తన అనుచర సమాజం (ఉమ్మత్) పై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హక్కులు:
1) అల్లాహ్ దాసుడిగా మరియు ప్రవక్తగా విశ్వసించడం.
2) తగిన విధంగా గౌరవించడం,
3) అల్లాహ్ తర్వాత, అత్యధికంగా ప్రేమించడం.
4) ఆదర్శాలను, సద్గుణాలను ఆచరించడం.
5) విధేయత చూపడం.
6) అభిప్రాయ భేదాలలో న్యాయనిర్ణేతగా స్వీకరించడం.
7) ఖుర్ఆన్ మరియు హదీసులకనుగుణంగా ఆచరించడం,
8) అత్యధికంగా దరూద్ పఠించడం.
గడిచిన జుమా ఖుత్బాలో, మేము ప్రవక్తల నాయకుడైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్థాయి, మహత్యం, అద్భుతాలు మరియు ఆయన ప్రత్యేకతలలో కొన్నింటిని గూర్చి వివరించాము. మరి ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ప్రవక్తకు తన అనుచర సమాజం (ఉమ్మత్)పై ఉన్న హక్కులేంటి? రండి, ఖురాను మరియు హదీసుల వెలుగులో ఆ హక్కుల గురించి నేటి జుమా ఖుత్బాలో తెలుసుకుందాం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దైవప్రవక్తలలో శ్రేష్టులయిన దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) వంశంలో జన్మించారు. ఆయన అల్లాహ్ దాసులు మరియు అంతిమ దైవప్రవక్త. ప్రళయం వరకు రాబోయే మానవులందరి కోసం ఆయనను ప్రవక్తగా చేసి పంపడం జరిగింది. ఆయన రాకతో దైవప్రవక్తల పరంపర సమాప్తమయ్యింది. ఆయన ఇతర ప్రవక్తలపై విశిష్టత మరియు ఆధిక్యతను పొందివున్నారు. ఇలాగే ఆయన ఉమ్మత్ స్థాయి కూడా ఇతర ఉమ్మత్ (అనుచర సమాజం)ల కన్నా ఎక్కువగా వుంది. ఆయన విధేయతను అల్లాహ్ తప్పనిసరి చేశాడు. ఆయనకు గల ప్రత్యేకతలు ఇతర ప్రవక్తలకు లేవు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని రండి! మన ప్రియ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి మహత్యం, ఆయన అద్భుతాలు మరియు
కొన్ని ప్రత్యేకతలను గూర్చి తెలుసుకొందాం.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్థాయి మరియు ఆయన విశిష్టత
1) శ్రేష్ట వంశము
తన వంశము (కుటుంబం) రీత్యా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో ఉన్నత స్థానం కలిగి వున్నారు.
ఈ విషయాన్నే వాయిలా బిన్ అసఖా (రదియల్లాహు అన్హు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా ఇలా ఉల్లేఖించారు:
“నిస్సందేహంగా అల్లాహ్, ఇస్మాయీల్ (అలైహిస్సలాం) సంతానంలో ‘కనాన’ ను ఎన్నుకున్నాడు. తదుపరి ‘కనాన’ నుండి ఖురైష్ ను, వారి నుండి బనూ హాషిమ్ ను ఎన్నుకున్నాడు. బనూ హాషిమ్ నుండి నన్ను ఎన్నుకున్నాడు.” (సహీ ముస్లిం : 2276)
ఇలాగే, రోము చక్రవర్తి (హెరిక్లెస్), అబూసుఫ్యాన్ (అప్పటి వరకు ఆయన ఇంకా ముస్లిం కాలేదు)ను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వంశావళిని గూర్చి అడగ్గా – ఆయన జవాబిస్తూ, “అతను మాలో ఎంతో ఉన్నతమైన వంశానికి చెందిన వ్యక్తి” అని అన్నారు. దీని పై హెరిక్లెస్ స్పందిస్తూ – దైవప్రవక్తలు (సాధారణంగా) తమ జాతుల్లోని ఉన్నత వంశానికి చెందినవారై వుంటారు అని అన్నాడు. (సహీ బుఖారీ : 7, సహీ ముస్లిం : 1773)
2) మానవాళి కొరకు గొప్ప కటాక్షం
వాస్తవానికి మానవాళి పై అల్లాహ్ ఉపకారాలు లెక్కలేనంతగా వున్నాయి. కానీ వాటిలో అన్నింటి కన్నా ప్రత్యేక ఉపకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆగమనం. ఈ విషయాన్ని అల్లాహ్ దివ్య ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు:
“అల్లాహ్ విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే – ఆయన, వారిలోనుండే ఒక ప్రవక్తను ఎన్నుకొని వారి వద్దకు పంపాడు. అతడు వారికి ఆయన వాక్యాలను చదివి వినిపిస్తాడు, వారిని పరిశుద్దుల్ని చేస్తాడు. వారికి గ్రంథజ్ఞానాన్ని, వివేకాన్ని బోధిస్తాడు. నిశ్చయంగా అంతకు ముందు వాళ్ళు స్పష్టమైన అపమార్గానికి లోనై వున్నారు.” (ఆలి ఇమ్రాన్ : 164)
ఈ ఆయత్ లో అల్లాహ్ సెలవిచ్చినట్లు, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు దైవదౌత్య బాధ్యతలు అప్పగించబడ్డ సమయంలో మానవ జాతి స్పష్టమైన అపమార్గానికి లోనై అజ్ఞానపు అంధకార లోయలలో కొట్టుమిట్టాడుతోంది. ఈ తరుణంలో అల్లాహ్ వారి వద్దకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను పంపి, వారిని అంధకారం నుండి బయటకు తీసి, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా వారిని రుజుమార్గం వైపునకు దారి చూపాడు. ఇలా, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సర్వ మానవాళి కొరకు ఒక కారుణ్యంగా వున్నారు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపాము.” (అంబియా : 107)
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు.
“ప్రజలారా! నేను ప్రజల కొరకు (అల్లాహ్ తరఫు నుండి) బహుమానంగా పంపబడిన కారుణ్యాన్ని”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ముస్లిం సముదాయం మీద ప్రవక్త ﷺ వారి హక్కులు https://youtu.be/vCfZBWieaic [52 నిముషాలు] వక్త:ముహమ్మద్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్
ఈ ప్రసంగం ముస్లిం సమాజంపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కుల గురించి వివరిస్తుంది. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ను స్తుతించడంతో ప్రసంగం మొదలవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక జాతికి లేదా ప్రాంతానికి మాత్రమే కాక, యావత్ ప్రపంచానికి ప్రవక్తగా పంపబడ్డారని ఖుర్ఆన్ ఆధారాలతో స్పష్టం చేయబడింది. ఇందులో ప్రధానంగా ఐదు హక్కుల గురించి చర్చించబడింది: 1) ప్రవక్తను విశ్వసించడం, ఇది ప్రతి వ్యక్తి యొక్క ప్రాథమిక బాధ్యత; 2) ప్రవక్తను ప్రాణం కంటే ఎక్కువగా గౌరవించడం మరియు ఆయన సమక్షంలో స్వరాలు పెంచరాదని సహాబీల ఉదాహరణలతో వివరించబడింది; 3) ప్రవక్తను తల్లిదండ్రులు, సంతానం, మరియు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం, జైద్ రజియల్లాహు అన్హు వంటి సహాబీల ఉదాహరణలతో నొక్కి చెప్పబడింది; 4) జీవితంలోని ప్రతి రంగంలో ప్రవక్తను ఆదర్శంగా తీసుకోవడం; 5) ప్రవక్త ఆదేశాలను పాటించడం మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా ఆయనకు విధేయత చూపడం. ఈ హక్కులను నెరవేర్చడం ద్వారానే ఇహపరలోకాలలో సాఫల్యం లభిస్తుందని ఈ ప్రసంగం బోధిస్తుంది.
أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ (వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్) نَبِيِّنَا مُحَمْمَدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ (నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్)
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక,ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు).
ముస్లిం సముదాయం మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కులు
ఈనాటి ప్రసంగంలో మనం ముస్లిం సముదాయం మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కులు ఏమిటి అనే విషయాన్ని ఇన్ షా అల్లాహ్ ఖుర్ఆన్, హదీస్ గ్రంథాల వెలుగులో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల ఉదాహరణల ద్వారా కూడా ఇన్ షా అల్లాహ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ముందుగా ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రదేశానికి, ఒక దేశానికి, ఒక జాతి వారికి ప్రవక్త కాదు, పూర్తి ప్రపంచానికి ఆయన ప్రవక్తగా పంపించబడ్డారు.
ఖుర్ఆన్ గ్రంథం ఏడవ అధ్యాయము 158 వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ (ఖుల్ యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుమ్ జమీఅనిల్లజీ లహు ముల్కుస్సమావాతి వల్ అర్ద్) (ఓ ముహమ్మద్!) వారికి చెప్పు: “ఓ మానవులారా! నిశ్చయంగా నేను మీ అందరి వైపునకు అల్లాహ్ పంపిన ప్రవక్తను. భూమ్యాకాశాల సామ్రాజ్యం ఆయనదే. (7:158)
దాని అర్థం ఏమిటంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి చెప్పు, ఓ ప్రజలారా నేను భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లాహ్ తరఫున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను. మీ అందరి వైపున పంపబడిన ప్రవక్త అంటే అందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దైవదౌత్యము వర్తిస్తుంది. అంటే నా మాటకు అర్థం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తి ప్రపంచానికి, మానవులందరి వైపుకు ప్రవక్తగా పంపబడి ఉన్నారు, ఈ విషయాన్ని ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఇక రండి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన తర్వాత, విశ్వాసి మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరఫున ఏమేమి బాధ్యతలు వస్తాయి, ఏమి హక్కులు అతని మీద ఉంటాయి, ఆ హక్కులు ఏమిటి, వాటిని అతను ఏ విధంగా చెల్లించుకోవాలి అనేది మనం చూద్దాం.
ప్రథమ హక్కు: విశ్వసించడం
ముందుగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం.
ఖుర్ఆన్ గ్రంథం సూరా తగాబున్ ఎనిమిదవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
فَآمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ (ఫ ఆమినూ బిల్లాహి వ రసూలిహి) కనుక మీరు అల్లాహ్ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. (64:8)
అనగా, మీరు అల్లాహ్ను విశ్వసించండి మరియు దైవ ప్రవక్త అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించండి. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించండి అని ఆదేశిస్తున్నాడు కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి కొంతమంది విశ్వసించారు. చూడకుండా చాలామంది విశ్వసించారు. అయితే ఒక ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి విశ్వసించిన వారికి ఒక్కసారి శుభవార్త వినిపిస్తే చూడకుండా ఆయనను విశ్వసించిన వారికి ఏడుసార్లు శుభవార్త వినిపించి ఉన్నారు.
طوبى لمن رآني وآمن بي، وطوبى سبع مرات لمن لم يرني وآمن بي (తూబా లిమన్ రఆనీ వ ఆమన బీ, వ తూబా సబ అ మర్రాతిన్ లిమన్ లమ్ యరనీ వ ఆమన బీ.) ఇది ప్రామాణికమైన హదీసు. దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే నన్ను చూసి నన్ను విశ్వసించాడో అతనికి ఒక్కసారి శుభవార్త, మరియు ఎవరైతే నన్ను చూడకుండా నన్ను విశ్వసించారో వారికి ఏడుసార్లు శుభవార్త అని ఆ ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. ఆ ప్రకారంగా మనము చాలా సంవత్సరాల తర్వాత ఈ భూమండలం మీద పుట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూడకుండా విశ్వసించాము కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఆ ఏడుసార్లు శుభవార్త ఇన్ షా అల్లాహ్ అది మనకు దక్కుతుంది.
అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి విని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన అతని ముందర జరిగింది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త అన్న విషయాన్ని అతను తెలుసుకొని కూడా ఏ వ్యక్తి అయితే ప్రవక్త వారిని విశ్వసించకుండా తిరస్కారిగా అలాగే ఉండిపోతాడో, అతను నరకానికి చేరుకుంటాడు, నరకవాసి అయిపోతాడు అని కూడా హెచ్చరించబడి ఉంది. ముస్లిం గ్రంథంలో మనం చూచినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా బోధించి ఉన్నారు,
والذي نفس محمد بيده، لا يسمع بي أحد من هذه الأمة يهودي ولا نصراني، ثم يموت ولم يؤمن بالذي أرسلت به، إلا كان من أصحاب النار (వల్లజీ నఫ్సు ముహమ్మదిన్ బి యదిహి, లా యస్మవు బీ అహదున్ మిన్ హాజిహిల్ ఉమ్మతి యహూదియ్యున్ వలా నస్రానియ్యున్, సుమ్మ యమూతు వలమ్ యుఅమిన్ బిల్లజీ ఉర్సిల్తు బిహి ఇల్లా కాన మిన్ అస్హాబిన్నార్). దీని భావం ఏమిటంటే, ఎవరి చేతిలో అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రాణము ఉందో ఆ మహా శక్తిశాలి అయిన ప్రభువు సాక్షిగా నా ఈ అనుచర సమాజంలో అతను యూదుడు గాని, క్రైస్తవుడు గాని ఎవరైనా గాని, అతని ముందర నా ప్రస్తావన జరిగింది, అతను నా గురించి విన్నాడు. నా గురించి విని కూడా అతను నన్ను మరియు నా ద్వారా పంపబడిన శాసనాన్ని, ధర్మాన్ని విశ్వసించకుండా అలాగే మరణిస్తాడో అతను నరకవాసులలో చేరిపోతాడు. చూశారా? ప్రవక్త వారి గురించి విని, తెలుసుకొని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా పంపబడిన ధర్మాన్ని గురించి విని తెలుసుకొని కూడా ఏ వ్యక్తి అయితే విశ్వసించకుండా అలాగే మరణిస్తాడో అతను నరకవాసులకు చేరిపోతాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత ఏమిటంటే అతని ముందర ఎప్పుడైతే ప్రవక్త వారి గురించి మరియు ప్రవక్త వారు తీసుకువచ్చిన ధర్మం గురించి ప్రస్తావించబడుతుందో అతను వెంటనే అర్థం చేసుకొని మనసారా ప్రవక్త వారిని విశ్వసించాలి, ప్రవక్త వారి ద్వారా పంపబడిన ధర్మాన్ని అతను స్వీకరించాలి.
