[2:24 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
బహిష్టు, బాలింత స్త్రీలు:
స్త్రీలు తమ ఋతుస్రావము మరియు బాలింత గడువులో ఉన్నప్పుడు నమాజ్, ఉపవాసాలు పాటించకూడదు. హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“నీవు ఋతువు గడువు దినాల్లో నమాజ్ చేయడం మానేయి. ఋతు స్రావం ముగిసాక నీ వొంటి మీది రక్తాన్ని కడిగి (తలంటు స్నానం చేసి) నమాజ్ చేస్తూ ఉండు”. (బుఖారి 331, ముస్లిం 333).
తప్పి పోయిన నమాజులు తిరిగి చేయకూడదు. కాని తప్పి పోయిన ఉపవాసాలు మాత్రం పూర్తి చేయాలి. అలాగే వీరు కాబా ప్రదక్షిణం (తవాఫ్) కూడా చేయకూడదు. ఈ గడువులో భర్త తన భార్యతో సంభోగించడం కూడా నిషిధ్ధం. అయితే రమించడం తప్ప పరస్పరం ఏ రకమైన ఆనందం పొందినా తప్పు లేదు. ఈ స్థితిలో స్త్రీ ఖుర్ఆనును తాక వద్దు.
రక్త స్రావం ఆగిన తరవాత స్నానం చేయడం విధిగా ఉంది([1]). స్నానం తర్వాత వారి గడువులో నిశిద్ధంగా ఉన్నవన్నీ ధర్మ సమ్మతం అవుతాయి.
నమాజ్ సమయం ప్రవేశించిన తరువాత, ఆ నమాజ్ చేయక ముందే ఏ స్త్రీకైనా ఋతు స్రావం మొదలవుతే, లేదా ప్రసవిస్తే ఆమె పరిశుద్ధురా- లయిన తరువాత ఆ నమాజును తిరిగి చేయాలి. (ఉదా: జొహ్ర్ నమాజ్ వేళ ఆరంభమయింది పగలు పన్నెండు గంటల నలబై నిమిషాలకు, ఒక స్త్రీ ఒకటింటి వరకు కూడా జొహ్ర్ నమాజ్ చేసుకోలేక పోయింది. అప్పుడే ఋతు స్రావం మొదలయింది, లేదా ప్రసవించింది. అలాంప్పుడు ఆ స్త్రీ పరిశుద్ధురాలయిన తరువాత జొహ్ర్ నమాజ్ చేయాలి). ఒక రకాతు మాత్రమే చేయునంత సమయం ఉన్నప్పుడు పరిశుద్ధుమైన స్త్రీ గుస్ల్ చేసిన తరువాత ఆ నమాజ్ చేసుకోవాలి. ఒక వేళ అది అస్ర్ లేదా ఇషా నమాజ్ అయితే అస్ర్ తో పాటు జొహ్ర్, మగ్రిబ్ తో పాటు ఇషా కూడా చేయుట అభిలషణీయం. ఉదాః సూర్యాస్తమయానికి ఒక రకాత్ చేయునంత ముందు పరిశుద్ధమైతే అస్ర్ నమాజ్ మాత్రం తప్పక చేయాలి. అయితే జొహ్ర్ కూడా ఖజా చేస్తే మంచిది. అర్థ రాత్రికి కొంచెం ముందు పరిశుద్ధురాలయితే ఇషా మాత్రం చేయవలసిందే, అయితే మగ్రిబ్ కూడా చేయడం మంచిది.
[1] కొందరు బాలింత స్త్రీలు 15, లేదా 20, 25 రోజుల్లో రక్త స్రావం నిలిచిపోయినా 40 రోజుల తరువాతే గుస్ల్ చేస్తారు. ఆ తరువాతే నమాజు ఆరంభిస్తారు. వారు ఇలా చేసేది చాలా ఘోరమైన తప్పు. ఎప్పుడు రక్త స్రావం నిలిచినదో అప్పుడే గుస్ల్ చేయాలి. నమాజు మొదలెట్టాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[44:53 నిముషాలు] హైజ్ వ నిఫాస్ (బహిష్టు & పురిటి రక్తం) ఆదేశాలు & ప్రశ్నోత్తరాలు వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది. శుద్ధి & నమాజు[పుస్తకం]
బహిష్టు, బాలింత స్త్రీలు:
స్త్రీలు తమ ఋతుస్రావము మరియు బాలింత గడువులో ఉన్నప్పుడు నమాజ్, ఉపవాసాలు పాటించకూడదు. హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“నీవు ఋతువు గడువు దినాల్లో నమాజ్ చేయడం మానేయి. ఋతు స్రావం ముగిసాక నీ వొంటి మీది రక్తాన్ని కడిగి (తలంటు స్నానం చేసి) నమాజ్ చేస్తూ ఉండు”. (బుఖారి 331, ముస్లిం 333).
తప్పి పోయిన నమాజులు తిరిగి చేయకూడదు. కాని తప్పి పోయిన ఉపవాసాలు మాత్రం పూర్తి చేయాలి. అలాగే వీరు కాబా ప్రదక్షిణం (తవాఫ్) కూడా చేయకూడదు. ఈ గడువులో భర్త తన భార్యతో సంభోగించడం కూడా నిషిధ్ధం. అయితే రమించడం తప్ప పరస్పరం ఏ రకమైన ఆనందం పొందినా తప్పు లేదు. ఈ స్థితిలో స్త్రీ ఖుర్ఆనును తాక వద్దు.
