ఖుర్బానీ ఆదేశాలు – ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ ఖుర్బానీ అసలు ఉద్దేశ్యం,ఖుర్బానీ ప్రాముఖ్యత, ఖుర్బానీ ఘనత, ఖుర్బానీ ఎవరి కొరకు?, కొన్ని ముఖ్య విషయాలు, ఖుర్బానీ నిబంధనలు, ఖుర్బానీ జంతువు లోపాలు, జిబహ్ షరతులు, తప్పులు సరిదిద్దుకుందాం, మృతుల వైపున ఖుర్బానీ.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇబ్రాహీం అలైహిస్సలాం జీవిత సందేశం – హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజాహుల్లాహ్) (19th July 2020) – [సూరా అస్ సాఫ్ఫాత్ , అయతులు 99 నుండి 105 వరకు]
37. సూరా అస్ సాఫ్ఫాత్ , అయతులు 99 నుండి 105 వరకు
7:99 وَقَالَ إِنِّي ذَاهِبٌ إِلَىٰ رَبِّي سَيَهْدِينِ అతను (ఇబ్రాహీమ్) ఇలా అన్నాడు : “నేను నా ప్రభువు వైపుకే పోతాను. ఆయన తప్పకుండా నాకు మార్గం చూపుతాడు.
37:101 فَبَشَّرْنَاهُ بِغُلَامٍ حَلِيمٍ అందువల్ల మేమతనికి, సహనశీలుడైన ఒక అబ్బాయి గురించిన శుభవార్తను అందజేశాము.
37:102 فَلَمَّا بَلَغَ مَعَهُ السَّعْيَ قَالَ يَا بُنَيَّ إِنِّي أَرَىٰ فِي الْمَنَامِ أَنِّي أَذْبَحُكَ فَانظُرْ مَاذَا تَرَىٰ ۚ قَالَ يَا أَبَتِ افْعَلْ مَا تُؤْمَرُ ۖ سَتَجِدُنِي إِن شَاءَ اللَّهُ مِنَ الصَّابِرِينَ మరి ఆ కుర్రాడు అతని వెంట పరుగెత్తే ఈడుకు చేరుకున్నప్పుడు, “ఒరేయ్ చంటీ! నేను నిన్ను ‘జిబహ్’ చేస్తున్నట్లు కల చూస్తున్నాను! మరి నీ అభిప్రాయమేమిటో చెప్పు” అని అతను (ఇబ్రాహీం) అన్నాడు. “నాన్నగారూ! మీకు ఆజ్ఞాపించబడిన దానిని (నిస్సంకోచంగా) నెరవేర్చండి. అల్లాహ్ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు” అని ఆ బాలుడు అన్నాడు.
37:103 فَلَمَّا أَسْلَمَا وَتَلَّهُ لِلْجَبِينِ మరి వారిరువురూ (దైవాజ్ఞను) శిరసావహించినప్పుడు అతను తన కుమారుణ్ణి ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టాడు.
37:105 قَدْ صَدَّقْتَ الرُّؤْيَا ۚ إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ “నువ్వు కలను నిజంచేసి చూపావు.” నిశ్చయంగా మేము సదాచార సంపన్నులకు ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
చేపవాడు (యూనుస్ అలైహిస్సలాం) కోపగించుకుని వెళ్ళిపోయినప్పటి స్థితి(ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి.) మేము తనను పట్టుకోలేమని అతడు భావించాడు. ఆఖరికి అతను చీకట్లలో నుంచి, “అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాణ్ణి” అని మొరపెట్టుకున్నాడు.
అందువల్ల మేము అతని మొరను ఆలకించాము. దుఃఖం నుంచి అతనికి విముక్తిని కల్పించాము. విశ్వాసులను మేము ఇలాగే కాపాడుతాము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మొదటి పంక్తిలో ఉండే కాంక్షలో కూడా గొప్ప ఘనత ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దాని నిర్ణీత ఫలితం తెలుపకుండా మౌనం వహించడమే దాని గొప్ప శ్రేష్ఠతను సూచిస్తుంది. ఆయన ప్రవచనం ఇలా ఉంది:
“అజాన్ చెప్పడంలో, మొదటి పంక్తిలో చేరడంలో ఎంత పుణ్యం ఉందో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు చీటులు వేసుకునే పద్ధతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, వారు తప్పకుండా పరస్పరం చీటులు వేసుకుంటారు. అలాగే నమాజ్ వేళ కాగానే తొలి సమయంలో (మస్జిద్) చేరడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటీపడతారు“. (బుఖారీ 615, ముస్లిం 437).
జాబిర్ బిన్ సముర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా మధ్యలో వచ్చి “దైవదూతలు తమ ప్రభువు ముందు ఏ విధంగా బారులు తీరియుంటారో మీరు ఆ విధంగా మీ పంక్తులను సరి చేసుకోరా?” అని ప్రశ్నించారు. ‘దైవదూతలు తమ ప్రభువు ముందు ఎలా బారులు తీరియుంటారు ప్రవక్తా’ అని మేమడిగాము. “మొదటి పంక్తి పూర్తి చేశాకే దాని తర్వాత పంక్తిలో నిలబడతారు. మరియు దగ్గర దగ్గరగా కట్టు దిట్టంగా నిలబడతారు” అని చెప్పారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). (ముస్లిం 430).
అబూ సఈద్ ఖుద్రీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ అనుచరుల్ని నమాజులోని పంక్తుల నుండి వెనక ఉండడాన్ని చూసి ఇలా చెప్పారు: “ముందుకు రండి, మీరు నన్ను అనుసరించండి. మీ వెనక వారు మిమ్మల్ని అనుసరిస్తారు. (జాగ్రత్త!) ప్రజలు గనక ఎప్పుడూ వెనకే ఉంటే అల్లాహ్ కూడా వారిని వెనకబాటుతనానికి గురిచేస్తాడు“. (ముస్లిం 438).