ఏ విషయం మమ్మల్ని అడ్డుపడుతూ ఉంది ప్రవక్త వారిని మరియు ప్రవక్త తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించడానికి అంటే చాలామంది కేవలము భయం కారణంగా వెనకడుగు వేస్తూ ఉంటారు. చూడండి నేడు ప్రజలతో గాని, అధికారులతో గాని మనము భయపడి వెనకడుగు వేస్తే రేపు మరణానంతరము మమ్మల్ని వారు వచ్చి రక్షిస్తారా? మాకు అలాంటి గడ్డు పరిస్థితులు కూడా లేవు ప్రపంచంలో. మనము అల్హమ్దులిల్లాహ్ స్వతంత్రులము. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో చూడండి, ప్రజలు పేదరికంలో ఉన్నారు, ప్రజలు బానిసలుగా కూడా ఉన్నారు. బానిసలుగా ఉండి, పేదలుగా ఉండి కూడా వారు గడ్డు పరిస్థితులలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలుసుకొని ప్రవక్త వారి సమక్షంలో హాజరయ్యి ప్రవక్త వారిని విశ్వసించారు, విశ్వాసులుగా మారారు. తత్కారణంగా ప్రజలు, అధికారులు, పెద్దలు వారిని హింసించారు, వారిని విమర్శించారు, వారిని హేళన చేశారు, రకరకాలుగా చిత్రహింసలు చేసినప్పటికినీ వారు మాత్రము విశ్వాసాన్ని వదులుకోకుండా ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని విశ్వాసులుగా చరిత్రలో నిలిచిపోయారు మరియు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వద్ద కూడా గౌరవమైన స్థానం పొందారు. ఉదాహరణకు బిలాల్ రజియల్లాహు అన్హు వారిని చూడండి. ఈయన ఒక యజమాని వద్ద బానిసగా ఉండేవారు. యజమాని పేరు ఉమయ్య బహుశా నాకు గుర్తు రావట్లేదు. ఉమయ్య బిన్ ఖల్ఫ్. అతను ఏం చేసేవాడంటే, బిలాల్ రజియల్లాహు అన్హు వారు ముస్లింలు అయిపోయారు, విశ్వాసి అయిపోయారు అన్న విషయాన్ని విని తెలుసుకొని, బిలాల్ రజియల్లాహు అన్హు వారిని ఈ అరబ్బు దేశంలో ఎడారిలో ఎండాకాలంలో మిట్టమధ్యాహ్నం పూట ఎండ ఎంత తీవ్రంగా ఉంటుంది, ఆ వేడికి ఇసుక ఎంతగా కాలిపోతూ ఉంటుంది, అలాంటి మండుతున్న ఇసుక మీద అర్ధనగ్నంగా ఆయనను పడుకోబెట్టేవాడు, ఆ తర్వాత ఛాతి మీద పెద్ద పెద్ద రాళ్లు పెట్టేసేవాడు. పైన రాయి కాలుతూ ఉంటుంది, బరువుగా ఉంటుంది, కింద ఇసుక కూడా కాలుతూ ఉంటుంది, అలాంటి స్థితిలో ఆయన అల్లాడిపోతూ ఉంటే నీవు విశ్వాసాన్ని వదిలేయి, నేను కూడా నిన్ను హింసించడం వదిలేస్తాను అని చెప్పేవాడు. అవన్నీ భరించి కూడా ఆయన బానిస అయి ఉండి కూడా చిత్రహింసలు భరిస్తూ కూడా అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ పంపించిన సత్య ప్రవక్త అని చాటి చెప్పారు. ఆ తర్వాత అతను అన్నము పెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా ఆకలిదప్పికలతో అలాగే ఉంచేశాడు, చెరసాలలో బంధించాడు, మెడలో తాడు కట్టేసి పోకిరి పిల్లవారికి, కుర్రాళ్ళ చేతికి ఇచ్చేశాడు. వారు బిలాల్ రజియల్లాహు అన్హు వారిని పశువులాగా ఈడ్చుకుంటూ తిరిగేవారు. తత్కారణంగా ఆయన శరీరానికి, కాళ్లకు గాయాలు అయిపోయేవి. అన్ని రకాలుగా ఆయనను హింసించినా అలాంటి గడ్డు పరిస్థితుల్లో బానిసగా అయ్యి ఉండి కూడా ఆయన విశ్వాసం పొందారు, ప్రవక్త వారిని మరియు ప్రవక్త వారు తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించి వచ్చిన సమస్యలని ధైర్యంగా ఎదుర్కొన్నారు. తత్కారణంగా ఆయన గొప్ప విశ్వాసిగా చరిత్రలో మిగిలిపోయారు, అల్లాహ్ వద్ద కూడా వారికి గొప్ప ఉన్నతమైన స్థానాలు ఉన్నాయి. కాబట్టి మనకు
الحمد لله ثم الحمد لله (అల్హమ్దులిల్లాహ్ సుమ్మా అల్హమ్దులిల్లాహ్), బానిసత్వం లేదు. అల్లాహ్ దయవల్ల మమ్మల్ని అందరినీ అల్లాహ్ స్వతంత్రులుగా ఉంచాడు కాబట్టి మనము కంగారు పడవలసిన అవసరము లేదు, బెదరవలసిన అవసరము లేదు, భయపడవలసిన వెనకడుగు వేయవలసిన అవసరం అంతకంటే లేదు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలుసుకోండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించండి. తద్వారానే ఇహపరాలా సాఫల్యము మనకు దక్కుతుంది.
రెండవ హక్కు: గౌరవించడం
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించడం ఇది మొదటి హక్కు. ఇక రెండవ హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన తర్వాత ప్రాణం కంటే ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఆయన బ్రతికి ఉన్నప్పుడు శిష్యులకు, సహాబాలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో బిగ్గరగా మాట్లాడకండి, శబ్దము పెంచకండి అని తాకీదు చేసి ఉన్నాడు. మనం చూసినట్లయితే, ఖుర్ఆన్ గ్రంథము 24వ అధ్యాయము 63వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
దాని అర్థం ఏమిటంటే, మీరు దైవప్రవక్త పిలుపును మీలో ఒకరినొకరిని పిలుచుకునే మామూలు పిలుపులా అనుకోకండి. మనం పరస్పరం ఒకరినొకరిని ఏ విధంగా అయితే పిలుచుకుంటామో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయం అలాంటిది కాదు. ప్రవక్త వారితో మాట్లాడేటప్పుడు, వారితో సంభాషించేటప్పుడు మీరు జాగ్రత్తగా, సగౌరవంగా, అణకువతో మాట్లాడండి అని ఆ వాక్యంలో బోధించబడి ఉంది.
అలాగే ఖుర్ఆన్ గ్రంథం 49వ అధ్యాయం, రెండవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلَا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ (యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి వలా తజ్హరూ లహు బిల్ ఖౌలి కజహ్రి బఅదికుమ్ లిబఅదిన్) ఓ విశ్వాసులారా! మీ స్వరాలను ప్రవక్త స్వరం కన్నా బిగ్గరగా చేయకండి, మీలో మీరు ఒకరితో మరొకరు బిగ్గరగా మాట్లాడినట్లు ఆయనతో మాట్లాడకండి. (49:2)
దీని అర్థం ఏమిటంటే, ఓ విశ్వాసులారా మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే హెచ్చుగా ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయనతో బిగ్గరగా మాట్లాడకండి. దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్థమైపోవచ్చు, జాగ్రత్త సుమా. చూశారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎంతగా గౌరవించాలంటే ప్రవక్త వారి సమక్షంలో బిగ్గరగా శబ్దాన్ని పెంచి, హెచ్చించి మాట్లాడరాదు, పలకరాదు. ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయనను గౌరవించకుండా బిగ్గరగా మాట్లాడినట్లయితే, శబ్దాన్ని పెంచినట్లయితే, అది ఒక రకంగా ప్రవక్త వారిని అగౌరవపరిచినట్లు అవుతుంది, తత్కారణంగా మనిషి యొక్క కర్మలు, సత్కార్యాలు, పుణ్యాలన్నీ వృధా అయిపోయే ప్రమాదం ఉంది అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు. దీనికి ఉదాహరణగా మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల గురించి ఒక ఉదాహరణ తీసుకుందాం.
ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు బనూ తమీమ్ అనే తెగకు చెందిన ఒక బిడారము, కొంతమంది సమూహము వచ్చారు. బనూ తమీమ్కు చెందిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోకి వచ్చినప్పుడు, అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక సలహా ఇచ్చారు. ఓ దైవప్రవక్త, కాకా బిన్ మాబద్ అనే వ్యక్తిని ఈ సమూహానికి మీరు నాయకునిగా నియమించండి అన్నారు. అయితే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు కూడా అక్కడ ఉన్నారు, ఆయన జోక్యం చేసుకుంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, ఓ దైవప్రవక్త, అక్రా బిన్ హాబిస్ ని ఈ సమూహానికి, ఈ తెగ వారికి నాయకునిగా నియమించండి అని ఆయన సలహా ఇచ్చారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఒక వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ ఉంటే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు మరో వ్యక్తి గురించి ప్రస్తావించారు. అయితే ఇద్దరి మధ్య భేదాభిప్రాయం వచ్చింది కదండీ, వారిద్దరూ కూడా నేను చెప్పిన వ్యక్తే మంచిది, నేను చెప్పిన వ్యక్తిని నియమిస్తేనే మంచిది అని ఒకరంటూ ఉంటే, లేదండి నేను చెప్పిన వ్యక్తిని నియమిస్తేనే మంచిది అని ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఆ తర్వాత మాట మాట పెరిగి వారు పెద్దగా శబ్దాలు చేయడం, హెచ్చుగా మాట్లాడటం ప్రారంభించేశారు. అలా జరిగినప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే ఈ వాక్యాలను అవతరింపజేశాడు. యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి. ఓ విశ్వాసులారా, మీ కంఠస్వరాలను ప్రవక్త వారి కంఠస్వరం వద్ద హెచ్చించకండి అని ఆ వాక్యాన్ని ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవతరింపజేశాడో, మీరు జాగ్రత్త పడకపోతే మీ సత్కార్యాలు, మీ పుణ్యాలు వృధా అయిపోతాయని ఆ వాక్యం చివరలో తెలియజేసి ఉన్నాడు కదా, అది విన్న తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఎంతగా మారిపోయారంటే, ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన ఎంత మెల్లగా మాట్లాడేవారంటే, ఎంత చిన్నగా మాట్లాడేవారంటే, దగ్గరలో కూర్చున్న వ్యక్తి కూడా ఆయన ఏమి చెప్పారో వినలేక రెండవసారి మళ్ళీ అడిగేవారు. అయ్యో మీరు ఏం చెప్పారో సరిగా వినిపించలేదండి, చెప్పండి ఏంటో అని రెండవసారి మళ్ళీ అడగవలసి వచ్చేది. అంత నెమ్మదిగా, అంత చిన్నగా ఆయన మాట్లాడటం అలవాటు చేసుకున్నారు ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఆ వాక్యము అవతరింపజేయబడిన తర్వాత.
కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించటం ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత, కర్తవ్యం. ఇది రెండవ హక్కు. దీనికి ఉదాహరణగా మనము చూచినట్లయితే, సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు, ఆయన స్వరం కొంచెం పెద్దది. మామూలుగా కొంతమందికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గొంతు కొంచెం పెద్దది ఇస్తాడు, వారు మామూలుగా మాట్లాడినా గాని శబ్దం కొంచెం హెచ్చుగా వస్తుంది. ఆ ప్రకారంగా సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారి స్వరము కూడా, కంఠము కూడా కొంచెం పెద్దది. ఆయన మామూలుగా మాట్లాడినా శబ్దం కొంచెం పెద్దగా, హెచ్చుగా వచ్చేది. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యాన్ని అవతరింపజేశాడో, యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి, ఆ వాక్యం అవతరింపజేయబడిన తర్వాత, ఆయన సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి సమావేశంలో రావడం, హాజరవ్వడమే మానేశారు. అసలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన రావడమే మానేశారు. కొద్ది రోజులు గడిచాయి. కొద్ది రోజులు గడిచిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏంటండీ సాబిత్ బిన్ ఖైస్ కనిపించడం లేదు అని సహాబాలతో అడిగారు. అప్పుడు సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు ఏం చెప్పారంటే, ఓ దైవప్రవక్త, నేను ఆయన పొరుగులోనే ఉంటాను. కాబట్టి మీరు అనుమతి ఇస్తే నేను వెళ్లి చూస్తాను, ఆయన ఎందుకు మీ మధ్య రావట్లేదు ఇక్కడ, ఎందుకు పాల్గొనట్లేదు మీ సమావేశంలో, నేను వెళ్లి తెలుసుకొని వస్తాను, మీరు అనుమతి ఇవ్వండి అంటే, ప్రవక్త వారు సరే అని పంపించారు. ఆ తర్వాత సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారి ఇంటికి వెళ్లి చూస్తే, ఆయన తల పట్టుకొని కూర్చొని ఉన్నారు, దిగులుగా ఉన్నారు. సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు వెళ్లి ఏమండీ ప్రవక్త వారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, ఈ మధ్య మీరు ప్రవక్త వారి సమావేశంలో హాజరు కాలేదు, ఎందుకండీ అలా, మిమ్మల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుర్తు చేసుకుంటున్నారు అని అడిగినప్పుడు, సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర బిగ్గరగా, పెద్ద శబ్దంతో మాట్లాడకండి, అలా మాట్లాడితే మీ కర్మలు వృధా అయిపోతాయి అని చెప్పాడు కాబట్టి, నా శబ్దం పెద్దది, నా కంఠం హెచ్చుగా ఉంటుంది కాబట్టి, నేను చేసుకున్న కర్మలన్నీ, సత్కార్యాలన్నీ వృధా అయిపోయాయి, నేను నరకవాసి అయిపోయానేమోనని నాకు భయంగా ఉంది, అందుకోసమే నేను దిగులుగా ఉన్నాను, అక్కడ రాలేకపోతున్నాను అని చెప్పారు. సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు అదంతా విని, తిరిగి వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు. అదంతా తెలియజేసిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మాట విని, వెంటనే ఆ సహాబీకి శుభవార్త తెలియజేశారు, సాద్ రజియల్లాహు అన్హు వారి ద్వారా. మీరు వెళ్ళండి, ఆయనకు తెలియజేయండి, ఆయన నరకవాసులలోని వ్యక్తి కాదు, ఆయన స్వర్గవాసులలోని వ్యక్తి అని శుభవార్త తెలియజేశారు.
ఈ ఉల్లేఖనం బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలో ఉంది. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించే విధానము సహాబాల వద్ద ఎంతగా ఉందో, వారు ఎంతగా ప్రవక్త వారిని గౌరవించేవారో, మరియు ప్రవక్త వారిని అగౌరవపరచడాన్ని ఎంతగా వారు భయపడేవారో చూడండి, దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే, ఎవరెవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తారో, ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవిస్తారో, అలాంటి వారి కోసము శుభవార్త ఉంది. ఖుర్ఆన్ గ్రంథము ఏడవ అధ్యాయము 157 వ వాక్యాన్ని మనం చూచినట్లయితే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
فَالَّذِينَ آمَنُوا بِهِ وَعَزَّرُوهُ وَنَصَرُوهُ وَاتَّبَعُوا النُّورَ الَّذِي أُنْزِلَ مَعَهُ ۙ أُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ (ఫల్లజీన ఆమను బిహి వ అజ్జరూహు వ నసరూహు వత్తబవూన్నూరల్లజీ ఉన్జిల మఅహు ఉలాయిక హుముల్ ముఫ్లిహూన్) కనుక ఎవరైతే ఆయనను విశ్వసించి, ఆయనను గౌరవించి, ఆయనకు సహాయం చేసి, ఆయనతోపాటు అవతరింపజేయబడిన జ్యోతిని అనుసరిస్తారో, వారే సాఫల్యం పొందేవారు. (7:157)
దాని అర్థం ఏమిటంటే, ఎవరు ఈ ప్రవక్తను విశ్వసించి, అతనికి ఆదరువుగా నిలుస్తారో, తోడ్పాటు నందిస్తారో, ఇంకా అతనితో పాటు పంపబడిన జ్యోతిని అనుసరిస్తారో, వారే సాఫల్యం పొందేవారు. ప్రవక్త వారిని విశ్వసించి, ప్రవక్త వారిని అనుసరించి, ప్రవక్త వారిని గౌరవించేవారు సాఫల్యం పొందేవారు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శుభవార్త తెలియజేసి ఉన్నాడు చూశారా.
అలాగే, సహాబాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎలా గౌరవించేవారో, ఒక అవిశ్వాసి అలనాటి అవిశ్వాసి, ఆయన పేరు ఉర్వా బిన్ మసూద్ సఖఫీ. తర్వాత, అప్పటి వరకు ఆయన ఇస్లాం స్వీకరించలేదు, తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించారని ధర్మ పండితులు తెలియజేసి ఉన్నారు. ఉర్వా బిన్ మసూద్ సఖఫీ, ఈ సంఘటన జరిగే సమయానికి ఆయన ఇంకా ఇస్లాం స్వీకరించలేరు. సులహ్ హుదైబియా, హుదైబియా ఒప్పందం సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన ప్రవక్త వారితో మాట్లాడటానికి వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడటానికి వచ్చినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమావేశంలో సహాబాలు ఏ విధంగా అణకువతో ఉన్నారో, ప్రవక్త వారిని ఏ విధంగా గౌరవిస్తున్నారో కళ్లారా చూశాడు. కళ్లారా చూసి, తర్వాత మళ్ళీ మక్కాలో ఉన్న అవిశ్వాసుల వద్దకు వెళ్లి, అక్కడ చూసిన దృశ్యాన్ని ఈ విధంగా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఏమంటున్నారో చూడండి: “ఓ నా జాతి ప్రజలారా, నేను పెద్ద పెద్ద రాజుల దర్బారులలోకి కూడా వెళ్ళాను. నేను రోమ్ చక్రవర్తి మరియు అలాగే ఈరాన్ చక్రవర్తి వారి దర్బారులలోకి కూడా నేను వెళ్ళాను. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, పెద్ద పెద్ద రాజులను కూడా అతని దర్బారులో ఉన్న మంత్రులు అంతగా గౌరవించరు, ఎంతగా అయితే ప్రవక్త వారి శిష్యులు ప్రవక్త వారిని గౌరవిస్తున్నారో. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ప్రవక్త వారి నోటి నుండి ఉమ్మి కూడా ఒకవేళ బయటికి వచ్చేస్తే, శిష్యులు ఆ ఉమ్మిని తీసుకొని శరీరానికి పూసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రవక్త వారు ఉజూ చేస్తే, ఆయన ఉజూ చేసిన నీటిని శిష్యులు తీసుకోవాలని పోటీ పడుతూ ఉన్నారు. ఆయన కేవలం సైగ చేస్తే చాలు, వెంటనే ఆ పని చేసి పెట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అలా నేను గౌరవించబడటము, పెద్ద పెద్ద రాజులని సైతము నేను చూడలేదు. అంతగా ప్రవక్త వారి శిష్యులు ప్రవక్తను గౌరవిస్తున్నారు” అని తెలియజేశాడు.
చూశారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహాబాలు ఏ విధంగా గౌరవించారు? అలాగే మనము కూడా ప్రవక్త వారిని గౌరవించాలి. ప్రవక్త వారు మన మధ్య లేరు కదా, మరి ఏ విధంగా మనము గౌరవించాలి అంటే, ప్రవక్త వారి ఆదేశాలు మన మధ్య ఉన్నాయి. ప్రవక్త వారి ఆదేశాలు, హదీసుల రూపంలో, ఉల్లేఖనాల రూపంలో మన మధ్య ఉన్నాయి. ఆ హదీసులు చదవబడేటప్పుడు, వినిపించేటప్పుడు మనము గౌరవంగా ఉండాలి, శ్రద్ధగా వినాలి. అలాగే, ప్రవక్త వారి ఆదేశాలను అదే గౌరవంతో మనము ఆచరించాలి.
ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించడం, ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కు. అయితే, గౌరవించాలి, ప్రతి ముస్లిం యొక్క హక్కు అని తెలుసుకున్న తర్వాత రెండు ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మొదటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రవక్తను గౌరవించడం అనే పదాన్ని తీసుకొని, ప్రవక్త వారి విషయంలో హద్దు మీరిపోవడం సరికాదు. గౌరవంలో చాలామంది హద్దు మీరిపోతూ ఉంటారు. అంటే, ప్రవక్తను ప్రవక్త స్థానంలో కాకుండా, తీసుకెళ్లి దైవ స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు, దీనిని గులు అని అంటారు. అల్లాహ్ సుబ్ హాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ విషయాన్ని ఇష్టపడలేదు, ప్రవక్త వారు వారించి ఉన్నారు. మనం చూచినట్లయితే, బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, ప్రవక్త వారు తెలియజేశారు:
لا تطروني كما أطرت النصارى ابن مريم، فإنما أنا عبد فقولوا عبد الله ورسوله (లా తత్రూనీ కమా అతరతిన్నసారా ఇబ్న మర్యమ. ఇన్నమా అన అబ్దున్, ఫఖూలూ అబ్దుల్లాహి వ రసూలుహు.) చూశారా, మర్యం కుమారుడు ఈసా, ఏసుక్రీస్తు అంటారు కదండీ, ಮರ್ಯಮ್ ಕುಮಾರడైన ఈసా అలైహిస్సలాం వారి విషయంలో క్రైస్తవులు ఏ విధంగా అయితే హద్దు మీరిపోయారో, మీరు, అనగా ముస్లింలకు ఆదేశిస్తున్నారు, మీరు నా విషయంలో ఆ విధంగా హద్దు మీరకండి. నేను అల్లాహ్ దాసుడిని మరియు అల్లాహ్ ప్రవక్తని. నాకు ఉన్న స్థానంలో మాత్రమే నన్ను మీరు ఉంచి గౌరవించండి, నాకు లేని స్థానము నాకు కల్పించే ప్రయత్నం చేయకండి అని ప్రవక్త వారు వారించారు.
చూశారా, కాబట్టి ప్రవక్త వారిని గౌరవిస్తున్నాము అని చెబుతూ చాలామంది ప్రవక్త వారికి ఉన్న స్థానం కంటే ఎక్కువ స్థానము ఇచ్చేటట్టుగా అల్లాహ్ స్థానంలోకి తీసుకుని వెళ్లి నిలబెట్టేటట్టుగా చేస్తూ ఉంటారు, అలా చేయడం సరికాదు.
అలాగే, దీనికి విరుద్ధమైన విషయం. చాలామంది మూర్ఖులు అనలో, పాపిష్టులు అనలో, ఇంకేమనాలో తెలియదు, ప్రవక్త వారిని కించపరుస్తూ ఉంటారు. అల్లాహ్ మమ్మల్ని ఏమంటున్నాడు, ప్రవక్త వారిని గౌరవించాలి అంటున్నాడు. కానీ నేడు మనం చూస్తున్నాం, ముస్లింలు మనము అని చెప్పుకునే చాలామంది మూర్ఖులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నారు. వారి మాటల ద్వారా, వారి చేష్టల ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నారు. ఈ మధ్యనే ఒక వ్యక్తి మీడియా ముందర వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నాడు. స్వయంగా నేను ముస్లిం అని కూడా మళ్లీ ప్రకటించుకుంటూ ఉన్నాడు. ఎంతటి మూర్ఖత్వం అండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా చెప్పుకున్న తర్వాతే ఒక వ్యక్తి ముస్లిం అవుతున్నాడు. అలాంటి వ్యక్తి, ప్రవక్త వారిని విశ్వసించిన తర్వాతే ముస్లిం అవుతున్న వ్యక్తి, ప్రవక్త వారిని కించపరచటం, అగౌరవపరచటం ఏమిటండి ఇది?
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎవరైతే కించపరుస్తారో, అగౌరవపరుస్తారో, ప్రపంచంలో కూడా శిక్షించబడతాడు, పరలోకంలో కూడా వారు శిక్షించబడతారు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథము సూరా తౌబా 61వ వాక్యంలో తెలియజేసి ఉన్నాడు కాబట్టి, జాగ్రత్త. కర్మలు వృధా అయిపోతాయి, నష్టపోతారు ప్రపంచంలో కూడా శిక్షించబడతారు, పరలోకంలోనూ మరియు ప్రపంచంలోనూ. కాబట్టి ప్రవక్త వారిని అగౌరవపరచటం పెద్ద నేరం, అలాంటి నేరానికి పాల్పడరాదు, జాగ్రత్త అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది.
మూడవ హక్కు: ప్రేమించడం
ముస్లిం సముదాయం మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కులలో నుంచి రెండు హక్కుల గురించి తెలుసుకున్నాం అండి. విశ్వసించడం ప్రథమ హక్కు, ప్రవక్త వారిని గౌరవించడం రెండవ హక్కు. ఇక మూడవ హక్కు ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించాలి, ప్రేమించాలి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,
ثلاث من كن فيه وجد حلاوة الإيمان (సలాసున్ మన్ కున్న ఫీహి వజద హలావతల్ ఈమాన్.) మూడు విషయాలు ఎవరిలో ఉంటాయో, అతను ఈమాన్ విశ్వాసం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించాడు అన్నారు. ఆ మూడు విషయాలు ఏమిటి అంటే, మొదటి విషయం:
أن يكون الله ورسوله أحب إليه مما سواهما (అన్ యకూనల్లాహు వ రసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా.) అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్త అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ వ్యక్తి అందరికంటే ఎక్కువగా అభిమానించాలి, ప్రేమించాలి. అందరికంటే ఎక్కువ అంటే, తనకంటే, తన కుటుంబ సభ్యుల కంటే, తన తల్లిదండ్రుల కంటే, బంధుమిత్రుల కంటే, ప్రపంచంలో ఉన్న వారందరి కంటే, చివరికి తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రవక్త వారిని అభిమానించాలని దాని అర్థం.
దీనికి ఉదాహరణగా మనము చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరే ఉల్లేఖనంలో ఈ విధంగా తెలియజేశారు:
لا يؤمن أحدكم حتى أكون أحب إليه من ولده ووالده والناس أجمعين (లా యూమిను అహదుకుమ్ హత్తా అకూన అహబ్బ ఇలైహి మిన్ వలదిహి వ వాలిదిహి వన్నాసి అజ్మయీన్.) మీలో ఏ వ్యక్తి కూడా అప్పటి వరకు విశ్వాసి కాజాలడు, ఎప్పటి వరకు అయితే అతను నన్ను తన సంతానము కంటే, తన తల్లిదండ్రుల కంటే, మానవులందరి కంటే ఎక్కువగా నన్ను అభిమానించడో అన్నారు. అంటే, తల్లిదండ్రుల కంటే, భార్యాబిడ్డల కంటే, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కంటే ఎక్కువగా ప్రవక్త వారిని అభిమానించినప్పుడే వ్యక్తి విశ్వాసి అవుతాడు.
ఉమర్ రజియల్లాహు అన్హు వారి గురించి ఉదాహరణ చాలా ప్రచారం చెంది ఉంది. ఉమర్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో హాజరయ్యి,
يا رسول الله، لأنت أحب إلي من كل شيء إلا من نفسي (యా రసూలల్లాహ్, లఅంత అహబ్బు ఇలయ్య మిన్ కుల్లి శైఇన్ ఇల్లా మిన్ నఫ్సీ) అన్నారు. ఓ దైవప్రవక్త, మీరు నాకు అందరికంటే ఎక్కువగా ఇష్టులు, నేను మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను, అయితే నా ప్రాణము నాకు మీకంటే ఎక్కువ ప్రియమైనది అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
لا، والذي نفسي بيده، حتى أكون أحب إليك من نفسك (లా వల్లజీ నఫ్సీ బియదిహి, హత్తా అకూన అహబ్బ ఇలైక మిన్ నఫ్సిక్.) లేదు లేదు ఓ ఉమర్, ఎవరి చేతిలో అయితే నా ప్రాణము ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, నీవు నీ ప్రాణము కంటే ఎక్కువగా నన్ను అభిమానించనంత వరకు పూర్తి సంపూర్ణ విశ్వాసి కాజాలవు అన్నారు.
ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించారు. ఆ తర్వాత ప్రవక్త వారి వద్దకు వచ్చి, ఓ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఇప్పుడు మిమ్మల్ని నా ప్రాణము కంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను అని తెలియజేసినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
الآن يا عمر (అల్ ఆన యా ఉమర్.) ఓ ఉమర్, ఇప్పుడు నీ విశ్వాసము సంపూర్ణమైంది అని తెలియజేశారు.
చూశారా, కాబట్టి ప్రతి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించాలి. ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించినప్పుడే అతను సంపూర్ణ విశ్వాసి కాగలడు, లేని యెడల అతని విశ్వాసము సంపూర్ణము కాజాలదు అని తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనము ఒక ఉదాహరణ తీసుకుందాం.
జైద్ రజియల్లాహు అన్హు వారి గురించి మనము చూచినట్లయితే, జైద్ రజియల్లాహు అన్హు వారిని ఆయన పసితనంలోనే దుండగులు దొంగలించారు. మన మొరటు భాషలో చెప్పాలంటే ఆయనను కిడ్నాప్ చేసేశారు. ఆయనను దొంగలు పట్టుకెళ్లి వేరే ప్రదేశాలలో అమ్మేశారు. ఆ తర్వాత నుండి ఆయన బానిస అయిపోయారు. ఆ తర్వాత చేతులు మారుతూ ఉన్నారు. ఒక వ్యక్తి ఆయనను కొన్నారు, తర్వాత వేరే వ్యక్తికి అమ్మేశారు, ఆ తర్వాత మరో వ్యక్తి మరో వ్యక్తిని అమ్మేశారు. ఆ ప్రకారంగా అమ్ముతూ అమ్ముతూ ఉన్నారు. ఆ విధంగా ఆయన చేతులు మారుతూ మారుతూ మారుతూ మక్కాలో ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారి వద్దకు వచ్చారు. ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారు జైద్ వారిని కొని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కానుకగా ఇచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కానుకగా ఇచ్చి, ఓ దైవప్రవక్త, ఈయనతో మీరు సేవలు చేయించుకోండి అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జైద్ రజియల్లాహు త’ఆలా అన్హు వారితో సేవలు చేయించుకుంటూ ఉన్నారు. సేవలు చేయించుకుంటూ ఉంటున్నప్పుడు, ఒకరోజు అనుకోకుండా ఆయన కాబతుల్లాలో తిరుగుతూ ఉంటే, వారి తల్లిదండ్రులు కూడా హజ్ చేయడానికి వచ్చి కాబతుల్లా వద్ద ప్రదక్షిణలు, తవాఫ్ చేస్తూ ఉన్నారు. వెంటనే తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను చూసి గుర్తుపట్టి, జైద్ రజియల్లాహు అన్హు వారు వెళ్లి, “నేను పసితనంలో తప్పిపోయిన మీ అబ్బాయిని” అని తెలియజేశారు. మీ అబ్బాయిని అని ఎప్పుడైతే తెలియజేశారో, కుటుంబ సభ్యులు వెంటనే జైద్ రజియల్లాహు అన్హు వారిని పట్టుకొని, చిన్ననాటి రోజుల్లో తప్పిపోయిన బిడ్డ దొరికాడు అని వారు చాలా సంతోషించారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవప్రవక్త, మా అబ్బాయి పసితనంలో తప్పిపోయాడు, ఇప్పుడు అనుకొని ఊహించని రీతిలో ఇక్కడ బానిసగా ఉన్నాడు, మీరు అనుమతి ఇస్తే మా అబ్బాయిని మేము మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాము అని అడిగినప్పుడు, ప్రవక్త వారు అన్నారు, మీరు సంతోషంగా తీసుకువెళ్ళవచ్చు, అయితే నిబంధన ఏమిటంటే, మీరు ఒకసారి జైద్ తో మాట్లాడండి, సంప్రదించి చూడండి. జైద్ వారు మీతో పాటు రావడానికి ఆయన సిద్ధమైతేనే మీరు తీసుకువెళ్ళండి, లేదంటే లేదు అని చెప్పారు.
ఆ తర్వాత, జైద్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వెళ్లి, చూడండి దైవప్రవక్త వారు మీ ఇష్టం మీద వదిలేశారు, ఇక మాకు అనుమతి దొరికినట్లే, కాబట్టి పదండి మేము మా ఇంటికి వెళ్లిపోదాము అని అంటే, జైద్ రజియల్లాహు అన్హు వారు లేదు నేను రాను, నేను ప్రవక్త వద్దనే ఉండిపోతాను అని తేల్చి చెప్పేశారు.
ఏంటండీ, ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలు ఆలోచించాలి. ఒక విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుమతి ఇచ్చేశారు, జైద్ రజియల్లాహు అన్హు వారికి ఇక బానిసత్వం నుంచి విముక్తి లభిస్తుంది, స్వతంత్రుడిగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి హాయిగా జీవించుకోవచ్చు. కానీ స్వతంత్రుడిగా వెళ్లి కుటుంబ సభ్యులతో హాయిగా జీవించుకోవడానికి ఆయన ఇష్టపడట్లేదు, ప్రవక్త వారి వద్ద బానిసగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నారు అంటే, ప్రవక్త వారిని ఆయన ఎంతగా అభిమానించేవారో, ఎంతగా ప్రేమించేవారో చూడండి. అలాగే, ప్రవక్త ఆయనతో ఎంత మంచిగా ప్రవర్తిస్తూ ఉంటే ఆయన ప్రవక్త వారిని అంతగా అభిమానిస్తున్నారు చూడండి.