రక్త స్రావం ఆగిన తరవాత స్నానం చేయడం విధిగా ఉంది([1]). స్నానం తర్వాత వారి గడువులో నిశిద్ధంగా ఉన్నవన్నీ ధర్మ సమ్మతం అవుతాయి.
నమాజ్ సమయం ప్రవేశించిన తరువాత, ఆ నమాజ్ చేయక ముందే ఏ స్త్రీకైనా ఋతు స్రావం మొదలవుతే, లేదా ప్రసవిస్తే ఆమె పరిశుద్ధురా- లయిన తరువాత ఆ నమాజును తిరిగి చేయాలి. (ఉదా: జొహ్ర్ నమాజ్ వేళ ఆరంభమయింది పగలు పన్నెండు గంటల నలబై నిమిషాలకు, ఒక స్త్రీ ఒకటింటి వరకు కూడా జొహ్ర్ నమాజ్ చేసుకోలేక పోయింది. అప్పుడే ఋతు స్రావం మొదలయింది, లేదా ప్రసవించింది. అలాంప్పుడు ఆ స్త్రీ పరిశుద్ధురాలయిన తరువాత జొహ్ర్ నమాజ్ చేయాలి). ఒక రకాతు మాత్రమే చేయునంత సమయం ఉన్నప్పుడు పరిశుద్ధుమైన స్త్రీ గుస్ల్ చేసిన తరువాత ఆ నమాజ్ చేసుకోవాలి. ఒక వేళ అది అస్ర్ లేదా ఇషా నమాజ్ అయితే అస్ర్ తో పాటు జొహ్ర్, మగ్రిబ్ తో పాటు ఇషా కూడా చేయుట అభిలషణీయం. ఉదాః సూర్యాస్తమయానికి ఒక రకాత్ చేయునంత ముందు పరిశుద్ధమైతే అస్ర్ నమాజ్ మాత్రం తప్పక చేయాలి. అయితే జొహ్ర్ కూడా ఖజా చేస్తే మంచిది. అర్థ రాత్రికి కొంచెం ముందు పరిశుద్ధురాలయితే ఇషా మాత్రం చేయవలసిందే, అయితే మగ్రిబ్ కూడా చేయడం మంచిది.
[1] కొందరు బాలింత స్త్రీలు 15, లేదా 20, 25 రోజుల్లో రక్త స్రావం నిలిచిపోయినా 40 రోజుల తరువాతే గుస్ల్ చేస్తారు. ఆ తరువాతే నమాజు ఆరంభిస్తారు. వారు ఇలా చేసేది చాలా ఘోరమైన తప్పు. ఎప్పుడు రక్త స్రావం నిలిచినదో అప్పుడే గుస్ల్ చేయాలి. నమాజు మొదలెట్టాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఎప్పుడూ ఆగకుండా, ఒకవేళ ఆగినా నెలలో కేవలం రెండు మూడు రోజులు మాత్రమే ఆగి మళ్ళీ స్రవిస్తూ ఉండే రక్తాన్ని “ఇస్తిహాజ” అంటారు. కొందరు 15 రోజులకంటే అధికంగా వస్తే అది “ఇస్తిహాజ” అని అన్నారు. ఇక ఏ స్త్రీకైనా బహిష్టు అలవాటే 15రోజలకంటే ఎక్కువగా ఉంటే అది వేరే విషయం.
ముస్తహాజ యొక్క మూడు స్థితులు:
(ఇస్తిహాజలో ఉన్న స్త్రీని ముస్తహాజ అంటారు).
1- స్థితి: ఇస్తిహాజకు ముందు బహిష్టు యొక్క కాలపరిమితి ఎన్ని రోజులనేది గుర్తుండవచ్చు. ఆ కాలపరిమితి ప్రకారం అన్ని రోజులు బహిష్టు రోజులని లెక్కించాలి. అప్పుడు బహిష్టు ఆదేశాలే ఆమెకు వర్తించును. మిగితా రోజులు ఇస్తిహాజ రోజులుగా లెక్కించాలి. అప్పుడు ఆమె ఇస్తహాజ ఆదేశాలను పాటించాలి.
దీని ఉదాహరణ: ఒక స్త్రీకి ప్రతి నెలారంభంలో ఆరు రోజులు బహిష్టు వచ్చేది. కాని ఒకసారి ఆ కాలం దాటినప్పటికీ ఆగలేదు. అలాంటపుడు ఆ నెల మొదటి ఆరు రోజులు బహిష్టు రోజులుగానూ ఆ తరువాతవి ఇస్తిహాజ రోజులుగానూ లెక్కించ వలెను. ఆరు రోజుల తరువాత స్నానం చేసి నమాజు, ఉపవాసాలు పాటించాలి. అప్పుడు రక్తస్రావం జరుగుతూ ఉన్నా పరవాలేదు.
2- స్థితి: మొదటిసారి బహిష్టు అయి, ఆగకుండా రక్తస్రావం జరుగుతూ ఉంటే బహిష్టు రోజుల గడువు తెలిసే వీలు లేకుంటే అలాంటప్పుడు బహిష్టు రక్తము మరియు ఇస్తిహాజ రక్తములో భేదమును తెలుసుకోవాలి. బహిష్టు రక్తము నలుపుగా లేక దుర్వాసనగా లేక చిక్కగా ఉండును. ఈ మూడిట్లో ఏ ఒక్క విధంగానున్నా అప్పుడు బహిష్టు ఆదేశాల్ని పాటించాలి. ఎప్పుడయితే ఇవి మారునో అప్పటి నుండి ఇస్తిహాజ ఆదేశాలు పాటించాలి.
