దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
నేను ఒక ముస్లిం అని చెప్పుకుంటూ జై శ్రీరామ్, భరతమాత కి జై, జై హింద్ అంటూ నినాదాలు చేస్తూ ముస్లింల యొక్క అస్థిత్వాన్ని, ఆచారాలను మంట కలుపుతూ యావత్ ముస్లిం సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నారు
[13:34 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్.అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ఈనాటి శీర్షిక ప్రళయం సంభవించినప్పుడు ఎలాంటి ఆందోళనకర పరిస్థితి ఉంటుందో దానిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము.
మహాశయులారా! ప్రళయం, పునరుత్థానదినం, పరలోకం మరోసారి అందరూ బ్రతికించబడి అల్లాహ్ యందు సమీకరించబడే రోజు. ఆ రోజు గురించి వెంటనే భయకంపితులై ఆ రోజు రాకముందే దాని గురించి మనం విశ్వాసం, పుణ్యాలతో, సత్కార్యాలతో సిద్ధంగా ఉండేటటువంటి ప్రయత్నం మనలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చేయాలి.
ఈ రోజుల్లో మనకు ఎన్నో అనుభవాలు కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రదేశాల్లో వెళ్తాము లేదా ఏదైనా సంఘటన సంభవిస్తుంది. చాలా బాధకు గురి అవుతాము. అప్పుడు మనం ఒకవేళ ముందు నుండే జాగ్రత్తపడి ఉండేది ఉంటే ఈనాటి రోజు చూసే రోజు కాకపోవచ్చు. ఎలాగైతే రిజల్ట్ వచ్చే సందర్భంలో ఏ స్టూడెంట్ అయితే చదువు కాలంలో సమయాన్ని వృధా చేసి తల్లిదండ్రులు, అటువైపున సార్లు, టీచర్ లు, మరోవైపున శిక్షణ ఇచ్చే వారు ఎన్నో రకాలుగా బోధ చేసినప్పటికీ పెడచెవిన పెట్టి వారి యొక్క బోధనలను ఏ మాత్రం విలువ నివ్వకుండా, సమయాన్ని వృధా చేశాడో రిజల్ట్ వచ్చే రోజు ఎలా పశ్చాత్తాప పడతాడు. ఈ ఉదాహరణలు, ఈ అనుభవాలు మనకు ఎందుకు ఇక్కడ కలుగుతున్నాయి? ఆ పరలోక దినం, అక్కడ పశ్చాత్తాపపడే ఆ రోజు గతాన్ని గుర్తు చేసుకొని బాధపడే ఆ రోజు మనం కూడా అలాంటి దురదృష్టవంతుల్లో కలవకూడదని.
అందుకు మహాశయులారా! ఆ పునరుత్థాన దినం మనమందరము సమాధుల నుండి లేపబడి ఏదైతే అల్లాహ్ ఎదురునకు సమీకరింప బడతామో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఖురాన్ లో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. దానిని ఈరోజు మనం అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తాము. ఆ రోజును అల్లాహ్ (తఆలా) ఎంతో గొప్ప రోజుగా, గొప్ప దినంగా, ఎంతో గాంభీర్యమైన ఒక దినంగా పేర్కొన్నాడు. ఆ గొప్ప దినాన, ఏ దినాన అయితే ప్రజలందరూ సర్వ లోకాల ప్రభువు ఎదుట నిలబడడానికి వెళ్తారు. మరియు ఆ రోజు అవిశ్వాసుల కొరకు సృష్టికర్త అయిన అల్లాహ్ ని విశ్వసించని వారి గురించి ఎంతో కఠినంగా, ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది.
సూరతుల్ ముద్దస్సిర్ ఆయత్ తొమ్మిది, పదిలో అల్లాహ్ (తఆలా) ఇలా తెలియపరిచాడు: “ఆ రోజు చాలా కష్టతరమైన రోజు. విశ్వాసాన్ని నమ్మని తిరస్కరించిన వారి గురించి అది ఏమాత్రం సులభతరంగా ఉండదు“.
అది ఎంత భయంకరమైన మరియు మన యొక్క ఆలోచనా విధానాన్ని కూడా మార్చి వేసే అంతటి భయంకరమైన రోజు అంటే ఏ తల్లి కూడా ఈ లోకంలో తన పసికందును, పాలు త్రాగే పిల్లని మర్చిపోదు. కానీ ఆ రోజున పరిస్థితి ఏమవుతుంది? సూరతుల్ హజ్ లోని తొలి ఆయత్ లోనే అల్లాహ్ (తఆలా) ఈ విషయాన్ని ఇలా స్పష్టపరిచాడు – “ఓ ప్రజలారా! మీ ప్రభువు తో మీరు భయపడండి. నిశ్చయంగా ఆ ప్రళయ దినం అనేది చాలా భయంకరమైన, చాలా గొప్ప దినం“. ఆనాటి విషయమే చాలా గొప్ప విషయం, భయంకరమైన విషయం. ఆరోజు భూమి కంపించి పోతుంది. అందులో ప్రకంపనలు ఏర్పడతాయి. దాని మూలంగా ఒక ఆందోళన ఏర్పడుతుంది. “ప్రళయ దినాన ఏ ప్రకంపనలు అయితే జరుగుతాయో చాలా గొప్ప విషయం అది. ఆ రోజు ప్రతి పాలిచ్చు తల్లి పాలు త్రాగే తన పసికందును మర్చిపోతుంది. మరియు ప్రతి గర్భిణి స్త్రీ ఆమె యొక్క గర్భం పడిపోతుంది“. గమనించారా! “మరియు ప్రజలు మత్తులో ఉన్నట్లుగా కనబడతారు. ఏదో మత్తు సేవించడం వల్ల ఎలాగైతే సొమ్మసిల్లి పోతారో అందువల్ల కాదు. కానీ ఆరోజు అల్లాహ్ యొక్క శిక్ష చాలా కఠినంగా ఉంటుంది“. అందుగురించి అలాంటి భయంకరమైన ఆ ప్రళయదినం రాకముందే విశ్వాస మార్గాన్ని అవలంబిస్తే ఆరోజు విశ్వాసులకు కొరకు ఎంతో సులభతరంగా గడిచిపోతుంది.
ఆనాటి గాంభీర్యం, ఆనాటి యొక్క ఆ భయంకరం ఎంత గొప్పగా ఉంటుంది అంటే మనిషి పరిస్థితి ఏమవుతుందో సూరయే ఇబ్రాహీం లో అల్లాహ్ (తఆలా) ఈ విధంగా తెలియజేసాడు. మరియు ప్రత్యేకంగా ఎవరైతే ఇహలోకంలో సన్మార్గాన్ని విడనాడి దుర్మామార్గంలో పడి ఉన్నారో, ఏకత్వ మార్గాన్ని వదిలి బహుదైవత్వంలో పడి ఉన్నారో, మరియు ఎవరైతే శాంతి మార్గాన్ని విడనాడి అశాంతి జీవితం గడుపుతున్నారో గమనించండి ఈ ఆయత్ ను: దుర్మార్గులు, దౌర్జన్య పరులు, షిర్క్ చేసేవారు, పాపాల్లో మునిగి తేలాడుతున్న వారు, వారి యొక్క పాపాల్ని వారి యొక్క షిర్క్ పనులను, వారి యొక్క దుర్మార్గాన్ని అల్లాహ్ చూడటం లేదు, అల్లాహ్ కు తెలియదు అన్నటువంటి భ్రమలో మీరు పడి ఉండకండి. అల్లాహ్ (తఆలా) వారికి కొంత వ్యవధిని ఇస్తున్నాడు. ఈ వ్యవధి ఎప్పటివరకు కొందరికైతే ప్రపంచంలోనే గుణపాఠం దొరుకుతుంది. కానీ ఎంతోమంది ఆనాటి వరకు ఏనాడైతే వారి యొక్క చూపులు చాలా క్రిందికి అయిపోతాయి. పరిగెడుతూ ఉంటారు. సమాధుల నుండి లేచిన తర్వాత పరిగెత్తుతారు. వారి తలలు కూడా క్రిందికి వంగి ఉంటాయి. కనురెప్పలు ఎత్తి కూడా చూడడానికి అవకాశం అనేది ఉండదు. అంత భయకంపితులై ఉంటారు. ఆనాటి పరిస్థితిలో అవిశ్వాసంగా ఇక్కడికి చేరుకున్నాము కదా!అని సిగ్గుతో, పశ్చాత్తాపంతో తలఎత్తడం, కళ్ళు ఎత్తి చూడడం అది కూడా వారికి సిగ్గుగా అనిపిస్తుంది మరియు ఆనాటి యొక్క భయంకరం, గాంభీర్యంతో వారి యొక్క హృదయాలు బయటికి వస్తాయా అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. మరి కొందరు పాపాత్ములు వారి పరిస్థితి ఇంతకంటే మరీ ఘోరంగా వారి యొక్క హృదయాలు బయటికి వచ్చి పడతాయా? అన్నటువంటి పరిస్థితి ఉంటుంది.