(క) మొదటి పంక్తుల్లో ఉన్నవారిపై అల్లాహ్ మరియు ఆయన దూతల దీవెనలు:
బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పంక్తుల మధ్య వచ్చి మా భుజాలను, ఛాతిని వెనకా ముందు ఉండ కుండా సరిచేసేవారు. ఇంకా ఇలా అనేవారు: “మీరు పంక్తుల్లో వెనకా మందు విభిన్న రీతిలో నిలబడకండి, అందువల్ల మీలో మనస్పర్థలు ఏర్పడవచ్చు”. ఇంకా ఇలా అనేవారుః “మొదటి పంక్తుల్లో ఉన్నవారిని అల్లాహ్ తనకు అతిసన్నిహితంగా ఉన్న దైవదూతల మధ్య ప్రశంసిస్తాడు మరియు దైవదూతలు వారి కొరకు దుఆ చేస్తారు“. (అబూ దావూద్ 664).
9 – సున్నతె ముఅక్కద
(అ) నిరంతరం సున్నతె ముఅక్కద చదివేవారు స్వర్గంలో ఒక గృహానికి అర్హులవుతారు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా నేను విన్నానని ఆయన సతీమణి ఉమ్మె హబీబ (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు: “ముస్లిం దాసుడు ప్రతి రోజూ ఫర్జ్ నమాజు కాకుండా పన్నెండు రకాతుల నఫిల్ నమాజు అల్లాహ్ కొరకు చేస్తూ ఉంటే అల్లాహ్ అతని కొరకు స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు. లేక ఒక ఇల్లు అతని కొరకు నిర్మించబడుతుంది“. (ముస్లిం 728).
సున్నతె ముఅక్కదలో కొన్ని ఫర్జ్ నమాజుకు ముందున్నాయి, మరి కొన్ని తర్వాతున్నాయి. అవి మొత్తం 12 రకాతులు.
ఫర్జ్ కంటే ముందున్నవి:
1- ఫజ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు:
“ఫజ్ర్ కు ముందు రెండు రకాతులు ప్రపంచము మరియు అందులో ఉన్నవాటి కంటే ఉత్తమమైనవి“. (ముస్లిం 725).
నాతో పాటు మీరు కూడా ఈ హదీసుపై శ్రద్ధ చూపండి:|
“ఫజ్ర్ సున్నతులు ప్రపంచం, వాటిపై ఉన్న డబ్బు, ధనము, బిల్డింగులు, కార్ల కంటే చాలా మేలైనవి.”
2- జొహ్ర్ కు ముందు 4రకాతులు.
ఫర్జ్ తర్వాతవి:
1- జొహ్ర్ తర్వాత రెండు. 2- మగ్రిబ్ తర్వాత రెండు. 3- ఇషా తర్వాత రెండు.
(ఆ) అస్ర్ కు ముందు నాలుగు రకాతులు చేయడం వల్ల అవి చేసేవారికి ప్రవక్త చేసిన రహ్మత్ యొక్క దుఆలో పాలుపంచుకునే భాగ్యం లభిస్తుంది. ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు:
“అస్ర్ కు ముందు నాలుగు రకాతులు చదివేవారి పై అల్లాహ్ కరుణ కురియుగాకా!”. (అబూ దావూద్ 1271, తిర్మిజి 430).
10 – అజాన్ మరియు ఇఖామత్ మధ్యలో దుఆ:
నమాజు వైపునకు త్వరగా వెళ్ళడం వల్ల అజాన్ మరియు ఇఖామత్ మధ్య దుఆ చేసే భాగ్యం కలుగుతుంది. మరియు ఇది దుఆ అంగీకార సమయం గనుక అదృష్టంగా భావించాలి. సమయమే గాకుండా మస్జిద్ స్థలం గనుక దాని శ్రేష్ఠతను దృష్టిలో ఉంచుకోవాలి. ఇంకా నమాజు కొరకు వేచి ఉండి దుఆ చేయడం అన్నది మరీ ఘనత గల విషయం. (ఇలా దుఆ అంగీకరించబడే అవకాశం ఎన్నో రకాలుగా ఉంది). ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు:
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[6 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
కొందరు స్వయం తమ ఖుర్బానీ చేయరు, మృతుల వైపు నుండి చేస్తారు, ఇది తప్పు మరియు ప్రవక్త సంప్రదాయానికి విరుద్ధం. మృతుల వైపున ఖుర్బానీ చేయడం అన్నదే భేదాభిప్రాయం గల సమస్య, ఇక స్వయం తన వైపు నుండి వదలి మృతుల వైపు నుండి ఖుర్బానీ చేయడం గురించి ఏ ధర్మ పండితుడూ అనుమతి ఇవ్వలేదు.
మృతుల వైపున ఖుర్బానీ యొక్క మూడు రకాలున్నాయి:
ఖుర్బానీ ఇస్తున్న వ్యక్తి తన వైపున మరియు తన ఇంటివారిలో బ్రతికిఉన్న మరియు చనిపోయిన వారందరి వైపున అని సంకల్పించుకోవడం యోగ్యం. (ఇబ్ను మాజ 3122).
చనిపోయిన వ్యక్తి వసియ్యత్ చేసి పోతే అతని వైపున ఖుర్బానీ చేయడం.
అతని వసియ్యత్ లేకుండా అతని వైపున చేయడాన్ని కొందరు పండితులు సదఖా (దానధర్మాల) లో లెక్కించి యోగ్యం అని చెప్పారు. కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితంలోనే ఆయన భార్య హజ్రత్ ఖదీజ (రజియల్లాహు అన్హా) మరియు సంతానంలో ముగ్గురు బిడ్డలు, ముగ్గురు కొడుకులు చనిపోయారు, అయినా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎన్నడూ వారి తరఫున ఖుర్బానీ చేయలేదు. (అందుకు సదఖా గా పరిగణించి చేయడం కూడా సహీ అనిపించదు).
[ఖుర్బానీ ఆదేశాలు – ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ ఖుర్బానీ అసలు ఉద్దేశ్యం,ఖుర్బానీ ప్రాముఖ్యత, ఖుర్బానీ ఘనత, ఖుర్బానీ ఎవరి కొరకు?, కొన్ని ముఖ్య విషయాలు, ఖుర్బానీ నిబంధనలు, ఖుర్బానీ జంతువు లోపాలు, జిబహ్ షరతులు, తప్పులు సరిదిద్దుకుందాం, మృతుల వైపున ఖుర్బానీ]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్లామీయ నిషిద్ధతలు (ముహర్రమాత్) – పార్ట్ 03 (23 జులై 2020) [40:44 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు జిబహ్ చేయుట (జంతువును బలి ఇచ్చుట) షిర్క్.
فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ
నీ ప్రభువు కొరకే నమజు చేయు మరియు ఖుర్బానీ ఇవ్వు. (కౌసర్ 108: 2).
అంటే అల్లాహ్ కొరకు మరియు అల్లాహ్ పేరుతో మాత్రమే జిబహ్ చేయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఆదేశించారు:
لَعَنَ اللهُ مَنْ ذَبَحَ لِغَيْرِ الله
“అల్లాహ్కు కాక ఇతరుల కోసం జిబహ్ చేయువానిపై అల్లాహ్ శపించాడు”. (ముస్లిం 1978).
జిబహ్ లో రెండు నిషేధాలు ఏకమవుతాయి. (1) అల్లాహ్ కు తప్ప ఇతరుల కోసం జిబహ్. (2) అల్లాహ్ పేరుతో కాకుండా ఇతరుల పేరుతో జిబహ్. ఈ రెండు కారణాల వల్ల ఆ జంతువు మాంసం తినడం యోగ్యం కాదు. ఈ రోజుల్లో జిన్నుల పేరు మీద జిబహ్ చేసే షిర్క్ ప్రభలి ఉంది. అదేమనగా; ఇల్లు కొనుగోళు చేసినా, నిర్మించినా అందులో ఎక్కడైనా లేదా ప్రత్యేకించి దాని గడప మీద, అలాగే బావి త్రవ్వినా, అక్కడే ఓ జంతువు జిబహ్ చేస్తారు. అది షైతాన్ (భూతాల)కు భయపడి, వాని నష్టం నుండి దూరముండుటకు వాని పేరు మీద జిబహ్ చేస్తారు. (వాస్త వేమిటంటే అల్లాహ్ ను కాక ఇతరులతో భయపడరాదు. ఇలాంటి జిబహ్ చేయరాదు). (తైసీరుల్ అజీజుల్ హమీద్ 158. దారుల్ ఇఫ్తా ముద్రణ).
(4) అల్లాహ్ హరాం చేసినదానిని హలాల్ చేయుట, లేదా హలాల్ చేసిన దానిని హరాం చేయుట
అల్లాహ్ హరాం చేసినదానిని హలాల్ చేయుట, లేదా అల్లాహ్ హలాల్ చేసినదానిని హరాం చేయుట, లేదా ఇలాంటి హక్కు అల్లాహ్ తప్ప ఇతరులకు ఉంది అని నమ్ముట, లేదా సమస్యల తీర్పు కొరకు ఇస్లాం ధర్మం కాకుండా ఇతర న్యాయస్థానాలకు వెళ్ళుట, మరియు ఇస్లామీయ చట్టాలతో కాకుండా ఇతర చట్టాలతో తీర్పు కోరుట, లేదా అది యోగ్యమేనని సంతోషంగా నమ్ముట ఎంతటి భయంకరమైన అవిశ్వాసంలోకి వస్తుందో ఈ ఆయతు ద్వారా తెలుసుకోండి:
వారు (యూదులుక్రైస్తవులు) అల్లాహ్ ను కాదని తమ పండితులను, తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. (తౌబా 9: 31).
ఈ ఆయతు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పఠిస్తుండగా, అదీ బిన్ హాతిం (రజియల్లాహు అన్హు) విని, ప్రవక్తా! యూదులు, క్రైస్తవులు తమ పండితులను, సన్యాసులను ఆరాధించేవారు కారు కదా? అని చెప్పగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అవును, కాని అల్లాహ్ హరాం చేసిన దానిని వారి పండితులు, సన్యాసులు హలాల్ చేస్తే వారు దానిని హలాల్ గానే భావించే వారు. ఇంకా అల్లాహ్ హలాల్ చేసినదానిని వారి పండితులు, సన్యాసులు హరాం చేస్తే వారు దానిని హరాంగానే భావించేవారు. కనుక ఇది వారిని ఆరాధించినట్లు” అని సమాధానం చెప్పారు. (బైహఖీ ఫీ సుననిల్ కుబ్రా 10/116, తిర్మిజి 3095, ఇది హసన్ అని షేఖ్ అల్బానీ గాయతుల్ మరాం 19లో తెలిపారు).
నిషిద్ధతలను నిషిద్ధంగా నమ్మనివారు యూదులు, క్రైస్తవులు మరియు బహుదైవారాధకులు అని అల్లాహ్ ఈ క్రింది ఆయతులలో స్పష్టం చేశాడు:
ఇలా అను: మీరు ఆలోచించరా! అల్లాహ్ మీ కొరకు అవతరింపజేసిన జీవనోపాధిలో నుండి మీరు స్వయంగానే కొన్నింటిని హరాం చేసు కున్నారు. మరికొన్నింటిని హలాల్ చేసుకున్నారు. ఇలా అడుగు: ఇలా చేయడానికి అల్లాహ్ మీకు అనుమతించాడా? లేదా మీ బూటక కల్పనలను అల్లాహ్ కు అంటగట్టుతున్నారా?. (యూనుస్ 10: 59).
(5) చేతబడి
చేతబడి (చేయుట, చేయించుట, నేర్పుట, నేర్చుకొనుట) అవిశ్వాసంలో లెక్కించ బడుతుంది. అది వినాశనానికి గురి చేసే ఏడు మహాపాపాల్లో ఒకటి. అది నష్టమే కలుగజేస్తుంది తప్ప ఏమీ లాభం కలగజేయదు. దానిని నేర్చుకొనుట గురించి అల్లాహ్ ఇలా తెలిపాడు:
సులైమాను ఎన్నడూ అవిశ్వాసానికి ఒడిగట్ట లేదు. అసలు అవిశ్వాసానికి పాల్పడినది ప్రజలకు చేతబడిని బోధించే షైతానులే. వారు హారూత్, మారూత్ దేవదూతల ద్వారా (ఇరాఖ్ లోని) బాబీలోనియాలో అవతరింప జేసినదాని వెంట బడ్డారు. ఎవడికైనా ఆ విద్యను నేర్పినప్పుడు ఆ దేవ దూతలు స్పష్టంగా ఇలా హెచ్చరిక చేసేవారుః జాగ్రత్త! మేము (మానవు లకు) కేవలం ఒక పరీక్ష మాత్రమే. కనుక మీరు (జాలవిద్యను నేర్చుకొని) అవిశ్వాసులు కాకండి. (బఖర 2: 102).
