ఇస్లాంలో మస్జిదుల స్థానం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో , టెక్స్ట్ ]

ఇస్లాం లో మస్జిదుల స్థానం
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=gNBBOGOFaVM [26 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో మస్జిద్ (మసీదు) యొక్క ఉన్నతమైన స్థానం మరియు ప్రాముఖ్యత గురించి వివరించబడింది. మస్జిద్ కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదని, అది విశ్వాసం, శాంతి, ఐక్యత మరియు విద్యకు కేంద్రమని వక్త నొక్కిచెప్పారు. మస్జిద్ లు ఇస్లామీయ కోటలని, అక్కడి నుండే ఇస్లాం వెలుగు ప్రపంచమంతటా వ్యాపించిందని తెలిపారు. ప్రవక్త ముహమ్మద్ (స) కాలంలో, సహాబాలు మస్జిద్ ను ఒక విశ్వవిద్యాలయంగా, శిక్షణా కేంద్రంగా ఎలా ఉపయోగించుకున్నారో ఉదాహరణలతో వివరించారు. అబూ హురైరా (ర) వంటి సహాబాలు మస్జిద్ లోనే ఉంటూ జ్ఞానాన్ని ఎలా సంపాదించారో పేర్కొన్నారు. మస్జిద్ లను నిర్మించడం, వాటిని ఆబాద్ (సజీవంగా) చేయడం, మరియు వాటి పట్ల గౌరవం చూపడం యొక్క పుణ్యఫలాలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో విశదీకరించారు. చివరగా, మస్జిద్ లో ప్రవేశించేటప్పుడు, ఉన్నప్పుడు మరియు బయటకు వెళ్ళేటప్పుడు పాటించవలసిన నియమాలు, మర్యాదల గురించి ప్రస్తావించారు.


مَنْ يَهْدِهِ اللهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ
[మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహూ వమన్ యుద్లిల్ ఫలా హాదియ లహూ]
ఎవరికైతే అల్లాహ్ మార్గదర్శకత్వం చూపాడో అతన్ని ఎవరూ త్రోవ తప్పించలేరు. మరియు ఎవరినైతే అల్లాహ్ త్రోవ తప్పించాడో అతనికి ఎవరూ మార్గదర్శకత్వం చూపలేరు.

وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ
[వ అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ]
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు. ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు.

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
[వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ]
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త.

أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللهِ وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ
[అమ్మా బ’అదు ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహి వ ఖైరల్ హద్యి హద్యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం]
ఇక విషయానికొస్తే, నిశ్చయంగా అన్ని మాటలలో ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం. మరియు అన్ని మార్గాలలో ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం.

وَشَرَّ الْأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ وَكُلَّ ضَلَالَةٍ فِي النَّارِ
[వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా వ కుల్ల ముహ్దసతిన్ బిద్’అతున్ వ కుల్ల బిద్’అతిన్ దలాలతున్ వ కుల్ల దలాలతిన్ ఫిన్నార్]
మరియు అన్ని విషయాలలో చెడ్డవి కొత్తగా కల్పించబడినవి. మరియు ప్రతీ కొత్తగా కల్పించబడినది బిద్’అత్. మరియు ప్రతీ బిద్’అత్ మార్గభ్రష్టత్వం. మరియు ప్రతీ మార్గభ్రష్టత్వం నరకానికి దారితీస్తుంది.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడతలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయు గాక.

అభిమాన సోదరులారా, ఈరోజు మనం ఇన్షా అల్లాహ్, ఇస్లాంలో మస్జిదుల స్థానం అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మస్జిద్ అంటే సజ్దా చేసే చోటు అని అర్థం. ప్రత్యేకంగా అల్లాహ్ ఆరాధన కోసం నిర్మించబడిన ఆలయాన్ని మస్జిద్ అంటారు.

మస్జిద్ కి గౌరవప్రదమైన, ఉన్నతమైన, పవిత్రమైన స్థానం ఉంది. ఇది ఈమాన్ మరియు శాంతికి మూలం. ప్రార్థనలు జరుపుకునే ప్రదేశం. ఇక్కడ ప్రార్థనలు స్వీకరించబడతాయి. ఉమ్మతి యొక్క ఐక్యతకు ఇదొక శీర్షిక. హిదాయత్, మంచితనం, స్థిరత్వానికి చిహ్నం. శాస్త్రీయపరమైన, ఆచరణాత్మకమైన, ఆధ్యాత్మికమైన గృహం మస్జిద్.

ఇది ధృడమైన శిక్షణా కేంద్రం. ఈ కేంద్రం నుంచే ఏమీ తెలియని ప్రజలు, గొర్రెలు మేపే సహాబాలు, ప్రపంచ ప్రతినిధులుగా తయారయ్యారు. దీని ఆధారంగానే రాగ ద్వేషాలలో రగిలే ప్రజలు ప్రేమానురాగాలకు ప్రతిరూపాలయ్యారు. ఈ కేంద్రం నుంచే సహాబాలు ఆ తరువాత వారు దీన్, దునియా, పరలోకం యొక్క శాస్త్రాలలో అత్యంత ప్రముఖులు, పట్టభద్రులయ్యారు.

ఇదొక పాఠశాల. దీనిలో విశ్వాసాల శిక్షణ జరుగుతుంది. హృదయాలు ఆధ్యాత్మికంగా శుద్ధి చేయబడతాయి. గొప్ప నాయకులు తయారవుతారు. ఇది ఒక న్యాయ వ్యవస్థ మరియు ఫత్వాలను జారీ చేసే ఓ మండలి. ఆశ్రయం లేని వారికి ఇదొక ఆశ్రయం. దాని మిహరాబు నుంచి అల్లాహ్ యొక్క స్పష్టమైన ఆయతులు పఠించబడతాయి. దీని మింబర్ నుంచి ప్రభావంతమైన ఖుత్బాలు, ఉపన్యాసాలు ఇవ్వబడతాయి.

మస్జిద్ అంటే కేవలం ఆరాధన ఆలయం మాత్రమే కాదు. వాస్తవానికి, మస్జిదులు ఇస్లామీయ కోటలు, ఇస్లాం ధర్మం కేంద్రాలు. ఇక్కడి నుండే ఇస్లాం వెలుగు ప్రపంచంలోని నలుదిశలూ వ్యాపించి విశ్వాన్నంతటినీ జ్యోతిర్మయం చేస్తుంది. ఈ మస్జిద్ల నుంచే సరైన ఇస్లామీయ బోధనలు జనబాహుళ్యంలో ప్రచారం చెందుతాయి. స్వచ్ఛమైన ఏక దైవోపాసనకు ప్రాచుర్యం లభిస్తుంది.

అభిమాన సోదరులారా, ఇక్కడ ముస్లింలందరూ తమ తమ భేదాలన్నీ కట్టిపెట్టి పాలు నీళ్ళల్లా కలిసిపోతారు. అల్పుడు, అధికుడు, పేదవాడు, ధనికుడు, అరబ్బుడు, అరబ్బేతరుడు, నల్లవాడు, తెల్లవాడు అనే భేద భావాలన్నీ మరచి ఒకే వరుసలో నిలుచుంటారు. అటువంటి స్థలం, కేంద్రం మస్జిద్.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, “మీరు ఒక వ్యక్తిని మస్జిద్ కు వస్తూ పోతూ ఉండగా చూస్తే అతని విశ్వాసం గురించి సాక్ష్యం ఇవ్వండి” అన్నారు. ఇది మస్జిద్ యొక్క మహత్యం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో మస్జిద్ గురించి ఏమన్నాడు?

فِي بُيُوتٍ أَذِنَ اللَّهُ أَن تُرْفَعَ وَيُذْكَرَ فِيهَا اسْمُهُ يُسَبِّحُ لَهُ فِيهَا بِالْغُدُوِّ وَالْآصَالِ
(ఏ గృహాల గౌరవ ప్రతిపత్తిని పెంచాలని, మరి వేటిలో తన నామస్మరణ చేయాలని అల్లాహ్‌ ఆజ్ఞాపించాడో వాటిలో ఉదయం సాయంత్రం అల్లాహ్‌ పవిత్రతను కొనియాడుతుంటారు, (24:36)

ఇక్కడ గృహాలు అంటే మస్జిద్. అంటే అర్థమేమిటి? విశ్వాసులు, అల్లాహ్ విధేయులు ఉదయం సాయంత్రం మస్జిదులలో అల్లాహ్ ప్రీతి కోసం నమాజులు చేస్తారు, కడు దీనంగా అల్లాహ్ ను వేడుకుంటారు.

అలాగే,

رِجَالٌ لَّا تُلْهِيهِمْ تِجَارَةٌ وَلَا بَيْعٌ عَن ذِكْرِ اللَّهِ وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ ۙ يَخَافُونَ يَوْمًا تَتَقَلَّبُ فِيهِ الْقُلُوبُ وَالْأَبْصَارُ
(కొందరు) పురుషులు. వర్తకంగానీ, క్రయవిక్రయాలుగానీ అల్లాహ్‌ నామస్మరణ, నమాజు స్థాపన, జకాత్‌ చెల్లింపు విషయంలో వారిని పరధ్యానానికి లోను చేయలేవు. ఏ రోజున హృదయాలు తలక్రిందులై, కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడుతూ ఉంటారు.(24:37)

ఈ ఆయత్ యొక్క అర్థాన్ని మనం గమనించాలి. కొంతమంది ఎలా ఉంటారు? వారిని వారి వర్తకం గానీ, వ్యాపారం, క్రయ విక్రయాలు గానీ అల్లాహ్ నామ స్మరణ, నమాజు స్థాపన, జకాత్ చెల్లింపు విషయంలో పరధ్యానానికి లోను చేయలేవు. అంటే మనిషి చేసే వ్యాపారాలు, క్రయ విక్రయాలు, ఉద్యోగాలు అతని జీవితంలో వస్తూ పోయే సమస్యలు, బాధ్యతలు ఇవన్నీ ఆ విశ్వాసిని, ఆ వ్యక్తుల్ని మస్జిద్ కి పోయి జమాత్ తో నమాజ్ చేయటం లేదా జిక్ర్ చేయటం, అల్లాహ్ ను ఆరాధించటం, జకాత్ ఇవ్వటం వీటిని వారి జీవన సమస్యలు ఆపలేవు. ఎందుకు? ఏ రోజున హృదయాలు తలక్రిందులై కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడతారు. అంటే ప్రళయం గురించి, అల్లాహ్ శిక్ష గురించి వారు భయపడతారు.

لِيَجْزِيَهُمُ اللَّهُ أَحْسَنَ مَا عَمِلُوا وَيَزِيدَهُم مِّن فَضْلِهِ ۗ وَاللَّهُ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ
తమ సత్కార్యాలకు అల్లాహ్‌ ఉత్తమ ప్రతిఫలం ఇవ్వటానికి, అల్లాహ్‌ తన కృపతో మరింత అధికంగా వొసగటానికి (వారు ఈ విధంగా మసలుకుంటారు). అల్లాహ్‌ తాను తలచిన వారికి లెక్క లేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు.(24:38)

అభిమాన సోదరులారా, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ గురించి ఇంకా ఇలా సెలవిచ్చారు,

وَمَا اجْتَمَعَ قَوْمٌ فِي بَيْتٍ مِنْ بُيُوتِ اللهِ يَتْلُونَ كِتَابَ اللهِ وَيَتَدَارَسُونَهُ بَيْنَهُمْ إِلاَّ نَزَلَتْ عَلَيْهِمُ السَّكِينَةُ وَغَشِيَتْهُمُ الرَّحْمَةُ وَحَفَّتْهُمُ الْمَلاَئِكَةُ وَذَكَرَهُمُ اللهُ فِيمَنْ عِنْدَهُ
[వ మజ్ తమ’అ ఖౌమున్ ఫీ బైతిన్ మిన్ బుయూతిల్లాహ్, యత్లూన కితాబల్లాహ్, వ యతదారసూనహూ బైనహుమ్, ఇల్లా నజలత్ అలైహిముస్ సకీనతు, వ గషియతుహుముర్ రహ్మతు, వ హఫ్ఫత్ హుముల్ మలాఇకతు, వ దకరహుముల్లాహు ఫీమన్ ఇందహ్]

అల్లాహ్ గృహాలలోని ఏదైనా ఒక గృహంలో కొంతమంది గుమికూడి దైవ గ్రంథాన్ని పారాయణం చేస్తూ, దాని గురించి పరస్పరం చర్చించుకుంటూ ఉంటే, అల్లాహ్ తరపున నుండి వారి మీద ప్రశాంతత, సకీనత్, ఆవరిస్తుంది. అలాగే రహ్మత్, దైవ కారుణ్యం వారిని కమ్ముకుంటుంది. అలాగే దైవదూతలు వారిని చుట్టుముడతారు. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన ఆస్థానములోని అంటే దైవదూతల మధ్య వారిని పరిచయం చేస్తాడు” (ముస్లిం)

ఇది ఎవరైతే మస్జిద్ లో ఖురాన్ పఠిస్తారో, ఖురాన్ నేర్చుకుంటారో, ఖురాన్ గురించి చర్చించుకుంటారో, దీన్ గురించి నేర్చుకుంటారో, నేర్పుతారో అటువంటి వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గొప్ప ప్రతిఫలం ఇస్తున్నాడు. ఈ ఆయత్ లో నాలుగు విషయాలు ఉన్నాయి. ఒకటి వారి జీవితాలలో వారికి ప్రశాంతత. ఇది డబ్బుతో కొనలేము. ప్రశాంతత ఇది విలువైన, గొప్ప వరం ఇది. రెండవది ఏమిటి? కారుణ్యం. అల్లాహ్ కరుణ లేకపోతే మన జీవితం దుర్భరమైపోతుంది. ఇహము పోతుంది పరము పోతుంది. మూడవది ఏమిటి? దైవదూతలు ప్రేమిస్తారు. నాలుగవది ఏమిటి? సకల లోకాలకు సృష్టికర్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రబ్బుల్ ఆలమీన్ ఆయన దైవ దూతల మధ్య వారి పరిచయం చేస్తాడు. ఎంత అదృష్టవంతులు వారు.

ఇంకా అల్లాహ్ యే ఇలా సెలవిచ్చాడు, మస్జిద్ లను ఆబాద్ చేయాలి. అంటే మస్జిద్ లు ఆబాద్ చేయటం అంటే ఏమిటి? మస్జిద్ లు నిర్మించాలి. య’అముర్ అంటే మస్జిద్ ను ఆబాద్ చేయటం, మస్జిద్ ని నిర్మించటం. దానికి అసలు అర్థం ఏమిటి స్వయంగా అల్లాహ్ సెలవిచ్చాడు.

