ని గుర్తించాలి.
వ్యాధిగ్రస్తుల తరఫున హజ్ చేయటం
అలాగే, ఐదవ సలహా ఏమిటంటే, విపరీతమైన వ్యాధిగ్రస్తుల తరఫున వారసులు హజ్ చేయవచ్చు. అయితే, ముందు తమ తరఫున వారు హజ్ చేసుకొని ఉండాలి. చాలా మంది ప్రజల యొక్క తల్లిదండ్రులు లేదంటే బంధుమిత్రులు పూర్తిగా వ్యాధిగ్రస్తులైపోయి మంచాన పడిపోయి ఉంటారు, మంచానికే పరిమితం అయిపోయి ఉంటారు. లేవలేరు, కూర్చోలేరు, నడవలేరు. అలాంటి స్థితిలో ఉంటారు. మరి వారి తరఫున వారి మిత్రులు గాని, వారి బంధువులు గాని వెళ్లి హజ్ ఆచరించవచ్చునా అంటే ఆచరించవచ్చు కాకపోతే ముందు వారు వారి తరఫున హజ్ ఆచరించుకొని ఉండాలి అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.
దీనికి ఆధారంగా మనం చూసినట్లయితే, ఖసామ్ తెగకు చెందిన ఒక మహిళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఇలా అడిగారు, “ఓ దైవ ప్రవక్త, నా తండ్రి మీద హజ్ విధి అయిపోయింది, కాకపోతే ఆయన వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు, వాహనం మీద కూర్చోలేడు, కాబట్టి నేను వెళ్లి నా తండ్రి తరఫున హజ్ ఆచరించవచ్చునా?” అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “అవును, చేయవచ్చు” అన్నారు. అలాగే ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు వెళ్ళిన వారి శిష్యుల్లో ఒక శిష్యుడు సంకల్పం చేస్తున్నప్పుడు:
لَبَّيْكَ عَنْ شُبْرُمَةَ (లబ్బైక్ అన్ షుబ్రుమా) “ఓ అల్లాహ్, నేను షుబ్రుమా తరఫున హజ్ చేయడానికి హాజరయ్యాను” అని చెప్పాడు.
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తితో, ఆ శిష్యునితో ఇలా అడిగారు, “ఏమయ్యా, ముందు నువ్వు నీ తరఫున హజ్ చేసుకున్నావా?” అని అడిగితే అతను అన్నాడు, “లేదండీ ఓ దైవప్రవక్త,” అన్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు:
حُجَّ عَنْ نَفْسِكَ ثُمَّ حُجَّ عَنْ شُبْرُمَةَ (హుజ్జ అన్ నఫ్సిక సుమ్మ హుజ్జ అన్ షుబ్రుమా) “ముందు నీ తరపున హజ్ చెయ్యి, ఆ తర్వాత షుబ్రుమా తరపున హజ్ చెయ్యి.”
కాబట్టి మిత్రులారా, ఇక్కడ రెండు ఉల్లేఖనాల ద్వారా మనకు అర్థమైన విషయం ఏమిటంటే, తల్లిదండ్రులు గాని, బంధుమిత్రులు గాని ఎవరైనా వ్యాధిగ్రస్తులైపోయి ఉంటే, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఉంటే వారి తరఫున వారి బంధువులు, కుటుంబ సభ్యులు హజ్, ఉమ్రాలు ఆచరించవచ్చు. కాకపోతే, ముందు వారు, ఎవరైతే ఇతరుల తరఫున హజ్ ఉమ్రాలు చేస్తున్నారో, వారు ముందు వారి తరఫున హజ్ ఉమ్రాలు చేసుకొని ఉండాలి.
పసి పిల్లలకు హజ్ చేయించడం
అలాగే, చాలా మంది ధనవంతులైన తల్లిదండ్రులు వారి వద్ద ఉన్న పసిపిల్లలకు కూడా హజ్, ఉమ్రాల కొరకు తీసుకుని వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నారు. అలా తీసుకుని వెళ్ళవచ్చునా అంటే, వెళ్ళవచ్చును, దానికి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలోని కొన్ని ఆధారాలు ఉన్నాయి.
ముస్లిం గ్రంథంలోని ఒక ఉల్లేఖనం ప్రకారము, ఒక మహిళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి తమ బిడ్డను పైకెత్తి చూపిస్తూ, “ఓ దైవ ప్రవక్త, ఈ బిడ్డను కూడా నేను తీసుకుని వెళ్లి హజ్ ఉమ్రా చేయించవచ్చునా?” అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు:
نَعَمْ وَلَكِ أَجْرٌ (నఅమ్ వలకి అజ్ర్) “అవును, మరియు నీకు ప్రతిఫలం ఉంది.”
“నీవు తప్పనిసరిగా నీ బిడ్డను తీసుకుని వెళ్లి హజ్ చేయించవచ్చు. నువ్వు ఆ బిడ్డను మోసుకొని అక్కడ శ్రమిస్తావు కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దానికి ఫలితంగా అదనంగా నీకు పుణ్యము ప్రసాదిస్తాడు,” అని ప్రవక్త వారు తెలియజేశారు.
అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక ధార్మిక పండితులు తెలియజేశారు, అదేమిటంటే తల్లిదండ్రులు ధనవంతులు. వారి బిడ్డలకు పసితనంలోనే తీసుకొని వెళ్లి హజ్ ఉమ్రాలు చేయించేశారు. ఆ బిడ్డలు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ పెరిగి పెద్దవారైపోతారు కదా, వారు పెరిగి పెద్దవారైపోయిన తర్వాత వారికి స్తోమత ఉంటే వారు తప్పనిసరిగా వారి తరఫున మళ్ళీ హజ్ ఉమ్రాలు చేసుకోవాలి. అలా కాకుండా స్తోమత ఉండి కూడా, “నా పసితనంలో మా తల్లిదండ్రులు నాకు ఉమ్రా చేయించేశారు, మా తల్లిదండ్రులు నాకు హజ్ చేయించేశారు,” అంటే కుదరదు. తల్లిదండ్రులు చేయించేశారు, అది వేరే విషయం. మీరు యవ్వనానికి చేరుకున్న తర్వాత మీకు స్తోమత ఉన్నప్పుడు మీ సొమ్ములో నుంచి మీ తరఫున మీరు తప్పనిసరిగా హజ్ ఉమ్రాలు ఆచరించుకోవలసి ఉంటుంది. అప్పుడే మీ బాధ్యత తీరుతుంది అని ధార్మిక పండితులు తెలియజేశారు.
హజ్ లోని గుణపాఠాలు
ఇవి కొన్ని విషయాలండీ. ఇక హజ్ చేసే వాళ్ళు అనేక విషయాలు అక్కడ గ్రహిస్తారండీ. ప్రపంచం నలుమూలల నుంచి అనేక జాతుల వారు, అనేక రంగుల వారు, అనేక భాషల వారు అక్కడికి వస్తారు. వారిలో రకరకాల జాతులు, రకరకాల రంగులు, రకరకాల భాషలు కలిగిన వారు ఉంటారు. అలాగే ధనం ప్రకారంగా ఎంతో వ్యత్యాసం కలిగిన వాళ్ళు ఉంటారు. గొప్ప గొప్ప కోటీశ్వరులు ఉంటారు, మధ్య తరగతి వాళ్ళు ఉంటారు, సాధారణమైన వాళ్ళు ఉంటారు. ఎవరు అక్కడికి వచ్చినా అందరూ ఒకే రకమైన బట్టల్లో అక్కడికి చేరుకుంటారు. అప్పుడు హజ్ చేసేవారు గమనించాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఉంటాయి.
మొదటి విషయం ఏమిటంటే ఇస్లాంలో ధనం మూలంగా గాని, జాతి మూలంగా గాని, రంగు మూలంగా గాని, అలాగే భాష మూలంగా గాని ఎవరికీ ఎలాంటి ఆధిక్యత లేదు. అందరూ అల్లాహ్ దృష్టిలో సమానులే అని చెప్పటానికి గొప్ప నిదర్శనం.
అలాగే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పిలుపు ఇచ్చినప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులందరూ అక్కడికి చేరుకుంటున్నారంటే ముస్లింలందరూ అంతర్జాతీయంగా ఐక్యంగా ఉన్నారు, అల్లాహ్ ఒక్క మాట మీద వారందరూ ప్రపంచం నలుమూలల నుండి బయలుదేరి రావడానికి సిద్ధంగా ఉన్నారు అని సూచించడం జరుగుతూ ఉంది.
అలాగే అక్కడికి చేరుకున్నప్పుడు ఇబ్రహీం అలైహిస్సలాం వారి త్యాగాలు, హాజిరా అలైహిస్సలాం వారి త్యాగాలు, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి త్యాగాలు, అవన్నీ గుర్తు చేసుకోవలసి ఉంటుంది. అలాగే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అక్కడ ఒకప్పుడు మక్కా ముష్రికులు చేసిన దాడులు, అలాగే నవ ముస్లింల మీద మక్కా ముష్రికులు చేసిన దౌర్జన్యాలు, ఒకప్పుడు బిలాల్ రజియల్లాహు లాంటి వారు అదే వీధుల్లో అల్లాహ్ కోసము “అల్లాహ్ అహద్, అల్లాహ్ అహద్” అని ఎంతగా శ్రమించారో, ఎంత కష్టపడి అల్లాహ్ ఏకత్వాన్ని చాటి చెప్పారో, ఆ సంఘటనలన్నీ మనం అక్కడ వెళ్ళినప్పుడు అవన్నీ గుర్తుంచుకోవలసి ఉంటుంది.
అలాగే మిత్రులారా, చాలా విషయాలు ఉన్నాయండి, ఇన్ షా అల్లాహ్ వేరే సందర్భాలలో మనం తెలుసుకుందాం. కాకపోతే, అక్కడ వెళ్ళినప్పుడు భక్తుడు కేవలం అల్లాహ్ నే ఆరాధిస్తాడు, అల్లాహ్ నే వేడుకుంటాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోనే అతను మాట్లాడుతూ ఉన్నట్టు ఉంటాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఏ వలినీ గుర్తుంచుకోడు, ఏ దర్గాని అక్కడ ఎవరూ గుర్తుంచుకోరు. వారందరి ముందర, వారందరి దృష్టిలో ఒకే ఒక ఆలోచన: అల్లాహ్ గృహం, మనం అల్లాహ్ తో మాట్లాడుతున్నాం, మనం అల్లాహ్ తో దుఆ చేసుకుంటున్నాం, మనం అల్లాహ్ ముందర ఇవన్నీ చేసుకుంటున్నామని అల్లాహ్ తోనే డైరెక్ట్ గా భక్తులందరూ సంభాషించుకుంటున్నారు కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తులతో డైరెక్ట్ గా మాట్లాడటానికి, వినటానికి, స్వీకరించటానికి, మన్నించటానికి, కోరికలు తీర్చటానికి అక్కడే కాదు ప్రపంచం నలుమూలలా సిద్ధంగా ఉన్నాడు, ఎవరి వాస్తా (మధ్యవర్తిత్వం) అవసరం లేదు, ఏ మరణించిన వ్యక్తి యొక్క వసీలా, వాస్తా భక్తునికి అవసరం లేదు, భక్తుడు కోరుకుంటే అల్లాహ్ డైరెక్ట్ గా వింటాడు అన్న తౌహీద్ సందేశం కూడా అక్కడ మనకు దొరుకుతుంది.
అలాగే, హజ్ ఉమ్రాలు ఆచరించే వారు అరఫా మైదానంలో, ముజ్దలిఫా మైదానంలో, మినా మైదానంలో వెళ్తూ ఉంటారు. అక్కడ రాత్రి వరకే ఉండాలంటే రాత్రి వరకే ఉంటారు. అక్కడ ఉదయాన్నే ఉండాలంటే అక్కడ ఉదయాన్నే ఉంటారు. అక్కడ ఎనిమిదవ తేదీన ఉండాలంటే ఎనిమిదవ తేదీనే ఉంటారు. తొమ్మిదవ తేదీన అలా ఉండాలంటే అక్కడే తొమ్మిదవ తేదీన మాత్రమే ఉంటారు. ఎందుకండీ? వేరే తేదీలలో అక్కడికి ఎందుకు వెళ్ళరు? అవన్నీ పక్కపక్కనే ఉన్నాయి కదా, ఒకే రోజు అన్ని తిరుక్కొని ఎందుకు రారు అంటే ప్రవక్త వారి విధానానికి విరుద్ధం అని వారు ఆ పని చేయరు. కాబట్టి అక్కడ వెళ్ళిన వారికి ప్రవక్త వారి విధానాన్ని అవలంబించటం భక్తుని యొక్క కర్తవ్యం అన్న విషయం కూడా బోధించబడుతుంది.
ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ హజ్ యాత్ర చేసే వారికి అవన్నీ విషయాలు బోధపడతాయి కాబట్టి నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కూడా ప్రత్యేకంగా హజ్ లు ఆచరించుకునే భాగ్యం ప్రసాదించు గాక. అలాగే కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో, భార్యాబిడ్డలతో కూడా వెళ్లి హజ్ లు ఆచరించే భాగ్యం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ప్రసాదించు గాక. అలాంటి సౌకర్యాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కలిగించు గాక.ఆమీన్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, షేక్ సలీం జామిఈ గారు ఇస్లాంలో సహనం (సబ్ర్) యొక్క ప్రాముఖ్యత మరియు దాని ప్రయోజనాల గురించి వివరించారు. సహనం పాటించేవారికి పరలోకంలో స్వర్గం లభిస్తుందని, దైవదూతలు వారికి స్వాగతం పలుకుతారని ఖుర్ఆన్ ఆధారాలతో తెలిపారు. సహనం పాటించడం వల్ల అల్లాహ్ ప్రేమ, సహాయం లభిస్తాయని, వారికి అపరిమితమైన పుణ్యం ప్రసాదించబడుతుందని నొక్కిచెప్పారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహనాన్ని గొప్ప అనుగ్రహంగా అభివర్ణించారని గుర్తుచేశారు. నిషిద్ధ విషయాలను త్యజించడం, పేదరికం మరియు కష్ట సమయాలు, శత్రువును ఎదుర్కోవడం, దైవ మార్గంలో పిలుపునివ్వడం, ఆత్మీయులను కోల్పోవడం, మరియు వ్యాధి సోకినప్పుడు వంటి వివిధ సందర్భాలలో సహనం ఎలా పాటించాలో ఉదాహరణలతో సహా వివరించారు. సహనం అనేది విశ్వాసంలో తల లాంటిదని, దాని విలువెంతో గొప్పదని ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.
وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ (వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్)
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
గౌరవనీయులైన ఇస్లామీయ సోదర సోదరీమణులారా, మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం,
السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు)
ఇంతకుముందు మీరు సహోదరుడు అబ్దుర్రహ్మాన్ గారి నోట వినే ఉన్నారు. నేటి మన ప్రసంగ అంశం సహనం ప్రయోజనాలు. సహనం వల్ల మనిషికి ఎలాంటి ఎలాంటి ప్రయోజనాలు సమకూరుతాయో ఈ ప్రసంగంలో మనము ఇన్ షా అల్లాహ్ ఖుర్ఆన్ మరియు హదీసుల వెలుగులో ఇన్ షా అల్లాహ్ కొన్ని ఉదాహరణలతో సహా కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాము కాబట్టి నేను మీ అందరితో కోరే విషయం ఏమిటంటే, జాగ్రత్తగా, ఏకాగ్రతతో విషయాలన్నింటినీ గమనించి వినాలని కోరుతున్నాను. అన్న విన్న మాటల మీద ఆచరించే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.
మనం పండితుల నోట అనేకసార్లు పరలోకం గురించి ప్రసంగాలలో విని ఉన్నాము కదండీ. మానవులందరూ మరణించిన తర్వాత పరలోకంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులందరితో లెక్కింపు తీసుకున్న తర్వాత నరకవాసులేమో నరకానికి వెళ్ళిపోతారు, స్వర్గవాసులేమో స్వర్గానికి చేరుకుంటారు. అయితే స్వర్గవాసులు ఎప్పుడైతే స్వర్గానికి చేరుకుంటారో, వారు స్వర్గంలో ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ దైవదూతలు కొందరు ఆ స్వర్గవాసులకు ఆహ్వానం పలుకుతూ ఉంటారు. ఏమని పలుకుతూ ఉంటారు? దాని ప్రస్తావన అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథంలోని 13వ అధ్యాయము 24వ వాక్యంలో ప్రకటించి ఉన్నాడు.
“మీరు చూపిన సహనానికి బదులుగా మీపై శాంతి కురియు గాక! (మీకు లభించిన) ఈ అంతిమ గృహం ఎంత మంచిది!” అని వారు అంటారు. (13:24)
సలామున్ అలైకుం బిమా సబర్ తుం అనే వాక్యం మీద ఒకసారి ఆలోచిస్తే దాని అర్థం ఏమిటంటే, “మీరు చూపిన సహనానికి బదులుగా మీపై శాంతి కురియు గాక. మీకు లభించిన ఈ అంతిమ గృహం ఎంత మంచిది” అని వారు అంటారు. మిత్రులారా, మీరు చూపించిన సహనానికి బదులుగా మీరు ఈ రోజు ఇక్కడ చేరుకుంటున్నారు అని ఆ రోజు దైవదూతలు స్వర్గవాసులు స్వర్గంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆహ్వానిస్తూ ఆ మాటలు అంటారు అంటే అర్థం ఏమిటండీ? ప్రపంచంలో దైవభక్తులు ఎంతో ఓపిక, సహనం కలిగి ఉంటారు కాబట్టి, వారు చూపించిన, ప్రదర్శించిన ఆ సహనం, ఓపిక వల్ల వారు అక్కడ స్వర్గానికి చేరుకుంటారు అని అర్థం మిత్రులారా.
అంతేకాదు, స్వర్గవాసులు స్వర్గంలో చేరిపోతారు కదా. స్వర్గవాసులు స్వర్గంలోకి చేరిపోయినప్పుడు వారిని ఉద్దేశించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటాడో తెలుసా? అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటాడో ఆ విషయాన్ని ఖుర్ఆన్ గ్రంథము 23వ అధ్యాయము 111వ వాక్యంలో తెలియజేశాడు,
“నేను ఈ రోజు వారికి వారి సహనానికి తగిన ప్రతిఫలం ఇచ్చాను. వాస్తవానికి వారు (ఆశించిన మేరకు) సఫలీకృతులయ్యారు (అని అల్లాహ్ సెలవిస్తాడు).” (23:111)
అల్లాహు అక్బర్. అక్కడ దైవదూతలు కూడా ఏమంటున్నారంటే మీరు చూపించిన సహనానికి బదులుగా మీరు ఈ రోజు ఇక్కడికి చేరుకుంటున్నారు, మీ మీద శాంతి కురియు గాక అని వారు స్వాగతిస్తూ ఉన్నారు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమని ప్రకటిస్తున్నారంటే, ఈ రోజు మీరు ఇక్కడికి చేరుకున్నారు, ఈ స్వర్గం నేను మీకు ఇచ్చాను అంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే మీరు చూపించిన సహనానికి బదులుగా నేను ఈ స్వర్గం మీకు ఇచ్చాను అని అల్లాహ్ అంటున్నాడు.
అల్లాహు అక్బర్. ఈ రెండు మాటలు వింటూ ఉంటే మనకు ఏమనిపిస్తుందండి? అంటే ప్రపంచంలో మనం ఎంతో ఓపికగా సహనం కలిగి ఉండాలన్న మాట. అలా ఉంటేనే మనము స్వర్గానికి చేరుకుంటామన్న మాట. అలా సహనం ఓపిక కలిగి ఉంటేనే రేపు దైవదూతలు మనకు స్వాగతిస్తారన్న మాట. కాబట్టి ఆ దృశ్యాన్ని ఒకసారి మనము మైండ్లో తెచ్చుకొని ఆలోచించుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలు, బాధలు అన్నీ కూడా తేలికమైనవి, చిన్నవి, వీటన్నింటి మీద మనము సహనం కలిగి ఉంటే, ఓపిక కలిగి ఉంటే ఇన్ షా అల్లాహ్ రేపు మనము స్వర్గానికి చేరుకుంటాము, దైవదూతలు మాకు స్వాగతిస్తారు అన్న ఊహతోనే ఆ ఆలోచనతోనే ఆ నమ్మకంతోనే మనము ఈ జీవితం గడిపేయొచ్చు మిత్రులారా.
కాబట్టి సహనం ఇది చిన్న విషయం కాదు. సహనం పాటించడం వలన మనిషి స్వర్గానికి చేరుకుంటాడు, స్వర్గానికి చేర్చే ఒక ముఖ్యమైన సాధనం సహనం. కాబట్టి సహనం మామూలు విషయం కాదు మిత్రులారా. సహనం మామూలు విషయం కాదన్న విషయం కూడా ఇన్ షా అల్లాహ్ నా ప్రసంగంలో ముందు ముందు నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సహనం వల్ల ఏంటి ప్రయోజనాలు? మనిషికి, భక్తునికి ప్రయోజనాలు ఏంటి అనేటివి మనము ఇన్ షా అల్లాహ్ తెలుసుకుందాం.
అల్లాహ్ ప్రేమ
సహనం వల్ల ఏ భక్తుడైతే సహనం పాటిస్తాడో, ఓపికను ప్రదర్శిస్తాడో, అలాంటి భక్తుణ్ణి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు. అల్లాహు అక్బర్. దీనికి ఆధారం ఏమిటి? దీనికి ఆధారము మూడవ అధ్యాయము 146వ వాక్యము. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తున్నాడు,
وَاللَّهُ يُحِبُّ الصَّابِرِينَ (వల్లాహు యుహిబ్బుస్ సాబిరీన్) సహనం వహించే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. (3:146)
అల్లాహ్ సహనశీలురులను ఇష్టపడతాడు. అల్లాహు అక్బర్. మనం ప్రపంచంలో సహనం కలిగి ఉంటే అల్లాహ్ మనల్ని మెచ్చుకుంటాడు. ఇంతకంటే మనకు ఎక్కువ ఇంకేం కావాలండి? అల్లాహ్ మెప్పు కోసమే కదా మనము ప్రయత్నిస్తాము, అల్లాహ్ ఇష్టపడాలనే కదా మనము సత్కార్యాలు చేస్తాము. కాబట్టి ఇక్కడ మనము అల్లాహ్ మెప్పు పొందటానికి ఒక మంచి అవకాశము, మంచి సాధనము సహనం పాటించడం. ఎవరైతే సహనం పాటిస్తారో, అలాంటి భక్తుల్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు అని స్వయంగా ఖుర్ఆన్ లో మూడవ అధ్యాయము 146వ వాక్యంలో ప్రకటించి ఉన్నాడు కాబట్టి మనము సహనం పాటించాలి.
సహనం పాటించడం వలన కలిగే ప్రయోజనాలలో ఒక ప్రయోజనం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనల్ని ఇష్టపడతాడు.
అల్లాహ్ తోడు
అలాగే మరోక ప్రయోజనం ఏమిటంటే, ఎవరైతే సహనం పాటిస్తారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి తోడుగా ఉంటాడు. అల్లాహు అక్బర్. దీనికి ఆధారం ఏమిటి? ఎనిమిదవ అధ్యాయము 46వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
సహన స్థైర్యాలను పాటించండి, స్థైర్యం కనబరిచే వారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ సహాయము, అల్లాహ్ మనకు తోడుగా ఉండటము, ఇదే కదా మనము కావాల్సింది. మనము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోడుగా ఉంటే ఎంతటి విషయాన్ని అయినా మనము ఓపికగా, ఎంతో తేలికగా మనము ఎదుర్కోవచ్చు. అల్లాహ్ మనకు తోడుగా ఉంటే ప్రపంచంలో మనము ఎవరితోనూ భయపడటానికి అవసరం ఉండదు అని అల్లాహ్ మనకు తోడు ఉంటే చాలు అని చాలా సందర్భాలలో అనుకుంటూ ఉంటాము కదండీ. అయితే అల్లాహ్ మనకు తోడుగా ఉండాలంటే మనము సహనం ప్రదర్శించాలి, ఓపిక ప్రదర్శించాలి. అలా సహనం కలిగి ఉండినట్లయితే అల్లాహ్ మనకు తోడుగా ఉంటాడని ఎనిమిదవ అధ్యాయం 46వ వాక్యంలో ప్రకటించి ఉన్నాడు కాబట్టి సహనం కలిగి ఉంటే మరొక ప్రయోజనం ఏమిటంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు తోడుగా ఉంటాడు.
అపరిమిత పుణ్యం
అంతే కాదండి. ఎవరైతే సహనం కలిగి ఉంటారో, ఓపికను ప్రదర్శిస్తారో, అలాంటి వారికి అపరిమిత పుణ్యము లభిస్తుంది. దీనికి ఆధారం ఏమిటండి? 39వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
అల్లాహు అక్బర్. మనం రంజాన్ నెలలో ఉపవాసాల గురించి వింటూ వింటూ ఏమంటామంటే, ఉపవాసం ఉంటే భక్తునికి అపరిమితమైన పుణ్యం ఇవ్వబడుతుంది అని వింటూ ఉంటాం కదా. అచ్చం అలాగే సహనం పాటిస్తే, ఓపికను ప్రదర్శిస్తే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా లెక్కలేనంత పుణ్యము అతనికి, ఆ భక్తునికి ప్రసాదిస్తాడు అని ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు, 39వ అధ్యాయము, 10వ వాక్యం. కాబట్టి సహనం పాటించడం వలన మనిషికి లెక్కలేనంత పుణ్యం ఇస్తాడు.
ఒక మనిషి ఒక మనిషికి లెక్కలేనంత సహాయం చేశాడు అంటే దాన్ని మనం అంచనా వేయలేకపోతూ ఉంటాం. అదే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తునికి లెక్కలేనంత పుణ్యం ఇచ్చేస్తే, దాన్ని అసలు మనం అంచనా వేయగలమా? మన అంచనాలకు చాలా పైన ఉంటుంది ఆ విషయం. కాబట్టి సహనం పాటిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తునికి లెక్కలేనంత పుణ్యం ఇస్తాడు అని వాగ్దానం చేసి ఉన్నాడు. ఇది కూడా సహనం వలన మనిషికి కలిగే ఒక ప్రయోజనం.
అలాగే మిత్రులారా, ఎవరైతే సహనం పాటిస్తారో, వాళ్ళకి స్వర్గం దక్కుతుంది అని ఇప్పుడు మనము రెండు వాక్యాలు విని ఉన్నాం. ఒకటి, దైవదూతలు స్వాగతించేది. రెండవది, స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రకటించేది. దైవదూతలు కూడా మీరు చూపించిన సహనానికి బదులుగా ఈ రోజు ఇక్కడికి చేరుకుంటున్నారు అని మీ మీద శాంతి కురియు గాక అని ఆహ్వానిస్తారు. ఆ వాక్యం ద్వారా కూడా స్పష్టమవుతుంది సహనం పాటిస్తే స్వర్గం లభిస్తుంది అని. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా మీరు చూపించిన సహనానికి బదులుగా ఈ రోజు నేను మీకు ఈ స్వర్గం ఇచ్చాను అని ప్రకటిస్తాడు. ఆ వాక్యము ద్వారా కూడా మనకు రూఢీ అవుతుంది అదేమిటంటే మనిషికి సహనం పాటించడం వలన స్వర్గం ప్రసాదించబడుతుంది.