దీని ఉదాహరణ: ఒక స్త్రీకి రక్తస్రావం ప్రారంభమయి ఆగడము లేదు. అలాంటపుడు తేడా/వ్యత్యాసం ఉందా లేదా గమనించవలెను. ఉదాహరణకు: పది రోజులు నలుపుగా తరువాత ఎరుపుగా లేక పది రోజులు చిక్కగా తరువాత పలుచగా లేక పది రోజులు దుర్వాసన తరువాత ఏ వాసన లేకుండా ఉంటే, మొదటి మూడు గుణాలు అంటే నలుపుగా, చిక్కగా, దుర్వాసనగా ఉంటే ఆమె బహిష్టురాళు. ఆ మూడు గుణాలు లేకుంటే ఆమె ముస్తహాజ.
3- స్థితి: బహిష్టు కాలపరిమితి తెలియదు, తేడాను గుర్తు పట్టట్లేదు. రక్త స్రావం ప్రారంభమైనప్పటి నుంచే ఆగకుండా ఉంది. అంతే గాకుండా ఒకే విధంగా ఉండి భేదము కూడా ఏర్పడడము లేదు, లేక అది బహిష్టు అన్న ఖచ్చితమైన నిర్ధారణకు రాకుండా సందిగ్ధంలో పడవేసే విషయాలున్నప్పుడు తన దగ్గరి బంధువుల్లో ఉన్న స్త్రీల అలవాటు ప్రకారం మొదటి నుంచే ఆరు లేక ఏడు రోజులు బహిష్టు రోజులుగా లెక్కించి, మిగితవి ఇస్తిహాజగా లెక్కించవలెను.
ఇస్తిహాజ ధర్మములు
ఇస్తహాజ మరియు పరిశుద్ధ స్త్రీలలో ఈ చిన్న భేదము తప్ప మరేమీ లేదు.
1- ముస్తహాజా ప్రతి నమాజుకు వుజూ చేయాలి.
2- వుజూ చేసే ముందు రక్త మరకలను కడిగి రహస్యాంగాన్ని దూదితో గట్టిగా బంధించాలి.
నిఫాసు, దాని ధర్మములు
ప్రసవ కారణంగా గర్భ కోశము నుంచి స్రవించు రక్తాన్ని నిఫాసు అంటారు. అది ప్రసవముతోనైనా, లేక తరువాత ప్రారంభమైనా, లేక ప్రసవావస్థతో ప్రసవానికి రెండు మూడు రోజుల ముందైనా సరే. అలాంటి స్త్రీ రక్తస్రావం ఆగిపోయినప్పుడే పరిశుద్ధమగును. (కొందరు స్త్రీలు నలబై రోజులకు ముందే రక్తస్రావం నిలిచినప్పటికీ స్నానం చేసి పరిశుద్ధులు కారు. నమాజు ఇతర ప్రార్థనలు చేయరు. నలబై రోజుల వరకు వేచిస్తారు. ఇది తప్పు. ఎప్పుడు పరిశుద్ధు- రాలయినదో అప్పటి నుండే నమాజులు మొదలెట్టాలి). నలబై రోజులు దాటినా రక్తస్రావం ఆగకుండా ఉంటే, నలబై రోజుల తరువాత స్నానం చేయవలెను. “నిఫాసు” కాలపరిమితి నలబై రోజులకంటే ఎక్కువ ఉండదు. నలబై రోజులకు ఎక్కువ అయితే అది బహిష్టు కావచ్చును. ఒకవేళ బహిష్టు అయితే, ఆ నిర్ణిత రోజులు ముగిసి పరిశుద్ధమయిన తరువాత స్నానం చేయవలెను.
పిండము మానవ రూపము దాల్చిన తరువాత జన్మిస్తెనే “నిఫాసు” అనబడును. మానవ రూపం దాల్చక ముందే గర్భము పడిపోయి రక్తస్రావం జరిగితే అది నిఫాసు కాదు. అది ఒక నరము నుంచి స్రవించు రక్తము మాత్రమే. అప్పుడు ముస్తహాజకు వర్తించే ఆదేశమే ఆమెకు వర్తించును. మానవ రూపము ఏర్పడుటకు కనీస కాలం గర్భము నిలిచినప్పటి నుండి ఎనభై (80) రోజులు. గరిష్ఠ కాలం తొంబై (90) రోజులు అవుతుంది.
నిఫాసు ధర్మములు కూడా బహిష్టు గురించి తెలిపిన ధర్మములే.
బహిష్టు మరియు కాన్పులను ఆపడం
స్త్రీ బహిష్టు కాకుండా ఏదయినా ఉపయోగించదలుచుకుంటే ఈ రెండు షరతులతో ఉపయోగించవచ్చును.
1- ఏలాంటి నష్ట భయముండకూడదు. నష్ట భయమున్నచో అది ధర్మసమ్మతం కాదు.
2- భార్య తన భర్త అనుమతితో ఉపయోగించాలి.
బహిష్టు కావడానికి ఏదయినా ఉపయోగించ దలుచుకంటే ఈ రెండు షరతులతో ఉపయోగించవచ్చును.