إِنَّمَا يَعْمُرُ مَسَاجِدَ اللَّهِ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَلَمْ يَخْشَ إِلَّا اللَّهَ ۖ فَعَسَىٰ أُولَٰئِكَ أَن يَكُونُوا مِنَ الْمُهْتَدِينَ
అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ విశ్వసిస్తూ, నమాజులను నెలకొల్పుతూ, జకాత్‌ను విధిగా చెల్లిస్తూ, అల్లాహ్‌కు తప్ప వేరొకరికి భయపడనివారు మాత్రమే అల్లాహ్‌ మస్జిదుల నిర్వహణకు తగినవారు. సన్మార్గ భాగ్యం పొందినవారు వీరేనని ఆశించవచ్చు.(9:18)

అంటే మస్జిదుల నిర్వహణకి తగిన వారు, మస్జిదులను ఆబాద్ చేసే వారు ఎవరు? ఈ గుణాలు అల్లాహ్ సెలవిచ్చాడు. అంటే సన్మార్గ భాగ్యం పొందిన వారు కూడా వీళ్ళే అని అల్లాహ్ అంటున్నాడు. అంటే ఈ ఆయత్ లో మస్జిదులను ఆబాద్ చేసే వారి గుణాలు అల్లాహ్ తెలియజేశాడు.

మొదటి గుణం ఏమిటి? వారు అల్లాహ్ ను విశ్వసిస్తారు. అల్లాహ్ పట్ల దృఢమైన, నిజమైన, వాస్తవమైన విశ్వాసం కలిగి ఉంటారు. రెండవది ఏమిటి? వారు అంతిమ దినాన్ని విశ్వసిస్తారు. ఒక రోజు నేను చనిపోవాల్సిందే, ఈ ప్రపంచం అంతం అవ్వాల్సిందే, చనిపోయిన తరువాత అల్లాహ్ కు లెక్క చూపించాల్సిందే, లెక్కల గడియ వస్తుంది, తీర్పు దినం వస్తుంది, ఆ అంతిమ దినం పట్ల విశ్వసిస్తాడు రెండవది. మూడవది ఏమిటి? నమాజులు చేస్తారు, నమాజులు పాటిస్తారు. నాలుగోది జకాత్ విధిగా చెల్లిస్తారు. ఐదవది ఏమిటి? అల్లాహ్ కు మాత్రమే భయపడతారు. ఇది గమనించాల్సిన విషయం ఇది. జీవితం, ప్రాపంచిక జీవితం యొక్క ప్రేమలో పడిపోయి చాలామంది అల్లాహ్ కు తప్ప ప్రతి ఒక్కరితో భయపడుతున్నారు. మనలో చాలా మంది జీవితం ఇలా అయిపోయింది ప్రతిదానికి భయపడటం అల్లాహ్ కు తప్ప. అల్లాహ్ ఏమంటున్నాడు? అల్లాహ్ కు మాత్రమే భయపడండి, వేరే వారితో భయపడకండి. మస్జిద్ ను ఆబాద్ చేసేవారు ఎవరు? నాలుగవ వారు అల్లాహ్ ను మాత్రమే భయపడతారు. వ లమ్ యఖ్ష ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప ఎవ్వరికీ భయపడరు.

ఈ గుణాలు కలిగిన వారికి అల్లాహ్ ఏమంటున్నాడు? య’అమురు మసాజిదల్లాహ్. వీళ్లే మసాజిద్ లను ఆబాద్ చేసేవారు, నిర్వహణకు తగిన వారు. ఇంకా చివరి వాక్యంలో అల్లాహ్ ఏమన్నాడు? ఫ’అసా ఉలాఇక అన్ యకూనూ మినల్ ముహ్తదీన్. సన్మార్గ భాగ్యం, హిదాయత్ ప్రసాదించబడిన వారు వీరేనని ఆశించవచ్చు. ఇది అసలైన అర్థం మస్జిదులను ఆబాద్ చేయటం అంటే.

ఇక అభిమాన సోదరులారా, ఇప్పుడు వరకు మనం మస్జిద్ గురించి, మస్జిద్ స్థానం గురించి, మస్జిద్ నిర్వహణ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మన జీవన విధానం అలా ఉందా? మస్జిదుల విషయంలో. మస్జిదులు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాయి? వాస్తవంగా మస్జిదులను మనం ఆబాద్ చేస్తున్నామా? మస్జిదులకు సంబంధించిన ఆదాబులు పాటిస్తున్నామా? మస్జిదుల హక్కులు పూర్తి చేస్తున్నామా? మనలోని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

ను వేరే విషయానికి వస్తున్నాను, మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు,

مَنْ بَنَى مَسْجِدًا لِلَّهِ بَنَى اللَّهُ لَهُ فِي الْجَنَّةِ مِثْلَهُ
“మన్ బనా లిల్లాహి మస్జిదన్, బనల్లాహు లహూ బైతన్ ఫిల్ జన్నహ్.”
ఎవరైనా అల్లాహ్ కోసం మస్జిద్ ను నిర్మిస్తే, అల్లాహ్ అతని కోసం స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు.

ఇక్కడ ఒక ప్రశ్న మనసులో రావచ్చు, ప్రతి ఒక్కరికీ ఒక మస్జిద్ నిర్మించే స్తోమత ఉంటుందా? ఆర్థికపరంగా. ఇన్నమల్ అ’అమాలు బిన్నియ్యాత్. కర్మల పరంగా అల్లాహ్ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. కర్మలు సంకల్పాలపై ఆధారపడి ఉన్నాయి. అందుకు ప్రతి వ్యక్తికి ఈ స్తోమత ఉండదు. కానీ ప్రతి వ్యక్తి మస్జిద్ నిర్మాణంలో పాలు పంచుకొనవచ్చు, తన శక్తి ప్రకారం.

అలాగే, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

أَحَبُّ الْبِلَادِ إِلَى اللَّهِ مَسَاجِدُهَا، وَأَبْغَضُ الْبِلَادِ إِلَى اللَّهِ أَسْوَاقُهَا
“అహబ్బుల్ బిలాది ఇలల్లాహి మసాజిదుహా వ అబ్గదుల్ బిలాది ఇలల్లాహి అస్వాకుహా.”
అల్లాహ్ దృష్టిలో అన్ని చోట్లలలో కెల్లా అత్యంత ప్రీతికరమైన, శ్రేయస్కరమైన చోటు మస్జిద్. అలాగే అల్లాహ్ దృష్టిలో అన్ని చోట్లలలో కెల్లా అత్యంత హానికరమైన చోటు బజారు

ఈ హదీస్ మనం మనసులో ఉంచుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు మన మస్జిదులు అలా ఉన్నాయా? అత్యంత శ్రేష్టకరమైన, పవిత్రమైన, ప్రీతికరమైన ఉన్నాయా? అల్లాహ్ దృష్టిలో ఉంది, అల్లాహ్ అంటున్నాడు అన్నిటికంటే శ్రేష్టమైన, శ్రేయస్కరమైన, ప్రీతికరమైన, పవిత్రమైన చోటు, స్థలం, కేంద్రం మస్జిద్ అని. కానీ ఇప్పుడు మన మస్జిదులు గీబత్ కి కేంద్రం, చాడీలకి కేంద్రం, ఖియానత్ కి కేంద్రం, లావాదేవీలకి కేంద్రం, రాజకీయాలకు కేంద్రం, ఇలా మారిపోయినాయి. కానీ అత్యంత హానికరమైన, మంచిది కాని స్థలం బజారు. కానీ మనము సహాబాలు, తాబయీన్లు, మన పూర్వీకుల జీవితాలు మనము వారి చరిత్ర చదివితే, వారు బజార్లను, అస్వాఖ్ లను, మస్జిదులుగా మార్చేసేవారు. వారి జీవన విధానం అలా ఉండేది. కొంతమంది సహాబాలు బజార్ కి సోదరులు, ముస్లిములు, తెలిసిన వారు, తెలియని వారు, ఇరుగు పొరుగు వారు కనపడతారేమో, సలాం చెప్దామన్న ఉద్దేశంతో పోయేవారు. అంటే మన పూర్వీకులు హానికరమైన స్థలాన్ని పవిత్రంగా చేసేసారు, అనగా మస్జిద్ గా చేసేసారు, పవిత్రంగా చేసేసేవారు. ఇప్పుడు మనం మస్జిద్ ని సూఖ్ లాగా, బజార్ లాగా చేసేస్తున్నాము. ఈ విషయంలో మనము పరిశీలించాలి, జాగ్రత్తగా ఉండాలి.

అభిమాన సోదరులారా, అలాగే రేపు ప్రళయ దినాన – ఈ హదీస్ మనందరం ఎన్నోసార్లు విన్నాము,

 سَبْعَةٌ يُظِلُّهُمُ اللَّهُ فِي ظِلِّهِ يَوْمَ لاَ ظِلَّ إِلاَّ ظِلُّهُ
సబ్’అతున్ యుదిల్లుహుముల్లాహు ఫీ దిల్లిహీ యౌమ లా దిల్లా ఇల్లా దిల్లుహ్
రేపు ప్రళయ దినాన ఏడు రకాల వ్యక్తులకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన నీడను ప్రసాదిస్తాడు. ఆ రోజు అల్లాహ్ నీడ తప్ప ఏ నీడా ఉండదు.

ఆ ఏడు రకాల వ్యక్తులలో ఒకరు ఎవరు?

رَجُلٌ قَلْبُهُ مُعَلَّقٌ فِي الْمَسَاجِدِ
రజులున్ ఖల్బుహూ ము’అల్లఖున్ ఫిల్ మసాజిద్.
ఏ వ్యక్తి యొక్క హృదయం, ఏ వ్యక్తి యొక్క మనసు మస్జిద్ లో ఉంటుందో, అంటే వారి మనసు మస్జిద్ లోకి నిమగ్నులై ఉంటాయి.

ఇది మస్జిద్ అంటే.

అలాగే, మనిషి తన ఇంట్లో లేక వీధిలో చేసే నమాజ్ కన్నా జమాఅత్ తో చేసే నమాజుకు పాతిక రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని హదీస్ లో ఉంది. ఈ విధంగా ఎక్కువ రెట్లు పుణ్యం లభించడానికి కారణం ఏమిటంటే, మనిషి చక్కగా వుజూ చేసుకొని, కేవలం నమాజు చేసే ఉద్దేశ్యంతో వెళ్తుంటే, ఆ సమయంలో అతను వేసే ప్రతి అడుగుకు అల్లాహ్ ఒక్కొక్కటి చొప్పున అతని అంతస్తులను పెంచుతాడు. అంతే కాదు, అతని వల్ల జరిగే పాపాలను కూడా ఒక్కొక్కటిగా తుడిచి పెట్టేస్తాడు. అతను నమాజ్ చేస్తూ వుజూతో ఉన్నంత వరకు దైవదూతలు అతని మీద శాంతి కురవాలని ప్రార్థిస్తూ, ఓ అల్లాహ్ ఇతనిపై శాంతి కురిపించు, ఓ అల్లాహ్ ఇతన్ని కనికరించు అని అంటూ ఉంటారు.

మస్జిద్ లో ప్రవేశించిన తర్వాత జమాత్ నమాజు కోసం అతను ఎంతసేపు నిరీక్షిస్తాడో, ఎదురు చూస్తూ ఉంటాడో, అంతసేపు అతను నమాజులో ఉన్నట్లుగానే పరిగణించబడతాడు. అల్లాహు అక్బర్. ఒక వ్యక్తి అరగంట ముందు మస్జిద్ కి పోయాడు, ఇరవై నిమిషాల ముందు మస్జిద్ కి పోయాడు, నమాజ్ కోసం వేచి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు జమాత్ కోసం, అంటే ఈ ఎంత సేపు అతను ఎదురు చూస్తున్నాడో అంత సేపు అతను ఎక్కడ ఉన్నాడు? నమాజ్ లోనే ఉన్నాడు. నమాజ్ చేస్తున్నాడు. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు.

ఈ విధంగా మస్జిద్, మస్జిద్ స్థానం, మరియు మన పూర్వీకులు దాని గురించి చాలా వివరాలు ఉన్నాయి. మనము సహాబాల, తాబయీన్ ల చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది. ఉదాహరణగా ఒక్క విషయం చెబుతున్నాను. అన్నిటికంటే అత్యధికంగా హదీసులు చెప్పిన వారు, రివాయత్ చేసిన వారు, అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు. ఆయన పాఠశాల ఏది? మస్జిద్. ఆయన చదువుకున్న యూనివర్సిటీ ఏది? మస్జిద్. ఆయనకి తినటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఒకసారి ఆయన వారి రోషం ఎటువంటిది అంటే అవసరం ఉన్నా కూడా చెయ్యి చాపేవారు కాదు. రెండు మూడు రోజులు అయిపోయింది, అన్నం తినలేదు. అడగటానికి బుద్ధి పుట్టటం లేదు. ఆయన మస్జిద్ బయట వీధిలో ఏ ఉద్దేశంతో పోయారు? సహాబాలు కనపడతారు, వారికి సలాం చెప్తే నన్ను చూసి, నా ముఖాన్ని చూసి వారు అర్థం చేసుకుంటారు అని ఉద్దేశంతో వీధిలో పోయి నిలబడితే అబూబకర్ రదియల్లాహు అన్హు వచ్చారు. ఇది నేను పూర్తి వివరంగా చెప్పదలచలేదు సమయం లేదు. అబూబకర్ కి ఆయన సలాం చెప్తే అబూబకర్ రదియల్లాహు అన్హు వఅలైకుం సలాం చెప్పి ముందుకు సాగిపోయారు. ఆయన బాధపడ్డారు మనసులో. ఆ తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ వచ్చారు రదియల్లాహు అన్హు. ఆయన కూడా వఅలైకుం సలాం చెప్పి ముందుకు సాగిపోయారు. ఈయన మనసులో కుమిలిపోతున్నారు, బాధపడిపోతున్నారు. నా ముఖం వారు గమనించలేదా? నన్ను వారు పట్టించుకోవటం లేదా? అని చెప్పి. ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. చిరునవ్వుతో వఅలైకుం సలాం చెప్పి తోడుగా తీసుకుపోయారు. తీసుకుని పోయి ఇంట్లో ఏముంది అని అడిగితే కొంచెం పాలు ఉంది. అబూ హురైరా మనసులో సంతోషం. పండగ మనసులో. ఈరోజు నాకు పండగ, పాలు దక్కింది అని చెప్పి. అప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ అబూ హురైరా, ఇంకా మస్జిద్ లో ఎంత మంది ఉన్నారు అని అడిగారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు మనసులో కొంచెం పాలు, ప్రవక్త గారు ఇలా అడుగుతున్నారు ఇంత మంది వచ్చేస్తే నాకు ఏం మిగులుతుంది అని మనసులో బాధ. పోయి పిలుచుకొని రా. దాదాపు ఒక 20, 30 మంది వచ్చారు. ఇప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హు ఓకే అల్హందులిల్లాహ్ కొంచెమైనా సరే వస్తుంది అనుకున్నారు. అప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హుతో, అందరికీ పంచు అని చెప్పారు. అప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హు మనసు, అందరికీ నేను పంచాలా? అంటే లాస్ట్ లో ఎవరు తాగాలి నేను. మిగులుతుందా మిగలదా? ఆ తర్వాత అందరికీ పంచారు. అందరూ కడుపు నిండా తాగారు. ఓ అబూ హురైరా, ఇంకా ఎవరున్నారు? ఓ ప్రవక్త నేను మీరు ఇద్దరే ఉన్నాం ప్రవక్త అంటే, నువ్వు తాగు అని చెప్పారు. అబూ హురైరా తాగారు. ప్రవక్రా నేను తాగేసాను. ఇంకోసారి తాగు. ఇంకోసారి తాగు. మూడు సార్లు తాగారు. నాలుగోసారి, దైవప్రవక్త ఇంకా ఇంకోసారి తాగండి అంటే, ఓ దైవప్రవక్త, ఇక్కడ వరకు వచ్చేసింది, ఇప్పుడు తాగలేను. ఆ తర్వాత ప్రవక్త గారు తాగారు. ఇది మోజిజా (మహిమ) . చెప్పటం ఏమిటంటే అటువంటి సహాబీ, ఇల్లు లేని సహాబీ, గృహం లేని సహాబీ, ఆర్థిక పరంగా ఏమీ లేని సహాబీ, వారి విశ్వవిద్యాలయం మస్జిద్, వారి పాఠశాల మస్జిద్, వారి శిక్షణా కేంద్రం మస్జిద్. అందరికంటే అత్యధికంగా హదీసులు రివాయత్ చేశారు అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు. అంత పేదరికంలో ఒకసారి ప్రవక్త గారు వరాన్ని ప్రసాదించారు. ఏం కోరుకుంటావు కోరుకో అని. అప్పుడు ఆయన జ్ఞానాన్ని కోరుకున్నారు. మెమరీ శక్తిని కోరుకున్నారు. ప్రపంచాన్ని కోరుకోలే, ఇల్లుని కోరుకోలే, ధనాన్ని కోరుకోలే. ఇల్లు లేదు ఉండటానికి, దుస్తులు లేవు. అటువంటి స్థితిలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇమాముల్ అంబియా, ఎన్నో వందల గొర్రెలు దానం చేసిన వారు. అడిగిన వారికి ఇచ్చేసేవారు. అటువంటి ఇమామ్-ఏ-కాయినాత్ అడుగుతున్నారు, ఓ అబూ హురైరా ఏం కావాలా అని చెప్పి. దానికి అబూ హురైరా, ఆ పేదవాడు ఏం కోరుకున్నారు? జ్ఞానం కోరారు, ఇల్మ్ కోరారు, జ్ఞాపక శక్తి కోరారు. అందుకోసమే ఆయన ఏమి రాసినా, ఏమి విన్నా ఆయన మనసులో అలాగే ఉండిపోయేది. అందరికంటే ఎక్కువగా హదీసులు ఆయనే రివాయత్ చేశారు.