కాబట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహాబాలు ఎంతగా ప్రేమించేవారో, ఎంతగా అభిమానించేవారో ఈ ఉదాహరణల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
అలాగే మిత్రులారా, మరొక ఉదాహరణ మనము చూచినట్లయితే, ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రవక్త వారు ఆయనను చూసి ఏమండీ, ఏంటో మీరు కంగారుగా ఉన్నారు అని అడిగినప్పుడు, ఆయన అంటున్నారు, ఓ దైవప్రవక్త, మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు మీరు గుర్తుకు వస్తే, వెంటనే మిమ్మల్ని చూడాలనుకుంటాను, కాబట్టి నేను ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ మస్జిద్ లోకి వస్తాను. మీరు మస్జిద్ లో ఏదో ఒక చోట సహాబాలతో సమావేశమై ఉంటారు లేదంటే నమాజ్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక విధంగా మీరు నన్ను కనిపిస్తారు. మిమ్మల్ని చూడగానే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. అయితే ఈరోజు నాకు ఒక ఆలోచన తట్టింది, ఆ ఆలోచన కారణంగా నేను అయోమయంలో పడిపోయాను, నాకు బాధగా ఉంది, కంగారుగా ఉంది. అదేమిటంటే, మరణించిన తర్వాత పరలోకంలో మీరేమో ప్రవక్త కాబట్టి స్వర్గంలోని ఉన్నతమైన శిఖరాలకు చేరుకుంటారు, నేను ఒక సాధారణమైన వ్యక్తి కాబట్టి, అల్లాహ్ దయవల్ల నేను కూడా స్వర్గానికి వచ్చేసినా, నేను స్వర్గంలోనే మామూలు స్థానాలలో ఉంటాను. అక్కడ కూడా నాకు మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు నేను మిమ్మల్ని అక్కడ ఎలా చూడగలను, అక్కడ చూడలేనేమోనని నాకు బాధగా ఉంది, కంగారుగా ఉంది, ఓ దైవప్రవక్త అన్నారు.
చూశారా, ఎంతటి తపన ఉందో ఆయనలో ప్రవక్త వారిని చూడాలనే తపన, ప్రవక్త వారిని చూసి మనశ్శాంతి పొందాలన్న అభిమానం చూశారా. ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాలు అవతరింపజేశాడు.
وَمَنْ يُطِعِ اللَّهَ وَالرَّسُولَ فَأُولَٰئِكَ مَعَ الَّذِينَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِمْ مِنَ النَّبِيِّينَ وَالصِّدِّيقِينَ وَالشُّهَدَاءِ وَالصَّالِحِينَ ۚ وَحَسُنَ أُولَٰئِكَ رَفِيقًا (వమయ్ యుతిఇల్లాహ వర్రసూల ఫఉలాయిక మఅల్లజీన అన్అమల్లాహు అలైహిమ్ మినన్నబియ్యీన వస్సిద్దీఖీన వష్షుహదాఇ వస్సాలిహీన వహసున ఉలాయిక రఫీఖా) ఎవరైతే అల్లాహ్కు, ప్రవక్తకు విధేయత చూపుతారో వారు, అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలు, సత్యసంధులు, అమరగతులు, సద్వర్తనులతో పాటు ఉంటారు. వారు ఎంత మంచి స్నేహితులు! (4:69) ఖుర్ఆన్ గ్రంథం నాలుగవ అధ్యాయము 69 వ వాక్యము.
దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్కు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత కనబరుస్తారో, వారే అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోను, సత్యసంధులతోను, షహీదులతోను, సద్వర్తనులతోను ఉంటారు. వీరు ఎంతో మంచి స్నేహితులు.
ఎవరైతే అల్లాహ్ను మరియు ప్రవక్త వారిని విశ్వసించి, అభిమానించి, ఆ ప్రకారంగా నడుచుకుంటారో వారు ప్రవక్తలతో పాటు ఉంటారట, సిద్దీఖీన్లతో పాటు సత్యసంధులతో పాటు ఉంటారట, షహీద్ వీరమరణం పొందిన వారితో పాటు ఉంటారట. ఎంతటి గౌరవం చూశారా?
سبحان الله ثم سبحان الله (సుబ్ హానల్లాహ్ సుమ్మా సుబ్ హానల్లాహ్).
అయితే మిత్రులారా, ఒకే మాట చెప్పి ఇన్ షా అల్లాహ్ ఒక విషయం వైపు మీ దృష్టిని నేను తీసుకువెళ్లాలనుకుంటున్నాను.. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి
متى الساعة؟ (మతస్సాఅ) ప్రళయం ఎప్పుడు వస్తుంది అని అడిగాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన వైపు చూసి
ماذا أعددت لها؟ (మాజా ఆదత్త లహా) అని తిరిగి ప్రశ్నించారు. ప్రళయం గురించి నీవు అడుగుతున్నావు సరే, కానీ ఆ ప్రళయం కోసము నీవు ఏమి సిద్ధం చేసుకున్నావు అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఓ దైవప్రవక్త, నేను పెద్దగా నమాజులు ఏమి చదువుకోలేదు, నేను పెద్దగా ఉపవాసాలు ఏమి ఉండలేదు, చెప్పుకోదగ్గ పెద్ద పుణ్యకార్యం నేను ఏమి చేసుకోలేదు. నా మీద ఉన్న బాధ్యత మాత్రం నేను నెరవేర్చుకుంటూ ఉన్నాను, పెద్దగా చెప్పుకోదగ్గ పుణ్యకార్యము నేను ఏదీ చేయలేదు. కాకపోతే నేను నా గుండెల నిండా మీ అభిమానం ఉంచుకొని ఉన్నాను అన్నారు.
ఆయన ఏమంటున్నాడండి, నా గుండెల నిండా నేను మీ అభిమానాన్ని ఉంచుకొని ఉన్నాను అంటే వెంటనే ప్రవక్త వారు తెలియజేశారు,
أنت مع من أحببت (అంత మఅ మన్ అహబబ్త.) నీవు ఎవరినైతే అభిమానిస్తున్నావో, రేపు వారితో పాటే పరలోకంలో ఉంటావు అని చెప్పారు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ వ్యక్తి పూర్తి అభిమానిస్తున్నాడు కాబట్టి, ప్రవక్త వారు తెలియజేసిన శుభవార్త ప్రకారము ఆ వ్యక్తి ప్రవక్త వారి దగ్గరిలో స్వర్గంలో ఉంటాడు. అయితే, ఇక్కడ ఇప్పుడు నేను మిమ్మల్ని ఆలోచింపజేస్తున్న విషయం ఏమిటంటే, ముస్లింలము మేము, ముస్లింలము మేము అని ప్రకటించుకునే ప్రతి వ్యక్తి ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, మీ గుండెల్లో ఎవరి అభిమానం ఎక్కువగా ఉంది? అల్లాహ్ అభిమానం ఎక్కువగా ఉందా? ప్రవక్త అభిమానం ఎక్కువగా ఉందా? లేక చింపిరి చింపిరి బట్టలు వేసుకున్న మహిళలతో నృత్యాలు చేసే, ఎగిరే, చిందేసే నాటక నటీనటుల అభిమానము ఉందా ఆలోచించండి. ఒకవేళ మీరు అందరి కంటే ఎక్కువగా అల్లాహ్ను అభిమానిస్తున్నారు, ప్రవక్త వారిని అభిమానిస్తున్నారు అంటే, అల్హమ్దులిల్లాహ్, చాలా సంతోషకరమైన విషయం. అలా కాకుండా మీరు అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ఎక్కువగా నటీనటులను, వేరే వేరే వ్యక్తులను అభిమానిస్తున్నారు అంటే రేపు మీరు ఎవరితో పాటు ఉంటారు పరలోకంలో ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారం ఆలోచించండి.
లేదండి, మేము ప్రవక్త వారిని ఎక్కువగా అభిమానిస్తున్నాం అండి అని చాలామంది నోటితో ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. నోటితో మాట్లాడితే సరిపోదు. మీ మాట్లాడే తీరు, మీ డ్రెస్ కోడ్, మీరు ధరించే దుస్తులు, మీ హెయిర్ స్టైల్, మీ వెంట్రుకలు, అలాగే మీ బట్టలు, మీ మాట్లాడే తీరు, మీ హెయిర్ స్టైల్, అలాగే మీరు, మీ కుటుంబ సభ్యులలో ఉన్న వ్యవహార శైలి ఇవన్నీ మీరు ఎవరిని అభిమానిస్తున్నారో, ఎవరిని మీరు ఫాలో అవుతున్నారో చెప్పకనే చెబుతూ ఉన్నాయి. ముస్లింలు అంటున్న వారు, వారి బట్టలను చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విధంగా వారు దుస్తులు ధరిస్తున్నారా? ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారంగా వారు వెంట్రుకలు ఉంచుతున్నారా? ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారము వ్యవహార శైలిగా నడుచుకుంటున్నారా? అక్కడ మనకు తెలిసిపోతుంది ఎవరు ఎవరిని మనం ఫాలో చేస్తున్నాం, ఎవరిని మనం అభిమానిస్తున్నాం, ఎవరి ఫోటోలు కాపీలలో, నోట్ బుక్కులలో, ఇంట్లోని గోడల మీద అతిక్కించుకుంటున్నాం, అక్కడ మనకు తెలిసిపోతుంది మన అభిమానులు ఎవరో, మనం ఎవరిని అభిమానిస్తున్నాము అనేది.
కాబట్టి జాగ్రత్త, ఎవరిని అభిమానిస్తున్నారో వారితోనే రేపు ఉంటారు.
నాలుగవ హక్కు: ఆదర్శంగా తీసుకోవడం
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నమ్మటం, విశ్వసించటం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించటం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించటం, మూడు హక్కుల గురించి తెలుసుకున్నాం కదండీ. ఇక మరొక హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శమూర్తిగా, రోల్ మోడల్ గా, ఆదర్శనీయుడిగా తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో నడుచుకోవాలి. ప్రతి పనిలో, ప్రతి విషయంలో, ఆరాధనల్లో, వ్యవహారాల్లో, అలాగే విశ్వాసంలో, ప్రతి విషయంలో ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకోవాలి.
ఖుర్ఆన్ గ్రంథం 33వ అధ్యాయం 21వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ لِمَنْ كَانَ يَرْجُو اللَّهَ وَالْيَوْمَ الْآخِرَ وَذَكَرَ اللَّهَ كَثِيرًا (లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనతున్ లిమన్ కాన యర్జుల్లాహ వల్ యౌమల్ ఆఖిర వ జకరల్లాహ కసీరా) వాస్తవానికి అల్లాహ్ ప్రవక్తలో మీ కొరకు – అంటే అల్లాహ్ను, అంతిమ దినాన్ని ఆశించేవారికీ, అల్లాహ్ను అధికంగా స్మరించే వారికీ – ఒక ఉత్తమ ఆదర్శం ఉంది. (33:21)
అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శము ఉంది అన్నారు. ఏ వ్యక్తి అయినా సరే ఆయన తండ్రిగా ఉంటాడు లేదా కుమారునిగా ఉంటాడు లేదా వృత్తిపరంగా ఒక బోధకునిగా, ఒక టీచర్గా ఉంటాడు లేదా ఒక డాక్టర్గా ఉంటాడు, ఏ రంగానికి చెందిన వ్యక్తి అయినా సరే, ఏ వయసులో ఉన్న వ్యక్తి అయినా సరే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఒక తండ్రిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదర్శనీయులు, ఒక కుమారునిగా కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక భర్తగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక గురువుగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక వ్యాపారిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక డాక్టర్గా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక బోధకునిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక లీడర్గా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక పొరుగువానిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, అలాగే ఒక సైన్యాధిపతిగా కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు. మనిషి జీవితంలోని ప్రతి రంగంలో కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు. కాబట్టి, ఏ వ్యక్తి అయినా సరే, ఏ రంగంలో ఉన్న వ్యక్తి అయినా సరే, ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకోవాలి.
ఇప్పుడు మనం ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నాం? ఎవరిని ఆదర్శంగా తీసుకొని మనము జీవించుకుంటున్నాం? మన జీవన వ్యవహారాలు, మన జీవన శైలి ఎలా ఉంది, మన లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కసారి ఆలోచించుకోండి మిత్రులారా. ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకొని మనము జీవించాలి, ఇది ముస్లింల సముదాయం మీద ఉన్న మరొక హక్కు.
ఐదవ హక్కు: విధేయత చూపడం
ఇక సమయం ఎక్కువైపోతుంది కాబట్టి, క్లుప్తంగా ఇన్ షా అల్లాహ్ చెబుతూ నా మాటను ముగించే ప్రయత్నం చేస్తాను. ప్రవక్త వారి తరఫున ముస్లిం సముదాయం మీద ఉన్న ముఖ్యమైన, ముఖ్యమైన, ముఖ్యమైన హక్కు, బాధ్యత ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విధేయత చూపాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. అనుసరించటం, విధేయత చూపటం అంటే ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ పనులకైతే మమ్మల్ని చేయమని ఆదేశించారో, ఆ పనులను చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ పనులైతే చేయవద్దు అని వారించారో, ఆ పనులు చేయకుండా వాటికి దూరంగా ఉండాలి. మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త వారు ప్రతి భక్తి కార్యానికి, ప్రతి మంచి కార్యానికి చేయమని ఆదేశించి ఉన్నారు. అలాగే, ప్రతి పాపానికి మరియు ప్రతి తప్పు కార్యానికి దూరంగా ఉండండి అని వారించి ఉన్నారు. ప్రవక్త వారు వారించిన విషయాలకు దూరంగా ఉండాలి, ప్రవక్త వారు బోధించిన, చేయమని చెప్పిన విషయాలను మనము చేయాలి. దీనినే ఇతాఅత్, ఇత్తెబా అని అరబీలో అంటారు, విధేయత అని తెలుగులో అంటారు, అనుసరించటం అని అంటారు.
ఖుర్ఆన్ గ్రంథం సూరా మాయిదా 92 వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు,
وَأَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ (వ అతీవుల్లాహ వ అతీవుర్రసూల్) అల్లాహ్కు విధేయత చూపండి, ప్రవక్తకు కూడా విధేయత చూపండి. (5:92)
అల్లాహ్కు విధేయత చూపండి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా విధేయత చూపండి, అనుసరించండి. ఎలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మనము విధేయత చూపాలి, అనుసరించాలంటే ఒక రెండు ఉదాహరణలు చెప్పిఇన్ షా అల్లాహ్ మాటను ముగించి ముందుకు కొనసాగిస్తాను.
ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందుకు వచ్చాడు. ఆయన బంగారపు ఉంగరము ధరించి ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచి, ఆ ఉంగరము తీసేసి పక్కన పడేశారు. పురుషులు బంగారము ధరించడము ఇస్లాం నియమాల నిబంధనల ప్రకారము అది వ్యతిరేకం. పురుషులు బంగారము ధరించరాదు, ఇది ఇస్లాం మనకు బోధించే విషయం. ఆ వ్యక్తి బంగారము ధరించి ఉన్నారు కాబట్టి ప్రవక్త వారు ఆ బంగారపు ఉంగరము తీసి పక్కన పడేసి, మీరు నరకము యొక్క అగ్నిని ముట్టుకోవటము, చేతిలో పట్టుకోవటము ఇష్టపడతారా, మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పారు. తర్వాత ప్రవక్త వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు, ఆ వ్యక్తి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇతర శిష్యులు ఆ వ్యక్తిని పిలిచి, చూడండి, ఆ బంగారము ధరించవద్దు అని ప్రవక్త వారు తెలియజేశారు కాబట్టి, ఆ బంగారము మీరు ధరించవద్దు, కానీ అది అక్కడ పడిపోయి ఉంది కాబట్టి, అది మీరు తీసుకువెళ్ళండి, వేరే పనుల కోసం ఉపయోగించుకోండి అన్నారు. అయితే, ఆయన ఏమన్నారో తెలుసా,
لا والله، لا آخذه أبداً، وقد طرحه رسول الله صلى الله عليه وسلم (లా వల్లాహి, లా ఆఖుజుహు అబదా, వఖద్ తరహహు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం.) అల్లాహ్ సాక్షిగా, అలా నేను చేయనంటే చేయను. ఏ పరికరాన్ని అయితే ప్రవక్త వారు తొలగించి పక్కన పడేశారో, దాన్ని నేను ముట్టుకోనంటే ముట్టుకోను అని చెప్పారు.