1- భర్త అనుమతితో ఉపయోగించాలి.
2- నమాజు, రోజా లాంటి విధిగా ఉన్న ఆరాధనలు పాటించని ఉద్దేశంగా ఉపయోగించకూడదు.
గర్భం నిలువకుండా (కుటుంబ నియంత్రణ కొరకు) ఏదైనా ఉపయోగించదలుచుకుంటే ఈ రెండు షరతులను పాటించాలి.
1- కుటుంబ నియంత్రణ ఉద్దేశంగా చేయుట యోగ్యం లేదు.
2- ఒక నిర్ణీత కాలపరిమితి వరకు అనగా గర్భము వెంటనే గర్భము నిలిచి స్త్రీ ఆరోగ్యానికి హాని కలిగే భయముంటె మాత్రమే. అది కూడా భర్త అనుమతితో. ఇంకా దీని వల్ల ఆమె ఆరోగ్యానికి ఏదైనా హాని కలిగే భయం ఉంటే కూడా చేయించకూడదు.
హైజ్ (బహిష్టు) ధర్మములు, అసాధారణ బహిష్టు – దాని రకాలు
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[27:32 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది. శుద్ధి & నమాజు[పుస్తకం]
తయమ్ముమ్:
క్రింద తెలుపబడే కారణాలు సంభవించి నప్పుడు ప్రయాణికులు, స్థానికులు ఎవరైనా సరే వుజూ మరియు గుస్ల్ కు బదులుగా తయమ్ముమ్ చేయవచ్చును.
1- అతికష్టంగా వెతికినప్పటికీ నీళ్ళు దొరకనప్పు డు, లేదా ఉండికూడా వుజూకు సరిపడనప్పుడు తయమ్ముమ్ చేయవచ్చును. కొంత దూరములో నీళ్ళు ఉన్నా అక్కడికి వెళ్ళి తీసుకోవడంలో అతనికి ధన, ప్రాణ నష్టమున్నప్పుడు కూడా తయమ్ముమ్ చేయవచ్చును.
2- వుజూ అవయవాల్లో ఏ ఒకదానికైనా గాయమయితే దాన్ని కడిగే ప్రయత్నం చేయాలి. కడగడం వల్ల నష్టం ఉంటే మసహ్ చేయాలి, అంటే చేయి తడి చేసి దాని మీద తుడువాలి. మసహ్ వల్ల కూడా హాని కలిగే భయం ఉంటే తయమ్ముమ్ చేయవచ్చును.
3- నీళ్ళు లేదా వాతవరణం మరీ చల్లగా ఉండి నీళ్ళ ఉపయోగం హానికరంగా ఉంటే తయమ్ముమ్ చేయవచ్చును.
4- నీళ్ళు కేవలం త్రాగడానికి మాత్రమే ఉన్నప్పుడు కూడా తయమ్ముమ్ చేయవచ్చును.
తయమ్ముమ్ విధానం:
మనుసులో నియ్యత్ /సంకల్పం చేసుకొని రెండు అరచేతులు ఒక సారి భూమిపై తట్టి ముఖముపై మళ్ళీ మణికట్ల వరకు రెండు చేతులపై మసహ్ చేయాలి. (కొందరు వుజూ చేసినట్లుగా మోచేతుల వరకు, కాళ్ళు సయితం మసహ్ చేస్తారు ఇది ప్రవక్త పద్దతి ఎంతమాత్రం కాదు). వుజూను భంగపరిచే విషయాలే తయ మ్ముమ్ ను భంగపరుస్తాయి. నమాజుకు ముందు లేదా నమాజ్ మధ్యలో నీళ్ళు లభిస్తే తయమ్ముం భంగమవుతుంది. నమాజ్ పూర్తి చేసుకున్న తరువాత నీళ్ళు లభిస్తే ఆ నమాజ్ అయినట్లే. తిరిగి మళ్ళీ చేయవలసిన అవసరం లేదు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[30:27 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
అంశాలు: ‘జునుబీ’ పై నిషిద్ధ విషయాలు
ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది. శుద్ధి & నమాజు[పుస్తకం]
‘జునుబీ’ పై నిషిద్ధ విషయాలు:
(స్వప్నస్ఖలనం వల్ల, లేదా భార్యభర్తల సంభోగం కారణంగా అశుద్ధతకు లోనయిన వ్యక్తిని ‘జునుబీ’ అంటారు).
1- నమాజ్. 2- తవాఫ్. 3- దివ్య ఖుర్ఆనును ముట్టుకోవడం, మెల్లగ, శబ్దముగా, చూసీ, చూడక ఏ స్థితిలోగాని చదవడం నిశిధ్ధం. 4- మస్జిదులో నిలవడం. కాని మస్జిదులో నుండి దాటి పోవడంలో తప్పేమీ లేదు. మస్జిదులో నిలువవలసినప్పుడు వుజూ చేసుకున్నా (మలినం కొంత వరకు తగ్గును, కనుక అది) సరిపోవును.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[45:28 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
అంశాలు: గుసుల్ (శుద్ధి స్నానం)
ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది. శుద్ధి & నమాజు[పుస్తకం]
గుస్ల్ (స్నానం):
శుద్ధి పొందే ఉద్దేశం (నియ్యత్)తో పూర్తి శరీరంపై నీళ్ళు పోసుకొనుటనే గుస్ల్ అంటారు. పూర్తి శరీరం కడగడం, అందులో పుక్కిలించడం మరియు ముక్కులో నీళ్ళు ఎక్కించడం కూడా తప్పనిసరి. అప్పుడే గుస్ల్ అగును. (ప్రవక్త గుస్ల్ పద్థతి ఇదిః ముందు మర్మాంగ భాగాన్ని శుభ్ర- పరుచుకోవాలి. పిదప నమాజుకు చేయునటు- వంటి వుజూ చేయాలి. అరచేతిలో నీళ్ళు తీసుకొని తల మీద పోసి రుద్దాలి. ఇలా మూడు సార్లు చేయాలి. మళ్ళీ పూర్తి శరీరము పై నీళ్ళు పోసుకొని స్నానం చేయాలి).