మాంత్రికుని గురించిన ఆదేశమేమిటంటే అతడ్ని హతమార్చాలి. అతని సంపద కూడా నిషిద్ధమైన చెడు సంపద. అజ్ఞానులు, దుర్మార్గులు, బలహీన విశ్వాసులు మాంత్రికుల వద్దకు వెళ్ళి , ఇతురలపై అన్యాయం, దౌర్జన్యం చేయడానికి, లేదా ప్రతీకారం తీర్చుకోడానికి చేతబడి చేయిస్తారు. మరికొందరు తనపై చేయబడిన చేతబడిని దూరం చేయించు- కోడానికి మాంత్రికుని వద్దకు వెళ్ళి ఓ నిషిద్ధ కార్యానికి పాల్పడతారు. ఇలాంటప్పుడు మాంత్రికుల వద్దకు వెళ్ళకుండా అల్లాహ్ వైపునకు మరలి, ‘ముఅవ్విజాత్’ వంటి అల్లాహ్ పవిత్రవచనాల ఆధారంగా అల్లాహ్ తో స్వస్థత కోరాలి. (ముఅవ్విజాత్ అంటే సూర ఫలఖ్, సూర నాస్ మరియు దీనికి సంబంధించిన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నేర్పిన దుఆలు).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్లామీయ నిషిద్ధతలు (ముహర్రమాత్) – పార్ట్ 02 (16 జులై 2020) [1:04:21 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
“ఘోరపాపాల్లోనే మరీ ఘోరమైన పాపం ఏదో తెలుపనా?” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మూడు సార్లు ప్రశ్నించారు. దానికి వారన్నారు: తప్పక తెలుపండి ప్రవక్త అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “అల్లాహ్ కు భాగస్వాములను కల్పిం చుట”. (బుఖారి 2654, ముస్లిం 87).
అల్లాహ్ షిర్క్ తప్ప ఏ పాపాన్నైనా క్షమించగలడు. దానికి ప్రత్యేకమైన పశ్చాత్తాపం తో క్షమాభిక్ష కోరడం (తౌబా చేయడం) తప్పనిసరి. అల్లాహ్ ఇలా ఆదేశించాడుః
“నిశ్చయంగా అల్లాహ్ తనకు భాగస్వామిని కల్పించటాన్ని ఏ మాత్రం క్షమించడు. అది తప్ప దేనినయినా తాను కోరినవారిని క్షమిస్తాడు“. (నిసా 4: 48).
షిర్క్ లో ఒక రకం పెద్ద/ఘోరమైన షిర్క్ (షిర్కె అక్బర్). ఇది ఇస్లాం నుండి బహిష్కరణకు కారణమవుతుంది. తౌబా చేయకుండా అదే స్థితిలో మరణించేవాడు నరకంలో ప్రవేశించి అందులో శాశ్వతంగా ఉంటాడు. ముస్లిం సమాజంలో ప్రబలి ఉన్న ఈ రకమైన షిర్క్ యొక్క కొన్ని రూపాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
1. సమాధుల పూజ
సమాధులను పూజించడం, మరణించి సమాధుల్లో ఉన్న వలీలు (పుణ్యపురుషులు) అవసరాలను తీరుస్తారని, కష్టాలను తొలిగిస్తారని నమ్మడం మరియు అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నదాని సహాయం వారితో కోరడం, వారితో మొరపెట్టుకోవడం లాంటివి పెద్ద షిర్క్ లో లెక్కించ బడతాయి. అల్లాహ్ ఆదేశం చదవండిః
“మీ ప్రభువు తనను తప్ప ఇతరులను మీరు ఆరాధింపకూడదని ఆదేశించాడు“. (బనీ ఇస్రాఈల్ 17: 23).
అదే విధంగా చనిపోయిన ప్రవక్తలతో, పుణ్యాత్ములతో ఇంకెవరితోనైనా వారి సిఫారసు పొందుటకు, తమ కష్టాలు దూరమగుటకు వారితో దుఆ చేయడం కూడా షిర్క్. చదవండి అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:
“బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరలను ఆలకించి అతని బాధను తొలగించేవాడు ఎవడు? భూమిపై మిమ్మల్ని ప్రతినిధులుగా చేసినవాడు ఎవడు? అల్లాహ్ తో పాటు (ఈ పనులు చేసే) మరొక దేవుడు కూడ ఎవడైనా ఉన్నాడా?“. (నమ్ల్ 27: 62).
కొందరు కూర్చున్నా, నిలబడినా, జారిపడినా తమ పీర్, ముర్షిదుల నామములను స్మరించు టయే తమ అలవాటుగా చేసుకుంటారు. ఎప్పుడు ఏదైనా క్లిష్టస్థితిలో, కష్టంలో, ఆపదలో చిక్కుకున్నప్పుడు ఒకడు యా ముహమ్మద్ అని, మరొకడు యా అలీ అని, ఇంకొకడు యా హుసైన్ అని, మరి కొందరు యా బదవీ, యా జీలానీ, యా షాజులీ, యా రిఫాఈ, యా ఈద్ రూస్, యా సయ్యద జైనబ్, యా ఇబ్ను ఉల్వాన్ అని, యా గౌస్ అల్ మదద్ అని, యా ముఈనుద్దీన్ చిష్తీ అని, యా గరీబున్నవాజ్ అని, నానా రకాలుగా పలుకుతారు. కాని అల్లాహ్ ఆదేశం ఏమిటని గమనించరు:
“అల్లాహ్ ను వదలి మీరు వేడుకుంటున్న వారు మీ మాదిరిగానే కేవలం దాసులు. మీరు వారిని ప్రార్థించి చూడండి. మీకు వారి పట్ల ఉన్న భావాలు నిజమే అయితే మీ ప్రార్థనలకు వారు సమాధానం ఇవ్వాలి“. (ఆరాఫ్ 7: 194).