అలాగే మనం చూచినట్లయితే, అలీ రజియల్లాహు అన్హు వారు ఒకసారి పట్టు వస్త్రాలు ధరించి వెళ్తూ ఉన్నారు, ప్రవక్త వారి కంటపడ్డారు. ప్రవక్త వారు అలీ రజియల్లాహు అన్హు వారు పట్టు వస్త్రాలు ధరించి ఉన్న విషయాన్ని చూసి, ప్రవక్త వారికి ఆ విషయం నచ్చలేదు. ప్రవక్త వారికి నచ్చలేదన్న విషయం ఆయన ముఖ కవళికల ద్వారా కనపడింది. వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు గుర్తుపట్టి, ఇంటికి వచ్చేసి ఆ వస్త్రాలు తీసి, చించేసి మహిళలకు ఇచ్చేశారు. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఇస్లామీయ నిబంధనల ప్రకారము పట్టు వస్త్రాలు పురుషులకు యోగ్యమైనవి కావు. పట్టు వస్త్రాలు మహిళలకే ప్రత్యేకం. పురుషులు పట్టు వస్త్రాలు ధరించరాదు, ఇది ఇస్లామీయ నిబంధన. అయితే అలీ రజియల్లాహు అన్హు వారు పట్టు వస్త్రాలు ధరించారు కాబట్టి, ప్రవక్త వారు ఆ విషయాన్ని ఇష్టపడలేదు. వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు ఆ విషయాన్ని గ్రహించి, ఆ పట్టు వస్త్రాలు ఇంటికి వెళ్లి చించేసి, మహిళల చేతికి ఇచ్చేశారు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఈ బట్టలతో ఏమైనా చేసుకోండి అని.
చూశారా, ప్రవక్త వారు ఇష్టపడలేదు, వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు ఆ దుస్తులను తొలగించేశారు. చూశారా, ఆ ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము అనుసరించాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము విధేయత చూపాలి. ఏ విషయాలనైతే ప్రవక్త వారు మమ్మల్ని వారించారో వాటికి దూరంగా ఉండాలి.
అలాగే, ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కులలో మరొక హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకువచ్చిన ధర్మాన్ని వ్యాపింపజేయాలి, ప్రచారం చేయాలి, ప్రజల వద్దకు తీసుకువెళ్లి చేరవేయాలి. ఆ పని ప్రవక్తలు చేశారు. ప్రవక్త, మీకు నేను చివరి ప్రవక్తని, నా తర్వాత ప్రవక్తలు రారు. ఇక దీని ప్రచారం యొక్క బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి వెళ్ళిన తర్వాత సహాబాలు ఆ బాధ్యత నెరవేర్చారు. ఆ తర్వాత వారు కూడా బాధ్యత నెరవేర్చారు. మనము కూడా ఆ బాధ్యత నెరవేర్చాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులను అభిమానించాలి. ఎవరిని కూడా కించపరచరాదు, దూషించరాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూద్ పఠించాలి, ఇది కూడా మన మీద ఉన్న బాధ్యత మరియు హక్కు. దరూద్ శుభాలు అనే ప్రసంగము
إِنْ شَاءَ ٱللَّٰهُ (ఇన్ షా అల్లాహ్) వినండి, అక్కడ దరూద్ గురించి, అది ఎంత విశిష్టమైన కార్యమో తెలపజడం జరిగింది. అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్నేహితులతో మనము కూడా అభిమానం చూపించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శత్రువులతో మనము కూడా శత్రుత్వాన్ని వ్యక్తపరచాలి. ఇవి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కులు. క్లుప్తంగా మీ ముందర ఉంచడం జరిగింది. నేను అల్లాహ్తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని అందరినీ అన్న, విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక,ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మహా ప్రవక్త ముహమ్మద్ ﷺ ఉన్నత వ్యక్తిత్వాన్ని అగౌరవ పరుస్తున్న నేటి పరిస్థితులలో ముస్లింగా మన బాధ్యత [వీడియో] https://youtu.be/2ZKt_5BKDM0 [53 నిముషాలు] వక్త: షరీఫ్ మదని , వైజాగ్ (హఫిజహుల్లాహ్) ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినాల్సిన వీడియో , మీ బంధు మిత్రులకు షేర్ చెయ్యడం మర్చిపోవద్దు సుమా!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మక్కా విజయం, సత్యాసత్యాల నడుమ జరిగిన ఓ నిర్ణయాత్మకమైన యుద్ధమే అనాలి. ఆ విజయానంతరం అరబ్బుల్లో, మహనీయ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క దైవ దౌత్యం గురించి ఎలాంటి సందేహానికి ఆస్కారం లేకుండా పోయింది. ఈ కారణంగానే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దైవధర్మం అయిన ఇస్లామ్ లో ప్రజలు తండోపతండాలుగా వచ్చి చేరడం ఆరంభమైంది. ప్రతినిధి వర్గాల రాకకు సంబంధించిన అధ్యాయంలో మేము ఇస్తున్న వివరాల ఆధారంగా ఈ విషయాన్ని వారు అంచనా వేసుకోవచ్చు. అలాగే, హజాతుల్ విదా సందర్భంలో హాజరైన ప్రజా సమూహాన్ని బట్టి కూడా దీన్ని మనం గుర్తించవచ్చు – మొత్తానికి, అరేబియాలో అంతర్గతంగా ప్రబలుతున్న తిరుగుబాట్లు, అడ్డంకులన్నీ ఇప్పుడు దాదాపుగా సమసిపోయి నట్లయింది. ముస్లిములు, దైవధర్మ సంవిధానాన్ని, ఇస్లామ్ షరీఅతను ఎల్లెడలా వ్యాపింపజేయడానికి, ఇస్లామ్ ధర్మప్రచారం కోసం ఏకాగ్రతను సంతరించుకొని ముందుకు పురోగమించడానికి అవకాశం లభించినట్లయింది.
తబూక్ పోరాటం సంభవించడానికి గల కారణం
అయితే ఇప్పుడు, ఎలాంటి కారణం లేకుండానే ముస్లిములతో తలపడడానికి ఓ శక్తి మదీనా వైపునకు దృష్టిని పెట్టింది. దీనికి సంబంధించిన వారు అప్పుడప్పుడు ముస్లిములను కవ్విస్తూ ఉన్నారు. ఈ శక్తి రోమను సామ్రాజ్యానికి సంబంధించినది. అది ఆ కాలంలో ప్రపంచంలోకెల్లా ఓ పెద్ద సూపర్ పవర్ గా అలరారే సామ్రాజ్యం . వెనుకటి పుటల్లో ఈ కవ్వింపు, షుజ్ల్ బిన్ అమ్రూ గస్సానీ చేతిలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి దూత హజ్రత్ హారిస్ బిన్ ఉమైర్ అజీ (రదియల్లాహు అన్హు) హత్యగావించబడడంతో ఆరంభమైంది. హజ్రత్ హారిస్ బిన్ ఉమైర్ బస్రా గవర్నరు వద్దకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సందేశాన్ని తీసుకు వెళ్ళిన వ్యక్తి. అదే కాకుండా, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ తరువాత హజ్రత్ జైద్ బిన్ హారిసా నేతృత్వంలో ఓ సైనిక పటాలాన్ని పంపించడం, అది రోమను సామ్రాజ్యంలో ‘మూతా’లో భీకరంగా యుద్ధం చేయడం, అయితే ఈ సైనిక పటాలం ఆ తలబిరుసుతనం గల రోమనులను అణచలేకపోవడం కూడా మనం వెనుకటి పుటల్లో చదువుకున్నదే. అయితే, ముస్లిముల ఈ సైన్యం అప్పటి సూపర్ పవర్ అయిన రోమనులతో ఢీకొనడం, అరేబియా పౌరులపై మంచి ప్రభావాన్నే వేసింది. |
రోమ్ చక్రవర్తి కైజరు, ఈ ప్రభావం విషయంలో, దాని ఫలితంగా అరబ్బు తెగల్లో రోమనుల నుండి స్వాతంత్ర్యం పొందే భావన జాగృతం అయ్యే విషయంలో, ముస్లిముల ఎడల అరబ్బుల్లో ఏర్పడే సానుభూతి విష
యంలో ఎలా ఉపేక్షించగలడు? అవి అతణ్ణి కలచివేస్తున్న ప్రమాద సూచికలే మరి. ఆ ప్రమాదం ఒక్కో అడుగు అతని సరిహద్దుల వైపునకు కదిలివస్తోంది. అరేబియాతో కలిసిన సిరియా సరిహద్దుకు ఓ సవాలుగా నిలిచింది. కాబట్టి కైజరు, ముస్లిముల ఈ మహోన్నతమైన శక్తి, అజేయమైన ఈ ప్రమాదం ముంచుకు రాకపూర్వమే, రోము సామ్రాజ్యానికి ఆనుకొని ఉన్న అరబ్బు ప్రాంతాల్లో సంక్షోభం, తిరుగుబాట్లు చెలరేగక మునుపే దాన్ని అణచివేయా లనే దృఢసంకల్పానికి వచ్చాడు.
ఈ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకునే, మూతా యుద్ధం జరిగి ఇంకా ఒక్క సంవత్సరం కూడా తిరిగిరాలేదు,
రోము చక్రవర్తి రోమను ప్రజల్ని, తన ఆధీనంలో ఉన్న అరబ్బుల్ని, అంటే ఆలెగస్సాన్ తెగ వగైరాలతో కూడిన ఓ పెద్ద సైన్యాన్ని సమీకరించి, ఓ భయంకరమైన, నిర్ణయాత్మకమైన యుద్ధం కోసం సన్నాహాలు మొదలెట్టాడు.
రోమనులు మరియు గస్సాన్ల యుద్ధ సన్నాహాల వార్తలు
రోమను సామ్రాజ్యం ముస్లిములపై దండెత్తడానికి సన్నాహాలు ప్రారంభించిందన్న వార్తలు ఎడతెగకుండా మదీనాకు చేరుతూనే ఉన్నాయి. ఈ కారణంగా ముస్లిములు అప్రమత్తులైపోయారు. ఏ చిన్న అనుమానం వచ్చినా రోమనులు తమపైకి వచ్చిపడ్డారనే భావనకు లోనైపోతున్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే ఓ సంఘటనను కూడా ఇక్కడ ఉటంకించక తప్పదు. అదే సంవత్సరం, అంటే హిజీ శకం 9లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ భార్యామణులతో అలిగి ఒక నెల్లాళ్ళు ‘ఈలా“చేసి వారికి దూరంగా ఉన్నారు. సహచరులకు ఈ విషయం తెలిసిరాలేదు. వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి తలాక్ ఇచ్చారనే అనుకొని బాధపడిపోయారు.
[ఈలా అంటే స్త్రీ వద్దకు వెళ్ళనని ఒట్టేసుకోవడం. ఈ ఒట్టు నాల్గు నెలలు లేదా అంతకంటే తక్కువ గడువు కోసం వేసుకుంటే ధర్మశాస్త్రం ప్రకారం ఫరవాలేదు. ఇదే గనక నాల్గు నెలలు దాటితే షరీఅత్ న్యాయస్థానం ఆ విషయంలో జోక్యం కలుగజేసుకుని భర్త, భార్యను భార్యగానైనా ఉంచుకోవాలి లేదా ఆమెకు తలాక్ అయినా ఇవ్వాలి అని ఆదేశిస్తుంది. కొందరు సహాబాల అభిప్రాయం ప్రకారం, నాల్గు నెలల గడువు తీరిపోగానే ఆ స్త్రీకి తలాక్ వర్తిస్తుంది.]
హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ సంఘటన గురించి ఇలా వివరిస్తున్నారు:
“నాకు అన్సారీ మిత్రుడొకడుండేవాడు. నేను (దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సన్నిధిలో) లేనప్పుడు అతను అక్కడ జరిగిన విషయాలు వచ్చి చెప్పేవాడు. నేను కూడా అతని గైర్హాజరులో వెళ్ళి జరిగిన విషయాలు అతనికి చెబుతూ ఉండేవాణ్ణి. ఈ ఇద్దరు మిత్రులు మదీనాలోనే ఉంటూ ఉండేవారు. ఇరుగుపొరుగున ఉంటూ వంతుల వారీగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సన్నిధికి వెళ్ళి వస్తూ ఉండేవారు – ఆ కాలంలోనే మాకు గస్సాన్ రాజు వల్ల ప్రమాదం ఏర్పడుతుందనే శంక ఉంటూ ఉండేది. అతను మా పై దాడి చేయనున్నాడని వస్తున్న వార్తల వల్ల మేము అప్రమత్తులమై ఉండేవారం. ఓ రోజు హఠాత్తుగా నా ఆ అన్సారీ మిత్రుడు నా తలుపును తెగబాదుతూ తలుపు తెరవమని అరవనారంభించాడు. అది విన్న నేను, “ఏమిటీ? గస్సానీలు వచ్చిపడ్డారా?”
అని అడిగాను.
“కాదు, అంతకంటే పెద్ద ఘోరమే జరిగిపోయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ భార్యామణుల నుండి వేరైపోయారు” అన్నాడు నా మిత్రుడు. [సహీహ్ బుఖారీ-2/730 ]
మరో ఉల్లేఖనంలో హజ్రత్ ఉమర్(రదియల్లాహు అన్హు) ఇలా అన్నట్లు ఉంది:
“మా పై దండెత్తడానికి ఆలెగస్సాన్ తమ గుర్రాలకు నాడాలు వేస్తున్నా రనే పుకార్లు బాగా వ్యాపించిన రోజులవి. ఓ రోజు నా మిత్రుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సన్నిధికి వెళ్ళి ఇషా నమాజు సమయానికి తిరిగివచ్చాడు. నా ఇంటి తలుపును పెద్దగా తడుతూ, “ఆయన నిద్రపోయారా?” అని అరుస్తున్నాడు.
నేను బెదిరిపోతూ బయటకు వచ్చేశాను.
“ఓ పెద్ద ప్రమాదం జరిగిపోయింది” అన్నాడతను.
“ఏమిటి? గస్సానులు వచ్చేశారా?” అని అడిగాన్నేను.
“లేదు. అంతకంటే పెద్ద ప్రమాదమే ముంచుకువచ్చింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ భార్యలకు తలాక్ ఇచ్చేశారు.” [సహీహ్ బుఖారీ-1/334]
ఈ పరిస్థితినిబట్టి రోమనుల వల్ల ముస్లిములలో ఏర్పడిన వ్యాకులత ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు. ఇదే కాకుండా, మునాఫిక్లులు (కపట ముస్లిములు) వ్యాపింపజేస్తున్న పుకార్లు వారిని మరింత చీకాకుపర్చనారం భించాయి. ఈ మునాఫిలకు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతి రంగంలోనూ నెగ్గుకు వస్తున్నారని, ఈ భూమ్మీదనున్న ఏ శక్తికీ వెరవడం లేదని, ఏ అడ్డంకులైతే ఆయన దారికి అడ్డువస్తున్నాయో అవన్నీ ఇట్టే తొలగిపోతున్నాయన్న విషయం తెలిసినప్పటికీ వారు తమ మనస్సుల్లో దాచుకున్నది, ఎదురు చూస్తున్నది తప్పకుండా నెరవేరే తరుణం ఎంతో దూరంగా లేదని తలచి ముస్లిములకు వ్యతిరేకంగా కుట్రలు పన్ననారంభించారు. వారు తాము భావిస్తున్నట్లుగానే ఓ మస్జిదను (ఆ మస్జిద్, మస్జిదె జిరా గా ఆ తరువాత ఖ్యాతిగాంచింది) కట్టుకొని ఆ మస్జిద్ లో కుట్రలు, కుతంత్రాలకు పథకాలు వేయనారంభిం చారు. దైవం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ల ఎడల తిరస్కార భావ పునాదులపై నిర్మించ బడిన మస్జి లోనికి వచ్చి నమాజు చేయించమని కూడా ఈ మునాఫిస్టు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం)ను కోరి ఉన్నారు. అలా కోరడానికి కారణం, ముస్లిములను మభ్య పెట్టి వారికి తాము పన్నుతున్న కుతంత్రాలు తెలియకుండా ఉండాలని, ఆ మస్జిద్ లోకి వచ్చి పోయే వారిపై ముస్లిములు నిఘా ఉంచకుండా ఉండడానికే. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యుద్ధ సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నందు వలన ఆ మస్జిద్ లో నమాజు చేయించే కార్యక్రమాన్ని యుద్ధం నుండి తిరిగి వచ్చే వరకు వాయిదా వేశారు. ఇలా మునాఫిక్లులు తమ లక్ష్యసాధనలో కృతకృత్యులు కాలేకపోయారు. అల్లాహ్ వారి ఈ ఎత్తుగడను యుద్ధం నుండి తిరిగివచ్చే లోపలే బట్టబయలు చేశాడు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యుద్ధం నుండి తిరిగివచ్చిన తరువాత ఆ మస్జిద్ లో నమాజు చేసే బదులు దాన్ని నేలమట్టం చేయించారు.