ఐదు సందర్భాల్లో గుస్ల్ చేయడం విధిగా ఉంది:
1- స్త్రీలకు గానీ పురుషులకు గానీ నిద్రలో ఉన్నా లేక మేల్కొని ఉన్నా కామము (షహ్వత్)తో ‘మనీ’ ఉబికిపడితే గుస్ల్ విధి అవుతుంది. కామము లేకుండా ఏదైనా వ్యాది, లేదా విపరీతమైన చలి కారణంగా వెలువడితే గుస్ల్ విధి కాదు. అలాగే స్ఖలనమైనట్లు కలగని ‘మనీ’ లేదా దాని మర్కలేమీ చూడకుంటే గుస్ల్ విధి కాదు. ఎప్పుడు ‘మనీ’ లేక దాని మర్కలు కనబడునో అప్పుడే గుస్ల్ విధి అవుతుంది. స్ఖలమైనట్లు అతనికి గుర్తు లేకున్నా పరవాలేదు.
2- మర్మాంగాల కలయిక. అంటే భర్త మర్మాంగం భార్య మర్మాంగంలో ప్రవేశించినప్పుడు వీర్యం పడకపోయినా స్నానం చేయుట విధియగును.
3- రుతు స్రావం, ప్రసవ స్రావం ముగిసిన తరువాత గుస్ల్ విధియగును.
4- శవానికి గుస్ల్ చేయించడం విధిగా ఉంది.
5- అవిశ్వాసుడు ఇస్లాం స్వీకరించినపుడు.
‘జునుబీ’ పై నిషిద్ధ విషయాలు:
(స్వప్నస్ఖలనం వల్ల, లేదా భార్యభర్తల సంభోగం కారణంగా అశుద్ధతకు లోనయిన వ్యక్తిని ‘జునుబీ’ అంటారు).
1- నమాజ్. 2- తవాఫ్. 3- దివ్య ఖుర్ఆనును ముట్టుకోవడం, మెల్లగ, శబ్దముగా, చూసీ, చూడక ఏ స్థితిలోగాని చదవడం నిశిధ్ధం. 4- మస్జిదులో నిలవడం. కాని మస్జిదులో నుండి దాటి పోవడంలో తప్పేమీ లేదు. మస్జిదులో నిలువవలసినప్పుడు వుజూ చేసుకున్నా (మలినం కొంత వరకు తగ్గును, కనుక అది) సరిపోవును.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“హైజ్” (బహిష్టు) కాలము, దాని గడువు: స్త్రీలకు ప్రతి నెలా జరిగే రక్తస్రావాన్ని హైజ్ అంటారు.
1- వయస్సు: ఎక్కువ శాతం 12 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సులో హైజ్ వస్తుంది. ఆరోగ్యం, వాతవరణం మరియు ప్రాంతాన్ని బట్టి ముందుగాని తరువాత గాని రావచ్చు.
2- కాలపరిమితి: కనీసం ఒక రోజు. గరిష్ఠ కాలపరిమితి 15 రోజులు.
గర్భిణి యొక్క బహిష్టు: సామాన్యంగా గర్భం నిలిచిన తర్వాత రక్త స్రావముండదు. గర్భిణీ ప్రసవ వేదనతో ప్రసవించడానికి రెండు మూడు రోజుల ముందు రక్తము చూసినచో అది “నిఫాసు” అగును. ఒకవేళ ప్రసవ వేదన లేనిచో అది “నిఫాసు” కాదు, బహిష్టు కాదు.
అసాధారణ బహిష్టు:
అసాధారణ బహిష్టు రకాలు:
1- ఎక్కువ, తక్కువ: ఉదాః ఒక స్త్రీ యొక్క (బహిష్టు కాలం) సాధారణంగా ఆరు రోజులు. కాని ఒక సారి ఏడు రోజులు వచ్చింది, ఏడు రోజుల అలవాటుండి ఆరు రోజులే వచ్చింది.
2- వెనక, ముందు: ఉదాః నెలారంభంలో అలవాటుండి నెలాఖరులో వచ్చింది. నెలాఖరులో అలవాటుండి నెలారంభంలో వచ్చింది.
పరిష్కారం: వెనక, ముందు అయినా, ఎక్కువ, తక్కువ రోజులు అయినా, ఎప్పుడు రక్తస్రావం చూసిందో అప్పుడే బహిష్టు, ఎప్పుడు ఆగి పోతుందో అప్పుడే పరిశుభ్రమయినట్లు.