సహనం ఒక గొప్ప అనుగ్రహం
మిత్రులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోడుగా ఉంటాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు, అపరిమితమైన పుణ్యం ప్రసాదిస్తాడు, స్వర్గం ప్రసాదిస్తాడు, ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే సహనం మామూలు విషయం అని అనిపిస్తుందా? కాదు కదా.
సహనం గొప్ప విషయం అని మనకు ఇవన్నీ ఈ ఉదాహరణల ద్వారా, ఈ వాక్యాల ద్వారా తెలుస్తుంది. అదే విషయం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేసి ఉన్నారు. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,
وَمَا أُعْطِيَ أَحَدٌ عَطَاءً خَيْرًا وَأَوْسَعَ مِنَ الصَّبْرِ (వమా ఊతియ అహదున్ అతఆన్ ఖైరన్ వ ఔసఆ మినస్సబ్ర్) “సహనం కంటే ఉత్తమమైన మరియు విస్తృతమైన బహుమతి మరెవరికీ ఇవ్వబడలేదు.” (సహీహ్ అల్-బుఖారీ)
అంటే మనిషికి ఇవ్వబడిన అనుగ్రహాలలో పెద్ద అనుగ్రహం, గొప్ప అనుగ్రహం, విశాలవంతమైన అనుగ్రహం అది సహనం అని ప్రవక్త వారు తెలియజేశారు. కాబట్టి మనిషికి ఎన్నో అనుగ్రహాలు దక్కుతాయి. కొందరికి మేధస్సు ఇవ్వబడుతుంది, కొందరికి కండబలం ఇవ్వబడుతుంది, కొందరికి వాక్ చాతుర్యం ఇవ్వబడుతుంది, మరికొందరికి డబ్బు ఇవ్వబడుతుంది, మరికొందరికి రకరకాల అనుగ్రహాలు ఇవ్వబడతాయి. అవన్నీ మనం లెక్క చేయలేం. ప్రతి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రకరకాల అనుగ్రహాలు ఇస్తాడు. అయితే ఆ అనుగ్రహాలన్నింటిలో గొప్ప అనుగ్రహం సహనం, ఓపిక పాటించే గుణం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరికైతే ఓపిక ప్రదర్శించే గుణం ఇవ్వబడిందో, ఎవరికైతే సహనం పాటించే గుణం ఇవ్వబడిందో, వారు గొప్ప వరం అల్లాహ్ తరపున పొంది ఉన్నారనే విషయాన్ని ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ద్వారా గ్రహించాలి.
అయితే మిత్రులారా, మరొకచోట ఖుర్ఆన్ గ్రంథం రెండవ అధ్యాయం 155 నుంచి 157 వాక్యాల వరకు మనము చూచినట్లయితే, అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సహనం పాటించే వారికి మూడు శుభవార్తలు తెలియజేసి ఉన్నాడు. ఏమన్నాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా?
“ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి.వారికెప్పుడు ఏ ఆపద వచ్చిపడినా, “మేము ఖుద్దుగా అల్లాహ్కు చెందినవారము, మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా!” అని అంటారు. వారిపై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందినవారు కూడా వీరే.” (2:155-157)
ఈ సహన మూర్తులకు శుభవార్త ఇవ్వండి. ఎవరు వారు? వారికి ఏమైనా ఆపద వస్తే వారు ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, మేము కూడా అల్లాహ్ వైపు మరలవలసిందే, మేము కూడా అల్లాహ్ అల్లాహ్ వాళ్ళమే అని వారు అంటారు. వారి కొరకే వారి ప్రభువు తరపున అనుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందిన వారు కూడా వీరే అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యాలలో తెలియజేశాడు. అంటే ఇక్కడ మూడు అనుగ్రహాల ప్రస్తావన ఉంది గమనించారా? వారిపై ప్రభువు దయానుగ్రహాలు ఉంటాయి, అంటే వారి మీద అల్లాహ్ దయ చూపుతాడు. రెండవది, వారి మీద కారుణ్యం ఉంటుంది, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క కారుణ్యం వారి మీద వర్షిస్తుంది. సన్మార్గాన్ని పొందిన వారు కూడా వీరే, వారు సన్మార్గం మీద ఉంటారు. అల్లాహు అక్బర్.
అంటే సహనం పాటించే వారికి మూడు అనుగ్రహాల ప్రస్తావన ఒకేచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రస్తావించాడు. వారి మీద అల్లాహ్ దయ ఉంటుంది, వారి మీద అల్లాహ్ కారుణ్యం ఉంటుంది, వారు సన్మార్గంలో నడుచుకుంటూ ఉంటారు. అల్లాహు అక్బర్. కాబట్టి సహనం పాటించడం వలన ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి మిత్రులారా.
అందుకోసమే సహాబాలు ఈ సహనం గురించి ఏమనేవారంటే ముఖ్యంగా ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ఏమనేవారంటే, వజద్నా ఖైర ఐషినా బిస్సబ్ర్.మేము మా జీవితంలో ఉత్తమమైన రోజులు ఎప్పుడు చూశామంటే సహనం పాటించే రోజుల్లోనే చూశాము అని చెప్పేవారు. ఎప్పుడైతే మనము సహనం పాటించామో, ఆ రోజుల్లోనే మా జీవితంలోని ఉత్తమమైన రోజులు మేము చూశాము అన్నారు ఆయన. అల్లాహు అక్బర్. అంటే సహనం పాటిస్తూ జీవిస్తే జీవితంలోని మరుపురాని ఉత్తమమైన రోజులు అయిపోతాయి ఆ దినాలు, మిత్రులారా.
అలాగే అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ఏమనేవారంటే “అస్సబ్ రు మినల్ ఈమాని బి మంజిలతిర్ రాస్“. విశ్వాసంలో సహనం యొక్క స్థానం ఏమిటంటే మనిషి శరీరంలో తలకు ఉన్న స్థానం లాంటిది అన్నారు. తల లేకుండా ఆ దేహానికి ఏమైనా విలువ ఉంటుందండీ? తల తీసేసి పక్కన పడేస్తే ఆ కాళ్ళకు, చేతులకు, ఆ దేహానికి ఏమైనా విలువ ఉంటుందా? ఎవరైనా ఆ దేహాన్ని గుర్తిస్తారా అసలు? గుర్తించరు, దానికి విలువ ఉండదు. తల లేని దేహానికి విలువ ఉండదు, అదే తల ఉన్న దేహానికి విలువ ఉంటుంది. అలాగే అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ఏమంటున్నారంటే సహనం కూడా విశ్వాసంలో తల లాంటిది. సహనం లేని విశ్వాసానికి విలువ ఉండదు. విశ్వాసంలో సహనం ఉంటే ఆ విశ్వాసానికి చాలా అంటే చాలా విలువ ఉంటుంది అని ఆయన చెప్పిన మాటలకు అర్థం మిత్రులారా.
కాబట్టి ఇప్పటివరకు మనము విన్న మాటలలో మనకు అర్థమైన విషయం ఏమిటంటే మిత్రులారా, సహనం ప్రదర్శిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోడుగా ఉంటాడు, అపరిమితమైన పుణ్యం ఇవ్వబడుతుంది, స్వర్గం ఇవ్వబడుతుంది, ఉత్తమమైన అనుగ్రహాలు ఇవ్వబడతాయి. అలాగే అల్లాహ్ యొక్క దయ ఉంటుంది, అల్లాహ్ కారుణ్యం ఉంటుంది, వారు సన్మార్గం మీద ఉంటారు, వారి విశ్వాసానికి ఎంతో విలువ ఉంటుంది, మరియు సహనంతో జీవిస్తే వారు జీవించిన ఆ రోజులు మధుర క్షణాలుగా వారి జీవితంలో నిలిచిపోతాయి. ఇన్ని విషయాలు మనము సహనం గురించి, ప్రయోజనాల గురించి తెలుసుకున్నాము.
సహనం పాటించవలసిన సందర్భాలు
అయితే మిత్రులారా, ఇప్పుడు సహనం ఎప్పుడెప్పుడు ప్రదర్శించాలన్న విషయాన్ని తెలుసుకుందాం. సహనం ఎప్పుడెప్పుడు ప్రదర్శించవలసి ఉంటుంది? ఏ ఏ సందర్భాలలో మనము సహనం ప్రదర్శించవలసి ఉంటుంది? అది కూడా ఇన్ షా అల్లాహ్ ఆధారాలతో తెలుసుకుందాం. ఒక్కొక్కటిగా చెబుతాను, మొత్తం తొమ్మిది విషయాలు ఉన్నాయండి. ఒక్కొక్కటిగా ఇన్ షా అల్లాహ్ చెబుతాను, బాగా శ్రద్ధగా వినండి, గుర్తుంచుకోండి.
1. నిషిద్ధ విషయాలను త్యజించేటప్పుడు
మొదటి విషయం ఏమిటంటే, నిషిద్ధ విషయాలను త్యజించేటప్పుడు చాలా సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. దీనికి మనం చూచినట్లయితే 79వ అధ్యాయము 40, 41 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
“మరెవడు తన ప్రభువు ఎదుట నిలబడే విషయమై భయపడ్డాడో, ఇంకా తన మనస్సును చెడు వాంఛల నుండి ఆపుకున్నాడో అతని నివాసం స్వర్గమే అవుతుంది.” (79:40-41)
ఈ వాక్యం యొక్క అర్థము మరియు సారాంశం ఏమిటంటే మిత్రులారా, మనిషి యొక్క మనసులో షైతాను కూర్చొని చెడ్డ కోరికలు కలిగిస్తూ ఉంటాడు. మనం ప్రసంగాలలో విని ఉన్నాము కదండీ, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో సైతాను అనుమతి తీసుకొని మనిషి మనసులో ఒక చిన్న చోటు తీసుకొని అక్కడ కూర్చున్నాడు, అక్కడ కూర్చొని మనిషికి చెడు కోరికలు, చెడు ఆలోచనలు అన్నీ కూడా కలిగిస్తూ ఉంటాడు అని మనము వేరే ప్రసంగాలలో విని ఉన్నాము కదండీ. కాబట్టి ఆ చెడు కోరికలు వచ్చినప్పుడు, చెడు ఆలోచనలు వచ్చినప్పుడు మనము సహనం ప్రదర్శించవలసి ఉంటుంది, ఏమని? అల్లాహ్ కు భయపడి ఈ పనులు చేయకూడదు, అల్లాహ్ నిషేధం చేశాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధం చేశారు. ఈ తప్పు చేస్తే, లేదంటే ఈ కోరికను నేను తీర్చుకుంటే రేపు నాకు ఇలాంటి శిక్షలు ఉంటాయి, రేపు నేను నష్టపోతాను. కాబట్టి రేపు శిక్షించబడకుండా ఉండటానికి, రేపు నష్టపోకుండా ఉండటానికి ఈ రోజు నా మనసును నేను కంట్రోల్ లో పెట్టుకుంటాను అని ఆ రోజు అతను ఒకవేళ సహనం ప్రదర్శించి, మనిషి తన మనసును కంట్రోల్ లో పెట్టుకొని, కోరికలను అదుపులో ఉంచుకుంటే అప్పుడు అతను ఎంతో సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. అలా చేస్తే రేపు ఇన్ షా అల్లాహ్ అతను శిక్షల నుండి రక్షించబడతాడు మరియు అతను సఫలీకృతుడైపోతాడు.
అయితే మిత్రులారా, ఆ కోరికలను అదుపులో పెట్టుకోవాలంటే మనిషికి సహనం కావాలి. ఎంతో పెద్ద సహనం అతనికి అవసరం అవుతుంది. మనం సమాజంలో నివసిస్తూ ఉన్నాం. మనం ఎక్కడైతే ప్రజల మధ్య నివసిస్తూ ఉన్నామో, మన ఇరుపక్కల మనం చూస్తూ ఉంటాం. మన మిత్రులు కావచ్చు, మన పొరుగువారు కావచ్చు, పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అవన్నీ అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించిన పనులై ఉంటాయి. వారు చేస్తూ ఎంతో ఆనందం పొందుతూ ఉంటారు, ఎంతో పాపులారిటీ పొందుతూ ఉంటారు. కానీ ఒక భక్తుడు అతనికి కూడా షైతాను రెచ్చగొడతాడు, నువ్వు కూడా ఈ పని చేస్తే నీకు కూడా పాపులారిటీ వస్తుంది, నువ్వు కూడా ఇది చేస్తే నీకు కూడా ఆనందం కలుగుతుంది, నువ్వు కూడా ఇది చేస్తే నువ్వు కూడా సంతోషపడతావు అని అతనికి షైతాను రెచ్చగొడతాడు. కానీ అలా సైతాను మాటల్లోకి రాకుండా మనసుని అదుపులో పెట్టుకోవాలి. అలా మనసుని అదుపులో పెట్టుకోవడానికి ఎంతో సహనం, ఓపిక అతనికి అవసరం అవుతుంది మిత్రులారా.
2. పేదరికం మరియు గడ్డు పరిస్థితులలో
మొదటి విషయం నిషిద్ధ విషయాలను త్యజించేటప్పుడు సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. రెండో విషయం ఏమిటంటే, పేదరికం, గడ్డు పరిస్థితులలో ఉన్నప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ పుట్టించాడు. కొంతమందిని ధనవంతులు చేశాడు., మరికొంతమందిని మధ్య తరగతి వాళ్ళలాగా చేశాడు., మరికొంతమందిని పేదవారిలాగా చేశాడు.. అది ఆయన నిర్ణయం. అయితే ఎప్పుడైతే మనిషికి పేదరికం, గడ్డు పరిస్థితి ఏర్పడుతుందో, అప్పుడు అతను ఎంతో ఓపిక, సహనం పాటించవలసి ఉంటుంది. దీనికి మనం చూసినట్లయితే 25వ అధ్యాయము 75వ వాక్యాన్ని మనం చూస్తే, అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
أُولَٰئِكَ يُجْزَوْنَ الْغُرْفَةَ بِمَا صَبَرُوا وَيُلَقَّوْنَ فِيهَا تَحِيَّةً وَسَلَامًا (ఉలాయిక యుజ్ జౌనల్ గుర్ ఫత బిమా సబరూ వ యులక్కౌన ఫీహా తహియ్యతన్ వ సలామా) “ఇలాంటి వారికే వారి సహన స్థైర్యాలకు బదులుగా స్వర్గంలోని అత్యున్నత స్థానాలు వొసగబడతాయి. అక్కడ సలాం, దీవెనలతో వారికి స్వాగత సత్కారాలు లభిస్తాయి.” (25:75)
మిత్రులారా, దీనికి నేను రెండు ఉదాహరణలు మీ అందరి ముందు ఉంచుతాను. గడ్డు పరిస్థితి ఏర్పడినప్పుడు ఏ విధంగా సహనం పాటించాలనేదానికి ఒక ఉదాహరణ, అలాగే పేదరికం మరియు గడ్డు పరిస్థితి రెండూ ఒకేసారి ఏర్పడితే ఎలా సహనం పాటించాలో అది ఒక ఉదాహరణ చెబుతాను చూడండి.
ముందుగా మనము యూసుఫ్ అలైహిస్సలాం వారి గురించి చూచినట్లయితే, యూసుఫ్ అలైహిస్సలాం వారు యాకూబ్ అలైహిస్సలాం వారి కుమారుడు. అదంతా కథ మనం ఈ రోజు చర్చించుకునే అవకాశం లేదు. యూసుఫ్ అలైహిస్సలాం వారిని వారి అన్నలు ఏం చేశారంటే తీసుకొని వెళ్లి బావిలో పడవేశారు. ఆయన చేసిన నేరం ఏమిటి? ఆయన ఏమైనా తప్పు చేశాడా? లేదు. చేయని నేరానికి అన్నలు తీసుకొని వెళ్లి ఆయనను బావిలో పడవేశారు. తర్వాత అక్కడి నుంచి కొంతమంది ఆయనను తీసుకొని వెళ్లి ఈజిప్ట్ నగరంలో అమ్మేశారు. బానిసగా మార్చబడ్డారు. కానీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దయతో రాజు ఇంటికి చేరుకున్నారు. అక్కడ మళ్లీ పెద్దవారైన తర్వాత చేయని నేరానికి ఒక మహిళ ఆయన మీద నింద మోపి జైలుకు పంపించింది. ఆయన జైలుకు కూడా వెళ్లారు. ఆయన చేసిన నేరం ఏమిటండి? ఆయన జైలుకు వెళ్లారు కదా, కటకటాలకు వెనక్కి వెళ్లారు కదా, చేసిన నేరం ఏమిటి? ఏమీ చేయలేదు. చేయని నేరానికి మళ్లీ ఆయన జైలు జీవితం అనుభవించవలసి వచ్చింది. చూశారా? ఎంత గడ్డు పరిస్థితి చూడండి. అన్నలు తీసుకొని వెళ్లి బావిలో పడవేయటం ఏమిటి, తర్వాత మార్కెట్లో అమ్మివేయబడటం ఏమిటి, ఆ తర్వాత చేయని నేరానికి నింద మోపబడటం ఏమిటి, మరియు జైల్లో జీవితం గడపడం ఏమిటి. ఇంత గడ్డు పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయన ఏం చేశారండి? సహనం పాటించారు. ఆయన పాటించిన సహనానికి మూలంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన ఫలితం ఏమిటో చూశారు కదా? ఏ చోట అయితే ఆయన జైలు జీవితం గడిపారో, అదే చోట మళ్లీ ఆయన ఆర్థిక మంత్రి అయిపోయారు అల్హందులిల్లాహ్. ఎంతో గొప్ప పోస్ట్ ని, ఎంతో గొప్ప హోదాని అక్కడ ఆయన సంపాదించుకోగలిగారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఆ హోదాకు, ఆ స్థాయికి చేర్చారు. అంటే ఇక్కడ యూసుఫ్ అలైహిస్సలాం వారి సంఘటనలో మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, గడ్డు పరిస్థితులు, పేదరికము ఏర్పడినప్పుడు సహనం పాటిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉన్నతమైన స్థానాలకు చేర్చుతాడు.
అలాగే మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలోని బనీ ఇస్రాయీలు వారి పరిస్థితుల్ని ఒకసారి మనం దృష్టిలో పెట్టుకోవాలండి. బనీ ఇస్రాయీలు వారు మూసా అలైహిస్సలాం వారు వచ్చే సమయానికి ఎలాంటి స్థితిలో ఉన్నారు? మనం ప్రసంగాలలో విని ఉన్నాం. ఫిరౌన్ అనే రాజు వారిని బానిసలుగా మార్చేసి రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. వెట్టి చాకిరి చేయిస్తూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు, తిడుతూ ఉన్నాడు, ఆకలితో సరైన ఆహారం పెట్టకుండా హింసిస్తూ ఉన్నాడు. అంతే కాదు, వారి వంశంలో పుట్టిన మగబిడ్డలను వారి కళ్ళ ముందే చంపి వేయిస్తూ ఉన్నాడు. ఎలాంటి క్లిష్టమైన స్థితులు ఇవి? ఎలాంటి గడ్డు పరిస్థితులు ఇవి? ఒక వైపు ఏమో కడుపు నిండా ఆహారము లేదు, పైనుంచి వెట్టి చాకిరి చేయవలసి వస్తూ ఉంది, తర్వాత దెబ్బలు తినవలసి వస్తూ ఉంది, మాటలు పడాల్సి వస్తూ ఉంది, అంతేకాదు పుడుతున్న మగబిడ్డల్ని కళ్ళ ముందరే కోల్పోవలసి వస్తూ ఉంటుంది. పేదరికం, గడ్డు పరిస్థితి దీనికంటే ఇంకా హీనమైనది ఇంకోటి ఉంటుందా? అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా మూసా అలైహిస్సలాం వారు ఏమనేవారో తెలుసా? ఇస్తఈనూ బిల్లాహి వస్బిరూ. మీరు సహనం పాటించండి, అల్లాహ్ సహాయం అర్థించండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తప్పనిసరిగా మీకు సహాయపడతాడు అని చెప్పేవారు. వారు అలాగే చేశారు. సహనం పాటించారు, అల్లాహ్ సహాయం కోరారు. చివరికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మూసా అలైహిస్సలాం వారితో పాటు బనీ ఇస్రాయీలు వారిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయేటట్టుగా అనుమతి ఇచ్చేశాడు. వెళ్తూ ఉంటే ముందర సముద్రం వచ్చింది. కథ మనమంతా విని ఉన్నాం. అల్లాహ్ ఆజ్ఞతో సముద్రంలో దారి తెరవబడింది. మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీలు వారు ఆ సముద్రం మధ్యలో ఉన్న దారిలో నుండి అటువైపు గట్టుకు చేరుకున్నారు. అదే మార్గంలో ఏ ఫిరౌన్ అయితే బనీ ఇస్రాయీలు వారిని హింసించాడో, పీడించాడో, కొట్టాడో, తిట్టాడో, వారి బిడ్డల్ని చంపించాడో, అతను అదే మార్గం నుండి వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు బాగా మధ్యలో వచ్చేసినప్పుడు మళ్లీ సముద్రం నీళ్లు కలిసిపోయాయి. చివరికి ఏమైందో తెలుసు కదండీ. ఫిరౌన్ బనీ ఇస్రాయీలు ప్రజల కళ్ళ ముందే సముద్ర నీటిలో మునిగి కుక్క చావు చచ్చాడు. చచ్చే ముందు ప్రాణభిక్ష పెట్టండయ్యా అని దీనంగా వేడుకున్నాడు. కానీ ప్రాణాలు దక్కలేదు. కుక్క చావు చచ్చాడు. చూశారా? అంటే ఇక్కడ చెప్పుకొచ్చే విషయం ఏమిటంటే, బనీ ఇస్రాయీలు ప్రజలు కూడా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు, పేదరికాన్ని ఎదుర్కొన్నారు. అయితే మూసా అలైహిస్సలాం వారు చెప్పినట్టుగా సహనం పాటించి, అల్లాహ్ సహాయం కోరారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని సహనం పాటించి మరియు అల్లాహ్ యొక్క సహాయం కోరిన కారణంగా ఆ పరిస్థితుల నుంచి గట్టు ఎక్కించాడు. అల్హందులిల్లాహ్.
కాబట్టి పేదరికం ఉన్నప్పుడు సహనం పాటించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నప్పుడు బిడ్డలు సహనం పాటించాలి. వారిని దూషించరాదు. ఇతరులను చూసి తల్లిదండ్రులను తక్కువగా అంచనా వేయరాదు. చాలామంది బిడ్డలు తల్లిదండ్రులు వారు కోరుతున్న విషయాలు ఇప్పించట్లేదు అని తల్లిదండ్రులను తిడతారు, కొంతమంది అయితే ఇల్లు వదిలేసి పారిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా చేయడం సమంజసము కాదు. సహనం పాటించాలి.
3. శత్రువును ఎదుర్కొనేటప్పుడు
సరే, రెండు విషయాలు తెలుసుకున్నాము కదండీ. మూడో విషయం ఏమిటంటే, శత్రువుని ఎదుర్కొంటున్నప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. దీనికి ఆధారం రెండవ అధ్యాయం 250వ వాక్యం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
“వారు జాలూత్, అతని సైన్యంతో ముఖాముఖి అయినప్పుడు, “ప్రభూ! మాకు సహన స్థైర్యాలు ప్రసాదించు. మా కాళ్ళకు నిలకడను ఇవ్వు. అవిశ్వాస జనులపై జరిగే పోరాటంలో మాకు తోడ్పడు.” అని ప్రార్ధించారు.” (2:250)
ఇది తాలూత్ మరియు జాలూత్ మధ్య జరిగిన యుద్ధం సంఘటన. ఈ సంఘటన గురించి మనం చర్చించుకుంటే చాలా సమయం అయిపోతుంది. ప్రవక్త దావూద్ అలైహిస్సలాం జీవిత చరిత్ర అని నాది ఒక ప్రసంగం ఉంది YouTube లో, అది మీరు వింటే అక్కడ దీని వివరణ మొత్తం అక్కడ ఉంది అండి. క్లుప్తంగా విషయం ఏమిటంటే, శత్రువు సైన్యంలో జాలూత్ అనేవాడు ఒకడు ఉండేవాడు, గొప్ప బలశీలి, బలవంతుడు. అయితే అతన్ని ఎదుర్కోవడానికి ఎప్పుడైతే తాలూత్ వారు వెళ్లారో, వీరి వద్ద విశ్వాసుల సైన్యము చాలా తక్కువ సంఖ్యలో ఉండేది. అవిశ్వాసుల సంఖ్య ఎక్కువగా ఉండేది. వారి వద్ద సైన్యం ఎక్కువగా ఉండేది, ఆయుధాలు కూడా ఎక్కువగా ఉండేవి. కానీ అల్లాహ్ దయవల్ల ఈ తక్కువ సంఖ్యలో ఉన్న విశ్వాసులు యుద్ధ మైదానంలో సహనం పాటించారు. కాబట్టి శత్రువును ఎదుర్కొన్నప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది. విశ్వాసులు సంఖ్యలో తక్కువ ఉన్నప్పుడు, అవిశ్వాసులు సంఖ్యలో ఎక్కువగా ఉన్నప్పుడు భయపడరాదు. ఓపికగా సహనం ప్రదర్శించి అల్లాహ్ మార్గంలో ముందడుగు వేయవలసి ఉంటుంది. ఇది మూడవ విషయం.
4. అల్లాహ్ వైపు పిలుపు ఇచ్చినప్పుడు
నాలుగో విషయం ఏమిటంటే, అల్లాహ్ వైపు పిలుపు ఇచ్చినప్పుడు. మిత్రులారా, ఈ విషయం ముఖ్యంగా ఎవరైతే ఫీల్డ్ లో వెళ్లి ప్రజలకు దైవ వాక్యాలు వినిపించే పని చేస్తూ ఉన్నారో, వారికి వర్తిస్తుంది. అల్లాహ్ వైపు పిలుపు ఇచ్చినప్పుడు ప్రజలు రకరకాలుగా మాట్లాడుతారు. అలా మాట్లాడినప్పుడు వారి మాటలతో గుండె భారం పెంచుకోకుండా ఓపిక, సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. ఖుర్ఆన్ గ్రంథం 16వ అధ్యాయము 127వ వాక్యాన్ని చూస్తే,
“ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు సహనం వహించు. అయితే అల్లాహ్ తోడ్పాటు లేకుండా నువ్వు సహనం వహించలేవు. వారి పరిస్థితిపై బాధపడకు. వారు పన్నే కుట్రలు, కుయుక్తులకు లోలోపలే దుఃఖించకు.” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు.