రోమనులు, గస్సానుల యుద్ధ సన్నాహాలకు చెందిన ప్రత్యేక వార్తలు
ముస్లిములు యుద్ధ వార్తలను వింటూ చీకాకులో ఉన్న కాలంలోనే మదీనాకు సిరియా దేశం నుండి నూనె సరఫరా చేసే ‘బన్తీల’ (*) ద్వారా హఠాత్తుగా హెరిక్స్ నలభై వేల మంది సైనికులతో కూడిన ఓ పెద్ద సైన్యాన్ని తయారు చేసి పేరుమోసిన ఓ కమాండరు నేతృత్వంలో యుద్ధానికి పంపిస్తు న్నాడని, ఆ సైన్యం జెండా క్రిందికి క్రైస్తవ తెగలైన లబ్న్ మరియు జిజాములు కూడా వచ్చి చేరాయని, ఆ సైన్యం ముందస్తు దళం ఒకటి ‘బల్కా’ వరకు వచ్చేసిందనే పిడుగులాంటి వార్త వినిపించారు. ఇలా అది ఓ పెద్ద ప్రమాద రూపంలో ముస్లిముల ముందుకు వచ్చిన ప్రత్యేక యుద్ధ సంబంధమైన
(*) సాబిత్ బిన్ ఇస్మాయీల్ (అలైహిస్సలాం) సంతతికి చెందినవారు. ఒకప్పుడు ఉత్తర హిజాలో మంచి పలుకుబడిగల ధనవంతులు. పతనావస్థకు చేరి క్రమక్రమంగా మామూలు రైతులుగా, వ్యాపారులుగా మారిపోయినవారు వీరు
మరింత జటిలంగా మారిన పరిస్థితులు
ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతుంటే, వాటికితోడు మరిన్ని విపత్తులు వచ్చిపడ్డాయి. విపరీతమైన ఎండ వేడిమికి తోడు ప్రజలు కరవు వల్ల బాధపడు తున్నారు. వెళ్ళడానికి వాహనాలు కూడా తక్కువే. మదీనాలో పండే పండు పంటకొచ్చాయి. కాబట్టి ప్రజలు మదీనాను వదలక నీడపట్టున ఉండి పంటను దక్కించుకుందామనే ధోరణిలో ఉన్నారు. వెంటనే బయలుదేరడానికి సిద్ధపడడం లేదు. అదేకాకుండా దూరప్రాంతానికి వెళ్ళడం, మార్గంలో ఏర్పడే అవరోధాలు ఓ ప్రక్క పీడించనారంభించాయి వారిని.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహనీయుని ఖచ్చితమైన నిర్ణయం
అయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరిస్థితులను, జరుగబోయే మార్పుల్ని క్షుణ్ణంగా గమనిస్తూనే ఉన్నారు. ఈ నిర్ణయాత్మకమైన ఘడియలో గనక ముస్లిములు రోమనులతో యుద్ధం చేయడానికి బద్దకించి ముస్లిముల ప్రాంతాల్లోనికి చొరబడే వీలు కలిగిస్తే, వారు మదీనా పై దండెత్తి వస్తే గనకా, ఇస్లామీయ సందేశం పై చెడు ప్రభావాలు పడతాయి. ముస్లిమ్ సైన్యానికి ఇప్పటి వరకు వచ్చిన కీర్తికాస్తా మంటగలిసిపోతుంది. ‘హునైన్’ యుద్ధంలో చావుదెబ్బ తిని తుది శ్వాస వదులుతున్న అజ్ఞానం తిరిగి బ్రతికి బట్టకడుతుంది. సమయం కోసం కాచుకొని అబూ ఆమిర్ ఫాసిక్ ద్వారా రోమను చక్రవర్తితో సంబంధాలు ఏర్పర్చుకున్న మునాఫిన్లు, రోమనులతో తలపడబోతున్న ముస్లిములకు వెన్నుపోటు పొడవడానికి కాచుకొని కూర్చున్నారు. ఇలా ఇప్పటి వరకు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయన అనుచరగణం ఇస్లామ్ వ్యాప్తికి చేసిన కృషి అంతా బూడిదలో బోసిన పన్నీరులా వృధా అయిపోగలదు. ఎడతెగని రక్తపాత సహిత యుద్ధాలు, సైనిక చర్యల ద్వారా సంపాదించిన విజయాలు కాస్తా అపజయాలుగా మారిపోయే ఆస్కారం ఉంది.
ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ ఫలితాలను పూర్తిగా బేరీజు వేసుకుం టూనే ఉన్నారు. అందుకని, ఓ వైపు విషమ పరిస్థితులు, మరో వైపు దారిద్ర్యం పీడిస్తున్నప్పటికీ, రోమనులను దారుల్ ఇస్లామ్ (మదీనా) వైపునకు పురోగ మించే వెసులుబాటును కల్పించే బదులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తామే స్వయాన వారి ప్రాంతాల్లోనికి చొరబడి వారికి వ్యతిరేకంగా ఓ నిర్ణయాత్మకమైన యుద్ధం చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
రోమనులతో యుద్ధానికి సన్నాహాలు
ఈ వ్యవహారాన్ని గురించి బాగా సమీక్షించిన తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహనీయులు సహాబా (రదియల్లాహు అన్హుమ్)లకు, యుద్ధం గురించిన సన్నాహాలు ప్రారంభిం చమని ప్రకటించారు. అరబ్బు తెగలు, మక్కా ప్రజల్ని కూడా యుద్ధం కోసం బయలుదేరండనే సందేశం పంపించారు. ఏ గజ్వాకైనా వెళ్ళేటప్పుడు దైవప్రవక్త
(సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజల దృష్టిని మరో వైపునకు మళ్ళించడం రివాజు. కాని పరిస్థితి జటిలత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), “మనం రోమనులతో యుద్ధానికి వెడుతున్నాం” అని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ‘జిహాద్’ గురించి ప్రజల్ని ప్రేరేపించారు. దివ్యఖుర్ఆన్లోని ‘తౌబా’ సూరాలోని ఓ భాగం ఈ సందర్భంలోనే అవతరించింది. దీనికితోడు, ఆయన దానధర్మాల ప్రాశస్త్యం గురించి చెబుతూ, అల్లాహ్ మార్గంలో ప్రియమైనది, మేలైనది అయిన దాన్ని వెచ్చించమని ప్రోత్సహించారు.
యుద్ధ సన్నాహాలకు ముస్లిముల ఉరుకులు పరుగులు
సహాబా (రదియల్లాహు అన్హుమ్)లు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ప్రకటన వినగానే, రోమనులతో యుద్ధం చేయడానికి సన్నాహాలను ముమ్మరం చేశారు. తెగలు, మిత్రపక్షాలు నలువైపుల నుండి మదీనాకు వచ్చిచేరనారంభించాయి. ఎవరి మనస్సుల్లోనైతే కపటం నాటుకుపోయిందో వారు తప్ప ప్రతి ముస్లిమ్ ఆ గజ్వాకు వెళ్ళడానికి వెనుకాడలేదు. అయితే ముస్లిములలోనే ముగ్గురు వ్యక్తులు మాత్రం ఎలాంటి కారణాలు లేకుండానే ఆ గజ్వాలో చేరకుండా ఆగిపోయారు. వారు కపట ముస్లిములు కారు, నిజమైన ముస్లిములే. ఆర్థికంగా వెనుకబడిన పేద ముస్లిములు సైతం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహనీయుల వద్దకు వచ్చి యుద్ధంలో పాల్గొనడానికి తమకు ఏదైనా వాహనాన్ని సమకూర్చమని ప్రాధేయపడనారం భించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన వద్ద ఏదీ లేదని, ఈ విషయంలో నేను నిస్సహాయుడనని చెప్పి పంపించడం జరుగుతూ ఉండేది. దివ్యఖుర్ఆన్ ఈ సందర్భాన్ని ఈ విధంగా అభివర్ణిస్తోంది.
“నేను మీ కొరకు వాహనాలను ఏర్పాటు చేయలేను అని అన్నప్పుడే, గత్యంతరం లేక వారు మరలిపోయారు. వారి కళ్ళ నుండి అశ్రువులు ప్రవహించాయి. వారు తమ ఖర్చులతో పోరాటంలో పాల్గొనే శక్తి తమకు లేనందుకు చాలా బాధపడ్డారు.” (9 : 92)
ఇలాగే ముస్లిములు దైవమార్గంలో ధనాన్ని వెచ్చించే విషయంలో ఒకరినొకరు మించిపోవాలనే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. హజ్రత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు), సిరియా దేశం వెళ్ళడానికిగాను వ్యాపార సామగ్రి మూటలు గల రెండు వందల ఒంటెలను, వాటితో సహా రెండు వందల ఓకియాల వెండి (దాదాపు ఇరవై తొమ్మిదిన్నర కిలోల వెండి) తయారు చేసి ఉన్నారు. ఆయన దీన్నంతటిని యుద్ధం కోసం దానంగా ఇచ్చేశారు. ఆ తరువాత అదనంగా ఓ వంద ఒంటెల్ని ప్రయాణ సామగ్రితో సహా సదఖా చేశారు. అది ఇచ్చిన తరువాత ఒక వెయ్యి దీనారాలు (దాదాపు అయిదున్నర కిలోల బంగారం) తెచ్చి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒడిలో పొసేశారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ దీనారాలను చేతితో ఇటు అటు కదిలిస్తూ ఈ రోజు ఉస్మాన్ ఏది చేసినా ఆయనకు నష్టాన్ని చేకూర్చదు ‘* అననారంభించారు. ( *జామిఆ తిర్మిజీ: మనాఖిబ్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్-2/2111 )
అదే కాకుండా హజ్రత్ ఉస్మాన్ మళ్ళీ మళ్ళీ సదఖా చేస్తూనే ఉన్నారు. అలా ఆయన సదఖా చేసిన ధనం గాక, ఒంటెల సంఖ్య తొమ్మిది వందలు, గుర్రాల సంఖ్య నూరు వరకు చేరిపోయింది.
ఇటు అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) తన రెండొందల ఓకియాలు (అంటే ఇరవైతొమ్మిదిన్నర కిలోల వెండి) తీసుకొచ్చి సమర్పించారు. హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) తన దగ్గర ఉన్నదంతా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి తెచ్చి పడవేశారు. ఆయన భార్యాపిల్లల కోసం మిగిల్చి ఉంచింది కేవలం అల్లాహ్, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను మాత్రమే. ఆయన చేసిన సదఖా ధనం మొత్తం నాల్గు వేల దీర్ఘములు. ఆయనే ఈ సదఖా తెచ్చి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సమర్పించినవారిలో ప్రథముడు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తన వద్ద ఉన్న సొత్తులోని సగభాగం తీసుకొని వచ్చి ఇచ్చారు. హజ్రత్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కూడా పెద్ద మొత్తంలోనే ధనాన్ని తెచ్చి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సమర్పించుకున్నారు. వారే కాకుండా హజ్రత్ తలా (రదియల్లాహు అన్హు), సఅద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు), ముహమ్మద్ బిన్ ముస్లిమా (రదియల్లాహు అన్హు)లు కూడా తగినంత డబ్బును సదఖాగా ఇచ్చారు. హజ్రత్ ఆసిమ్ బిన్ అద్దీ (రదియల్లాహు అన్హు) తొంభై వస్క్ ల (అంటే పదమూడున్నర వేల కిలోలు లేదా పదమూడున్నర టన్నుల) ఖర్జూరాలు తీసుకువచ్చారు. తక్కిన సహాబాలు కూడా ఒకరి తరువాత ఒకరు తమకు తోచిన సదఖా తెచ్చి ఇచ్చారు. చివరికి శక్తి లేనివారు కూడా ఒకటో రెండో ముద్దు (ఖర్జూరాలు) సదఖాగా ఇచ్చారు. మహిళలు కూడా తమ కంఠహారాలు, వడ్డాణాలు, కాళ్ళ పట్టీలు, చెవుల రింగులు, ఉంగరాలు వగైరాలు వారి శక్తి మేరకు తెచ్చి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సమర్పించుకున్నారు. ప్రతివారూ పిసినారితనాన్ని ప్రదర్శించకుండా సదఖ ఇచ్చినవారే. కేవలం మునాఫిన్లు ఒక్కరే ఒకరిని మించి ఒకరు సదఖా చేయడం చూసి (వీరు ప్రదర్శనాబుద్ధితో చేస్తున్న సదఖా అని) తూలనాడనారంభించారు. తమ వద్ద ఇవ్వడానికి ఏమి లేని పేద ముస్లిములెవరైనా ఒకటి, రెండు ఖర్జూరాలను తీసుకొని వస్తే వారిని చూసి ఈ మునాఫిక్లు, ఓహో ఈ ఖర్జూరాలతో కైజరు సామ్రాజ్యాన్ని జయిస్తారు కాబోలు అని హేళన చేసేవారు. (9 : 97)
తబూక్ కు బయలుదేరిన ఇస్లామీయ సైన్యం
ఇస్లామీయ సైన్యం యుద్ధానికి పూర్తిగా సన్నద్ధమైన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ ముహమ్మద్ బిన్ ముస్లిమా (రదియల్లాహు అన్హు)ను, మరో ఉల్లేఖనంలో చెప్పబడి నట్లుగా సబా బిన్ అరఫ్తా (రదియల్లాహు అన్హు)ను మదీనాకు గవర్నరుగా నియమించారు. . హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు)ని తమ కుటుంబ సభ్యులకు సంరక్షకులుగా చేసి మదీనా లోనే ఉండమని చెప్పి ఆదేశించారు. కాని మునాఫిన్లు ఆయన్ను తూల నాడడం వలన ఆయన బయలుదేరి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు చేరారు. కాని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తిరిగి ఆయన్ను మదీనాకు పంపిస్తూ, “ఏమిటీ! నీకూ నాకూ ఉన్న అనుబంధం, హజ్రత్ మూసా (అలైహిస్సలాం)కు హజ్రత్ హారూన్ (అలైహిస్సలాం)తో ఉన్న అనుబంధం లాంటిది అనే విషయాన్ని గ్రహించలేదా? అయితే నా తరువాత మరో ప్రవక్త రాడు అనే విషయం తెలుసుకో” అని అన్నారు.
ఎట్టకేలకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉత్తర దిశ వైపునకు బయలుదేరారు. (నిసాయీ గ్రంథంలోని ఉల్లేఖనం ప్రకారం అది గురువారం) గమ్యం తబూక్. సైన్యం పెద్దది. ముప్ఫై వేల మంది యోధులతో కూడిన సైన్యం అది. అంతకు పూర్వం ముస్లిములు అంత పెద్ద సైన్యాన్ని ఎప్పుడూ సమీకరించలేదు. అందుకని, ముస్లిములు దానికోసం తమ శాయశక్తులా ధనాన్ని సమకూర్చి నప్పటికీ సైన్యానికి కావలసిన హంగుల్ని సమకూర్చలేకపోయారు. అప్పటికీ వాహనాలు, తినుబండారాలు బాగా తక్కువగానే ఉన్నాయి. కాబట్టి పద్దెనిమిదేసి మంది సిపాయీలకు ఒక్కొక్క ఒంటె కేటాయించబడింది. వారు దాని పై వంతుల వారీగా స్వారీ చేస్తూ వెడుతున్నారు. అలాగే తినుబండారాల కొరత వల్ల అప్పుడప్పుడు చెట్ల ఆకుల్ని సైతం తినవలసి వచ్చింది. ఆ ఆకుల్ని తినడం వలన వారి పెదాలు వాచిపోయాయి. విధిలేక ఒంటెల కొరత ఉన్నప్పటికీ వాటిని జిబహ్ చేసి దాని ప్రేవుల్లో ఉన్న నీటిని త్రాగవలసి వచ్చింది. అందుకొరకే ఆ సైన్యం పేరు ‘జైషే ఉగ్రత్’ (అంటే కష్టాలు అనుభవించిన సైన్యం) అని పడిపోయింది. తబూక్ కు వెళ్ళేటప్పుడు ఈ సైన్యం ‘ హిజ్ర్ (అంటే సమూద్ జాతి నివసించిన ప్రదేశం) గుండా వెళ్ళవలసి వచ్చింది. సమూద్ జాతి ‘వాదియిల్ ఖురా’లో బండరాళ్ళను తొలిచి ఇండ్లను నిర్మించుకున్న జాతి. సహాబా (రదియల్లాహు అన్హుమ్)లు అక్కడి ఓ బావి నుండి నీటిని నింపుకున్నారు. కాని బయలుదేరే టప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో, “మీరు ఈ ప్రదేశంలోని నీరు త్రాగకండి, ఆ నీటితో నమాజు చేసుకోవడానికి వుజూ కూడా చెయ్యొద్దు. ఆ నీటితో ఏ పిండి అయితే కలిపి ముద్దగా చేశారో, దాన్ని పశువులకు పెట్టేయండి. ఆ పిండి తినకండి. మీరు సాలెహ్ (అలైహిస్సలాం)గారి ఒంటె నీళ్ళు త్రాగిన బావిలోని నీటినే ఉపయోగించండి” అని ఆదేశించారు.