3- పసుపు లేదా గోదుమ రంగు: బహిష్టు రోజుల మధ్యలో లేదా చివరిలో పరిశుభ్రతకు కొంచం ముందు పసుపు లేదా గోదుమ రంగు వలే అంటే పుండు నుండి వెళ్ళే నీటి మాదిరిగా చూచినచో అది బహిష్టు రక్తస్రావమే అగును. బహిష్టు స్త్రీలకు వర్తించే ఆదేశము ఆ స్త్రీకి వర్తించును. ఒకవేళ పరిశుభ్రత పొందిన తరువాత అలా వస్తే అది బహిష్టు రక్తస్రావము కాదు.
4- ఒక రోజు రక్తస్రావముండడము మరో రోజు ఉండక పోవడం.
ఇది రెండు రకాలుగా కావచ్చు.
మొదటి రకం: ఇది ఎల్లపుడూ ఉన్నచో “ముస్తహాజ” కావచ్చును. “ముస్తహాజా”లకు వర్తించే ఆదేశాలే ఆమెకు వర్తించును.
రెండవ రకం: ఎల్లపుడూ కాకుండా, ఎప్పుడయినా ఒకసారి వచ్చి, ఆ తరువాత పరిశుభ్రం అవుతుంది.
ఎవరికి ఒకరోజుకన్నా తక్కువ రక్తస్రావం ఆగిపోతుందో అది పరిశుద్ధతలో లెక్కించబడదు. ఒకవేళ ఏదైనా గుర్తు ఉంటే అది వేరే విషయం; ఉదా: అలవాటుగా ఉన్న చివరి రోజుల్లో ఆగిపోవడం, లేదా తెల్లని ద్రవం రావడం (తెల్లబట్ట అవడం కూడా అంటారు కొందరు).
5- రక్తస్రావం ఉండదు కాని బహిష్టు రోజుల మధ్య లేక పరిశుద్ధమగుటకు కొంచెం ముందు తడిగా ఉన్నట్లు గ్రహించినచో అది బహిష్టు. ఒకవేళ పరిశుద్ధమయిన తరువాత ఉంటే అది బహిష్టు కాదు.
బహిష్టు యొక్క ధర్మములు
1- నమాజ్: బహిష్టు స్త్రీ పై ఫర్జ్, సున్నత్, నఫిల్ అన్ని విధాల నమాజులు నిషిద్ధం. చేసినా అది నెవరవేరదు. కాని కనీసం ఒక రకాత్ చేయునంత సమయం దాని మొదట్లో లేక చివరిలో లభించినచో ఆ నమాజు తప్పకుండా చేయవలెను. మొదటి దానికి ఉదాహరణః సూర్యాస్తమయం అయ్యాక మగ్రిబ్ యొక్క ఒక రకాత్ చేయునంత సమయం దాటాక బహిష్టు అయినచో, ఆమె పరిశుద్ధమయిన తర్వాత ఆ మగ్రిబ్ నమాజు ‘ఖజా’ చేయవలెను. ఎందుకనగా ఆ నమాజు యొక్క ఒక్క రకాతు చేయునంత సమయం పొందిన పిదపనే బహిష్టు అయింది. ఇక చివరి దానికి ఉదాహరణః సూర్యోదయానికి ముందు ఒక రకాత్ మాత్రమే చేయునంత సమయం ఉన్నపుడు పరిశుద్ధమయితే, (స్నానం చేశాక) ఆ ఫజ్ర్ నమాజ్ ‘ఖజా’ చేయాలి. ఎందుకనగా రక్తస్రావం ఆగిన తరువాత ఆమె ఒక్క రకాత్ చేయునంత సమయం పొందినది.
ఇక జిక్ర్, తక్బీర్, తస్బీహ్, తహ్మీద్, తినుత్రాగినప్పుడు బిస్మిల్లాహ్ అనడం, హదీసు మరియు ధర్మ విషయాలు చదవడం, దుఆ చేయడం, దుఆపై ఆమీన్ అనడం, ఖుర్ఆన్ పారాయణం వినడం, నోటితో కాకుండా చూస్తూ గ్రహించి చదవడం, తెరిచియున్న ఖుర్ఆనులో లేదా బ్లాక్ బోర్డ్ పై వ్రాసియున్న దాన్ని చూస్తూ మనస్సులో చదవడం నేరం కాదు, యోగ్యమే. ఏదైనా ముఖ్య అవసరం: టీచర్ గా ఉన్నపుడు లేదా పరీక్ష సమయాల్లో ఇంకా ఒకరి కరెక్షన్ కొరకు ఖుర్ఆన్ చూస్తూ చదవడం, చదివించడం పాపము కాదు, కాని ఆ సమయంలో చేతులకు గ్లౌజులు ధరించి ఉండాలి, లేదా ఏదైనా అడ్డుతో పట్టుకోవాలి.
2- ఉపవాసం (రోజా): ఫర్జ్, నఫిల్ అన్ని విధాల రోజాలు నిషేధం. కాని ఫర్జ్ రోజాలు తరువాత ఖజా (పూర్తి) చేయాలి. ఉపవాస స్థితిలో బహిష్టు వస్తే ఆ ఉపవాసం నెరవేరదు, అది సూర్యాస్తమయానికి కొన్ని క్షణాల ముందైనా సరే. అది ఫర్జ్ ఉపవాసమయితే ఇతర రోజుల్లో పూర్తి చేయాలి. సూర్యాస్తమయమునకు కొద్ది క్షణాల ముందు రక్తస్రావం అయినట్లు అనిపించి, అలాకాకుండా సూర్యాస్తమయం తరువాతనే అయితే ఆ ఉపవాసం పూర్తయినట్లే. ఉషోదయం అయిన కొద్ది క్షణాల తర్వాత పరిశుద్ధమయితే ఆ రోజు యొక్క ఉపవాసం ఉండరాదు. అదే ఉషోదయానికి కొద్ది క్షణాలు ముందు అయితే ఉపవాసం ఉండాలి. స్నానం ఉషోదయం తరువాత చేసినా అభ్యంతరం లేదు.