కావున అభిమాన సోదరులారా సమయం అయిపోయింది, మస్జిద్ కి సంబంధించిన కొన్ని ఆదాబులు తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి.

ఒకటి, దుఆ చేస్తూ సలాం చెబుతూ మస్జిద్ లోకి ప్రవేశించాలి (అల్లాహుమ్మఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక్). రాని వారు నేర్చుకోవాలి. తహియ్యతుల్ మస్జిద్ చేసుకోవాలి పోయిన తర్వాత. అలాగే ఉల్లిపాయలు, తెల్ల ఉల్లిపాయలు, ఇంకా ఏ పదార్థాల వల్ల తినటం వల్ల నోటిలో దుర్వాసన వస్తుందో వాటిని తిని రాకూడదు. ఒకవేళ తిన్న యెడల బ్రష్ చేసుకొని ముఖంలో ఎటువంటి దుర్వాసన లేకుండా చూసుకొని ఆ తర్వాత మస్జిద్ కి రావాలి. ఎందుకంటే ప్రవక్తగారు సెలవిచ్చారు, దేని వల్ల మనిషి బాధపడతాడో, దేని వల్లకి మనిషికి కష్టం కలుగుతుందో, దైవదూతలు కూడా బాధపడతారు అని చెప్పారు. అలాగే మస్జిద్ ను పరిశుభ్రంగా ఉంచాలి, నిశ్శబ్దంగా కూర్చొని భయభక్తులు గలవారై అల్లాహ్ స్మరణ చేయాలి. ప్రశాంతంగా కూర్చోవాలి. గోల చేయడం, పరిహాసాలాడటం, లావాదేవీలు జరపటం, మస్జిద్ ని అగౌరవపరిచినట్లు అవుతుంది. మస్జిద్ ను వచ్చిపోయే మార్గంగా చేసుకోకూడదు. ప్రవేశించాక నమాజ్ చేయడమో, పారాయణం చేయడమో, జిక్ర్ చేయడమో, ఆరాధించడం చేయాలే గానీ, ఇదే మస్జిద్ కి హక్కు. అలాగే మస్జిద్ నుంచి పోయేటప్పుడు అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫద్లిక్ అనే దుఆ చేసుకుంటూ పోవాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించు గాక. ఆమీన్. వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42432

తాగూత్ (الطَّاغُوتِ) & దాని యొక్క రకాలు [వీడియో & టెక్స్ట్]

తాగూత్ & దాని యొక్క రకాలు
త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ
youtube.com/watch?v=rzm66iOZUwg [22 నిముషాలు]

ఈ పాఠంలో, వక్త ‘తాగూత్’ అనే విషయాన్ని వివరిస్తారు. అల్లాహ్‌ను కాకుండా ఆరాధించబడే ప్రతిదాన్ని ‘తాగూత్’ అంటారు. ప్రతి ఒక్కరూ తాగూత్‌ను తిరస్కరించి, అల్లాహ్‌ను మాత్రమే విశ్వసించాలని ఇస్లాం నిర్దేశిస్తుందని వక్త పేర్కొన్నారు. ఇమామ్ ఇబ్న్ అల్-ఖయ్యిమ్ నిర్వచనం ప్రకారం, ఆరాధన, విధేయత లేదా అనుసరణలో మానవుడు తన పరిధిని దాటడానికి కారణమయ్యేది తాగూత్. ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్ద్ అల్-వహాబ్ ప్రకారం, ఐదు ప్రధాన తాగూత్‌లు ఉన్నాయి: 1. ఇబ్లీస్ (సైతాన్), 2. తన ఆరాధన పట్ల సంతోషించేవాడు, 3. తనను ఆరాధించమని ప్రజలను పిలిచేవాడు, 4. అగోచర జ్ఞానం ఉందని చెప్పుకునేవాడు, 5. అల్లాహ్ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా తీర్పు చెప్పేవాడు. చివరగా, “ధర్మానికి శిరస్సు ఇస్లాం, దాని స్తంభం నమాజ్, మరియు దాని శిఖరం జిహాద్” అనే హదీస్‌తో వక్త పాఠాన్ని ముగించారు.

భర్త నమాజు చదవడం లేదు, తావీజు ధరిస్తున్నాడు, షిర్క్ చేస్తున్నాడు, ఇటువంటి సమయంలో విశ్వాసురాలైన భార్య ఏమి చెయ్యాలి? [ఆడియో]

భర్త నమాజు చదవడం లేదు, తావీజు ధరిస్తున్నాడు, షిర్క్ చేస్తున్నాడు,
ఇటువంటి సమయంలో విశ్వాసురాలైన భార్య ఏమి చెయ్యాలి?
https://youtu.be/HORMsPWKEDQ [7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, భర్త నమాజుకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, మెడలో తాయెత్తులు వేసుకుంటూ, దర్గాల వద్దకు వెళ్తూ షిర్క్ చేస్తున్నప్పుడు, తౌహీద్ మరియు సున్నత్ ప్రకారం జీవించాలనుకునే భార్య అతని నుండి ఖులా (విడాకులు) తీసుకోవచ్చా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. దర్గాలకు వెళ్లడం, తాయెత్తులు ధరించడం వంటివి షిర్క్ వరకు తీసుకెళ్లే తీవ్రమైన పాపాలని, ఖురాన్ ఆయతుల ఆధారంగా వివరించబడింది. ముఖ్యంగా అల్లాహ్ ను కాకుండా ఇతరులను ప్రార్థించడం, ఇతరులకు సజ్దా చేయడం స్పష్టమైన షిర్క్. అలాగే, నమాజును నిర్లక్ష్యం చేయడం లేదా వదిలివేయడం కూడా చాలా పెద్ద పాపమని, అది కుఫ్ర్ వరకు వెళ్ళవచ్చని హెచ్చరించబడింది. భర్త ఈ పాపాలనుండి పశ్చాత్తాపపడకపోతే, భార్య ఖులా తీసుకోవడం ధర్మసమ్మతమని పండితులు అభిప్రాయపడతారని, అయితే ఓపికతో అతనికి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేయవచ్చని, కానీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని సలహా ఇవ్వబడింది.

భర్త ఏ మాత్రం నమాజుకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, మెడలో తాయీజులు వేసుకుంటూ దర్గాల వద్దకు వెళ్తూ ఉంటాడు. భార్య ఇస్లాం యొక్క ప్రేమికురాలు, తౌహీద్ మరియు సున్నత్ ప్రకారంగా జీవితం గడపాలనుకుంటుంది. అయితే ఆ భర్త, ఆ భర్త నుండి ఖులా తీసుకోవడానికి, వేరుకోవడానికి ఇస్లాంలో ఏదైనా అనుమతి ఉందా అని మీరు అడిగారు.

వాస్తవానికి చూసేది ఉంటే, మనిషి దర్గాలకు వెళ్లి అక్కడ అల్లాహ్ కు చేయబడే అటువంటి కొన్ని ఆరాధనలు అక్కడ చేస్తున్నాడు, తాయీదులు వేసుకుంటున్నాడు, ఇవి రెండూ కూడా షిర్క్ వరకు తీసుకెళ్లే పాపాలు.

దర్గా కాడికి వెళ్లి డైరెక్ట్ దర్గా వారితో దుఆ చేస్తే, దర్గా వారికి సజ్దా చేస్తే, అల్లాహ్ అలాంటి పరిస్థితి నుండి మనందరినీ కాపాడుగాక, షిర్క్ చేసినవాడైపోతాడు. అల్లాహ్ త’ఆలా చాలా స్పష్టంగా చెప్పాడు.

وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ
(వస్ జుదూ లిల్లా హిల్లాజి ఖలకహున్)
వాటిని సృష్టించిన అల్లాహ్‌కే సాష్టాంగపడండి. (41:37)

భూమి ఆకాశాలు, సూర్య చంద్రాలు ఇంకా ఈ సృష్టి అంతటినీ సృష్టించిన ఆ ఏకైక అల్లాహ్ కు మాత్రమే మీరు సజ్దా చేయండి.

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ
(వ కాల రబ్బుకుముద్ ఊని అస్తజిబ్ లకుం)
మీ ప్రభువు అంటున్నాడు: “నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. (40:60)

మీ ప్రభువు మీతో చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు నన్ను మాత్రమే అర్థించండి, నాతో మాత్రమే దుఆ చేయండి, నేను మీ దుఆలను అంగీకరిస్తాను.

ఇంత స్పష్టమైన ఆయతులు ఉన్నప్పటికీ మనిషి దర్గాల కాడికి వెళ్లి ఇలాంటి పనులు చేస్తున్నాడంటే స్పష్టమైన షిర్క్ కు గురి అవుతున్నాడు. ఇక ఆ మనిషి అల్లాహ్ ను నమ్ముతూ, ప్రవక్తను నమ్ముతూ, పరలోక దినాన్ని నమ్ముతూ నమాజులు చేస్తూ ఇదే పెద్దలు చేసిన్లు మా ఊర్లో, నేను ఎక్కడా ఇంకా బయటికి వెళ్ళలేదు ఏమీ వేరేది చూడలేదు, దీనినే నిజమైన ఆరాధన అనుకుంటున్నాను అన్నటువంటి భ్రమలో ఉండి ఉంటే, అల్లాహ్ అలాంటి వ్యక్తితో ఎలా మసులుకుంటాడో కరుణాకటాక్షాలతో లేదా ఇంకా వేరే ఏదైనా పరీక్ష తీసుకుంటాడా అది వేరే విషయం. కానీ ఈనాటి కాలంలో నెట్ ద్వారా, మొబైల్ ల ద్వారా సత్యం అనేది ఎంత ప్రస్ఫుటమవుతుంది, అయినా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఇలాంటి షిర్క్ పనికి లోనవుతూ ఉంటే ఇది చాలా భయంకరమైన విషయం.

భార్య వాస్తవానికి ఇస్లాం ప్రకారంగా జీవితం గడపాలనుకుంటుంది అంటే ముందు భర్తను ఇలాంటి షిర్క్ పనుల గురించి ప్రేమగా, మంచి విధంగా, ఆధారాలు చూపుతూ ఇవి తప్పు అని తప్పకుండా తెలియజేస్తూ ఉండాలి.

దీనిపై ఇంకా తాయీదులు వేసుకుంటున్నారు అంటే ఈ రోజుల్లో దర్గాల వద్ద నుండి వేరే కొందరు మౌల్సాబుల నుండి ఏదైతే తాయీదులు ఇవ్వడం జరుగుతున్నాయో, సర్వసాధారణంగా ప్రజలు ఆ తాయీదుల మీదనే మొత్తం నమ్మకం ఉంచుతున్నారు. చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఎందరితోనో మనం మాట్లాడి, ఎంతో ప్రేమగా దీని గురించి చెప్పి తీయించాలని ప్రయత్నం చేస్తే, అయ్యో వద్దండి వద్దండి ఇది తీసేస్తుంటే ఖలాస్ ఇక నా ప్రాణం పోతది, లేదు నాకు మళ్లీ కడుపునొప్పి మొదలైపోతది, ఇక ఇది తీసేది ఉంటే నేను మళ్ళీ అనారోగ్యానికి గురైపోతాను అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఇది కేవలం ఒక చిన్న సబబుగా అల్లాహ్ యే షఫా ఇచ్చేవాడు అన్నటువంటి సంపూర్ణ నమ్మకం లేదు. దీనిమీదనే, ఈ తాయీదుల మీదనే నమ్మకం ఉన్నది. మరి ఇలాంటి ఈ నమ్మకాన్ని కూడా పెద్ద షిర్క్ లో పడవేసేది అని ఖురాన్ హదీస్ ఆయతుల ద్వారా ధర్మ పండితులు చెప్పి ఉన్నారు.

దీనికంటే కరేలా నీమ్ చడా అన్నట్టుగా ఇంకా ఘోరమైన విషయం మీరు తెలిపింది ఏమిటంటే ఆ భర్త నమాజుకు ప్రాముఖ్యత ఏమీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఒక విషయం గమనించాల్సి ఉంటుంది. అదేమిటంటే నమాజుకు ఏదైనా ఎప్పుడైనా బద్ధకంతో వెళ్లకపోతే అదే చాలా ప్రమాదకరమైన విషయం అని ఖురాన్ హదీసులో చెప్పడం జరిగింది.