కొందరు సమాధి పూజారులు సమాధుల ప్రదక్షిణం చేస్తారు. వాటి మూలమూలలను చుంబిస్తారు. చేతులు వాటికి తాకించి తమ శరీరంపై పూసుకుంటారు. వాటి గడపను చుంబిస్తారు. దాని మట్టిని తీసుకొని తమ ముఖాలకు రుద్దుకుంటారు. వాటిని చూసినప్పుడు సాష్టాంగ పడతారు (సజ్దా చేస్తారు). తమ అవసరాలను కోరతూ రోగాల నుండి స్వస్థత పొందు టకు, సంతానం కావాలని, అవసరం తీరాలని వాటి యదుట భయభీతితో, వినయవినమ్రతలతో నిలబడతారు. ఒక్కోసారి సమాధిలో ఉన్నవారిని ఉద్దేశించి ఇలా పిలుస్తారు కూడాః యా సయ్యిదీ! ఓ మేరే బాబా! నేను చాలా దూరం నుండి మీ సమక్షంలో హాజరయ్యాను, నాకు ఏమీ ప్రసాదించక వెనక్కు త్రిప్పి పంపుతూ అవమాన పరచకు. కాని అల్లాహ్ ఆదేశం ఏముందో గమనించారా?
“అల్లాహ్ ను వదలి ప్రళయం వరకు తమ ప్రార్థనలను విని సమాధాన మివ్వలేనటువంటి వారిని ప్రార్థించే వారికంటే, ఎక్కువ మార్గభ్రష్టులెవరు? మరియు వారు వీరి (ప్రార్థించేవారి) ప్రార్థనలను ఎరుగకుండా ఉన్నారు“. (అహ్ఖాఫ్ 46: 5).
ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు:
(مَنْ مَاتَ وَهْوَ يَدْعُو مِنْ دُونِ الله نِدًّا دَخَلَ النَّارَ)
“ఎవరు అల్లాహ్ ను కాదని ఇతరులను ప్రార్థిస్తూ/దుఆ చేస్తూ చనిపోతాడో అతను నరకంలో ప్రవేశిస్తాడు”. (బుఖారి 4497).
కొందరు సమాధుల వద్ద తమ తల గొరిగించుకుంటారు. ‘సమాధుల హజ్ చేసే విధానం’ అన్న పేరుగల పుస్తకాలు కొందరి వద్ద లభిస్తాయి. విశ్వవ్యవస్థ నిర్వహణ శక్తి మరియు లాభనష్టాలు చేకూర్చే శక్తి వలీలకు ఉన్నదని కొందరు నమ్ముతారు. కాని అల్లాహ్ యొక్క ఈ ఆదేశం పట్ల వారు ఎలా అంధులైపోయారో గమనించండి:
“ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవరూ లేరు. ఇంకా ఆయన గనక నీ విషయంలో మేలు చేయాలని సంకల్పిస్తే ఆయన అనుగ్రాహన్ని మల్లించే వాడు కూడా ఎవడూ లేడు“. (యూనుస్ 10: 107).
2. మొక్కుబడులు
అల్లాహ్ ను కాకుండా ఇతరుల పేరున మొక్కుకొనుట షిర్క్ అవుతుంది. ఈ రోజుల్లో ప్రజలు సమాధిలో ఉన్నవారి పేరున దీపాలు, కొవ్వత్తులు, కోళ్ళు, ఆస్తులు మొదలగునవి ఇస్తానని మొక్కుకుంటారు. అయితే ఇది ఘోరమైన షిర్క్ అన్న విషయం మరచిపోతారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అలిహందులిల్లాహి వహద వస్సలాతు వస్సలామ్ అలా నబియ్యునా బ’ద అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
సోదర సోదరీమణులారా! పరలోకం సత్యం. మరోసారి లేపబడటం అనుమానం, సందేహం లేని విషయం. దీని గురించి ఖురాన్ లో అల్లాహ్ (తఆలా) ఎన్నో రకాలుగా మనకు ఉదాహరణలు ఇచ్చి ఉపమానాల ద్వారా దీని యొక్క వాస్తవికతను తెలియపరిచాడు. ఒక రకమైన నిదర్శన దీని గురించి ఏమిటంటే, సామాన్యంగా మనం మన జీవితంలో చూస్తూ ఉంటాము: ఒక్కసారి ఏదైనా వస్తువు తయారు చేయడం లేదా అనండి, మొదటిసారి ఏదైనా వస్తువు తయారు చేయడంలో మనకి ఏదైనా కష్టం కావచ్చు. కానీ దానినే మరోసారి తయారు చేయడంలో అంత కష్టం ఉండదు. ఇది మన విషయం, నవూదుబిల్లాహ్, మనకు మరియు అల్లాహ్ కు ఎలాంటి పొంతన లేదు. కానీ మన తక్కువ జ్ఞానానికి, మన అల్పబుద్ధులకు కూడా విషయం అర్థం కావడానికి మన యొక్క ఈ ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆ బ్రహ్మాండమైన సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్త ఈ ఆకాశాల ముందు, ఇంత పెద్ద భూమి ముందు, ఇంత గొప్ప పర్వతాల ముందు ఐదు అడుగుల మనం మానవులం ఇంత పెద్ద విషయం. అయితే తొలిసారిగా ఒక ఇంద్రియపు బిందువుతో అందమైన ఇంతటి గొప్ప మనిషిని సృష్టించగల ఆ సృష్టికర్త చనిపోయిన తర్వాత మరోసారి సృష్టించడం కష్టమా? ఎంత మాత్రం కష్టం కాదు. ఎంత మాత్రం కష్టం కాదు.
సూర రూమ్ ఆయత్ నెంబర్ 27 లో అల్లాహ్ ఇలా తెలియపరిచాడు.