3- కాబా యొక్క తవాఫ్ (ప్రదక్షిణం): అది నఫిలైనా, ఫర్జ్ అయినా అన్నీ నిషిద్ధం. హజ్ సమయంలో తవాఫ్ తప్ప ఇతర కార్యాలుః సఫా మర్వా సఈ, అరఫాత్ మైదానంలో నిలవడం, ముజ్దలిఫా, మినాలో రాత్రులు గడపడం, జమ్రాతులపై రాళ్ళు రువ్వడం మొదలగునవన్నీ పూర్తి చేయాలి. ఇవి నిషిద్ధం కావు. పరిశుద్ధ స్థితిలో తవాఫె హజ్ చేసిన వెంటనే లేక సఫా మర్వా సఈ మధ్యలో బహిష్టు ప్రారంభమయితే ఆ హజ్ లో ఏలాంటి లోపముండదు.
4- మస్జిదులో నిలవడం: బహిష్టు స్త్రీ మస్జిదులో ఉండుట నిషిద్ధం.
5- సంభోగం: భార్య రజస్సుగా ఉన్నపుడు భర్త ఆమెతో సంభోగించడం నిషిద్ధం. భర్త సంభోగాన్ని కోరుతూ వచ్చినా భార్య అంగీకరించడం కూడా నిషిద్ధం. పురుషుని కొరకు అతని భార్య ఈ స్థితిలో ఉన్నపుడు ఆమెతో సంభోగం తప్ప ముద్దులాట మరియు కౌగలించుకొనుట ఇతర విషయాలన్నీ అల్లాహ్ అనుమతించాడు.
6- విడాకులుః భార్య రజస్సుగా ఉన్నపుడు విడాకులివ్వడం నిషిద్ధం. ఆమె ఆ స్థితిలో ఉన్నపుడు విడాకులిచ్చినా అతడు అల్లాహ్, ఆయన ప్రవక్త యొక్క అవిధేయుడయి ఒక నిషిద్ధ కార్యం చేసినవాడవుతాడు. కనుక అతడు విడాకులను ఉపసంహరించుకొని ఆమె పరిశుద్ధురాలయిన తరువాత విడాకులివ్వాలి. అప్పుడు కూడా ఇవ్వకుండా మరోసారి బహిష్టు తరువాత పరిశుద్ధురాలయ్యాక ఇష్టముంటే ఉంచుకోవడం లేదా విడాకులివ్వడం మంచిది.
7- స్నానం చేయడం విధిగా ఉందిః పరిశుద్ధురాలయిన తరువాత సంపూర్ణంగా తలంటు స్నానం చేయుట విధి. తల వెంట్రుకలు కట్టి (జెడ వేసి) ఉన్నచో వాటిలో నీళ్ళు చేరని భయమున్నచో అవి విప్పి అందులో నీళ్ళు చేర్పించవలెను. నమాజు సమయం దాటక ముందు పరిశుద్ధమయినచో ఆ సమయంలో ఆ నమాజును పొందుటకు స్నానం చేయడంలో తొందరపడుట కూడా విధిగా ఉంది. ప్రయాణంలో ఉండి నీళ్ళు లేనిచో, లేదా దాని ఉపయోగములో ఏ విధమైనా హాని కలిగే భయమున్నచో, లేక అనారోగ్యం వల్ల హాని కలిగే భయమున్నచో స్నానానికి బదులుగా “తయమ్ముం”(1) చేయవలెను. తరువాత నీళ్ళు లభించిన లేక ఏ కారణమయితే అడ్డగించిందో అది తొలిగిపోయిన తరువాత స్నానం చేయవలెను.
(1) దాని విధానం ఇది: ఒక సారి రెండు చేతులు భూమిపై కొట్టి ముఖముపై ఒకసారి మరియు మణికట్ల వరకు చేతులపై ఒకసారి తుడుచుకోవాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[22:07 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
అంశాలు: వుజూను భంగపరిచే విషయాలు
ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది. శుద్ధి & నమాజు[పుస్తకం]
వుజూను భంగపరిచే విషయాలు:
1- మలమూత్రపు దారుల నుండి ఏదీ వెలువడినా సరే అందు వలన వుజూ భంగమవుతుంది. ఉదాః మలము, మూత్రము, అపానవాయువు (పిత్తు), ‘మనీ’, ‘మజీ’, ‘వదీ’ రక్తము. (‘మనీ’ వలన స్నానం చేయడం విధి అవుతుంది).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ముగీర బిన్ షొఅబ చెప్పారుః ఒక రాత్రి నేను ప్రవక్తతో ఉండగా, ఆయన ఒక చోట మజిలీ చేసి (ఓ చాటున) కాలకృత్యాలు తీర్చుకొని వచ్చారు, అప్పుడు నా వద్ద ఉన్న చెంబుతో నీళ్ళు పోశాను ఆయన వుజూ చేశారు. చివరిలో తమ మేజోళ్ళపై ‘మసహ్’ చేశారు. (బుఖారి 203, ముస్లిం 274).