మహాశయులారా!, మరి కొందరి పరిస్థితి ఆనాడు ఎలా ఉంటుందో సూరయే గాఫిర్ ఆయత్ నెంబర్ పద్దెనిమిదిలో అల్లాహ్ (తఆలా) ఇలా తెలియజేసాడు: “అతి సమీపంలో రానున్న ఆ భయంకరమైన రోజు గురించి వారిని హెచ్చరించండి. వారి యొక్క హృదయాలు గొంతు వరకు వస్తున్నాయి. దానిని వారు ఇటు మింగ లేక పోతున్నారు అంటు బయటికి రాలేక పోతుంది”. అంత గాంభీర్యం అయిన పరిస్థితి ఉంటుంది. అంతెందుకండీ చిన్న పిల్లలు, వారు అయితే ఇంకా ఏ పాపం చెయ్యలేదు. వారు చేసేటటువంటి పని వారి గురించి రాయబడదు. అయినా గాని ఆ ప్రళయం సంభవించే రోజు ఎంతటి భయంకరమైన రోజు అంటే ఆ పిల్లల యొక్క వెంట్రుకలు కూడా తెల్ల పడిపోతాయి.
సూరయే ముజ్జమ్మిల్ లో అల్లాహ్ (తఆలా) తెలియపరిచాడు: “మీరు ఒకవేళ ఆ ప్రళయ దినాన్ని నిరాకరిస్తే, తిరస్కరిస్తే మరి ఆ శిక్ష నుండి మీరు ఎలా బయటపడతారు, ఎలా రక్షింపబడతారు. ఆ ప్రళయ దినం నాటి యొక్క భయంకరత్వం ఎలా ఉంది? పిల్లలు సైతం ముసలివారు గా ఏర్పడతారు”. అంతటి గాంభీర్యం.
ఆ రోజు మనిషి యొక్క పరిస్థితి ఎంతవరకు చేరుకుంటుంది అంటే తనను తాను తప్ప మరి ఎవరి గురించి కూడా ఆలోచించలేడు. చివరికి మనిషి అతని యొక్క భార్యను గాని లేదా భార్య తన యొక్క భర్తను గాని, తల్లి కొడుకును గాని, కొడుకు తల్లిని గాని, కూతురు తండ్రిని గాని, తండ్రి కూతురును గాని, సోదరులు పరస్పరం, సోదరీమణులు పరస్పరం ఎవరు కూడా ఎవరైతే ఇహలోకంలో క్లోజ్ ఫ్రెండ్ అని, సుఖదుఃఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉండేవాళ్ళు, ప్రాణానికి ప్రాణం ఇచ్చేటటువంటి మాటలు చెప్పుకునేవారు సైతం ఆ ప్రళయదినాన తమను తప్ప మరెవరి గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి ఉండదు. ఒకసారి ఖురాన్ లో ఈయొక్క విషయాన్ని ఎలా స్పష్టంగా తెలుపడం జరిగిందో గమనించండి. సూరత్ అబస ఆయత్ నెంబర్ ముప్పై మూడు నుండి ముప్పై ఏడు వరకు: “ఆ ప్రళయదినం సంభవించినప్పుడు మనిషి తన సోదరునితో పారిపోతాడు. తన తల్లిదండ్రులతో కూడా పారిపోతాడు. తన భార్య, స్త్రీ అయితే తన భర్త మరియు సంతానం నుండి పారిపోతారు. ఆ రోజు ప్రతి ఒక్కరికీ స్వయం తన గురించి ఎంత బాధ, ఎంత పశ్చాత్తాపం, ఎంత రంది ఉంటుందో ఇతరుల గురించి ఆలోచించే ఆ పరిస్థితిని రానివ్వదు.”
ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. సహీ బుఖారీ లో హదీత్ ఉంది. ప్రళయ దినాన శంకు ఊదబడిన తరువాత అందరూ సమాధుల నుండి లేచి వచ్చినప్పుడు వారి శరీరంపై దుస్తులు ఉండవు, కాళ్ళకు చెప్పులు ఉండవు మరియు పురుషులు ఒడుగులు చేయబడిన స్థితిలో ఖత్న, సున్నతీ లేకుండా లేప బడతారు. అందరూ ఈవిధంగా నగ్నంగా వస్తారు అన్న విషయం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలుపుతూ ఉన్నప్పుడు హజ్రత్ ఆయిషా సిద్దీక (రదియల్లాహు అన్హా) గారు అడిగారు: “ప్రవక్తా! మరి ఆ సందర్భంలో పురుషులు, స్త్రీల యొక్క దృష్టి ఒకరిపై ఒకరికి పడదా?” అంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: “ఆయేషా! ఆనాటి పరిస్థితి అంతకంటే మరీ ఘోరంగా ఉంటుంది. ఎవరికీ ఎవరి గురించి ఏ ఆలోచన ఉండదు. ఇలా దృష్టి ఒకరిపై వేసి చూడాలి అన్నటువంటి ఆ ఆలోచన రానే రాదు”.