وَهُوَ الَّذِي يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ وَهُوَ أَهْوَنُ عَلَيْهِ – 30:27 “ఆయనే సృష్టి (ప్రక్రియ)ని ప్రారంభిస్తున్నాడు. మరి ఆయనే దాన్ని పునరావృతం చేస్తాడు. ఇది ఆయనకు చాలా తేలిక”
ఆయనే సృష్టిని తొలిసారిగా పుట్టించిన వాడు, ఆయన తప్పకుండా తిరిగి పుట్టించ గలడు. తిరిగి పుట్టించడం అనేది అతనికి ఎంతో సులభతరమైన విషయం.
సూరతుల్ అంబియా ఆయత్ నెంబర్ 104 లో ఇలా తెలియపరిచాడు.
كَمَا بَدَأْنَا أَوَّلَ خَلْقٍ نُّعِيدُهُ ۚ وَعْدًا عَلَيْنَا ۚ إِنَّا كُنَّا فَاعِلِينَ – 21:104 “ఏ విధంగా మేము మొదటిసారి సృష్టించామో అదేవిధంగా మలిసారి కూడా చేస్తాము. ఈ వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యత మాపైన ఉంది. దాన్ని మేము తప్పకుండా నెరవేరుస్తాము.”
గమనించారా? తొలిసారిగా పుట్టించడం దానికంటే మలిసారి సృష్టించడంలో ఎలాంటి కష్టతరమైన పని కాదు.
ఒక వ్యక్తి ప్రస్తావన సూరయే యాసీన్ లో వచ్చి ఉంది. అతను ఎంతో విర్రవీగుతూ “మా శరీరమంతా మట్టిలో కలిసిపోయిన తరువాత మా ఎముకలు సైతం బూడిద అయిపోయిన తర్వాత ఎలా పుట్టించ గలుగుతాడు, ఎలా తిరిగి లేప గలుగుతాడు?” అన్నటువంటి అడ్డ ప్రశ్నలు వేశాడు. అల్లాహ్ (తఆలా) అతనికి సమాధానం ఇస్తూ “మాకు ఉపమానాలు చూపించి ఎలా లేపుతాడు? అని ప్రశ్నిస్తున్నాడా? తాను తన స్వయంగా సృష్టిని మరిచిపోయాడా?” ఆ తరువాత ఆయత్ నెంబర్ 79 లో అల్లాహ్ ఇలా తెలిపాడు.
قُلْ يُحْيِيهَا الَّذِي أَنشَأَهَا أَوَّلَ مَرَّةٍ ۖ وَهُوَ بِكُلِّ خَلْقٍ عَلِيمٌ – 36:79 (వారికి) సమాధానం ఇవ్వు : “వాటిని తొలిసారి సృష్టించిన వాడే (మలిసారి కూడా) బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు.”
తొలిసారిగా ఎలా మిమ్మల్ని పుట్టించాడో అలా మలిసారిగా పుట్టించడం తప్పనిసరి. ఇందులో అతనికి ఏ మాత్రం ఇబ్బందికరం ఉండదు. అందుకు సోదరులారా ఇందులో అనుమానపడే విషయం లేదు.
ఇక బుద్ధి పూర్వకమైన మరికొన్ని నిదర్శనాలు మరోరకంగా చూపించాడు. ఒకసారి గమనించండి. ఎండకాలం వచ్చిందంటే బీడు వారిన భూములను మనం చూస్తాం. ఏ మాత్రం అందులో జీవం లేని విషయాన్ని మనం గమనిస్తాము. కానీ అదే నిర్జీవ భూమిలో ఒక్కసారి ఒక వర్షం యొక్క జల్లు పడిందంటే అందులో మళ్ళీ జీవం పోసేది ఎవరు? ఆ సృష్టికర్తయే. ఆ భూమి నుండి పంటలు పండించేది ఎవరు? ఆ సృష్టికర్తయే. ఎలాగైతే నిర్జీవ భూమిలో జీవం పోసి, అక్కడి నుండి పంటలు పండించే శక్తి ఆ సృష్టికర్త కు ఉందో, అలాగే చనిపోయిన మనిషిని, మట్టిలో కలిసిపోయిన శరీరాన్ని, బూడిదగా మారినా ఎముకల్ని సైతం కలిపి మరోసారి జీవింప చేయడం ఏమాత్రం కష్టతరమైన విషయం కాదు.
ఆయన యొక్క సూచనలలో ఒక సూచన ఏమిటంటే, నీవు భూమిని ఎండిపోయినదిగా, బీడుబారినదిగా చూస్తావు. ఎప్పుడైతే మేము ఆ భూమిపై వర్షాన్ని కురిపిస్తామో, ఆ తర్వాత పచ్చని పైర్లతో అది ఎంతో అందంగా కనబడుతూ ఉంటుంది. ఆ నిర్జీవ భూమిని ఎవరైతే బ్రతికించాడో ఆ భూమిలో జీవం పోసాడో అతడే మృతులను కూడా మరోసారి లేపుతాడు. వారికి కూడా జీవం ప్రసాదిస్తాడు.
ఇలాంటి ఆయత్ లు ఖురాన్ లో మరి ఎన్నో ఉన్నాయి. మరొక గమనించగల విషయం ఏమిటంటే, ఎండిపోయిన భూమి, చూడడానికి చనిపోయిన భూమి, అందులో నీటి వర్షం, వర్షం యొక్క నీరు పడిన తరువాత ఎలా పచ్చగా అవుతుందో, మొలకలు ఎత్తుతాయో ఇలాంటి ఉదాహరణలే మృతులను లేపబడే విషయంలో కూడా అల్లాహ్ (తఆలా) తెలియపరిచాడు.