ఉదాహరణకు మీరు గమనించండి, ఒక చిన్న సూరాలో అంటే సూరతుల్ మాఊన్ లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు,

فَوَيْلٌ لِلْمُصَلِّينَ
(ఫ వైలుల్ లిల్ ముసల్లీన్)
వయిల్ (అధోలోకం) ఉన్నది ఆ నమాజీల కొరకు, (107:4)

الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ سَاهُونَ
(అల్లజీనహుం అన్ సలాతిహిం సాహూన్)
ఎవరయితే తమ నమాజుల పట్ల ఏమరుపాటుగా ఉంటారో, (107:5)

ఎవరైతే నమాజు బద్ధకంగా చేస్తున్నారో, టైం యొక్క సమయపాలన లేకుండా, రుకున్ వాజిబాత్ ఇంకా సున్నత్ ప్రకారంగా చేయకుండా, ఇష్టం వచ్చినప్పుడు చేస్తున్నాడు లేదా అంటే వదిలేస్తున్నాడు, ఇలా బద్ధకంగా చేసే వారి గురించే వినాశకరమైన వైల్ ఉన్నది అని అల్లాహ్ త’ఆలా హెచ్చరిస్తున్నాడు. అలాంటప్పుడు ఎవరైతే దానికి ప్రాముఖ్యతనే ఇవ్వరో, అయ్యో నమాజ్ చదవాలి అన్నటువంటి మనసులో ఒక తపన లేనే లేదో వారు ఇంకా ఎంత భయంకరమైన పాపములో పడి ఉన్నారో గమనించండి.

అయితే ఇలాంటి భార్య అతని నుండి ఆ భర్త నుండి ఖులా తీసుకోవచ్చా? ఎంతోమంది ధర్మపండితులు చెప్పే విషయం ఏమిటంటే ఇలాంటి షిర్క్ మరియు నమాజును వదిలేటువంటి కుఫ్ర్ పని నుండి అతను తోబా చేయకుంటే తప్పకుండా భార్య ఖులా తీసుకోవాలి.

కానీ మన చోట ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ భార్య ఇంకా దావత్ ఇస్తూ, భర్తకు నచ్చజెప్పుతూ ఓపిక కొంచెం వహించింది అంటే ఒకరకంగా మంచిది కావచ్చు. కానీ అలాగే ఉండిపోవడం, ఆ భర్త అంటే ఆమె పిల్లల యొక్క తండ్రి యొక్క శిక్షణలో ఈ పిల్లలు ఎలా ఎదుగుతారు అనే విషయంలో భార్య తప్పకుండా భయపడాలి. అల్లాహ్ తో అధికంగా దుఆ చేయాలి, అధికంగా దుఆ చేయాలి. అల్లాహ్ మనందరికీ సన్మార్గం ప్రసాదించుగాక. ఇస్లాంపై స్థిరంగా ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక.


తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

అల్లాహ్ సామీప్య మార్గాలు (వసీలా) – అబ్దుల్ గఫ్ఫార్ ఉమరీ [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ కు దగ్గర కావాలనుకుంటున్నారా? అల్లాహ్ ప్రేమించేవారిలో, ఇష్టపడేవారిలో చేరాలనుకుంటున్నారా? మరి అల్లాహ్ సామీప్యం పొందడానికి మార్గాలు ఏమిటి? అల్లాహ్ సామీప్యం పొందితే కలిగితే గొప్ప ప్రయోజనాలు ఏమిటి? తప్పక విని ప్రయోజనం పొందండి. మరియు మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి ఇన్ షా అల్లాహ్

అల్లాహ్ సామీప్య మార్గాలు
https://youtu.be/CiCtBSNqJAI [38 నిముషాలు]
వక్త: అబ్దుల్ గఫ్ఫార్ ఉమరీ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, అల్లాహ్ సామీప్యాన్ని (వసీలా) ఎలా పొందాలో ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. ప్రసంగం ప్రారంభంలో, విశ్వాసులు అల్లాహ్ సామీప్యాన్ని అన్వేషించాలని సూచించే ఖురాన్ ఆయతును ఉదహరించారు. అల్లాహ్ సామీప్యం పొందడానికి పది ముఖ్యమైన మార్గాలు వివరించబడ్డాయి: సమయానికి నమాజ్ చేయడం, ఫర్జ్ నమాజులతో పాటు సున్నత్ మరియు నఫిల్ నమాజులు అధికంగా చేయడం, అల్లాహ్ పట్ల విధేయత చూపడంలో ఉత్సాహం కలిగి ఉండటం, ఎల్లప్పుడూ అల్లాహ్ ను స్మరించడం (జిక్ర్), అల్లాహ్ ప్రసన్నత కోసం ఉపవాసం ఉండటం, చేసిన పాపాల పట్ల పశ్చాత్తాపం చెందడం, ఖురాన్ ను పారాయణం చేయడం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పంపడం, సజ్జనులతో స్నేహం చేయడం, మరియు పేదవారికి దానం చేయడం. ఈ మార్గాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి అల్లాహ్ కు ప్రియమైన వాడిగా మారి, అతని ప్రార్థనలు అంగీకరించబడతాయని మరియు ఇహపరలోకాలలో సాఫల్యం పొందుతాడని నొక్కి చెప్పబడింది.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బ’అద్.

ఫ అ’ఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్.

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
కరుణామయుడు, కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

سُبْحَٰنَكَ لَا عِلْمَ لَنَآ إِلَّا مَا عَلَّمْتَنَآ ۖ إِنَّكَ أَنتَ ٱلْعَلِيمُ ٱلْحَكِيمُ
(సుబ్ హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అన్తల్ అలీముల్ హకీమ్)
“(ఓ అల్లాహ్‌!) నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవూ నీవే!” (2:32)

వ ఖాలల్లాహు తబారక వ త’ఆలా

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ وَٱبْتَغُوٓا۟ إِلَيْهِ ٱلْوَسِيلَةَ
(యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ వబ్తగూ ఇలైహిల్ వసీలహ్)
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి.  (5:35)

ప్రియమైన సోదరులారా! సోదరీమణులారా! అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క కృతజ్ఞత, ఆయన దయతో ఈరోజు మనమంతా ఒక కొత్త అంశాన్ని తీసుకొని సమావేశమై ఉన్నాము. అల్లాహ్ తో దుఆ ఏమనగా, ఖురాన్ మరియు హదీసుల ప్రకారం ఏవైతే వాక్యాలు మనకు వినబడతాయో వాటిని అమలుపరిచే భాగ్యాన్ని అల్లాహ్ త’ఆలా మాకు ప్రసాదించు గాక. ఆమీన్. అలాగే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అందరినీ ఒకేచోట సమావేశపరుస్తున్న వారందరికీ అల్లాహ్ త’ఆలా మంచి ఫలితాన్ని ఇహపరలోకాలలో ప్రసాదించు గాక. ఆమీన్.

ప్రియమైన మిత్రులారా! ఖురాన్ గ్రంథంలోని ఒక ఆయత్.

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ وَٱبْتَغُوٓا۟ إِلَيْهِ ٱلْوَسِيلَةَ
(యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ వబ్తగూ ఇలైహిల్ వసీలహ్)
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. (5:35)

ఓ విశ్వాసులారా! అల్లాహ్ యొక్క సామీప్యాన్ని మీరు అన్వేషించండి అని అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథంలో సెలవిచ్చాడు.

ఈరోజు మన అంశం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సామీప్య మార్గాలు. అల్లాహ్ సామీప్యం ఎలా పొందగలము? వాటి యొక్క మార్గాలు ఏమిటి? దాని ఫలితంగా మనకు అల్లాహ్ త’ఆలా కల్పించే భాగ్యాలు ఏమిటి? దీనిపై ఈరోజు సవివరంగా మీ ముందు ఉంచబోతున్నాను.

సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్ తబారక వ త’ఆలా మనల్ని అందరినీ సృష్టించారు. సరైన మార్గం కూడా అల్లాహ్ తబారక వ త’ఆలా మాకు సూచించాడు. సర్వ జనుల్లో అనేకమంది అనేక అభిప్రాయాలు, అనేక ఆలోచనలతో జీవిస్తున్నారు. కొంతమందికి కొన్ని విషయాల వల్ల ప్రేమ, మరి కొంతమందికి కొన్ని విషయాల పట్ల ఆకర్షణ, మరికొంతమందికి కొన్ని విషయాల పట్ల సంతుష్టి ఉంటుంది. అయితే ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తబారక వ త’ఆలా ఏమి చెబుతున్నాడంటే, ఓ విశ్వాసులారా! నా యొక్క సామీప్యాన్ని మీరు అన్వేషించండి.

అల్లాహ్ యొక్క సామీప్యం ఎంతో ఉన్నతమైన స్థానం. విలువైన స్థానం. ఆ ఉన్నతమైన స్థానానికి, ఆ విలువైన స్థానానికి మనిషి చేరుకోగలిగితే, ఇక అక్కడి నుంచి అల్లాహ్ తబారక వ త’ఆలా ను ఆ మనిషి ఏది కోరుకుంటాడో, ఆ దాసుడు ఏది కోరుకుంటాడో దాన్ని అల్లాహ్ త’ఆలా ప్రసాదిస్తాడు. ఆ విలువైన స్థానం, ఆ విలువైన సామీప్యాన్ని పొందడానికి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక విషయాలు సూచించారు. ఆ సామీప్యం మనిషికి దొరికినట్లయితే ఆ మనిషి యొక్క విలువ కూడా పెరిగిపోతుంది. అతని భక్తి కూడా పెరిగిపోతుంది. అల్లాహ్ వద్ద ఉన్నత స్థానాల్లో ఉంటాడు.

అయితే ఆ సామీప్యం మనకు ఎలా లభిస్తుంది? దాని కోసం మనం ఎన్నుకోవలసిన మార్గాలు ఏమిటి? ఇది మీరు, మేము చెప్పుకుంటే వచ్చేది కాదు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ప్రవక్తా! మీకు ఏ దేవుడైతే, ఏ అల్లాహ్ అయితే మీకు ప్రవక్తగా చేసి పంపించాడో అతని సాక్షిగా నేను చెబుతున్నాను. అల్లాహ్ తబారక వ త’ఆలా మీకు అందజేసిన సందేశం ఏమిటో నాకు వివరించండి.

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, “షహాదతైన్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్.” దాన్ని “అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్.” నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప మరి నిజమైన ఏ దేవుడు లేడు. అలాగే నేను సాక్ష్యమిస్తున్నాను మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని. దీని తర్వాతే మిగతా విషయాలన్నీ అక్కడ వస్తాయి. ఆ వ్యక్తి దాన్ని విశ్వసించేవాడు. ఆ వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో అంటున్నాడు, రేయింబవళ్ళలో అల్లాహ్ తబారక వ త’ఆలా మాపై విధించిన విషయాలు ఏమిటో చెప్పండి.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఆదేశించారు. రేయింబవళ్ళలో అల్లాహ్ తబారక వ త’ఆలా మనపై విధించిన విషయం ఏమిటంటే, ఐదు పూటల నమాజు విధిగా అల్లాహ్ తబారక వ త’ఆలా చేశాడు. ఆ వ్యక్తి అన్నాడు, ప్రవక్తా! ఇంకేమైనా ఉందా? అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఐదు పూటల నమాజు తర్వాత నీకిష్టమైతే ఇంకా ఎక్కువైనా చదువుకోవచ్చు. ఆ తర్వాత ఆ వ్యక్తి అన్నాడు, ప్రవక్తా! అల్లాహ్ తబారక వ త’ఆలా మీకు అందజేసిన సందేశంలో ఇంకేమైనా చేయవలసి ఉంటే అది కూడా చెప్పండి. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రమజాన్ మాసములో ఉపవాసాలు ఉండుట, పూర్తి మాసంలో ఉపవాసాలు ఉండుట. ఆ వ్యక్తి అన్నాడు, ఇంకేమైనా ఉందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఆ పూర్తి మాసం తర్వాత నీకు ఇష్టమైతే మిగతా రోజుల్లో కూడా నువ్వు ఉపవాసాలు ఉండవచ్చు.

మీకు అందజేసిన ఆదేశాల్లో ఇంకేమైనా ఉందా అని అడిగాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, జకాత్ చెల్లించటం, సంవత్సరానికి ఒకసారి జకాత్ చెల్లించటం. ఈ విధంగా ఒక్కొక్క విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళు చాలా క్లుప్తంగా వివరించారు. అన్ని విషయాలు విన్న ఆ వ్యక్తి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అన్నాడు, ఓ ప్రవక్తా! ఏవైతే మీరు నాకు వినిపించారో, ఏవైతే సందేశం నాకు ఇచ్చారో ఆ సందేశంలో నేను రవ్వంత కూడా ఎక్కువ చేయను, రవ్వంత కూడా తగ్గించను. ఏదైతే నేను నాపై విధిగా ఉందో అది మాత్రమే నేను చేస్తాను. ఇంకా ఎక్కువ చేయను, ఇంకా తక్కువ చేయను అని ఆ వ్యక్తి పలకరించి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వెళ్తుండగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏదైతే ఈ మనిషి అన్నాడో, ఏదైతే ఈ మనిషి వాంగ్మూలం ఇచ్చాడో దాన్ని సరిగ్గా నెరవేరిస్తే ఇతను తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్తను ఇచ్చారు.

ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా! ఇది బుఖారీ, ముస్లింలో ఉంది, ఈ ఒక్క హదీస్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే అల్లాహ్ సామీప్యం పొందటం చాలా సులువు. కానీ మనం కాస్త గ్రహించట్లేదు. ఒకవేళ మనం గ్రహిస్తే అల్లాహ్ సామీప్యం పొందటం చాలా సులువైన విషయం. ఎందుకంటే ఆ వ్యక్తి అడిగిన విషయాల్లో ఏవైతే అల్లాహ్ తబారక వ త’ఆలా విధిగా చేశాడో అవి మాత్రమే నేను చేస్తాను అని చెప్పాడు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్త వినిపించారు, ఈ వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు అని. అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందటానికి మనిషికి కావలసినది ఏమిటంటే, అత్యంత విలువైన, అల్లాహ్ తబారక వ త’ఆలా ఏదైతే అతనిపై విధిగా చేశాడో దాన్ని అమలు పరచటం. అల్లాహ్ త’ఆలా విధిగా చేయనిది మనము ఎంత చేసుకున్నా అది విధికి సమానంగా ఉండదు. ధార్మిక పండితులు, ధార్మిక విద్వాంసులు అనేక విషయాలు దీనికి సంబంధించి చెప్పారు. అందులో కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. అవి అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందడానికి మార్గాలు అన్నమాట.

మొట్టమొదటిదిగా అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందటానికి కావలసింది ఏమిటంటే, ‘అదావుస్ సలాతి ఫీ అవ్ఖాతిహా’. నమాజుని దాని యొక్క సమయంలో ఆచరించటం.