అర్థం ఏమిటంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు సహనం వహించు. అయితే అల్లాహ్ తోడ్పాటు లేకుండా నువ్వు సహనం వహించలేవు. వారి పరిస్థితిపై బాధపడకు. వారు పన్నే కుట్రలు, కుయుక్తులకు లోలోపలే దుఃఖించకు. సహనం ప్రదర్శించు. నువ్వు చేస్తున్న పని దైవ వాక్యాలు ప్రజలకు వినిపించే పని. ఆ పని చేస్తున్నప్పుడు ప్రజలు నీ పట్ల కుట్రలు పన్నుతూ ఉన్నారు. వారు పన్నుతున్న కుట్రలకు నువ్వు దుఃఖించకు. సహనం ప్రదర్శించు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తూ ఉన్నాడు.
కాబట్టి ఇదే విషయం, ఇదే ఆదేశం మనకు వర్తిస్తుంది. మనము దేవుని విషయాలు, దేవుని వాక్యం ప్రజలకు వినిపించే ప్రయత్నం చేసినప్పుడు కుట్రలు పన్నే వాళ్ళు రకరకాలుగా కుట్రలు పన్నుతారు. అయితే మనము దుఃఖించకూడదు, అలాగే వెనకడుగు వేయకూడదు. సహనం పాటించాలి, అల్లాహ్ మార్గంలో ముందడుగు వేయాలి.
5. వ్యతిరేకులు విమర్శించినప్పుడు
ఐదో విషయం ఏమిటంటే, వ్యతిరేకులు విమర్శించినప్పుడు కూడా చాలా సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. మనం చెప్పే మాటలకు ఏకీభవించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఏకీభవించే వాళ్ళు మా మాటను వినేస్తారు. అయితే వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే విమర్శలు చేస్తారు. అప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. 73వ అధ్యాయం, 10వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
وَاصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَاهْجُرْهُمْ هَجْرًا جَمِيلًا (వస్బిర్ అలా మా యఖూలూన వహ్జుర్ హుం హజ్రన్ జమీలా) “వారు చెప్పే మాటలపై ఓర్పు వహించు. హుందాగా వారి నుండి నిష్క్రమించు.” (73:10)
వారు రకరకాలుగా విమర్శిస్తూ ఉంటారు. వారి విమర్శించే విమర్శలను నువ్వు పట్టించుకోవద్దు. వారి విమర్శలపై ఓర్పు, సహనం పాటించు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు.
6. ఆత్మీయులను కోల్పోయినప్పుడు
అలాగే ఆరో విషయం ఏమిటంటే, ఆత్మీయులను కోల్పోయినప్పుడు. అల్లాహు అక్బర్, ఇది గొప్ప విషయం అండి. మన కుటుంబంలో మన బిడ్డలు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, అన్న, చెల్లెళ్ళు ఎవరైనా కావచ్చు, మన ఆత్మీయుల్ని ఎప్పుడైతే మనము కోల్పోతామో, అప్పుడు కూడా చాలా సహనం పాటించవలసి ఉంటుంది.
ఇది మామూలు విషయం కాదు. మన కుటుంబ సభ్యుల్లో, మన ఆత్మీయుల్లో ఎవరో ఒకరు మరణించారంటే అది పెద్ద ప్రాణ నష్టం. ఆ నష్టం ఎప్పుడైతే వాటిల్లుతుందో, మనిషి కుంగిపోతాడు, కదిలిపోతాడు. అయినా గానీ ఓపిక సహనం పాటించవలసి ఉంటుంది.
బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనాన్ని చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు,
మాలి అబ్ దిల్ మోమిని ఇందీ జజావున్ ఇజా కబస్తు సఫియ్యహు మిన్ అహ్లిద్దున్యా సుమ్మ హతసబహు ఇల్లల్ జన్నా. “విశ్వాసి అయిన నా దాసుని యొక్క ఆత్మీయులు ప్రపంచంలో నివసించు వారిలో ఒకరిని నేను తీసుకున్నప్పుడు అతను నాపై నమ్మకం ఉంచి సహనంగా ఉంటే అతని కొరకు నా వద్ద స్వర్గం తప్ప మరో బహుమతి లేదు.“
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రవక్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట తెలిపిన మాట ఏమిటంటే, విశ్వాసి అయిన నా దాసుని యొక్క ఆత్మీయులు ప్రపంచంలో నివసించు వారిలో ఒకరిని నేను తీసుకున్నప్పుడు అతను నాపై నమ్మకం ఉంచి సహనంగా ఉంటే అతని కొరకు నా వద్ద స్వర్గం తప్ప మరో బహుమతి లేదు. అల్లాహు అక్బర్. ఆత్మీయుల్లో ఎవరో ఒకరు మరణించినప్పుడు మనము సహనం ప్రదర్శిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటున్నాడంటే అతని ఆత్మీయుల్ని నిన్ను తీసుకున్నాను, అయినా అతను సహనం పాటించాడు కాబట్టి అతనికి నా వద్ద స్వర్గం తప్ప మరొక బహుమతి లేదు, నేను అతనికి స్వర్గమే ఇచ్చేస్తాను బహుమానంగా అని అల్లాహ్ తెలియజేసి ఉన్నాడు. కాబట్టి ఆత్మీయుల్ని కోల్పోయినప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది, అలా పాటిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ భక్తునికి బహుమానంగా స్వర్గం ఇస్తాడు.
7. ప్రజల మధ్య సంచరిస్తున్నప్పుడు
అలాగే ఏడో విషయం ఏమిటంటే, ప్రజల మధ్య సంచరిస్తున్నప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే, ఒక వ్యక్తి అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ ప్రజల మధ్య నడుస్తూ ఉంటే అతని టోపీని చూసి గానీ, అతని గడ్డాన్ని చూసి గానీ, అతను ధరించిన జుబ్బాలను చూసి గానీ, లేదంటే ఏదో ఒక విషయాన్ని చూసి కొంతమంది వెక్కిరిస్తారు, లేదంటే హేళన చేస్తారు, రకరకాల ఎత్తిపొడిచే మాటలు మాట్లాడతారు. అయినా గానీ, నన్ను చూసి, నేను అమలు చేస్తున్న నా ఈ గడ్డాన్ని చూసి, లేదంటే నా బట్టలను చూసి, నా టోపీని చూసి వీరు నన్ను హేళన చేస్తున్నారు అని మనము కృంగిపోకూడదు, ఆ విషయాలను త్యజించకూడదు. సహనం పాటించవలసి ఉంటుంది. ప్రజల మధ్య ఉన్నప్పుడు లోకులు కాకులని విన్నారు కదా, ఆ విధంగా వాళ్ళు కావు కావు అంటారు. కానీ మనము సహనం పాటించాలి. ప్రజల మధ్య ఉండి, వారి మాటల మీద సహనం ప్రదర్శించినవాడు గొప్ప విశ్వాసి అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.
8. వ్యాధి సోకినప్పుడు
ఎనిమిదో విషయం ఏమిటంటే, వ్యాధి సోకినప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది. ఒక మనిషి ఆరోగ్యంగా ఎంతో కాలం జీవించుకుంటూ వస్తాడు. అయితే అకస్మాత్తుగా అతనికి ఒక వ్యాధి సోకుతుంది. ఆ వ్యాధి సోకిన తరువాత అతను ఎప్పుడైతే వైద్యం చేయించుకుంటాడో, అప్పటి నుండి అతని జీవితం తలకిందులైపోతుంది. డాక్టర్లు, వైద్యులు అతనికి ఇవి తినకూడదు, అవి తినకూడదు, అక్కడ కూర్చోకూడదు, అది ఎత్తకూడదు, అది మోయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని కొన్ని విషయాలు, కొన్ని ఆంక్షలు పెడతారు. అలా ఆంక్షలు పెట్టినప్పుడు అతని జీవితం మొత్తం తలకిందులైపోతుంది. అన్ని రోజులు అతను తోచింది తిన్నాడు, తోచినట్టు అతను నడుచుకున్నాడు. కానీ ఈ వ్యాధి వచ్చిన తర్వాత నుంచి అతను తోచింది తినలేడు, తోచినట్టు అతను ఏదీ చేయలేడు, క్రమశిక్షణతో అతను కొన్ని ఆంక్షలను పాటించవలసి వస్తూ ఉంటుంది. అలా జీవితం ఎప్పుడైతే తలకిందులైపోతుందో, అప్పుడు కూడా అతను సహనం పాటించవలసి ఉంటుంది.
దీనికి ఉదాహరణగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఒక మహిళకు ఒక వ్యాధి సోకింది. ఆవిడ స్పృహ కోల్పోయి దారిలో ఎక్కడంటే అక్కడ పడిపోయేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఆవిడ విన్నవించుకున్నారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు ఫలానా వ్యాధి ఉంది, ఆ వ్యాధి వల్ల నేను ఎక్కడంటే అక్కడ స్పృహ కోల్పోయి పడిపోతూ ఉంటాను కాబట్టి మీరు అల్లాహ్ తో దుఆ చేయండి, నా ఈ వ్యాధి తొలగిపోవాలని అల్లాహ్ ను ప్రార్థించండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఆవిడ కోరుకున్నారు.
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆవిడ ముందర రెండు విషయాలు ఉంచారు. మొదటి విషయం ఏమిటంటే, చూడమ్మా నువ్వు సహనం పాటిస్తే ఈ వ్యాధి మీద నీకు స్వర్గం ఇవ్వబడుతుంది. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏమిటంటే నువ్వు కోరినట్టుగానే నిన్ను దుఆ చేయమంటే నిన్ను దుఆ చేసేస్తాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వ్యాధి తొలగించేస్తాడు. ఈ రెండు విషయాల్లో నీకు ఏది కావాలో కోరుకో అన్నారు. ఆవిడ ఏమన్నారో తెలుసా? ఓ దైవ ప్రవక్త, నేను సహనం పాటిస్తాను, నాకు స్వర్గమే కావాలి అన్నారు. అల్లాహు అక్బర్. సుబ్ హా నల్లాహ్. చూశారా మిత్రులారా? కాబట్టి వ్యాధి సోకినప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది.
9. సేవ చేసేటప్పుడు
అలాగే చివరి విషయం ఏమిటంటే, సేవ చేసేటప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. మానవ సేవ అండి, సేవ అంటే ధార్మిక సేవ కావచ్చు, మానవ సేవ కావచ్చు, ఏ రకమైన సేవ అయినా సరే. సేవ చేసినప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. ఎందుకు?
ఎందుకు అంటే మీరు సేవ కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నప్పుడు ప్రజలు మీ మీద నోరు పారేసుకుంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీదనే ఒక వ్యక్తి వెళ్లి మాట్లాడాడు. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పంచే కొన్ని విషయాలు పంచుతూ ఉన్నారు. ప్రజల మధ్య కొన్ని విషయాలు పంచుతూ ఉన్నారు. పంచుతూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి యా ముహమ్మద్ ఇ’దిల్, ఓ ముహమ్మద్ నువ్వు న్యాయంగా వ్యవహరించు అంటూ ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చింది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొహం ఎర్రబడిపోయింది. సహాబాలు చూసి గమనించేశారు. ప్రవక్త వారికి అంత కోపం వచ్చింది అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆయన కారుణ్యమూర్తి కదండీ, కోపం వచ్చినా గానీ కోపం ప్రదర్శించరు. ఆయన ప్రశాంతంగా మాట్లాడుతారు. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను న్యాయం చేయకపోతే ఎవరు న్యాయం చేస్తారయ్యా అన్నారు. అల్లాహు అక్బర్. కాబట్టి సేవ కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నప్పుడు కూడా ప్రజలు నోరు పారేసుకుంటారు. కాబట్టి విశ్వాసంగా, నిజాయితీగా మనము సేవ కార్యక్రమాలు, అది ధర్మ సేవ కావచ్చు, మానవ సేవ కావచ్చు, అలాంటి కార్యక్రమాలలో పాల్గొనాలి. అలా పాల్గొనేటప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది.
ముగింపు
చివరిగా ధార్మిక పండితులు కొందరు ఏమన్నారంటే, సహనం మూడు రకాలు, అస్సబరు సలాసతు అన్వా. సబర్, సహనం మూడు రకాలు.
మొదటిది, అస్సబరు అలా అదాయిత్తాఅ. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశాలను పాటిస్తున్నప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది.
రెండవది, అస్సబరు అన్ ఇర్తికాబిల్ మాసియ. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిషేధించిన విషయాలను త్యజించేసేటప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది.
మూడవది, అస్సబరు అలా అఖ్దారిల్లాహిల్ మూలిమా. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తుని మీద కొన్ని నిర్ణయాలు ఎప్పుడైతే చేసేస్తాడో, ఆ అల్లాహ్ నిర్ణయాలను కట్టుబడి ఉండేటప్పుడు కూడా మనిషి సహనం పాటించవలసి ఉంటుంది.
ఈ మూడు విషయాలు ధార్మిక పండితులు తెలియజేశారు. చూడటానికి మూడు విషయాలు కానీ దీని అర్థము, భావము చాలా విశాలమైనది, లోతైనది.
ఇంతటితో నా మాటను ముగిస్తూ నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఓపిక, సహనం అనే గుణం ప్రసాదించు గాక. మనందరికీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అల్లాహ్ ఆరాధనల్లో, అల్లాహ్ ఆదేశాలు పాటించే విషయంలో సహనం పాటించే గుణం ప్రసాదించు గాక. అలాగే పాప కార్యాల నుండి, అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించిన విషయాల నుండి దూరం ఉండేటప్పుడు కూడా అల్లాహ్ మనందరికీ సహనం ప్రసాదించు గాక.
అలాగే ప్రవక్త వారు తెలియజేసినట్టుగా అల్లాహ్ ఇచ్చిన అనుగ్రహాలలో గొప్ప అనుగ్రహం సహనం, ఆ గొప్ప అనుగ్రహం సహనం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. అల్లాహ్ మనందరికీ స్వర్గం ప్రసాదించు గాక. నరకం మరియు సమాధి శిక్షల నుండి, ఇతర శిక్షల నుండి అల్లాహ్ మనందరినీ కాపాడు గాక. ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, పిల్లల శిక్షణలో తల్లి పాత్ర యొక్క ప్రాముఖ్యతను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. పిల్లలు అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహమని, వారిని నరకాగ్ని నుండి కాపాడటం తల్లిదండ్రుల బాధ్యత అని ఖురాన్ ఆయతుతో స్పష్టం చేయబడింది. తండ్రితో పోలిస్తే తల్లికి ఎక్కువ బాధ్యత ఉంటుందని, ఎందుకంటే పిల్లలు ఎక్కువగా తల్లితోనే గడుపుతారని ఒక హదీసు ఉటంకించబడింది. ప్రవక్త నూహ్ మరియు ప్రవక్త ఇబ్రాహీం (అలైహిముస్సలాం)ల కుమారుల ఉదాహరణల ద్వారా తల్లి విశ్వాసం పిల్లలపై ఎలా ప్రభావం చూపుతుందో తెలియజేయబడింది. అలాగే, ఇమామ్ అలీ, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్, ఇమామ్ బుఖారీ, మరియు ఇమామ్ షాఫియీ వంటి గొప్ప ఇస్లామీయ పండితులు మరియు నాయకుల జీవితాలలో వారి తల్లుల పెంపకం, భక్తి మరియు త్యాగాల పాత్రను చారిత్రక సంఘటనలతో వివరించారు. నేటి యువత మార్గభ్రష్టులు కావడానికి ధార్మిక విద్య లోపించడమే కారణమని, సమాజ సంస్కరణ జరగాలంటే బిడ్డలకంటే ముందు తల్లులకు విద్య నేర్పించడం అత్యంత ఆవశ్యకమని నొక్కి చెప్పబడింది.
అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడు అయిన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
సోదర సోదరీమణులారా! మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
పిల్లల శిక్షణలో తల్లి పాత్ర
ఈనాటి ప్రసంగంలో ‘పిల్లల శిక్షణలో తల్లి పాత్ర’ అనే అంశం మీద ఇన్ షా అల్లాహ్ కొన్ని విషయాలు ఖురాన్ మరియు హదీసు వెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవులకు అనేక అనుగ్రహాలు ప్రసాదించాడు. ఆయన ప్రసాదించిన అనుగ్రహాలలో సంతానం గొప్ప అనుగ్రహం. ఎవరికైతే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సంతానము ఇవ్వలేదో, అలాంటి దంపతులకు వెళ్ళి కలిసి మాట్లాడి చూడండి, సంతానం కోసం, బిడ్డల కోసం వారు ఎంత తపిస్తూ ఉంటారో వారి మాటలు వింటే అర్థమవుతుంది. తద్వారా, ఎవరికైతే అల్లాహ్ బిడ్డలు ఇచ్చాడో, సంతానము ప్రసాదించాడో, వారు అల్లాహ్ తరఫున గొప్ప అనుగ్రహము పొంది ఉన్నారన్న విషయాన్ని గ్రహించాలి.
అయితే, ఆ సంతానం విషయంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనకు ఈ విధంగా ఆదేశిస్తున్నాడు. ఖురాన్లోని 66వ అధ్యాయము 6వ వాక్యంలో అల్లాహ్ ఆదేశించిన ఆ ఆదేశము ఈ విధంగా ఉంది.
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قُوا أَنفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًا [యా అయ్యుహల్లజీన ఆమనూ ఖూ అన్ఫుసకుమ్ వ అహ్లీకుమ్ నారా] “ఓ విశ్వాసులారా! మీరు మిమ్మల్ని, మీ కుటుంబీకుల్ని అగ్ని బారి నుండి కాపాడుకోండి“ (66:6)
ఇక్కడ చాలా మంది ఆలోచనలో పడిపోతూ ఉంటారు. మిమ్మల్ని, మీ కుటుంబీకుల్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రపంచంలో ఉన్నవారికి ఆదేశిస్తున్నాడు, నరకాగ్ని ప్రపంచంలో లేదు కదండీ, పరలోకంలో కదా నరకాగ్ని ఉండేది, ప్రపంచంలో నరకాగ్ని నుండి మిమ్మల్ని, మీ కుటుంబీకుల్ని కాపాడుకోండి అని అల్లాహ్ ఆదేశిస్తున్నాడంటే దాని అర్థం ఏమిటి అని ఆలోచించుకుంటూ ఉంటే, ధార్మిక పండితులు తెలియజేసిన విషయము చూడండి, ఏ పనులు చేయడం వలన మనము వెళ్ళి నరకంలో పడిపోతామో, ఏ పాపాలు చేయడం వలన, ఏ దుష్కార్యాలు చేయడం వలన మన కుటుంబీకులు వెళ్ళి నరకంలో పడిపోతారో, ఆ పనుల నుండి, ఆ కర్మల నుండి మనము కూడా దూరంగా ఉండాలని, మన కుటుంబీకుల్ని కూడా దూరంగా ఉంచమని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేస్తున్నాడు, ఈ వాక్యానికి అర్థము అది అని ధార్మిక పండితులు వివరించారు.
ఏ పనులు చేస్తే మనిషి వెళ్ళి నరకంలో పడతాడు అంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చేయమని ఆజ్ఞాపించిన పనులు చేయకపోతే నరకానికి వెళ్ళవలసి వస్తుంది. అలాగే ఏ పనులైతే చేయవద్దు అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారించాడో, ఆ పనులు చేసేస్తే అది పాపం అవుతుంది, అప్పుడు నరకానికి వెళ్ళి పడాల్సి ఉంటుంది. కాబట్టి, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఏ పనులు చేయమని ఆదేశించాడో, ఏ పనులు చేయరాదు అని ఆదేశించాడన్న విషయాన్ని ముందు మనము తెలుసుకోవాలి, మన కుటుంబీకులకు కూడా తెలియపరచాలి, ఆ విధంగా అల్లాహ్ ఆదేశాలు మనము మరియు మన కుటుంబ సభ్యులు కట్టుబడి ఉంటే ఇన్ షా అల్లాహ్ నరకాగ్ని నుండి రక్షించబడతాము, స్వర్గానుగ్రహాలకు అర్హులవుతాము.
ఇక రండి మిత్రులారా. అల్లాహ్ ఆదేశాల గురించి మనము తెలుసుకోవాలి, మన కుటుంబీకులకు తెలియపరచాలి. మన కుటుంబీకులలో ముఖ్యంగా మన సంతానము ఉన్నారు, ఆ మన సంతానానికి అల్లాహ్ ఆజ్ఞలు తెలియజేయాలి. ఒక రకంగా సూటిగా చెప్పాలంటే, ధర్మ అవగాహన, ధార్మిక శిక్షణ వారికి ఇప్పించాలి. అయితే, బిడ్డలకు ధార్మిక శిక్షణ ఇప్పించే బాధ్యత తల్లి, తండ్రి ఇద్దరి మీద ఉంది, ఇందులో ఎలాంటి సందేహము లేదు, కాకపోతే తల్లి మీద కొంత ఎక్కువగా బాధ్యత ఉంది.
చూడండి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఈ విధంగా ప్రవచించారు.
وَالْمَرْأَةُ رَاعِيَةٌ عَلَى بَيْتِ بَعْلِهَا وَوَلَدِهِ وَهِيَ مَسْؤولَةٌ عَنْهُمْ [వల్ మర్అతు రాఇయతున్ అలా బైతి బాలిహా వ వలదిహీ వహియ మస్ఊలతున్ అన్హుమ్] మహిళ తన భర్త ఇల్లు మరియు సంతానము పట్ల బాధ్యురాలు. వారి బాధ్యత పట్ల ఆవిడ ప్రశ్నించబడుతుంది. (సహీహ్ బుఖారీ)
పురుషుడు కూడా బాధ్యుడే. ముఖ్యంగా ఇక్కడ మహిళ గురించి తెలియజేస్తూ, భర్త ఇల్లు మరియు సంతానము పట్ల మహిళ బాధ్యురాలు. ఆ బాధ్యత గురించి ఆమెకు ప్రశ్నించబడుతుంది కాబట్టి ఆ బాధ్యత ఆమె ఇక్కడ ప్రపంచంలో నెరవేర్చాలి అన్నారు. అలా ఎందుకన్నారన్న విషయాన్ని వివరిస్తూ ధార్మిక పండితులు తెలియజేశారు, తల్లి బిడ్డల అనుబంధము చాలా పటిష్టమైనది. బిడ్డలు తల్లి వద్ద ఎక్కువగా ఉంటారు. తండ్రి ఉద్యోగ రీత్యా, వ్యాపారము రీత్యా, ఇతర పనుల రీత్యా బయట ఎక్కువగా ఉంటాడు. కాబట్టి, బిడ్డలు తల్లి వద్ద ఎక్కువ ఉంటారు, తల్లి మాటల ప్రభావము, తల్లి చేష్టల ప్రభావము బిడ్డల మీద ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే చూడండి పండితులు అంటూ ఉంటారు, ‘తల్లి ఒడి శిశువుకి మొదటి బడి’. అలా ఎందుకంటారంటే బిడ్డలు తల్లి వద్ద ఎక్కువగా నేర్చుకుంటారు, తల్లి మాటల ప్రభావం బిడ్డల మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా తెలియపరిచారు. అందుకోసమే తల్లి మీద సంతానం పట్ల కొంచెం బాధ్యత ఎక్కువ అన్న విషయాన్ని తెలియజేయడం జరిగింది మిత్రులారా.
చారిత్రక ఉదాహరణలు
ఇక రండి, తల్లి మాటల ప్రభావము బిడ్డల మీద ఎక్కువగా ఉంటుంది అనటానికి ఖురాన్లో ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా, హదీసులలో ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా అని మనం చూచినట్లయితే, ఖురాన్లో ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి కుమారుని ప్రస్తావన, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుని ప్రస్తావన మనకు కనిపిస్తుంది.
ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు, తూఫాను వచ్చినప్పుడు నూహ్ అలైహిస్సలాం వారు పిలవగా, “నాన్నా వచ్చి పడవలో ఎక్కు, విశ్వాసులతో పాటు కలిసిపో, ఈ రోజు ఈ తూఫాను నుండి ఎవ్వరూ రక్షించబడరు” అంటే, పడవలెక్కి కాదండీ, నేను పర్వతం ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటాను అన్నాడు. పర్వతం ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉండగా పెద్ద అల వచ్చి తాకింది. ఆ తాకిడికి నీళ్ళలో పడి, మునిగి మరణించాడు.
ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుడ్ని చూడండి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వచ్చి, “నా కుమారా, నేను కల ద్వారా ఆదేశించబడ్డాను. నేను నిన్ను బలి ఇవ్వాలని అల్లాహ్ కోరుకుంటున్నాడు, నువ్వేమంటావు?” అంటే, “నాన్నగారండీ, మీకు ఇవ్వబడిన ఆదేశాన్ని వెంటనే మీరు అమలుపరచండి. దానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు నన్ను సహనం పాటించే వారిలో చూస్తారు” అని వెంటనే ఆయన ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైపోయారు. జరిగిన విషయం మనకు తెలుసు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇస్మాయీల్ అలైహిస్సలాం వారిని కాపాడాడు, ఆకాశము నుండి ఒక పశువుని పంపించి ఆయనకు బదులుగా ఆ పశువుని జబా చేయించాడు.
అయితే ఆలోచించి చూడండి. అక్కడ నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు ప్రవక్త పొజిషన్లో ఉన్న తండ్రి మాట వినట్లేదు, పర్వతం ఎక్కుతాను అని ప్రయత్నించాడు, చివరికి నీట మునిగి మరణించాడు. ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుడు ఇస్మాయీల్ అలైహిస్సలాం, ప్రవక్త పదవిలో ఉన్న తండ్రి మాటను వెంటనే శిరసావహించాడు, బలి అయిపోవటానికి సిద్ధమైపోయాడు. ఎందుకు వచ్చింది ఈ తేడా అంటే, ధార్మిక పండితులు ఆ విషయాన్ని కూడా వివరించారు. ఆ తేడా ఎందుకు వచ్చిందంటే, అక్కడ నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి అవిశ్వాసురాలు, అవిధేయురాలు కాబట్టి, ఆమె అవిశ్వాస ప్రభావము ఆ బిడ్డ మీద కూడా పడింది, ఆ బిడ్డ కూడా అవిశ్వాసుడయ్యాడు. ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సతీమణి హాజిరా అలైహస్సలాం గొప్ప భక్తురాలు. ఆమె భక్తి, ఆమె ఆరాధన, ఆమె ఆలోచన, ఆమె చేష్టలు వాటి ప్రభావము ఇస్మాయీల్ అలైహిస్సలాం వారి మీద పడింది. కాబట్టి ఆయన కూడా ఒక గొప్ప భక్తుడయ్యాడు. భక్తురాలి బిడ్డ భక్తుడయ్యాడు, అవిధేయురాలు బిడ్డ అవిధేయుడయ్యాడు అని ధార్మిక పండితులు తెలియజేశారు. తద్వారా తల్లి ఆలోచనల, తల్లి విశ్వాసాల, తల్లి చేష్టల, తల్లి మాటల ప్రభావము బిడ్డల మీద ఎక్కువగా ఉంటుందన్న విషయం అక్కడ స్పష్టమైపోయింది మిత్రులారా.