ఆ రోజు అవిశ్వాసులు, సత్య తిరస్కారాలు పాపాల్లో కూరుకుపోయి తమ జీవితం సత్కార్యాలు నుండి దూరం ఉంచినవారు నరక శిక్ష గురించి, ప్రళయం యొక్క ఆ గాంభీర్యం గురించి అవన్నీ వారికి ఆ రోజున ఎప్పుడైతే సత్యాలు తెలుస్తాయో వారికి కోరిక ఏముంటుంది? భూమి నిండా బంగారం కానీ, ఇంకా ఏదైనా వారికి లభిస్తే వారు దానిని ఒక పరిహారంగా అల్లాహ్ ఎదుట ఇచ్చి, ఆనాటి గాంభీర్యం, ఆనాటి యొక్క భయంకరత్వం దాని నుండి రక్షించుకోవాలని, తప్పించుకోవాలని ఆలోచిస్తారు. సూరయే యూనుస్ ఆయత్ నెంబర్ యాబై నాలుగులో అల్లాహ్ (తఆలా) తెలిపాడు: ఇహలోకంలో షిర్క్ చేస్తూ, పాపాలు చేస్తూ అల్లాహ్ అవిధేయత లో జీవితం గడిపిన ప్రతి మనిషి భూమి నిండా ధనం అతనికి లభిస్తే అదంతా కూడా ఆనాటి గాంభీర్యం మరియు శిక్ష నుండి తప్పించుకోవటానికి ఒక పరిహారంగా ఇచ్ఛేద్దామా అని ఆలోచిస్తాడు. సూరయే రఆద్ ఆయత్ నెంబర్ పద్దెనిమిదిలో అల్లాహ్ మరి కొందరి గురించి ఏమని తెలిపాడంటే – వారి వద్ద ఈ భూమి కాదు ఈ భూమి యొక్క రెండింతలు ఉన్నాకానీ, ఈ భూమి యొక్క రెండింతలు ఉన్నా కానీ దానిని పరిహారంగా చెల్లించి ఆనాటి శిక్షల నుండి, ఆనాటి ఆందోళనకరల నుండి తప్పించుకుందాం అన్నటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇది ఏమాత్రం సాధ్యపడదు. ఆ రోజు ఏ డబ్బు, ఏ ధనము, ఏ బంగారం, ఏ వెండీ, ఏ డైమండ్స్ ఏదీ కూడా చెల్లదు. ఆ రోజు విశ్వాసం మరియు సత్కార్యాల ఆధారంగా తీర్పు జరుగుతుంది. ఎవరు విశ్వాసాన్ని అవలంభించి సత్కార్యాలు చేసి ఉన్నారో వారి కొరకే సుఖాలు, ఐశ్వర్యాలు, అన్ని రకాల లాభాలు, భోగభాగ్యాలు ఉంటాయి. అల్లాహ్ ఎవరి నుండి ధనము, డబ్బు స్వీకరించడు వారిని ఆ శిక్ష నుండి తప్పించడానికి, ఆ శిక్ష నుండి రక్షించడానికి. గమనించండి, సూరయే ఆలె ఇమ్రాన్ ఆయత్ నెంబర్ తొంబై ఒకటిలో అల్లాహ్ (తఆలా) ఇలా తెలియపరిచాడు – “ఎవరైతే సత్యాన్ని తిరస్కరించారో, అవిశ్వాసానికి ఒడిగట్టారో, వారు అ విశ్వాసులుగా ఉన్నప్పుడే వారికి చావు వచ్చిందో భూమి నిండా బంగారం కూడా వారు ప్రాయశ్చితంగా ఇవ్వాలి అని అనుకుంటే అది స్వీకరించబడదు. వారికి ఆ రోజు కఠినమైన శిక్ష ఉంటుంది, బాధాకరమైన శిక్ష ఉంటుంది. ఎవరు కూడా వారికీ ఎలాంటి సహాయం చేసేవారు ఉండరు.” ఇలాంటి ఆయతులతో, ఇలాంటి బోధనలతో గుణపాఠం నేర్చుకొని మనలో వెంటనే మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ ఈ సత్భాగ్యం నాకు మీకు అందరికి ప్రసాదించు గాకా!
సహీ బుఖారీ లో హదీత్ ఉంది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు – సత్య తిరస్కారిని, అవిశ్వాసిని ప్రళయ దినాన తీసుకురావడం జరుగుతుంది. అతనితో ఇలా ప్రశ్నించడం జరుగుతుంది. ఏమీ! నీ వద్ద ఈభూమి నిండా బంగారం ఉంటే నీవు దానిని పరిహారంగా చెల్లించి ఈ శిక్షల నుండి తప్పించుకుందామని అనుకుంటివా? అతను అంటాడు, అవును. అప్పుడు అతనికి సమాధానం చెప్పడం జరుగుతుంది. నేనైతే ఇహలోకంలో నీవు ఉన్నప్పుడు దీనికంటే ఎంతో తేలికమైన విషయం నీతో నేను కోరాను. విశ్వాసాన్ని అవలంభించు, సత్కార్యాలు చేస్తూపో. ఇదే నీతో నేను కోరబడినది ఇహలోకంలో, కానీ అది మాత్రం చేయలేదు. ఇప్పుడు నీ వద్ద భూమి నిండా బంగారం ఉంటే దాన్ని పరిహారంగా చెల్లించాలి అనుకుంటున్నావు. ఇది ఎక్కడ సాధ్యపడుతుంది?
ఇంకా ఆ ప్రళయదిన గాంభీర్య విషయాలు మరిన్ని తెలుసుకునేటివి చాలా ఉన్నాయి. తరువాయి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్లాంలో పురుషులు నమాజుకి టోపీ పెట్టుకోవడం తప్పని సరినా? కొందరు మస్జిదులో టోపీ లేకుండా నమాజు చదివితే వారిని అడ్డుకుంటూ ఉంటారు? కొందరైతే టోపీ లేకుండా మస్జిదు కు రావద్దు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి టోపీ పెట్టుకోకబోతే నమాజు స్వీకరించబడదా? టోపీ అస్తమానం పెట్టుకుంటూ ఉండాలా?
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్.అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
మహాశయులారా! లెక్క తీసుకునే విధానాలు ప్రళయ దినాన ప్రతి ఒక్కరితో వేరు వేరుగా ఉండవచ్చు. అల్లాహ్ (తఆలా) కొందరిని తన దగ్గరికి పిలుచుకొని తాను చేసిన ఒక్కొక్క పాపాన్ని, ఒక్కొక్క సత్కార్యాన్ని గుర్తు చేసి, పాపాలు ఏదైతే అతని నుండి జరిగినవో అతని ద్వారా ఒప్పిస్తాడు. ప్రజల్లో కొందరు ఒప్పుకుంటారు. మరి కొందరు స్వయంగా వారు చేసిన పాపాల్ని అబద్దం చెప్పి మేము చేయలేదు అని అంటారు. అలాంటి వారికి అల్లాహ్ (తఆలా) వారి ముందు కొన్ని, కొందరు సాక్షులను తీసుకొస్తాడు. చివరికి స్వయంగా వారి శరీర భాగాలు కూడా మాట్లాడుతాయి మరియు వారికి వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతాయి.
ఈ విధంగా సోదరులారా సహీ బుఖారిలో ఒక హదీత్ వచ్చి ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: ప్రళయ దినాన అల్లాహ్ (తఆలా) ఒక వ్యక్తిని ప్రజలందరి మధ్యలో నుండి హాజరు పరుస్తాడు మరియు తనకు మరియు అతనికి మధ్యలో ఎలాంటి అనువాదం చేసే వాని అవసరం లేకుండా స్వయంగా అల్లాహ్ (తఆలా) అతనితో మాట్లాడుతాడు. అతడు చేసిన పాపాల్ని అతనికి గుర్తు చేస్తాడు. అతడు తన పాపాలు అన్నిటిని కూడా ఒప్పుకుంటాడు. అప్పుడు అల్లాహ్ (తఆలా) అతనితో అంటాడు: “ఇహలోకంలో నీవు ఈ పాపాలు చేసినప్పుడు నిన్ను అవమాన పరచకుండా నీతో జరిగిన ఈ పాపాల విషయంలో ఎవరికి తెలియకుండా నేను కప్పి ఉంచాను. ఈ రోజు కూడా ప్రజలందరి ముందు నిన్ను అవమాన పరచకుండా నేను నిన్ను క్షమిస్తున్నాను, మన్నించేస్తున్నాను” అని అల్లాహ్ (తఆలా) శుభవార్త తెలియపరుస్తాడు.