ఫజర్ నమాజ్ ఫజర్ సమయంలో, జోహర్ నమాజ్ జోహర్ సమయంలో, అసర్ నమాజ్ అసర్ సమయంలో, మగ్రిబ్ నమాజ్ మగ్రిబ్ సమయంలో, ఇషా నమాజ్ ఇషా సమయంలో. ఏ నమాజ్ ఏ సమయంలో అల్లాహ్ తబారక వ త’ఆలా విధిగా చేశాడో ఆ నమాజ్ ని ఆ సమయంలో విధిగా భావించి ఆచరించాలి. కొంతమంది ఫజర్ నమాజ్ ని హాయిగా పడుకొని జోహర్ నమాజ్ తో కలిపి చదువుతారు. ఇది అల్లాహ్ తబారక వ త’ఆలాకి నచ్చదు. సమయాన్ని తప్పించి నమాజ్ ఆచరించటం అనేది విధిగా అల్లాహ్ తబారక వ త’ఆలా చేయలేదు. కనుక అల్లాహ్ యొక్క సామీప్యం పొందాలంటే ఏదైతే అల్లాహ్ తబారక వ త’ఆలా విధిగా చేశాడో, ఎప్పుడు చేశాడో దాన్ని ఆ ప్రకారంగానే అమలు చేయటం. ఇస్లాం ధర్మంలో రెండో మౌలిక విధి నమాజ్ ది ఉంది. మొదటిది షహాదతైన్, ఆ తరువాత నమాజ్ అన్నమాట. నమాజ్ ని దాని సమయంలో పాటించటం, ఆచరించటం ఉత్తమం.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారు, మనిషి చనిపోయిన తర్వాత అన్నిటికంటే ముందు అల్లాహ్ వద్ద అతనితో ప్రశ్నించబడేది నమాజే. నమాజ్ గురించి అతను సమాధానం ఇవ్వగలిగితే మిగతా విషయాల్లో అతను విజయం, సాఫల్యం పొందుతాడు. కనుక ఇది గుర్తుపెట్టుకోవాలి. అల్లాహ్ సామీప్యం పొందడానికి కావలసినది విధిగా చేసి ఉన్న నమాజులని సమయం ప్రకారం ఆచరించటం, పాటించటం.

ఇక రెండోది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఒక వ్యక్తి, ప్రవక్తా! స్వర్గంలో నేను మీతో ఉండాలనుకుంటున్నాను. అప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అయితే నువ్వు ఎక్కువగా నమాజ్ ఆచరించు. విధిగా ఉన్న నమాజులని ఆచరించిన తర్వాత సున్నత్ నమాజులను, నఫిల్ నమాజులను ఇలాంటి నమాజులను ఎక్కువగా ఆచరించటం వలన అల్లాహ్ యొక్క సామీప్యం మనకు లభిస్తుంది. ఎంతవరకు అయితే మనిషి అల్లాహ్ యొక్క భక్తిని తన హృదయంలో, తన మనసులో పెంపొందించుకుంటాడో, అల్లాహ్ తబారక వ త’ఆలా అతనికి తన సామీప్యానికి దరికి తీసుకుంటాడు. కనుక సున్నత్ నమాజులను, నఫిల్ నమాజులను, అలాగే రాత్రిపూట ఏకాంతంలో చదివే తహజ్జుద్ నమాజులను కూడా వదలకూడదు. ఈ నమాజులు మన స్థాయిని పెంచుతాయి. అల్లాహ్ సన్నిధిలో మన యొక్క విలువ పెరుగుతుంది.

ఆ తర్వాత మూడో మార్గం ఏమిటంటే అల్లాహ్ యొక్క విధేయతను పాటించడంలో ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆశతో ఉండాలి. విధేయత అంటే ఇతాఅత్. ఏదైతే అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ పని చేయమని, ఆ పని చేయమని అల్లాహ్ త’ఆలా మాకు ఆజ్ఞాపిస్తాడో ఆ ఆజ్ఞను శిరసా వహించటానికి ఇతాఅత్ అంటాము. ఆ ఇతాఅత్ చేయటానికి మనము ఎల్లప్పుడూ ఆశ కలిగి ఉండాలి. ఉత్సాహం కలిగి ఉండాలి. ఉత్సాహం లేకుండా ఏదీ మనిషి చేయలేడు, ఇష్టం లేకుండా ఏది మనిషి చేయలేడు. అల్లాహ్ విధేయత పట్ల మనిషి ఉత్సాహం కలిగి ఉంటే ఆ విశ్వాసంలో కలిగే రుచే వేరుగా ఉంటుంది. ఇది మూడో మార్గం అన్నమాట.

ఇక నాలుగో మార్గం ఏమిటంటే అల్లాహ్ తబారక వ త’ఆలాని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి. అంటే జిక్ర్. జిక్ర్ అంటే అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క నామము యొక్క జపము. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక దుఆలతో నామాలతో, జపాలతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూచించారు. మనిషి కూర్చొని ఉన్నా, నమాజ్ తర్వాత అయినా, ఏదైనా వస్తువు మన చేతి నుండి కింద పడిపోయినా, ఏదైనా వస్తువు మనకు ఆకర్షణను కలిగించినా, అనేక విధాలుగా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క నామాన్ని మనం స్మరిస్తూ ఉండాలి. సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, మాషాఅల్లాహ్. ఈ విధంగా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క నామాలను స్మరిస్తూ ఉండాలి. దీని ద్వారా మన యొక్క విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, తద్వారా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క సామీప్యం మనకు లభిస్తుంది.

ఇక ఐదోది ఏమిటంటే, అల్లాహ్ ప్రసన్నత కోసం ఉపవాసం ఉండుట. ఉపవాసం అనేది ఎవరికీ కానవచ్చేది కాదు. అల్లాహ్ ప్రసన్నత కోసం మనిషి ఉపవాసం ఉంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమి చెప్పారంటే, ఎవరైతే అల్లాహ్ ప్రసన్నత కోసం ఒక రోజు ఉపవాసం ఉండినట్లయితే, అల్లాహ్ తబారక వ త’ఆలా అతని యొక్క ముఖాన్ని 70 సంవత్సరాల దూరంగా నరకాగ్ని నుండి ఉంచుతాడు. ఇది కేవలం ఒక రోజు ఉపవాసం ఉంటే అల్లాహ్ తబారక వ త’ఆలా అతని ముఖాన్ని నరకాగ్ని నుండి 70 సంవత్సరాల దూరం వరకు తప్పిస్తాడు. ఆ విధంగా అల్లాహ్ ప్రసన్నత కోసం ఎన్ని ఉపవాసాలు ఉన్నా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక ఉపవాసాలు చూపించారు. వారంలో రెండు రోజులు ఉపవాసం ఉండుట, ఒక మాసములో, ఒక నెలలో మూడు రోజులు, 13, 14, 15 వ తేదీలలో ఉపవాసాలు ఉండుట. అలాగే అరఫా రోజున ఉపవాసం ఉండుట, ముహర్రం రోజులో 9, 10 ఈ రెండు రోజులు ఉపవాసాలు ఉండుట. రమజాన్ మాసములో విధిగా చేయబడిన ఒక నెల ఉపవాసాలు ఉండుట. ఈ విధంగా అనేక ఉపవాసాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఉపదేశించారు. ఈ ఉపవాసాల ద్వారా మనిషిలో విశ్వాసము, ఈమాన్ పెరుగుతుంది. దాని మూలంగా అతను అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందగలుగుతాడు.

ఇక ఆరోది ఏమిటంటే పశ్చాత్తాపం, ‘అత్తౌబతు అనిల్ మ’ఆసీ’. పశ్చాత్తాపం. ఏవైతే మనము చెడు కర్మలు చేసి ఉన్నామో, నేరాలు చేసి ఉన్నామో, దాని పట్ల పశ్చాత్తాపం చెందుతూ ఉండాలి. అల్లాహ్ త’ఆలాతో ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండాలి. అల్లాహ్ త’ఆలా వైపు మరలుతూ ఉండాలి. ఎల్లప్పుడూ అల్లాహ్ త’ఆలాతో క్షమాపణ, మన్నింపు కోరుతూ ఉండాలి. దీని మూలంగా మన యొక్క పాపాలు అల్లాహ్ తబారక వ త’ఆలా తుడిచి పెడతాడు. దాని ద్వారా మన యొక్క ఈమాన్ పెరుగుతుంది, అల్లాహ్ యొక్క సామీప్యం మనకు కలుగుతుంది. మనిషి ఏ సమయంలో ఎలాంటి పాపం చేస్తాడో అతనికే తెలుసు. కొన్ని సందర్భాలు ఇలాంటివి కూడా ఉంటాయి, అతను పాపాలు చేస్తాడు, ఆ పాపాలు అతనికి గుర్తు ఉండవు. కనుక అల్లాహ్ తబారక వ త’ఆలాతో దుఆ ఏమని చేయాలంటే, ఏ పాపాలైతే నేను తెలిసి చేశానో, తెలియక చేశానో అన్నిటినీ నువ్వు క్షమించు అని అల్లాహ్ త’ఆలాతో మన్నింపు కోరుతూ ఉండాలి.

పశ్చాత్తాపం చేయటానికి, క్షమాపణ కోరటానికి, మన్నింపు కోరటానికి గడువు తీసుకోకూడదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, రాత్రిళ్ళలో ఎవరైతే పాపాలు చేస్తారో, నేరాలు చేస్తారో అతని కోసం అల్లాహ్ తబారక వ త’ఆలా పగలు తన రెండు హస్తాలను చాచి, ఓ నా భక్తులారా! ఎవరైతే రాత్రిళ్ళలో మీరు పాపాలు చేసి ఉన్నారో, నేరాలు చేసి ఉన్నారో, నేను మిమ్మల్ని క్షమిస్తాను, రండి. ఆ సమయంలో ఎవరైతే అల్లాహ్ తబారక వ త’ఆలాతో పశ్చాత్తాపం కోరుతారో, అల్లాహ్ త’ఆలా వారిని క్షమిస్తాడు, మన్నించి వేస్తాడు. అదే విధంగా పగటి పూట ఎవరైతే పాపాలు చేస్తూ ఉంటారో, వారి కోసం అల్లాహ్ తబారక వ త’ఆలా రాత్రి తన హస్తాలు చాచి, ఓ నా దాసులారా! మీరు పగటిపూట ఏమైనా నేరాలు చేసి ఉంటే, పాపాలు చేసి ఉంటే, రండి, క్షమాపణ కోరండి, మీ పాపాలను నేను తుడిచి వేస్తాను, మన్నించి వేస్తాను. కానీ మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు పాపం పట్ల పశ్చాత్తాపం చెందితే మళ్ళీ బహుశా నాతో పాపం జరిగే అవకాశం ఉంది. కనుక ఇప్పుడే పశ్చాత్తాపం చెందకూడదు. జీవితంలో చివరి కాలంలో, శేష జీవితంలో నేను పాపాల నుండి విముక్తి పొందటానికి అల్లాహ్ త’ఆలాతో పశ్చాత్తాపం కోరాలి అనే భావన అతనిలో కలిగి ఉంటుంది. ఇది ముమ్మాటికీ తప్పు, పొరపాటు. మనిషి అన్న తర్వాత చిన్న పాపాలు గాని, పెద్ద పాపాలు గాని, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. కానీ అల్లాహ్ తబారక వ త’ఆలా క్షమిస్తూనే ఉంటాడు. గఫూరుర్ రహీం. ఆయన కరుణించేవాడు, క్షమించేవాడు, అమితంగా క్షమించేవాడు, కరుణించేవాడు. ఎల్లప్పుడూ తమ పాపాల పట్ల అల్లాహ్ త’ఆలాతో పశ్చాత్తాపం కోరుతూ ఉండాలి.

ఇక ఏడో మార్గం ఏమిటంటే, అల్లాహ్ తబారక వ త’ఆలా అవతరింపజేసిన ఖురాన్ గ్రంథాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉండాలి, కంఠస్థం చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. అల్లాహ్ తబారక వ త’ఆలా మహత్తరమైన గ్రంథాన్ని అవతరింపజేశాడు. మన సాఫల్యం కోసం, పరలోకంలో మనం విజయం సాధించాలనే ఉద్దేశ్యముతో అల్లాహ్ త’ఆలా మన కోసం ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఈనాడు మన స్థితి కాస్త గ్రహించినట్లయితే మనకు అర్థమవుతుంది, అదేమిటంటే ఖురాన్ చదవటం వచ్చిన వాళ్ళు అయినా సరే, ఖురాన్ చదవటం రాని వాళ్ళు అయినా సరే సమానమయ్యారు. ఖురాన్ చదవటానికి వారి వద్ద సమయం లేదు. ఖురాన్ నేర్చుకోవడానికి వారి వద్ద సమయం లేదు. ఇది అంతిమ దైవ గ్రంథం. నిజమైన గ్రంథం. ఈ భూమండలంలో ఏదైనా నిజమైన గ్రంథం, అల్లాహ్ యొక్క దైవ గ్రంథం ఉండినట్లయితే అది కేవలం ఖురాన్ గ్రంథం మాత్రమే. అసలైన స్థితిలో అలాగే భద్రంగా ఉంది.

ఎంత అభాగ్యులు వారు, ఎవరైతే ఈ గ్రంథాన్ని విడిచిపెట్టి తన జీవితాన్ని సాగిస్తున్నారో. చాలా దురదృష్టవంతులు. అల్లాహ్ యొక్క గ్రంథం ఈ భూమండలం మీద ఉన్నప్పుడు మనలో విశ్వాసం దాన్ని చదవడానికి, దాన్ని పారాయణం చేయడానికి, కంఠస్థం చేయడానికి ఎలా తహతహలాడాలంటే అంత ఉత్సాహంతో ఉండాలి. ఖురాన్ గ్రంథం పట్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పి ఉన్నారు, ఎవరైతే ఒక అక్షరం చదువుతాడో దానికి బదులుగా అల్లాహ్ తబారక వ త’ఆలా పది పుణ్యాలు లభింపజేస్తాడు. ఖురాన్ గ్రంథంలో వాక్యాలు, పదాలు అనేక అక్షరాలతో కూడి ఉన్నాయి. అది చదవంగానే అల్లాహ్ తబారక వ త’ఆలా వారికి ఎంతో విలువైన పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. దాని మూలంగా వారి యొక్క విశ్వాసం పెరుగుతుంది, అల్లాహ్ యొక్క సామీప్యం వారికి లభిస్తుంది. కనుక ఖురాన్ గ్రంథాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉండాలి. ఏదైతే మనకు వస్తుందో, ఒక సూరా వచ్చినా, మొత్తం ఖురాన్ వచ్చినా, నిరంతరంగా చదువుతూ ఉండాలి.

అల్లాహ్ తబారక వ త’ఆలా సూరె ఫుర్ఖాన్ లో ఈ విధంగా చెప్తున్నాడు, ప్రళయ దినం నాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సన్నిధిలో అంటారు, “యా రబ్బీ ఇన్న హాజల్ కౌమీత్తఖజూ ఖురాన మహ్జూరా”. ఓ నా ప్రభువా! ఈ నా జాతి వారు ఖురాన్ గ్రంథాన్ని చదవటం విడిచిపెట్టారు. కనుక ఈ స్థితి రాకుండా మనం ఏం చేయాలంటే, ఖురాన్ గ్రంథాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. దాని దాని కారణంగా మనకు మేలు జరుగుతుంది, అల్లాహ్ యొక్క సామీప్యం దొరుకుతుంది.

ఎనిమిదో మార్గం ఏమిటంటే, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ తబారక వ త’ఆలా మన సన్మార్గం కోసం పంపించాడు. ఆయన్ని ప్రవక్తగా చేసిన అల్లాహ్ తబారక వ త’ఆలా మనపై పెద్ద ఉపకారమే చేశాడు. ఆయన చెప్పకపోతే, ఆయన మార్గాన్ని సూచించకపోతే నిజమైన మార్గం మనకు దొరికేది కాదు. అర్థమయ్యేది కాదు. కనుక మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అత్యధికంగా దరూద్ చదువుతూ ఉండాలి.

అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్, కమా సల్లయిత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్, కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్.

ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై చదివే దరూద్, పంపే దరూద్ అన్నమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించి ఉన్నారు, మీలో ఎవరైతే నాపై ఎక్కువ దరూద్ పంపుతారో, చదువుతారో అతను నాకు సమీపంగా ఉంటాడు. అల్లాహ్ సామీప్యం పొందడానికి ఈ దరూద్ కూడా మనకు తోడ్పాటు అవుతుంది.

అలాగే తొమ్మిదో మార్గం ఏమిటంటే, మంచి వ్యక్తులతో స్నేహం కలిగి ఉండాలి. స్నేహం అన్నది కేవలం ప్రపంచంలో మనం చెప్పుకుంటా స్నేహం కాదు. సద్వర్తుల స్నేహం. ఎవరైతే అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగి ఉంటాడో, ఎల్లప్పుడూ అల్లాహ్ ని గుర్తు చేస్తూ ఉంటాడో, అల్లాహ్ యొక్క విధేయతను పాటిస్తూ ఉంటాడో, అల్లాహ్ తో ఎవరైతే భయపడుతూ ఉంటారో వారి యొక్క స్నేహాన్ని మనము చేసుకోవాలి. మనము ఇటువంటి వారిని స్నేహించము. మన జీవిత కాలంలో మనకున్న స్నేహాలు, స్నేహితులు వేరు. అల్లాహ్ తబారక వ త’ఆలా ఏదైతే సూచిస్తున్నాడో అది వేరు. కనుక గుర్తుంచుకోవాలి, స్నేహం చేసేటప్పుడు మనలో ఉన్న గుణం ఏమిటి, అది మన స్నేహం ద్వారా వ్యక్తమవుతుంది. ఒక మంచి మనిషి అల్లాహ్ తో భయపడేవాడు, అల్లాహ్ పట్ల సంతుష్టుడయ్యేవాడు, అల్లాహ్ యొక్క దాసులతో ప్రేమిస్తాడు, స్నేహం చేస్తాడు. కనుక మంచి స్నేహితులని ఎన్నుకోవాలి. దాని మూలంగా వారు చేస్తున్న ఆచారాలు, వారు చేస్తున్న కర్మలు మనకు కూడా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. దాని ద్వారా మన విశ్వాసం కూడా, ఈమాన్ కూడా పెరుగుతుంది. తద్వారా అల్లాహ్ సన్నిధిలో మనము కూడా ఒక సామీప్యాన్ని పొందగలుగుతాం.

పదోది ఏమిటంటే, దానము చేయటం, పేదవారిపై దానము చేయటం. దానం చేయడాన్ని అల్లాహ్ తబారక వ త’ఆలా ఎంతో మెచ్చుకుంటాడు. అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా చెప్పి ఉన్నాడు, ఏదైతే మీకు నేను ప్రసాదించి ఉన్నానో అందులో నుంచి మీరు ఖర్చు పెట్టండి పేదవారిపై. ఇక్కడ చెప్పవలసిన విషయం ఏమిటంటే, మన దగ్గర ఎంత ఉంది అనేది కాదు, ఏదైతే అల్లాహ్ త’ఆలా మనకు ప్రసాదించి ఉన్నాడో, అది కొంత అయినా ఎంతైనా సరే, అందులో నుంచి ఖర్చు పెట్టి అల్లాహ్ ప్రసన్నత కోరటం అనేది ఇక్కడ మాట. ఎల్లప్పుడూ అల్లాహ్ తబారక వ త’ఆలా కోసం, అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం మనము దానధర్మాలు చేస్తూ ఉండాలి. దీని మూలంగా అల్లాహ్ యొక్క సామీప్యం మనకు దొరుకుతుంది.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులు, సహాబాలు ఎంతో శ్రమపడి అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క ప్రసన్నత కోరేవారు. ఒక సందర్భంలో హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆయన వద్ద ఉన్న అన్ని వస్తువులు తీసుకొచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ప్రవేశపెట్టారు. వారి స్థితిని గమనించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు తో అన్నారు, ఓ అబూబకర్! ఇవన్నీ ఇక్కడికి తీసుకువచ్చావు, ఇంట్లో ఏమి పెట్టుకున్నావు? ఆయన అన్నారు, ప్రవక్తా! నేను ఇంట్లో అల్లాహ్ మరియు ప్రవక్తను వదిలేసి వచ్చాను.

ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులు అల్లాహ్ ప్రసన్నత కోసం అనేక విధాలుగా ఖర్చు పెట్టేవారు. అల్లాహ్ యొక్క ప్రసన్నతను పొందాలని.

ఈ పది సూత్రాలు, పది మార్గాలు ఉన్నాయి అల్లాహ్ యొక్క సామీప్యం పొందడానికి.

అయితే ఇప్పుడు చెప్పవలసిన విషయం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సామీప్యం మనం పొందినట్లయితే, అప్పుడు అల్లాహ్ తబారక వ త’ఆలా మా యొక్క ప్రతి మాటను వింటూ ఉంటాడు, మేము కోరేదానికి అల్లాహ్ తబారక వ త’ఆలా ప్రసాదిస్తూ ఉంటాడు. ఒక హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, ‘లవ్ అఖ్సమ అలల్లాహి ల అబర్రహ్’. అల్లాహ్ సామీప్యం పొందినవాడు ఎప్పుడైనా అల్లాహ్ మీద ప్రమాణం చేస్తే అల్లాహ్ తబారక వ త’ఆలా అతని యొక్క ప్రమాణాన్ని పూర్తి చేస్తాడు.

అదే విధంగా మరో హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క సామీప్యం పొందినవాడు అల్లాహ్ యొక్క స్నేహితుడు అవుతాడు, వలీ అవుతాడు. ఎవరైతే అల్లాహ్ యొక్క వలీతో ఏదైనా విషయం పట్ల హాని కలిగించినట్లయితే అల్లాహ్ తబారక వ త’ఆలా అంటున్నాడు, అతను తోనే అతనితో నేను యుద్ధం చేయడానికి సిద్ధమై ఉన్నాను. అల్లాహ్ మిత్రుల పట్ల, అల్లాహ్ యొక్క సామీప్యం పొందిన వారి పట్ల అల్లాహ్ తబారక వ త’ఆలా ఏం చెప్తున్నాడంటే, అతనిని నేను మెచ్చుకుంటాను, అతనిని నేను ఇష్టపడతాను, అతను ఏ చేతిలోనైతే పట్టుకుంటుంటాడో ఆ చేతిని నేను అయిపోతాను. ఏ కాలి ద్వారా అయితే అతను నడుస్తూ ఉంటాడో ఆ కాలును నేను అయిపోతాను. ఏ కళ్ళ ద్వారా అతను చూస్తూ ఉంటాడో ఆ కళ్ళు నేను అయిపోతాను. అని ఎంతో ప్రేమతో, ఎంతో ప్రసన్నతతో అల్లాహ్ తబారక వ త’ఆలా చెప్తున్నాడు.

అల్లాహ్ యొక్క సామీప్యం మనం పొందినట్లయితే మన యొక్క ప్రతి మాట అల్లాహ్ తబారక వ త’ఆలా వింటాడు. మేము ఏది కోరితే అల్లాహ్ తబారక వ త’ఆలా అది మాకు ప్రసాదిస్తాడు.

కనుక చివరిగా అల్లాహ్ తబారక వ త’ఆలా తో దుఆ ఏమనగా, ఏవైతే మనం విన్నామో ఆ మాటలని గుర్తించి సరైన మార్గంపై నడిచే భాగ్యాన్ని అల్లాహ్ తబారక వ త’ఆలా మాకు ప్రసాదించు గాక. అల్లాహ్ తబారక వ త’ఆలా ఏవైతే విధిగా చేసి ఉన్నాడో వాటిని ఆచరించి అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందే భాగ్యాన్ని అల్లాహ్ త’ఆలా మనకు ప్రసాదించు గాక. ఆమీన్.

వ ఆఖిరు ద’అవానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=17147


జునుబీ’ (అశుద్ద స్థితిలో ఉన్నవారి) పై నిషిద్ధ విషయాలు [వీడియో, టెక్స్ట్]

‘జునుబీ’ (అశుద్ద స్థితిలో ఉన్నవారి) పై నిషిద్ధ విషయాలుఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) : పార్ట్ 7A
https://youtu.be/4tRtuTItZkY [30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
శుద్ధి & నమాజు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, ‘ఫిఖ్ అత్-తహారా వస్-సలాహ్’ (పారిశుధ్యం మరియు నమాజ్ ఆదేశాలు) అనే అంశంపై ఏడవ తరగతిలో భాగంగా, జునూబీ (అశుద్ధావస్థలో ఉన్న వ్యక్తి)కి నిషిద్ధమైన పనుల గురించి వివరించబడింది. జునూబీ అంటే స్వప్నస్కలనం లేదా భార్యాభర్తల సంభోగం కారణంగా అశుద్ధతకు లోనైన స్త్రీ లేదా పురుషుడు. వీరికి నిషిద్ధమైనవి నాలుగు ప్రధాన పనులు: 1) నమాజ్ చేయడం, 2) కాబా తవాఫ్ చేయడం, 3) దివ్య ఖుర్ఆన్ గ్రంథాన్ని ముట్టుకోవడం, మరియు 4) మస్జిద్‌లో ఆగడం లేదా నివసించడం. ప్రతి అంశానికి ఖుర్ఆన్ ఆయతులు, హదీసుల నుండి ఆధారాలు, మరియు నలుగురు ఇమామ్‌ల ఏకాభిప్రాయం (ఇజ్మా)తో సహా వివరణ ఇవ్వబడింది. అశుద్ధావస్థలో నమాజ్ చేయరాదు కానీ దాని కోసం నమాజ్‌ను ఆలస్యం చేయడం లేదా వదిలివేయడం తప్పు అని, వెంటనే స్నానం చేసి నమాజ్ ఆచరించాలని స్పష్టం చేయబడింది.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు

أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ
(అల్ హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సఃబిహి అజ్మయీన్, అమ్మా బ’ద్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన కుటుంబ సభ్యులు మరియు ఆయన సహచరులందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.

సోదర మహాశయులారా సోదరీమణులారా! ఫిఖ్ అత్-తహారా వస్-సలాహ్ (Fiqh al-Taharah wa’l-Salah), పరిశుభ్రత మరియు నమాజ్‌కు సంబంధించిన ఆదేశాల ఈ క్లాస్ ఏదైతే మనం మొదలుపెట్టామో, అల్లాహ్ యొక్క దయవల్ల ఈ రోజున ఏడవ క్లాస్ మనం మొదలుపెట్టబోతున్నాము.

అయితే ఈనాడు మనం చదివేటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో, పరిశుద్ధ స్థితిలో లేనివారు, ప్రత్యేకంగా అశుద్ధావస్థలో ఉన్నవారు అంటే జునూబీ (Junubi) అని ఎవరినైతే అనడం జరుగుతుందో, వారిపై నిషిద్ధములు ఉన్నవి ఏమిటి మరియు తయమ్ముమ్‌కు సంబంధించి కొన్ని ఆదేశాలు ఖుర్ఆన్ హదీస్ ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

అయితే రండి, ‘జునూబీ‘ అన్న పదం ఏదైతే ఉందో, అరబీలో జునూబీ అన్న పదం స్వప్నస్కలనం వల్ల లేదా భార్యాభర్తల సంభోగం కారణంగా అశుద్ధతకు లోనైన వ్యక్తిని, స్త్రీ అయినా పురుషుడు అయినా, జునూబీ అని అంటారు.

అయితే, ఈ అశుద్ధ స్థితిలో ఎవరైతే ఉంటారో, ఆ కొంత కాలం, ఆ కొంత సమయం ఏదైతే వారు అశుద్ధంగా ఉంటారో అప్పుడు ఏ కార్యాలు చేయడం వారిపై నిషిద్ధంగా ఉంటాయి? అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్లు నాలుగు విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఒకటి నమాజ్, రెండవది తవాఫ్, మూడవది దివ్య ఖుర్ఆన్ ను ముట్టుకోవడం, నాలుగవది మస్జిద్ లో ఉండడం, అక్కడ కూర్చోవడం, పడుకోవడం, నిలవడం.

అయితే రండి, ఈ నాలుగు విషయాలకు కొంత వివరణ మనం తెలుసుకుందాము. నమాజ్, తవాఫ్, దివ్య ఖుర్ఆన్ ను ముట్టుకోవడం, మస్జిద్ లో ఆగడం. ఇవి నాలుగు పనులు జునూబీ చేయరాదు.

అయితే, వీటికి సంబంధించి మనం ధర్మాదేశాలు చూస్తే గనక, అక్కడ ఎన్నో దలీల్ (ఆధారాలు), నిదర్శనాలు ఉన్నాయి.

ఉదాహరణకు, అల్లాహు త’ఆలా సూరతున్ నిసా ఆయత్ నెంబర్ 43లో తెలిపాడు:

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَقْرَبُوا۟ ٱلصَّلَوٰةَ وَأَنتُمْ سُكَـٰرَىٰ حَتَّىٰ تَعْلَمُوا۟ مَا تَقُولُونَ وَلَا جُنُبًا إِلَّا عَابِرِى سَبِيلٍ حَتَّىٰ تَغْتَسِلُوا۟

విశ్వసించిన ప్రజలారా! మీరు (తాగిన) మత్తులో ఉన్నప్పుడు నమాజు దరిదాపులకు కూడా పోకండి. మీరు పలికేదేమిటో మీకు అర్థం కాగలిగినప్పుడే (నమాజు చెయ్యాలి). లైంగిక అశుద్ధావస్థలో కూడా – స్నానం చేయనంతవరకూ – నమాజు చేయరాదు. (మస్జిదు) దారిగుండా సాగిపోయేటి పరిస్థితి అయితే అది వేరే విషయం! (4:43)

నమాజ్‌కు సమీపించకూడదు. ఇక్కడ ఎవరు? రెండవ విషయం, వలా జునుబన్ (వలా జునుబన్) – జునూబీ, అశుద్ధావస్థలో ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పటివరకు? హత్తా తఘ్ తసిలూ – స్నానం చేసే వరకు. స్నానం చేసిన తర్వాతనే వారు నమాజ్ చేయాలి, అంతకుముందు నమాజ్ చేయడానికి అవకాశం లేదు. ఈ నమాజ్ చేయడం వారిపై నిషిద్ధం.