ఇక రండి. పూర్వం ఒక తండ్రి బిడ్డలను పిలిచి, వారు పెద్దవారైన తర్వాత సమావేశపరచి ఏమంటున్నాడంటే, “బిడ్డలారా! మీరు పుట్టిన తర్వాత నేను మీ మీద దయ చూపించాను. అలాగే, మీరు పుట్టక ముందు కూడా నేను మీ మీద దయ చూపించాను” అన్నాడు. బిడ్డలు పెరిగి పెద్దవారయ్యారు, ఆలోచించి అర్థం చేసుకునే సామర్థ్యం వారి వద్ద ఉన్నింది కాబట్టి వెంటనే నాన్నగారితో, “నాన్నగారండీ! మేము పుట్టిన తర్వాత మన కోసం మీరు కష్టపడ్డారు. మా ఆరోగ్యము రక్షించడానికి, మనకు మంచి ఆహారము తినిపించడానికి, మంచి బట్టలు ధరింపజేయటానికి, మంచి విద్య నేర్పించటానికి మీరు కష్టపడ్డారు, మా మీద దయ చూపించారు. ఇది అర్థమయింది. కానీ మేము పుట్టక ముందే మా మీద మీరు దయ చూపించారు అంటున్నారేమిటి? అది ఎలా సాధ్యమవుతుంది?” అని ఆశ్చర్యంగా వారు ప్రశ్నించినప్పుడు, ఆ తండ్రి అన్నాడు, “బిడ్డలారా! నా బిడ్డలు విద్యావంతులు, సమర్థవంతులు, క్రమశిక్షణ కలిగిన వారు, విలువలు కలిగిన వారు అవ్వాలంటే, నేను విద్యావంతురాలిని వివాహం చేసుకోవాలి. క్రమశిక్షణ కలిగిన, ధర్మ అవగాహన కలిగిన, భక్తురాలితో నేను వివాహం చేసుకోవాలి. అప్పుడే నా బిడ్డలు కూడా విద్యావంతులు, క్రమశిక్షణ కలిగిన వారు, భక్తులు అవుతారు అని నేను అందగత్తెల వెంట పడకుండా, ధనవంతురాలి వెనక పడకుండా, భక్తురాలు ఎక్కడున్నారని వెతికి మరీ నేను ఒక భక్తురాలితో వివాహం చేసుకున్నాను. అలా నేను వివాహం చేసుకోవడానికి కారణము, మీరు మంచి వారు, ప్రయోజనవంతులు, భక్తులు, సామర్థ్యము కలవారు కావాలనే ముందు చూపుతో అలా చేశాను కాబట్టి, మీరు పుట్టక ముందు కూడా నేను మీ మీద దయ చూపించాను” అని తెలియజేయగా, అప్పుడు ఆ బిడ్డలకు ఆ విషయం అర్థమయింది. తద్వారా ధార్మిక పండితులు తెలియజేసే విషయం ఏమిటంటే, మహిళ భక్తురాలు అయితే, విద్యావంతురాలు అయితే, వారి ఒడిలో పెరిగే బిడ్డలు కూడా గొప్ప భక్తులు అవుతారు, గొప్ప విద్యావంతులు అవుతారు.
దీనికి ఉదాహరణలు కూడా మనకు ఇస్లామీయ చరిత్రలో చాలా ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు ఇన్ షా అల్లాహ్ నేను మీ ముందర ఉంచుతున్నాను, చూడండి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం, అబూ బకర్ రజియల్లాహు అన్హు వారు నాయకులయ్యారు. ఆయన పరిపాలన యుగము ప్రశాంతంగా గడిచిపోయింది. ఆయన మరణానంతరం ఉమర్ రజియల్లాహు అన్హు వారు నాయకులయ్యారు. ఆయన పరిపాలన యుగము కూడా ప్రశాంతంగా గడిచిపోయింది. ఇస్లామీయ సామ్రాజ్యము విస్తరించి చాలా దూరం వరకు వ్యాపించిపోయింది. ఆ తర్వాత ఉస్మాన్ రజియల్లాహు త’ఆలా అన్హు ముస్లిముల నాయకులయ్యారు. ఆయన ప్రారంభంలో ప్రశాంతంగానే పరిపాలన జరిపారు, అయితే చివరి రోజుల్లో పెద్ద పెద్ద ఉపద్రవాలు తలెత్తాయి. చివరికి ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు షహీద్ చేయబడ్డారు. అప్పటికే ఇస్లామీయ సామ్రాజ్యము చాలా దూరం వరకు వ్యాపించి ఉంది. పెద్ద పెద్ద ఉపద్రవాలు తలెత్తి ఉన్నాయి, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు షహీద్ చేయబడ్డారు. ఆ తర్వాత నాయకుని పోస్టు ఖాళీగా ఉంది. ఎవరు బాధ్యతలు చేపడతారు అని ఎవరి వద్దకు వెళ్ళి మీరు బాధ్యతలు చేపట్టండి అంటే, ఎవరూ సాహసించట్లేదు, ఎవరూ ముందుకు వచ్చి ఆ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే పరిస్థితులు అలా క్లిష్టతరంగా మారి ఉన్నాయి కాబట్టి, ఉపద్రవాలు అలా తలెత్తి ఉన్నాయి కాబట్టి, ఎవరూ సాహసించలేకపోయారు.
అలాంటప్పుడు, అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ముందుకు వచ్చి, బాధ్యతలు స్వీకరించి, తలెత్తి ఉన్న ఆ పెద్ద పెద్ద ఉపద్రవాలన్నింటినీ ఆరు నెలల లోపే పూర్తిగా అణచివేశారు. పరిస్థితులన్నింటినీ అల్హందులిల్లాహ్ చక్కదిద్దేశారు.
మరి అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారిలో అలాంటి సామర్థ్యము ఎక్కడి నుంచి వచ్చింది అని మనము కొంచెం ఆయన చరిత్రను వెతికి చూస్తే, అలీ రజియల్లాహు అన్హు వారు జన్మించినప్పుడు, వారి తండ్రి, అనగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చిన్నాన్న, వారి వద్దకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళారు. చిన్నాన్న దగ్గరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళి, చిన్నాన్న గారి వద్దకు, మీ కుటుంబంలో చాలా మంది బిడ్డలు ఉన్నారు, వారందరికీ పోషించే భారం మీ మీద ఎక్కువగా పడిపోతూ ఉంది కాబట్టి, అలీని నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్ళి పెంచుకుంటాను అని చెప్పగా, చిన్నాన్న సంతోషంగా అలీ రజియల్లాహు అన్హు వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతికి ఇచ్చేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారిని, ఆయన పుట్టినప్పుడు పసితనంలో తీసుకొని వచ్చి, విశ్వాసుల మాత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారి చేతికి ఇచ్చి, ఈయనకు మీరు పోషించండి, మంచి బుద్ధులు నేర్పించండి అని చెప్పగా, ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా అలీ రజియల్లాహు అన్హు వారిని తీసుకొని, అలీ రజియల్లాహు అన్హు వారికి మంచి భక్తి, మంచి క్రమశిక్షణ, ఇలాంటి విషయాలు నేర్పించారు. అలా ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వద్ద శిక్షణ పొందిన అలీ రజియల్లాహు అన్హు వారు పెరిగి పెద్దవారయ్యాక, అలాంటి సామర్థ్యవంతులు, ప్రయోగవంతులు అయ్యారు మిత్రులారా. కాబట్టి, తల్లి మాటల, తల్లి భక్తి, తల్లి విశ్వాసపు ప్రభావము బిడ్డల మీద ఎక్కువగా ఉంటుంది అనటానికి ఇది పెద్ద నిదర్శనం.
ఇక రండి, రెండవ ఉదాహరణగా మనం చూచినట్లయితే, నలుగురు ఖలీఫాలు, అబూ బకర్, ఉమర్, ఉస్మాన్, అలీ రజియల్లాహు అన్హుమ్ వారు. వారి పరిపాలన యుగము స్వర్ణయుగం. వారి తర్వాత ప్రపంచంలో కేవలం ఒకే ఒక వ్యక్తి వారి లాంటి పరిపాలన, న్యాయంతో కూడిన పరిపాలన కొనసాగించారు. ఒకే ఒకరు. ఒకే ఒకరికి మాత్రమే అలాంటి పరిపాలన, అంటే నలుగురు ఖలీఫాల లాంటి పరిపాలన చేయటానికి వీలు పడింది. ఆ ఒకరు ఎవరంటే, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లాహ్ వారు. మరి ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లాహ్ వారికి అలాంటి సామర్థ్యము వచ్చిందంటే, ఎలా వచ్చిందన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఆయన జీవిత చరిత్రను ఒకసారి మనము చూచినట్లయితే, ఉమర్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వెళ్ళి ఆ సంబంధము కలుస్తూ ఉంది. అది ఎలాగంటే, ఉమర్ రజియల్లాహు అన్హు వారి పరిపాలన యుగంలో, ఆయన మారువేషంలో రాత్రి పూట గస్తీ చేసేవారు. ఒక రోజు గస్తీలో మారువేషంలో వెళ్తూ ఉంటే ఒక ఇంటి వద్ద తల్లి కూతుళ్ళ మధ్య గొడవ పడుతూ ఉండే శబ్దాన్ని విని, ఇంటి దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుందో వినటం ప్రారంభించారు.
అక్కడ తల్లి కుమార్తెతో, “ఈ రోజు పశువులు పాలు తక్కువ ఇచ్చాయి, కాబట్టి పాలలో నీళ్ళు కలుపు. వినియోగదారులందరికీ పాలు దొరికేలాగా పాలలో నీళ్ళు కలుపు,” అంటూ ఉంటే, కుమార్తె మాత్రము, “లేదమ్మా! విశ్వాసుల నాయకులు పాలలో నీళ్ళు కలపరాదు, స్వచ్ఛమైన పాలు మాత్రమే అమ్మాలి అని ఆదేశించి ఉన్నారు కాబట్టి, అలా చేయటము ద్రోహం అవుతుంది, అలా చేయకూడదమ్మా” అంటుంటే, తల్లి మాత్రము కుమార్తె మీద దబాయిస్తూ, “విశ్వాసుల నాయకుడు వచ్చి ఇక్కడ చూస్తున్నాడా? చెప్పింది చెప్పినట్టు చెయ్యి” అని దబాయిస్తూ ఉంటే, అప్పుడు భక్తురాలైన ఆ కుమార్తె తల్లితో, “విశ్వాసుల నాయకుడు చూడట్లేదమ్మా, నిజమే. కానీ ఈ విశ్వానికి నాయకుడు, విశ్వనాయకుడు ఉన్నాడు కదా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా! ఆయన చూస్తున్నాడే, మరి ఆయనకేమని సమాధానం ఇస్తారమ్మా” అని చెప్పారు. ఆ కూతురి, ఆ బిడ్డ మాటలు ఉమర్ రజియల్లాహు అన్హు వారికి చాలా నచ్చాయి. ఆమె భక్తి ఉమర్ రజియల్లాహు అన్హు వారికి చాలా నచ్చింది. వెంటనే ఆ ఇల్లుని గుర్తు పెట్టుకోండి అని చెప్పి, మరుసటి రోజు ఉమర్ రజియల్లాహు అన్హు వారి కుమారుడు ఆసిమ్ అని ఒకరుంటే, ఆయనతో ఆ బిడ్డ వివాహము చేయించటానికి వెంటనే అక్కడికి మనుషుల్ని పంపించగా, వెంటనే ఆ సంబంధము అల్హందులిల్లాహ్ ఒకే అయింది. ఆ ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఆ అమ్మాయిని, ఆ భక్తురాలిని కోడలుగా చేసుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నారు. అల్లాహు అక్బర్.
ఇక్కడికి ఆగలేదండీ, అసలు విషయం ఇప్పుడు వస్తుంది చూడండి. తర్వాత ఆ భక్తురాలికి ఒక కుమార్తె పుట్టింది. ఆ కుమార్తెకు పుట్టిన బిడ్డే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లాహ్ వారు. ఆ విధంగా ఆ భక్తురాలి మనవడు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్. ఆయన కూడా గొప్ప భక్తుడయ్యాడు, న్యాయంగా పరిపాలన చేసి నలుగురు ఖలీఫాల తర్వాత ఐదవ ఖలీఫాగా ఆయన కీర్తి పొందారు. కాబట్టి మహిళ భక్తురాలు అయితే ఆమె భక్తి ప్రభావము ఎంత వరకు వ్యాపిస్తుందో చూడండి మిత్రులారా.
ఇక రండి మరొక ఉదాహరణ మనం చూచినట్లయితే, ప్రపంచంలో ఖురాన్, అల్లాహ్ వాక్యాలతో నిండిన సురక్షితమైన గ్రంథము. ఖురాన్ తర్వాత ఈ ప్రపంచంలో ఎలాంటి బలహీనమైన వాక్యాలు, కల్పిత వాక్యాలు లేకుండా, పరిశుద్ధమైనది మరియు నమ్మకమైనది, ప్రామాణికమైన మాటలు కలిగి ఉన్న గ్రంథము ఏది అంటే సహీ అల్-బుఖారీ. ‘అసహుల్ కితాబి బాద కితాబిల్లాహి సహీ అల్-బుఖారీ’ అని పూర్తి ప్రపంచము ఆ గ్రంథము ప్రామాణికమైన హదీసులతో నిండి ఉంది అని, పూర్తి ప్రపంచము ఆ గ్రంథాన్ని ‘అసహుల్ కితాబి బాద కితాబిల్లాహ్’, అల్లాహ్ గ్రంథము తర్వాత ప్రామాణికమైన, నిజమైన మాటలతో నిండిన గ్రంథము అని కీర్తిస్తుంది. అలాంటి గ్రంథాన్ని ప్రపంచానికి ఇచ్చి వెళ్ళిన వారు ఎవరంటే ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్, ఇమామ్ బుఖారీ అని ప్రజలందరూ ఆయనను గుర్తు చేసుకుంటూ ఉంటారు.
మరి అలాంటి గొప్ప గ్రంథాన్ని ప్రపంచానికి ఆయన కానుకగా ఇచ్చి వెళ్ళారే, ఆయన అంత ప్రయోజకవంతుడు ఎలా అయ్యాడన్న విషయాన్ని మనము ఆయన చరిత్రలో కొంచెం వెళ్ళి చూస్తే, అర్థమయ్యే విషయం ఏమిటంటే, ఆయన బాల్యంలో కంటి చూపుకి దూరమై అంధుడిగా ఉండేవారు. బాల్యంలో ఆయనకు కంటి చూపు ఉండేది కాదు. మరి, ఆయన తల్లి రాత్రి పూట నిద్ర మేల్కొని తహజ్జుద్ నమాజులో కన్నీరు కార్చి ఏడ్చి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాతో బిడ్డకు కంటి చూపు ఇవ్వాలని ప్రార్థించేది. ఆమె అల్లాహ్ తో ప్రార్థన చేస్తూ ఉంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దయతలచి, ఆమె ప్రార్థన ఆమోదించి, అంధుడిగా ఉన్న ఆ బాలుడికి కంటి చూపునిచ్చాడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా. కంటి చూపు వచ్చిన తర్వాత, ఆ బాలుడు పెరిగి పెద్దవాడైన తర్వాత దేశ విదేశాలకు కాలినడకన ప్రయాణాలు చేసి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రామాణికమైన హదీసులన్నింటినీ ప్రోగు చేసి ఒక గ్రంథ రూపంలో పొందుపరిచారు. అదే సహీ అల్-బుఖారీ గ్రంథము. జాబిల్లి వెలుగులో కూర్చొని ఆయన హదీసులు రాసేవారు అని చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు. అలాంటి చూపు అల్లాహ్ ఆయనకు ఇచ్చాడు. అయితే, ఆ చూపు రావటానికి, ఆయన అంత గొప్ప విద్యావంతుడు, భక్తుడు అవ్వటానికి కారణము ఆయన తల్లి. చూశారా? తల్లి భక్తి మరియు తల్లి విద్య యొక్క ప్రభావము బిడ్డల మీద ఎలా పడుతుందో చూడండి.
మరొక ఉదాహరణ మనం చూచినట్లయితే, నలుగురు ఇమాములు ప్రపంచంలో ప్రసిద్ధి చెంది ఉన్నారు. ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లాహ్, ఇమామ్ షాఫియీ రహిమహుల్లాహ్, ఇమామ్ అబూ హనీఫా రహిమహుల్లాహ్. ఈ నలుగురు ఇమాములలో ఇమామ్ షాఫియీ వారు గొప్ప విద్యావంతులు అని అందరికీ తెలిసిన విషయం. అందరూ ఆయన గొప్ప విద్యావంతుడన్న విషయాన్ని అంగీకరిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఆయన చాలా పుస్తకాలు రచించి ప్రపంచానికి కానుకలుగా ఇచ్చారు. అందులో ‘అర్-రిసాలా’ అనేది ఒక పెద్ద, మంచి పుస్తకం. అలాంటి పుస్తకము అంతకు ముందు ఎవరూ రాయలేకపోయారు, ఆ తర్వాత కూడా ఎవరూ రాయలేకపోయారు అని ప్రపంచంలో ఉన్న పండితులు ఆ గ్రంథం గురించి తెలియజేస్తూ ఉంటారు, ఆ పుస్తకం గురించి తెలియజేస్తూ ఉంటారు. అలాంటి విద్యతో నిండి ఉన్న పుస్తకము ప్రపంచానికి ఆయన ఇచ్చారు.
మరి అంత విద్యావంతులు, అంత గొప్ప భక్తులు, ఇమాముగా ఆయన ఖ్యాతి పొందారు అంటే, అలా ఎలా సాధ్యమైందన్న విషయాన్ని మనం ఆయన చరిత్రలో వెతికి చూస్తే, ఆయన జన్మించక ముందే లేదా ఆయన జన్మించిన కొద్ది రోజులకే ఆయన తండ్రి మరణించారు. ఆయన అనాథగా ఉన్నప్పుడు, పసితనంలోనే ఆయన అనాథగా ఉన్నప్పుడు, ఆయన జన్మించింది యెమెన్ దేశంలో. ఆయన తల్లి యెమెన్ దేశం నుండి చంటి బిడ్డను ఒడిలో పెట్టుకొని ప్రయాణం చేసుకుంటూ యెమెన్ దేశం నుండి మక్కాకు వచ్చేసింది ఆవిడ. మక్కాకు వచ్చి అక్కడ స్థిరపడి, అక్కడ ఈ ఇమామ్ షాఫియీ రహిమహుల్లాహ్ వారికి మంచి విద్య నేర్పించింది. బిడ్డను ఒడిలో తీసుకొని వచ్చి మక్కాలో పండితుల వద్ద విద్య నేర్పించారు. అక్కడ స్థిరపడి, అక్కడ కష్టపడి బిడ్డకు విద్య నేర్పించారు, ప్రయోజవంతులు చేయటానికి ఆమె కృషి చేశారు. ఆమె కృషికి ఫలితంగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇమామ్ షాఫియీ రహిమహుల్లాహ్ వారికి ఎలాంటి విద్యావంతులుగా తీర్చిదిద్దాడంటే, ఏడు సంవత్సరాల వయసులోనే ఇమామ్ షాఫియీ రహిమహుల్లాహ్ వారు పూర్తి ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసేశారు. ఆ తర్వాత లక్షల సంఖ్యలో హదీసులను ఆయన కంఠస్థం చేసేశారు. ఆ తర్వాత పెద్ద పెద్ద పుస్తకాలు రచించి ప్రపంచానికి ఆయన ఇచ్చారు. ఆ విధంగా అంత పెద్ద ప్రయోజవంతులు, విద్యావంతులు, ఇమాముగా ఆయన ప్రసిద్ధి చెందారు, ఖ్యాతి పొందారు అంటే అక్కడ ఆయన తల్లి యొక్క శ్రమ, ఆయన తల్లి యొక్క కృషి ఉంది అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి.
వీటన్నింటి ద్వారా, ఈ ఉదాహరణలన్నీ మనము దృష్టిలో పెట్టుకుంటే, మనకు స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏమిటంటే మిత్రులారా, తల్లి విద్యావంతురాలు అయితే, తల్లి భక్తురాలు అయితే, తల్లి వద్ద సామర్థ్యము ఉంటే, ఆ తల్లి భక్తి ప్రభావము, ఆ తల్లి విశ్వాస ప్రభావము, ఆ తల్లి చేష్టల మాటల ప్రభావము బిడ్డల మీద పడుతుంది. ఆ బిడ్డలు పెద్దవారయ్యి గొప్ప విద్యావంతులు, గొప్ప భక్తులు, పండితులు అవుతారు, ఇమాములు అవుతారు, ఖలీఫాలు అవుతారు, ప్రపంచానికి కానుకలు ఇచ్చి వెళ్తారు అని మనకు వీటి ద్వారా అర్థమవుతుంది. ఈ విధంగా పిల్లల శిక్షణలో తల్లి పాత్ర చాలా ముఖ్యమైనది. తండ్రి కూడా బాధ్యుడే కానీ, బిడ్డల మీద తండ్రి కంటే తల్లి మాటల, చేష్టల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని ఈ ఉదాహరణ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది.
అలాగే, మానసిక వైద్య నిపుణులు కూడా, వైద్య రంగానికి చెందిన ఈ నిపుణులు కూడా ఏమంటుంటారంటే, తల్లి గర్భంలో బిడ్డ ఉంటున్నప్పటి నుంచి, తల్లి ఆలోచనల, తల్లి మాటల, తల్లి విశ్వాసాల ప్రభావము తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడే పడుతుంది. ఆ బిడ్డ మళ్ళీ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత తల్లి ఒడిలో ఉన్నప్పుడు మరీ ఎక్కువగా తల్లి ఆలోచనల, తల్లి మాటల, తల్లి చేష్టల, తల్లి విశ్వాసాల ప్రభావము మరీ ఎక్కువగా పడుతూ ఉంటుంది అని వైద్యులు, మానసిక వైద్య నిపుణులు కూడా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేసి ఉన్నారు.
ముగింపు
ఇక నేటి పరిస్థితుల్ని మనం ఒకసారి చూచినట్లయితే, నేటి తరం, నేటి మన యువత, నేటి మన బిడ్డలు మార్గభ్రష్టులయ్యారు, మార్గం తప్పారు, అశ్లీలతకు బానిసయ్యారు, మద్యపానానికి, జూదానికి, ఇంకా వేరే చాలా దుష్కార్యాలకు, అక్రమాలకు వారు పాల్పడుతున్నారు. అలా వారు మార్గభ్రష్టులవటానికి కారణం ఏమిటి అంటే, చాలా కారణాలు దృష్టిలోకి వస్తాయి. అందులో ముఖ్యంగా మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే, తల్లిదండ్రులు బిడ్డల ధార్మిక శిక్షణ గురించి శ్రద్ధ తీసుకోవట్లేదు. బిడ్డలకు భక్తి విషయాలు నేర్పించే విషయంలో శ్రద్ధ తీసుకోవటం లేదు. బిడ్డలకు విలువలు నేర్పించాలి, బిడ్డలకు భక్తి నేర్పించాలి, మంచి చెడు అలవాట్లు వారికి అర్థమయ్యే రీతిలో బోధించాలి అనే విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవట్లేదు. కేవలము ప్రాపంచిక విద్య, ప్రాపంచిక ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నంలోనే ఉన్నారు కానీ, భక్తి, ధర్మ అవగాహన అనే విషయం మీద వారు దృష్టి సారించట్లేదు కాబట్టి నేటి యువత, నేటి మన తరాలు, రాబోయే తరాలు వారు మార్గభ్రష్టులైపోతున్నారు. ఆ విధంగా సమాజంలో అశాంతి, అలజడులు వ్యాపించిపోతున్నాయి అన్న విషయం దృష్టికి వస్తుంది. కాబట్టి, సమాజంలో శాంతి రావాలన్నా, మన బిడ్డలందరూ మంచి క్రమశిక్షణ కలిగిన వారుగా మారాలన్నా, రాబోయే తరాల వారందరూ కూడా ప్రయోజవంతులు కావాలన్నా, వారికి ధార్మిక శిక్షణ ఇప్పించడము తల్లిదండ్రుల బాధ్యత. ముఖ్యంగా, ముఖ్యంగా తల్లులు భక్తురాళ్ళు అవ్వటం చాలా ముఖ్యము. అందుకోసమే ఒక కవి ఉర్దూలో ఈ విధంగా కవిత్వాన్ని తెలియజేశాడు,
اسلاہ معاشرہ آپ کو منظور ہے اگر بچوں سے پہلے ماؤں کو تعلیم دیجئے
మీరు సమాజాన్ని సంస్కరించాలనుకుంటున్నారా?, అలాగైతే, బిడ్డలకంటే ముందు తల్లులకు మీరు విద్య నేర్పించండి.
తల్లులు సంస్కారవంతులు, విద్యావంతులు అయితే అప్పుడు బిడ్డలు కూడా సంస్కారము కలవారు, విద్యావంతులు అవ్వటానికి మార్గము సుగమం అయిపోతుంది అని తెలియజేశారు.
కాబట్టి, నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మమ్మల్నందరికీ అన్న విన్న మాటల మీద ఆచరించే భాగ్యము ప్రసాదించు గాక. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మమ్మల్నందరినీ ధర్మ అవగాహన చేసుకొని మంచి కార్యాలలో చేదోడు వాదోడుగా ముందుకు కొనసాగాలని, అల్లాహ్ మనందరికీ సద్బుద్ధి ప్రసాదించు గాక, దుష్కార్యాల నుండి, పాపాల నుండి అల్లాహ్ మమ్మల్నందరినీ దూరంగా ఉంచు గాక. ఆమీన్.
వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దైవప్రవక్త ముహమ్మద్ ﷺ పై దరూద్ పంపడం! https://youtu.be/fmFOIVupMt8 [11 నిముషాలు] వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం దరూద్ పఠించడం యొక్క విశిష్టత మరియు ప్రాముఖ్యత వివరించబడింది. దరూద్ అంటే ఏమిటి, అల్లాహ్, దైవదూతలు మరియు విశ్వాసులు పంపే దరూద్ మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టం చేయబడింది. దరూద్ పఠించడం వల్ల కలిగే అపారమైన పుణ్యాలు, పాపాల క్షమాపణ, ఉన్నత స్థాయిలు మరియు ప్రళయ దినాన ప్రవక్త సిఫారసుకు అర్హులు కావడం వంటి ప్రయోజనాలు హదీసుల వెలుగులో చర్చించబడ్డాయి. ముఖ్యంగా శుక్రవారం రోజున అధికంగా దరూద్ పంపాలని ప్రోత్సహించబడింది. ప్రవక్త పేరు విన్న తర్వాత కూడా దరూద్ పంపని వారిని ప్రవక్త శపించినట్లుగా హెచ్చరించబడింది. చివరగా, నమాజులో పఠించే ‘దరూద్ ఇబ్రాహీం’ యొక్క పదాలను నేర్పిస్తూ, దానిని ఎక్కువగా పఠించాలని ఉపదేశించబడింది.