దీనికి భిన్నంగా ఖురాన్ లోని ఆయత్ మనం చదివామంటే ఒళ్ళు కంపించిపోతుంది. ఒక వ్యక్తి వస్తాడు. ఎన్నో పాపాలు చేసి ఉంటాడు. కానీ ఏ ఒక్క పాపాన్ని ఒప్పుకోడు. “నీవు చేసిన పాపాలు ఒప్పించడానికి సాక్ష్యం పలికే వారిని తీసుకొస్తాను” అని అంటే “ఈ రోజు నేను నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే వారిని ఎవరినీ స్వీకరించను. నా శరీరం నాకు సాక్ష్యం పలుకుతే నేను స్వీకరిస్తాను”. అప్పుడు అల్లాహ్ (తఆలా) శరీరం యొక్క తోలు ఏదైతే ఉందో దానిని ఆదేశిస్తాడు. మనిషి యొక్క తోలు మాట్లాడుతూ ఉంటుంది. వారు తమ శరీర తోలును ఎప్పుడైతే మాట్లాడడం వ్యతిరేకంగా సాక్ష్యం పలకడం చూస్తారో, వారు తోలుతో అంటారు: “ఏమైంది? నాకు వ్యతిరేకంగా మీరు ఎందుకు సాక్ష్యం పలుకుతున్నారు?” “ప్రతి మాట్లాడే వారికి మాట్లాడే శక్తి అల్లాహ్ ఎలా ప్రసాదించాడో ఈరోజు మాకు మాట్లాడే శక్తి అల్లాహ్ అలాగే ప్రసాదించాడు” అని ఆ తోళ్ళు పలుకుతాయి.
సూరయే యాసీన్ లోని ఆయతులు చదవండి – “మేము ఆ రోజు ప్రళయ దినాన వారి యొక్క నోళ్ళపై ముద్ర వేసేస్తాం. అప్పుడు వారి యొక్క చేతులు మాట్లాడుతూ ఉంటాయి. వారి యొక్క కాళ్లు సాక్ష్యం పలుకుతాయి. వారు చేసిన వాటన్నిటి గురించి చెపుతూ ఉంటాయి”. మహాశయులారా! అల్లాహ్ ఒకవేళ తన దాసులపై అన్యాయం చేసి నరకంలో పంపినా గానీ, అతన్ని ఎవరూ అడిగేవారు లేరు. అంతటి శక్తిశాలి. అయినా అది అతని యొక్క అన్యాయం అనబడదు కూడా. ఎందుకంటే మనందరం అతని ఆధీనంలో ఉన్నాము. అతని యొక్క దాసులము. కానీ, “నీ ప్రభువు తన దాసులపై ఏ రవ్వంత అన్యాయం చేసేవాడు కాదు“. ఆనాడు లెక్క తీసుకోబడటం ఏదైతే జరుగుతుందో అందులో అల్లాహ్ ఏ ఒక్కరిపై కూడా రవ్వంత అన్యాయం, దౌర్జన్యం చేయనే చేయడు. అల్లాహ్ ఎలా దౌర్జన్యం చేయగలుగుతాడు? అస్తగ్ఫిరుల్లాహ్! అల్లాహ్ ఎలా అన్యాయం చేయగలుగుతాడు? ఆయనే స్వయంగా చెబుతున్నాడు, ముస్లిం షరీఫ్ లోని హదీత్ ఖుద్సీ, “అన్యాయాన్ని దౌర్జన్యాన్ని నేను నాపై నిషేధించాను మరియు మీ మధ్యలో కూడా దానిని నిషేధించి ఉన్నాను. మీరు కూడా పరస్పరం దౌర్జన్యం చేసుకోకండి, అన్యాయాలు చేసుకోకండి“.
లెక్క తీసుకునే విషయంలో అల్లాహ్ వద్ద ఉన్నటువంటి మరొక నియమం ఏమిటంటే ఆయన ఒకరి పాపాల గురించి మరొకరిని పట్టుకోడు. ఒకరి పాపాల భారం మరొకరిపై వేయడు. ఒకరు చేసిన పాపానికి మరొకరిని శిక్షించడు.
అంతేకాకుండా లెక్క తీసుకునే విషయంలో మరొక నియమం అల్లాహ్ ఏదైతే పాటిస్తాడో – దాసులు వారు చేసిన కర్మలన్నీ వారికి స్వయంగా చూపిస్తాడు. “ఎవరైతే అణువంత పుణ్యం చేసుకున్నారో వారు కూడా దానిని చూసుకుంటారు. మరి ఎవరైతే అణువంత పాపం చేశారో వారు కూడా దానిని చూసుకుంటారు“. సూరయే ఆలె ఇమ్రాన్ లో అల్లాహ్ (తఆలా) తెలిపాడు: “ఆనాడు ప్రతీ ప్రాణి, ప్రతీ ఒక్కరు తాను చేసుకున్న మంచిగానీ, చెడ్డ గానీ, సత్కార్యం గానీ, దుష్కార్యం కానీ దానిని వారు చూస్తారు. దానిని వారు పొందుతారు. ప్రతీ కార్యం వారికి తెలియజేయడం జరుగుతుంది.”
లెక్క తీసుకునే విషయంలో అల్లాహ్ వద్ద ఉన్నటువంటి మరొక నియమం ఏమిటంటే – అల్లాహ్ (తఆలా) సత్కార్యాల సత్ఫలితం ఎన్నో రెట్లుగాపెంచి ఇస్తాడు. కానీ అదే దుష్కార్యాలు వాటి యొక్క శిక్ష ఏ రవ్వంత పెంచి ఇవ్వడు. దీని గురించి ఎన్నో హదీతులు వచ్చి ఉన్నాయి. ఒక సహీ హదీత్ లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఎప్పుడైతే ఒక మనిషి ఒక సత్కార్యం చేయాలని మనసులో అనుకుంటాడో అల్లాహ్ అతనికి ఒక పుణ్యం రాస్తాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ సత్కార్యాన్ని ఆచరణ రూపంలో చేస్తాడో అల్లాహ్ అతనికి ఆ సత్కార్యానికి బదులుగా పది రెట్లు నుండి ఏడు వందల రెట్ల వరకు పుణ్యాలు రాస్తాడు. దాసుడు ఒకవేళ దుష్కార్యం గురించి మనసులో అనుకుంటే అల్లాహ్ అతనికి ఒక పాపం రాయడు. ఒకవేళ అతను ఆ దుష్కార్యం చేస్తే ఒక్క పాపం మాత్రమే రాస్తాడు. అదే ఒకవేళ అతను ఆ దుష్కార్యం ఆలోచనను వదులుకుంటే అతనికి ఒక పుణ్యం రాస్తాడు“. ఈ హదీత్ కు సాక్షాధారం చదవాలనుకుంటే ఖురాన్ లోని ఈ ఆయత్ కూడా చదవవచ్చు. “ఎవరైతే ఒక సత్కార్యం చేస్తారో వారికి దాని పది రెట్ల కు ఎక్కువగా వారికి పుణ్యం లభిస్తుంది“
అలాగే లెక్క తీసుకోవడంలో ఒక నియమం ఏమిటంటే – అల్లాహ్ (తఆలా) ఒకరు చేసిన పాపానికి బదులుగా మరొకరిని శిక్షించడు. ఒకరు చేసిన పాపానికి బదులుగా మరొకరిని పట్టుకోవడం జరగదు. ఖురాన్ లోని ఈ ఆయత్ చదవండి – “ఒకరి పాపాల భారం మరో ఒకరిపై వేయడం జరగదు“. మరోచోట అల్లాహ్ (తఆలా) తెలిపాడు – “ప్రతి మనిషి తాను ఏమి సంపాదించాడో దాని ప్రకారమే అతనికి ప్రతిఫలం లభిస్తుంది“. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఒకరు చేసిన పాపానికి బదులుగా మరొకరు శిక్ష పొందడం ఇలా జరగదు కానీ ఎవరైనా ఇతరులకు చెడు చేయాలని చెప్పి, చెడు వైపునకు ప్రేరేపిస్తే వారు చెడు చేసినందుకు ఇతని కారణంగా అతను ఆ చెడు చేశాడు కనుక అతను చేసిన చెడులోని పాప భారం అతనిపై ఏమాత్రం తగ్గకుండా, ఇతను చెడు వైపునకు పురికొల్పినందుకు ఇతను కూడా ఆ పాప భారాన్ని మోస్తాడు. అతని యొక్క పాప భారంలో ఏ మాత్రం తగ్గింపు జరగదు. లెక్క జరిగే విషయాల కొన్ని వివరాలు మనం తెలుసుకుంటున్నాము. అలాగే సోదరులారా, చెడు వైపునకు ప్రేరేపిస్తే, ప్రేరేపించిన వారికి ఆ చెడు యొక్క పాపం కలుగును. దాని యొక్క శిక్ష అతను పొందాలి. అలాగే ఎవరైనా మంచి కార్యం వైపునకు, పుణ్యకార్యం వైపునకు ఇతరులను ఆహ్వానిస్తే, ఆ ఆహ్వానం మేరకు ఎవరెవరు ఆ పుణ్యం వైపునకు వస్తారో, దానిని ఆచరిస్తారో వారికి వారి ప్రకారంగా సత్ఫలితం లభిస్తుంది. కానీ పుణ్యం వైపునకు ఆహ్వానించే వారికి కూడా ఆ పుణ్యం చేసినంత సత్ఫలితం వారికి లభిస్తుంది.