‘సహీ హీన్’ గ్రంథంలో ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు)గారి ఉల్లేఖనం ఒకటుంది. అందులో ఆయన ఇలా సెలవిస్తున్నారు:
“మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘ హిజ్ర్ (లేదా సమూద్ జాతి నివాసం) గుండా వెడుతూ, ‘ఈ దుష్టులు నివసించిన ప్రదేశంలో ప్రవేశించకండి. వారి పై పడిన ఆపద మీ పైనా పడవచ్చు. అయితే వెళ్ళేటప్పుడు మాత్రం బాధతో మూలిగే హృదయాలు రోదిస్తూ నడిచినట్లు నడవండి’ అన్నారు. ఆ పిదప ఆయన తన తల పై వస్త్రం కప్పుకుని వేగంగా ప్రయాణిస్తూ ఆ లోయను దాటారు.” [సహీహ్ బుఖారీ- హిజ్ర్ లోయలో ప్రవేశించిన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనే అధ్యాయం-2/637]
మార్గమధ్యంలో సైన్యానికి నీరు కరవై విలవిలలాడిపోతోంది. ఈ విషయం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు విన్నవించుకున్నారు కొందరు. ప్రవక్త మహ నీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ను మొర పెట్టుకోగా అల్లాహ్ మేఘాలను పంపించాడు. అవి బాగా వర్షించగా జనం తనవితీరా దాహాన్ని తీర్చుకోవడమే కాకుండా అవసరానికి కావలసినంత నీటిని నింపుకోవడం జరిగింది.
ఇక తబూక్ దాపుకు చేరుతారనగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సైన్యాన్ని ఉద్దేశించి, “ఇన్షా అల్లాహ్, మీరు రేపటికల్లా తబూక్ యొక్క నీటి చెలమను చేరుకో గలరు. అయితే చార్జ్ సమయానికి ముందు అక్కడకు వెళ్ళలేరు. కాబట్టి
అక్కడికి వెళ్ళినవాడు ఏ ఒక్కడు కూడా నేను చేరనంత వరకు ఆ నీటిని ముట్టుకోవద్దు సుమా!” అని హెచ్చరించారు. హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, “మేము అక్కడికి చేరేలోపలే ఇద్దరు వ్యక్తులు ఆ చెలమ దగ్గరికి వెళ్ళడం గమనించాం. ఊట బావి(చెలమ) నుండి కొద్దికొద్దిగా నీరు ఊరుతోంది. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిద్దరిని ఉద్దేశించి, ‘మీరు ఈ నీటిని ముట్టుకున్నారా?’ అని అడగగా, ‘అవును’ అని బదులిచ్చారు వారు. ఆ ఇద్దరికి దైవాదేశం మేరకు ఏం చేప్పాలో చెప్పి, ఆ చెలమ నుండి తన ఒక అర చేతిని దొప్పగా చేసి వచ్చిన నీటిని బయటకు తీయనారంభించారు. అలా తీయగా వచ్చిన కొద్దిపాటి నీటితో తన ముఖాన్ని, చేతుల్ని కడిగి తిరిగి ఆ నీటిని ఆ చెలమలో పోసేశారు. ఆ తరువాత ఆ చెలమలో పుష్కలంగా నీరు ఊరనారంభించింది. సహాబా (రదియల్లాహు అన్హుమ్) తనవితీరా ఆ నీటిని త్రాగారు. ఆ తరువాత నన్నుద్దేశించి, ‘ఓ ముఆజ్! నీవే గనక బ్రతికి ఉంటే ఈ ప్రదేశాన్ని తోటలతో సస్యశ్యామలంగా అలరారుతున్నట్లు చూస్తావు’ అని చెప్పారు.” [ ముస్లిమ్- ముఆజ్ బిన్ జబల్ ఉల్లేఖనం-2/246]
మార్గం మధ్యలోనో లేదా తబూక్ కు చేరిన తరువాతనో- ఉల్లేఖనాల్లో కొంత భేదం ఉంది – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఈ రాత్రి మి మీదికి పెద్ద ఇసుక తుఫాను ఒకటి వచ్చిపడబోతోంది. అందుకని ఏ ఒక్కడూ లేచి నిలబడకూడదు. ఒంటెగలవాడు దాన్ని త్రాటితో గట్టిగా కట్టేయాలి” అన్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చినట్లుగానే ఆ రాత్రి తీవ్రమైన గాలి దుమారం చెలరేగింది. వారిలో ఒక వ్యక్తి లేచి నిలబడగా ఆ గాలి దుమారం అతణ్ణి ఎగిరేసుకుపోయి రెండు కొండల నడుమ విసరేసింది. ” [ముస్లిమ్-ముఆజ్ బిన్ జబల్ ఉల్లేఖనం -2/246]
తబూక్ ప్రయాణంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జొహ్రీ మరియు అశ్ నమాజులు, మగ్రిబ్ మరియు ఇషా నమాజులు కలిపి చేసేవారు. ఒక్కొక్కసారి ఈ రెండు నమాజుల్ని జమా తస్లిమ్ గాను, జమా తాఖీ గానూ చేసేవారు. (‘జమా తస్లీమ్’ అంటే జొహ్రీ మరియు అస్త్ నమాజులు జొహ్ర నమాజు వేళ అయినప్పుడు, మగ్రిబ్, ఇషా నమాజులు మగ్రిబ్ వేళ అయినప్పుడు చేయడం. ఇక ‘ జమా తాకీర్’ అంటే, జొన్గా, అత్ నమాజులు అన్ నమాజు వేళలో, మగ్రిబ్, ఇషా నమాజులు ఇషా నమాజు వేళలో చేయడం)
తబూక్ కు చేరిన ఇస్లామీయ సైన్యం
ఇస్లామీయ సైన్యం తబూకకు చేరి గుడారాలను వేసుకొని, రోమనులతో తలబడడానికి సిద్ధమైపోయింది. ఈ సందర్భంలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సైన్యానుద్దేశించి, విశాలమైన భావాలు స్ఫురించేటట్లుగా ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఇహపరలోకాల సాఫల్యం గురించి ప్రోత్సహించారు. అల్లాహ్ శిక్ష ఎలాంటిదో చూపుతూ భయ పెట్టారు. యుద్ధానంతరం లభించబోయే వరాలు, బహుమానాలకు సంబంధించిన శుభవార్తనిచ్చారు. ఇలా సైన్యం యొక్క ధైర్యసాహసాలు పెరిగినట్లయింది. వారిలో ఇప్పటి వరకు, తినుబండా రాలు, ఇతర వస్తువుల లేమి గురించి బాధపడుతున్న లోపాలన్నీ తొలగి పోయాయి. మరో ప్రక్క రోమను సామ్రాజ్యానికి మద్దతుగా వచ్చిన తెగలు, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాక గురించి విని భయభీతులైపోయాయి. ముందుకొచ్చి ముస్లిమ్ సేనను ఢీకొనడానికి ధైర్యం చాలక, దేశంలోని వివిధ పట్టణాల వైపునకు పారిపోనారంభించాయి. వారి ఈ వైఖరి ప్రభావం, అరేబియా ద్వీపం లోనే కాకుండా, బయటి వారి పైనా పడింది. ముస్లిముల ఘనకీర్తికి మరింత బలం చేకూరినట్లయింది. ముస్లిములకు, యుద్ధం ద్వారా సాధించ లేని రాజకీయ ప్రయోజనాలు ఒనగూడాయి. ఆ ప్రయోజనాలేమిటో మనం ఇక్కడ సమీక్షిద్దాం.
‘అయిలా’ పాలకుడు ‘యక్నా బిన్ రౌబా’ వెంటనే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో హాజరై జిజియా కట్టడానికి ఒప్పుకున్నాడు. సంధి ఒప్పందం చేసు కున్నాడు. ‘జర్ బా’ మరియు ‘అజ్ రూహ్’ పౌరులు కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు వచ్చి జిజియా కట్టడానికి సిద్ధపడ్డారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ఓ పత్రాన్ని రాయించి ఇచ్చారు. వారు దాన్ని సురక్షితంగా తమ వద్ద ఉంచు కోవడం జరిగింది. అలాగే ‘అయిలా’ లకునికి కూడా ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) పత్రాన్ని రాసి ఇచ్చారు. అది ఈ క్రింది విధంగా ఉంది.
“బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం. ఇది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తరఫున, యహినా బిన్ రౌబా మరియు అయిలా ప్రజలకు రాసి ఇచ్చిన శాంతి ఒప్పంద పత్రం. భూతలంపైనా, సముద్రం మీదనూ వారి పడవలు మరియు బిడారాల బాధ్యత అల్లాహ్ మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)దే. అలాగే ఈ బాధ్యత ‘యహినా’కు మిత్రులైన సిరియా వారి కోసం కూడాను. అయితే, వారి ఏ వ్యక్తి అయినా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అతని ధనం అతని ప్రాణాన్ని రక్షించలేదు. అతని సొత్తును తీసుకున్నవాడికి అది ధర్మసమ్మతమే అవుతుంది. వారు ఏ ఒయాసిస్సుకు వెళ్ళడాన్నిగాని, భూమి మరియు సముద్ర మార్గం పై నడవడాన్నిగాని అడ్డుకోవడం జరుగదు.”
ఇదే కాకుండా మహనీయ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు)కు నాల్గు వందల ఇరవై ఉ’రోహకుల పటాలాన్నిచ్చి దూమతుల్ జందల్ పాలకుడు ‘ఉకైదిర్’ వద్దకు పంపించారు. వెళ్ళేటప్పుడు ఆయనతో, “నీవు వెళ్ళేటప్పటికి అతడు జింక వేటలో ఉండగా జూస్తావు” అని కూడా చెప్పారు. హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) కోట అగుపడేటంత దూరం వెళ్ళి ఆగిపోయారు. అనుకోకుండా ఓ జింక ఎక్కడి నుండో వచ్చి కోట ద్వారాన్ని కొమ్ములతో చెలుగుతోంది. ఉకైదర్ దాన్ని వేటాడడానికి బయటకు వచ్చాడు. వెన్నెల రాత్రి కావడం వలన, హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు), ఆయనగారి అనుచరులు అతణ్ణి పట్టుకొని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి తెచ్చారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతణ్ణి క్షమించి, రెండు వేల ఒంటెలు, ఎనిమిది వందల బానిసలు, నాల్గు వందల కవచాలు, నాల్గు వందల బరిశెలు ఇచ్చే షరతు పై ఒప్పందం కుదుర్చుకుని వదలివేశారు. అతను ఇక నుండి జిజియా కూడా కడతా నని ఒప్పుకున్నాడు. ఇలా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యహినాకు తోడు దూమా, తబూక్, అయిలా మరియు తైమాలతో షరతులతో కూడిన ఒప్పందాలు చేసుకున్నట్లయింది.
ఈ పరిస్థితులను గమనించి, ఇప్పటి వరకు రోమనుల చెప్పుచేతల్లో ఉన్న తెగలు, ఇక తమ పాత సంరక్షకులను నమ్ముకొని ఉండే కాలం చెల్లిపోయిందని తలచి ముస్లిములకు సహకరించనారంభించారు. ఈ విధంగా ముస్లిము సామ్రాజ్య సరిహద్దులు విస్తరించి నేరుగా రోమను సామ్రాజ్యంతో కలిసిపోయాయి. రోమనుల తొత్తులు చాలా మట్టుకు అంతమైపోయారు.
మదీనాకు తిరుగు ప్రయాణం
ఇస్లామీయ సేన ఎలాంటి యుద్ధం చేయకుండానే విజయకేతనం ఎగురవేస్తూ మదీనాకు తిరిగి వచ్చింది. అల్లాహ్, యుద్ధం విషయంలో మోమిన్ (విశ్వాసుల)కు అండగా నిలిచాడు. అయితే మార్గమధ్యంలో ఓ లోయ వద్ద పన్నెండుగురు మునాఫిక్ కు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను హతమార్చడానికి ప్రయత్నించారు. ఆయన అప్పుడు ఆ లోయగుండా వెళుతున్నారు. హజ్రత్ అమ్మార్(రదియల్లాహు అన్హు) ఒంటె ముకుత్రాడు పట్టుకొని ముందు నడుస్తున్నారు. హజ్రత్ హుజైఫా బిన్ యమాన్ (రదియల్లాహు అన్హు) ఒంటె వెనకాల నడుస్తూ దాన్ని తోలుతున్నారు. మిగిలిన సహాబాలందరూ దూరంగా, ఆ లోయ పల్లపు ప్రదేశం గుండా వస్తున్నారు. అందుకని మునాఫిలకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను హతమార్చే దుష్టావకాశం లభించిందనిపించింది. వారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వైపునకు రానారంభించారు. ఇటు ప్రవక్తగారి సహచరులిద్దరు మామూలుగా నడుస్తూనే ఉన్నారు. వెనుక నుండి ఎవరో వస్తున్నట్లు కాళ్ళ సవ్వడి వినబడింది. వీరంతా ముఖాలపై ముసుగులు కట్టుకొని దాడికి సిద్ధపడడం చూసి ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) హుజైఫా (రదియల్లాహు అన్హు)ను వారిని అడ్డగించడానికి పంపారు. ఆయన వారి వాహనాల ముఖాలపై తన బౌలుతో కొట్టనారంభించారు. అల్లాహ్, ఆయన వేసిన దెబ్బలకు భయపడి పోయేటట్లుగా చేయడం వలన వారు పారిపోయి తమ వారి వద్దకు చేరారు. ఆ తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పేర్లు చెబుతూ వారెందుకు వచ్చారో తెలియజేశారు. అందుకనే హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు)కు, ప్రవక్త ‘నమ్మిన బంటు’గా పేరుబడిపోయింది. ఈ సంఘటనకు సంబంధించే దివ్య ఖుర్ఆన్లో, “వారు చేయదలిచిన పనిని చేయలేకపోయారు” అనే వాక్యం అవతరించింది.
ప్రయాణం పూర్తిచేసి మదీనా దాపుకు రాగానే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మదీనా గురుతులు కానరాగా ఆయన, “అదిగో ‘తాబా’, అది ఉహద్ కొండ, మనల్ని ప్రేమించేది మనం దాన్ని ప్రేమిస్తున్న కొండ అదిగో” అని సంబరపడుతూ అన్నారు. ఇటు మదీనాలో ఆయన రాక గురించిన వార్త అందగానే స్త్రీలు, పిల్లలు, అమ్మాయిలంతా బయటకు వచ్చి ఎంతో ఘనంగా ఆ సైన్యానికి స్వాగతం పలకుతూ ఈ పద్యపాదాలను చదవనారంభించారు° (దాని భావం ఇలా ఉంది):
“సనీయతుల్ విదా దిగ్మండలం నుండి పొడిచిన పున్నమి చంద్రు డడిగో, మమ్మల్ని పిలిచేవాడు పిలుస్తున్నంత వరకు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవడం మన విధి.”