ప్రియ వీక్షకులారా! కారుణ్య వర్షి రమజాన్ అనే ఈ కార్యక్రమములోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
అభిమాన సోదరులారా! ఈరోజు మనం ఇన్ షా అల్లాహ్ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం దరూద్ పఠించటం గురించి తెలుసుకుందాం. అంటే దరూద్ విశిష్టత అని అర్థం. దరూద్ యొక్క విశిష్టత ఏమిటి? కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం.
దరూద్ విశిష్టత
అభిమాన సోదరులారా! దరూద్ విశిష్టత కొరకు ఈ ఒక్క ఆయత్ మనకి సరిపోతుంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ అహ్జాబ్ లో తెలియజేశాడు.
“నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.” (33:56)
ఓ విశ్వాసులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం అల్లాహ్ దరూద్ పంపుతాడు. దైవదూతలు దరూద్ పంపుతారు ప్రవక్త పైన. ఓ విశ్వాసులారా మీరు కూడా దరూద్ సలాం పంపించండి అని అల్లాహ్ ఆదేశిస్తున్నాడు. అంటే ఈ ఆయత్ లో ప్రవక్త పైన దరూద్ అల్లాహ్ పంపుతాడు, దైవదూతలు పంపుతారు, మీరు కూడా పంపండి విశ్వాసులారా అని అల్లాహ్ ఆదేశిస్తున్నాడు.
మరి దరూద్ అంటే ఏమిటి? దరూద్ అరబీలో సలాత్ అంటారు. అంటే, ఈ ఆయత్ లో, అల్లాహ్ దరూద్ పంపుతాడు అంటే, కారుణ్య వర్షం కురిపిస్తాడు అని అర్థం. అల్లాహ్ ప్రవక్త పైన దరూద్ పంపుతాడు అంటే, కారుణ్య వర్షం కురిపించటం అని. దైవదూతలు దరూద్ పంపుతారు అంటే, మన్నింపు కోసం, ఉన్నత సోపానాల కోసం ప్రార్థిస్తారన్నమాట. ఇది దైవదూతల దరూద్ అంటే. విశ్వాసుల దరూద్ అంటే, శ్రేయస్సు కోసం దుఆ చేయటం అని అర్థం.
దరూద్ పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఈ దరూద్ గురించి ముస్లిం షరీఫ్ లో ఒక హదీస్ ఉంది.
مَنْ صَلَّى عَلَيَّ صَلَاةً صَلَّى اللَّهُ عَلَيْهِ بِهَا عَشْرًا “మన్ సల్ల అలయ్య సలాతన్, సల్లల్లాహు అలైహి బిహా అషరన్” నాపై దరూద్ పఠించిన వ్యక్తి మీద అల్లాహ్ పది కారుణ్యాలు కురిపిస్తాడు.
ఎవరైతే అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పంపుతారో, ఆ వ్యక్తికి అల్లాహ్ పది కారుణ్యాలు కురిపిస్తాడు.
“ఎవరైతే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన ఒక్కసారి దరూద్ పంపుతాడో, ఒక్కసారి, దరూద్ పంపుతాడో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని పైన పది సార్లు కారుణ్యం పంపుతాడు, కురిపిస్తాడు. అలాగే అతని పది పాపాలు మన్నిస్తాడు. అలాగే అతని పది దరజాత్ (స్థాయి) పెంచుతాడు.”
ఇది దరూద్ యొక్క విశిష్టత. ఒక్కసారి దరూద్ పంపితే అల్లాహ్ మనపై పది కారుణ్యాలు కురిపిస్తాడు, అల్లాహ్ మన పది పాపాలు మన్నిస్తాడు, అల్లాహ్ మన పది స్థాయిలని పరలోకంలో పెంచుతాడు.
ప్రళయ దినాన ప్రవక్త సామీప్యం
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓ సందర్భంలో ఇలా తెలియజేశారు,
أَوْلَى النَّاسِ بِي يَوْمَ الْقِيَامَةِ أَكْثَرُهُمْ عَلَيَّ صَلاَةً “అవ్లన్నాసి బీ యౌమల్ ఖియామా, అక్సరుహుం అలయ్య సలాత్”. ఎవరైతే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అత్యధికంగాదరూద్ పంపుతారో వారు అత్యంత చేరువులో ఉంటారు ప్రవక్త గారికి.
ప్రళయ దినాన అత్యంత చేరువులో ఉండే వారు ఎవరు? ప్రళయ దినాన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు అత్యంత చేరువులో ఉంటారు. ఎవరంటే ఎవరైతే అత్యధికంగా ప్రవక్త పైన దరూద్ పంపుతారో. ఎవరైతే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఎక్కువగా దరూద్ పంపుతారో వారు అత్యంత చేరువులో ఉంటారు ప్రవక్త గారికి. దానికి అర్థం ఏమిటి? అంతిమ ప్రవక్త సిఫారసుకి హక్కుదారులు అవుతారు అని అర్థం. ఎంత ఎక్కువగా దరూద్ పంపుతామో, ఆ వ్యక్తి అంత ఎక్కువగా పరలోకంలో సిఫారసుకి హక్కుదారుడు అవుతారని అర్థం.
అలాగే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు,
“వారానికి ఏడు రోజుల్లో ఉన్నతమైన, శ్రేష్ఠమైన రోజు యౌముల్ జుమా, జుమా రోజు. కావున ఓ ప్రజలారా మీరు ఆ రోజు అత్యధికంగా నాకు దరూద్ పంపించండి. ఎందుకంటే మీరు పంపించే దరూద్ నా పైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చేర్పిస్తాడు.”
అభిమాన సోదరులారా! ఎవరికి ఇష్టం ఉండదు ప్రవక్త గారు సిఫారసు చేయాలని? కోరుకుంటాము. ప్రార్థిస్తూ ఉంటాము. ఓ అల్లాహ్, రేపు ప్రళయ దినాన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సిఫారసు నాకు పొందాలి అని దుఆ చేస్తూ ఉంటాము. “నా పై దరూద్ పంపండి, దరూద్ పఠించండి. ఎంత ఎక్కువగా దరూద్ పఠిస్తారో వారు నా సిఫారసుకి హక్కుదారులు అవుతారు” అని ప్రవక్త గారు అంటున్నారు. అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సిఫారసుకి హక్కుదారులు అవ్వాలంటే మనం అత్యధికంగా దరూద్ పఠిస్తూ ఉండాలి.
దరూద్ పంపని వారి గురించి హెచ్చరిక
అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు,
رَغِمَ أَنْفُ رَجُلٍ ذُكِرْتُ عِنْدَهُ فَلَمْ يُصَلِّ عَلَيَّ “రగిమ అన్ఫు రజులిన్ జుకిర్తు ఇందహు ఫలమ్ యుసల్లి అలయ్య” “ఏ వ్యక్తి దగ్గర నా ప్రస్తావన వస్తుందో, నా ప్రస్తావన విని కూడా నా పైన దరూద్ పఠించడో, దరూద్ పంపడో, ఆ వ్యక్తి ముక్కుకి మన్ను తగులుగాక”
అంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, “రగిమ అన్ఫు రజులిన్”, అల్లాహ్ ఆ వ్యక్తి ముక్కుకి మన్ను తగులుగాక అన్నారు. ఏ వ్యక్తి ముక్కుకి మన్ను తగులుగాక? ఏ వ్యక్తి దగ్గర నా ప్రస్తావన వస్తుందో, నా ప్రస్తావన విని కూడా నా పైన దరూద్ పఠించడో, దరూద్ పంపడో, ఆ వ్యక్తి ముక్కుకి మన్ను తగులుగాక అని శపించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక్కడ ముక్కుకి మన్ను తగులుగాక అంటే అర్థం ఏమిటి? అవమానం, పరాభవం పాలుగాక అని అర్థం. అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు విని, ప్రస్తావన వచ్చిన తర్వాత కూడా ప్రవక్త పైన దరూద్ పంపకపోతే వారు శాపగ్రస్తులు అవుతారు.
అలాగే మనము చాలాసార్లు విని ఉంటాము. ఓ సందర్భంలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మింబర్ పైన ఎక్కేటప్పుడు తొలి మెట్టు పైన ఆమీన్, రెండవ సారి ఆమీన్, మూడోసారి ఆమీన్ అన్నారు. అది ఏమిటి? ప్రతీ ఆమీన్ కి ఒక సందర్భం ఉంది, ఒక సంఘటన ఉంది. ఒకటి ఏమిటి దాంట్లో? జిబ్రయీల్ దైవదూత శపిస్తున్నారు, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట విని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు విని, ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు కూడా ఆయన పైన దరూద్ పంపడో, వాడు నరకంలో పోవుగాక అని జిబ్రయీల్ దైవదూత ఈ దుఆ చేస్తే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమీన్ అన్నారు. దీంతో అర్థమవుతుంది దరూద్ విశిష్టత.
దరూద్ ఎలా పంపాలి?
అభిమాన సోదరులారా! చివర్లో ఒక విషయం చెప్పి నేను ముగిస్తున్నాను, అది ఏమిటంటే, దరూద్ ఎలా పంపాలి? దరూద్ పలుకులు ఏమిటి అని సహాబాలు అడిగారు. ఓ ప్రవక్తా, మేము నమాజులో సలాం చేసే పద్ధతి మాకు తెలుసు కాబట్టి మేము సలాం చేస్తున్నాము. మేము అంటున్నాం నమాజులో, అత్తహియ్యాత్ లో. అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహమతుల్లాహి వ బరకాతుహు అని సలాం పంపుతున్నాము. కానీ ఈ దరూద్ ఎలా పంపాలి? దరూద్ వచనాలు ఏమిటి అని అడిగితే, అప్పుడు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దరూద్ పలుకులు నేర్పించారు.
అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్.
ఇవి దరూద్ పలుకులు. ఇవి కొన్ని పదాల హెచ్చుతగ్గులతో అనేక పదాలతో హదీస్ పుస్తకాలలో ఉంటుంది. దాంట్లో అన్నిటికంటే ఎక్కువ పేరు పొందిన, ఫేమస్ అయిన పదాలు ఇవి.
ఈ దరూద్ ని మనం నమాజులో కూడా చదువుతాము అత్తహియ్యాత్ లో. అందుకు మనము అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన అత్యధికంగా దరూద్ పంపిస్తూ ఉండాలి. అలాగే శుక్రవారం రోజు అత్యధికంగా పఠించాలి. ఈ మాసాన్ని మహా భాగ్యంగా భావించుకుని అనేక సార్లు, అత్యధికంగా దరూద్ పంపిస్తూ ఉండాలి. ఎంత ఎక్కువగా దరూద్ పఠిస్తామో, అంత ఎక్కువగా ఛాన్స్ ఉంది ప్రవక్త గారి సిఫారసు పొందటానికి. అల్లాహ్ కారుణ్యం పొందటానికి. అల్లాహ్ కారుణ్యం పొందటానికి ఎక్కువగా మనకి అవకాశం ఉంటుంది.
చివర్లో అల్లాహ్ తో ప్రార్థిస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అత్యధికంగా దరూద్ పఠించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన పైన దరూద్ పంపించి అల్లాహ్ యొక్క కారుణ్యానికి, అంతిమ దైవ ప్రవక్త యొక్క సిఫారసుకి హక్కుదారులు అయ్యేవారిలో అల్లాహ్ మనల్ని చేర్పించుగాక, ఆమీన్.
వ ఆఖిరు ద అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, వక్త ఇస్లాంలో నిషిద్ధమైన ‘బిదాత్’ (మతంలో నూతన ఆవిష్కరణ) యొక్క వివిధ రకాలను వివరిస్తారు. బిదాత్ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు: విశ్వాసానికి సంబంధించినది (బిదాత్ అల్-ఇ’తిఖాదియ్యా) మరియు ఆరాధనలకు సంబంధించినది (బిదాత్ అల్-అమలియ్యా). విశ్వాసపరమైన బిదాత్, జహ్మియా, ముతజిలా వంటి మార్గం తప్పిన సమూహాల సిద్ధాంతాలను ఉదాహరణగా చూపిస్తుంది. ఆరాధనలలో బిదాత్ను నాలుగు విభాగాలుగా వివరిస్తారు: 1) షరియత్లో ఆధారం లేని కొత్త ఆరాధనను సృష్టించడం (ఉదా: మీలాద్-ఉన్-నబీ ఉత్సవం), 2) నిర్ధారిత ఆరాధనలకు అదనంగా చేర్చడం (ఉదా: ఫర్జ్ నమాజ్లో రకాతుల సంఖ్యను పెంచడం), 3) ఆరాధన పద్ధతిని మార్చడం (ఉదా: వ్యక్తిగత ధిక్ర్ను సామూహికంగా చేయడం), 4) సాధారణ ఆరాధనలకు షరియత్ నిర్దేశించని ప్రత్యేక సమయం లేదా తేదీని కేటాయించడం (ఉదా: షాబాన్ 15న ప్రత్యేక ఉపవాసం మరియు జాగరణ). ప్రతి రకమైన బిదాత్ నుండి దూరంగా ఉండాలని మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గాన్ని మాత్రమే అనుసరించాలని వక్త నొక్కిచెప్పారు.
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.
గత ఎపిసోడ్ లో బిదాత్ అంటే ఏమిటి? దాని అర్థం తెలుసుకున్నాం. ఈరోజు బిదాత్ రకాలు తెలుసుకుందాం, కొన్ని రకాలు.
బిదాత్ రకాలు
ముఖ్యంగా బిదాత్ రెండు రకాలు.
మొదటి రకం విశ్వాసపరమైన బిదాత్. విశ్వాసానికి, ఈమాన్ కి సంబంధించిన బిదాత్. అంటే ఈ బిదాత్ సంబంధం వ్యక్తుల విశ్వాసాలతో ఉంటుంది. ఉదాహరణకు, జహ్మియా అనే ఒక వర్గం ఉంది, ముతజిలా అనే ఒక వర్గం ఉంది, రవాఫిజ్ అనే వర్గం ఉంది, తదితర మార్గ విహీన వర్గాల వారి సిద్ధాంతాలు. వారు అల్లాహ్ విషయంలో, అల్లాహ్ యొక్క అస్మాయె హుస్నా (ఉత్తమమైన పేర్లు) విషయంలో, అలాగే తఖ్దీర్ (విధి వ్రాత) విషయంలో, మన కర్మల విషయంలో వాళ్ళు కొత్త కొత్త విషయాలు కల్పించుకున్నారు. ఇప్పుడు దాని వివరం అవసరం లేదు. ఇది విశ్వాసానికి సంబంధించిన బిదాత్. ముతజిలా, జహ్మియా, రవాఫిజ్ తదితర మార్గ విహీన వర్గాల సిద్ధాంతాలు.
ఇక రెండవ రకం, ఆరాధనకి సంబంధించిన బిదాత్. ఆరాధన. నమాజ్ చేయటం, జికిర్ చేయటం, దుఆ చేయటం, హజ్ ఉమ్రా చేయటం, ఉపవాసం ఉండటం, పండుగ జరుపుకోవటం. హృదయానికి సంబంధించిన ఆరాధనలు, శారీరానికి సంబంధించిన ఆరాధనలు, నాలుకకి సంబంధించిన ఆరాధనలు. అంటే ఆరాధనకి సంబంధించిన బిదాత్, ఇది రెండవ రకం. అంటే ఇబాదత్ గా, ఆరాధనగా చెల్లుబాటు అవుతున్న బిదాత్. అది ఆరాధన కాదు, అది ఇబాదత్ కాదు, అది ప్రవక్త గారి విధానం కాదు. కానీ ఇబాదత్ గా, ఆరాధనగా చెల్లుబాటు అవుతా ఉంది.
ఉదాహరణకు, షరియత్ తో ఏ ప్రాతిపదిక కూడా లేని ఆరాధనను ఎవరైనా సృష్టించుకొని దానిని సమాజంలో ప్రవేశపెట్టడం. అంటే లేని నమాజు, లేని ఉపవాసం, లేని పండుగలను కల్పించుకోవటం అన్నమాట. ఉదాహరణకు, మీలాదున్నబీ, ఈద్ మీలాదున్నబీ ఉత్సవం. అది ఇబాదత్ గా, దీన్ లోని, ధర్మంలోని ఒక పండుగగా జరుపుకుంటారు. కానీ అది ఇబాదత్ కాదు. ఇది ఇబాదత్ లో బిదాత్ అవుతుంది.
అలాగే, ఇంకో రకం, చేయవలసి ఉన్న ఆరాధనకు అదనంగా ఏదన్నా చేర్చటం. ఉదాహరణకు, ఫర్జ్ నమాజులో ఒక రకాతును అదనంగా చేర్చటం. జుహర్ నమాజ్ నాలుగు రకాతులు ఫర్జ్. ఐదు చేయవచ్చా? చేయకూడదు. ఉద్దేశ్యపూర్వకంగా పుణ్యమే కదా, ఆరాధనే కదా, మంచి పనే కదా అని ఉద్దేశ్యంతో చేస్తే అది బిదాత్ అయిపోతుంది. అలాగే అసర్ లో నాలుగు, ఐదు చేయలేము. మగ్రిబ్ లో మూడు, నాలుగు చేయలేము. ఇషాలో నాలుగు, ఐదు చేయలేము. ఫజర్ లో రెండే, మూడు చేయలేము. మరి నమాజ్ మంచిదే కదా, నమాజ్ పుణ్యమే కదా అని చెప్పి ప్రవక్త గారు చూపించిన విధానం కాకుండా వేరే విధానం, కొత్తగా ఆవిష్కరిస్తే, ప్రవేశ పెడితే అది ఆరాధనలో బిదాత్ అవుతుంది.
అలాగే ఇంకో రకం ఏమిటంటే, ఆరాధన చేయవలసిన రీతిలో చేయకుండా, సంప్రదాయేతర పద్ధతిలో చేయటం. ఉదాహరణకు, వ్యక్తిగతంగా చేసుకోవలసిన దుఆలను, దైవ ధ్యానమును, జికిర్ ను సామూహికంగా చేయటం. ఏ ఆరాధన అయితే ప్రవక్త గారు వ్యక్తిగతంగా చేసుకోండి అని చేసి చూపించారో, వాటిని మనం సామూహికంగా చేయటం. దాని కోసం ప్రత్యేక సదనాలను ఏర్పాటు చేసుకోవటం, ఆరాధనలు చేసేందుకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవలంబించిన సులభమైన విధానాన్ని కాదని, కష్టతరమైన పద్ధతులను పాటించటం అన్నమాట.
అలాగే ఇంకో రకం ఏమిటంటే, ధర్మ సమ్మతమైన ఏ దేని ఆరాధనలను ఫలానా తేదీ లేక ఫలానా సమయం కొరకు కేటాయించుకోవటం. ఆ ఆరాధన మాత్రం ధర్మ సమ్మతమే. కానీ ఆ ధర్మ సమ్మతమైన ఆ ఆరాధనలను ఫలానా తేదీ లేక ఫలానా సమయం కొరకు ప్రత్యేకించుకోవటం. అది కూడా బిదాతే. ఎందుకంటే ఈ ఆరాధనలను షరియత్ ఆ మేరకు నిర్ధారించి ఉండదు. ఉదాహరణకు, షాబాన్ నెల 15వ తేదీ పగలు ఉపవాసం ఉండాలని, ఆ రాత్రి పూట జాగారం చేయాలని నిశ్చయించుకోవటం. ఇది బిదాత్. ఉపవాసం ఉండటం, రాత్రి జాగారం చేయటం ఇది సమ్మతమే. ఎప్పుడైనా ఉపవాసం ఉండవచ్చు, ఏ రాత్రి అయినా జాగారం చేసి ప్రార్థన చేయవచ్చు. ఉపవాసం ఉండటం, రాత్రి పూట జాగారం చేయటం సమ్మతమే. కానీ వాటిని ఒకానొక రాత్రి కోసమో, పగలు కోసమో ప్రత్యేకించుకోవటం సమ్మతం కాదు. దానికి ఆధారం లేదు అన్నమాట.
ఇది బిదాత్ కి సంబంధించిన కొన్ని రకాలు మనము తెలుసుకున్నాము. మన సమాజంలో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అల్లాహ్ మనందరినీ ప్రతి బిదాత్ నుండి కాపాడుగాక. ఇక బిదాతుల ఆదేశం ఏమిటి? అది ఇన్షాఅల్లాహ్ మనం వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“ఐ లవ్ ముహమ్మద్ ﷺ” మనతో ఏమి కోరుతుంది? ప్రవక్త ముహమ్మద్ ﷺ వారి మీద ఉన్న ప్రేమ మనతో ఏమి కోరుతుంది? https://youtu.be/HVwTB7FS8Dw [46 నిముషాలు] షేఖ్ సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, షేక్ సలీం జమఈ హఫిజహుల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ యొక్క నిజమైన అర్థాన్ని వివరిస్తారు. కేవలం బ్యానర్లు, సోషల్ మీడియా స్టేటస్ల ద్వారా ప్రేమను ప్రదర్శించడం కాకుండా, ఆ ప్రేమ మన నుండి ఏమి ఆశిస్తుందో ఆయన విశ్లేషించారు. ప్రవక్త ప్రేమకు నిజమైన నిదర్శనం, ఆయన తెచ్చిన ధర్మాన్ని మనస్ఫూర్తిగా విశ్వసించడం, ఆయన ఆజ్ఞలను పాటించడం (ఇతా’అత్), ఆయనపై దరూద్ పఠించడం, ఆయన జీవిత చరిత్ర (సీరత్)ను తెలుసుకోవడం, ఆయన ప్రవర్తనను మన జీవితంలో అలవర్చుకోవడం, ఆయన ఇష్టపడిన వాటిని ఇష్టపడటం మరియు ఆయన కుటుంబీకులను (అహలె బైత్) గౌరవించడం అని స్పష్టం చేశారు. హంజా (రదియల్లాహు అన్హు)), అబ్దుల్లాహ్ బిన్ మసూద్ (రదియల్లాహు అన్హు) వంటి సహాబాల ఉదాహరణలతో నిజమైన విధేయతను వివరిస్తూ, కేకులు కోయడం, ర్యాలీలు చేయడం వంటివి ప్రవక్త ప్రేమకు నిదర్శనం కాదని, అవి ధర్మంలో లేని పనులని ఆయన హెచ్చరించారు.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియా ఇవల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వఆలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
నేటి కార్యక్రమానికి హాజరైన సోదర సోదరీమణులందరికీ నా ఇస్లామీయ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదర సోదరీమణులారా, ఇదివరకే మీరు ఈనాటి ప్రసంగ అంశాన్ని విని ఉన్నారు. ఈరోజు మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అభిమానం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ఉన్న ప్రేమ మనతో ఏమి కోరుతుంది? అనే అంశం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం.
మనమంతా సోషల్ మీడియాలో, అంతర్జాల మాధ్యమాలలో గత కొద్ది రోజులుగా ఒక హాట్ టాపిక్ చూస్తూ వస్తూ ఉన్నాం. ప్రతిచోట ‘ఐ లవ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం’ అని బ్యానర్లు, జెండాలు దర్శనమిస్తూ ఉన్నాయి. అలాగే స్టేటస్లలో, ప్రొఫైల్ పిక్చర్లలో కూడా ‘ఐ లవ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం’ అనే ఇమేజ్లు ప్రదర్శించబడుతూ ఉన్నాయి. చాలా చోట్ల ర్యాలీలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా చాలాచోట్ల కొన్ని ఊహించని సంఘటనలు కూడా చోటు చేసుకుని ఉన్నాయి.
అయితే మిత్రులారా, ఒక్క విషయం మాత్రము ప్రపంచానికి అర్థమయింది. అదేమిటంటే, ముఖ్యంగా మనము ఏ దేశంలో అయితే నివసిస్తూ ఉన్నామో ఆ దేశ ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద చాలా ప్రేమ, అభిమానం కలిగి ఉన్నారు అన్న విషయాన్ని ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది, గమనిస్తూ ఉంది. అయితే మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల మనకు ఉన్న ప్రేమ, అభిమానం ఏమి కోరుతూ ఉంది? ప్రవక్త వారి ప్రేమ మాకు ఏమి కోరుతూ ఉంది, ఏమి చేయమని చెబుతూ ఉంది? మనము ఏమి చేస్తున్నాం? ప్రవక్త వారు, ప్రవక్త వారి ప్రేమ మాతో ఏమి కోరుతూ ఉంది, మేము ఏమి చేయాలి వాస్తవానికి? కానీ చేయాల్సిన పనులు చేయకుండా పక్కన పెట్టేసి మేము ఏమి చేస్తున్నాం అనేది ఆత్మ విమర్శ చేసుకుంటారన్న ఉద్దేశము, అలాగే సరైన విధంగా ప్రవక్త వారిని అభిమానిస్తారు అన్న ఉద్దేశంతో ఈ టాపిక్ ఎన్నుకోబడింది. ఎవరినీ ఉద్దేశించటమో లేదా ఎవరినీ కించపరచటమో లేదంటే ఎవరి మనోభావాలను మనము బాధపరచటము గాని, గాయపరచటము గాని ఉద్దేశము కానేకాదు. ఇది నేను ముందుగానే వ్యక్తపరుస్తూ ఉన్నాను, తెలియజేసేస్తూ ఉన్నాను.
చూడండి, మనమంతా పండితుల నోట అనేక సందర్భాలలో, అనేక ప్రసంగాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించటం ప్రతి విశ్వాసి యొక్క కర్తవ్యం అని విన్నాం. అవునా కాదా? ఆ ప్రకారంగా పండితులు మనకు ఖురాన్లోని వాక్యాలు వినిపించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులు వినిపించారు. ముఖ్యంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా తౌబా 24 వ వాక్యంలో తెలియజేశాడు, మీరు ప్రవక్త వారి కంటే ఎక్కువగా మీ వర్తకాన్ని లేదంటే మీ ఆస్తిపాస్తుల్ని, మీ కుటుంబ సభ్యుల్ని ఇలాంటి వారిని మీరు అభిమానించేటట్లయితే మీరు అల్లాహ్ శిక్ష కొరకు ఎదురు చూడండి అని అల్లాహ్ హెచ్చరించి ఉన్నాడు. అంటే మనము ప్రవక్త వారినే ఎక్కువగా అభిమానించాలి కానీ ప్రాపంచిక విషయాలు లేదంటే ఇతర వ్యక్తులను ఎక్కువగా అభిమానించరాదు, అందరికంటే ఎక్కువగా ప్రవక్త వారిని అభిమానించాలి అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆజ్ఞ అని ఆ వాక్యం ద్వారా మనకు పండితులు వివరించారు.