సహీ ముస్లింలోని హదీత్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియపరిచారు. “మొదటిసారి ఇస్రాఫీల్ శంఖు ఊదినప్పుడు ఒక వైపునకు మెడలు వాలి పోతాయి. ప్రజలు సొమ్మసిల్లి పోతారు. ఆ తర్వాత ప్రళయం సంభవించి ఈ ప్రపంచమంతా నాశనం అయిపోతుంది. మళ్ళీ అల్లాహ్ (తఆలా) ఒక వర్షం కురిపిస్తాడు. వెన్నుముక లోని చివరి భాగం ఏది అయితే మిగిలి ఉంటుందో, దాని ద్వారా మరోసారి ఎలాగైతే వర్షం ద్వారా మొలకలు ఎత్తుతాయో అలాగే మనుషులు కూడా పుట్టుకొస్తారు. రెండవ శంఖు ఊదిన తర్వాత అందరూ కూడా అల్లాహ్ ఎదుట హాజరవుతారు”. ఈ ప్రళయ దినాన్ని విశ్వసించడం, ప్రళయ దినాన్ని నమ్మడం మన విశ్వాసంలోని అతి ముఖ్యమైన భాగం. ఇందులో మనం ఏ మాత్రం ఆలస్యం కానీ, ఏ మాత్రం సందేహం గాని, అనుమానం గాని ఉంచుకోకూడదు. దీని వల్ల మనకే నష్టం కలుగుతుంది. ఒకవేళ మనం పరలోక దినాన్ని విశ్వసించామో ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ మరోసారి లేపుతాడు, బ్రతికిస్తాడు అని ఎప్పుడైతే నమ్ముతామో మనకే ఇందువల్ల మేలు కలుగుతుంది.
మరొక విషయం గమనించండి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. ఎందరో ఎన్నో రకాల అన్యాయాలు చేస్తున్నారు. ఎన్నో రకాల దౌర్జన్యాలు చేస్తున్నారు. వారికీ వారి దౌర్జన్యం వారు చేసే అంతటి పాపాల శిక్ష ఇహ లోకంలో ఎక్కడైనా దొరుకుతుందా? లేదు. వారు ఎవరిపైన అయితే దౌర్జన్యం చేస్తున్నారో ఆ బాధితులకు వారి యొక్క న్యాయం లభిస్తుందా? లేదు. అందుగురించి కూడా పరలోక దినం తప్పనిసరి. అక్కడ సృష్టికర్త అయిన అల్లాహ్ సర్వ మానవుల మధ్య న్యాయం చేకూరుస్తారు. బాధితునికి అతని హక్కు దౌర్జన్యపరుడు నుండి తప్పకుండా ఇప్పిస్తాడు. అంతే కాదు సహీ హదీత్ లో వచ్చి ఉంది ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెలిపారు: “ఒకవేళ కొమ్ము ఉన్న మేక కొమ్ము లేని మేకను అన్యాయంగా కొట్టిందంటే రెండు మేకల్ని కూడా అల్లాహ్ (తఆలా) ప్రళయ దినాన హాజరు పరుస్తాడు. దౌర్జన్యం చేసిన మేక నుండి దౌర్జన్యానికి గురి అయిన మేకకు న్యాయం ఇప్పించి ఆ తర్వాత వారిని మట్టిగా మార్చేస్తాడు”. చెప్పే విషయం ఏంటంటే జంతువుల మధ్య లో కూడా న్యాయం చేకూర్చ గలిగే ఆ సృష్టికర్త, మానవుల మధ్య తప్పకుండా న్యాయం చేకూర్చ గలుగుతాడు. ఆ న్యాయం, ప్రతిఫల దినం తప్పని సరిగా రావలసి ఉంది. మనం దానిని ఎంత తిరస్కరించినా అది తప్పక వస్తుంది. నిశ్చయంగా ప్రళయ దినం వచ్చి ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అల్లాహ్ దీని విషయంలో మనందరి విశ్వాసంలో మరింత బలం చేకూర్చు గాక.
ప్రళయ దినం రావడం ఆ రోజు మనందరి లెక్క తీసుకోవడం ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అల్లాహ్ (తఆలా) ఆదిమానవుడు నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు వచ్చే మానవులందరినీ కూడా ఒక చోట జమ చేసి, వారిలో ఎవరికీ ఎన్ని సంవత్సరాల జీవితం ప్రసాదించాడో వాటి గురించి తప్పకుండా లెక్క తీసుకుంటాడు.
సూరతుల్ ఘాషియా ఆయత్ నెంబర్ 25, 26 లో అల్లాహ్ ఇలా తెలియపరిచాడు:
إِنَّ إِلَيْنَا إِيَابَهُمْ – 88:25 ثُمَّ إِنَّ عَلَيْنَا حِسَابَهُم – 88:26 “వారందరూ మా వైపునకు తిరిగి రావలసి ఉన్నది. మరి ఆ తర్వాత మేము వారందరి యొక్క లెక్క తప్పకుండా తీసుకొని ఉంటాము.”
లెక్క తీసుకోవడం అనేది అల్లాహ్ (తఆలా) మనకు ఇచ్చిన జీవితంలోని ఒక్కొక్క క్షణానికి ఆరోజు లెక్క తీసుకోవడం అనేది సత్యం. కొన్ని సందర్భాల్లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “అల్లాహుమ్మ హాసిబ్నీ హిసాబయ్ యసీరా” అని దుఆ చేసేవారు. అంటే “ఓ అల్లాహ్! నా యొక్క లెక్క చాలా తేలికగా నీవు తీసుకో. ఎలాంటి ఇబ్బందికి నన్ను గురిచేయకుండా నా లెక్క తీసుకో.” అయితే ఒక సందర్భంలో ఆయిషా (రదియల్లాహు అన్హా) ప్రశ్నించారు: “ప్రవక్తా! చాలా సులభతరమైన లెక్క ఏమిటి” అని? అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సమాధానం పలికారు: “తేలికమైన, చాలా సులభతరమైన లెక్క అంటే ఆయేషా అల్లాహ్ దాసుని యొక్క కర్మ పత్రాలను కేవలం అలా చూసి అతన్ని మన్నించి వేయడం“. ఈ హదీత్ ముస్నద్ అహ్మద్ లోనిది సహీ హదీత్.