లెక్క తీసుకునే విషయంలో మరొక నియమం ఏమిటంటే – అల్లాహ్ (తఆలా) అవిశ్వాసులకు, కపటవిశ్వాసులకు, వంచకులకు, మరెందరో పాపాలు చేసేటటువంటి దుర్మార్గులకు వారు తిరస్కరించినందుకు, వారికి వ్యతిరేకంగా ఎన్నో రకాల సాక్షులను వారి ముందు నిలబెట్టడం జరుగుతుంది. వాటి యొక్క వివరాలు తర్వాత ఎపిసోడ్ లలో ఇన్షాఅల్లాహ్ మనం విననున్నాము.
అయితే లెక్క విషయంలో మరొక విషయం మనం తెలుసుకోవలసినది ఏమిటంటే – ఆదమ్ (అలైహిస్సలాం) నుండి మొదులుకొని చిట్టచివరి ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వరకు ఎందరు ప్రవక్తలు వచ్చారో, వారందరి ప్రవక్తల జాతుల్లో అందరికంటే మొట్టమొదటి సారిగా లెక్క తీసుకోవడం జరిగేది మన ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి యొక్క అనుచర సంఘం. దీనికి సంబంధించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు – “మనం ఇతర జాతులను చూస్తే వారికంటే చివరిలో వచ్చిన వారిమి. కానీ ప్రళయ దినాన అందరికంటే ముందు మనం ఉంటాము. సర్వ ప్రజల్లో అందరికంటే ముందు లెక్క, తీర్పు జరిగేది మన అనుచర సంఘం యొక్క లెక్క తీర్పు.” ఇది కూడా మన ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై మరియు మనపై అల్లాహ్ యొక్క గొప్ప కరుణ. దీనిని మనం గ్రహించాలి.
ఈ హదీత్ సహీ బుఖారి మరియు సహీ ముస్లిం లో ఉంది మరియు ముస్నద్ అహ్మద్ ఇంకా ఇబ్నెమాజా లో ఉంది – ఇబ్నె అబ్బాస్ (రది యల్లాహు తఆలా అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపినట్లుగా చెప్పారు – “ఇతర అనుచర సంఘాల్లో మనం అందరికంటే చివరి వారిమి. కానీ లెక్క జరిగే ప్రకారంగా మొట్టమొదటి వాళ్ళం. మన నుండే లెక్క మొదలవుతుంది. మన లెక్క అయిన తర్వాతనే ఇతర జాతుల లెక్క జరుగుతుంది.”
మరి సోదరులారా!, సోదరీమణులారా!, లెక్క జరిగే ఆ ప్రళయదినాన మొట్టమొదటి లెక్క దేని గురించి జరుగునో ఎప్పుడైనా మనం గమనించామా? హదీతుల్లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ విషయం కూడా చాలా స్పష్టంగా మనకి తెలియజేసారు. ఎందుకూ? అలాంటి సత్కార్యాలు చేయడంలో మనం వెనుక ఉండకూడదు అని. ప్రళయ దినాన లెక్క తీసుకోబడే రోజు మనం అక్కడ మోక్షం పొందాలి, ఆ లెక్కలో పాస్ అవ్వాలి అని. ఇబ్నెమాజా లోని సహీ హదీత్ – “ప్రళయ దినాన ఆరాధనల్లో అందరికంటే ముందు నమాజ్ యొక్క లెక్క తీసుకోబడును. నమాజ్ సరిగ్గా ఉంటే అందులో అతడు పాస్ అయ్యాడు అంటే ఇతర వేరే కర్మలు కూడా సరి అయినట్లు. అతను నమాజ్ లో ఫెయిల్ అయ్యాడు అంటే ఇతర విషయాల్లో కూడా ఫెయిల్ అయినట్లే“, అందుగురించి మహాశయులారా!, ఇకనైనా నమాజ్ విషయంలో మనం శ్రద్ధ వహించాలి. ప్రత్యేకంగా పురుషులు సామూహికంగా మస్జిద్ లో నమాజ్ చేయాలి. ప్రత్యేకంగా ఫజర్ నమాజ్ లో ఏ బద్ధకం వహిస్తున్నామో, రాత్రి పడుకోవడంలో ఆలస్యం చేసి ఫజర్ నమాజ్ ను వదిలేస్తున్నామో, మనం డ్యూటీ వెళ్ళే సమయంలో చదవడం లేదా జోహార్ తో పాటు కలిపి చదవడం లాంటి ఏ తప్పులు అయితే చేస్తున్నామో వాటిని వదులుకోవాలి. తొలిసారిగా లెక్క జరిగేది నమాజ్ గురించి. ఈ నమాజ్ లో పాస్ కాకుంటే మనం చాలా నష్టపోతాము, ఫెయిల్ అయిన వాళ్ళల్లో లెక్కించబడుతుంది. అందుగురించి నమాజ్ పట్ల శ్రద్ధ వహించండి.
ఇంకా మహాశయులారా!, తీర్పుల్లో మొట్టమొదటి తీర్పు, సహీ బుఖారీ, సహీ ముస్లిం లోని హదీత్, “ప్రళయ దినాన ప్రజలందరి మధ్యలో మొట్టమొదటి తీర్పు రక్తాల గురించి జరుగును. ఎవరు ఎవరిని అన్యాయంగా హత్య చేశారో, ఎవరు ఎవరిని హత్య చేయడానికి ప్లాన్ లు వేసాడో, ఎవరు ఎవరిని హత్య చేయడానికి సహాయ పడ్డాడో” ఈ విధంగా ఇస్లాంలో ఆరాధనల్లో మొట్ట మొదటి విషయం నమాజ్ అయితే సామాజిక వ్యవహారాల్లో, సామాజిక విషయాల్లో రక్తానికి చాలా గొప్ప విలువ ఉన్నది. మహాశయులారా!, ఇకనైనా గమనించండి. ఇస్లాం పై బురద చల్లకండి. ఇస్లాం పై అజ్ఞానంతో వేరే రకంగా దాన్ని చిత్రీకరించకండి. ప్రాణాలకు ఎంత విలువనిస్తుంది. అన్యాయంగా, అకారణంగా, దౌర్జన్యంగా ఎవరైతే ఎవరిని హత మారుస్తారో వారికి స్వర్గం కూడా లభించదు. స్వర్గం యొక్క సువాసన నలభై సంవత్సరాల ప్రయాణం గల దూరం నుండి ఆఘ్రానించ బడుతుంది. కానీ అలాంటి వారికి ఆ సువాసన కూడా లభించదు అని ఇస్లాం స్పష్టపరిచింది. అయితే ప్రళయదినాన ఈ రక్తాలు గురించి మొట్టమొదటి తీర్పు జరుగును. అందుగురించే ఇస్లాం “ఎవరైనా అన్యాయంగా ఒక ప్రాణిని చంపారంటే మానవత్వం మొత్తాన్ని మట్టిలో కలిపినట్లు” అని వారి గురించి హెచ్చరించింది.