[ఇది ఇబ్నె ఖయ్యిమ్ గారి సూక్తి. దీనిపై చర్చ ఇది వరకే వచ్చింది]
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తబూక్ కు రజబ్ నెలలో బయలుదేరారు. తిరిగి వచ్చేటప్పటికి రమజాన్ నెల నడుస్తోంది. ఈ ప్రయాణం మొత్తం యాభై రోజుల ప్రయాణం. ఇరవై రోజులు తబూక్ లో గడిపినవి, ముప్ఫై రోజులు అక్కడికి వెళ్ళిరావడానికి జరిగిన ప్రయాణ రోజులు.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ జీవితకాలంలో స్వయంగా పాల్గొన్న గజ్వాల్లో ఈ గజ్వా చిట్టచివరి గజ్వా (పోరాటం).
ముకల్లిఫీన్ (యుద్ధంలో పాల్గొనకుండా వెనుక ఉండిపోయినవారు)
ఈ పోరాటం, దాని ప్రత్యేక పరిస్థితులననుసరించి, అల్లాహ్ తరఫున ఓ గట్టి పరీక్ష కూడాను. ఈ పోరాటం ద్వారా, విశ్వాసులెవరో, విశ్వాసులు కానివారెవరో తేలిపోయింది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా ఇలాంటి వారిని ఏరి చూయించడం అల్లాహ్ సంప్రదాయం. దివ్యఖుర్ఆన్ ఈ విషయాన్ని ఇలా సెలవిస్తోంది:
“మీరు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో అల్లాహ్ విశ్వాసులను ఏ మాత్రం ఉండనివ్వడు. ఆయన పవిత్రులను, అపవిత్రుల నుంచి తప్పకుండా వేరుచేస్తాడు.” (3:179)
కాబట్టి ఈ పోరాటంలో విశ్వాసులు, సత్యవంతులందరూ పాల్గొన్నవారే. ఆ యుద్ధంలో పాల్గొనకపోవడమంటే, అది నిఫా కు (కాపట్యానికి) గుర్తు. ఎవరైనా యుద్ధంలో పాల్గొనకుండా ఎందుకు ఉండిపోవలసి వచ్చిందో ఆ విషయాన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు విన్నవించుకునేవారు సహాబా (రదియల్లాహు అన్హుమ్). ఆయన దానికి జవాబుగా, “వదిలేయండి! అతని మనస్సులో శ్రేయం పొందాలనే కోరికే ఉంటే, అల్లాహ్ త్వరలోనే అతణ్ణి నా వద్దకు పంపించేస్తాడు. అలా కాకపోతే అతని నుండి అల్లాహ్ మిమ్మల్ని రక్షించినట్లే” అని అంటూ ఉండే వారు. ఎలాగైతేనేమి,యుద్ధసామగ్రి, వాహనాలులేక యుద్ధంలో పాల్గొనలేక పోయిన వారు కొందరైతే, మునాఫిక్ కు మరికొందరు. ఈ మునాఫిస్టు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విశ్వసించామని దొంగ నటన చేసినవారు. ప్రస్తుతం వారే దొంగసాకులు చెప్పి ఈ గజ్వాలో పాల్గొనకుండా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుమతిని పొంది వెనుక ఉండిపోయినవారు. మరికొందరైతే ఎలాంటి అనుమతి లేకుండానే ఇండ్లలో కూర్చుండిపోయారు. అయితే పోరాటంలో పాల్గొనకుండా మిగిలిపోయిన ముగ్గురు మాత్రం నిజమైన ముస్లిములు, గట్టి విశ్వాసం గలవారే. వారు ఎలాంటి కారణం లేకుండానే యుద్ధంలో పాల్గొనలేదు. వారిని అల్లాహ్ పరీక్షకు గురిచేసిన తరువాత వారి పశ్చాత్తాపాన్ని మన్నించడం జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
తిరుగు ప్రయాణం చేసి మదీనాకు చేరిన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎప్పటిలాగే మస్జిదె నబవీ కి వెళ్ళారు. అక్కడ రెండు రకాతుల నమాజు చేశారు. ప్రజలు చుట్టుముట్టగా అక్కడనే కూర్చుండిపోయారు. ఇటు మునాఫిక్లులు – వారు ఎనభై మందికంటే ఎక్కువే.”(*) ఒకరి తరువాత ఒకరు వచ్చి ఏదో సాకులు చెప్పనారంభించారు. అల్లాహ్ పై ప్రమాణాలు చేస్తూ తాము రాలేకపోయిన విషయాన్ని వివరిస్తున్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు పైకి చెప్పే దాన్ని స్వీకరించి వారితో బైక్ కూడా చేస్తూ వారి మన్నింపు కోసం దైవాన్ని ప్రార్థిస్తున్నారు. వారి మనస్సులోని విషయాన్ని దైవానికే వదలివేశారు
(*) వాకిదీ కథనం ప్రకారం, ఈ సంఖ్య అన్సారులలోని మునాఫిక్ లది. వారే కాకుండా బనీ గిఫ్ఫార్ వగైరా బద్దూ తెగల వారి సంఖ్య ఎనభై ఇద్దరు. అబ్దుల్లాహ్ బిన్ ఉబై, అతని సహచరులు వారికి అదనం. వారు కూడా చాలా మందే ఉన్నారు. (చూడండి, ఫహుల్ బారి-8/119)
ఇక మిగిలిన వారు ముగ్గురు మోమిన్లు, సత్యసంధులు – అంటే హజ్రత్ కఅబ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు), మురారా బిన్ రబీ (రదియల్లాహు అన్హు), హిలాల్ బిన్ ఉమయ్యా (రదియల్లాహు అన్హు)లు- వారు నిజాన్నే అనుసరిస్తూ, “మేము ఎలాంటి కారణం లేకుండానే పోరాటంలో పాల్గొనలేదు” అని ఉన్న విషయం మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు విన్నవించుకున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ఈ ముగ్గురు వ్యక్తులతో ఎలాంటి సంభాషణ చేయవద్దని సహాబా (రదియల్లాహు అన్హుమ్)ను ఆదేశించారు. కాబట్టి ఈ ముగ్గురికి వ్యతిరేకంగా తీవ్రమైన బాయికాట్ (సామాజిక వెలి) ప్రారంభం అయింది. ప్రజలంతా ఒక్కసారే మారిపోయారు. జీవితం భయంకరంగా మారిపోయింది. ఇంత పెద్ద వైశాల్యం గల భూమి ఒక్కసారే ఇరుకైనట్లనిపించింది వారికి, అదేకాదు ప్రాణాలు కూడా పోయేటంత గడ్డు పరిస్థితి ఏర్పడింది. అలా నలభై రోజులు గడిచిన తరువాత భార్యల వద్దకుపోవడం కూడా మానుకొమ్మనే ఆదేశం వెలువడింది. బాయికాట్ కు సంబంధించిన యాభై రోజులు పూర్తి అయిన తరువాత అల్లాహ్ వారి తౌబా స్వీకరించబడినట్లు శుభవార్త అందించాడు. దివ్యఖుర్ఆన్ లోని ఈ శుభవార్త వాక్యాలు ఇలా ఉన్నాయి.
“ఇంకా వ్యవహారం వాయిదా వేయబడిన ఆ ముగ్గురిని కూడా ఆయన క్షమించాడు. ఇంత పెద్ద వైశాల్యం కలిగి ఉండి కూడా, భూమి వారికి ఇరుకై పోయింది. వారి ప్రాణాలు కూడా వారికి భారమైపోయాయి. అల్లాహ్ నుండి తమను కాపాడుకోవడానికి స్వయంగా అల్లాహ్ కారుణ్యం తప్ప వేరే ఆశ్రయం ఏదీ లేదని వారు తెలుసుకున్నారు. అప్పుడు అల్లాహ్ కనికరంతో వారి వైపునకు మరలాడు, వారు ఆయన వైపునకు మరలి వచ్చేటందుకు. నిశ్చయంగా ఆయన చాలా క్షమించేవాడు, కరుణించే వాడూను.” (9 : 118)
ఈ తీర్పు వెలువడగానే ముస్లిములందరూ సాధారణంగానూ, ఆ ముగ్గురు సహాబాలు (6) ప్రత్యేకంగాను సంబరపడిపోయారు. ప్రజలు పరుగున వచ్చి వారికి ఈ శుభవార్తను అందించనారంభించారు. వారి ముఖాలు ఆనందాతిశయంతో విప్పారిపోయాయి. ప్రజలు వారికి కానుకలు అర్పించనారంభించారు. నిజం చెప్పాలంటే ఆ రోజు వారికి ఎంతో విలువైన రోజు.
అలాగే మరెవరైతే చేతకాక వివశులై ఆ సంగ్రామంలో పాల్గొనలేక పోయారో వారిని గురించి అల్లాహ్ ఈ క్రింది ఆయత్ లను అవతరింపజేశాడు.
“వృద్ధులు, వ్యాధిగ్రస్తులూ, పోరాటంలో పాల్గొనడానికి దారి భత్యాలు లేని వారూ ఒకవేళ వెనుక ఉండిపోతే ఏ దోషమూ లేదు. వారు చిత్తశుద్ధితో అల్లాహూ, ఆయన ప్రవక్తకూ విశ్వాసపాత్రులుగా ఉన్నంతవరకు. అటువంటి సజ్జనుల పట్ల ఆక్షేపణకు ఏ ఆస్కారమూ లేదు. అల్లాహ్ మన్నించేవాడూ, కరుణించేవాడూను.” (9 : 91,92)
మదీనాకు దాపుగా వచ్చినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి విషయంలోనే, “మదీనాలో కొందరున్నారు. వారు మీరు ఏయే ప్రదేశాల నుండి ప్రయాణం చేశారో, ఏ లోయల్ని దాటారో అప్పుడు మీ వెంటే ఉన్నారు, వారిని కొన్ని అనివార్య కారణాలు మీ వెంట రాకుండా చేశాయి” అని అనగా, “ఓ దైవప్రవక్తా! వారు మదీనాలో ఉంటూనే మన వెంట ఉన్నారా?” అని అడిగారు అనుచరులు. “అవును, మదీనాలో ఉండి కూడా వారు మీ వెంటే ఉన్నారు” అని సమాధానమిచ్చారు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
ఈ పోరాట ప్రభావం
ఈ సంగ్రామం అరేబియా ద్వీపంపై, ముస్లిముల ప్రభావం విస్తరింప జేయడానికి, బలం చేకూర్చడానికి ఎంతో దోహదపడింది. ఇక అరేబియా ద్వీపంలో ఇస్లామ్ శక్తి తప్ప మరే శక్తి జీవించి ఉండజాలదు అనే విషయం ప్రజల మనస్సుల్లో నాటుకుపోయింది. ముస్లిములకు వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు పన్నుతూ అదను కోసం ఎదురుచూస్తున్న మునాఫిక్ ఆశలు కూడా అడియాసలైపోయాయి. వీరు రోమను సామ్రాజ్యంపై పెట్టుకున్న
ఆశలు ఈ సంగ్రామంతో అడుగంటిపోయాయి. అందుకని వారి ధైర్యం కాస్తా సన్నగిల్లి, యదార్థం ముందు మోకరిల్లడం తప్ప మరే మార్గం వారికి లభించలేదు.
ఇలాంటి పరిస్థితి ఏర్పడిన తరువాత ఇక ముస్లిములు, మునాఫిక్స్ ఎడల మృదువైఖరిని అవలంబించే అవసరమే లేకుండాపోయింది. అల్లాహ్ వారి ఎడల కఠిన వైఖరిని అవలంబించమని ఆదేశం ఇస్తూ, చివరకు వారు ఇచ్చే దానధర్మాలను కూడా స్వీకరించడంగాని, వారి జనాజా నమాజు చేయడం గాని, వారి మన్నింపు కోసం ప్రార్థించడంగాని చేయవద్దని ఆదేశించడం జరిగింది. అలాగే వారి సమాధుల వద్దకు కూడా వెళ్ళవద్దని, మస్జిద్ పేరు మిద వారేదైతే కుట్రల గూడు కట్టుకున్నారో దాన్ని పడవేయమని ఆదేశిం చాడు. వాటి గురించి అవతరింపజేసిన ఆయలు వారిని పూర్తిగా బట్టబయలు చేసివేశాయి. ఇక వారిని గుర్తించడంలో ఎలాంటి పొరపాటు లేకుండా పోయింది. అంటే, ఈ ఖుర్ఆన్ ఆదేశాలు, మదీనా ప్రజలు తెలుసుకునేటట్లు వారి బండారం బయట పెట్టాయన్నమాట.” *
* ఈ గజ్వా (సంగ్రామం) గురించిన వివరాలు ఈ క్రింది ఆధారాల నుండి గ్రహించ బడ్డాయి. ఇబ్నె హషామ్-2/515 – 517, జాదుల్ ముఆద్-3/2 – 13; సహీ బుఖారి -2/633 – 637, 1/252, 414 వగైరా; సహీహ్ ముస్లిమ్ షరా నూవీ-2/246; ఫత్ హుల్ బారి-8/110 – 126, ముక్తసరుస్సీరత్- షేక్ అబ్దుల్లాహ్, పుట. 291 – 407)
ఈ సంగ్రామానికి సంబంధించి అవతరించిన ఖుర్ఆన్ ఆదేశాలు
ఈ గజ్వాకు సంబంధించి తౌబా సూరా (కౌ అధ్యాయం)లో అనేక ఆయలు అవతరించాయి. కొన్ని గజ్వాకు బయలుదేరక పూర్వం అవతరిస్తే, మరికొన్ని బయలుదేరి వెళ్ళిన తరువాత ప్రయాణ సందర్భంగాను, మరికొన్ని మదీనాకు తిరిగి వచ్చిన తరువాతనూ అవతరించాయి. ఈ ఆయత్ లలో చిత్తశుద్ధిగల విశ్వాసుల ఔన్నత్యం ఎలాంటిదో చెప్పడం జరిగింది. అదే కాకుండా, ఈ ఆయత్ లలో, గజ్వాలో పాల్గొన్నవారు, గజ్వాలో పాల్గొనలేక పోయిన విశ్వాసులు, సత్యసంధుల తౌబా (పశ్చాత్తాపం) స్వీకరించబడిన విషయమూ వగైరాలు ఉన్నాయి.
ఆ సంవత్సరపు కొన్ని ప్రముఖ సంఘటనలు
ఆ సంవత్సరం (అంటే హిజీ శకం 9)లో చారిత్రాత్మకమైన సంఘట నలు అనేకం చోటు చేసుకున్నాయి.
1. తబూక్ నుండి తిరిగివచ్చిన తరువాత, ఉవైమిర్ అజ్ఞానీ మరియు ఆయన భార్య నడుమ ‘లిఆన్’ (రంకు విషయమై ఏర్పడిన జగడం) జరిగింది.
2. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో తాను వ్యభిచరించినట్లు చెప్పిన స్త్రీకి ‘రజ్మ్’ (రాళ్ళతో కొట్టి చంపే శిక్ష) వేయబడింది. ఆ స్త్రీ పురుడు పోసుకొని, పిల్లవాడు పాలు త్రాగడం మానినప్పుడు గాని ఆమెను రజ్జ్ చేయడం జరగలేదు.
3. అబిసీనియా చక్రవర్తి ‘అస్మహా నజాషీ’ మరణించగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన ‘గాయిబానా’ (పరోక్ష) నమాజె జనాజా చేశారు.
4. ఆ సంవత్సరమే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి పుత్రిక ఉమ్మె కుల్సూమ్ (రదియల్లాహు అన్హా) చనిపోయారు. ఆమె మరణం మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను శోకసముద్రంలో ముంచివేసింది. తన అల్లుడు హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)తో ఆయన(సల్లల్లాహు అలైహి వసల్లం), “ఒకవేళ నాకు మూడవ కుమార్తె ఉండి ఉంటే ఆమె వివాహం కూడా నీతో చేసేవాన్నే” అన్నారు.
5. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తబూక్ నుండి తిరిగివచ్చిన తరువాత మునాఫిక్స్ సర్దారు అబ్దుల్లా బిన్ ఉబై చనిపోయాడు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని మన్నింపు కోసం దుఆ చేశారు. హజ్రత్ ఉమర్(రదియల్లాహు అన్హు) ఆయన్ను వారిస్తున్నప్పటికీ అతని నమాజె జనాజా చేశారు. ఆ తరువాత దివ్యఖుర్ఆన్లో, హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ను బలపరుస్తూ, మునాఫిక్స్ నమాజె జనాజా చేయకూడదనే ఆదేశం అవతరించింది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.