అయితే సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో మరొక హదీత్ ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు” “ఎవరి లెక్క తీసుకోబడుతుందో అతడు అయితే శిక్షలో పడినట్లే”. అప్పుడు ఆయేషా (రదియల్లాహు అన్హా) మరోసారి ప్రశ్నించారు: “ప్రవక్తా! అల్లాహ్ (తఆలా) ఖురాన్ లో తెలిపాడు కదా! అతనితో చాలా సులభతరమైన లెక్క తీసుకోవడం జరుగుతుంది అని”. దీనికి సమాధానంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు: “ఆయిషా! ఇది కేవలం అతని కర్మ పత్రాల్లో చూడడం, దానిని లెక్క తీసుకోవడం అని చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా లెక్క తీసుకోవడం అంటే ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క కార్యాన్ని పట్టి అడగడం, దాని గురించి మందలించడం. ఇలా ఎవరైతే ఒక్కొక్క విషయాన్ని గురించి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందో, అతడు అయితే నాశనం అయినట్లే కదా!” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు చెప్పారు.
అంటే ఈ హదీతుల ద్వారా ఏం బోధపడుతుంది మనకు? లెక్క తీసుకోవడం తప్పకుండా జరుగుతుంది అని, దానికి మనం ఇక్కడే సిద్దపడాలి అని మరియు అల్లాహ్ తో దుఆ కూడా చేస్తూ ఉండాలి – “ఓ అల్లాహ్ సత్కార్యాలు చేస్తూ జీవితం గడిపే సత్ భాగ్యం నాకు ప్రసాదించు మరియు ప్రళయ దినాన మా యొక్క లెక్క, తీర్పులు అన్నీ కూడా చాలా సులభతరంగా జరగాలి. నీ యొక్క మన్నింపు కు మీ యొక్క క్షమాపణకు, నీ యొక్క కరుణ కటాక్షాలను మేము నోచుకోవాలి” అని దుఆ చేస్తూ ఉండాలి.
ఇప్పటికీ సమాజంలో కొందరు ప్రళయదినం ఎందుకు? ఆ రోజు ఎందుకు లెక్క తీసుకోవడం? ఇలాంటి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అయితే అల్లాహ్ (తఆలా) ఏ ఉద్దేశంతో మనల్ని ఇహలోకంలోకి పంపాడో అది ఆయన్ను ఆరాధించడం మాత్రమే. ఆయన ఆరాధన పద్ధతులను తెలియపరచడానికి ప్రవక్తల్ని పంపాడు. గ్రంధాలను కూడా అవతరింపజేశాడు. ఇక అల్లాహ్ తన బాధ్యత పూర్తి చేసి మానవునికి సన్మార్గం ఎందులో ఉందో తెలియజేసి అతను దానిని అవలంబించాలి, దాని ప్రకారం జీవితం గడపాలి అని ఆదేశించాడు. ఇక ఆ పరలోకం,, ఇహలోకంలో ఎవరు ఎలా జీవించారు? ఆ లెక్క తీసుకోవడానికి, ఎవరు న్యాయం చేశారో, వారి యొక్క న్యాయానికి ప్రతిఫలం ఇవ్వడానికి, ఎవరైతే అన్యాయం చేశారో, దౌర్జన్యం చేశారో వారి యొక్క శిక్ష వారికి ఆ రోజు ఇవ్వడానికి. ఎవరు ప్రవక్తల యొక్క బాటను అనుసరించారు? అల్లాహ్ పంపిన గ్రంధాలని స్వీకరించి వాటి ప్రకారం తమ జీవితం మలుచుకున్నారు? ఇవన్నీ కూడా ఆ రోజు తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది.
సూరతుల్ ఆరాఫ్ లో అల్లాహ్ ఇలా తెలియపరిచాడు:
“మేము ప్రవక్తల్ని కూడా ప్రశ్నిస్తాము మరియు ప్రవక్తల్ని ఎవరి వైపునకు పంపామో ఆ జాతి వారిని కూడా ప్రశ్నిస్తాము.”
ఈ లెక్క విషయంలో ప్రజలందరూ కూడా సమానంగా ఉండరు. వారి వారి కర్మల ప్రకారం, వారి వారి విశ్వాసాల ప్రకారం, వారు ఇహలోకంలో అల్లాహ్ ఆజ్ఞలను, అల్లాహ్ ఆదేశాలను పాటించి, వాటి ప్రకారం ఏదైతే జీవితం గడిపారో, వాటి ప్రకారం కొందరి యొక్క లెక్క చాలా కష్టతరంగా ఉంటుంది. మరికొందరికి సులభతరంగా ఉంటుంది. కొందరిపట్ల మన్నింపు వైఖరి అల్లాహ్ వహిస్తాడు. మరి కొందరిని అల్లాహ్ (తఆలా) వారితో ఒక్కొక్క లెక్క తీసుకుంటాడు.
ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక సందర్భంలో తెలిపారు. సహీ బుఖారి మరియు సహీ ముస్లిం లో వచ్చిన హదీత్ ఆ పొడుగైన హదీతులో చివరి మాట ఏంటంటే – “గత జాతులు నాకు చూపబడటం జరిగింది, నా అనుచర సంఘాన్ని కూడా నేను చూశాను. వారిలో డెబ్బై వేల మంది వారు ఎంత అదృష్టవంతులు అంటే, వారు ఎలాంటి లెక్కలేకుండా, ఎలాంటి శిక్ష లేకుండా స్వర్గంలోనికి వెళ్తారు.” అల్లాహు అక్బర్. అల్లాహ్ (తఆలా) మనందరినీ కూడా ఆ డెబ్బై వేలలో కలపాలి, ఆ డెబ్బై వేలలో జోడించాలి అని మనం దుఆ చేస్తూ ఉండాలి. ఆ ప్రకారంగా మనం ఆచరిస్తూ కూడా ఉండాలి.
ఇన్షా అల్లాహ్, పరలోకానికి సంబంధించిన ఎన్నో మజిలీలు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుంటూ పోతూఉన్నాము . మా ఈ కార్యక్రమాలను ఎడతెగకుండా చూస్తూ ఉండండి. అల్లాహ్ (తఆలా) పరలోకం పట్ల మన విశ్వాసాన్ని మరింత బలం చేయుగాక, సత్కార్యాలు చేస్తూ ఉండి, కలిమా “లా ఇలాహ ఇల్లల్లాహ్” చదువుతూ, అదే పుణ్య స్థితిలో అల్లాహ్ మన ప్రాణాలు వీడే అటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.