ఈ విధంగా లెక్క జరిగే ఆ రోజున దానికి సంబంధించిన వివరాలు మనం అల్లాహ్ యొక్క దయ వల్ల ఈనాటి కార్యక్రమంలో విన్నాము, తెలుసుకున్నాము. అయితే ఆ లెక్క జరిగే రోజు రాకముందే మనం ఇక్కడే దాని గురించి సిద్దపడాలి. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వారు చెప్పిన ఈ మాటలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి: “ప్రళయ దినాన అక్కడ మీ లెక్క జరిగే కి ముందు మీరు ఇక్కడే మీలెక్క తీసుకుంటూ ఉండండి. మీకు అక్కడ సులభతరం కలుగుతుంది“.
అల్లాహ్ మనందరికీ ప్రతిరోజు మనం చేస్తున్న ప్రతికార్యం గురించి లెక్క తీసుకుంటూ ఆ లెక్క రోజు గురించి సిద్ధపడేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సజ్దా నమాజులోని అతి గొప్ప భాగం, అందులో అల్లాహ్ కొరకు నమ్రత, సమర్పణ సంపూర్ణ రీతిలో పాటించబడుతుంది. అందుకే అనేక పుణ్యాలు, ఉత్తమ ఫలితాలు సజ్దా విషయంలో చెప్పబడ్డాయి. ఈ గొప్ప పుణ్యాన్ని గమనించండి.
(9.1) సాఫల్యం (నరకం నుండి రక్షణ, స్వర్గ ప్రవేశ సఫలత)
అల్లాహ్ ఆదేశం: {విశ్వాసులారా! రుకూ చేయండి, సజ్దా చేయండి, మీ ప్రభువుకు దాస్యం చేయండి, మంచి పనులు చేయండి, దీని ద్వారానే మీకు సాఫల్య భాగ్యం లభించవచ్చును}. (హజ్ 22: 77).
{లఅల్లకుం తుఫ్లిహూన్} వ్యాఖ్వానంలో అబూ బక్ర్ అల్ జజాయిరీ ఇలా చెప్పారు: ‘అంటే నరకం నుండి రక్షణ పొంది స్వర్గ ప్రవేశ ప్రాప్తమే గొప్ప సాఫల్యం‘. (ఐసరుత్తఫాసీర్ లికలామిల్ అలియ్యిల్ కదీర్).
(9.2) ప్రళయదినాన అల్లాహ్ దయానుగ్రహాలు, ఆయన సంతోషం మరియు కాంతి లభిస్తాయి
{ముహమ్మద్ ﷺఅల్లాహ్ ప్రవక్త, ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులుగా ఉంటారు, పరస్పరం కరుణామయులుగా ఉంటారు. నీవు వారిని చూసినప్పుడు, వారు రుకూ సజ్దాలలో, అల్లాహ్ అనుగ్రహాన్నీ ఆయన ప్రసన్నతనూ అర్థించటంలో నిమగ్నులై ఉండటం కనిపిస్తుంది. సజ్దాల సూచనలు వారి ముఖాలపై ఉంటాయి. వాటి వల్ల వారు ప్రత్యేకంగా గుర్తించ బడతారు}. (ఫత్ హ్ 48: 29).
{సజ్దాల సూచనలు వారి ముఖాలపై ఉంటాయి} యొక్క వ్యాఖ్యానం లో సఅదీ (రహిమహుల్లాహ్) ఇలా చెప్పారు: ‘అధికంగా మరియు మంచిరీతిలో చేసిన దాస్యం (ఇబాదత్) ప్రభావం వారి ముఖాలపై పడింది. చివరికి వారి నమాజుల వల్ల వారి బాహ్యం మెరిసినట్లు వారి ఆంతర్యం సయితం కాంతివంతమైంది. (తైసీరుల్ కరీమిర్రహ్మాన్ ఫీ తఫ్సీరి కలామిల్ మన్నాన్)
(9.3) స్థానం రెట్టింపు, పాపం మన్నింపు
فَقَالَ النَّبِي صلى الله عليه وسلم: (عَلَيْكَبِكَثْرَةِالسُّجُودِلِلهفَإِنَّكَلَاتَسْجُدُلِلهسَجْدَةًإِلَّارَفَعَكَاللهُبِهَادَرَجَةًوَحَطَّعَنْكَبِهَاخَطِيئَةً).
ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారుః “నీవు ఎక్కువగా సజ్దాలు చేయి, నీవు సజ్దా చేసినపుడల్లా నీ ప్రతి సజ్దాకు బదులుగా అల్లాహ్ నీ కొరకు ఒక స్థానం పెంచుతాడు, పాపం మన్నిస్తాడు”. (ముస్లిం 488).
(9.4) ప్రవక్త సామీప్యం
రబీఅ బిన్ కఅబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: నేను వుజూ నీళ్ళు, మరేదైనా అవసరమున్నవి అందించుటకు ప్రవక్త ﷺ వద్దనే రాత్రి గడపేవాణ్ణి. అయితే ఒకసారి ప్రవక్త ﷺ“అడుగు (నీకిష్టమున్నది అడుగు)” అని అన్నారు. ‘నేను స్వర్గంలో మీ సామీప్యం కోరుతున్నాను’ అని అన్నాను, ఇంకేదైనా? అని ప్రవక్త అడిగాడు, ‘కేవలం అది మాత్రమే’ అని నేనన్నాను. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారుః “నీ స్వప్రయోజనం కోసం నీవు అధిక సజ్దాలు (నమాజులు) చేసి నాకు సహాయపడు”. (ముస్లిం 489).
(9.5) దుఆ స్వీకారానికి తగిన సమయం
ప్రవక్త ﷺ ప్రబోధించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “దాసుడు తన ప్రభువుకు అతి చేరువుగా ఉండేది సజ్దా స్థితిలో, గనక అందులో ఎక్కువగా దుఆ చేయండి”. (ముస్లిం 482).
మరో ఉల్లేఖనంలో ఆయన ﷺ ఇలా చెప్పారు: “సజ్దాలో దుఆ ఎక్కువగా చేయండి, అది స్వీకారయోగ్యమవుతుందన్న నమ్మకం ఈ స్థితిలో ఎక్కువగా ఉంటుంది”. (ముస్లిం 479).
(9.6) పాపాల ప్రక్షాళన
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు: “మనిషి నమాజు చేయుటకు లేచినప్పుడు అతని పాపాలు అతని తల మరియు భుజాలపై వేయబడతాయి, అతను రుకూ, సజ్దాలు చేసినపుడల్లా అవి రాలిపోతాయి”. (బైహఖీ 3/10, సహీహుల్ జామిఅ 1671).
(9.7) సజ్దా అంగమును నరకాగ్ని కాల్చదు
ప్రవక్త ﷺ సెలవిచ్చారు: “(మానవ శరీరములో) సజ్దా భాగాన్ని అల్లాహ్ నరకంపై నిషేధించాడు, అంటే అది దాన్ని కాల్చదు”. (బుఖారీ 806, ముస్లిం 182).