వాటి పై ‘మసహ్’ చేయుటకు నిబంధనలు ఏమిటంటే అవి వుజూ చేసిన తర్వాత తొడిగి యుండాలి. పై భాగాన ‘మసహ్’ చేయాలి, క్రింది భాగాన కాదు.
‘మసహ్’ గడువు
స్థానికులు ఒక పగలు ఒక రాత్రి, ప్రయాణికులు (ఏ ప్రయాణంలో నమాజ్ ఖస్ర్ చేయవచ్చునో ఆ ప్రయాణంలో) మూడు రేయింబవళ్ళు మేజోళ్ళపై ‘మసహ్’ చేయవచ్చును. (వుజూ చేసి తొడిగిన తరువాత వుజూ భంగమయిన క్షణం నుంచీ గడువు మొదలవుతుంది).
‘మసహ్’ భంగమయే కారణాలు
గడువు ముగిసిన మరుక్షణం నుంచే ‘మసహ్’ భంగమైపోతుంది. ‘మసహ్’ చేసిన తరువాత కనీసం ఒకసారైనా తీసినట్లయితే ‘మసహ్’ భంగమవుతుంది. లేదా మనిషి (స్వప్నస్ఖలనం లేదా భార్యభర్తల సంభోగం కారణంగా) అశుద్ధతకు లోనైతే ‘మసహ్’ భంగమవుతుంది. స్నానం చేయుటకై అవి తీయడం కూడా తప్పనిసరి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారని, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“అల్లాహ్ ఆదేశించిన విధంగా సంపూర్ణంగా వుజూ చేసేవారు, వారి ఫర్జ్ నమాజులు వాటి మధ్య జరిగే పాపాల ప్రక్షాళనకు కారణభూతమవుతాయి”. (ముస్లిం 231).
వుజూ విధానం :
* వుజూలో ఒక అవయవం తర్వాత మరో అవయవం క్రమ ప్రకారంగా మరియు వెంటవెంటనే కడుగుట తప్పనిసరి([1]).
[1] క్రమ ప్రకారంగా వుజూ చేయాలి. అంటే: 1 నుండి 8 వరకు ఉన్న క్రమం ప్రకారం వీటిలో వెనకా ముందు చేయకూడదు. వెంటవెంటనే చేయాలి. అంటేః పై క్రమం ప్రకారం, ఒక అవయవం కడిగాక, దాని తడి ఆరక ముందే వెంటనే దాని వెనక అవయవం కడగాలి. మరీ ఆలస్యం చేయవద్దు.
1- వుజూ నియ్యత్ (సంకల్పం) నోటితో పలుకకుండా మనుసులోనే చేయాలి. ఒక పని చేయుటకు మనుసులో నిర్ణయించుకోవడమే ‘నియ్యత్’.
మళ్ళీ బిస్మిల్లాహ్ అనాలి. (క్రింది వుజూ చిత్రాలు చూడండి).
2- రెండు అరచేతులను మణికట్ల వరకు మూడు సార్లు కడగాలి. (చిత్రం2).
3- మూడు సార్లు నోట్లో నీళ్ళు తీసుకొని పుక్కిలించి, ముక్కులో నీళ్ళు ఎక్కించి శుభ్రం చేయాలి. (చిత్రాలు 3, 4).
4- మూడు సార్లు ముఖము కడగాలి. అడ్డంలో కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు. నిలువులో నొసటి పై భాగం నుండి గదువ క్రింది వరకు. (చి.5)
5- రెండు చేతులు మూడేసి సార్లు కడగాలి. వ్రేలు మొదటి భాగము నుండి మోచేతుల వరకు. ముందు కుడి చెయ్యి, తరువాత ఎడమ చెయ్యి. (చి.6)
6- ఒక సారి తల ‘మసహ్’ చేయాలి. అంటే రెండు చేతులను తడి చేసి తల మొదటి (నుదుటి) భాగము నుండి వెనక మెడ వరకు తీసుకెళ్ళి మళ్ళీ వెనక నుండి మొదటి వరకు తలను స్పర్శిస్తూ తీసుకురావాలి. (చూడండి చిత్రం 7 మరియు దాని తర్వాత చిత్రం).
7- ఒక సారి రెండు చెవుల ‘మసహ్’ చేయాలి. అంటే రెండు చూపుడు వ్రేళ్ళతో చెవి లోపలి భాగాన్ని, బొటన వ్రేళ్ళతో పై భాగాన్ని స్పర్శించాలి. (చిత్రం 8.)
8- రెండు కాళ్ళను వ్రేళ్ళ నుండి చీలమండల వరకు మూడేసి సార్లు కడగాలి. ముందు కుడి కాలు తరువాత ఎడమ కాలు.
9- తర్వాత దుఆ చదవాలి: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారని, ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మీలో ఎవరైనా సంపూర్ణంగా వుజూ చేసుకొని ‘అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహ్’ చదువుతారో అతని కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి, ఎందులో నుండి ప్రవేశించ గోరినా అతని ఇష్టం“. (ముస్లిం 234).
(నేను సాక్ష్యమిస్తున్నాను; అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడని, ఆయన ఏకైకుడు భాగస్వామీ లేనివాడని మరియు సాక్ష్యమిస్తున్నాను; ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.