అలాగే ప్రవక్త వారి ఒక హదీస్, ప్రవక్త వారి ఉల్లేఖనం, ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఒకానొక సందర్భంలో ప్రవక్త వారి చేయి పట్టుకొని ఉండి ప్రవక్త పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఓ దైవ ప్రవక్త, నేను ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని అభిమానిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. అయితే నా ప్రాణము నాకు మీకంటే ప్రియమైనది అని చెప్పగానే ప్రవక్త వారు ఏమన్నారు ఆయనకి? ఓ ఉమర్, లేదు లేదు, ఏ వ్యక్తి కూడాను ప్రపంచంలో ఉన్న వారందరికంటే ఎక్కువగా చివరికి తన ప్రాణము కంటే ఎక్కువగా నన్ను అభిమానిస్తేనే సంపూర్ణ విశ్వాసి అవగలుగుతాడు లేదంటే అతని విశ్వాసం అసంపూర్ణం అవుతుంది జాగ్రత్త అని హెచ్చరించినప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు వారు వారిని వారు సంస్కరించుకున్నారు. ప్రవక్త వారిని తన ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించడం ప్రారంభించేశారు. ఆ విషయాన్ని మళ్ళీ ప్రవక్త వారితో తెలియజేశారు. ఓ ప్రవక్త, ఇప్పుడు నేను నా ప్రాణము కంటే ఎక్కువగా మిమ్మల్ని అభిమానిస్తున్నాను అని చెప్పగానే ప్రవక్త వారు ఏమన్నారంటే, ఓ ఉమర్ ఇప్పుడు నీ విశ్వాసము సంపూర్ణమైంది అన్నారు.
ఇలాంటి సంఘటనలు తెలియజేసి ధార్మిక పండితులు మనకు ఏమని చెప్పారంటే, మనము ఈ ప్రపంచంలో మన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా, మన భార్యాబిడ్డల కంటే ఎక్కువగా, బంధుమిత్రుల కంటే ఎక్కువగా, మన ఆస్తిపాస్తుల కంటే ఎక్కువగా, మన ప్రాణము కంటే ఎక్కువగా ప్రవక్త వారిని ప్రేమించాలి, అభిమానించాలి అని తెలియజేశారు. అల్హమ్దులిల్లాహ్ ఆ విషయాలను మనం బాగా అర్థం చేసుకున్నాము. ప్రతి యువకుడు, ప్రతి మహిళ, ప్రతి పురుషుడు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానిస్తూ ఉన్నారు, చాలా సంతోషం. అయితే ఈ అభిమానం మనకు కొన్ని శుభవార్తలు కూడా ఇస్తూ ఉంది, మనతో కొన్ని విషయాలు కూడా కోరుతూ ఉంది.
ప్రవక్త వారి అభిమానం మనకు ఇస్తున్న శుభవార్త ఏమిటి? మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనసారా ప్రేమిస్తే, అభిమానిస్తే మనము స్వర్గానికి చేరుకుంటాము అని శుభవార్త ఇస్తూ ఉంది. దానికి ఆధారము, ఒక పల్లెటూరి వాసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేను, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుగాంతం ఎప్పుడు సంభవిస్తుంది? అంటే ఖియామత్, యుగాంతం ఎప్పుడు సంభవిస్తుంది అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, నువ్వు యుగాంతం గురించి ప్రశ్నిస్తూ ఉన్నావు, బాగానే ఉంది. అయితే దాని కొరకు నువ్వు ఏమి సిద్ధము చేశావు? అని అడిగారు. యుగాంతం గురించి అడుగుతున్నావ్, పరలోకం గురించి, ప్రళయం గురించి అడుగుతున్నావ్ బాగానే ఉంది. అయితే ఆ ప్రళయం కొరకు, ఆ యుగాంతం కొరకు, ఆ పరలోకం కొరకు నువ్వు ఏమి సిద్ధం చేసుకున్నావ్, అది చెప్పు అన్నారు. దానికి ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఎక్కువగా చెప్పుకోదగ్గ నమాజులు, చెప్పుకోదగ్గ దానధర్మాలు ఏమి చేసుకోలేదు కానీ అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల హృదయము నిండా అభిమానము, ప్రేమ కలిగి ఉన్నాను అని చెప్పాడు.
దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతనికి శుభవార్త ఇచ్చారు. ఏమని?
قَالَ أَنْتَ مَعَ مَنْ أَحْبَبْتَ (ఖాల అంత మ’అ మన్ అహబబ్త) “నీవు ప్రేమించిన వారితోనే ఉంటావు.” అన్నారు.
అల్లాహు అక్బర్. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉండే స్థలం స్వర్గం. ప్రవక్త వారి అభిమానులు కూడా ఇన్షాఅల్లాహ్ చేరుకునే స్థలం స్వర్గం ఇన్షాఅల్లాహ్. అల్లాహ్ సుబ్ హాన వ త’లా మనందరికీ ప్రవక్త వారి అభిమానంతో పాటు ప్రవక్త వారితో పాటు స్వర్గంలో చేరుకునే భాగ్యం ప్రసాదించుగాక, ఆమీన్.
అయితే మిత్రులారా, ప్రవక్త వారి అభిమానము మనకు స్వర్గానికి చేర్చుతుంది అన్న శుభవార్త ఇస్తూ ఉంది. ఆ అభిమానంతోనే, ఆ ఆశతోనే మనము ప్రవక్త వారిని ప్రేమిస్తున్నాము, అభిమానిస్తూ ఉన్నాం. మన విశ్వాసం కోసం, స్వర్గం కోసం, అల్లాహ్ ను ప్రవక్త వారిని నమ్ముతూ ఉన్నాము, ప్రేమిస్తూ ఉన్నాము, అభిమానిస్తున్నాం, ఓకే బాగానే ఉంది. అయితే మరి ఆ ప్రేమ ఏమి కోరుతుందో అది తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ప్రవక్త వారి పేరు మీద ర్యాలీలు చేస్తూ ఉన్నారో, జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారో, బ్యానర్లు పెట్టుకుంటూ ఉన్నారో, స్టేటస్లు పెడుతూ ఉన్నారో, ప్రొఫైల్ పిక్చర్లు పెడుతూ ఉన్నారో, వారిలో ప్రవక్త వారి ప్రేమ కోరుతున్న విషయాలలో ఎన్ని విషయాలు చేస్తూ ఉన్నారు అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఈ విషయాలు మనము జాగ్రత్తగా విని ఇన్షాఅల్లాహ్ ఆత్మ పరిశీలన చేసుకుందాం.
1. ప్రవక్త తెచ్చిన ధర్మాన్ని విశ్వసించడం
చూడండి, ప్రవక్త వారి ప్రేమ కోరుతున్న విషయాలలో ప్రథమ విషయం ఏమిటంటే, ఏ ధర్మాన్ని, ఏ శాసనాన్ని అయితే ప్రవక్త వారు తీసుకుని వచ్చారో ఆ ధర్మాన్ని, ఆ శాసనాన్ని మనమంతా మనసారా స్వీకరించాలి, ఆమోదించాలి, విశ్వసించాలి, నమ్మాలి.
దీనికి ఒక రెండు ఉదాహరణలు మనము ఇన్షాఅల్లాహ్ తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శాసనము తీసుకుని వచ్చి ప్రజల ముందర వినిపించినప్పుడు, ముఖ్యంగా మక్కా వారిలో కొంతమంది ఇస్లాం స్వీకరించారు. అధిక శాతం ప్రజలు ప్రవక్త వారి మీద తిరగబడ్డారు.
ఇలాంటి సందర్భాలలో ఒకసారి ఏమైందంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలోని కాబా పుణ్యక్షేత్రం వద్ద నమాజ్ ఆచరించుకుంటూ ఉన్నారు. అంతలోనే ముస్లింల బద్ధ శత్రువు, ప్రవక్త వారి బద్ధ శత్రువు అయిన అబూ జహల్ చూసుకున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక్కరే ఉన్నారు, నమాజ్ చేసుకుంటూ ఉన్నారు. అది చూసి ఎంతగా అతనికి మండింది అంటే, అతను ప్రవక్త వారి మీద నోరు పారేసుకున్నారు, లేనిపోని మాటలు ప్రవక్త వారి గురించి మాట్లాడాడు. కానీ ప్రవక్త వారు ఎలాంటి ఏకాగ్రతను కోల్పోకుండా ప్రశాంతంగా, ఏకాగ్రతతో నమాజ్ ఆచరించుకుంటూ ఉన్నారు.
అతనికి సైతాను ఎంతగా రెచ్చగొట్టాడంటే, నోటికి పని చెప్పినవాడు అక్కడికి సంతృప్తి పడలేదు. తర్వాత పక్కనే ఉన్న ఒక రాయి తీసుకుని ప్రవక్త వారి మీద విసిరి, చేయికి పని చెప్పాడు. ముందు నోటికి పని చెప్పాడు, కానీ మనసు కుదుట పడల, మనశ్శాంతి దొరకలా అతనికి. తర్వాత చేయికి పని చెప్పాడు, రాయి తీసుకుని ప్రవక్త వారి మీద విసిరాడు. ప్రవక్త వారికి గాయమయింది. ఆయన కారుణ్యమూర్తి కదా, ప్రజల కోసం కరుణగా పంపించబడ్డారు కదా, ఆయన మాటలు భరించారు, బాధను కూడా భరించారు, గాయాన్ని కూడా ఆయన భరించారు.
ఇదంతా ఒక బానిసరాలైన మహిళ చూసుకున్నారు. ఆమె ఏమి చేశారంటే, ప్రవక్త వారి మీద జరుగుతున్న ఆ దౌర్జన్యాన్ని చూసి ఊరుకుండలేక, చక్కగా ప్రవక్త వారి బంధువు అయిన హంజా రజియల్లాహు అన్హు వారి దగ్గరికి వెళ్లారు. హంజా రజియల్లాహు అన్హు వారు ఎవరండీ? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్వయాన పినతండ్రి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పినతండ్రి దగ్గరకు వెళ్లి, “ఏవండీ, మీ తమ్ముడి కుమారుడు మక్కాలోని కాబా పుణ్యక్షేత్రం వద్ద నమాజ్ ఆచరించుకుంటూ ఉంటే, ఈ దుర్మార్గుడు అబూ జహల్ వచ్చి ముందు తిట్టాడు, ఆ తర్వాత మీ తమ్ముడి కుమారుడి మీద చేయి చేసుకుని కొట్టాడండి” అని చెప్పేశారు.
ఆయన ఏమన్నారంటే, “నా తమ్ముడి కుమారుడు ఏం తప్పు చేశాడబ్బా? ఎందుకు అతను ఆ విధంగా ప్రవర్తించాడు?” అని అడిగారు. ఆవిడ ఏమన్నారంటే, “లేదండీ, ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన ఒక్కరే ఒంటరిగా అక్కడ నమాజ్ ఆచరించుకుంటున్నారు అంతే. ఎవరితో ఏమీ మాట్లాడలేదు, ఎవరితో ఆయన ఏమీ చేయలేదు. ఆయన చేసిన తప్పు, నేరం ఏమీ లేదు. కానీ అనవసరంగా ఆయన మీద నోరు పారేసుకున్నాడు, ఆ తర్వాత కొట్టి గాయపరిచాడు” అని చెప్పగానే, ఆయనలో కుటుంబీకుల పట్ల ఉన్న ప్రేమ, అభిమానం ఎంతగా ఉప్పొంగిందంటే, అక్కడి నుంచి విల్లు తీసుకొని చక్కగా అక్కడికి వచ్చేశారు కాబతుల్లాహ్ దగ్గరికి.
ఆ సమయానికి ప్రవక్త వారు అక్కడ నమాజ్ ముగించుకొని వెళ్లిపోయారు ఇంటికి. ప్రవక్త వారు లేరు. కానీ ఈ అబూ జహల్ మాత్రము అక్కడ వేరే వాళ్లతో పాటు కూర్చొని మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఉన్నాడు. హంజా, అప్పటికి ఆయన ఇంకా ఇస్లాం స్వీకరించలేదు, ప్రవక్త వారి పినతండ్రి, చక్కగా అబూ జహల్ దగ్గరికి వెళ్లి విల్లు తీసుకొని తల మీద కొట్టగా గాయమైంది, రక్తం కారింది, కింద పడి విలవిల్లాడాడు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, “నీకు అంతగా పోరాడాలని, కొట్లాడాలని ఉంటే నాతో తలపడురా మూర్ఖుడా! నా తమ్ముని కుమారుడి మీద ఏందిరా నువ్వు చూపించేది నీ మగతనము? నాతో ఉంటే, నీకు అంతగా ఉంటే నాతో తలపడు, నాతో పోరాడు చూద్దాము” అని చెప్పారు. ఆయన బలవంతుడు హంజా రజియల్లాహు అన్హు, అప్పటికీ ఆయన ఇంకా ఇస్లాం స్వీకరించలేదు కానీ మక్కాలోనే బలవంతులలో ఒక బలవంతుడు ఆయన. కాబట్టి అబూ జహల్ కి నూట మాట రాలేదు, గమ్మునుండి పోయాడు.
తర్వాత హంజా రజియల్లాహు అన్హు వారు చక్కగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఇంటికి వెళ్లి, “బిడ్డా, నువ్వు సంతోషించు, నువ్వు బాధపడవద్దు. నీ మీద చేయి చేసుకున్న వ్యక్తితో నేను ప్రతికారము తీర్చుకున్నాను, నువ్వు సంతోషించు” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిన్నగా చిరునవ్వు చిందిస్తూ పినతండ్రితో ఏమన్నారో తెలుసా? “చిన్నాన్నా, మీరు ప్రతికారము తీర్చుకున్నారు అని చెబుతున్నారు, ఆ విషయము నాకు సంతోషం కలిగించదు. నిజంగా మీరు నన్ను సంతోషపరచాలనుకుంటుంటే నేను తీసుకుని వచ్చిన శాసనాన్ని, ధర్మాన్ని మీరు అంగీకరిస్తే, ఆమోదిస్తే, నమ్మితే, విశ్వసిస్తే అప్పుడు నేను సంతోషిస్తాను చిన్నాన్నా” అన్నారు. అల్లాహు అక్బర్. అప్పటికప్పుడే హంజా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోనే కలిమా చదివి ఇస్లాం స్వీకరించారు, విశ్వాసిగా మారారు, అల్హమ్దులిల్లాహ్.
అయితే ప్రవక్త వారి పినతండ్రులలోనే మరొక పినతండ్రి ఉన్నారండి. ఆయన పేరు అబూ తాలిబ్. ఆయన గురించి తెలియని వ్యక్తి ఉండరు. అయితే అబూ తాలిబ్ వారు ఎలా మరణించారో ఒకసారి మనము చూద్దాం. అబూ తాలిబ్ వారు మరణ సమయం వచ్చింది, కొద్దిసేపు తర్వాత ఆయన ప్రాణం పోతుంది అన్నట్టుగా ఉంది. చివరి ఘడియలు అంటాము కదా? ఆ చివరి ఘడియల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పినతండ్రి అయిన అబూ తాలిబ్ దగ్గరికి వెళ్లి, “చిన్నాన్నా, ఒక్కసారి మీరు నోటితో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్’ సాక్ష్య వచనము పలకండి. నేను అల్లాహ్ వద్ద మీ కొరకు సిఫారసు చేస్తాను” అని కోరారు.
అంతలోనే ఈ మక్కా పెద్దలు అనిపించుకునే కొంతమంది అబూ తాలిబ్ వారి సహచరులు వచ్చేశారు. వచ్చేసి ఆ పెద్ద మనుషులు అనిపించుకునే, స్నేహితులు అనిపించుకునే వాళ్ళు ఏమి చేశారంటే, “ఏమండీ, మీరు బ్రతికినంత కాలము తాత ముత్తాతల ధర్మం మీద బ్రతికి, మరణించే సమయాన మీరు తాత ముత్తాతల ధర్మానికి ద్రోహం చేసి వెళ్తారా? ఇది మీకు సమంజసమేనా? ఇది మీకు సరిపోతుందా?” అని రెచ్చగొట్టేశారు. చివరికి ఏమైందంటే, ఆయన “నేను తాత ముత్తాతల ధర్మం మీదనే ఉంటున్నాను” అని చెప్పేసి శ్వాస విడిచారు. అంటే ప్రవక్త వారు తీసుకువచ్చిన ధర్మాన్ని ఆయన అంగీకరించలేదు, విశ్వసించలేదు. సరే. ఆయన మరణం తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బంధువుల్లో ఎవరైతే ఇస్లాం స్వీకరించిన వారు ఉన్నారో వారిలో ఒకరు ప్రవక్త వారితో ప్రశ్నించారు. ఏమండీ, మీ చిన్నాన్న అబూ తాలిబ్ వారు మీకు ఇంచుమించు 40 సంవత్సరాలు సేవలు చేశారు, సపోర్ట్గా నిలబడ్డారు, మీ కొరకు మక్కా వారి శత్రుత్వాన్ని కొనుక్కున్నారు, మీకు మాత్రము ఆయన సపోర్ట్గా నిలబడ్డారు కదా? అంతగా మీకు పోషించిన, మీకు సపోర్ట్ చేసిన మీ చిన్నాన్నకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఆయన స్వర్గవాసా లేదంటే నరకవాససా? అని అడిగారు.
ప్రవక్త వారు ఏమన్నారండి? ఆయన నరకానికే వెళ్తారు. అయితే నరకంలోనే చిన్న శిక్ష ఉంటుంది అన్నారు. అది వేరే విషయం. కానీ ఎక్కడికి వెళ్తారు అన్నారు? ఆయన నరకానికే వెళ్తారు అని చెప్పారు. ఇక్కడ ప్రవక్త వారి ఇద్దరు పినతండ్రులు. ఒకరు హంజా రజియల్లాహు అన్హు వారు, ఒకరు అబూ తాలిబ్ వారు. హంజా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి శాసనాన్ని, ఆయన తీసుకుని వచ్చిన ధర్మాన్ని విశ్వసించారు. అబూ తాలిబ్ వారు ప్రవక్త వారిని ప్రేమించారు, అభిమానించారు, సపోర్ట్గా నిలబడ్డారు కానీ ప్రవక్త వారు తీసుకుని వచ్చిన ధర్మాన్ని మాత్రము ఆమోదించలేదు, విశ్వసించలేదు. ఏమైందండి ఫలితం? హంజా రజియల్లాహు అన్హు వారేమో స్వర్గవాసి అయ్యారు, అబూ తాలిబ్ వారు మాత్రము నరకానికి చేరుకున్నారు.
దీన్నిబట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏమిటండీ? ప్రవక్త వారి ప్రేమ ఏమి కోరుకుంటుంది అంటే ప్రవక్త వారు తీసుకుని వచ్చిన ధర్మాన్ని మనసారా మనము స్వీకరించాలి, విశ్వసించాలి, నమ్మాలి. అప్పుడే ప్రవక్త వారి ప్రేమ కోరుతున్న విషయాలలో ఒక విషయాన్ని మనము పాటించిన వాళ్ళం అవుతాం, లేదంటే నష్టపోతాం. ఇప్పుడు చెప్తారు మీరు చాలామంది. “ఆ, మేమంతా ముస్లింలమే కదండీ, మేమంతా కలిమా చదివిన వాళ్ళమే కదండీ, ఈరోజు ఐ లవ్ ముహమ్మద్ అని చెప్పుకుంటున్న వాళ్ళము, మరి మాకు ఇవన్నీ విషయాలు చెప్తున్నారు ఏంటి మీరు?” అంటారు. ఆ, అవ్వలేదు, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయండి. ఒక్క విషయంతోనే సరిపోదు. ఇంకా మరికొన్ని విషయాలు ఉన్నాయి. అవి కూడా తెలుసుకుందాం. అప్పుడు మాట్లాడదాం ఇన్షాఅల్లాహ్. అప్పుడు ఆత్మ విమర్శ చేసుకుందాం.
2. ప్రవక్తను అనుసరించడం (ఇతా’అత్)
ప్రవక్త వారి ప్రేమ కోరుతున్న విషయాలలో మరొక విషయం ఏమిటంటే, మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి, ఇతా’అత్ చేయాలి. ప్రవక్త వారిని అనుసరించాలి.
చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలోని 59 వ అధ్యాయము ఏడవ వాక్యంలో తెలియజేశాడు,
అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఇచ్చిన దానిని పుచ్చుకోండి, ఆయన ఏ విషయం నుండైనా మిమ్మల్ని వారిస్తే దాన్ని వదిలి పెట్టేయండి. ఎవరు చెబుతున్నారు? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రవక్త వారిని అనుసరించాలి అంటే అర్థం ఏమిటి? ప్రవక్త వారు ఏ పని అయితే చేయమని చెప్పారో అది మనము చేయాలంట. ప్రవక్త వారు ఏ పని అయితే చేయవద్దు అని వరించారో అది మనము వదిలేయాలంట. ఇది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్లో ఆ వాక్యంలో మాకు తెలియజేస్తున్న విషయం.
అలాగే రెండవచోట ఖురాన్ గ్రంథం మూడవ అధ్యాయం 31వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’లా తెలియజేశాడు,
قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ (ఖుల్ ఇన్ కున్తుమ్ తుహిబ్బూనల్లాహ ఫత్తబి’ఊనీ యుహ్బిబ్కుముల్లాహ్) ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి చెప్పండి, “మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి, తత్ఫలితంగా అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు.” (3:31)
అంటే అర్థం ఏమిటండీ? మనమంతా అల్లాహ్ దాసులం. మనము అల్లాహ్ ప్రేమ పొందాలి అంటే ప్రవక్త వారి అడుగుజాడల్లో నడుచుకోవాలి. ప్రవక్త వారి అడుగుజాడల్లో నడుచుకుంటే, ప్రవక్త వారిని అనుసరిస్తే మనకు అల్లాహ్ యొక్క ప్రేమ దక్కుతుంది అని ఈ వాక్యంలో తెలియజేయడం జరిగింది. అల్లాహు అక్బర్.
అంటే అర్థం ఏమిటండీ? అర్థం ఏమిటంటే మనము అల్లాహ్ ప్రేమ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ కలిగి ఉన్న వాళ్ళమైతే అల్లాహ్ చెప్పినట్టు విని నడుచుకోవాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినట్టు విని నడుచుకోవాలి అనేది మనకు స్పష్టమవుతుంది. ఏ విధంగా నడుచుకోవాలి? దానికి కొన్ని ఉదాహరణలు పెడతాను చూడండి. ఏ విధంగా ప్రవక్త వారి మాట విని మనము నడుచుకోవాలో దానికి కొన్ని ఉదాహరణలు మీ ముందర పెడతాను. దాన్నిబట్టి ఇన్షాఅల్లాహ్ మనము విషయం బాగా వివరంగా తెలుసుకుందాం.
మొదటి ఉదాహరణ అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రజియల్లాహు అన్హు వారిది. ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రసంగించటానికి మింబర్ పైకి ఎక్కారు. ఎక్కి ప్రజలను ఉద్దేశించి “అందరూ కూర్చోండి” అని ప్రకటించారు. ఆ పలుకు వినగానే అందరూ ప్రశాంతంగా, ఎవరు నిలబడి ఉన్నచోట వాళ్ళు అక్కడ కూర్చున్నారు.
ప్రవక్త వారు ఎప్పుడైతే ఈ మాట “అందరూ కూర్చోండి” అని పలికారో ఆ సమయానికి అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రజియల్లాహు అన్హు వారు వుజూ చేసుకొని మస్జిద్ లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఒక అడుగు మస్జిద్ లోపల ఉంది, ఒక అడుగు మస్జిద్ బయట ఉంది. అంటే గుమ్మం దగ్గర ఉన్నారు ఆయన. ప్రవక్త వారి మాట ఎప్పుడైతే చెవిలో పడిందో “అందరూ కూర్చోండి” అని, అక్కడే గుమ్మం మీద కూర్చుండిపోయారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రసంగం ప్రారంభించేసి, ప్రసంగిస్తూ ప్రసంగిస్తూ అటు ఇటు చూస్తూ ఆయన్ని చూసుకున్నారు. ఆయన్ని చూసుకొని, “ఏంటయ్యా మీరు అక్కడే కూర్చున్నారు, లోపలికి వచ్చేయండి” అని చెప్పగానే అప్పుడు ఆయన వెంటనే లోపలికి వస్తూ, “ఓ దైవ ప్రవక్త, నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నాను అంటే, మీరు కూర్చోండి అని చెప్పగానే వెంటనే మీ మాటను అనుసరిస్తూ నేను ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా ఇక్కడే కూర్చుండి పోయాను” అని చెప్పేశారు.
మొత్తానికి ప్రవక్త వారు ఆయనను లోపలికి రమ్మని చెప్పారు. ఆయన ఆ ప్రవక్త వారి ఆదేశంతో ఆయన లోపలికి వచ్చేశారు. కాకపోతే, మనము తెలుసుకోవలసిన, అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త వారి మాట వచ్చిన తర్వాత ఆయన తన ఇష్టానుసారంగా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు చూశారా? అలా మనము ప్రవక్త వారి మాటను అనుసరించాలి.
ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త వారు చెప్పారు, ప్రవక్త వారి పద్ధతి ఇది అని మనము ప్రజలకు చెబితే, వారు వెంటనే ప్రవక్త వారి మాట మీద అనుసరించరు. ఏమి చేస్తారు? వారి కోరికలు వారికి అడ్డుపడతాయి. వారి కుటుంబ సభ్యుల ప్రేమ వారికి అడ్డుపడుతుంది. తత్కారణంగా వారు ప్రవక్త వారి మాటల్ని, ప్రవక్త వారి పద్ధతుల్ని వెనక్కి పెట్టేసి కోరికలు తీర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అల్లాహు అక్బర్.
ఇక్కడ అబ్దుల్లాహ్ బిన్ మసూద్ వారు చూడండి. ప్రవక్త వారి మాట వచ్చిన తర్వాత తన ఇష్టానుసారంగా ఒక అడుగైనా ముందుకు వేశారా? లేదే. వెంటనే అమలు పరిచేశారు. మనము కూడా ఆ విధంగా ఉండాలి. ఏదైనా ప్రవక్త వారి హదీస్, ఏదైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ మన ముందర చెప్పబడింది, వినిపించబడింది అంటే అది విని మనము వెంటనే అమలు పరచాలి గాని, ప్రవక్త వారి మాటను పక్కన పెట్టేసి మా కోరికలు తీర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవటం, భార్య బిడ్డల కోరికలు తీర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవటం, కుటుంబ సభ్యుల మాటలు వింటూ ముందుకు వెళ్ళిపోవటం, ప్రవక్త వారి మాటను మాత్రం పక్కన పెట్టేయడం ఇలా చేయడం సరికాదండి.
అలాగే ప్రవక్త వారి మాట ఎంతగా వినాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనేది సహాబాలు ఆ రోజుల్లో చేసి చూపించారు. ఒక ఉదాహరణ విన్నాము అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రజియల్లాహు అన్హు వారి గారిది. మరొక ఉదాహరణ…
ప్రారంభంలో అక్కడ మక్కా పరిసరాలలో, మక్కా వాసులు మరియు పరిసరాల వాసులు విపరీతంగా సారాయి తాగేవారు. వారిలో ఆ అలవాటు ఉండింది ముందు నుంచి. అజ్ఞానపు కాలం నుండి ఆ అలవాటు నడుస్తూ వస్తూ ఉంది. చాలా విపరీతంగా వారు సారాయి తాగేవారు. పోటాపోటీగా వారు మద్యాలు సేవించేవారు. అయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎప్పుడైతే మద్యం సేవించడం నిషేధం అని నిషేధ ఆజ్ఞ అవతరింపజేశాడో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమి చేశారంటే, శిష్యుల్ని పిలిపించి ప్రకటన చేయించేశారు. “మీరు వెళ్ళండి, అందరికీ ఈ మాట వినిపించేయండి” అని చెప్పగానే, ప్రవక్త వారి శిష్యులు వీధుల్లో తిరిగి పరిసరాల్లో ఉన్న వారందరికీ కూడా “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అల్లాహ్ వద్ద నుంచి ఆజ్ఞ వచ్చేసింది, మద్యం నిషేధం, మద్యం సేవించరాదు” అని చెప్పేశారు.