విశ్వాసులు చేసిన పాపాల్ని అల్లాహ్ క్షమించనిచో, మరియు వారి పాపాలను అధిగమించే, తుడిచివేసే పుణ్యాలు కూడా వారి వద్ద లేకున్నచో వారు వారి పాపాల పరిమాణాన్ని బట్టి అగ్నిలో శిక్షించబడతారు. అయితే సజ్దా అంగములు చాలా గౌరవనీయమైనవి గనక అగ్ని వాటిని తినదు, వాటిపై ఏలాంటి ప్రభావం పడదు. (అష్షర్హుల్ ముమ్తిఅ. 3వ సంపుటం: షేఖ్ ఇబ్ను ఉసైమీన్)
10 – మొదటి తషహ్హుద్
భూమ్యాకాశాల్లో ఉన్న అల్లాహ్ దాసులకు సమానంగా పుణ్యం
మొదటి తషహ్హుద్ లో ‘అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లా హిస్సాలిహీన్’ అన్న దుఆ చదువుతున్నప్పుడు గొప్ప ఘనత మనకు తెలుస్తుంది. నాతో పాటు మీరూ గమనించండి:
అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: నా చేయి ప్రవక్త ﷺ చేతిలో ఉండగా ఖుర్ఆను సూరాలు నేర్పినట్లు ఆయన నాకు తషహ్హుద్ దుఆ నేర్పారు. ‘అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యి బాతు అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహిస్సాలిహీన్‘ఈ పదాలు మీరన్నప్పుడు భూమ్యాకాశాల్లో ఉన్న ప్రతి పుణ్య పురుషునికి ఈ దుఆ లభిస్తుంది.‘వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు’. (బుఖారీ 831).
నీవు సలాం చేస్తున్నావంటే; భూమ్యాకాశాల్లో బ్రతికి ఉన్న, చని పోయిన పుణ్యపురుషులు, జిన్నాతులు మరియు అల్లాహ్ దూతలు అందరూ అన్ని రకాల లోపాలకు అతీతంగా మరియు ఆపదలకు దూరంగా ఉండాలని దుఆ చేస్తున్నావు అని అర్థం. దీని వల్ల అల్లాహ్ నీపై కరుణించి ఎవరెవరిపై నీవు సలాం చేశావో ప్రతి ఒక్కరికి బదులుగా పుణ్యం ప్రసాదిస్తాడు.
11 – చివరి తషహ్హుద్: (ప్రవక్త పై దరూద్)
ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లంపై దరూద్ చదవడంలో చాలా పుణ్యాలు, రెట్టింపు ప్రతిఫలాలున్నాయి.
{అల్లాహ్ ఆయన దూతలు ప్రవక్తకై ‘దరూద్‘ను పంపుతారు, విశ్వాసులారా! మీరు కూడా ఆయనకై దరూద్, సలామ్లు పంపండి}. (అహ్ జాబ్ 33: 56).
(11.2) పది రెట్ల పుణ్యం
عَنْ أَبِي هُرَيْرَةَ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (مَنْصَلَّىعَلَيَّوَاحِدَةًصَلَّىاللهُعَلَيْهِعَشْرًا).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ఎవరు నాపై ఒక సారి దరూద్ పంపుతారో అల్లాహ్ అతనిపై పది సార్లు కరుణిస్తాడు”. (ముస్లిం 408).
(11.3) పది పుణ్యాలు లిఖించబడతాయి, పది పాపాలు తొలగించ బడతాయి
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశ ప్రకారం: “నాపై ఒక్కసారి దరూద్ పంపిన వానికి అల్లాహ్ పది పుణ్యాలు వ్రాస్తాడు”. (తిర్మిజి 485), మరో ఉల్లేఖనంలోని పదాలు ఇలా ఉన్నాయి: “అతని పది పాపాలు తొలగిస్తాడు”. మరో హదీసు పదాలు ఇవి: “అతని పది పాపాలు తుడిచివేస్తాడు”. (ముస్నద్ అహ్మద్ 3/102, 4/29). [పది స్థానాలు రెట్టింపు చేయబడతాయని’ ముస్నద్ అహ్మద్ 4/29లో ఉంది.]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
నమాజు ఆరంభములో సూరె ఫాతిహాకు ముందు తక్బీరె తహ్రీమ తర్వాత అనేక దుఆలున్నాయి. వాటిలో ఈ దుఆను నేను తెలుపు తున్నాను. “అల్లాహు అక్బరు కబీరా, వల్ హందులిల్లాహి కసీరా, వ సుబ్ హాల్లాహి బుక్రతౌఁ వఅసీలా”. దీని ఉద్దేశం దీని గొప్ప ఘనతను చాటడమే తప్ప ఈ ఒక్క దుఆయే అని తెలపడం కాదు. ఆ ఘనత ఏమిటి? దాన్ని చదివిన వారి కొరకు ఆకాశ తలుపులు తెరువబడుతాయి.
ఇబ్ను ఉమర్ (రదియల్లాహు అన్హు) తెలిపారుః మేము ప్రవక్త ﷺ తో నమాజు చేస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి “అల్లాహు అక్బరు కబీరా, వల్ హందులిల్లాహి కసీరా, వ సుబ్ హాల్లాహి బుక్రతౌఁ వఅసీలా” అని పలికాడు, (నమాజు ముగించిన తర్వాత) “ఈ పదాలు పలికిన వారెవరు?” అని ప్రవక్త ﷺ అడిగారు. నేనే ఓ ప్రవక్తా! అని అతను చెప్పగా, “నేను ఆశ్చర్య పోయాను. ఆ పదాల వల్ల ఆకాశ తలుపులు తెరువబడ్డాయి” అని ప్రవక్త ﷺ తెలిపారు. ఇబ్ను ఉమర్ ఇలా చెప్పారుః నేను ఈ విషయం ప్రవక్తతో విన్నప్పటి నుండి వాటిని పలకడం మానలేదు. (ముస్లిం 601).
5 -సూరె ఫాతిహ పారాయణం
(5.1) ఖుర్ఆనులోని గొప్ప సూరా
నీవు నమాజులో సూరె ఫాతిహ చదువుతున్నప్పుడు ఖుర్ఆనులోని
ఒక గొప్ప సూర చదివినవానివవుతావు. నాతో పాటు నీవు కూడా ఈ హదీసుపై శ్రద్ధ వహించు:
అబూ సఈద్ బిన్ ముఅల్లా (రదియల్లాహు అన్హు) తెలిపారు: నేను మస్జిదులో నమాజు చేస్తుండగా ప్రవక్త ﷺ నన్ను పిలిచారు, వెంటనే నేను హాజరు కాలేకపోయాను, కొంత సేపయ్యాక హజరయి, ‘ప్రవక్తా! నేను నమాజు చేస్తుంటిని’ అని విన్నవించుకోగా, {అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పిలుపుకు జవాబు పలకండి} అని అల్లాహ్ ఆదేశం తెలియదా? అని మందలించి, “నీవు మస్జిద్ నుండి బైటికి వెళ్ళక ముందే నేను నీకు ఒక సూరా నేర్పుతాను, అది ఖుర్ఆనులోని ఒక గొప్ప సూరా” అని చెప్పారు. నా చేతిని పట్టుకున్నారు. ఇక ఎప్పుడైతే మస్జిద్ నుండి మేము బైటికి వెళ్ళబోయామో, అప్పుడు నేను ‘ప్రవక్తా! ఖుర్ఆనులోని ఒక గొప్ప సూరా గురించి తెలుపుతానన్నారు కదా’ అని గుర్తు చేశాను. అప్పుడాయన ఇలా చెప్పారు: “అది ఏడు ఆయతులు గల సూరా, మాటిమాటికి పఠింపదగినది మరియు గొప్ప ఖుర్ఆను నాకు ఇవ్వబడినది”. (బుఖారీ 4474).