ఇక ఈ అశుద్ధ స్థితిలో నమాజ్ చేయడం నిషిద్ధం అని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుల్లో ఎంతోమంది యువకులు, యువతులు ఈ ఆదేశం, అల్లాహు త’ఆలా ఏదైతే ఇచ్చాడో, తప్పుడు భావం తీసుకుని నమాజ్‌ను వదులుతూ ఉన్నారు. ఎందరినో చూడడం జరుగుతుంది, వేరే నమాజ్‌లు వారు పూర్తి పాబందీగా చేసినప్పటికీ, రాత్రి అశుద్ధావస్థకు లోనయ్యారు, స్వప్నస్కలనం జరిగింది, వారిని మేల్కొలిపినప్పటికీ, వారు ఫజ్ర్ నమాజ్ జమాఅత్‌తో చేయడానికి రారు. ఇళ్లల్లో తల్లులు లేపినా పిల్లల్ని, వారు చాలా అశ్రద్ధ వహిస్తారు. ఏందంటే నేను స్నానం చేసేది ఉంది, ఇప్పుడు ఈ చల్లదనం, ఇప్పుడు ఇంత తొందరగా చేయాలంటే నాతో కుదరదు, నేను 7 గంటల తర్వాత లేచి స్నానం చేసి అప్పుడు నమాజ్ చేసుకుంటాను.

అయితే సోదర మహాశయులారా, ఈ ఆయత్ ద్వారా చెప్పదలచిన విషయం ఏమిటంటే, అశుద్ధావస్థలో నమాజ్ చేయడం సరియైన విషయం కాదు. ఇలాంటి మనిషి తప్పకుండా స్నానం చేసి నమాజ్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది కానీ, “నమాజ్ ఆలస్యం చేయండి, నమాజ్ దాని సమయం దాటినా పర్వాలేదు, మీరు ఆలస్యంగా చేసుకున్నా అభ్యంతరం లేదు”, అలాంటి మాట ఇక్కడ చెప్పడం జరగలేదు. ఈ విషయం గుర్తుంచుకోవాలి.

అశుద్ధావస్థలో ఉన్న వారిపై నమాజ్ నిషిద్ధం అన్న దాని గురించి హదీసులలో కూడా ఆధారం ఉంది. మనకు సహీహ్ బుఖారీ హదీస్ నెంబర్ 275 మరియు సహీహ్ ముస్లింలో హదీస్ నెంబర్ 605, ఇలా స్పష్టంగా కనబడుతుంది.

అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు:

ఉఖీమతిస్సలాహ్ – నమాజ్ కొరకు ఇఖామత్ చెప్పడం జరిగింది. వ ఉద్దిలతిస్ సుఫూఫు ఖియామా – అందరూ పంక్తుల్లో నిలబడి సఫ్‌లన్నీ కూడా సక్రమంగా చేయబడ్డాయి. ఫ ఖరజ ఇలైనా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం – నమాజ్ చేయించడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేశారు. ఫలమ్మా ఖామ ఫీ ముసల్లా – ప్రవక్త నమాజ్ చేయించే, ఇమామత్ చేయించే స్థలం ఏదైతే ఉందో అక్కడ నిలబడిన నిలబడ్డారు, జకర – అప్పుడు గుర్తుకొచ్చింది అన్నహు జునుబున్ – ప్రవక్త అశుద్ధావస్థలో ఉన్నట్లు, స్నానం చేయవలసిన అవసరం ఉంది అని ప్రవక్త వారికి గుర్తుకొచ్చింది. ఫ ఖాల లనా – అబూ హురైరా అంటున్నారు, ప్రవక్త వారు మా సహాబాలందరినీ ఉద్దేశించి చెప్పారు, మకానకుమ్ – మీరు ఇలాగే నిలబడి ఉండండి. సుమ్మ రజ’అ ఫఘ్ తసల – ప్రవక్త వెళ్ళిపోయారు, స్నానం చేశారు. సుమ్మ ఖరజ ఇలైనా – మళ్ళీ ప్రవక్త మా మధ్యలో వచ్చారు, వ ర’సుహు యఖ్తుర్ – తల నుండి నీళ్లు, నీళ్ల యొక్క చుక్కలు, నీళ్ల బొట్లు పడుతూ ఉన్నాయి. ఫ కబ్బర ఫ సల్లైనా మా’అహు – అల్లాహు అక్బర్ అని తక్బీరె తహ్రీమా అన్నారు. మేము ప్రవక్త వెంట నమాజ్ చేసుకున్నాము.

ఈ హదీస్ ద్వారా కూడా ఏం తెలిసింది? ప్రవక్త మరిచిపోయారు. అయితే, నమాజ్ చేయించడానికి వచ్చేశారు కానీ నిలబడి ముసల్లా మీద నమాజ్ స్టార్ట్ చేసేకి ముందుగా గుర్తుకు వచ్చేసింది, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే ఆ విషయాన్ని, ఏదైతే గుర్తుకు వచ్చిందో, సహాబాలను అక్కడే ఉండమని చెప్పి వెళ్ళిపోయారు మరియు నమాజ్ స్నానం చేసిన తర్వాతనే వచ్చి నమాజ్ చేయించారు.

సోదర మహాశయులారా, కనీసం ఒక ఆధారం మనం తెలుసుకున్నా అల్హందులిల్లాహ్ సరిపోతుంది. కానీ మీకు ఈ హదీసుల పట్ల కూడా మంచి అవగాహన కలిగి ఉండాలి అని నిదానంగా ఇలాంటి దలీల్ అన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అందుకొరకు శ్రద్ధ వహించండి, నోట్స్ తయారు చేసుకుంటూ ఉండండి మరియు పాఠం జరిగిన తర్వాత, క్లాస్ తర్వాత ఈ పాఠాలను మీరు నెమరువేసుకుంటూ ఉండండి, రివ్యూ చేసుకుంటూ ఉండండి. దీని ద్వారా విద్య అనేది ఇంకా బలపడుతుంది, మీ మనసుల్లో నాటుకుపోతుంది, ఇంకా మీరు ఈ విషయాలు మర్చిపోకుండా ఉండాలంటే మీ వెనక వారికి, క్లాసులో పాల్గొనలేని వారికి చెబుతూ ఉండాలి కూడా.

అశుద్ధావస్థలో ఉన్నటువంటి జునూబీపై రెండవది ఏదైతే నిషిద్ధంగా ఉందో, అది కాబతుల్లాహ్ యొక్క తవాఫ్. దీనికి సంబంధించి ఎన్నో ఆధారాలు మనకు కనబడతాయి. సర్వసామాన్యంగా నేను ఏదైతే చెబుతూ ఉంటానో, మన మధ్యలో నాలుగు ఫిఖ్‌లు ఏవైతే ఫేమస్‌గా ఉన్నాయో, అంతకంటే ఎక్కువ ఫిఖ్‌లు కూడా ఇమామ్‌లు కూడా ఉండిరి, కానీ ఇవి నాలుగు ఫేమస్ అయిపోయాయి, హనఫీ, మాలికీ, షాఫియీ, హంబలీ. ఈ నాలుగు ఫిఖ్‌లలో కూడా ఏకీభవంగా తవాఫ్ చేసే వ్యక్తి కూడా తప్పకుండా పరిశుద్ధావస్థలో ఉండడం మరియు తవాఫ్ చేసేకి ముందు అతను వుదూ చేసుకోవడం చాలా నొక్కి చెప్పడం జరిగింది.

ఇంతకుముందు నేను ఏదైతే నమాజ్ గురించి ఒక ఆయత్ వినిపించానో, సూరత్ అన్-నిసా ఆయత్ నెంబర్ 43, దాని ద్వారా కూడా ఆధారం తీసుకోవడం జరుగుతుంది.

అలాగే హజ్రత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా వారికి హజ్ చేసే సందర్భంలో ఆమె నిలవారి ఏదైతే మొదలైపోయిందో, బహిష్టు, ఆ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏం చెప్పారు: ఇఫ్’అలీ మా యఫ్’అలుల్ హాజ్, ఘైర అల్లా తతూఫిల్ బైత్ హత్తా తత్ హురీ – ఇంకో ఉల్లేఖనంలో హత్తా తఘ్ తసిలీ. ఓ ఆయిషా, నీవు ఈ నెలవారి రక్తస్రావంలో ఉన్నావని బాధపడకు, హజ్ విషయంలో నీకు ఏదైనా ఆటంకం కలిగింది అన్నట్లుగా నీవు నొచ్చుకోవద్దు ఎందుకంటే నీవు ఈ స్థితిలో ఉండి కూడా హాజీ ఏ ఏ పనులు చేస్తాడో అవన్నీ చేయవచ్చును నువ్వు, కేవలం ఒక్క తవాఫ్ తప్ప. తవాఫ్ చేయకూడదు, పరిశుద్ధమై స్నానం చేసే వరకు తవాఫ్ చేయకు.

ఈ హదీస్ సహీహ్ బుఖారీలో ఉంది 305, సహీహ్ ముస్లింలో ఉంది 1211. ఈ హదీస్ ద్వారా కూడా ధర్మవేత్తలందరూ ఏకీభవించారు. స్త్రీ నెలవారి రక్తస్రావం జరుగుతుంది అంటే ఆమె అశుద్ధావస్థలో ఉన్నట్లు. అశుద్ధావస్థలో ఉన్నవారు తవాఫ్ చేయకూడదు.

ఇదే కాకుండా హజ్రత్ సఫియా బిన్తె హుయై ఇబ్ను అఖ్తబ్ రదియల్లాహు త’ఆలా అన్హా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర భార్య, ఆమెకు సంబంధించిన ఒక హదీస్ ద్వారా కూడా ఈ విషయం తెలుస్తుంది.

మరియు అలాగే ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం ఉంది, సునన్ నసాయిలో, నసాయి కుబ్రా 3944, అలాగే బైహఖీలో 9573 మరియు ఈ హదీసును కొందరు ధర్మవేత్తలు మౌఖూఫ్ మరియు సహీహ్ అని చెప్పారు. కానీ ఈ మాట చెప్పేవారు ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు అయినప్పటికీ, హదీస్ పరిభాషలో, ఇస్తిలాహె హదీస్లో దీనిని హుక్ముర్ రఫ్’అ అని అంటారు, హుక్ముల్ మర్ఫూ అని అంటారు. అంటే, ఇలాంటి మాట సహాబీ తన ఇష్టానుసారం చెప్పడానికి హక్కు ఉండదు, వారు ప్రవక్తతో విని ఉంటారు, తెలుసుకొని ఉంటారు కానీ ప్రవక్త చెప్పారు అన్నటువంటి మాట ఆ సందర్భంలో వారు చెప్పలేదు. ఏంటి విషయం?

అత్తవాఫు బిల్ బైతి సలాహ్ – కాబతుల్లాహ్ యొక్క తవాఫ్ కూడా సలాహ్, నమాజ్ లాంటిది. కాకపోతే ఈ తవాఫ్‌లో మాట్లాడే అటువంటి, నడిచే అటువంటి అనుమతి ఇవ్వడం జరిగింది. నమాజ్‌లో మాట్లాడే, నడిచే అనుమతి కూడా లేదు.”

సోదర మహాశయులారా, తవాఫ్ చేయకూడదు అన్నటువంటి ఈ విషయం ఏదైతే ఉందో, దీని గురించి మనకు ఈ ఆధారాలు ఏవైతే తెలిశాయో, వీటిపై మనం తృప్తి ఉండి, ఎప్పుడూ మనం తవాఫ్ చేసినా అశుద్ధావస్థలో ఉండకుండా పరిశుభ్రతలో ఉండి, వుదూ చేసుకొని తవాఫ్ చేసే ప్రయత్నం చేయాలి.

ఇక రండి, మూడో విషయం అశుద్ధావస్థలో ఏమి చేయరాదు? ఖుర్ఆన్ ను తాకకూడదు అన్నటువంటి విషయం. అయితే ఖుర్ఆన్ ను తాకకూడదు అన్నటువంటి విషయం ఏదైతే ఉందో, దీని గురించి కూడా హనఫీ, మాలికీ, షాఫియీ, హంబలీ, ఈ నాలుగు ఫిఖ్‌లలో, నాలుగు ఫిఖ్‌లలో జునూబీ – జునూబీ అంటే ఎవరో తెలిసింది కదా, అశుద్ధావస్థలో ఉన్న వ్యక్తి – ఖుర్ఆన్ ను ముట్టుకోకూడదు, ఖుర్ఆన్ ను తాకకూడదు అని ఏకీభవించారు. మరియు ఇమామ్ ఇబ్ను అబ్దిల్ బర్ర్, ఇమామ్ ఇబ్ను అబ్దిల్ బర్ర్ ఈ విషయంలో అందరి ఏకాభిప్రాయం ఉంది, ఇజ్మా ఉంది అని కూడా స్పష్టంగా తెలిపారు. ఈ విషయం అల్-ఇస్తిద్కార్ లో ఉంది. అలాగే ఇమామ్ షౌకానీ రహిమహుల్లాహ్ కూడా ఈ విషయం తెలిపారు, నైలుల్ అవ్తార్ లో ఈ మాట ఆయన రాశారు.

దీనికి సూరతుల్ వాఖిఆ, ఇందులోని ఆయత్ ద్వారా కూడా దలీల్ తీసుకోవడం జరుగుతుంది. కొందరు సూరత్ అల్-వాఖిఆలో వచ్చిన ఆయత్ ను దేవదూతల గురించి అని, అది లౌహె మహ్ఫూజ్ గురించి అని అంటారు. కానీ సర్వసామాన్యంగా అధికమంది ధర్మవేత్తలు ఈ ఆయత్ నే ఆధారంగా తీసుకున్నారు మరియు ఇమామ్ ఖుర్తుబీ రహిమహుల్లాహ్ తఫ్సీరె ఖుర్తుబీలో చెప్పారు: అన్నహు ఇదా కాన లా యజూజు లహు అల్-లుబ్సు ఫిల్ మస్జిద్, ఫ అహ్రా అల్లా యజూజ లహు మస్సుల్ ముస్హఫ్, వలల్ ఖిరాఅతు ఫీహి ఇద్ హువ అ’జము హుర్మతన్. మనం నాలుగో విషయం తెలుసుకోబోతున్నాము మస్జిద్ లో ఉండకూడదు అని. అక్కడ వివరాలు వస్తాయి దానికి సంబంధించి. అయితే ఇమామ్ ఖుర్తుబీ ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావించారు. జునూబీ మస్జిద్ లో ఆగకూడదు, అక్కడ నిలువకూడదు. అయితే, మస్జిద్ లో జునూబీ నిలువకూడదు అని ఆదేశం ఉన్నప్పుడు, ఫ అహ్రా అల్లా యజూజ లహు మస్సుల్ ముస్హఫ్ – అయితే అతను ముస్హఫ్ ను, ఖుర్ఆన్ గ్రంథాన్ని తాకకపోవడం, ముట్టుకోకపోవడం ఇది మరీ చాలా అవసరమైన విషయం. వలల్ ఖిరాఅతు ఫీహి – దానిని ముట్టుకొని, చూసి చదవడం కూడా ఇది యోగ్యం లేదు. ఇద్ హువ అ’జము హుర్మతన్ – ఖుర్ఆన్ గ్రంథం, దీని యొక్క గౌరవప్రదం అనేది మస్జిద్ కంటే కూడా ఎక్కువగా ఉంది.