ప్రవక్త వారి మాట, ప్రవక్త వారి శిష్యులు వినిపిస్తూ ఉంటే ఆ సమయానికి కొంతమంది కూర్చొని మద్యం సేవిస్తూ ఉన్నారు, కొంతమంది ఇండ్లలో మద్యం స్టాక్ చేసి పెట్టుకొని ఉన్నారు. కొంతమంది అయితే సభలు ఏర్పాటు చేసుకొని, మన మొరటు భాషలో చెప్పాలంటే పార్టీలు చేసుకుంటూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ప్రవక్త వారి ప్రకటన వినిపించింది. వెంటనే ఏం చేశారండి? ఇది లాస్ట్ పెగ్గులే, ఈ ఒక్క పెగ్గు తాగేసి తర్వాత మానేద్దాం అనుకోలేదు. వెంటనే అప్పటికప్పుడే వారి ముందర ఉన్న సారాయిని పక్కన పడేశారు. తాగుతున్న వ్యక్తి కూడా అప్పటికప్పుడే ఆపేసి ఆ మిగిలిన సారాయి మొత్తం కింద పడేశాడు. ఇళ్లల్లో స్టాక్ చేసి పెట్టుకున్న ఆ సారాయి మొత్తం వీధుల్లోకి కుమ్మరించేశారు. అలాగే దాచిపెట్టుకున్న మద్యం మొత్తము కూడా తీసి వీధుల్లో కుమ్మరించేశారు. చరిత్రకారులు తెలియజేశారు, ఈ ప్రకటన తెలియజేసిన తర్వాత ఆ రోజు వీధుల్లో మద్యము ఏరులై పారింది, ఆ విధంగా అసహ్యించుకుని వెంటనే అది ఇక నిషేధం మనకు పనికిరాదు దాన్ని మనము ముట్టుకోరాదు, సేవించరాదు, మన ఇళ్లల్లో పెట్టుకోకూడదు అని చెప్పేసి ఆనాటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు, సహాబాలు వీధుల్లో దాన్ని కుమ్మరించేశారు. అల్లాహు అక్బర్.
చూసారా? ఈ రోజు తాగుతాంలే రేపటి నుంచి ఆపుదాంలే, ఇది ఒక్కటి తాగుదాంలే ఆ తర్వాత ఆపుదాంలే, ఈ వారము తాగేసి వచ్చే వారం నుంచి ఆపేద్దాంలే, అలా వారు సాకులు వెతకలేదండి. ప్రవక్త వారి ఆదేశం వచ్చిందా? వెంటనే అమలు పరిచేశారు. సాకులు వెతకలేదు. అలా ఉండాలి. ఆ విధంగా మనము చేస్తూ ఉన్నామా? ఈరోజు మనము ప్రవక్త వారి ప్రేమికులము, అభిమానులము అని చెప్పేసి ప్రవక్త వారి ప్రేమ ప్రకటన చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాము. సరే, ప్రవక్త వారి మాట వినడానికి, ప్రవక్త వారి పద్ధతిని ఆచరించడానికి అంతే ప్రేమతో మనము ముందుకు వస్తూ ఉన్నామా? ప్రవక్త వారి ప్రేమ మనకు ప్రవక్త వారిని అనుసరించండి అని చెబుతూ ఉంది. మరి మనం అనుసరించట్లేదే? ప్రేమ ప్రకటించడానికి ముందుకు వస్తున్నాం. కానీ ప్రవక్త వారిని అనుసరించడానికి మాత్రం వెనకడుగు వేస్తూ ఉన్నాం, సాకులు వెతుకుతూ ఉన్నాం, ఏమేమో చెబుతూ ఉన్నాం. ఇది సరైన విధానము కాదు, గమనించండి మిత్రులారా.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో ఒక శిష్యుడు తెలియక ఒకసారి బంగారపు ఉంగరాన్ని ధరించి ఉన్నారు. బంగారపు ఉంగరాన్ని ధరించి ఉన్న ఆయన ఒకసారి ఒకచోట ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొద్దిసేపటికి అక్కడి నుంచి వస్తూ వస్తూ ఆయన్ని చూసి ఆయన చేతిలో ఉన్న ఉంగరాన్ని గమనించారు.
ఆయనతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దగ్గరికి వచ్చి ఆ ఉంగరము తీసేసి ఏమన్నారంటే, పురుషులు బంగారం ధరించటం నిషేధం అని చెప్పి ఆయన తొడిగి ఉన్న ఆ ఉంగరాన్ని తీసి పక్కన పెట్టేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు బోధించాల్సిన విషయాలు బోధించేశారు. పురుషులు బంగారము ధరించరాదు అన్న విషయాన్ని బోధించేసి అక్కడి నుంచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంటికి వెళ్లిపోయారు.
ఆ తర్వాత ఈయన, ఎవరి చేతిలో నుంచి అయితే ప్రవక్త వారు బంగారపు ఉంగరాన్ని తీసి పక్కన పడేశారో, ఆయన కూడా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. అది చూసిన కొంతమంది ఆయన మిత్రులు ఆయనతో ఏమన్నారంటే, “ఏమండీ, మీ బంగారపు ఉంగరం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది మీరు మీ వెంట తీసుకెళ్ళండి, ఏదైనా పనుల కోసం, అవసరాల కోసం ఉపయోగించుకోండి” అని చెప్పారు.
దానికి ఆయన ఏమన్నారో తెలుసా? “ఏ వస్తువుని అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి స్వ హస్తాలతో తీసి పక్కన పడేశారో దాన్ని నేను ముట్టుకోను అంటే ముట్టుకోను” అని చెప్పేశారు. అల్లాహు అక్బర్.
అదండీ ప్రవక్త వారి మాట పట్ల, ప్రవక్త వారి ఆదేశం పట్ల గౌరవం అంటే. చూశారా? కాబట్టి ఈ విషయాల ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏమిటండీ? ప్రవక్త వారి ప్రేమ, ప్రవక్త వారిని అనుసరించండి, ప్రవక్త వారి ఆదేశాలను పాటించండి అని మనతో కోరుతూ ఉంది. అది మనము చేయాలి. అది మనము చేస్తున్నామా? గమనించండి మిత్రులారా.
3. ప్రవక్త వారు తీసుకు వచ్చిన ధర్మాన్ని ప్రజల వద్దకు చేర్చాలి
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమిస్తున్న మనము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకు వచ్చిన ధర్మాన్ని ప్రజల వద్దకు చేర్చాలి. ఇది మన బాధ్యత అండి. అవును. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరి ప్రవక్త. ఆయన తర్వాత ఇక ప్రళయం వరకు ప్రవక్తలు రారు. మరి ధర్మ ప్రచార బాధ్యత ఎవరు నిర్వహించాలి? ఆ బాధ్యత ఎవరు నిర్వహించమని ప్రవక్త వారు మనకు తెలియజేసి వెళ్లారు? నేను వెళ్తూ ఉన్నాను. నా తర్వాత మీరు, మీలో ఎవరికి ఎంత తెలుసో ఆ విషయాలను మీరు తెలియని వారి వద్దకు చేర్చండి, తెలియపరచండి. ఒక్క విషయం అయినా మీకు తెలిస్తే, ఆ ఒక్క విషయాన్నే మీరు ఇతరుల వరకు తెలియని వారికి నేర్పండి, తెలియజేయండి అని బోధించి వెళ్లారు. అల్లాహ్ సుభానహు వ తఆలా కూడా మనకు మీరు ఉత్తమమైన సమాజం, మీరు ప్రజలకు మంచిని ఆదేశిస్తారు, చెడు నుంచి వారిస్తారు అని చెప్పి బాధ్యత ఇచ్చి ఉన్నాడు. అల్లాహ్ మరియు ప్రవక్త వారు ఇచ్చిన బాధ్యత మనము నెరవేర్చాలి. ప్రవక్త వారి ప్రేమ మనతో ఆ విషయం కోరుతూ ఉంది. మనము నిజమైన ప్రవక్త వారి ప్రేమికులమైతే, ప్రవక్త వారి అభిమానులమైతే, ప్రవక్త వారి ధర్మాన్ని, ప్రవక్త వారు తీసుకొని వచ్చిన ధర్మాన్ని ప్రజల వద్దకు చేరవేయాలి. మరి ఆ పని మనము చేస్తున్నామా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తీసుకొని వచ్చిన ధర్మాన్ని మన నోటితో మనము చేయగలిగితే నోటితో చేయాలి. వెళ్లి ప్రజలకు విషయాలు బోధించాలి. అంత శక్తి లేదండీ. ఆ విధంగా మీకు మాట్లాడడానికి రాదు అని మీరు భావిస్తూ ఉన్నట్లయితే, అల్హందులిల్లాహ్ పుస్తకాలు ఉన్నాయి, కరపత్రాలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఆడియోస్ ఉన్నాయి, ఇమేజెస్ ఉన్నాయి. అవి మీరు ఇతరుల వద్దకు చేరవేయండి అయ్యా. ఆ విధంగా ప్రవక్త వారి నిజమైన అభిమానులనిపించుకోండి. కానీ ఆ విధంగా చేస్తున్నామా? స్టేటస్ లు పెడుతున్నాం. స్టేటస్ లు పెట్టడం కాదండి. ప్రవక్త వారి సందేశాలు, ఆ ధర్మాన్ని ఇతరుల వరకు చేరవేయండి. ఇది ప్రవక్త వారి ప్రేమ మనతో కోరుతున్న మరొక విషయం.
4. ప్రవక్తపై దరూద్ పఠించడం
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ మనతో కోరుతున్న మరొక విషయం ఏమిటంటే, ప్రవక్త వారి మీద మనము ఎక్కువగా దరూద్ పఠిస్తూ ఉండాలి. ఎంతమందికి దరూద్ వస్తుందండి? అల్హమ్దులిల్లాహ్, చాలా మందికి వస్తుందండి, నేను ఆ విధంగా విమర్శించట్లేదు. ముఖ్యంగా ఎవరైతే వీధుల్లో ర్యాలీలు చేస్తూ ఉన్నారో, జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారో, వారిలో మీరు వెళ్లి అడిగి చూడండి. ఒకసారి దరూద్ పఠించి వినిపించండయ్యా అని అడిగి చూడండి. దరూద్ వస్తుందేమో వాళ్ళకి? ప్రేమికులము, మేము ప్రవక్త వారి అభిమానులము అని ఏమేమో చేస్తూ ఉన్నారే, అలా చేసే వారు ఒక్కసారి ప్రవక్త వారి మీద దరూద్ పఠించి వినిపించండి అని చెప్పండి. వస్తుందేమో చూద్దాం? చాలా మందికి రాదండి. అయినా మేము ప్రవక్త వారి ప్రేమికులమని నోటితో చెప్పుకుంటూ ఉంటారు. నోటితో చెప్పుకుంటే సరిపోదండి, ఇవన్నీ చేయాలి. ప్రవక్త వారి మీద ప్రేమ ఉంటే దరూద్ నేర్చుకొని దాన్ని ఎక్కువగా పఠిస్తూ ఉండాలి. ఎక్కువగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు దరూద్ పఠిస్తూ ఉండాలి. దరూద్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఒక ప్రసంగం ఉందండి, ‘దరూద్ లాభాలు’ అని, అది వినండి తెలుస్తుంది ఇన్షాఅల్లాహ్. అయితే మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటండీ ఇక్కడ? మనము నిజమైన ప్రవక్త ప్రేమికులమైతే, అభిమానులమైతే మనము ప్రవక్త వారి మీద ఎక్కువగా దరూద్ పఠించాలి.
5. ప్రవక్త జీవిత చరిత్ర (సీరత్) తెలుసుకోవడం
అలాగే ప్రవక్త వారి అభిమానులమైనప్పుడు, ప్రవక్త వారి ప్రేమ మనతో కోరుతున్న విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర మనము తెలుసుకోవాలి. అవును, మనం ప్రవక్త వారి అనుచర సమాజం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అభిమానులం, ఓకే. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులమైనందుకు, ప్రవక్త వారి అభిమానులము అయినందుకు మనకు ప్రవక్త వారి చరిత్ర తెలియకపోతే ఎలా? మీరు ప్రవక్త వారి ప్రేమికులు అనుకుంటున్నారు, మరి ప్రవక్త వారి గురించి మీకు ఏమి తెలుసయ్యా? మీ ప్రవక్త వారి చరిత్ర క్లుప్తంగా రెండు మాటల్లో చెప్పండి అని ఎవరైనా అడిగాడు అనుకోండి, తల ఎక్కడ పెట్టుకోవాలి అప్పుడు మనం? కదా? కాబట్టి ప్రవక్త వారి ప్రేమ ఏమి కోరుతూ ఉంది అంటే ప్రవక్త వారి జీవిత చరిత్రను మనము తెలుసుకోవాలి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు జన్మించారు, ఎక్కడ జన్మించారు, వారి తల్లిదండ్రులు ఎవరు, వారి తాతలు ఎవరు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాల్యము ఎలా గడిచింది, ప్రవక్త వారి యవ్వనము ఎలా గడిచింది, ప్రవక్త వారు ఎక్కడ వివాహం చేసుకున్నారు, ఎంతమంది బిడ్డలు కలిగారు, ఎప్పుడు ఆయనకు దైవదౌత్య పదవి దక్కింది, ఆయన దైవదౌత్య పదవి దక్కిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఏ విధంగా ధర్మ సేవ చేశారు, తర్వాత ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ఆ తర్వాత ఆయన జీవితంలో ఎలాంటి ఘట్టాలు ఎదురయ్యాయి, చివరికి ఆయన ఎక్కడికి చేరుకున్నారు, ఆ తర్వాత ఎప్పుడు ఆయన మరణం సంభవించింది, ఎక్కడ ఆయన సమాధి ఉంది, ఇవన్నీ విషయాలు ఒక ప్రవక్త వారి అనుచరునిగా, ప్రవక్త వారి అభిమానిగా, ప్రేమికునిగా ప్రతి వ్యక్తి తెలుసుకోవలసి ఉంది మిత్రులారా. అయితే అల్లాహ్ దయ ఏమిటంటే ప్రవక్త వారి జీవిత చరిత్ర చదువు వచ్చిన వాళ్ళు పుస్తకాలలో ‘అర్రహీఖుల్ మఖ్తూమ్‘ అని ఒక పుస్తకం ఉంది. అది ఉర్దూలో, అలాగే తెలుగులో అనేక భాషల్లో అల్హమ్దులిల్లాహ్ అనువాదం చేయబడి ఉంది. అది చదివి తెలుసుకోవచ్చు. చదువు రాని వాళ్ళు వారి వారి భాషల్లో ప్రవక్త వారి జీవిత చరిత్రను వీడియోల రూపంలో విని తెలుసుకోవచ్చు. అల్హమ్దులిల్లాహ్ ‘మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర’అని పూర్తి ప్రవక్త వారి జీవిత చరిత్ర అల్హమ్దులిల్లాహ్ YouTube లో తెలుగు భాషలో ఉంది. అది కూడా మీరు వినవచ్చు, ఇతరులకు అల్హమ్దులిల్లాహ్ షేర్ చేయవచ్చు. అలాగే హిందీలో, అలాగే ఇంగ్లీష్ లో ప్రతి భాషలో ప్రవక్త వారి జీవిత చరిత్ర ఉంది. అది తెలుసుకోవాలి.
6. ప్రవక్త ప్రవర్తనను అలవర్చుకోవడం
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ మనతో కోరుతున్న మరొక విషయం ఏమిటంటే, ప్రవక్త వారి ప్రవర్తన ఎలా ఉండేదో మన ప్రవర్తనను కూడా మనము ఆ విధంగా మార్చుకోవాలి. మూర్ఖత్వంగా ప్రవర్తించటం, ఆ తర్వాత మేము ప్రవక్త వారి అభిమానులం అని చెప్పుకోవటం అది సరికాదు. మూర్ఖత్వం ప్రదర్శించటం, తర్వాత మేము ప్రవక్త వారి అభిమానులం అని చెప్పుకోవటం సరికాదండి.
ప్రవక్త వారి అభిమానులు అయితే, ప్రవక్త వారి ప్రేమికులు అయితే, ప్రవక్త వారి మీద ఉన్న మీ ప్రేమ నిజమైనది అయితే, ప్రవక్త వారి వ్యక్తిత్వం ఎలా ఉండేదో, ఆయన వ్యవహారాలు ఏ విధంగా ఉండేవో, ఆ విధంగా మన వ్యక్తిత్వాన్ని, మన వ్యవహారాలను మనము మార్చుకోవాలి. ప్రవక్త వారు కుటుంబీకులతో ఎలా ప్రవర్తించేవారు? ప్రవక్త వారు ఇరుగుపొరుగు వారితో ఎలా ప్రవర్తించేవారు? పిల్లలతో ఎలా ప్రవర్తించేవారు? పెద్దలతో ఎలా ప్రవర్తించేవారు? మహిళలతో ఎలా ప్రవర్తించేవారు? ముస్లింలతో ఎలా ప్రవర్తించేవారు? ముస్లిమేతరులతో ఎలా ప్రవర్తించేవారు? బంధువులతో ఎలా ప్రవర్తించేవారు? శత్రువులతో ఎలా ప్రవర్తించేవారు? అలాంటి ప్రవర్తన మనము కూడా కలిగి ఉండాలి.
మరి మనం అలా ఉన్నామా? ప్రవక్త వారి ప్రేమికులం అని చెప్పుకుంటున్నాం, ఒక పక్క బిడ్డల్ని హింసిస్తూ ఉన్నాం, ఒక పక్క భార్యని హింసిస్తూ ఉన్నాం, ఒక పక్క తల్లిదండ్రులకు సేవ చేయట్లేదు, పెద్దల్ని గౌరవించట్లేదు, అన్నీ పక్కన పెట్టేశాం, ప్రవక్త వారి ప్రేమికులమని చెప్పి మళ్ళా స్టేటస్ పెట్టుకుంటూ ఉన్నాం. ఇది ఎంతవరకు సబబు అండి? కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వ్యక్తిత్వం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వ్యవహారం ఎవరితో ఏ విధంగా ఉండేదో తెలుసుకొని మనము కూడా ఆ విధంగా మనల్ని మనము సంస్కరించుకోవాలి, మార్చుకోవాలండి. ఇది ప్రవక్త వారి ప్రేమ మనతో కోరుతున్న విషయం.
7. ప్రవక్త ఇష్టాఇష్టాలను పాటించడం
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ మనతో కోరుతున్న మరొక విషయం ఏమిటంటే, ప్రవక్త వారు ఏ విషయాలను ప్రేమించారో, ఇష్టపడ్డారో, ఆ విషయాలను మనము కూడా ఇష్టపడాలి. ప్రవక్త వారు ఏ విషయాలను అయితే అసహ్యించుకున్నారో, ప్రవక్త వారికి ఏ పనులు, ఏ విషయాలు నచ్చలేదో, ఆ పనులు, ఆ విషయాలను కూడా మనము వదిలేయాలి, మనము కూడా వాటిని ఇష్టపడకూడదు.
ప్రవక్త వారు ఇష్టపడిన విషయాన్ని మనం కూడా ఇష్టపడతాం. ప్రవక్త వారికి నచ్చని విషయాలను కూడా మనము పక్కన పెట్టేద్దాం, మనము ఆ విషయాలను ఇష్టపడకూడదు. ఈరోజు మనం ఏమి చేస్తున్నాం? ప్రవక్త వారికి నచ్చిన విషయాలు మనకు నచ్చట్లేదు. ప్రవక్త వారికి నచ్చని విషయాలు మనకు నచ్చుతా ఉన్నాయి. మాకు నచ్చుతూ ఉన్నాయి, మా బిడ్డలకు నచ్చుతూ ఉన్నాయి, మా కుటుంబీకులకు నచ్చుతూ ఉన్నాయి. ఏమన్నా చెప్తే ఇది చేయకూడదు కదా, ఇది ప్రవక్త వారు చేయవద్దు అని వరించారు కదా మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్తే, “హజరత్, అలా కాదు హజరత్. మా బిడ్డ అలా కోరుతూ ఉంటే అలా చేశాను హజరత్. లేదంటే మా తల్లిదండ్రులు చెప్తే చేశాను హజరత్. లేదంటే మా ఇంట్లో చెప్తే నేను చేశాను హజరత్” అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు అండి? ప్రవక్త వారి ప్రేమికులు అని చెప్పేవాళ్ళు చెప్తున్న మాట ఇది. ప్రవక్త వారిని మీరు నిజంగానే ప్రేమిస్తూ ఉంటే ప్రవక్త వారు ఇష్టపడిన విషయాలను ఇష్టపడండి, వాటిని అభిమానించండి, వాటిని మీ జీవితంలోకి తీసుకొని రండి. ప్రవక్త వారికి నచ్చని విషయాలు వాటిని చేయటం, ఆ తర్వాత వారు చెప్పిన కారణంగా చేశాను, వీళ్ళు చెప్పిన కారణంగా చేశాను అని చెప్పటం సరికాదు.
8. ప్రవక్త కుటుంబీకులను (అహలె బైత్) గౌరవించడం
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ మనతో కోరుతున్న విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకుల్ని మనము గౌరవించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులు ఎవరు? అహలె బైత్ అంటారు. ఒక ప్రత్యేకమైన ప్రసంగము ఉంది, అది కూడా మీరు వినవచ్చు. అహలె బైత్ అంటే ఎవరు? అహలె బైత్ వారి యొక్క విశిష్టతలు అని ప్రసంగాలు ఉన్నాయండి, అవి వినండి ఇన్షాఅల్లాహ్, విషయాలు వివరంగా తెలుస్తాయి. కాబట్టి ప్రవక్త వారి ప్రేమ మనతో కోరుతున్న విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకుల్ని మనము ప్రేమించాలి, అభిమానించాలి, గౌరవించాలి. ఏ ఒక్కరినీ కూడా కించపరచటం సబబు కాదు, సరికాదు. నిజమైన ప్రేమికులమైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకుల్ని మనము గౌరవించాలి, అభిమానించాలి.
ప్రవక్త వారి ప్రేమ కోరని విషయాలు చాలామంది చేస్తూ ఉన్నారు
మిత్రులారా, ఇవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ మనతో కోరుతున్న విషయాలు అనే అంశం మీద కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీ ముందర ఉంచాను. అయితే నేడు ప్రవక్త వారి ప్రేమ కోరుతున్న విషయాలు ఎంతమంది చేస్తూ ఉన్నారు అనేది మనము ఆత్మ విమర్శ చేసుకోవాలి. మనం ఆ విధంగా చేస్తూ ఉన్నామా లేదా అనేది మనము ఆత్మ విమర్శ చేసుకోవాలి. అయితే సమాజాన్ని చూస్తే మాత్రము ఒక విషయం మన ముందర వస్తుంది, అదేమిటంటే, ప్రవక్త వారి ప్రేమ ఏ విషయాలు అయితే మనతో కోరుతూ ఉందో, ఆ విషయాలు చేస్తున్న వారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ప్రవక్త వారి ప్రేమ కోరని విషయాలు చాలామంది చేస్తూ ఉన్నారు.
ప్రవక్త వారి ప్రేమ ర్యాలీలు చేయమని చెప్పలేదండి. ప్రవక్త వారి ప్రేమ డీజేలు వాయిస్తూ పచ్చని జెండాలు చేతిలో పట్టుకొని ట్రాఫిక్ జామ్ చేసి అక్కడ ఎగరండి, అక్కడ పాడండి అని మనకు చెప్పలేదండి. కానీ చేస్తున్నారు, ఏమంటే ప్రవక్త వారి ప్రేమ అంటూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మసీదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు బ్యానర్ మీద పెట్టి, స్టేజ్ ని అలంకరించి, ఆ తర్వాత అక్కడ అశ్లీలమైన పాటలు వాయిస్తూ అక్కడ నృత్యాలు చేస్తూ ఉన్నారు. ప్రవక్త వారి ప్రేమ ఈ పనులు చేయమని చెప్పిందా అండి మనకు? లేదు లేదు. ఇది ప్రవక్త వారి ప్రేమకు విరుద్ధమైన విషయాలు.
అలాగే ప్రవక్త వారి ప్రేమ అని చెప్పి చాలామంది ఏమి చేస్తున్నారంటే, పెద్ద పెద్ద కేకులు తయారు చేస్తూ ఉన్నారు. ఆ కేకులు తయారు చేస్తూ, అల్లాహ్ మన్నించు గాక, ఇంగ్లీష్ లో “హ్యాపీ బర్త్డే యా రసూలుల్లాహ్” అని చెప్పి కూడా కేకులు కోస్తూ ఉన్నారు, అదేదో పెద్ద ఘన కార్యం అని చెప్పేసి మళ్లీ దాన్ని సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. ఇది చేయమని చెప్పిందండి మన ప్రవక్త వారి ప్రేమ మనకు? కేకులు సింగారించి “హ్యాపీ బర్త్డే యా రసూలుల్లాహ్” అని చేయమని మనకు ప్రవక్త వారి ప్రేమ చెప్పిందా అండి? లేదు మిత్రులారా.
ప్రవక్త వారి ప్రేమ సాకుతో అసభ్యమైన కార్యాలు చేయరాదు, ప్రజలకు ఇబ్బంది పెట్టే పనులు చేయరాదు, అలాగే అసంఘాకికమైన విషయాలకు దరిదాపుగా వెళ్ళకూడదు, అలాగే మన ధర్మంలో లేని విషయాలకు కూడా మనము చేయకూడదు ప్రవక్త వారి ప్రేమ సాకుతో.
ఇంతటితో నా మాటలు ముగిస్తూ, నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ నిజమైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అభిమానుల్లాగా తీర్చిదిద్దు గాక. ప్రవక్త వారి ప్రేమ ఏ విషయాలైతే కోరుతూ ఉందో ఆ విషయాలను తూచా తప్పకుండా మనందరికీ పాటించే భాగ్యం ప్రసాదించు గాక. ప్రవక్త వారి ప్రేమ ఏ విషయాలైతే కోరట్లేదో అలాంటి విషయాల నుండి దూరంగా ఉండే అనుగ్రహం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు, ముఖ్యంగా మన యువకులకు ప్రసాదించు గాక. ఆమీన్.
వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో లంచగొండితనం అనే ఘోరమైన పాపం గురించి వివరించబడింది. లంచం అంటే అన్యాయంగా ఒక లక్ష్యాన్ని సాధించడానికి లేదా అక్రమమైన కోరికను నెరవేర్చుకోవడానికి అధికారికి ఏదైనా ఇవ్వడం అని ప్రవక్త నిర్వచించారు. ఇస్లాంకు ముందు కూడా ఈ అవినీతి యూదులలో ఉండేదని, వారు ప్రాపంచిక ప్రయోజనాల కోసం తమ గ్రంథాలను మార్చారని ఆయన వివరించారు. లంచాన్ని ఇస్లాం తీవ్రంగా నిషేధించిందని, సూరా అల్-బఖరా మరియు సూరా అల్-మాఇదాలోని వచనాలను ఉటంకిస్తూ, లంచం ఇచ్చేవారిని మరియు తీసుకునేవారిని ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శపించారని ఒక హదీసును ఉదహరించారు. ఒక వ్యక్తి యొక్క నిజమైన సంపద అతను తిన్నది, ధరించినది లేదా పరలోకం కోసం దానధర్మాలు చేసినది మాత్రమేనని, మిగిలినది వారసుల కోసం విడిచిపెట్టబడుతుందని ప్రవక్త స్పష్టం చేశారు. లంచం వంటి అక్రమ సంపాదన తినడం వల్ల ప్రార్థనలు (దుఆ) అంగీకరించబడవని మరియు అది దైవిక శిక్షకు దారి తీస్తుందని హెచ్చరించారు.
نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ (నహ్మదుహు వ నస్త’ఈనుహు వ నస్తగ్ఫిరుహు) మేము ఆయననే స్తుతిస్తున్నాము, ఆయన సహాయాన్నే అర్థిస్తున్నాము మరియు ఆయన క్షమాపణనే వేడుకుంటున్నాము.
وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا (వ న’ఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వమిన్ సయ్యిఆతి అ’అమాయలినా) మా ఆత్మల కీడు నుండి మరియు మా చెడు కార్యాల నుండి మేము అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము.
مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ (మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్ ఫలా హాదియ లహు) అల్లాహ్ మార్గనిర్దేశం చేసిన వారిని ఎవరూ తప్పుదారి పట్టించలేరు, మరియు ఆయన తప్పుదారి పట్టించిన వారికి ఎవరూ మార్గనిర్దేశం చేయలేరు.
وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ (వ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు) మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారని, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వాములు లేరు.
وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ (వ అష్హదు అన్న ముహమ్మదన్ ‘అబ్దుహు వ రసూలుహు) మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని.
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ (యా అయ్యుహల్లదీన ఆమను త్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహి వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్) “ఓ విశ్వాసులారా! అల్లాహ్కు భయపడవలసిన విధంగా భయపడండి. మరియు ముస్లింలుగా తప్ప మరణించకండి.” (3:102)
“మానవులారా! మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి సృష్టించాడు. దాని నుండే దాని జతను కూడా సృష్టించాడు. మరి వారిద్దరి నుండి ఎంతోమంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేశాడు. మీరు ఎవరి పేరుతో ఒకరినొకరు కోరుకుంటారో ఆ అల్లాహ్కు భయపడండి. బంధుత్వ సంబంధాలను తెంచటానికి భయపడండి. నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని ఉన్నాడు.” (4:1)
“ఓ విశ్వాసులారా! అల్లాహ్కు భయపడండి. మరియు సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. ఆయన మీ కార్యాలను చక్కబరుస్తాడు. మరియు మీ పాపాలను క్షమిస్తాడు. ఇక అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపినవాడు గొప్ప విజయాన్ని సాధించినట్లే.” (33:70-71)
أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صلى الله عليه وسلم وَشَرَّ الأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلَّ بِدْعَةٍ ضَلالَةٌ وَكُلَّ ضَلالَةٍ فِي النَّارِ
ఇక ఆ తర్వాత, నిశ్చయంగా, మాటలలోకెల్లా ఉత్తమమైనది అల్లాహ్ గ్రంథం (ఖుర్ఆన్), మరియు మార్గాలలోకెల్లా ఉత్తమమైనది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం. కార్యాలలోకెల్లా చెడ్డవి కొత్తగా కల్పించబడినవి. ప్రతి కొత్తగా కల్పించబడినది బిద్అత్ (ధర్మంలో నూతన ఆచారం). ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత్వం. మరియు ప్రతి మార్గభ్రష్టత్వం నరకానికి దారితీస్తుంది.
సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.
లంచగొండితనం
అభిమాన సోదరులారా! లంచగొండితనం అనే అంశంపై ఈరోజు మనం ఇస్లాం ధర్మం ఏమి చెబుతుంది అని కొన్ని విషయాలు తెలుసుకుందాం.
లంచం లేదా లంచగొండితనం అంటే అధర్మమైన ఏదైనా లక్ష్యాన్ని, ఏదైనా పనిని న్యాయ విరుద్ధమైన తన కోరికను నెరవేర్చుకోవడానికి ఎవరైనా అధికారికి లేక తత్సంబంధితమైన వ్యక్తికి ఎంతో కొంత ఇచ్చి ఆ పనిని చేయించుకోవటం లంచం. దీనిని కొందరు లాంఛనం అని, మరికొందరు దక్షిణం అని, ఇంకొందరు బహుమతి అని, గిఫ్ట్ అని అంటారు. ఏ పేరుతో పిలుచుకున్నా ఉద్దేశం మాత్రం దురుద్దేశమే కాబట్టి, పద్ధతి మాత్రం అక్రమ పద్ధతి కాబట్టి ఇది నూటికి నూరు శాతం లంచమే అవుతుంది.
ఖురాన్ అవతరణ పూర్వం, అలాగే మదీనాలోని యూదులలో కూడా ఈ గుణం ఉండేది. లంచగొండితనం అనేది ఉండేది. తౌరాతు గ్రంథంలో జరిగిన ప్రక్షిప్తాల (మార్పుల) వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి ఈ లంచమే. అరేబియాలో యూదుల వ్యాజ్యాలపై వారి మతాధిపతులు, తెగల సర్దారులు తీర్పులు చేసేవారు. వారి స్వార్థ బుద్ధి కారణంగా న్యాయ సమత్వం లేకుండా పోయింది. అయిన వారికి ఆకులో, కాని వారికి కంచంలో అన్నట్లు యూద విద్వాంసులు ఆశ్రిత పక్షపాతం వహించేవారు. ఈ వ్యవహారంలో వారు తౌరాతు గ్రంథంలో ఉన్న ధర్మాదేశాలను కూడా కట్టిపుచ్చేవారు.
ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ సూరా బఖరా ఆయత్ 174లో ఇలా సెలవిచ్చాడు:
“అల్లాహ్ తన గ్రంథంలో అవతరింపజేసిన విషయాలను దాచేవారు, వాటిని కొద్దిపాటి ధరకు అమ్ముకునేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. ప్రళయ దినాన అల్లాహ్ వారితో అస్సలు మాట్లాడడు. వారిని పరిశుద్ధపరచడు. పైపెచ్చు వారికి బాధాకరమైన శిక్ష కలదు.” (2:174)
అంటే, అల్లాహ్ తన గ్రంథంలో అవతరింపజేసిన విషయాన్ని ఆ యూదులు, ఆ యూదుల ధర్మ పండితులు దాచిపెట్టేవారు. దానిని కొద్దిపాటి మూల్యానికి అమ్ముకునేవారు. తమ పొట్టలను అగ్నితో నింపుకునేవారు. ప్రళయ దినాన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారితో మాట్లాడటం గానీ, వారిని పరిశుద్ధ పరచటం గానీ చేయడు. వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. అంటే యూదులు లంచం తీసుకుని వారి గ్రంథాలలో ఉన్న విషయాలను దాచి పెట్టేవారని స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయత్లో తెలియజేశాడు. ఇంకా అల్లాహ్ సూరా మాఇదాలో ఇలా అన్నాడు:
“వారిలో చాలామందిని నీవు చూస్తావు, వారు పాపకార్యాల వైపుకు, దౌర్జన్యం వైపుకు, అధర్మమయిన సొమ్మును స్వాహా చేయటం వైపుకు ఎగబడుతూ ఉంటారు. వారు చేసే ఈ చేష్టలన్నీ పరమ చెడ్డవి.“ (5:62)
అంటే లంచం తీసుకుని వారు న్యాయం, అన్యాయం, పాపం, పుణ్యం పట్టించుకునేవారు కాదు.
ఇస్లాంలో లంచం నిషేధం
లంచగొండితనం ఇస్లాంలో చాలా స్పష్టంగా నిషేధించబడినది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా బఖరా ఆయత్ 188లో ఇలా సెలవిచ్చాడు:
“ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహా చేయకండి. బుద్ధిపూర్వకంగా, అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంతభాగం కాజేయటం కోసం అధికారులకు ముడుపులు చెల్లించకండి. అది (న్యాయం కాదన్న సంగతి) మీకూ తెలిసినదే.“ (2:188)
అంటే ఈ ఆయత్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, మీరు ఒకరి సొమ్మును ఇంకొకరు అధర్మంగా తినకండి. ఇతరుల సొమ్ములోని కొంత భాగం అక్రమంగా స్వాహా చేసేందుకు ఆ వ్యవహారాన్ని అధికారుల వద్దకు తీసుకుపోకండి. అది అన్యాయం అన్న సంగతి స్వయంగా మీకు తెలుసు. అంటే లంచం ఇచ్చి, అధికారులకు లంచం ఇచ్చి అన్యాయంగా సొమ్ము కాజేయకండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయత్లో హెచ్చరించాడు.
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
لَعَنَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم الرَّاشِيَ وَالْمُرْتَشِيَ (ల’అన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ అర్రాషి వల్ ముర్తషి) “లంచం పుచ్చుకునేవానిని మరియు లంచం ఇచ్చేవానిని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శపించారు.”
లంచం పుచ్చుకునే వానిని, లంచం ఇచ్చే వానిని పుచ్చుకునేవాడు ఇచ్చేవాడు వారిద్దరినీ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ల’అనత్ చేశారు, వారి పైన శపించారు. అంటే, ఏ విషయం పైన అల్లాహ్ శాపం ఉంటుందో, దేని పైన ప్రవక్త గారి శాపం ఉంటుందో, అది ఘోరమైన పాపం అని అర్థం. దానికి తప్పనిసరిగా శిక్ష ఉంటుందని అర్థం. అంటే ఘోర పాపాలలో ఒక ఘోరమైన పాపం లంచం. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లంచం పుచ్చుకునే వానిని, లంచం ఇచ్చే వానిని శపించారు. ఎందుకంటే వారు అన్యాయంగా, అనైతికంగా సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇతరుల సంపదను నిషిద్ధమైన పద్ధతిలో సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కనుక లంచం ద్వారా వచ్చే ఆ డబ్బు, లంచం ద్వారా వచ్చే ఆ ధనం, లంచం ద్వారా వచ్చే ఆ పదవి, ఆ వస్తువు ఏదైనా సరే అది అధర్మం, హరాం అని స్పష్టమవుతుంది.
అభిమాన సోదరులారా! ప్రతి చిన్న బాధ్యుడు, చిన్న పోస్ట్, పియాన్ నుంచి, ఫర్రాష్ నుంచి పెద్ద స్థాయి వరకు లంచం అనేది సర్వసామాన్యం అయిపోయింది సమాజంలో. అసలు లంచం ఇచ్చేవారు దానికి తప్పుగా అని కూడా భావించడం లేదు. ఇంత సర్వసామాన్యం అయిపోయింది. ఇది ఒక అమానత్. అల్లాహ్ మనకి ఇచ్చింది ప్రతీది అమానత్. అది మన శరీర అవయవాలు కావచ్చు, అతను తన ఇంట్లో యజమాని అయితే, తన అధీనంలో ఉన్న భార్యాపిల్లలు కావచ్చు. అల్లాహ్ ఏదైతే మనకి ఇచ్చాడో అది అమానత్, అప్పగింత. దానిని మనం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాల ప్రకారంగానే మనము జీవించాలి ప్రతి విషయంలో. వ్యవహారం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వాణిజ్యం కావచ్చు, క్రయవిక్రయాలు కావచ్చు, లావాదేవీలు కావచ్చు, ఏదైనా సరే. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు సూరా నిసా ఆయత్ 58 లో:
إِنَّ اللَّهَ يَأْمُرُكُمْ أَن تُؤَدُّوا الْأَمَانَاتِ إِلَىٰ أَهْلِهَا (ఇన్నల్లాహ య’మురుకుమ్ అన్ తుఅద్దుల్ అమానాతి ఇలా అహ్లిహా) “ఎవరి అమానతులను వారికి అప్పగించండి… ” అని అల్లాహ్ మిమ్మల్ని గట్టిగా ఆదేశిస్తున్నాడు (4:58)
ఈ ఆయత్లో అమానత్, విశ్వసనీయత ఇవి రెండు రకాలు.
ఒకటి, ఒకరు ఇంకొకరి వద్ద భద్రపరచమని పెట్టిన సొమ్ము. అది ఏదైనా కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, కరెన్సీ రూపంలో కావచ్చు, వెండి, బంగారం రూపంలో కావచ్చు, భూమి కాగితాలు కావచ్చు, తినే వస్తువు ఏదైనా సరే భద్రపరచమని పెట్టిన సొమ్ము. ఆ సొమ్ము ఆ వ్యక్తి వచ్చి అడిగినప్పుడు ఎవరి సొమ్ముని వారికి తిరిగి ఇచ్చేయాలి. ఇది ఒక అమానత్.
రెండవ రకపు అమానతు పదవులకు సంబంధించినది. ఒకటి, అర్హత కలిగిన వారికే బాధ్యత అప్పగించాలి. రెండవది, బాధ్యత తీసుకున్న వారు తమ బాధ్యతను, తన డ్యూటీని న్యాయంగా, ధర్మంగా, షరియత్ పరంగా, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాల పరంగా అతను బాధ్యత వహించాలి. ఇది అమానత్. లంచం తీసుకుంటున్నాడు అంటే తన బాధ్యతలో లోపం జరుగుతుంది. అంటే డబ్బు తీసుకుని, సొమ్ము తీసుకుని అన్యాయంగా, అక్రమంగా, మోసపూరితంగా అతను తన బాధ్యత వహిస్తున్నాడు. సొమ్ము కాజేస్తున్నాడు. దీనినే లంచం అంటారు. అది ఒక పైసా కావచ్చు, కోట్లు కావచ్చు. ఒక్క పైసా హరాంతో కూడిన మన కడుపులోకి పోతే, దానివల్ల మన శరీరం ఎదుగుతుంది కదా, మాంసము, ఎముకలు, రక్తము ఇవన్నీ హరాంతో అవుతుంది. అటువంటి శరీరం స్వర్గంలో ప్రవేశించదని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు ఉన్నాయి.
ధనం యొక్క వాస్తవికత
అభిమాన సోదరులారా! అసలు మనిషి అన్యాయంగా, అక్రమంగా డబ్బులు సంపాదిస్తాడు. కానీ ఆ డబ్బు వలన ఈ లోకములో అతనికి మనశ్శాంతి ఉండదు. పరలోకంలో శిక్ష ఉంటుంది. ఈ విషయం మరిచిపోతున్నాడు.
ఈ ధనం గురించి మన ప్రవక్తగారు ఏం చెప్పారో ఒక హదీస్ తెలుసుకుందాం. తిర్మిదిలో ఈ హదీస్ ఉంది.
عَنْ كَعْبِ بْنِ عِيَاضٍ، قَالَ سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُولُ (అన్ కా’బ్ ఇబ్ని ‘ఇయాదిన్, ఖాల సమీ’తు అన్నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లమ యఖూలు) కాబ్ బిన్ ఇయాజ్ రదియల్లాహు అన్హు కథనం: నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పగా విన్నాను:
إِنَّ لِكُلِّ أُمَّةٍ فِتْنَةً وَفِتْنَةُ أُمَّتِي الْمَالُ (ఇన్న లికుల్లి ఉమ్మతిన్ ఫితనతున్, వ ఫితనతు ఉమ్మతీ అల్-మాల్) “నిశ్చయంగా, ప్రతీ ఉమ్మత్ (సముదాయం) కొరకు ఒక ఫితనా (పరీక్ష) ఉంది. మరియు నా ఉమ్మత్ యొక్క ఫితనా ధనం.” (జామి అత్-తిర్మిది)
కాబ్ బిన్ ఇయాజ్ రదియల్లాహు అన్హు కథనం, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతుండగా నేను విన్నానని అంటున్నారు. ప్రవక్తగారు ఏం చెప్పారు? ప్రతి ఉమ్మత్ కి ఒక ప్రత్యేకమైన పరీక్ష ఉంటుంది. అలాగే నా అనుచర సమాజానికి పరీక్ష సంపద, డబ్బు, మాల్ అన్నారు. ఎందుకంటే రేపు ప్రళయ దినాన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ ధనం గురించి ప్రశ్నిస్తాడు, లెక్క ఉంది. న్యాయంగా సంపాదించావా, అన్యాయంగా సంపాదించావా? లంచంతో సంపాదిస్తే అది అన్యాయం, అధర్మం, నిషిద్ధం, పాపం, నేరం అది. ఒక హదీస్లో ఇలా ఉంది:
అబూ బర్జా అల్-అస్లమీ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
“ప్రళయ దినాన ఒక దాసుడు నాలుగు విషయాల గురించి ప్రశ్నించబడే వరకు తన పాదాలను కదల్చలేడు: తన జీవితాన్ని దేనిలో గడిపాడని, తన జ్ఞానంతో ఏమి ఆచరించాడని, తన ధనాన్ని ఎక్కడి నుండి సంపాదించి ఎక్కడ ఖర్చు పెట్టాడని, మరియు తన శరీరాన్ని దేనిలో ఉపయోగించాడని.” (జామి అత్-తిర్మిది)
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
لَا تَزُولُ قَدَمَا عَبْدٍ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يُسْأَلَ عَنْ أَرْبَعٍ (లా తజూలు ఖదమా అబ్దిన్ యౌమల్ ఖియామతి హత్తా యుస్అల అన్ అర్బ’ఇన్) రేపు ప్రళయ దినాన నాలుగు ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అల్లాహ్ దాసుడు ఒక అడుగు కూడా ముందుకు వేయలేడు.
ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. ఎప్పుడు? నాలుగు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినంత వరకు. ఆ నాలుగు ప్రశ్నలు ఏమిటి?
మొదటి విషయం, తన జీవితం, తన వయసు ఎలా గడిచింది. ధర్మంలోనా, అధర్మంలోనా? ధర్మపరంగా, అధర్మపరంగా? అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు విధేయతలోనా, అవిధేయతలోనా?
రెండవ ప్రశ్న, వ’అన్ ‘ఇల్మిహి ఫీమా ఫ’అల్ (తన జ్ఞానం విషయంలో ఏమి ఆచరించాడు). జ్ఞానం గురించి. అతనికి అల్లాహ్ గురించి, అల్లాహ్ ప్రవక్త గురించి, ఖురాన్ గురించి, ఇస్లాం గురించి ఎంత వరకు జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంలో అతను ఎంతవరకు ఆచరించాడు.
మూడవది, వ’అన్ మాలిహి మిన్ ఐన ఇక్తసబహు వ ఫీమా అన్ఫఖహు (తన ధనాన్ని ఎక్కడి నుండి సంపాదించాడు మరియు దేనిలో ఖర్చు పెట్టాడు). ధనం గురించి, సొమ్ము గురించి, ఆస్తి గురించి, డబ్బు గురించి ఎలా సంపాదించావు, ఎలా ఖర్చు పెట్టావు. ఎలా వచ్చింది, అది కూడా, ఎలా పోయింది అది కూడా, రెండు కూడా. కొందరు కష్టంగా సంపాదిస్తారు, ధర్మ సమ్మతంగా సంపాదిస్తారు, న్యాయంగా సంపాదిస్తారు. కష్టార్జితమే, కానీ ఖర్చు పెట్టేది అధర్మం అవుతుంది. కావున ఈ ఎలా సంపాదించావు, న్యాయంగా, అన్యాయంగా, ధర్మంగా, అధర్మంగా, అలాగే ఎలా ఖర్చు పెట్టావు.
నాలుగవది, వ’అన్ జిస్మిహి ఫీమా అబ్లాహ్ (తన శరీరాన్ని దేనిలో ఉపయోగించాడు). శరీరం గురించి. చేతులు, కాళ్లు, కళ్లు, హృదయం, కడుపు, పాదాలు, ఇవన్నీ, చెవులు వారికి ఎలా పోషించావు. నీ శరీరం ఎలా పెరిగింది? హరాం సొమ్ముతోనా, హలాల్ సొమ్ముతోనా? ఏ విధంగా ఖర్చు పెట్టావు? చెవులతో ఖురాన్ విన్నావా, న్యాయం విన్నావా, ఇంకేమైనా బూతులు, చెడు విషయాలు? ఇవన్నీ అల్లాహ్ అడుగుతాడు.
అందుకే ఒక విషయం, రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తున్నాను. మొదటి విషయం ఏమిటంటే, అరఫా మైదానం. చాలాసార్లు విన్నాం మనం ఈ హదీస్. అరఫా మైదానం, ఇప్పుడు కూడా ఇన్ని సౌకర్యాలు ఉండి కూడా హజ్ చేస్తే చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. ఇన్ని సౌకర్యాలు ఉండి, ఏసీ బస్సులు, విమానంలో ఏసీ, ఎయిర్ పోర్టులో ఏసీ, గుడారాలు, ఇంటి నుంచి తవాఫ్ వరకు, మినాకి, ముజ్దలిఫాకి అన్నిచోట్ల ప్రయాణ సౌకర్యాలు, సవారీలు అయినప్పటికీ చాలా ఇబ్బందులు పడతారు మనుషులు. కానీ ప్రవక్త గారి కాలంలో ఉన్నవారు ఒంటెల పైన, లేనివారు కాలి నడక పోయి హజ్ చేసేవారు. అటువంటి ఒక వ్యక్తి అరఫా మైదానంలో దుస్తులు సరిగా లేవు, తల వెంట్రుకలు గాలితో, దుమ్ముతో నిండిపోయినాయి. ఒకరకంగా ఉంది. ఆ వ్యక్తి అరఫా మైదానంలో చేతులు ఎత్తి ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కార్చి దుఆ చేస్తున్నాడు. ఆ వ్యక్తి గురించి ప్రవక్త గారు ఏమన్నారంటే, అతని దుఆ స్వీకరించబడదు అన్నారు. ఒక వ్యక్తి ఎన్నో వందల, వేల మైళ్ల దూరంతో ప్రయాణం చేసి హజ్ కోసం ప్రయాణం చేస్తే అరఫా మైదానంలో హదీస్ లో ఏముంది, అరఫా మైదానంలో చేయబడిన దుఆ రద్దు చేయబడదు అని ఉంది కదా. అల్-హజ్జు అరఫా అన్నారు ప్రవక్తగారు కదా. అయినా అరఫా మైదానంలో దుఆ చేస్తే ఆ దుఆ క్యాన్సిల్. ప్రవక్తగారు అన్నారు, ఎందుకు? దానికి వివరం ప్రవక్తగారు చెప్పారు. ఆ వ్యక్తి తినే సొమ్ము హరాం, తొడిగే దుస్తులు హరాం, తాగేది హరాం. అతని దుఆ ఎలా అల్లాహ్ స్వీకరిస్తాడు? అంటే ఇది చెప్పటం నా ఉద్దేశం ఏమిటంటే, లంచం హరాం. లంచం తీసుకునే వ్యక్తి యొక్క దుఆ ఎలా స్వీకరించబడుతుంది? దుఆ స్వీకరించబడదు. ఈ లోకంలో మనశ్శాంతి ఉండదు, పరలోకంలో కఠినమైన శిక్ష ఉంటుంది అని మనం తెలుసుకోవాలి.
అసలు ప్రవక్త గారు ఒక విషయం చెప్పారు. మనిషి సంపాదించే సంపాదనలో ఆ వ్యక్తి యొక్క వాటా ఎంత? వేరే వాళ్ళ వాటా కాదు. ఒక వ్యక్తి సంపాదిస్తాడు, తన వారసుల వాటా కాదు. ఒక వ్యక్తి చనిపోతే భార్యకు వాటా ఎంత, పిల్లలకి వాటా ఎంత, అమ్మానాన్నకి వాటా ఎంత దీని గురించి కాదు. ఒక వ్యక్తి కష్టార్జితం, కష్టంతో సంపాదిస్తున్నాడు. ఆ సంపదలో అతని వాటా ఎంత? ఇది ప్రాపంచిక యొక్క యదార్థం ఇది. తెలుసుకుందాం.
అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, దాసుడు నా ధనము, నా ధనము అంటూ ఉంటాడు. ఎల్లప్పుడూ నా దాసుడు నా ధనము, నా సంపాదన, నా ధనము, నా విల్లా, నా బంగ్లా, నా సేవింగ్ అకౌంట్, నాది, నాది అంటాడు కదా. వాస్తవానికి సంపాదనలో, సంపాదించే వ్యక్తిలో మూడు భాగాలే ఉంటాయి. నాలుగో భాగం ఉండదు. మొదటి భాగం, మా అకల ఫ అఫ్నా (తిన్నాడు మరియు దానిని జీర్ణం చేసుకున్నాడు). తిన్నాడు, ఆ తర్వాత అది అరిగిపోయింది. అతను వాడాడు. తిన్నాడు, ఆ తిండి వలన తన శరీరంలో రక్తం వచ్చింది, మాంసం వచ్చింది, ఇది వచ్చింది. తిన్నాడు. ఆ తిన్నదే అతని వాటా. రెండవది, అవ్ లబిస ఫ అబ్లా (ధరించాడు మరియు దానిని పాతదిగా చేశాడు). తొడిగాడు, చించేసాడు. కొన్నాడు, బట్టలు కొన్నాడు, దుస్తులు కొన్నాడు, తొడుక్కున్నాడు, యూస్ చేశాడు. ఇది అతని వాటా. మూడవది, అవ్ అ’తా ఫఖ్తనా (ఇచ్చాడు మరియు దానిని పరలోకం కోసం దాచుకున్నాడు). అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాడు. ఈ మూడే అతనికి వాటా. ఈ మూడింటిలో రెండు వాటాలు అతను అనుభవిస్తాడు, ప్రపంచంలోనే అయిపోతాయి. మూడో వాటా శాశ్వతంగా అతనికి మిగిలిపోతుంది. ఇవి కాక అతని ధనంలో, అతని సొమ్ములో, అతని ఆస్తిలో, అతని సంపదలో ఏదైనా మిగిలినా అది అతనిది కాదు. ఎందుకంటే అదంతా అతను విడిచిపెట్టి చనిపోతాడు. వేరేవాళ్లు అక్రమంగా తీసుకోవచ్చు, అధర్మంగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి పోకపోయినా, తన సంతానము, బంధువులు అది తీసేసుకుంటారు. చివరికి ఒక ఉంగరమో, ఏదైనా రాకపోయినా కట్ చేసి తీసేసుకుంటారు కానీ వదలరు. మనిషి యొక్క సంపాదనలో ఇవి మూడే వాటాలు. ఇది మనం గ్రహించాలి.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ హలాల్ సంపదను సంపాదించే కృషిని, సద్బుద్ధిని ప్రసాదించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.