(5.2) ఇది సనా (అల్లాహ్ స్తోత్రం) మరియు దుఆ
ఫాతిహ సూరా పారాయణం అల్లాహ్ మరియు ఆయన దాసుని మధ్యలో రెండు భాగాలుగా విభజించబడింది. మొదటి భాగంలో అల్లాహ్ స్తోత్రం, ఆయన మహత్తు, గొప్పతనం ఉంది. రెండవ భాగంలో దాసుని అర్ధింపు మరియు దుఆ ఉంది.
అబూ హురైరా (రదియల్లాహు అన్హు)ఉల్లేఖించారుః అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త ﷺ చెప్పారుః “నమాజు (సూరె ఫాతిహా)ను నేను నా మధ్య మరియు నా దాసుని మధ్య రెండు భాగాలుగా జేశాను. నా దాసుడు అర్థించినది అతనికి ప్రాప్తమవుతుంది. అతడు {అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆల మీన్} అన్నప్పుడు, నా దాసుడు నన్ను స్తుతించాడు అని అల్లాహ్ అంటాడు. అతడు {అర్రహ్మానిర్రహీం} అన్నప్పుడు, నా దాసుడు నన్ను ప్రశంసించాడు అని అల్లాహ్ అంటాడు. అతడు {మాలికి యౌమిద్దీన్} అన్నప్పుడు, నా దాసుడు నా గొప్పతనాన్ని చాటాడు అని అల్లాహ్ అంటాడు. అతడు {ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్} అన్న ప్పుడు, ఇది నా మధ్య మరియు నా దాసుని మధ్య ఉన్న సంబంధం, ఇక నా దాసుడు ఏది అడిగినా అతనికి ప్రాప్తమవుతుంది. అతడు {ఇహ్దినస్సిరాతల్ ముస్తఖీం, సిరాతల్లజీన అన్అమ్ త అలైహిం గైరిల్ మగ్ జూబి అలైహిం వలజ్జాల్లీన్} అన్నప్పుడు, ఇది నా దాసుడు అడిగింది, అతడు కోరినది అతనకి ప్రాప్తమవుతుంది అని అల్లాహ్ అంటాడు”. (ముస్లిం 395). మరిన్ని ఘనతలకై పేజి 69 చూడండి**
6 – ఆమీన్ పలకడం:
నమాజీ సోదరా! శుభవార్త!! ఎవరి ఆమీన్ అల్లాహ్ దూతల ఆమీన్ తో కలిసిపోవునో అతని పూర్వ పాపాలు క్షమించబడతాయి.
ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “(నమాజులో) ఇమాం గైరిల్ మగ్జూబి అలైహిం వలజ్జాల్లీన్ అని అన్నప్పుడు మీరంతా ఆమీన్ అని చెప్పండి, మీరు చెప్పే ఆమీన్ అల్లాహ్ దూతలు చెప్పే ఆమీన్ కు అనుగుణంగా ఉంటే ఆమీన్ చెప్పే వ్యక్తి పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 782, ముస్లిం 410).
عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (إِذَاقَالَأَحَدُكُمْآمِينَوَقَالَتْالْـمَلَائِكَةُفِيالسَّمَاءِآمِينَفَوَافَقَتْإِحْدَاهُمَاالْأُخْرَىغُفِرَلَهُمَاتَقَدَّمَمِنْذَنْبِهِ).
ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా ఆమీన్ అని పలకగా, ఆకాశంలో దైవదూతలు కూడా ఆమీన్ అన్నప్పడు ఇలా ఇవి రెండు కలిసిపోతాయి. తద్వారా ఆమీన్ అన్న వ్యక్తి పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 781).
ప్రవక్త ﷺ ఉపదేశించారని ఇబ్ను ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “మనిషి నమాజు కొరకు లేచినప్పుడు అతని పాపాలు అతని తల మరియు భుజాలపై వేయబడతాయి, అతను రుకూ, సజ్దాలు చేసినపుడల్లా అవి రాలిపోతాయి”. (బైహఖీ 3/10, సహీహుల్ జామిఅ 1671).
8 – రుకూ నుండి నిలబడిన తర్వాత దుఆలు:
రుకూ తర్వాత దుఆల ఘనత గొప్పది, పుణ్యం పెద్దది.
(8.1) ఎవరి ‘అల్లాహుమ్మ రబ్బనా లకల్ హందు / రబ్బనా వలకల్ హంద్’ పలుకులు దైవదూతల పలుకులతో కలిసిపోవునో అతని పాపాలు క్షమించబడును
عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (إِذَاقَالَالْإِمَامُسَمِعَاللهُلِمَنْحَمِدَهُفَقُولُوااللَّهُمَّرَبَّنَالَكَالْحَمْدُفَإِنَّهُمَنْوَافَقَقَوْلُهُقَوْلَالْمَلَائِكَةِغُفِرَلَهُمَاتَقَدَّمَمِنْذَنْبِهِ).
ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఇమాం నమాజులో ‘సమిఅల్లాహు లిమన్ హమిదహ్’ అన్నపుడు మీరు ‘అల్లాహుమ్మ రబ్బనా లకల్ హంద్’ అనండి, ఎవరి ఈ మాట అల్లాహ్ దూతల మాటకు అనుగుణంగా ఉంటుందో అతని పూర్వ పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ 796, ముస్లిం 409). మరో ఉల్లేఖనంలో ‘రబ్బనా వలకల్ హంద్’ అనండి అని ఉంది.
(8.2) ‘రబ్బనా వ లకల్ హందు హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్’ పదాలను వ్రాయడానికి అల్లాహ్ దూతలు ఒకరిని మించి ఒకరు ముందుకు వెళ్తుంటారు.
రిఫాఅ బిన్ రాఫిఅ (రదియల్లాహు అన్హు) అజ్జర్ఖి తెలిపారుః ప్రవక్త వెనక మేము నమాజు చేస్తూ ఉన్నాము, రుకూ నుండి తల లేపుతూ ప్రవక్త ‘సమిఅల్లాహు లిమన్ హమిదహ్’ అన్నారు, వెనక ఒక మనిషి ‘రబ్బనా వలకల్ హందు హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్’ అని అన్నాడు, ప్రవక్త నమాజు ముగించాక, “నమాజులో ఈ పదాలు పలికినవారెవరు?” అని అడిగారు. ‘నేను’ అని ఆ మనిషి అన్నాడు, అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారుః “నేను ముప్ఫై (30) కి పైగా అల్లాహ్ దూతలను చూశాను, ప్రతి ఒక్కరు తానే ముందుగా ఈ పదాలను వ్రాయాలని ఆరాట పడుతున్నాడు”. (బుఖారీ 799).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
2) ఏ సురాహ్ ఒకసారి చదివితే ఖుర్ఆన్ 1/3 భాగం తో సమానం?
A) సురాహ్ ఫాతిహా B) సురాహ్ యాసీన్ C) సురాహ్ ఇఖ్లాస్ D) సురాహ్ రహ్మాన్
మూడు సార్లు సూరె ఇఖ్లాస్ పారాయణం : పూర్తి ఖుర్ఆన్ పారాయణం చేసినంత పుణ్యం
అబూ సఈద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మీలో ఎవరైనా ఒక రాత్రిలో మూడోవంతు ఖుర్ఆన్ చదవలేడా? అని ప్రవక్త ﷺ ప్రశ్నించారు. ఇది వారికి కష్టంగా ఏర్పడి ‘ఎవరు చదవగలుగుతారు ప్రవక్తా? అని చెప్పారు, అప్పుడు ప్రవక్త “అల్లాహుల్ వాహిదుస్సమద్ (సూరె ఇఖ్లాస్) మూడోవంతు ఖుర్ఆన్ కు సమానం” అని చెప్పారు.
(బుఖారి: ఫజా-ఇలుల్ ఖుర్ఆన్/ ఫజ్లు ఖుల్ హువల్లాహు అహద్ 4628. ముస్లిం 1344).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.