అంతేకాకుండా, మరొక హదీస్ ద్వారా కూడా దలీల్ తీసుకుంటారు ఎందరో ధర్మవేత్తలు. తబరానీ, దారుఖుత్నీ ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో ఈ హదీస్ వచ్చి ఉంది. షేక్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహుల్ జామిఅలో దీనిని ప్రస్తావించారు. హదీస్ నెంబర్ 7780. ఏంటి హదీస్? లా యమస్సుల్ ఖుర్ఆన ఇల్లా తాహిరున్ – ఖుర్ఆన్ ను పరిశుభ్రంగా ఉన్న వ్యక్తే ముట్టుకోవాలి, తాకాలి. అయితే జునూబీ మనిషి ఖుర్ఆన్ ను ముట్టుకోకూడదు, తాకకూడదు.

అయినా మీరు గమనించండి, ఈ జనాబత్ అనేది ఏదైతే ఉందో, ఈ అశుద్ధావస్థ ఏదైతే ఉందో, అది చాలా తక్కువ సమయమే ఉంటుంది. స్త్రీలకు నెలవారి లేదా ప్రసవ రక్తం స్రవించే సందర్భంలో ఒక కొన్ని రోజుల వరకు వారు ఆ అశుద్ధావస్థలో ఉంటారు, వారి విషయం వేరు. కానీ జనాబత్ అన్నది ఏదైతే ఉందో, స్వప్నస్కలనం లేదా భార్యాభర్తల సంభోగం కారణంగా అశుద్ధావస్థ, ఇది చాలా తక్కువ సమయం ఉంటుంది. అందుకొరకు ఈ సమయంలో ఖుర్ఆన్ ను ముట్టుకోకపోవడం, తాకకుండా ఉండడమే మేలైన విషయం.

ఈ కొన్ని ఆయత్ హదీసులు కాకుండా, సహాబాల యొక్క అతర్, వాటి ద్వారా కూడా దీనికి ఆధారం తీసుకోవడం జరుగుతుంది. ఇందులో సల్మాన్ ఫార్సీ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం ఉంది. ఇమామ్ ఇబ్ను అబీ షైబా తన ముసన్నఫ్‌లో 1106, మరియు ఇమామ్ బైహఖీ మరియు ఇమామ్ దారుఖుత్నీ ఇంకా ఇమామ్ జైల’యీ రహిమహుల్లాహ్ నస్బుర్ రాయాలో కూడా దీనిని ఉల్లేఖించారు.

సల్మాన్ ఫార్సీ రదియల్లాహు త’ఆలా అన్హు ఒక ప్రయాణంలో ఉండగా, అబ్దుర్రహ్మాన్ బిన్ యజీద్ బిన్ జాబిర్ ఉల్లేఖిస్తున్నారు, ఆయన చెప్పారు: సల్మాన్ ఫార్సీ రదియల్లాహు త’ఆలా అన్హు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లారు. తిరిగి వచ్చేసిన తర్వాత నేను అడిగాను, మీరు వుదూ చేసుకోండి, ల’అల్లనా నస్’అలుక అన్ ఆయిన్ మినల్ ఖుర్ఆన్ – మేము నీతో ఖుర్ఆన్‌లోని కొన్ని ఆయతుల గురించి అడగాలనుకుంటున్నాము. అప్పుడు సల్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు: సలూనీ, ఫ ఇన్నీ లా అముస్సుహు – అడగండి, నేను ఖుర్ఆన్‌ను ముట్టుకోను, తాకను. ఇన్నహు లా యమస్సుహు ఇల్లల్ ముతహహరూన్ – ఈ ఖుర్ఆన్‌ను తాకడానికి పవిత్రంగా, పరిశుభ్రంగా ఉండడం తప్పనిసరి. అప్పుడు మేము వారితో అడిగాము, ఫ ఖర’అ అలైనా ఖబ్ల అన్ యతవద్ద’అ – అయితే సల్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు వుదూ చేసుకునేకి ముందు, ఖుర్ఆన్‌ను తాకకుండా, ఖుర్ఆన్ ఆయత్ మాకు చదివి వినిపించారు.

ఈ విధంగా సోదర మహాశయులారా, మనకు అల్లాహ్ యొక్క దయవల్ల ఖుర్ఆన్ ను ముట్టుకోకూడదు అన్నటువంటి విషయం గురించి ఈ ఆధారాలు తెలిసినవి.

జునూబీ, అశుద్ధావస్థలో ఉన్న వ్యక్తిపై నిషిద్ధం ఉన్న నాలుగో విషయం ఏదైతే ఉందో, మస్జిద్ లో ఆగడం, మస్జిద్ లో నిలవడం. దీనికి సంబంధించి కూడా ఖుర్ఆన్ లోని సూరత్ అన్-నిసాలోని ఆయత్ 43 ఏదైతే ఇంతకుముందు మనం చెప్పుకున్నామో, వలా జునుబన్ ఇల్లా ఆబిరీ సబీలిన్ హత్తా తఘ్ తసిలూ, ఈ ఆయత్ ద్వారానే దలీల్ తీసుకోవడం జరుగుతుంది.

మాషాఅల్లాహ్. తబారకల్లాహ్. గమనించండి. అందుకొరకే నేను మాటిమాటికి చెబుతూ ఉంటాను. నాకు అరబీ వచ్చయ్యా, అరె ఖుర్ఆన్ అయితే నా భాషలో తర్జుమా, అనువాదం ఉంది కదా నేను చదివి తెలుసుకుంటాను, ఇట్లాంటి మోసాలకు గురి కాకూడదు, నాకు జ్ఞానం ఉంది, నేను స్వయంగా ధర్మ విద్య నేర్చుకుంటాను అన్నటువంటి మాటల్లో పడి మనిషి పెడమార్గంలో పడే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఉలమాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటే, క్లాసులలో పాల్గొని ఉండేది ఉంటే, ఇంకా దానికి సంబంధించిన వ్యాఖ్యానాలు చదువుతూ ఉంటే, ఒక్కొక్క ఆయత్ ద్వారా ఎన్ని ధర్మ విషయాలు ధర్మవేత్తలు మనకు తెలియజేస్తూ ఉంటారు.

మస్జిద్ లో నిలవడం జునూబీపై నిషిద్ధం అన్న దాని గురించి ఈ ఆయత్ నుండి ఎలా దలీల్ తీసుకున్నారో చెప్పండి? ఇల్లా ఆబిరీ సబీలిన్. జునూబీ ఎవరైతే ఉన్నారో వారు నమాజ్‌కు, నమాజ్ చేసే స్థలానికి అక్కడికి రాకూడదు. కానీ నమాజ్ చేసే స్థలం ఏదైతే ఉంటుందో, ఇల్లా ఆబిరీ సబీల్ – అలా దాటుతూ వెళ్ళవచ్చు. అయితే, నమాజ్ చేసే స్థలం అంటే ఇక మస్జిద్. సర్వసామాన్యంగా. అయితే ఆ మస్జిద్, దానికి కూడా ఒక గౌరవ స్థానం అల్లాహ్ ప్రసాదించాడు. అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ ఆయత్ ఏదైతే అవతరించిందో ఇది నమాజ్ గురించి, నమాజ్ చేసే స్థలం గురించి కూడా అని ధర్మవేత్తలు దీని గురించి ఏకీభవించారు. హనఫీ, మాలికీ, షాఫియీ, హంబలీ, అందరూ దీనిని ఏకీభవించారు.

ఒకవేళ ఎవరికైనా అనుమానం రావచ్చు, సర్వసామాన్యంగా మేము అంటూ ఉంటాము, మనం కేవలం ఖుర్ఆన్ హదీస్‌ను ఫాలో కావాలి. ఇక ఎవరైతే ఖుర్ఆన్ హదీస్ కాకుండా ఈ మస్లక్‌లలో పడి ఉన్నారో, హనఫీ, షాఫియీ, హంబలీ, మాలికీ, ఈ విధంగా ఇది మంచి విషయం కాదు, అంధీ తఖ్లీద్ (గుడ్డి అనుకరణ) అనేది ఇది చాలా ప్రమాదకరం అని చెబుతూ ఉంటారు. మరి ఈ మస్లే మసాయిల్, ఈ ధర్మ విషయాలు బోధిస్తున్నప్పుడు మాటిమాటికి హనఫీ, మాలికీ, షాఫియీ, హంబలీ అందరూ దీనిని ఏకీభవించారు అని వాటిని ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఇది తెలుసుకోవాల్సిన విషయం. చూడండి, ఇదే మన్హజె సలఫ్. మనకు సహాబాలు ఎలా ఖుర్ఆన్ హదీసులను అర్థం చేసుకున్నారో, ధర్మవేత్తలు ఎలా అర్థం చేసుకున్నారో, వాటిని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని అదే రకంగా మనం అనుసరించాలి. ఎప్పుడైనా ఎవరైనా, ఎక్కడైనా వారితో పొరపాటు జరిగితే వారి గురించి అల్లాహ్ వారిని మన్నించుగాక అని దుఆ చేస్తూ, ఖుర్ఆన్ హదీస్‌కు చేరువగా, దగ్గరగా ఎవరి మాట ఉందో తీసుకోవాలి, ఖుర్ఆన్ హదీస్‌ను అనుసరించాలి. అల్లాహ్ యొక్క దయ కలిగితే వేరే సందర్భాలలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చెబుదాము.

అయితే, జునూబీ అశుద్ధావస్థలో ఉన్న వ్యక్తి మస్జిద్ లో నిలవకూడదు. ఈ ఆయత్ ద్వారా దలీల్ తీసుకోవడం జరిగింది. ధర్మ పండితులందరూ కూడా ఏకీభవించారు. తఫ్సీర్ ఇబ్ను కసీర్ లో ఈ మాట ఉంది. అలాగే సౌదీ అరబ్ లోని ఇఫ్తా కమిటీ, ఫత్వా కమిటీ ఏదైతే ఉందో వారు కూడా దీనిని ఏకీభవించారు. కానీ ఇందులో ఒక విషయం, ఖుర్ఆన్ ఆయత్ ద్వారానే మనకు తెలుస్తుంది. ఎవరికైనా వేరే ఏ గత్యంతరం లేక మస్జిద్ నుండి దాటి వెళ్ళవలసిన అవసరం వస్తే, వారు తప్పకుండా అలా వెళ్ళవచ్చు. ఇందులో అనుమానం లేదు. ఫిఖ్ షాఫియీ, హంబలీ అలాగే ఇమామ్ ఇబ్ను తైమియా, ఇబ్ను బాజ్, ఇబ్ను ఉసైమీన్ వీరందరి ఫత్వాలు కూడా ఇలాగే ఉన్నాయి.

ఇక్కడ ఒక విషయం. ఈ రోజుల్లో కొన్ని సందర్భాల్లో ఇప్పుడు లాక్డౌన్ కారణంగా కాకపోవచ్చు కానీ అంతకుముందు కూడా మస్జిద్ లో పడుకుంటారు కొందరు. అయితే మస్జిద్ లో పడుకోవడం పాపం తప్పేమీ లేదు. కానీ ఎవరైతే మస్జిద్ లో పడుకుంటున్నారో వారు ఈ విషయాన్ని, ఈ అంశాన్ని శ్రద్ధగా ఎల్లవేళల్లో మదిలో నాటుకొని ఉండాలి. అదేమిటి? ఒకవేళ నిద్రలో వారికి స్వప్నస్కలనం జరిగిందంటే, వెంటనే వారు వెళ్లి స్నానం చేసేయాలి. అరె ఫజర్ నమాజ్ కొరకు ఇంకా మూడు గంటలు ఉన్నాయి కదా, ఇంకా రెండు గంటలు ఉన్నాయి కదా అని అలాగే అక్కడ పడుకొని ఉండిపోవడం, ఇది మంచి విషయం కాదు.

సోదర మహాశయులారా, ఈ విధంగా మనం అల్లాహ్ యొక్క దయవల్ల ఈ అశుద్ధావస్థలో ఏ ఏ పనులు చేయరాదు అన్నటువంటి విషయం ఆ మనం తెలుసుకున్నాము. అయితే, ఖుర్ఆన్ చదవవచ్చు కానీ ఖుర్ఆన్ ను తాకకూడదు అని సల్మాన్ ఫార్సీ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క మాట ద్వారా కూడా మనం అర్థం చేసుకున్నాము ఈ మధ్యలో. కానీ ఎలాగైనా అశుద్ధావస్థ అనేది జనాబత్‌కు సంబంధించింది, ఎక్కువ సేపు ఉండదు గనుక మనం కావాలని మరీ ఆలస్యం చేయకూడదు. కావాలని ఖుర్ఆన్ ను తాకడం గాని, చదవడం గాని చేయకుండా ఉండి, అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తూ ఉండడం, ఇందులో అభ్యంతరం లేదు.

మరి ఏ ధర్మ పండితులైతే ఖుర్ఆన్ చూడకుండా చదవవచ్చు అని అన్నారో, వారు తీసుకున్నటువంటి దలీళ్లలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్, అన్న నబి సల్లల్లాహు అలైహి వసల్లం, రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కాన యద్కురుల్లాహ అలా కుల్లి అహ్యానిహి – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎల్లవేళల్లో అల్లాహ్ యొక్క జికర్ చేస్తూ ఉండేవారు. ఇమామ్ బుఖారీ ము’అల్లఖన్ ఈ హదీస్‌ను ప్రస్తావించారు 634 కంటే ముందు, సహీహ్ ముస్లింలో 373లో ఈ హదీస్ ఉంది.

కానీ హజ్రత్ అలీ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఆచరణ గురించి ముసన్నఫ్ అబ్దుర్రజాఖ్‌లో అలాగే ఇమామ్ అబూ ను’అయమ్ అస్సలాలో, ఇమామ్ దారుఖుత్నీ సునన్‌లో ఆ మరియు ఇంకా వేరే ధర్మవేత్తలు ప్రస్తావించారు, అలీ రదియల్లాహు త’ఆలా అన్హు ఒక సందర్భంలో చెప్పారు: ఇఖ్ర’ఉల్ ఖుర్ఆన మా లమ్ యుసిబ్ అహదుకుమ్ జనాబ, ఫ ఇన్ అసాబత్హు జనాబతున్ ఫలా, వలా హర్ఫన్ వాహిదా – మీలో ఎవరైనా జనాబత్, అశుద్ధావస్థకు లోనయ్యారంటే వారు ఖుర్ఆన్ లోని ఒక అక్షరం కూడా చదవకూడదు.

అయితే, మరి అలీ రదియల్లాహు త’ఆలా అన్హు చదవకూడదు అని అంటున్నారు కదా? మరి కొందరు ధర్మవేత్తలు ఏమన్నారు? చదవవచ్చు అని అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ ద్వారా దలీల్ తీసుకున్నారు. అయితే, అలీ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఈ మాట ద్వారా వేరే కొందరు ధర్మవేత్తలు ఏమంటారంటే, అలీ రదియల్లాహు అన్హు చెప్పిన మాట కరెక్టే, చదవకండి అని. కానీ అక్కడ వివరణ లేదు, ఖుర్ఆన్ చూసి చదవడమా లేకుంటే చూడకుండా చదవడమా అని. ఖుర్ఆన్ ను పట్టుకొని చదవడమా లేక మనకు కంఠస్థం ఉన్న దానిలో నుండి చదవడమా? ఈ విధంగా కూడా ఒక దలీల్ ఇవ్వడం జరిగింది.


ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు