మహాశయలారా! మీలాదున్నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉత్సవాలు జరుపుకొనుట ధర్మమేనా కాదా అన్న సందేహాన్ని దూరము చేసుకొనుటకు ఈ క్రింది విషయాల్ని చదువుతే చాలా బావుంటుంది.
1. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం ఇలా ఉందిః
(مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ فِيهِ فَهُوَ رَدٌّ ) “ఎవరు మా ఈ ధర్మంలో లేని విషయాన్ని కొత్తగా పుట్టిస్తాడో అది రద్దు చేయ బడుతుంది“. (బుఖారి 2697, ముస్లిం 1718).
సోదరా! మీలాదున్నబీ ఉత్సవం ప్రవక్త కాలంలో కనీసం ఒక్కసారైనా జరగలేదు. అంతే కాదు బుఖారి (2651) మరియు ముస్లిం (2533)లోని హదీసు ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ మూడు కాలల గురించి అవి ఉత్తమమైనవి అని తెలిపారో ఆ కాలాల్లో కూడా ముస్లింలు మీలాదున్నబీ జరుపుకో లేదు. అందుకే నలుగురు ఖులఫాయే రాషిదీన్ హయాంలోగాని, ఆ తర్వాత 70 సంవత్సరాల వరకు ఉన్న సహాబాల కాలంలోగాని లేదా వారి శిశ్యులైన తాబిఈన్ కాలంలోగాని ఆ తర్వాత నలుగురు గొప్ప ఇమాముల కాలంలోగాని మీలాదున్నబీ ఉత్సవాలు జరిగినట్లు చరిత్ర పుటల్లో ఏ ఒక్క చిన్నపాటి ఆధారం అయినా లభించదు.
అందుకే పండితులు దీనిని దురాచారం అంటారు.
మరో విధంగా గ్రంహించగలుగుతే: సహాబాలు (ప్రవక్త సహచరులు) ప్రవక్త పట్ల మనకంటే అధికంగా ప్రేమగలవారన్న విషయంలో ఏలాంటి సందేహం లేదు కదా? అయితే వారు దీనిని పాటించనప్పుడు మనం పాటించడం ఎంత వరకు సమంజసం?
2. మనం దీనిని ఉత్సవంగా జురుపుకుంటున్నామంటే, సంవత్సరంలో ఎన్ని ఉత్సవాలు జరుపుకోటానికి ప్రవక్త మనకు ఆదేశించారన్నది ఎప్పుడైనా ఆలోచించామా? అబూదావూదు (1134), నిసాయీ (1556)లోని ఈ హదీసును గమనించండిః
అనస్ బిన్ మాలిక రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చినప్పుడు, వారు (సంవత్సరంలో) రెండు రోజులు ఆటపాటల్లో గడుపుకునే వారు. ఈ రెండు రోజుల సంగతేమిటి? అని ప్రవక్త వారిని అడిగినప్పుడు వారన్నారుః మేము అజ్ఞానకాలం నుండి ఈ రెండు రోజులు ఆటపాటల్లో గడుపుకునేవాళ్ళము. అప్పుడు ప్రవక్త చెప్పారుః “ఆ రెండు రోజులకు బదులుగా అల్లాహ్ మీ కొరకు వాటికంటే మేలైన మరో రెండు రోజులు ప్రసాదించాడు. అవి: ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అజ్హా” (అంటే రమజాను పండుగ మరియు బక్రీద్ పండుగ).
గ్రహించండి సోదరులారా! ఈ రెండు పండుగలు వారు జరుపుకునే ఉత్సవాల కంటే మేలైనవని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అయితే మీలాదున్నబీ గురించి ప్రవక్త ఏమైనా చెప్పారా? అందుకే దానిని ప్రతి సంవత్సరం ఉత్సంగా జరుపుకోవడం, ఆ దినానికంటూ ఓ ప్రత్యేకత ఇవ్వడం ఏ మాత్రం ధర్మం కాదు. ఇంతే కాదు ఇస్లాం ధర్మం సంపూర్ణం అయింది గనుక అందులో అదనంగా చేర్చడానికి ఏ అవకాశమూ లేదు. చదవండి అల్లాహ్ ఆదేశం:
الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الإِسْلاَمَ دِيناً]. {المائدة 3} ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు ఇస్లాంను మీ ధర్మంగా అంగీకరించాను. (మాఇద 5: 3).
ఈ స్పష్టమైన ఆయతు చదివిన తర్వాత కూడా మీలాదున్నబీ చేయాలనే దృఢ నమ్మకం మీద ఉన్నామంటే ఇక ఈ క్రింది మూడిట్లో ఏదైనా ఒక ప్రమాదంలో పడినట్లేః
1. అల్లాహ్ ధర్మాన్ని పరిపూర్ణం చేశాడు కాని మీలాదున్నబీ గురించి చెప్పడం మరచిపోయాడు. అందుకే ఈ రోజు మేము చేస్తున్నాము. (అస్తగ్ఫిరుల్లాహ్, నఊజు బిల్లాహ్).
2. అల్లాహ్ దీని ఆదేశమిచ్చాడు కాని ప్రవక్త తెలుపడం లేదా చేయడం మరచిపోయారు. (అస్తగ్ఫిరుల్లాహ్, నఊజు బిల్లాహ్).
3. ప్రవక్త దాని గురించి చెప్పారు, లేదా దానిని చేశారు కాని సహాబాలందరు కలసి దానిని తమ వెనకవారికి తెలుపలేదు. వారూ స్వయంగా దానిని పాటించలేదు. (అస్తగ్ ఫిరుల్లాహ్, నఊజు బిల్లాహ్).రవ్వంతైనా విశ్వాసమున్న ముస్లిం ఇలా ఊహించగలడా?
3. ఈ రోజుల్లో సామాన్యంగా 12వ రబీఉల్ అవ్వల్ కే ప్రవక్త జన్మదినం అని అదే రోజు మీలాదున్నబీ ఉత్సవం జురుపు కుంటారు. అయితే 12కే ప్రవక్త మరణించారన్నది తిరుగులేని సత్యం. అయితే మీలాద్ చేసే వారు ప్రవక్త జన్మదిన వేడుకోలు జరుపుకుంటారా? లేదా తద్దినాలు జరుపుకుంటారా?
4. ఆ దినాన్ని పండుగరోజుగానే సామాన్య ప్రజలు భావిస్తున్నారు. అయితే పండుగరోజున ఉపవాసం ఉండటాన్ని ప్రవక్త నివారించారు. (బుఖారి 1990, ముస్లిం 1137). అలాగే జుమా రోజు వారపు పండుగ అందుకని ఆ రోజు ఉపవాసం కూడా నివారించడం జరిగింది. చూడండిః ముసన్నఫ్ ఇబ్ను అబీ షైబా.
ఇక సోమవారం నాటి ఉపవాసం గురించి ప్రవక్తను అడిగినప్పుడు అది నేను జన్మించిన రోజు అలాగే నాపై తొలివహీ అవతరించిన రోజు అని చెప్పారు. (ముస్లిం 1162). అంటే ప్రవక్త పుట్టిన రోజు సోమవారం వచ్చినప్పుడల్లా ఉపవాసం ఉడడం ప్రవక్త సంప్రదాయం. అయితే ఆ దినాన్ని పండుగగా చేసుకోవడానికి ఏమిటి బలమైన సబబు?.
5. మీలాద్ చేయకూడదనడానికి పై ఆధారాలే కాకుండా మరో బలమైన ఆధారం ఏమిటంటే క్రైస్తవులు క్రిస్మిస్ డే జరుపుకున్నట్లు మరియు ఇతరులు తమ ప్రవక్తల లేదా గొప్ప వ్యక్తుల జన్మదినాలు జరుపుకున్నట్లు అయిపోతుంది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఇతరుల పోలికలను అవలంబించుట నుండి నివారించారు. అంతేకాదు, అలా పాటించేవారు వారిలోనే కలసిపోతారని కూడా హెచ్చరించారు. చూడండిః అబూదావూద్ 4031.
మీలాద్ పై సంక్షిప్తంగా చారిత్రక దృష్టి:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభకాలంలో, సహాబాలు, తాబిఈన్ మరియు ఇమాముల సద్కాలాల్లో లేని ఈ మీలాద్ ఎప్పుడు మరెందుకు పుట్టింది? అన్న ప్రశ్న తలెత్తవచ్చు, అయితే శ్రద్ధగా చదవండి: అల్లాహ్ యొక్క గొప్ప దయతో దినదినానికి ఇస్లాం ధర్మం పురోగతిని చూస్తూ ఓర్వలేని ఇస్లాం శత్రువులు ఇస్లాం, మరియు ముస్లింలకు వ్యెతిరేకంగా ఏదో పన్నాగం పన్నుతునే ఉన్నారు. వాటిలోని ఓ పన్నాగమే ఇలాంటి దురాచారాలు.
ఉబైదియ్యీన్ అన్న పేరుగాంచిన దుర్మార్గులు, దుండగులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంవారి సుకుమార్తె అయిన ఫాతిమ రజియల్లాహు అన్హా వంశంలో వస్తారన్న భ్రమ ప్రజలకు కలిగేలా ఫాతిమీయ్యీన్ అన్న మారు పేరు పెట్టుకొని, 362వ హిజ్రీలో మిస్ర్ (EGYPT) దేశాన్ని కైవసం చేసుకున్నారు. సుమారు 567వ సంవత్సరం వరకు వారి ప్రభుత్వం అక్కడ కొనసాగింది. మీలాద్ బిద్అత్ వారి కాలంలోనే వారి ప్రోద్బలంతో మొదలయ్యింది. వారు బహిరంగంగా సహాబాలను ప్రత్యేకంగా అబూ బక్ర్, ఉమర్ మరియు ఉస్మాన్ రజియల్లాహు అన్హుంలను చెప్పరాని విధంగా దూషించేవారు. 381వ హిజ్రీలో మిస్ర్ లో ఒక వ్యక్తి వద్ద ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్ గారి మువత్త హదీసు గ్రంథం ఉన్నందు వల్ల అతన్ని విపరీతంగా బాధించి ఊరంతా తింపారు. ఇంకా ఎన్నో అఘాయిత్యాలు వారు జరిపారు. అయితే ఆ కాలంలో సరియైన ఉలమాలు కరువయి పోయారా, వారు అలాంటి దురాచారాలకు ఏమీ అడ్డుగోడగా నిలవలేదా అని ఎవరికైనా అనుమానం రావచ్చు, అయితే ఆ కాలంలోని ధర్మపండితులు ఆ దురాచారాల నుండి వారించారు, వాటికి ఎదురుగా నిలబడ్డారు. కాని ప్రభుత్వ పరంగా ఈ దురాచారానికి సపోర్ట్ లభించడం వల్ల అది ప్రభలిపోయింది. ఈ వివరాలన్నిటినీ ఈ పాంఫ్లేటులో వ్రాయడానికి స్థలం సరిపోదు. వివరాలు కోరినవారు హాఫిజ్ ఇబ్ను కసీర్ రచణ ‘అల్ బిదాయ వన్నిహాయ’లో 402వ సంవత్సరంలోని సంఘటనలు చదవండి.
ఆ తర్వాత హిజ్రీ అరవ శతాబ్దంలో ఇరాఖ్ లోని మూసిల్ అన్న ప్రాంతంలో అబూ సఈద్ కౌకబూరీ అన్న రాజు ఈ బిద్అత్ ను పునరారంభించాడు. ఆ రోజు దూబారా ఖర్చులతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. భారత ఖండంలో ముఘల్ పరిపాలన కాలంలో ఈ బిద్అత్ కాళ్ళు మోపింది.
కొందరు మీలాద్ చేయుట ధర్మం అని కొన్ని కుంటి సాకులు తీసుకొచ్చి చూడండి మేము కూడా ఖుర్ఆన్ ద్వారా రుజువు చేస్తామని ప్రజల్ని మోసగిస్తారు. రండి వాటి వాస్తవికతను కూడా సంక్షిప్తంగా తెలుసుకుందాము.
వారి వద్ద ఉన్న ఆధారాల్లో వారి భ్రమ ప్రకారం అతి గొప్ప ఆధారం ఖుర్ఆన్ యొక్క సూర యూనుస్ లోని 58వ ఆయతుః
“ఇలా తెలియజేయండి: (ప్రజలు) అల్లాహ్ యొక్క ఈ అనుగ్రహం మరియు ఆయన ఈ కారుణ్యం వల్ల సంబరపడాలి. ఇది వారు కూడబెట్టే వాటన్నిటికంటే ఉత్తమమైనది”. (సూర యూనుస్ లోని 58వ ఆయతు)
దీని వ్యాఖ్యానంలో వారు ఇలా అంటారు: అల్లాహ్ అనుగ్రహం, కారుణ్యం లభించినప్పుడు సంతోషపడాలని ఆదేశించడం జరిగింది. అయితే ప్రవక్త మొత్తం విశ్వానికే కారుణ్యమూర్తి అన్న విషయం జగమెరిగినదే, అందుకే ఆయన జన్మదినాన మేము సంతోష సభలు ఏర్పాటు చేస్తాము’.
అయితే దీని సమాధానం శ్రధ్దగా చదవండిః
1. ఈ ఆయతు ఈ రోజు మనపై అవతరించలేదు. ఆ నాడు ప్రవక్త పై అవతరించింది. దీని అవతరణ తర్వాత ప్రవక్త 10, 11 సంవత్సరాలు, ఆ తర్వాత సహాబాలు వంద సంవత్సరాలు జీవించారు. అయితే వారు ఈ ఆయతు యొక్క ‘ఈ’ భావం తెలుసుకో లేకపోయారా? లేదా తెలిసికూడా పాటించలేదా?
2. దీనికి ముందు ఉన్న 57వ ఆయతును కలిపి చదువుతే కూడా వారి భ్రమ తొలిగిపోతుంది.
అసలే ప్రవక్త మరియు ఆయన సహచరులు ఇంకా ఇమాములు మీలాద్ చేయనప్పుడు, ఆధారాల పేరిట ఎన్ని విషయాలు తెచ్చినా అవి సరితూగవు.
మహాశయులారా! ఖుర్ఆన్ అవతరింపజేసింది అల్లాహ్ యే. దాని అర్థభావాలను ప్రవక్తకు తెలిపింది కూడా అల్లాహ్ యే. (చూడండి సూర ఖియామ 75:19). ఆ తర్వాత ప్రవక్త సహాబాలకు తెలియజేశారు. అందుకు మనం అజ్ఞానంగా పాటిస్తున్న దురాచారాలను విడనాడడంలోనే మనకు మోక్షం లభిస్తుంది. వాటిని దురాచారం అని తెలుసుకోకుండా వాటిని ధర్మ కార్యాలని భావించి, ఇతరులపై అవి రుద్దుటకు కుంటి సాకులను వెతికి తేవడం అత్యంత పాపకార్యం.
అల్లాహ్ మనందరికి ఆయనకు ఇష్టమైన రీతిలో ప్రవక్త అనుకరణ భాగ్యం, మరియు అన్ని రకాల బిద్అత్ (దురాచారా)లకు దూరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక! అమీన్!!
మీలాదున్ నబీ గురించిన ప్రశ్నలు – షేఖ్ ఇబ్ను ఉసైమీన్ (రహిమహుల్లాహ్)
మీలాదున్ నబీ (ప్రవక్త గారి పుట్టిన రోజు పండగ) ఉత్సవం జరుపుకునేవారితో కూర్చుండుట
షేఖ్ గారు! మీలాదున్ నబీ ఉత్సవం బిద్అత్ అని మీరు తెలిపారు, అయితే ఈ బిద్అత్ చేస్తూ మస్జిదులో ప్రవక్త చరిత్ర గురించి ప్రసంగాలు చేసేవారి వద్ద కూర్చుండేవారి గురించి ఏమిటి ఆదేశం అని షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లాహ్ గారిని ప్రశ్నించడం జరిగింది.
జవాబు:
ఎవరు బిద్అత్ లో పాల్గొంటారో వారికి దానికి తగిన పాపం కలుగుతుంది. వారి ఆ మీలాద్ ఉత్సవంలో పాల్గొనుట ఏ ముస్లింకి తగదు, జాయెజ్ లేదు. ఎందుకనగా అది బిద్అత్. ఏ బిద్అత్ గురించైతే ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) అది దుర్మార్గం (మార్గభ్రష్టత్వం) అని తెలియబరచారో అలాంటి బిద్అత్ లో, వారితో కూర్చుండుట మనిషి ఎలా ఇష్టపడతాడు?
(లిఖాఉల్ బాబిల్ మఫ్ తూహ్ 131/17)
మీలాదున్ నబీ ఉత్సవం జరుపుకునే మరియు అది జరుపుకోవాలని ఆహ్వానించే వారి పట్ల మన బాధ్యత ఏమిటి?
షేఖ్ గారు! ఒక ఖతీబ్ (ప్రసంగీకుడు) గత జుమా ఖుత్బాలో వారు ప్రక్కన ఉన్న రాష్టంలో మీలాద్ జరుపుకోటానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలియజేశాడు. అయితే మేము ఆ రాష్టంలో వలసదారులం, మా బాధ్యత ఏమిటి? (అని షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లాహ్ గారిని ప్రశ్నించడం జరిగింది)
జవాబు:
ఇది సత్యం కాదు, బిద్అత్ అని నీవు స్పష్టపరిచగలిగితే చాలా మంచిది. అల్లాహ్ దయ వల్ల మీలాద్ ఉత్సవం బిద్అత్ అని నిరూపించడం చాలా సులభం. ఎలా అనగా నీవు చాలా సులభంగా ప్రశ్నించగలుగుతావు (ప్రశ్నించి చూడు): మీలాద్ ఉత్సవం ప్రవక్త చేశారా? ఖలీఫాలు చేశారా? సహాబాలు చేశారా? తాబిఈన్లు చేశారా? నలుగురు ఇమాములు చేశారా? అతను గనక ‘అవును’ అంటే, దలీల్ (ప్రూఫ్, రుజువు) చూపించమను. చూపించు దలీల్! అతను గనక ‘దలీల్ లేదు, కాని ప్రజలు చేస్తుంటారు’ అని అంటే, నీవు చెప్పు: ప్రజలు చేసేది దలీల్ కాదు. ప్రజలు ఎన్నో బిద్అత్ పనులు చేస్తున్నారు, వాటికి ఏ దలీల్ లేదు. ప్రవక్త చేయలేదు, ఖలీఫాలు చేయలేదు, సహాబాలు చేయలేదు, తాబిఈన్లు చేయలేదు, ఇమాములు చేయలేదు, అందుకు అది కచ్ఛితంగా అధర్మం, అసత్యం. ఎందుకని వారు (అంటే ప్రవక్త, ఖలీఫాలు, సబాలు…) చేయలేదు, ఇది చేయాలని ప్రజలకు తెలుపలేదు? వారికి దాని గురించి తెలియదా? లేక వారు గర్వాహంకారంతో తిరస్కరించారా? ఈ విధంగా వారితో నీవు మాట్లాడావు, చర్చించావంటే వారిని ఖండించినట్లే
మీలాదున్నబీ ఉత్సవం జరుపుకోవడం ద్వారా ముస్లిముల మధ్య ఐక్యత ఏర్పడుతుందా?
అల్లాహు అక్బర్! ఇది సరియైన మాట కాదు. దీని వల్ల ప్రజలు మరింత విభజనకు గురి అవుతారు. గుర్తించుకోండి! బిద్అత్ ద్వారా ఐక్యత ఏర్పడడం అసాధ్యం. మరో ముఖ్య విషయం ఏమిటంటే: హృదయాలు కలుపుటకు, ఐక్యతకు అల్లాహ్ తెలుపని విషయాన్ని కనుగొన్నవారై బిద్అత్ ను పుట్టించిన పాపంలో పడతారు. మన మధ్య ఐక్యత, మన హృదయాలు పరస్పరం కలిసి ఉండుటకై అల్లాహ్ ప్రతి రోజు ఐదు పూటల నమాజు విధిగావించాడు. దానిని మనం అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో, ప్రవక్త పద్ధతిలో నెరవేర్చామంటే సరిపోతుంది. దాని ద్వారా హృదయాల్లో ఐక్యత జనిస్తుంది.
(లిఖాఉల్ బాబిల్ మఫ్ తూహ్ 37/12, 1/416, 4/2).
మీలాద్ ఉత్సవం ప్రవక్త జ్ఞాపకార్థం చేయవచ్చా?
మీలాద్ ఉత్సవం ప్రవక్త జ్ఞాపకార్థం చేస్తున్నామని, అందుకు ఇది బిద్అత్ కాదు మంచి విషయం అని కొందరనుకుంటారు, అలాంటి వారికి షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లాహ్ ఇచ్చిన జవాబు యొక్క సారాంశం మీకు తెలుగులో తెలుపుతున్నాము:
న్యాయంగా ఆలోచించండి, మనం ప్రతి రోజు అయిదు సార్లు ‘అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్’ అని ప్రవక్తను గుర్తు చేయట్లేదా? వుజూ చేసిన ప్రతీ సారి ప్రవక్తను గుర్తు చేయట్లేదా? ప్రతి నమాజులో ‘అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతుహు అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహిస్సాలిహీన్ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వఅష్ దహు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహు’ అని ప్రవక్తను గుర్తు చేయట్లేదా? ఒక్కమాటలో చెప్పాలంటే ఏ సత్కార్యం చేసినా ఇఖ్లాస్ తో పాటు ముతాబఅ (ప్రవక్త అనుసరణ) తప్పనిసరి, ఇవి రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా ఆ సత్కార్యం అల్లాహ్ వద్ద ఆమెదించబడదు. ఇలా ఒక్క రోజులో అనేక సార్లు అల్ హందు లిల్లాహ్! మనం ప్రవక్తను నాలుకతో గుర్తు చేస్తున్నాము, ఆచరణ పరంగా గుర్తు చేస్తున్నాము, అలాంటప్పుడు స్వయం ప్రవక్త, సహాబా, తాబిఈన్, ఇమాములు చేయని, ఇంకా బిద్అత్ లో పరిగణించబడే దానిని సంవత్సరంలో ఒక్కసారి జరుపుకుంటే ఏమిటి లాభం? లాభమేమీ ఉండదు, పాపమే మహా భయంకరంగా ఉంటుంది.
(లిఖాఉల్ బాబిల్ మఫ్ తూహ్ లో ఎన్నో సందర్భాల్లో ఈ విషయాలు తెలిపారు, ఉదాహరణకు చూడవచ్చు 37/12, 66/10, 131/7లో).
మీలాదున్నబీ ఉత్సవం ప్రవక్త గారి మీద ప్రేమతో జరుపుకుంటున్నట్టా?
మీలాదున్నబీ ఉత్సవం ప్రవక్త ప్రేమలో జరుపుకుంటాము, ప్రవక్త ప్రేమ గలవారే సన్మార్గంపై ఉన్నారు అని అనేవారు చాలా ముఖ్యమైన ఓ విషయం గమనించాలి. ప్రవక్త ప్రేమ మనపై విధిగా ఉంది, కేవలం విధియే కాదు, మన తల్లిదండ్రుల, సంతానం ప్రేమకంటే ఎక్కువగా ఉండాలి. కాని ప్రవక్త ప్రేమ అంటే ప్రవక్తకు అధిగమించి ముందుకు దూసుకెళ్ళడమా? ఆయన చెప్పనిది, చేయనిది చేసి ప్రేమ అని చాటుకోవడమా? కాదు, కాదు, ముమ్మాటికి కాదు. చదవండి అల్లాహ్ ఈ ఆదేశాన్ని: (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ”మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (ఆలి ఇమ్రాన్ 3:31). అల్లాహ్ మరో చోట ఇలా తెలిపాడు: కనుక అల్లాహ్ను విశ్వసించండి. సందేశహరుడు, నిరక్షరాసి అయిన ఆయన ప్రవక్తను కూడా విశ్వసించండి – ఆ ప్రవక్త అల్లాహ్ను మరియు ఆయన ఆదేశాలను విశ్వసిస్తాడు. అతన్ని అనుసరించండి. తద్వారా మీరు సన్మార్గం పొందుతారు. (ఆరాఫ్ 7:158).
మీలాద్ ఉత్సవం జరుపుకునే ఓ సోదరా! మరో విషయం గమనించు: నీవు అబు బక్ర్ , ఉమర్ , ఉస్మాన్ ,అలీ మరియు సహాబా (రజియల్లాహు అన్హుం)ల కంటే ఇంకా తాబిఈన్, తబఎ తాబిఈన్ల కంటే ఎక్కువగా ప్రవక్తను ప్రేమిస్తావా? నీవు ‘అవును’ అంటే నీకంటే అబద్ధపుకోరు మరొకడు లేడు. ‘లేదు’ అంటే, వారు చేయనిది నీవు చేయకు, వారు మీలాద్ చేశారా? లేదు, ముమ్మాటికి వారు చేయలేదు. ఇది హిజ్రీ నాల్గవ శతాబ్దంలో మొదలయిన బిద్అత్. ఇంతకంటే ముందున్నవారు చేయలేదంటే, వారు అజ్ఞానులా? లేదా వారు తెలిసి కూడా చేయలేదా? లేదా వారికి ప్రవక్త పట్ల ప్రేమ లేదా? నిజం ఏమిటంటే వారు అజ్ఞానులు కారు, తెలిసి కూడా వ్యతిరేకించలేదు, వారికి అధికమైన ప్రేమ ఉండింది. కాని ప్రవక్త చేయలేదు, చేయమని చెప్పలేదు గనకనే వారు చేయలేదు. అదే మనకు కూడా సరిపోయేది అంటే చేయకపోవడం.
ప్రేమ ఉంది అని మనిష్టమున్నట్లు చేయడం ధర్మం కాదు, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఇష్టమున్నట్లు చేయడమే నిజమైన ప్రేమ. సహీ హదీసులో వచ్చిన ఒక చిన్న సంఘటన గమనించండి: ఒక సందర్భంలో ప్రవక్త వుజూ చేస్తున్నప్పుడు క్రింద పడుతున్న నీళ్ళను సహాబాలు తమ చేతుల్లో తీసుకుంటూ తమ శరీరాలపై తుడుచు- కోవడం మొదలెట్టారు, ప్రవక్త ఇది చూసి, ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగారు, ‘అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ప్రేమలో’ అని వారన్నారు, అప్పుడు ప్రవక్త చెప్పారు: అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మిమ్మల్ని ప్రేమించాలని మీరు కోరుతుంటే: అమానతు హక్కుదారులకు ఇవ్వండి, మాట్లాడినప్పుడు సత్యమే పలకండి, పొరుగువారి పట్ల ఉత్తమంగా మసలుకోండి. (సహీహా: అల్బానీ 2998). ఈ హదీసులో మచ్చుకు మూడు విషయాలు తెలుపబడ్డాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే ప్రవక్త చెప్పనిది, చేయనిది చేయకుండా ఉండడమే నిజమైన ప్రేమ.
సంకలనం : ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో సూరత్ అల్-ఫాతిహా యొక్క ప్రాముఖ్యత మరియు దానిని ఉపయోగించాల్సిన సరైన పద్ధతుల గురించి వివరించబడింది. సూరత్ అల్-ఫాతిహా ఖురాన్లోని మొట్టమొదటి సూరా అని, దీనిని నమాజులోని ప్రతి రకాత్లో తప్పనిసరిగా పఠించాలని వివరించారు. అంతేకాకుండా, ఆరోగ్యం కోసం (రుఖ్యా) దీనిని పఠించడం సున్నత్ అని, దీనికి సహీహ్ బుఖారీలో ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
అయితే, సమాజంలో వ్యాపించి ఉన్న బిద్అత్ ఆచారాలు, అంటే వంటకాలపై ఫాతిహా చదవడం, మీలాద్లు, ఉర్సులు, మరియు ఇతర పండుగల పేరుతో చేసే ఆచారాలను ఖండించారు. పుణ్యపురుషుల పేరుతో చేసే ఇటువంటి పనులు షిర్క్ మరియు బిద్అత్ అని, అల్లాహ్ యే సర్వశక్తుడని, ఆయననే వేడుకోవాలని ప్రబోధించారు. చివరిగా, బిద్అత్ లేదా షిర్క్ ఆచారాలలో భాగంగా చేసిన ఆహారాన్ని తినకూడదని హెచ్చరిస్తూ, సన్మార్గంలో నడవాలని అల్లాహ్ ను వేడుకున్నారు.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
అల్ హమ్దులిల్లాహ్! ఫాతిహా గురించి ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. సంక్షిప్తంగా ఇక్కడ వచ్చిన ఒక ప్రశ్నకు సమాధానంగా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను, శ్రద్ధగా వింటారు అని మరియు ఖురాన్ హదీసు ప్రకారంగా సహీహ్ విషయాలపై ఆచరిస్తారు అని ఆశిస్తున్నాను. అల్లాహ్ మనందరికీ ఖురాన్ మరియు హదీసును అనుసరించేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక.
సాధారణంగా ప్రశ్న ఎలా వస్తుంది? ఫాతిహా ఎలా చేయాలి? ఫాతిహా చేసే పద్ధతి ఏంటి? కొంచెం తెలపగలరు. లేదా ఫాతిహా చేసిన అన్నం తినవచ్చా? ఫాతిహా చేసి ఉన్న ఏదైనా పదార్థం త్రాగవచ్చా? అన్నటువంటి ప్రశ్నలు ఉంటాయి. అయితే ముందు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సూరతుల్ ఫాతిహా దివ్య ఖురాన్ అల్లాహ్ పంపినటువంటి సత్య గ్రంథం, దివ్య గ్రంథం ఖురానే మజీద్లోని మొట్టమొదటి సూరత్.
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్, అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ నుండి మొదలవుతుంది. గైరిల్ మగ్ దూబి అలైహిమ్ వలజ్జాల్లీన్ పై సమాప్తమవుతుంది.
ఈ సూరా మనం ఎన్నో సందర్భాలలో చదివేది ఉంది. దీనిని సూరే ఫాతిహా అని అంటారు. ఖురాన్లో అల్ ఫాతిహా అన్న పేరుతోనే ఇది వ్రాయబడుతుంది. పోతే ఇంకా వేరే ఎన్నో ఘనతలు ఈ సూరాకు ఉన్నాయి, ఇంకా ఎన్నో పేర్లు కూడా ఉన్నాయి.
అయితే మనం రేయింబవళ్లలో, 24 గంటల్లో చేసేటువంటి ఐదు ఫర్జ్ నమాజులలో 17 ఫర్జ్ రకాత్లు ఏవైతే ఉన్నాయో, వాటిలోని ప్రతి ఒక్క రకాత్లో సూరే ఫాతిహా తప్పకుండా చదవాలి. మనం జమాత్ లో ఉండి నమాజ్ చేస్తున్నా గానీ, ఒంటరిగా చేస్తున్నా గానీ, ఇమామ్ గా ఉన్నా గానీ, ముక్తదీగా ఉన్నా గానీ. ఇది ఫాతిహా సూరా చదివేది నమాజులో.
ఇక నమాజులో కాకుండా ఆరోగ్యం పొందే ఉద్దేశంతో దీనిని చదవవచ్చు. సహీహ్ బుఖారీలో దీనికి ఆధారం అనేది ఉంది. ఎవరికైనా ఏదైనా పురుగు కాటేసింది లేదా ఏదైనా పాము, తేలు అట్లాంటిది లేదా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా నొప్పి ఉంది, శరీరంలో ఏదైనా బాధ ఉంది, అలాంటి వారు ఈ సూరా చదివి తమపై ఊదుకోవచ్చు. ఇక్కడ విషయం మరోసారి శ్రద్ధగా వినండి. స్వయం ఆరోగ్యం పొందాలన్న ఉద్దేశంతో స్వయం మనకు మనం ఈ సూరా చదివి మన శరీరంపై లేదా నొప్పి ఉన్న భాగంపై లేదా కాటేసిన చోటు మనం ఊదుకోవచ్చు. సాధారణంగా ప్రజలు ఏమనుకుంటారు? ఫలానా వారి దగ్గరికి వెళ్లాలి, వారు మనకు ఏదైనా మంత్రం చేయాలి, దువా చదవాలి, వారు చదివి ఊదాలి – ఇటువంటి విషయాలు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో పర్వాలేదు కానీ, సాధారణంగా మనం ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాలు నేర్చుకోవాలి.
బిద్అత్ మరియు ఫాతిహా
ఇక రండి కొన్ని సందర్భాలలో కొన్ని వంటకాలు చేసి ఏదైతే ఫాతిహా చేయడం అన్నటువంటి పదం మనలో చాలా ప్రబలి ఉందో శ్రద్ధగా వినండి సోదర సోదరీమణులారా. మీలాద్లు, ఉర్సులు, జాతరాలు, చాలిస్వాలు, బిస్వాలు, తీస్వాలు ఇలాంటివి, రజబ్ కే కుండే, ఇంకా ముర్దోం కీ ఈద్, బడోం కీ ఈద్, 15 షాబాన్, షబే బరాత్ ఇట్లాంటి ఇంకా ఎన్నో పేర్లతో ఏ ఏ బిద్అత్లన్నీ జరుగుతున్నాయో, సాధారణంగా అలాంటి బిదాత్లలోనే కొన్ని తిను పదార్థాలపై లేదా మంచి బిర్యానీలు, పలావులు, ఇంకా ఏదైనా తీపి పదార్థాలు వండుకొని ఏం చేస్తారు? అక్కడ ఫాతిహా అని చేస్తారు.
ఇక ఇందులో ఇలా చేసే వారు కొందరు మౌల్వీ సాబులు వారి వ్యక్తిగత లాభం కొరకు చేస్తారా, దేని కొరకు చేస్తారో అల్లాహ్ అందరికీ హిదాయత్ ఇచ్చుగాక. కానీ శ్రద్ధగా వినండి ఇలా ఇట్లాంటి బిద్అత్లు అవి చేయడమే నిషిద్ధం ఇస్లాంలో. ఎందుకంటే మొహర్రంలో పీరీల పండుగలు గానీ, ఆ తర్వాత నెలలో ఏదైనా చివరి బుధవారం అని, ఆ తర్వాత వచ్చే రబీ ఉల్ అవ్వల్ నెలలో మీలాద్ అని, ఆ తర్వాత వచ్చే రబీ ఉల్ ఆఖర్ నెలలో పీరానే పీర్ కా మహీనా గ్యార్వీ షరీఫ్ లో అని, ఇంకా లేదా రజబ్ లో రజబ్ కే కుండే 22 రజబ్ ఇమామ్ జాఫర్ సాదిక్ రహిమహుల్లా పేరుతో, కుండే మేరాజ్ యొక్క రాత్రి, ఇట్లాంటివి షాబాన్ లో ఇంకా 15 షాబాన్ షబే బరాత్ ఇట్లాంటివన్నీ కూడా బిద్అత్లు. ఈ బిద్అత్లు చేయడానికి ఇస్లాంలో అనుమతి ఏమాత్రం లేదు.
షిర్క్ మరియు ఇతర ఆచారాలు
ఇక ఆ బిద్అత్లు చేసి అందులో కొన్ని వంటకాలు చేసుకొని అందులో ఫాతిహాల పేరుతో ఏమైనా చేయడం కూడా నిషిద్ధం హరామ్ కిందికి వస్తుంది, అవన్నీ జాయెజ్ లేవు. కొందరు ఏమంటారో తెలుసా? మేము ఈసాలే సవాబ్ గురించి చేస్తున్నాము. మన పుణ్యాత్ములకు, పూర్వీకులకు, పుణ్యపురుషులకు, మన బంధువులలో చనిపోయిన వారికి పుణ్యం దొరకాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాము – ఇవన్నీ కేవలం బూటకపు మాటలు, కేవలం ఒక బిద్అత్ ను నడపడానికి పేర్లు మార్చి చేసేటువంటి కొన్ని పనులు. అందుకొరకు జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి వాటికి ఏ ఆధారాలు లేవు.
ఇక కొందరు మౌల్వీ సాబులు ఫాతిహా అన్న పేరుతో ఈ సూరే ఫాతిహా చదువుతారు, కుల్ హువల్లాహు అహద్ చదువుతారు, దరూద్ షరీఫ్ చదువుతారు, ఇంకా కొందరు ఇంకొన్ని పెంచుతారు, మరికొందరు కొన్ని తగ్గిస్తారు. ఆ తర్వాత ఇక ఫాతిహా అయిపోయింది, ఇక దీంట్లో చాలా బర్కత్ ఉంటుంది తినాలి అని అంటారు. మరికొందరు ఈ సూరాలు చదవడమే కాకుండా కొందరు అల్లాహ్ యొక్క వలీలు, అల్లాహ్ యొక్క భక్తులు ఎవరైతే గడిచిపోయారో, వారి పేర్ల మీద కొన్ని ప్రత్యేక పనులు చేస్తారు. ఇట్లాంటివి షిర్క్ వరకు చేరిపిస్తాయి. మొదటి విషయం ఏదైతే ఉందో కేవలం ఆ సూరాలు చదవడం ఖురాన్ లోని – ఇది బిద్అత్ కిందికి వస్తుంది, అది కూడా హరామ్. కానీ మరికొందరు ఏం చేస్తారు? పుణ్యపురుషుల పేర్లతో వాళ్ళ పేర్లు తీసుకొని మనం ఈ విధంగా చదివేది ఉంటే ఇంత ఇంత బర్కత్, ఇంత ఇంత శుభము, ఇంత ఇంత పుణ్యము లభిస్తుంది అన్నటువంటి మూఢనమ్మకాలలో ఉంటారు. వారికి అవన్నీ ఏమీ లభించవు, వాస్తవానికి అన్నీ ప్రసాదించేవాడు అల్లాహ్ యే. ఏదైనా పరీక్ష వచ్చినా గానీ అల్లాహ్ వైపు నుండే వస్తుంది. కానీ ప్రజలలో ఉన్న మూఢనమ్మకం ద్వారా వారు ఇలా చేస్తారు, ఇది షిర్క్ వరకు చేరిపిస్తుంది. అందుకొరకు మనం ఎలాంటి ఫాతిహాలు చేయకూడదు.
ఫాతిహా చేసిన ఆహారం తినవచ్చా?
ఇక మన ఇంటికి ఎవరైనా ఫాతిహా చేసిన వస్తువు తీసుకొచ్చి వస్తే ఇస్తే అవి తినాలా అని కూడా అడుగుతూ ఉంటారు. అయితే ఒకవేళ కేవలం బిద్అత్ కు సంబంధించినది అయ్యేది ఉంటే అది తీసుకోకూడదు. ఎందుకు? తీసుకోవడంలో ఒక బిద్అత్ కు, ఒక నిషిద్ధ కార్యానికి మనం సపోర్ట్ చేసే వాళ్లం అవుతున్నాము అని. కానీ ఏమీ తెలియకుండా వచ్చేసింది మనం తినేసాము, అల్లాహ్ క్షమించుగాక అని మనం ఇస్తిగ్ఫార్ చేసుకోవాలి.
ఇక ఒకవేళ నేను రెండో రకం ఏదైతే చెప్పానో చూడండి, ఆ ఫాతిహాలలో షిర్క్ లాంటి విషయాలు కూడా ఉంటాయి అని. అవి గైరుల్లాహ్ యొక్క పేరు కూడా అందులో తీసుకోవడం జరుగుతుంది. మరి ఖురాన్ లో నాలుగు చోట్ల అల్లాహ్ త’ఆలా గైరుల్లాహ్ యొక్క పేరు మీద, అల్లాహ్ యేతరుల పేరు మీద ఇట్లాంటి మొక్కుబడులు చేసిన వాటిని తినకూడదు అని నిషేధించాడు. అది షిర్క్ కిందకి వస్తుంది, దాని నుండి అయితే ఎట్టి పరిస్థితిలో కూడా మనం జాగ్రత్త వహించాలి.
అయితే ఈ ఫాతిహాకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు మీ ముందుకు వచ్చేసాయి అని నేను ఆశిస్తున్నాను. అల్లాహ్ త’ఆలా అన్ని రకాల చెడుల నుండి, అన్ని రకాల దురాచారాల నుండి ఇస్లాం యొక్క పేర్లు లేబుల్ లు తగిలించి చేసేటువంటి పనుల నుండి, ఇట్లాంటి మోసపూరితమైన మాటలు చేష్టల నుండి అల్లాహ్ మనందరినీ కూడా కాపాడుగాక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సరైన పద్ధతిని అనుసరిస్తూ అల్లాహ్ యొక్క ఆరాధన పూర్తి ఇఖ్లాస్ చిత్తశుద్ధి మంచి సంకల్పంతో చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక.
బారకల్లాహు ఫీకుమ్ వ జజాకుముల్లాహు ఖైరా. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వసల్లల్లాహు వ సల్లమ అలా నబియ్యినా ముహమ్మద్ వఅలా ఆలిహీ వసహబిహీ అజ్మయీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సమాహతుష్ షేఖ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్) గారిని క్రింది విధంగా ప్రశ్నించడం జరిగింది
ప్రశ్న: షేఖ్ గారు! “సున్నీ (అహ్లుస్ సున్నహ్ ) మరియు షీయాలో చిన్నపాటి విషయాల్లో తప్ప (మూల విషయాల్లో) ఏ భేదం లేదు” అని మీరన్నట్లు విన్నాము, ఇది నిజమేనా? కాదా? వాస్తవానికి సున్నీ మరియు షీయాలో విభేదాలున్నాయా?
షేఖ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్) గారి జవాబు:
ఇది చాలా విచిత్రం. ఇది అబద్ధం, అపనింద. –అల్లాహ్ ఇలాంటి వాటి నుండి రక్షించాలి- ఇది అసత్యం, ఇలాంటి ఏ మాట గాని, దీనికి ఇంచుమించు లేదా ఈ భావం గల ఏ మాట నా నుండి వెల్లలేదు. మా (సున్నీల) మధ్య మరియు వారి (షీయాల) మధ్య భూమ్యాకాశాల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఉంది. ప్రత్యేకంగా షీయాలో రాఫిదా , నుసైరియా మరియు వీరి లాంటి వర్గాల మధ్య (చాలా విభేదాలున్నాయి).
షియాలో ఎన్నో రకాలున్నాయి. ఒకే రకం కాదు. అనేక రకాలు, అనేక వర్గాలున్నాయి. షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహిమహుల్లాహ్ 22 వర్గాలు పేర్కొన్నారు. కొన్ని వర్గాలవారు దుర్మార్గంలో ఉన్నారు. కొందరు కేవలం అలీ (రదియల్లాహు అన్హు) గారు ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) కంటే ఘనతగలవారంటారు. మరి కొందరు అలీ (రదియల్లాహు అన్హు) గారు అబూబక్ర్, ఉమర్ (రదియల్లాహు అన్హుమా)ల కంటే ఉత్తములు అని అంటారు. కాని దూషించరు, అలీ (రదియల్లాహు అన్హు) గారిని పూజించరు, వారి విషయంలో అతిశయించరు (గులువ్వ్ చేయరు). వీరు కూడా షీయాలే, కాని వీరి విషయం చిన్నపాటి తేలిగ్గా ఉంది, వీరు సహాబాలలో అతిఉత్తములెవరన్న విషయంలో సున్నీలకు భిన్నంగా ఉండి, తప్పులో పడ్డారు కాని ధర్మపరంగా మహా ఘోరమైన నష్టంలో పడలేదు. వీరి దుర్మార్గం, నష్టం ఇతర వర్గాల మాదిరిగా కాదు.
షీయాలో కొందరు ముఆవియ (రదియల్లాహు అన్హు) గారిని దూషిస్తారు, వీరు కూడా పప్పులో కాలేసి, తప్పులో పడ్డారు, వీరికి దీని పాపం కలుగును.షీయాలో మరికొందరు ఆయిషా (రదియల్లాహు అన్హా) గారిని దూషిస్తారు. (వీరు మహా ఘోర పాపంలో పడ్డారు).
అయితే షీయాలో కొన్ని ‘బాతినీ’ వర్గాలున్నాయి (అంటే బాహ్యానికి భిన్నమైన ఆంతర్యం గలవారు). అలీ (రదియల్లాహు అన్హు) గారిని ఆరాధిస్తారు, పూజిస్తారు, ప్రవక్త కుటుంబీకులను పూజిస్తారు, వారితో మొరపెట్టుకుంటారు, వారికి మ్రొక్కుబడులు చెల్లిస్తారు, వారికి అగోచర జ్ఞానం గలదన్న నమ్మకం కలిగి ఉంటారు, సహాబాలను దూషిస్తారు, అంతేకాదు – నఊజుబిల్లాహ్ – సహాబాలు కాఫిర్లయ్యారనీ, ఇంకా సహాబాలు అలీ (రదియల్లాహు అన్హు) పై దౌర్జన్యం చేశారని, ప్రవక్త తర్వాత అలీకి రావలసిన ఖిలాఫత్ హక్కును ఆక్రమించుకున్నారని అంటారు. అయితే సహాబాలలో కేవలం అమ్మార్, సల్మాన్, మిక్దాద్ బిన్ అస్వద్ మరి కొందరు సహాబాలను దూషించరు.
సారాంశం ఏమిటంటే: షీయాలో వర్గాలున్నాయి. వారి మధ్య మరియు సున్నీల మధ్య స్పష్టమైన భేదాలున్నాయి. ప్రత్యేకంగా సున్నీల మరియు బాతినీ వర్గాల మధ్య.
సున్నీలు సహాబాలను స్నేహితులుగా, సన్నిహుతులుగా భావిస్తారు, వారిని ప్రేమిస్తారు, వారి ప్రస్తావన వచ్చినప్పుడు రదియల్లాహు అన్హు/మ్ అంటారు, వారు ముస్లిం సమాజంలో అత్యుత్తములు, ఉన్నత శ్రేణికి చెందిన ఘనతగలవారు అని విశ్వసిస్తారు.
ఇక షీయాలోని రాఫిదా, నుసైరియా మరియు వీరి లాంటి వర్గాలు సున్నీల విశ్వసానికి భిన్నంగా ఉన్నారు. సున్నీలు కేవలం ఏకైక అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తారు. అగోచరజ్ఞానం (ఇల్మె గైబ్) అల్లాహ్ కు తప్ప ఎవరికీ లేదు అని నమ్ముతారు.
కాని రాఫిదా, బాతినీ వర్గాలు ఈ విశ్వాసాలకు భిన్నంగా ఉన్నారు.సున్నీ షీయాల మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. మరిన్ని వివరాలు కోరే వారు షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా గారి “మిన్ హాజుస్ సున్నహ్“, అబ్దుల్లాహ్ ముహమ్మద్ గరీబ్ గారి “వజాఅ దౌరుల్ మజూస్“, అల్లామా ఏహ్సాన్ ఇలాహీ జహీర్ లాంటివారు వ్రాసిన పుస్తకాలు చదువవచ్చు. ఈ అంశానికి సంబంధించి మరెన్నో పుస్తకాలున్నాయి.
తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
سمعنا يا سماحة الشيخ أنك تقول بأنه ليس هناك فرقٌ بين أهل السنة والشيعة إلا ببعض الفروع، فهل هذا صحيح أم لا؟ وهل هناك فعلًا فرقٌ بين أهل السنة والشِّيعة؟
هذا من العجائب، هذا كذبٌ وافتراءٌ -نسأل الله العافية- هذا كذبٌ، ولم يصدر مني هذا الكلام، ولا قريب من هذا الكلام، بل بيننا وبينهم مثل ما بين السماء الأرض، ولا سيما بينهم وبين الرافضة، الرافضة والنُّصيرية وأشباههم طوائف باطنية.
والشيعة أقسام، هم ليسوا قسمًا واحدًا، أقسام كثيرة، وفِرَقٌ كثيرة، حتى ذكرهم شيخُ الإسلام اثنتين وعشرين فرقة، هم أقسام، بعضهم ضالٌّ، وبعضهم يُفضّل عليًّا فقط على عثمان، وبعضهم يُفضله على الصديق وعمر، لكن لا يسبُّون، ولا يعبدون عليًّا، ولا يغلون فيه، هؤلاء شيعة، لكن أمرهم سهل، لا يضرُّهم ذلك من جهة الدين، وإن كانوا قد أخطأوا في مخالفة أهل السنة في التفضيل، لكن لا يضرُّهم مثل ضرر الطوائف الأخرى.
ومنهم مَن يسبُّ معاوية، وهؤلاء أيضًا قد أخطأوا وغلطوا، وعليهم إثم ذلك، ومنهم مَن يسبُّ عائشة كذلك، لكن فيهم طوائف باطنية، يعبدون عليًّا، ويعبدون أهل البيت، ويستغيثون بهم، وينذرون لهم، ويعتقدون أنهم يعلمون الغيب، ويَسُبُّون أصحاب النبي صلى الله عليه وسلم، ويُكفِّرونهم، ويقولون: إنهم ظلموا عليًّا وأخذوا عنه الولاية، إلا النفر القليل من أصحاب النبي لا يسبُّونهم: كعمار وسلمان والمقداد بن الأسود ونفر قليل.
فالحاصل أن الشيعة أقسام، وبينهم وبين أهل السنة فرقٌ بعيدٌ، خصوصًا الباطنية منهم:
فأهل السنة يُوالون الصحابة، ويُحبُّونهم، ويترضون عنهم، ويعتقدون أنهم أفضل الأمة، وخير الأمة، والرافضة والنُّصيرية وأشباههم بضدِّ ذلك.
وأهل السنة يعبدون الله وحده، ويقولون: الغيب لله، لا يعلمه إلا الله، والرافضة والباطنية بخلاف ذلك.
فالفرق عظيمٌ جدًّا، ومَن أراد ذلك فليُراجع ما كتبه الناسُ في هذا، مثل: “منهاج السنة” لشيخ الإسلام ابن تيمية، ومثل: “وجاء دور المجوس” لعبدالله محمد غريب، ومثل الكتب الأخرى: كتب الشيخ حافظ إحسان، وغيره ممن كتب في هذا الباب، وفي هذا كتابات كثيرة
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రస్తుత కాలంలో బిద్అతులు (కల్పిత ఆచారాలు) హెచ్చరిల్లిపోయాయి. దీనికి ప్రధాన కారణం నేటి కాలానికీ – దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కాలానికీ మధ్య చాలా ఎక్కువ అంతరం ఉండటం, నిజ జ్ఞానం కొరవడటం, షరీయత్కు వ్యతిరేకమయిన విషయాల వైపు పిలుపు ఇచ్చేవారు అధికంగా ఉండటం.
మహనీయ ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) వారు ఇలా చెప్పి ఉన్నారు :
“మీరు తప్పకుండా మీ పూర్వీకుల అడుగు జాడల్లో నడుస్తారు.”
(దీనిని ఇబ్నెమాజా-3994 ఉల్లేఖించి, ప్రామాణికంగా పేర్కొన్నారు)
ఈ హదీసు ప్రకారం ముస్లిములు అన్యుల ఆచార వ్యవహారాలను ఎక్కువగా అనుకరించటం మొదలెట్టారు.
మీలాదున్నబీ పేరిట ఉత్సవాలు :
మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పుట్టిన రోజు పేరుతో పండుగ జరుపుకోవటం వాస్తవానికి క్రైస్తవుల అనుకరణ. క్రైస్తవులు ఏసుక్రీస్తు (ఈసా అలైహిస్సలాం) పుట్టిన రోజు పండుగ జరుపుకుంటారు. విద్యాగంధం లేని ముస్లిములు, రుజుమార్గానికి కుడిఎడమ వైపుల్లో కాలిబాటలు తీసుకున్న విద్వాంసులు (ఉలమా) ఏటేటా రబీవుల్ అవ్వల్ మాసంలో మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పుట్టిన రోజును పురస్కరించుకుని సంబరాలు జరుపుకుంటారు. కొంతమంది ఈ ఉత్సవాన్ని మస్జిదుల్లో జరుపుకుంటే, మరికొంతమంది తమ ఇండ్లలో చేసుకుంటారు. ఇంకా కొందరు కొన్ని నిర్ణీత బహిరంగ స్థలాలలో ఈ ఉత్సవం జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో ముస్లిం సమాజానికి చెందినవారు చాలాపెద్ద సంఖ్యలోనే హాజరవుతారు. ఇంతకుముందు చెప్పినట్లు ఇది క్రైస్తవుల నుండి పుణికిపుచ్చుకున్న పోకడ. పూర్వం క్రైస్తవులు ఏసుక్రీస్తు పుట్టిన రోజు పండుగను తమంతట తామే కల్పించుకున్నారు. సాధారణంగా ఈ మీలాద్ ఉత్సవాలలో క్రైస్తవులను పోలిన ఎన్నో బిద్అతులు చేయబడతాయి. కొన్ని షిర్కుతో కూడిన పనులు కూడా జరుగుతుంటాయి. ఉదాహరణకు:
ఈ సందర్భంలో చదవబడే నాతులు, కవితలలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) విషయంలో అతిశయిల్లడం కద్దు. వారు ఆ నాతులలో అల్లాహ్ బదులు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను మొరపెట్టుకోవటం మొదలెడతారు. సహాయం కొరకు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)నే అర్ధించసాగుతారు. కాగా; తనను పొగిడే విషయంలో అవధులు మీరరాదని దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) స్వయంగా తాకీదు చేసి ఉన్నారు. ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు :
“క్రైస్తవులు మర్యమ్ కుమారుడగు ఈసాను పొగడటంలో మితిమీరిపోయినట్లుగా మీరు నన్ను పొగడటంలో మితిమీరకండి (కడకు వారు తమ ప్రవక్తను దేవుని కుమారునిగా చేసేశారు). చూడండి! నేనొక దాసుడను. కాబట్టి నన్ను అల్లాహ్ దాసుడు, అల్లాహ్ సందేశహరుడు అని అనండి.”(బుఖారి, ముస్లిం)
ఒక్కోసారి ‘మీలాద్’ పేరిట జరిగే ఈ సదనాలలో స్త్రీలు పురుషులు కలిసిపోతారు. ఈ మిశ్రమ సమ్మేళనాలు నైతిక పతనానికి, భావ కాలుష్యానికి కూడా కారణం అవుతాయి.
ఒక్కోసారి వారు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తమ సమావేశాలకు హాజరవుతారని కూడా నమ్ముతుంటారు. ఈ సమావేశాలలో సామూహికంగా (కొన్నిచోట్ల స్రీలు – పురుషులు కూడా) నాతె షరీఫ్ పఠిస్తారు. కవి సమ్మేళనాలు నిర్వహిస్తారు. బృందగానాలు ఆలాపిస్తారు. సూఫీ మహాశయులు కల్పించుకున్న ప్రత్యేక ధ్యానాలు కూడా ఈ సందర్భంగా పాటించబడతాయి. అదలా ఉంచితే స్త్రీ, పురుషుల మిశ్రమ సమావేశాలు ఉపద్రవానికి కారణభూతం అయ్యే ప్రమాదం ఉంటుంది.
అలాంటిదేమీ లేదండీ! కేవలం మేమిక్కడ సమావేశమై భోజనాలు చేసి వెళ్ళిపోతామండీ అని కొంతమంది చెబుతుంటారు. వారు చెప్పిందే నిజమే అయినా అది కూడా ఇస్లాం ధర్మంలో ఓ కొత్తపోకడే. (ధర్మంలో ప్రతి కొత్త విషయావిష్కరణ బిద్అతే. ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత వైపు గొనిపోతుంది). కాలక్రమేణా ఈ చిన్న విషయాలే చెడుల వైపునకు, నీతి బాహ్యత వైపునకు దారితెరుస్తాయి.
మేము దీనిని బిద్అత్ అని ఎందుకన్నామంటే ఖుర్ఆన్ హదీసులలో ఈ ఉత్సవానికి ఎలాంటి ఆధారం లేదు. సలఫె సాలిహీన్ ఆచరణ ద్వారా కూడా దీనికి సంబంధించిన ఉపమానం ఏదీ లభించటం లేదు. హిజ్రీ 4వ శతాబ్ది తరువాతనే ఇది ఉనికిలోనికి వచ్చింది. ఫాతిమీ షియాలు దీనిని మొదలు పెట్టారు.
ఇమామ్ అబూ హఫస్ తాజుద్దీన్ అల్ఫాఖానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు :
ముబారికీన్కు చెందిన ఒక బృందం తరఫున – రబీవుల్ అవ్వల్ నెలలో మీలాద్ ఉత్సవం పేరిట నిర్వహించబడే ఈ సమావేశం గురించి, “ధర్మం (దీన్)లో దీనికేదన్నా ఆధారం ఉందా?” అని ప్రశ్నించటం జరిగింది. దీనికి సంబంధించి వారు స్పష్టమయిన, నిర్దిష్టమైన సమాధానం కావాలని కోరారు. కాబటి దేవుడిచ్చిన సద్బుద్ధితో సమాధానం ఇవ్వబడుతోంది :
“దైవగ్రంథంలోగానీ, దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సంప్రదాయంలో గానీ నేడు చెలామణీలో ఉన్న మీలాద్కు ఎలాంటి ‘మూలం’ లేదు. ఎలాంటి నిదర్శనం కూడా నాకు కనిపించలేదు. ఉమ్మత్కు చెందిన ఎన్నదగ్గ ఉలమాలు, ఆదర్శప్రాయులైన వారు కూడా ఈ విధంగా ఆచరించినట్లు లేదు. పైగా ఇదొక బిద్అత్. దీనిని పనీ పాటా లేని వ్యక్తులు, నిరుద్యోగులు కనుగొన్నారు. ఇదొక మనోవాంఛ. పదార్థ పూజారులు దీనిని తమ పబ్బం గడుపుకునేందుకు వాడుకుంటున్నారు.” (రిసాలతుల్ మోరిద్ ఫీ అమలుల్ మౌలిద్)
షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఏమంటున్నారో చూడండి :
“ఇదేవిధంగా కొంతమంది ఏసుక్రీస్తు (ఈసా – అలైహిస్సలాం) పుట్టిన రోజు విషయంలో క్రైస్తవులను అనుకరిస్తూ లేదా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రేమలో, భక్తితత్పరతలో ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) పుట్టిన రోజు పండుగను ఆవిష్కరించారు. వాస్తవానికి ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) వుట్టినరోజు నిర్ధారణ విషయంలో ఇప్పటికీ ప్రజల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. తొలికాలపు సజ్జనులు సయితం ఈ ‘ఉత్సవం’ జరుపుకోలేదు. ఒకవేళ ఇలా చేయటంలో ‘మంచి’ అనేది ఏదయినా ఉంటే, లేదా మంచికి ఆస్కార ముంటుందని అయినా ఆశాభావం ఉండి ఉంటే ఆ సజ్జనులు (రహిమహుముల్లాహ్) ఇలాంటి సంబరం తప్పకుండా జరుపుకునేవారే. ఎందుకంటే దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) యెడల ప్రేమాదరణల విషయంలో ఆ మహనీయులు మనకన్నా గొప్పవారే. వారు ఎల్లప్పుడూ మేలును, శుభాన్ని కాంక్షించేవారు. యదార్దానికి దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను అనుసరించటం ద్వారానే ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) యెడల (పేమాదరణలకు సార్ధకత లభిన్తుంది. ఆయన ఆజ్ఞలను శిరసావహించేవారు, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) నెలకొల్పిన సంప్రదాయాల పునరుద్ధరణకు చిత్తశుద్ధితో పాటువడేవారు, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) రాకలోని లక్ష్యాన్ని నెరవేర్చటానికి మనోవాక్కాయ కర్మల చేత కృషిచేసేవారు మాత్రమే నిజంగా ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) యెడల ప్రేమాదరణలు గలవారు. ఎందుకంటే అన్సార్ – ముహాజిర్లలోని ప్రథమశ్రేణి సహాబీలు గానీ, వారిని అనుసరించే తరువాతి తరాల వారుగానీ ఇలాగే చేసేవారు.”(ఇఖ్తెజా అస్సిరాతల్ ముస్తఖీమ్ – 2/615, డా. నాసిరుల్ అఖల్ పరిశోధన)
ఈ కొత్త పోకడను ఖండిస్తూ లెక్కలేనన్ని పుస్తకాలు (పాతవి, కొత్తవి) ప్రచురించ బడ్డాయి. ఈ మీలాద్ ఉత్సవం స్వతహాగా ఒక బిద్అత్ అవటంతో పాటు అది మరెన్నో మీలాదుల నిర్వహణకు ప్రేరకం అయ్యే అవకావం ఉంది. మరెందరో ఔలియాల, పెద్ద విద్వాంసుల, నాయకుల మీలాద్ (బర్త్డే) లకు శ్రీకారం చుట్టవచ్చు. ఈ విధంగా ముస్లిం సముదాయం కీడుకు, ఉపద్రవానికి ద్వారం తెరుచుకుంటుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
కొన్నిస్థలాల, చిహ్నాల, మృతుల నుండి శుభం (బరకత్) పొందటం :
కొత్తగా కనిపెట్టిన బిద్అతు(కల్పితాచారం)లలో ‘సృష్టితాల‘ నుండి “శుభం” పొందగోరటం కూడా ఒకటి. ఇది కూడా విగ్రహారాధనలో ఒక భాగమే. ఈ వల పన్నటం ద్వారా ఎంతోమంది బ్రతకనేర్చిన స్వార్ధపరులు అమాయక వ్యక్తుల జేబులు ఖాళీ చేస్తుంటారు.
‘బరకత్” అంటే ఏదైనా వస్తువులో శుభం, సమృద్ధి స్థిరంగా ఉండటం అని భావం.
ఇలాంటి శుభం లేక సమృద్ధి కొరకు ప్రార్థించాల్సింది అల్లాహ్ నే . ఎందుకంటే ఆ వస్తువును ప్రసాదించిన వానికే బరకత్ పొందుపరిచే శక్తి ఉంటుంది. ఆ పని అల్లాహ్ మాత్రమే చేయగలడు. ఎందుకంటే శుభాన్ని అవతరింపజేసేవాడు, దానిని స్థిరపరిచేవాడు అల్లాహ్ మాత్రమే. మనుషులకు, వేరే ఇతర సృష్టితాలకు బరకత్ని ప్రసాదించే శక్తిగానీ, బరకత్ అనే దానికి ఉనికినిచ్చే శక్తిగానీ, దానిని నిలిపి ఉంచే శక్తిగానీ ఉండదు.
కాబట్టి స్థలాల నుండి, చిహ్నాల నుండి, చనిపోయిన వ్యక్తుల నుండి “శుభం” (తబర్రుక్) పొందటం ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే ఆ వస్తువుకు శుభం చేకూర్చే శక్తి స్వత సిద్ధంగా ఉందని మనిషి గనక నమ్మాడంటే అది ‘షిర్క్‘ అవుతుంది. ఒకవేళ అతను ఫలానా వస్తువును సందర్శించటం, దానిని తాకటం, దానిని తన శరీరంపై స్పర్శించటం అల్లాహ్ తరపున బరకత్ ప్రాప్తికి సాధనమని నమ్మితే అది షిర్క్ కాదుగానీ, షిర్క్కు దోహదపడే ఒక సాధనమవుతుంది.
ఇక ప్రవక్త ప్రియ సహచరుల విషయానికి వస్తే వారు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కేశముల ద్వారా, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) గారి లాలాజలం ద్వారా, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) వుజూ చేసిన నీళ్ల ద్వారా బరకత్ (శుభం) పొందేందుకు పోటీపడేవారు. అయితే ఇదంతా ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) జీవించి ఉన్నంతవరకే జరిగింది. దీనికి ఆధారం ఏమిటంటే, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) పరమపదించిన తరువాత, సహచరులు ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) సమాధి ఉన్న గదిలోకి వెళ్ళి శుభం పొందలేదు. ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) నమాజ్ చేసిన వివిధ స్థలాలకు వెళ్ళి, లేదా ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) విశ్రాంతి పొందిన స్థలాలకు వెళ్ళి అక్కడి నుండి “శుభం” పొందలేదు. కాబట్టి ఔలియాల (అల్లాహ్ ప్రియతములైన వ్యక్తుల) స్థలాలకు వెళ్ళి అక్కడి నుండి శుభం పొందగోరటం ధర్మసమ్మతం కాదు.
అలాగే ప్రవక్త సహచరులు తమలోని గొప్ప వ్యక్తుల నుండి కూడా శుభం పొందేవారు కారు. ఉదాహరణకు : హజ్రత్ అబూబకర్, హజ్రత్ ఉమర్ (రది అల్లాహు అన్హుమా), ఇంకా ఆ కోవకు చెందిన మరెందరో సహాబీల జీవిత కాలంలోగానీ, వారు మరణించిన తరువాత గానీ వారి నుండి శుభం పొందేందుకు యత్నించలేదు. వారు హిరా గుహ వద్దకు వెళ్ళి నమాజ్ చేయటంగానీ, దుఆ చేయటంగానీ చేయలేదు.అల్లాహ్ మూసా (అలైహిస్సలాం)తో సంభాషించిన తూర్ పర్వత సందర్శన నిమిత్తం వెళ్ళటంగానీ, అక్కడ నమాజ్ చేయటం గానీ చేయలేదు. దైవప్రవక్తల సమాధులున్నాయని అనుమానించ బడుతున్న పర్వతాల వద్దకు, స్థలాల వద్దకు కూడా వారు వెళ్ళలేదు.
అలాగే మదీనా నగరంలో మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నిత్యం నమాజ్ చేసే స్థలంలోనే నిలబడటంగానీ, మక్కాలో ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) నమాజ్ చేసీన స్థలాలలో తొలికాలపు మహనీయులు నిలబడటం గానీ, ఆ స్థలాలను తాకటంగానీ, ముద్దాడటం గానీ చేసేవారు కారు.
కాస్త ఆలోచించండి! మహాప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) గారి శుభప్రదమైన అడుగులు పడిన స్థలాలను, ఆయన నమాజ్ చేసిన స్థలాలనే తాకటం, ముద్దుపెట్టుకోవటం ఆయన అనుయాయులకు ధర్మసమ్మతం కానపుడు వేరేతరులు సంచరించిన, ఆరాధనలు చేసిన స్థలాలను, ప్రదేశాలను ముద్దాడటం ఎంత వరకు సమ్మతం? ఎంతవరకు సహేతుకం?
ఆ స్థలాలలో దేనినయినా తాకటం లేదా ముద్దుపెట్టుకోవటం మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) షరీయత్ ప్రకారం ధర్మసమ్మతం కాదన్న విషయం ఇస్తామీయ విద్వాంసులకు బాగా తెలుసు. (ఇఖ్తెజ అస్సిరాతల్ ముస్తఖీమ్ – 2/795-802. డా. నాసిరుల్ అఖల్ పరిశోధన).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జన్మదిన వేడుకలు, బర్త్ డే పార్టీలు, మీలాదున్నబీ ఉత్సవాలు జరుపుకొనుట ఇస్లామీయ కార్యమేనా? మనకంటే ఎంతో అధికంగా ప్రవక్తను ప్రేమించే సహాబాలు (ప్రవక్త సహచరులు) ఈ మీలాద్ చేశారా? ఇది చేయడం పుణ్యమైతే వారు ఎందుకు చేయలేదు? అది పుణ్యం కాకపోతే మరి మనం ఎందుకు చేయాలి? ఇంకా మరిన్ని వివరాలు, వాస్తవాలు ఈ వీడియోలో తెలుసుకోండి.
[40 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
ఈ ప్రసంగం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పుట్టినరోజు (మీలాద్-ఉన్-నబీ) వేడుకల యొక్క వాస్తవికతను చర్చిస్తుంది. ఇస్లాం ఒక సంపూర్ణమైన మతమని, దానిలో కొత్త ఆచారాలకు, ప్రత్యేకంగా ఆరాధనల విషయంలో, స్థానం లేదని వక్త స్పష్టం చేస్తున్నారు. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాంలో కేవలం రెండు పండుగలు (ఈదుల్ ఫితర్ మరియు ఈదుల్ అద్హా) మాత్రమే ఉన్నాయని, మీలాద్ వేడుకలను పండుగగా జరుపుకోవడం ప్రవక్త మరియు ఆయన సహచరుల పద్ధతికి విరుద్ధమని వివరిస్తున్నారు. ఈ వేడుకను సమర్థించడానికి ఉపయోగించే వాదనలను విశ్లేషించి, వాటిలోని వైరుధ్యాలను ఎత్తిచూపుతూ, ఇది ఇస్లాంలోకి తరువాత చేర్చబడిన ఒక నూతన ఆచారం (బిద్అత్) అని, దీనిని పాటించడం పుణ్యకార్యం కాదని, పాపమని తేల్చిచెప్పారు. ఇస్లాం యొక్క మూల సూత్రాలను అనుసరించాలని, ఇతర మతాల వారిని అనుకరించరాదని ఆయన ముస్లింలకు హితవు పలికారు.
(الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ) అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబీయ్యినా ముహమ్మద్ వ ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్. (సర్వలోకాల ప్రభువైన అల్లాహ్కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)పై, ఆయన కుటుంబ సభ్యులు మరియు సహచరులందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక).
ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకలు, దీని యొక్క వాస్తవికత ఏమిటి? ఇస్లాంకు సంబంధించిన విషయమేనా ఇది, కాదా?
మహాశయులారా, మొట్టమొదటి విషయం మనం తెలుసుకోవలసినది, ఇస్లాం ధర్మం సంపూర్ణమైనది. “అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్మమ్తు అలైకుమ్ నిఅమతీ వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా” ( الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا) అని అల్లాహుతాలా చాలా స్పష్టంగా తెలియజేశాడు. అంటే ఏమిటి? “అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్” ( الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ) – ఈనాడు నేను మీ ధర్మాన్ని సంపూర్ణం చేశాను. “వ అత్మమ్తు అలైకుమ్ నిఅమతీ” (وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي) – మరియు నా అనుగ్రహాన్ని మీపై పరిపూర్ణం చేశాను. “వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా” (وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا) – మరియు మీ కొరకు ధర్మంగా ఇస్లాంను ఇష్టపడ్డాను.
ఈనాడు మీ ధర్మాన్ని నేను సంపూర్ణం చేశాను అంటే ఏ నాడు అది? ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానికి ఇంచుమించు ఒక 80-83 రోజుల క్రితం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఈ ఆయత్ అవతరింపజేయబడినది. అయితే, ఇస్లాం ధర్మం సంపూర్ణమైనది అని ఏదైతే మనం అంటున్నామో, ఈ ఆయత్ దానికి ఒక ఆధారంగా, నిదర్శనంగా తెలుసుకున్నామో, దీని భావం ఏమిటి? ధర్మం పేరుతో ఇక ఏ విషయం కూడా మనం ఇందులో చేర్చలేము. ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి చెప్పినట్లు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణానికి ముందు ఏ విషయం అయితే దీన్లో లేనిదో, అది ఇప్పుడు దీన్లో లెక్కించబడదు. ధర్మంలో లెక్కించబడదు. మరియు ధర్మంలో ఉన్న ఏ విషయాన్ని కూడా తీసివేయడానికి కూడా మనకు ఎలాంటి అర్హత లేదు.
రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ధర్మం సంపూర్ణమైనది అని అన్నదానికి భావం రెండు రకాలుగా. ఒకటి, ఇందులో అదనంగా మనం ఏదీ చేర్చలేము. అరే ఇది కూడా చాలా మంచిగా ఉంది కదా, దీన్ని కూడా ధర్మంగా భావిద్దాము, ఇది కూడా మనం ఆచరిద్దాము, ఇలా కూడా చేద్దాము, ఇది కూడా ధర్మంగా పుణ్యంగా ఉంటుంది మనకు, ఇలా చెప్పలేము మన ఇష్టానుసారం. అలాగే అల్లాహుతాలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విషయాన్ని ధర్మంలో తెలిపారో, అందులో నుండి ఏ విషయాన్ని కూడా మనం మినహాయించలేము, తీసివేయలేము. ఆ అర్హత కూడా మనకు లేదు.
ఇంకా మహాశయులారా, ఇందులో మనం తెలుసుకోవాల్సిన రెండవ విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం, ఇందులో అల్లాహ్ మనకు ఏది తెలిపాడో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏది తెలిపారో, అదే ధర్మం. దానినే మనం అనుసరించాలి. ఇది కాకుండా మన ఇష్టానుసారం ఏదైనా విషయాన్ని చేర్చుకోవడాన్ని, అనుసరించడాన్ని అల్లాహ్ ఖండించాడు. దీనికి సంబంధించిన ఎన్నో ఆయతులు ఉన్నాయి, కానీ ఉదాహరణకు సూరె జాథియాలోని ఆయత్ నంబర్ 18: “సుమ్మ జఅల్నాక అలా షరీఅతిమ్ మినల్ అమ్రి ఫత్తబిఅహా వలా తత్తబిఅ అహ్వా అల్లజీన లా యఅలమూన్” (ثُمَّ جَعَلْنَاكَ عَلَىٰ شَرِيعَةٍ مِّنَ الْأَمْرِ فَاتَّبِعْهَا وَلَا تَتَّبِعْ أَهْوَاءَ الَّذِينَ لَا يَعْلَمُونَ). (మేము నిన్ను ధర్మానికి సంబంధించిన ఒక రాజబాటపై నిలబెట్టాము. అయితే నీవు దీనిని అనుసరించు. జ్ఞానం లేని వారి కోరికలను అనుసరించకు). అల్లాహ్ పంపిన షరీఅత్, అల్లాహ్ పంపిన ధర్మం దానినే మనం అనుసరించాలి అని అల్లాహ్ మనకు ఆదేశిస్తున్నాడు.
అలాగే మహాశయులారా, మూడవ విషయం, ఇస్లాంలో పండుగలు, ఈద్ అని ఏదైతే మనం అంటామో, ఎన్ని ఉన్నాయి సంవత్సరానికి? రెండు మాత్రమే. ఒకటి ఈదుల్ అద్హా, ఇంకొకటి ఈదుల్ ఫితర్. ఈదుల్ ఫితర్, ఈదుల్ అద్హా ఈ రెండు మాత్రమే. సునన్ అబీ దావూద్ లోని సహీహ్ హదీస్, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చినప్పుడు అక్కడ ప్రజలు పండుగగా, ఈద్గా కొన్ని రెండు రోజులు జరుపుకునేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆ రెండు రోజులను పండుగగా జరుపుకోకూడదు అని, వారిని ఆ రెండు రోజులను పండుగగా జరుపుకోవడాన్ని నిషేధించి, రద్దు చేసి, “ఖద్ అబ్దలకుముల్లాహు బిహిమా ఖైరమ్ మిన్హుమా” (قَدْ أَبْدَلَكُمُ اللَّهُ بِهِمَا خَيْرًا مِنْهُمَا). (అల్లాహుతాలా మీ కొరకు ఆ రెండు రోజుల కంటే మరీ ఉత్తమమైన వేరే రెండు రోజులు మీకు ప్రసాదించాడు, వాటిని మీరు పండుగగా జరుపుకోండి, ఈద్గా జరుపుకోండి అని తెలిపారు). ఆ రెండు ఏమిటి? ఈదుల్ ఫితర్ మరియు ఈదుల్ అద్హా. ఈ విధంగా సంవత్సరంలో ఇక మూడవ ఈద్, మూడవ పండుగ ముస్లింలకు ఏదీ లేదు. మూడవ పండుగ, మూడవ ఈద్ ఏదైనా ఉండేది ఉంటే, అది వారంలో ఒకసారి జుమా రోజు. జుమా కూడా ఈదుల్ మూమినీన్ అని చెప్పడం జరిగింది.
ఇక మీలాదున్నబీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకలు, దానిని ఈద్ అని ఏదైతే ఈ రోజుల్లో అనడం జరుగుతుందో, ఈద్ మీలాదున్నబీ అని, ధర్మపరంగా దానిని ఈద్ అని అనడం కూడా తప్పు, అలాగే దానిని ఈద్గా జరుపుకోవడం కూడా తప్పు. ఒకవేళ ఎవరైనా, సరే మంచిది, దానికి ఈద్ అన్న పదం మేము తీసేస్తాము, మీలాదున్నబీ అని జరుపుకుంటాము అని అంటే, అది కూడా కుదరని పని.
కానీ ఇంతవరకే విషయం సరిపోదు. మరికొందరు ఒక రాంగ్ క్వశ్చన్, ఒక అడ్డ ప్రశ్న వేస్తారు. అదేమిటంటే, సరే మంచిది, ఈద్ అని దానికి పేరు పెట్టుకోము. మీలాదున్నబీ అన్న పేరుతో ఆ రోజును మేము గడుపుకోవడం, ఒక సంతోషంగా, సంతోషక దినంగా భావించి జరుపుకోవడం, ప్రజల్ని ఆ రోజు ఒకచోట జమా చేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చరిత్ర తెలపడం, ఇందులో ఏమిటి తప్పు? పాపం ఏమున్నది ఇందులో? ఇలా అడ్డంగా ప్రశ్నిస్తారు. అయితే, ఇందులో పాపం ఏమున్నదో, అది ఇప్పుడే తెలియజేస్తాను, కానీ దానికంటే ముందు ఒక విషయం మనం ఆలోచించాలి. అదేమిటి?
ఇది ఒకవేళ మంచి విషయం అని మనం భావించి చేస్తూ ఉండేది ఉంటే, నవూజుబిల్లాహ్, అస్తగఫిరుల్లాహ్, ఈ యొక్క మంచి విషయం మనకు తెలపడం అల్లాహ్ మర్చిపోయాడా? నవూజుబిల్లాహ్, అస్తగఫిరుల్లాహ్. అల్లాహ్ ప్రవక్తకు తెలియజేశారు కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలపడం మర్చిపోయారా? అలా ఏమైనా ఉందా? గమనించండి. ఈ రోజు ఇందులో తప్పేమున్నది? మనం మంచి పనులే చేస్తాము కదా ఈ రోజుల్లో. అయితే, మనం మన ఇష్టానుసారం ఏ పనినైనా మంచిదిగా భావించి చేయడం, ఇది ధర్మం కాదు. ఇది అల్లాహ్కు ఇష్టమైన రీతిలో స్వీకరించబడదు. అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త తెలిపిన విషయాన్నే మనం ఆచరించాలి.
ఇక నష్టం ఏమిటి? అందులో వేరే ఏ చెడు పని చేయకున్నా, మహా నష్టం ఇప్పుడే నేను మీకు తెలియజేసినట్లు, ఒకవేళ అది మంచి పని అని మనం చేస్తూ ఉంటే, ఆ మంచి పని విషయంలో అల్లాహ్ లేదా అల్లాహ్ యొక్క ప్రవక్త మర్చిపోయారా? ఇటువంటి ఒక పెద్ద అభాండం ఏర్పడుతుంది. రెండవ విషయం, ఒకవేళ ఇది చెడైతే ఏమీ కాదు, మంచి అని అని మనం చేసుకుంటూ ఉంటే, మనకంటే ఎక్కువగా ధర్మం పట్ల ప్రేమ కలిగిన సహాబాలు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనకంటే ఎక్కువగా ప్రేమించేవారు సహాబాలు. సహాబా కంటే ఎక్కువ మనం ప్రేమిస్తామా ప్రవక్తను? చెప్పండి. మనం ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నామా ప్రవక్తను లేక సహాబాలు ఎక్కువ ప్రేమించేవారా? సహాబాలు కదా. అయితే వారు మరి ఈ విషయం పాటించలేదు కదా?
ఈ విధంగా చూసుకుంటే ఎన్నో రకాలు. అందుగురించి ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి ఒక సందర్భంలో ఏమి చెప్పారు? ఎవరైతే ఒక పని ఇస్లాంలో కొత్తగా ఏర్పాటు చేసి దానిని ఆచరిస్తాడో, అతడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఒక మహా అపనింద, ఒక పెద్ద అబద్ధాన్ని మోపుతున్నాడు. ఎందుకు? “ఇది మంచి కార్యం, ఇది సత్కార్యం, ఇది చాలా అల్లాహ్కు ఇష్టమైన పని” అని మనం అంటుంటే, అల్లాహుతాలా మర్చిపోయాడు లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు తెలియజేయడం మర్చిపోయాడు అని ఈ విధంగా, “ఫఖద్ ఖాన రిసాలా” (فقد خان الرسالة) (సందేశాన్ని అందజేయడంలో మోసం చేశాడు). ప్రవక్త రిసాలత్, సందేశం అందజేయడంలో, నవూజుబిల్లాహ్, అమానత్ పాటించలేదు అన్నటువంటి ఒక పెద్ద అపనింద ప్రవక్తపై వస్తుంది. అందుగురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇక, ఈ విషయాలు మీకు అర్థమయ్యాయి. అర్థమయ్యాయి కదా? అయితే, ఇదే విషయాన్ని మరో రకంగా కూడా కొంచెం మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజుల్లో ఎందరో ముస్లిం సోదరులని మనం మీలాదున్నబీ జరుపుకుంటున్నది చూస్తూ ఉన్నాము. చూస్తున్నాము కదా? అచ్చా, మీలాదున్నబీ అంటే ఏంటో తెలుసా? మీలాదున్నబీ అన్న ఈ అరబీ పదానికి భావం ఏంటి? ప్రవక్త బర్త్డే. నబీ అంటే ప్రవక్త, మీలాద్ అంటే “ఉష్ మీలాద్ అంతా?” (وش ميلادك أنت؟) (నీ పుట్టినరోజు ఏది?). నీ జన్మదినం ఏది? నీ బర్త్డే ఏది? అని మనం సామాన్యంగా అరబీలో అడుగుతాము కదా.
అయితే మహాశయులారా, ఇస్లాంలో మనం మన బర్త్డే జరుపుకోవడానికి అనుమతి లేదు, ప్రవక్తల బర్త్డే జరుపుకోవడానికి అనుమతి లేదు, ఇంకా ఏ పుణ్యపురుషులు, మహాభక్తులు, ఔలియా అల్లాహ్, బుజుర్గ్ బాబా, అచ్చే అచ్చే లోగా, ఈ విధంగా ఎవరి ఏ బర్త్డేలు, జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి అవకాశం ఉందా? లేదు. “అరే ఏం చేయమండి మేము? కేవలం ఆ రోజు మేము పుట్టిన దినం అని చాక్లెట్లు పంచుకుంటాము. ఆ రోజు మేము పుట్టిన దినము అని అందరం ఒకచోట జమా అయ్యి కేక్ తీసుకొచ్చి దాన్ని కోసి మేము అందరం కలిసి తింటాము. ఇందులో మేమేం హరామ్ కార్యం చేస్తున్నాము?” అని అంటారు. కానీ ఇది ఇస్లాంకు సంబంధించిన విషయం ఎంత మాత్రం కాదు.
ఇంకా మహాశయులారా, ఎందరో సోదరులు ఈద్-ఎ-మీలాదున్నబీ పాటిస్తున్నారు. కానీ వారి యొక్క ఈ మీలాదున్నబీ ఉత్సవాల విషయం మరియు వారు చెప్పే మాటలలో ఎన్నో రకాల వైరుధ్యం కనబడుతుంది. కాంట్రడిక్షన్. ఏ విధంగా? ఒక మౌల్వీ సాబ్ ప్రసంగం చేస్తూ ఏమన్నాడు? మనం తప్పకుండా మీలాదున్నబీ ఉత్సవాలు పాటిస్తూ ఉండాలి. దీనికి మనకు ఆధారాలు కూడా ఉన్నాయి, అని చెప్పుకొచ్చాడు. ఇక దానికి దలీల్ ఉంది, ఆధారం ఉంది అని అంటే, ప్రజలు చాలా సంతోషపడిపోతారు కదా. ఏంటి ఆధారం అండి? సహీహ్ ముస్లిం షరీఫ్లో హదీస్ ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సోమవారం ఉపవాసం ఉండేవారు. అయితే, ప్రవక్తా మీరు ఎందుకు ఉపవాసం ఉంటారు అని ప్రవక్తను ప్రశ్నించినప్పుడు, “జాక యౌమున్ వులిద్తు ఫీహి” (ذَاكَ يَوْمٌ وُلِدْتُ فِيهِ) (అది నేను జన్మించిన రోజు). నేను ఆ సోమవారం రోజున జన్మించాను గనుక నేను ఉపవాసం ఉంటున్నాను. చూడండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తమ జన్మదిన వేడుకలు పాటిస్తూ ఉన్నారు. మనం కూడా పాటించడం చాలా మంచిది.
కానీ అస్తగఫిరుల్లాహ్! వాస్తవంగా ఈ హదీస్ ముస్లిం షరీఫ్లో ఉన్నది వాస్తవమే. కానీ దీని ద్వారా మీలాదున్నబీ మనం చేసుకోవచ్చు అన్నదానికి ఏదైతే ఆధారం తీసుకుంటున్నారో, ఆ ఆధారం కుదరదు. ఎందుకు కుదరదు? గమనించండి. మొదటి విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేసేవారు హదీస్ ప్రకారంగా? ఉపవాసం పాటించేవారు, రోజా రఖ్తే థే. ఉపవాసం పాటించేవారు. మరి ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నారు? మీలాదున్నబీ అని ఏదైతే ఉత్సవాలు జరుపుకుంటున్నారో, ఉపవాసమే పాటిస్తున్నారా కేవలం? విరుద్ధమా లేదా?
రెండో రకంగా చూసుకోండి. ఈద్-ఎ-మీలాదున్నబీ అని ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మరి ఈద్ రోజున ఉపవాసం ఉండవచ్చా? వేరొక హదీస్లో ఉంది, అది కూడా సహీహ్ హదీస్. ఎవరైతే సహీహ్ బుఖారీ, ముస్లింలో వచ్చి ఉంది. ఎవరైతే పండుగ రోజు ఉపవాసం ఉంటారో, వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అవిధేయులు. నాఫర్మానీ చేసేవాళ్ళు. అయితే ఇక చెప్పండి. ఈద్ అని అంటున్నారు, ప్రవక్త ఉపవాసం ఉండే ఆ హదీస్ ద్వారా దలీల్ తీసుకుంటున్నారు. మరి ఈద్ రోజున, పండుగ రోజున ఉపవాసం ఉండరాదు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవూజుబిల్లాహ్ అస్తగఫిరుల్లాహ్, అస్తగఫిరుల్లాహ్ అస్తగఫిరుల్లాహ్, ప్రవక్త స్వయంగా పండుగ రోజు ఉపవాసం ఉండరాదు అని, పండుగ రోజు ఉపవాసం ఉన్నారా? ఇది మీలాదున్నబీ అని అంటున్నారు కదా.
ఇంకా మూడో రకంగా దీన్ని ఆలోచించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సోమవారం, అంటే సోమవారం సంవత్సరంలో ఒకసారి వస్తుందా? వారంలో ఒకసారి. అయితే వారంలో ఒకసారి వచ్చేదాన్ని, ఉపవాసం పాటించేదాన్ని వదిలేశారు, సంవత్సరంలో ఒకసారి ఈద్-ఎ-మీలాదున్నబీ అని జరుపుకుంటున్నారు. ఇది ఎక్కడ కుదురుతుంది? గమనించండి.
ఈ రకంగా చూసుకుంటూ పోతే, నాలుగో విషయం గమనించండి. అదేమిటి? సామాన్యంగా ఎవరైతే మీలాదున్నబీ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారో, సామాన్యంగా మీలాదున్నబీ ఉత్సవాలు ఎవరు జరుపుతారు? తమకు తాము మేము ముఖల్లిద్లం. ఏదైనా ఒక ఇమామ్ను పట్టుకోవాలి, ఏదైనా ఒక ఇమామ్ యొక్క తఖ్లీద్ తప్పకుండా చేయాలి, అని అంటూ ఉంటారు కదా. అలాంటివారే మరొక విషయం ఏమంటారు? వారిలోని పండితులు కూడా, అల్లాహ్ మనందరికీ హిదాయత్ ఇవ్వుగాక, వారిలోని పండితులు కూడా ఏమంటారు? మేము ఇజ్తిహాద్ చేయడానికి, ఖురాన్ హదీస్ ద్వారా విషయాలు గ్రహించడానికి, మన ముందు ఉన్న సమస్యలకు ఖురాన్ హదీస్ ద్వారా పరిష్కారం వెతకడానికి మాకు అనుమతి లేదు. మేము ఏ ఇమామ్ యొక్క తఖ్లీద్ పాటిస్తున్నామో, ఆ ఇమామ్ ఏం చెబితే అదే మేము చేయాలి. అయితే, అటువైపున తప్పకుండా తఖ్లీద్ను పాటించాలి అని అంటారు. ఇటు ఈద్-ఎ-మీలాదున్నబీ వచ్చినప్పుడు స్వయంగా వారే దలీల్లు ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు. మరి ఇమామ్ల విషయం చూస్తే, ఏ ఒక్క ఇమామ్ కూడా మీలాదున్నబీ చేయాలని చెప్పలేదు. విషయం అర్థమవుతుందా? నమాజ్ విషయానికి వస్తే ఉదాహరణకు, ఎందుకు మీరు ఇలా నమాజ్ చేస్తున్నారు? ప్రవక్త యొక్క విధానం ఇది కదా అంటే, లేదు లేదు మేము ఫలానా ఇమామ్ను అనుసరిస్తాము. హమ్ ఫలా ఇమామ్ కే ముఖల్లిద్ హై. ఈ విధంగా అంటారు. ఇక మీలాదున్నబీ వచ్చే విషయం వచ్చేసరికి, స్వయంగా ఎన్నో దలీల్ ఆధారాలు వెతుకుతూ వెతుకుతూ వేటికి తీసుకొస్తారు. ఈ రకంగా కూడా…
ఇంకా మహాశయులారా, మరికొందరు ఏమంటారో తెలుసా? మీరు ఈద్-ఎ-మీలాదున్నబీ చేయవద్దు, చేయవద్దు, చేయవద్దు అంటారు కదా. ఈద్-ఎ-మీలాదున్నబీ చేయవద్దు అని ఎక్కడైనా దలీల్ ఉందా చూపించండి. అర్థమవుతుందా? ఈద్-ఎ-మీలాదున్నబీ చేయవద్దు అని ఎక్కడైనా దలీల్ ఉందా చూపించండి అని అంటారు. మరి వారితోనే ఈ ప్రశ్న అడిగితే, ఏమని? ఈద్-ఎ-మీలాదున్నబీ చేయవచ్చు అని ఎక్కడ దలీల్ ఉంది చూపించండి. ఈద్-ఎ-మీలాదున్నబీ అన్న పదాలతో. ఎక్కడా లేదు హదీసులలో. సోమవారం రోజు ఉపవాసం ఉండేవారు ప్రవక్త. హదీస్ ఏదైతే వచ్చి ఉందో, దాని ద్వారా దలీల్ తీసుకుంటున్నారు. ఇంకా వేరే ఎలాంటి దలీల్లు నేను చూపిస్తాను ఇన్షా అల్లాహ్, అందులో కూడా భావం వారు తప్పుగా ఎలా తీసుకుంటున్నారో. అయితే, ఈద్-ఎ-మీలాదున్నబీ చేయకూడదు అని దలీల్ మాతోనే అడుగుతున్నారు. అప్పుడు మేమే అడిగినప్పుడు, ఈద్-ఎ-మీలాదున్నబీ చేయవచ్చు అని ఎక్కడ దలీల్ ఉంది చూపించండి అంటే, వారి వద్ద ఎలాంటి సమాధానం లేదు. ఈద్-ఎ-మీలాదున్నబీ చేయవచ్చు అని ఎక్కడా దలీల్ లేదు.
ఇక మాట వచ్చింది గనుక ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. అదేమిటంటే, ఆరాధనలు, ఇబాదాత్, వీటిలో దలీల్, ఆధారం చేయడానికి ఉండాలి. ప్రవక్త ఇలా చేశారు. అల్లాహ్ ఇలా ఆదేశించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు అని చేయడానికి ఆధారం ఉండాలి. చేయకూడదు అన్నదానికి కాదు. మరియు ఏ విషయం చేయమని ఉందో, అది మాత్రమే మనం చేయాలి. ఏ విషయం ప్రస్తావన లేదో, దానిని చేయకూడదు. ఎందులో ఇది? ఇబాదాత్లో, ఆరాధనలలో. ఉదాహరణకు, ఉపవాసం, రోజా, మంచి విషయమేనా కాదా? అల్లాహ్కు చాలా ఇష్టమైన సత్కార్యం కదా. రమదాన్లో ఇది ఫర్జ్, విధి. ఎవరైనా ఒక మనిషి వచ్చి, ఎవరైనా ఒకరు వచ్చి, ఇస్లామీయ ప్రకారం నాలుగో నెల రబీఉల్ ఆఖర్. ఇందులో కూడా మనం ఇన్ని రోజులు ఉపవాసం ఉంటే మనకు ఇలాంటి లాభాలు అని చెప్తే, దానిని మనం ఒప్పుకోవచ్చా? ఎక్కడుంది ఆధారం చూపించు.
ఇప్పుడు ఆ మనిషి మళ్లీ, రబీఉల్ అవ్వల్లోని ఈ మాసంలో ఉపవాసాలు ఉండకండి అని ప్రవక్త ఎక్కడైనా చెప్పారా అని మనకు అడ్డ ప్రశ్న వేస్తే, ఆ ప్రశ్నయే తప్పు అక్కడ. అర్థమైందా? ఉదాహరణకు నమాజ్ విషయం తీసుకోండి. నమాజ్ విషయం. ఐదు పూటల నమాజ్లు విధి అని మనకు తెలుసు కదా. ఇవి కాకుండా ఫర్జ్ నమాజ్ల కంటే ముందు సున్నతులు, ఫర్జ్ నమాజ్ల కంటే తర్వాత సున్నతులు, నఫిల్ నమాజ్లు, ఇంకా వేరే చాష్త్, సలాతుల్ ఇస్తిస్కా వర్షం గురించి నమాజ్, సలాతుల్ కుసూఫ్ సూర్య గ్రహణ, చంద్ర గ్రహణ నమాజ్లు, జుమ్మా నమాజ్, ఈ విధంగా ఎన్నో రకాల నమాజ్లు ఉన్నాయి కదా. వాటన్ని వివరాలు వచ్చి ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి 15వ తారీఖు షాబాను రాత్రి ఎవరైనా 100 రకాతుల నమాజ్లు చేసి, ప్రతి ఒక్క రకాతులో 10, 10 సార్లు ఖుల్ హువల్లాహ్ చదవాలి సూరె ఫాతిహా తర్వాత అని ఈ విధంగా ఒక పద్ధతి మనకు నేర్పుతే, మనం ఏమడుగుతాము? నమాజ్ మంచి విషయమే. కానీ ఈ విధంగా ఒక తారీఖు ముకర్రర్ చేసి, ఒక పద్ధతి నిర్ణయించి నువ్వు ఏదైతే చెబుతున్నావో, దానికి ఏమిటి ఆధారం? ఆ, 15వ తారీఖు షాబానున ఈ రకంగా నమాజ్ చేయవద్దు అని ఎక్కడ దలీల్ ఉంది చూపించు అని అంటే? అతని ఆ ప్రశ్నయే అడ్డ ప్రశ్న, అలా అడగడమే తప్పు. ఇప్పుడు మాట అర్థమైంది కదా? ఇంతకంటే మరొక చిన్న ఉదాహరణ ఇచ్చేసి నేను ఇక ముందుకు వెళ్తాను. అదేమిటి?
ప్రతి రోజు మనం అజాన్ వింటున్నాము కదా? అజాన్ యొక్క చివరి పదాలు ఏంటి చెప్పండి? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్. సామాన్యంగా మనం వుజూ చేసుకున్న తర్వాత గాని, తషహుద్లో గాని, వేరే సందర్భాల్లో అవ్వల్ కలిమా తయ్యిబ్ ఏమంటాము తర్వాత? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. మనం చిన్నప్పుడు వినేవాళ్ళం కదా, చదివేవాళ్ళం కదా. ఆరు కల్మాల యొక్క వాస్తవికత మరి ఎప్పుడైనా తెలియజేస్తాను ఏంటి అనేది. దానిలో ఉన్న బిద్అతులు ఏంటి అది మరి ఎప్పుడైనా తెలుసుకోండి. కానీ ఇక్కడ అవ్వల్ కలిమా తయ్యిబ్ అని మనలో చాలా ఫేమస్ ఉంది, చిన్నప్పటి నుండి మనం నేర్చుకుంటూ వస్తాము. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. కదా? ఇప్పుడు ఎవరైనా అజాన్ తర్వాత చివరిలో అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని అంటే, మంచిదేనా? ఎందుకు? మంచిది కాదు అని అంటున్నాము కదా మనం, ధర్మం కాదు అని అంటున్నాము కదా. అయితే ముహమ్మదుర్ రసూలుల్లాహ్ ఈ పదం తప్పా? కాదు. ఇక్కడ ఏమంటాము మనం? ప్రవక్త ఇంతే మనకు నేర్పారు ఇక్కడ అజాన్లో. లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ వేరే సందర్భాల్లో చదువుతాం మనం. వుజూ చేసిన తర్వాత అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహ్ అని చదువుతాము. తషహుద్లో ఉన్నప్పుడు కూడా మనము అవన్నీ ఎక్కడ చదువుతాము. ఎక్కడ ఏ విధంగా నేర్పారో అక్కడ అలా చదువుతాము. కానీ అజాన్ తర్వాత ఇక్కడ మనకు ఏం నేర్పబడింది? కేవలం లా ఇలాహ ఇల్లల్లాహ్ మీద చదివి అజాన్ ఆపేసేయాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి అడ్డ ప్రశ్న అడిగితే, అరే నేను ముహమ్మదుర్ రసూలుల్లాహ్ కూడా అంటానయ్యా. ఎక్కడైనా ఉందా హదీస్లో ముహమ్మదుర్ రసూలుల్లాహ్ చెప్పొద్దు అజాన్ చివరలో అని? అంటే ఏమంటాము? నీ ప్రశ్నయే తప్పు ఇక్కడ. అర్థమైంది కదా? ఆరాధనలలో ప్రవక్త ఎలా చేశారు, ఎలా చేయాలని చెప్పారు, ఎలా చేయాలని అనుమతించారు, లేదా అల్లాహ్ ఎలా మనకు ఆదేశించాడు, అలాగే చేయాలి. కానీ వివిధ జీవితంలోని విషయాలు ఏవైతే ఉన్నాయో, ముఆమలాత్ అని దేనినైతే అనబడడం జరుగుతుందో, పెళ్లిళ్లు గాని, ఇంకా వ్యాపారాలు గాని, లావాదేవీలు గాని, ఇవన్నిటిలో, భోజనాలు తినే, త్రాగే విషయాల్లో, దుస్తులు ధరించే విషయాల్లో, ఇవన్నీ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇందులో నహీ, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు. పురుషులు చీలమండలానికి కిందిగా డ్రెస్ తొడుగకూడదు. భోజనం చేసేటప్పుడు ఆనుకొని, టేకా తీసుకొని తినకూడదు. ఈ విధంగా ఏ విషయాల నుండి మనల్ని నివారించడం జరిగిందో, వాటికి మనం దూరంగా ఉండాలి. అవి తప్ప మిగతావన్నీ కూడా హలాల్గా పరిగణించడం జరుగుతుంది. ఇంకా వేరే ఎన్నో ఆయతులు ఉన్నాయి, హదీసులు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే రండి ఇక.
చాలా దూరం వెళ్ళిపోలేదు. ఈద్-ఎ-మీలాదున్నబీ విషయం ఏదైతే ఉందో, దాని విషయంలో కూడా ఈద్-ఎ-మీలాదున్నబీ చేయకూడదు అని దలీల్ ఎక్కడుంది చూపించండి అని అడగడానికి హక్కు లేదు. ఎందుకంటే ఈ ప్రశ్నయే తప్పు. ప్రవక్త ఎక్కడ చేశారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి 40 సంవత్సరాల వయసులో ప్రవక్త పదవి లభించినది. ఆ తర్వాత 23 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. ఆ తర్వాత సహాబాలు ఇంచుమించు 100 సంవత్సరాల వరకు ఉన్నారు. చివరి సహాబీ 110 లో చనిపోయారు. ఆ తర్వాత తాబయీన్ కాలం, ఆ తర్వాత తబఎ తాబయీన్ కాలం. సహీహ్ బుఖారీలో వచ్చిన హదీస్ ప్రకారంగా, “ఖైరుల్ ఖురూని ఖర్నీ సుమ్మల్లజీన యలూనహుమ్ సుమ్మల్లజీన యలూనహుమ్” ( خَيْرُ الْقُرُونِ قَرْنِي ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ). (అనువాదం: నా కాలం, నా తర్వాత వచ్చే కాలం, ఆ తర్వాత వచ్చే కాలం, సర్వ కాలాల్లో అతి ఉత్తమమైన కాలాలు ఇవి మూడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు). అలాంటి ఉత్తమమైన కాలంలో ఈ బిద్అత్ లేనే లేదు.
అందుగురించి మహాశయులారా, ఇది మంచి కార్యమే కదా, ఎందుకు చేయకూడదు? ఇలాంటి ప్రశ్నల్లో మనం పడే అవసరం లేదు. ప్రవక్త గారు చేశారా? సహాబాలు చేశారా? సహాబాలను అనుసరించినవారైనటువంటి తాబయీన్లు చేశారా? ఈ విషయం మనం చూడాలి. మరొక విచిత్రమైన విషయం, అదేమిటంటే కాంట్రడిక్షన్. ఎవరైతే సామాన్యంగా మీలాదున్నబీ జరుపుకుంటూ ఉంటారో, ఏ తారీఖున జరుపుకుంటారు? తారీఖు తెలియదా? 12 రబీఉల్ అవ్వల్. కదా? అయితే ఈ తారీఖు అని మనం ఏదైతే అంటామో, డేట్, ఇవి ఎప్పటి నుండి ఉన్నాయి? ఎప్పటి నుండి? భూమి, ఆకాశాలు, సూర్య, చంద్రులు అప్పటి నుండి, అవును కదా? “ఇన్న ఇద్దతష్షుహూరి ఇందల్లాహి ఇస్నా అషర షహ్రన్ ఫీ కితాబిల్లాహ్” సూరె తౌబా లోని ఆయత్. అయితే, మీలాదున్నబీ జరుపుకునే వాళ్లలో అధికులు, ఇంచుమించు అందరూ ప్రవక్త గారి గురించి ఒక మాట వారి వద్ద ఏమున్నదంటే, నవూజుబిల్లాహ్ అస్తగఫిరుల్లాహ్, ఒక హదీస్ అని వారు అంటారు కానీ హదీస్ కాదు అది. “అవ్వలు మా ఖలఖల్లాహు నూరీ” (أَوَّلُ مَا خَلَقَ اللَّهُ نُورِي) (అనువాదం: అల్లాహ్ సృష్టించిన వాటిలో మొదటిది నా జ్యోతి). ప్రప్రథమంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నూర్ను అల్లాహుతాలా పుట్టించాడు, ఆ తర్వాతనే ఈ లోకమంతా పుట్టించబడింది అని. మొట్టమొదటిసారిగా, తొలిసారిగా, ప్రప్రథమంగా ఎవరిని పుట్టించడం జరిగింది అంటారు వాళ్ళు? సహీహ్ హదీస్ లేదు దానికి కానీ వారు చెప్పే ప్రకారంగా ఎవరిని పుట్టించడం జరిగింది? ప్రవక్త గారి నూర్ను. అంటే వారి ప్రకారంగా ప్రవక్త అందరికంటే మొదటిసారిగా పుట్టించబడ్డారు. అయితే మీ విశ్వాస ప్రకారం ప్రవక్త పుట్టినప్పుడు సూర్య చంద్రులు లేవు, భూమి ఆకాశాలు లేవు, పగలు రాత్రి అనేదే లేదు, డేట్ అన్నదే లేదు. మరి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఎందుకు మళ్ళీ బర్త్డేలు జరుపుకుంటున్నారు? అర్థమైందా? అర్థమైందా లేదా విషయం? మీ విశ్వాస ప్రకారం అందరికంటే ముందు ఎవరు పుట్టారు? ప్రవక్త, ప్రవక్త యొక్క నూర్. అప్పుడు సూర్య చంద్రులు, ఈ నక్షత్రాలు, ఈ లోకమే లేదు. మరి ఈ తారీఖు అన్న విషయం, డేట్ అన్న విషయం భూమి ఆకాశాలు పుట్టి, సూర్య చంద్రులు తర్వాత కదా? రాత్రి, పగలు ద్వారా మనకు డేట్స్ అనేది ఏర్పడతాయి. ఈ విధంగా వారి మాటయే వారికి విరుద్ధంగా ఉంది.
మరొక విచిత్రమైన విషయం. ఒక మౌల్వీ సాబ్ చాలా పుస్తకం రాశారు, మీలాదున్నబీ చేయవచ్చు అని రుజువు చేయడానికి. స్వయంగా ఆయన ఒకచోట ఏం రాశాడో తెలుసా? ఒక్కచోట రాయలేదు, ఒక హెడ్డింగ్, ఒక సైడ్ హెడ్డింగ్ అని ఏదైతే అంటారో. ఖులఫాయే రాషిదీన్ మరియు సహాబాల కాలంలో మీలాదున్నబీ జరుపుకోకపోవడానికి కారణాలు. అంటే, సహాబాల కాలంలో మీలాదున్నబీ జరగలేదు అని ఒప్పుకుంటున్నారు. కానీ ఇక తర్వాత వచ్చి ఏం చేస్తున్నారు? కొన్ని కారణాలు తెలుపుతున్నారు. అయితే ఎప్పుడైతే వారు ఒప్పుకుంటున్నారో సహాబాలు కూడా దీనిని చేయలేదు అని, అంటే ఇక ఖురాన్ హదీస్లో లేనట్లే కదా. మళ్ళీ మీలాదున్నబీ జరుపుకోవడానికి ఆ ఆయత్ కూడా ఉన్నది, ఫలానా ఆయత్ ఉన్నది, ఫలానా హదీస్ ఉన్నది, ఫలానా హదీస్ ఉన్నది అని అంటే, ఈ రోజు ఈ హదీసులు, ఈ ఆయతులతోనైతే మీరు దలీల్ చూపుతున్నారో, ఆ ఆయతులు, ఆ హదీసులు సహాబాలకు తెలియలేదా? మరి తెలిస్తే వారెందుకు జరుపుకోలేదు? గమనించండి.
మరియు మన ఏ సోదరులైతే మీలాదున్నబీ జరుపుకుంటున్నారో, వారు ఈ విషయాలపై గ్రహించాలి, ఆలోచించాలి. సూరె యూనుస్ ఆయత్ నంబర్ 57, 58 ద్వారా మీలాదున్నబీ చేయవచ్చు అన్నటువంటి ఒక ఆధారం, సాకు తీసుకునే ప్రయత్నం చేస్తారు. గమనించండి కొంచెం. “కుల్ బి ఫద్లిల్లాహి వ బిరహ్మతిహి, ఫబిజాలిక ఫల్ యఫ్రహూ” (قُلْ بِفَضْلِ اللَّهِ وَبِرَحْمَتِهِ فَبِذَٰلِكَ فَلْيَفْرَحُوا). బి ఫద్లిల్లాహి, అల్లాహ్ యొక్క దయ, వ రహ్మతిహి, అల్లాహ్ యొక్క కారుణ్యం. అల్లాహ్ యొక్క దయ మరియు కారుణ్యం మీకు లభించినది అంటే, మీరు సంతోషించండి. ఖురాన్ యొక్క ఆయత్ యొక్క భావం, తర్జుమా. కానీ ఉర్దూలో అల్లాహ్ కా ఫజ్ల్ ఔర్ ఉస్కి రహ్మత్ జబ్ యే పాయే తో వో ఖుష్ హో జాయే. సంబరపడాలి, సంతోషించాలి. దాంట్లో కొంచెం పదం ఏలుపు… పెంచుతారు. ఖుషీ మనాయో. ఖుష్ హో జావో, ఖుషీ మనాయో. సంతోషించండి, సంబరపడండి. సంతోషాలను, మీ సంబరాలను ఒక ఉత్సవంగా జరుపుకోండి. ఈ రెండిటిలో తేడా ఉందా లేదా? ఒక నిమిషం.
అయితే ఇది 58వ ఆయత్. కానీ ఈ అల్లాహ్ యొక్క దయ, ఈ అల్లాహ్ యొక్క కారుణ్యం, అల్లాహ్ దేని గురించి చెప్తున్నాడు? ఏంటిది అది? అయితే 57వ ఆయత్లో ఉంది. “యా అయ్యుహన్నాసు కద్ జాఅత్కుమ్ మౌఇజతుమ్ మిర్రబ్బికుమ్” (يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُم مَّوْعِظَةٌ مِّن رَّبِّكُمْ). ఖురాన్ గురించి. అంటే ఈ ఖురాన్ గ్రంథం అల్లాహ్ యొక్క గొప్ప దయ, అల్లాహ్ యొక్క గొప్ప కారుణ్యం. ఇది రావడం ద్వారా మీ మనసులో ఉన్నటువంటి రోగాలు దూరమైపోయినాయి, మీలో ఉన్నటువంటి పరస్పరం కోపాలు, ద్వేషాలు ఇవన్నీ దూరమయ్యాయి, షిర్క్, బిద్అతులు ఇవన్నీ దూరమైపోయాయి, విశ్వాస మార్గం మీకు లభించినది, మీ సమాజంలో ఉన్నటువంటి ఎన్నో దుర్మార్గాలు కూడా దూరమైపోయి మీరు సన్మార్గం వైపునకు వచ్చారు. ఖురాన్ అల్లాహ్ యొక్క గొప్ప దయ, గొప్ప కారుణ్యం. ఇది వచ్చినప్పుడు మీరు దీనిని సంతోషించాలి. అయితే ఏమంటారో తెలుసా? ఖురాన్ అవతరించినప్పుడు అల్లాహ్ దీనిని ఒక గొప్ప కారుణ్యం, గొప్ప దయ అని తెలిపి సంతోషపడాలి, సంతోషించాలి, ఉత్సవాలు జరుపుకోవాలి అని ఏదైతే మనకు అల్లాహ్ తెలుపుతున్నాడో, ఈ ఖురాన్ ఎవరి ద్వారా వచ్చింది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక ప్రవక్త పుట్టిన రోజును మనం ఎంత గొప్పగా జరుపుకోవాలి, మీరే ఆలోచించండి. ఓ నిజంగానే చాలా గొప్ప విషయం అని ప్రజలు అనుకుంటారు. కానీ ఇక్కడ మళ్ళీ ప్రశ్న, అదేంటి? ఈ ఆయత్ ఎవరిపై అవతరించింది? ఈ రోజు మనపై అవతరించిందా? మీలాదున్నబీ జరుపుకునే వాళ్ళ మీద అవతరించిందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించింది. మరి ప్రవక్త ఇలాంటి మీలాదున్నబీ జరుపుకోవాలి అని ఈ ఆయత్ ద్వారా ఎక్కడైనా చెప్పారా? మరి ఈ విషయం సహాబాలకు బోధపడలేదా? ఈ రోజు ఈ భావం తీసుకోవడానికి ఎక్కడ మనకు హక్కు ఉన్నది?
మరియు ఖురాన్ హదీసులను మనం పరిశీలిస్తే, అక్కడ మనకు తెలిసే విషయం ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పుట్టుకను కేవలం గొప్ప కారుణ్యంగా చెప్పలేదు అల్లాహుతాలా. ఏ రోజు ప్రవక్తకు ప్రవక్త పదవి లభించినదో, ఏ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఖురాన్ లభించినదో, దానిని అల్లాహుతాలా ఒక గొప్ప కారుణ్యంగా చెబుతున్నాడు. సూరె ఆలి ఇమ్రాన్లో “లఖద్ మన్నల్లాహు అలల్ ముఅమినీన ఇజ్ బఅస ఫీహిమ్” ( لَقَدْ مَنَّ اللَّهُ عَلَى الْمُؤْمِنِينَ إِذْ بَعَثَ فِيهِمْ). అల్లాహుతాలా విశ్వాసులపై ఎంతో అనుగ్రహించాడు. “ఇజ్ బఅస ఫీహిమ్” ( إِذْ بَعَثَ فِيهِمْ) (వారిలో ఒక ప్రవక్తను పంపినప్పుడు). ఎలా? వారిలో నుండే ఒక ప్రవక్తను ఎన్నుకొని వారి మధ్య ఒక సందేశ దూతగా అల్లాహుతాలా పంపాడు. ఆ సందేశ దూత ఖురాన్ ఆయతులను పఠిస్తారు వారి మధ్యలో. మరియు వారిని శుభ్రపరుస్తారు. చక్కదిద్దుతారు. వారికి ఖురాన్, హదీసులను నేర్పుతారు. గమనించండి. ఖురాన్, హదీసులను నేర్పడం, అల్లాహ్ ఆయతులను పఠించడం, ప్రజలను షిర్క్, దుర్మార్గం, బిద్అత్, అన్ని రకాల చెడుల నుండి మంచి వైపునకు తీసుకురావడం, దీనిని ఒక గొప్ప అనుగ్రహంగా ప్రస్తావిస్తున్నారు. మరి ఇంతకుముందు మనం ముస్లిం షరీఫ్ హదీస్ ఏదైతే విన్నామో, అందులో మరొక విషయం కూడా ఉన్నది. అదేమిటి?
ప్రవక్తా, మీరు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు ఈ సోమవారం రోజున అని అడిగినప్పుడు, ఇదే రోజు నేను పుట్టాను, జన్మించాను. “వ బుఇస్తు” ( وَبُعِثْتُ). మరియు అదే రోజు నాకు ప్రవక్త పదవి లభించినది. ప్రవక్త పదవి లభించినది. అయితే ఈ ప్రవక్త పదవి లభించడం, ప్రవక్తకు ప్రవక్త పదవి లభించి మనకు ఏ సన్మార్గం అయితే లభించినదో, ఇది చాలా గొప్ప విషయం.
అందుగురించి సోదరులారా, ఈ విధంగా మనం ఆలోచిస్తూ పోతే, గ్రహిస్తూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. చివరికి ఒక సంక్షిప్తంగా, ఇంతకుముందు కూడా కొన్ని సంవత్సరాల క్రితం మీలాదున్నబీకి సంబంధించిన ఒక తెలుగులో ఒక టాపిక్, ఒక ప్రసంగం చేశాను. అందులో ఈ బిద్అత్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అది కూడా వివరంగా తెలిపాను, తెలియజేశాను. కానీ మన అఖండ భారత్లో అంటే, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇదంతా విడిపోక ముందు, సంగతి గురించి అప్పుడు తొలిసారిగా మన ఏరియాలో, భారతదేశంలో ఈ మీలాదున్నబీ యొక్క జులూస్ ఏదైతే వెళ్తుందో, ఆ జులూస్ 5 జులై 1933లో స్టార్ట్ అయింది అని, ఈ మీలాదున్నబీ యొక్క జులూస్ ఏదైతే వెళ్తుందో, అది 5 జులై 1933లో మన ఇండియాలో స్టార్ట్ అయింది. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలన అక్కడ జరుగుతుంది. వారి నుండి దీని గురించి ప్రత్యేకమైన లైసెన్స్ తీసుకొని వారు కొందరు దీనిని చేశారు. దీనిని ఇలా జరుపుకోవడానికి కారణం ముఖ్యంగా ఏంటో తెలుసా? పండితులు కాదు దీనిని స్టార్ట్ చేసిన వారు.
క్రైస్తవులు, ఇంకా వేరే మతస్తులు వారి మత పెద్దల జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. జరుపుకుంటూ ఉంటారు కదా? క్రిస్మస్ అని కానీ, గాంధీ జయంతి అని కానీ, ఇంకా అంబేద్కర్ గారు జన్మించిన జన్మదినం గాని, ఇంకా వేరే ఎన్నో రకాలుగా ఎందరో పెద్దలు, మహానుభావుల జన్మదిన వేడుకలు జరుగుతూ ఉంటాయి. అయితే వాళ్ళందరూ వారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నప్పుడు, మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే గొప్పవారు ఎవరు? వారి యొక్క జన్మదిన వేడుకలు మనం ఎందుకు జరుపుకోకూడదు? మనం ఆ రోజున ఎందుకు జులూస్ తీయకూడదు? ఇలాంటి ఆలోచన వారిలో వచ్చి, ఇలాంటి ఒక బిద్అత్కు వారు ఒక పునాది నాటారు. అప్పటి నుండి ఇది మొదలైంది ఈ ఏరియాలో. మరి ఇక్కడ మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసును గ్రహించాలి. “మన్ తషబ్బహ బి కౌమిన్ ఫహువ మిన్హుమ్” (مَنْ تَشَبَّهَ بِقَوْمٍ فَهُوَ مِنْهُمْ). (ఎవరైతే ఇతర జాతుల, ఇతర మతస్తుల, ఇతర ధర్మాలను అనుసరించే వారి యొక్క పోలికను అవలంబిస్తాడో, వారి గతి వారితోనే అయిపోతుంది). అల్లాహు అక్బర్ అస్తగఫిరుల్లాహ్. ఇది ఇష్టమేనా మనలో ఎవరికైనా?
అల్లాహ్ ఏమంటున్నాడు మనకు? “వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్” (وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ). (మీకు చావు వచ్చినా కానీ ఇస్లాంపై, కల్మా చదువుతూ, ఇస్లాం ప్రకారంగా మీ చావు రావాలి). అంటే, చచ్చేవరకు మీరు ఇస్లాంపై జీవించాలి. అందుగురించి, బర్త్డేలు జరుపుకోవడం, అది ప్రవక్త బర్త్డే గాని, స్వయంగా మన బర్త్డేలు గాని, ఇంకా వేరే ఏ విషయాలు కానీ, ఇస్లాంకు వీటికి ఎలాంటి సంబంధం అనేది లేదు. ఇందులో మనకు పుణ్యం లభించదు, పాపం అవుతుంది. అల్లాహ్ ఇలాంటి బిద్అతుల నుండి, దురాచారాల నుండి మనందరినీ కూడా కాపాడుగాక.
జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[నెల్లూరు రొట్టెల పండగ పేరుతో జరిగే షిర్క్ మరియు అధర్మ కార్యాల గురుంచి ఈ పోస్టులో వివరించబడింది]
నెల్లూరు ఆంధ్రరాష్ట్రానికి చెందిన ఒక జిల్లా, సముద్రం ఒడ్డున ఉన్న ఒక అందమైన పట్టణము. 12వందల సంవత్సరాల క్రితం పన్నెండు మంది అరబ్ ముస్లిములు వలస వచ్చారు అని కథనాలు చెప్పుకుంటారు. వారందరూ జాతులకు, మతాలకు అతీతంగా శాంతిని నెలకొల్పాలని వచ్చినట్లు భావిస్తారు. మరియు కొన్ని రోజుల తరువాత వారందరూ షహీద్ కాబడ్డారనీ అంటారు. ఆ తరువాత వారందరినీ ఆ సెలయేరు (ఒక పెద్ద చెరువు) వద్దనే సమాధి చేసారు. తరువాత కొంత మంది ప్రజలు ఆ సమాధులనే దర్గాలుగా నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆ పన్నెండు దర్గాలను కలిపి “బారా షహీద్ మజార్ షరీఫ్” అని పేర్కొంటారు. అక్కడే మరొక దర్గా “సయ్యద్ బాబా” అని “లాల్ దర్గా” పేరుతో ఉంది.
రొట్టెల పండుగ పేరుతో 10 నుండి 15 లక్షల మంది ప్రజలు ధర్మాలకు అతీతంగా, ప్రతి ఏట ముహర్రం నెలలో సందర్శిస్తారు. అక్కడ ఉత్సవాల పేరుతో ముహర్రం నెల 10, 11, 12వ తేదిలలో రొట్టెల మార్పిడి జరుగుతుంది. అలా మూడు నాలుగు రోజుల పాటు ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు.
అంటే అక్కడ వచ్ఛేవారి వివిధ మొక్కుబడుల ప్రకారం రొట్టెలకు పేర్లు కేటాయించుకుంటారు. ఉదాహరణకు “పిల్లల రొట్టెలు” – ఎవరికైన సంతానం లేకపోతే ఆ నదిలో నిలబడి తలపై ఆ నది నీళ్ళను తీర్ధంలా చల్లుకొని, సంతానం లేనివారు సంతానం కలిగినవారి నుండి రొట్టెలను తీసుకొని తింటారు. అలా చేస్తే సంతాన ప్రాప్తి జరుగుతుందని వారి మూఢ నమ్మకం. అలా సంతానం లేనివారు రొట్టెలను తిన్న తరువాత వారికి సంతానము కలిగితే, తిరిగి వచ్చి వారుకూడా రొట్టెలను ఇతరులకు ఇస్తారు. అలా అనేక మంది ప్రజలు తమ తమ మ్రొక్కుబడుల ప్రకారం ప్రతి ఏట రొట్టెల మార్పిడి జరిపే ఆచారాన్ని “నెల్లురు రొట్టెల పండుగ” అని అంటారు.
ప్రజల సమస్యలకు అనుగుణంగా రొట్టెలకు పేర్లు పెట్టుకుంటారు. అంటే; ఉద్యోగం రొట్టెలు, ధనం రొట్టెలు, విదేశాలకు పోయే వీసా రొట్టెలు, అసెంబ్లీ రొట్టెలు, ఆరోగ్యం రొట్టెలు, వివాహం రొట్టెలు అని వివిధ సమస్యల పేర్లతో రొట్టెల మార్పిడి జరుగుతుంది. తరువాత అక్కడికి వచ్చేవారు అక్కడ ఉన్న దర్గాలను కూడా ఆరాధిస్తారు. ప్రతి దర్గా వద్ద జరిగే షిర్క్ మరియు బిద్అత్ వంటి అధర్మ కార్యాలను బహిరంగా పాటిస్తారు.
“బారా షహీద్ మజార్ షరీఫ్”కు వచ్చే ప్రజలు తమ నమ్మకాల ప్రకారం నాణల రూపంలో ఆ దర్గాలపై నాణెములను(చిల్లరడబ్బులు) విసురుతారు. దర్గాల నిర్వాహకులు దర్గాలపై నుండి రూపాయి లేక రెండు రూపాయి బిళ్లలను తీసుకుని, ఎర్రటి లేక పచ్చటి రంగుల గుడ్డపేలికలలో చుట్టి, ప్రజల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకొని, ఆ ఒక్క రూపాయిని పది రూపాయిలకు లేక ఇరవై రూపాయిలకు విక్రయిస్తారు. ఎందుకంటే? ఆ నాణెములను ప్రజలు తమ దగ్గర ఉంచుకుంటే ధనంలో శుభాలు కలుగుతాయని నమ్మిస్తారు.
అధికమైన సంఖ్యలో స్త్రీలు అక్కడ సమావేశమవుతారు. ఎందుకంటే? మూఢ నమ్మకాల వలలో స్త్రీలే అతి ఎక్కువగా చిక్కుకుంటారు. మరియు ఇస్లాం ధర్మం తెలియని అజ్ఞాన ముస్లింలు మరియు బలహీన విశ్వాసులు అలాంటి మూఢ విశ్వాసాలకు తొందరగా ప్రభావితులవుతారు. ఎందుకంటే? ఎదో విధంగా తమ అదృష్టాలను పరిక్షించుకొని, కష్టాలను దూరం చేసుకోవాలని వారి తపన. మన సమాజంలో అలాంటి మూఢ విశ్వాసాలు కలిగిన వారు చాలా మంది ఉన్నారు. మరియు వారు దేశ, విదేశాల దర్గాలను సందర్శించి ఆరాధిస్తూ ఉంటారు.
“ఇవన్నీ మీరు మరియు మీ తండ్రి, తాతలు పెట్టిన పేర్లు మాత్రమే, అల్లాహ్ వీటిని గురించి ఎట్టి ప్రమాణం అవతరింప జేయలేదు. వారు కేవలం తము ఊహాగానాలను మరియు తమ ఆత్మలు కోరే మనోవాంఛలను మాత్రమే అనుసరిస్తున్నారు. వాస్తవానికి వారి ప్రభువు తరపునుండి వారి వద్దకు మార్గదర్శకత్వం కూడా వచ్చి ఉన్నది?” (సూరతున్ నజ్మ్:23)
(ఓ ప్రవక్తా!)వారికి ఇలా చెప్పు: “అల్లాహ్ను వదలి మీరు ఎవరెవరినయితే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవ్వంత అధికారంగానీ వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్కు సహాయకుడు కూడా కాదు” (సూరతుస్ సబా:22).
అల్లాహ్ను మాత్రమే ప్రార్ధించాలి. భయం, భక్తి ఆశ, ప్రేమానురాగం, మొరపెట్టుకోవడం, అణుకువ, అశక్తత, శరణు వేడుకోవడం, జిబహ్ చేయడము, మొక్కుబడులు చెల్లించడం, ఉపాధిని కోరడం వంటి కార్యాలన్నీ ఆరాధనలే. కనుక ఆ ఆరాధనలు అల్లాహ్కే సొంతం చేసి ఆరాధించాలి. అల్లాహ్ను తప్ప మరెవరినీ ఆరాధించకూడదు.
“మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తనూ పంపినా: “నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! కావున మీరు నన్నే ( అల్లాహ్నే) ఆరాధించండి” అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చి పంపాము.” (సూరతుల్ అంబియా:25)
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “ఎప్పుడైతే మీరు సహయం కొరకై మొరపెట్టుకుంటారో అప్పుడు అల్లాహ్ను మాత్రమే సహాయానికై ఆర్థించండి.” (తిర్మిజీ:2516, జిలాలుల్ జన్నహ్: 316-318).
ముఖ్య గమనిక: “రొట్టెల పండుగ పేరున మనం చేసే ఆచారాలు, ఆరాధనలు, మొక్కుబడులు ధర్మం కానే కావు. ఎవరైనా అల్లాహ్ పేరుపై తప్ప ఇతరులెవరి పేరుపై నైనా మొక్కుబడులు చెల్లిస్తే అది “షిర్క్” ఆచారమే అవుతుంది. ఒక వేళ ఎవరైనా తెలిసి తెలియక మొక్కుబడులు చేసుకొని ఉంటే, వాటిని నెరవేర్చకూడదు. దాని వల్ల ఎలాంటి నష్టంగాని లేక కీడుగాని జరగదు. కనుక ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “ఎవరైతే అల్లాహ్ విధేయత పట్ల మొక్కుబడి చేసుకున్నారో వారు ఆ మొక్కుబడిని తీర్చాలి. మరియు ఎవరైతే అల్లాహ్ అవిధేయత పట్ల మొక్కుకున్నారో వారు ఆ మొక్కబడిని తీర్చకూడదు.”” (బుఖారి :2602).
ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 67-70). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్లామీయ ఈ రెండవ మాసంలో ఎంతో మంది అపశకునం పాటిస్తారు. ఇలా పాటించడం ధర్మమా అధర్మమా ఈ వీడియోలో తెలుసుకోండి.
సఫర్ (صفر) మాసం – ఇస్లామీయ క్యాలెండరులో రెండవ నెల. ఇది ముహర్రం నెల తర్వాత వస్తుంది. దీనికా పేరు ఎలా వచ్చిందనే విషయమై కొందరు పండితులు తమ అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చారు – ఈ నెలలో ప్రయాణం కోసం ప్రజలు మక్కా నగరాన్ని ఖాళీ (ఇస్ఫార్) చేస్తుండేవారు.
ఇంకో అభిప్రాయం ప్రకారం ఈ నెలలో మక్కావాసులు ఇతర తెగలపై దాడి చేసి, వారి మొత్తం సంపదనను కొల్లగొట్టేవారు (అరబీలో సిఫ్రాన్ మినల్ మతాఅ) అంటే వారికి ఏమీ మిగల్చకుండా నిలువుదోపిడి చేసేవారు. (ఇబ్నె అల్ మంధూర్ వ్రాసిన లిసాన్ అల్ అరబ్ పుస్తకం 4వ భాగం 462-463)
సఫర్ అంటే భాషాపరంగా శూన్యమాసం అంటే ఖాళీ నెల అని అర్థం. ఈ పదం ఉనికిలోనికి రావటానికి రెండు కారణాలు వాడుకలో ఉన్నాయి:
మొదటిది: ఈ నెలలో అనాగరిక అరబ్బులు తమ ఇళ్ళను ఖాళీ చేసి లూటీ చేయటం కోసం వెళ్ళటం – సిఫర్ అంటే విసర్జించటం లేక ఖాళీ చేయటం.
రెండోది: అరబీ పదమైన సుఫ్ర్ అంటే పసుపు అనే పదం నుండి సఫర్ అనే పదం రావటం. ఈ నెలకు ఆ పేరు పెట్టబడిన కాలంలో, క్రమంగా క్షీణించిపోతూ, ఆకులు పసుపు రంగులో మారిపోయే శరదృతువులో ఆ నెల రావటం వలన దానికి ఆ పేరు వచ్చిందనేది మరొక అభిప్రాయం.
[24 నిమిషాల వీడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
సఫర్ నెల వాస్తివికత
సఫర్ నెల ఇస్లామీయ క్యాలండర్ ప్రకారం రెండవ నెల. అరబ్బులలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవప్రవక్తగా రాక మునుపు సఫర్ నెలను అపశకునంగా భావించేవారు. మరియు ప్రాచీన అరబ్బులు ఈనెలలో ఆకాశం నుండి అనేక విపత్తులు, బాధలు, నష్టాలు అవతరిస్తాయని నమ్మేవారు. అందుకని ఈ నెలలో వివాహాలు, సంతోష సంబరాలు వంటి మంచి కార్యాలను నిర్వహించేవారు కాదు.
ప్రస్తుత కాలంలో మన ముస్లిం సమాజానికి చెందిన కొంత మంది అజ్ఞానులు, అలాంటి మూఢ నమ్మకాల వెంటపడి వారిలాగానే సఫర్ నెల పట్ల అపశకునాలకు చెందిన కొన్ని నమ్మకాలకు గురికాబడి ఉన్నారు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి:
1-మొత్తం సంవత్సరంలో పది లక్షల ఎనభై వేల విపత్తులు ఆకాశం నుండి దిగి వస్తాయని భావిస్తారు. ఆ విపత్తలలో నుండి ఒక్క సఫర్ నెలలోనే తొమ్మిది లక్షల ఇరవై వేల విపత్తులకు గురికాబడతారని భావిస్తారు.
2-సఫర్ నెల రాగానే ప్రయాణాలను మానుకుంటారు, సంతోషకరమైన సంబరాలను జరుపుకోవడం అపశకునంగా భావిస్తారు.
౩-ఈ నెల మొదటి పదమూడు రోజులను “తేరతేది” అని పేర్కొంటూ, తీవ్రమైన విపత్తులకు గురికాబడే రోజులుగా భావిస్తారు.
4- ఈ నెలలో వివాహాలు చేసుకోరు, పెళ్ళి చూపులకు సహితం దూరంగా ఉంటారు. ఒక వేళ క్రొత్తగా వివాహాలు జరిగి ఉన్నా ఆ జంటలను పదమూడు రోజుల వరకు విడదీసి, ఒకరి ముఖాలను మరొకరు చూడడం అపశకునంగా భావిస్తారు. అలా కాదని వారు గనుక కలుసుకుంటే, వారిద్దరిలో ఒకరు చనిపోతారు, లేక జీవితాంతం వారి మధ్య తగాదాలు ఏర్పడతాయని భావిస్తారు.
యదార్ధం ఏమంటే? అలాంటి అపశకునాలకు ఇస్లాం ధర్మంలో ఎలాంటి వాస్తవికత లేదు. పైగా అలాంటి మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే? నెలలను లేక సమాయాలను అపశకునాలకు విపత్తులకు ప్రత్యేకిస్తే, అల్లాహ్ ను తప్పుపట్టినట్లుగా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేసారు. కనుక ఒక హదిసు ఖుద్సీలో ఇలా ఉంది:
“అల్లాహ్ ఇలా తెలియజేసాడు: “ఆదాము పుత్రుడు (మానవుడు) కాలాన్ని (రోజులను, నెలలను, యేడాదిని) తిట్టుతున్నాడు. మరియు నేనే కాలాన్ని. నా చేతిలోనే రాత్రింబవళ్ళ మార్పిడి ఉన్నది.”,(బుఖారి;4452, ముస్లిం:41 70)
మరొక చోట ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“మీరు కాలాన్ని తిట్టకండి. నిశ్చయంగా అల్లాహ్ యే కాలము.” (ముస్లిం:4165)
ఆఖరి చహార్షుమ్బా
సఫర్ నెలకు చెందిన చివరి వారంలో ఉన్న బుధవారాన్ని ఊరుబయటకు వెళ్ళి పచ్చగడ్డిపై నడవటం పుణ్య ఆచారంగా భావిస్తారు. ఎందుకంటే? ఆ రోజే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారికి స్వస్థత లభించినది అని, మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సరదాగా ఆ రోజు పచ్చగడ్డిపై నడిచారని అంటారు. దాని కారణంగా ప్రజలు భార్యపిల్లలతో కలిసి పార్కులలో, తోటలలో షికార్లు చేస్తారు. దానిని ప్రవక్త ఆచారం అని అంటారు.
ఆ సాకుతో కొంత మంది ప్రజలు సఫర్ నెల చివరి బుధవారం తమ ఇండ్లలో మంచి వంటకాలు చేసుకొని, స్నానాలు చేసుకొని, క్రొత్త దుస్తులు ధరించి, బాగా అందంగా తయారయ్యి అందాల పోటీల సభలలో పాల్గొన్నట్లు ముస్తాబు అవుతారు. చిన్నాపెద్ద, ఆడామగా అనే తేడా లేకుండా పార్కుల్లో, తోటల్లోకి పోయి ఏ విధంగా కలిసి మెలిసి షికార్లు చేస్తుంటారనేది మనం చెప్పనక్కర లేదు.
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చివరి రోజులు:
సఫర్ నెల చివరి బుధవారం రోజున ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారికి స్వస్థత లబించిందా అంటే? దానికి జవాబు కానేకాదు. ఎందుకంటే? “అర్రహీఖుల్ మఖ్తూమ్” తెలుగు పేజి: 813లో ప్రవక్త గారి గురించి ఇలా ఉంది: “ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానికి అయిదు రోజుల ముందు బుధవారం రోజున ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) శరీర ఉష్ణోగ్రత (జ్వరము) మరింత పెరిగిపోయింది. ఆ కారణంగానే ఆయన బాధ బాగా ఎక్కువై అపస్మారక పరిస్థితి ఎర్పడింది.” నిజమేమంటే ఆ రోజే ఆయన అస్వస్థకు గురికాబడ్డారు. కాని మనం స్వస్థత చేకూరిందంటూ సంతోషాలు జరుపుకోవడం ధర్మమేనా? దాని వలన మనకు పుణ్యం ప్రాప్తిస్తుందా? లేక పాపం ప్రాప్తిస్తుందా? మనం ఆఖరి చహార్షుమ్బా పేరుతో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చరిత్రనే తప్పుగా ప్రచారం చేయడం లేదా?
ప్రియమైన ముస్లిములారా! ఆఖరి చహార్షుమ్బా అంటూ ప్రత్యేకమైన ఎలాంటి పుణ్యకార్యం లేదు. మరియు సఫర్ నెల గురించి ఇస్లాం ధర్మంలో ఎలాంటి అపశకునాలు లేవు. అసలు అలాంటి అపశకునాలకు గురికాకూడదని ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు:
“అంటు (వ్యాధులు), దుశ్శకునం అనేవి ఒట్టిమాటలే. అపశకునాలు లేవు, గుడ్లగుబ కేకల వలన ఎలాంటి ప్రభావం లేదు, మరియు సఫర్ (నెల) ఏమి కాదు…” (బుఖారి: 5316, ముప్లిం: 4116)
ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 71-74). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహ్మతుల్లాహి అలైహి) యొక్క సంక్షిప్త జీవిత చరిత్ర, మరియు ప్రత్యేకంగా గ్యారవీ(రబీఉస్సానీ నెల 11 వ రోజు)గురించి నిజమైన వివరాలు ఈ వీడియోలో తెలుసుకోగలరు
ఈ ప్రసంగంలో, వక్త షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహిమహుల్లాహ్) గారి జీవిత చరిత్ర, ఆయన వంశం మరియు విద్య గురించి క్లుప్తంగా వివరిస్తారు. ఆయన తౌహీద్ (ఏకదైవారాధన) మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని అనుసరించడంపై చేసిన స్పష్టమైన బోధనలను ఉటంకిస్తారు. అనంతరం, రబీఉల్-ఆఖర్ నెలలో ఆయన పేరు మీద జరిగే ‘గ్యారవీ’ మరియు జెండాలు ఎగురవేయడం వంటి ఆచారాలను తీవ్రంగా ఖండిస్తారు. ఈ పనులు షిర్క్ మరియు బిద్అత్ (ధర్మంలో నూతన కల్పనలు) అని, ఇస్లాం బోధనలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేస్తారు. ఆయన పట్ల గౌరవం చూపించడం మరియు ఆయన విషయంలో అతిశయోక్తికి పాల్పడటం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ, సరైన మధ్య మార్గాన్ని అనుసరించాలని ఉద్బోధిస్తారు. చివరగా, ఇటువంటి మూఢనమ్మకాలకు, కల్పిత కథలకు దూరంగా ఉండి, ఖుర్ఆన్ మరియు సున్నత్ను మాత్రమే అనుసరించాలని ముస్లిం సమాజానికి పిలుపునిస్తారు.
السلام عليكم ورحمة الله وبركاته [అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్] మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.
الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده أما بعد [అల్ హందులిల్లాహి వహ్దహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు అమ్మా బ’అద్] సర్వ స్తోత్రాలు ఏకైకుడైన అల్లాహ్ కే. ఆయన తర్వాత ఏ ప్రవక్త లేరో, ఆయనపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ఇక అసలు విషయానికొస్తే…
మహాశయులారా, పీరానే పీర్, మహబూబే సుబ్ హానీ, షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లాహ్ వారి యొక్క జీవితం మరియు సంక్షిప్తంగా వారి జీవిత చరిత్రతో పాటు వారి యొక్క ముఖ్య బోధనలు ఇంకా రబీఉస్సానీ, రబీఉల్-ఆఖర్ ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం ఈ నాలుగోవ నెల ఇందులో సామాన్యంగా మన దేశాల్లో పీరానే పీర్ పేరు మీద కొత్త జెండాలు పెట్టడం, గ్యారవీలు చేయడం, ఇంకా ఇలాంటి దురాచారాలు ఏదైతే చేస్తున్నారో వాటి వాస్తవికత ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
సోదర మహాశయులారా, పీరానే పీర్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై హిజ్రీ శకం 470 లేదా 471లో జన్మించారు. ఆయన జన్మించిన స్థలం ఇరాక్ లో జీలాన్ మరియు అలాగే కీలాన్ అని కూడా అనబడింది. కానీ జీలానీ అన్న పేరుతో చాలా ప్రఖ్యాతి గాంచారు.
షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారి జీవితం
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇద్దరు మనమలు హజ్రత్ హసన్ మరియు హజ్రత్ హుసైన్ రదియల్లాహు అన్హుమా వీరిద్దరిలో హజ్రత్ హుసైన్ రదియల్లాహు తాలా అన్హు వంశానికి చెందినవారు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై.
యవ్వనంలో చేరిన తర్వాత ఇంచుమించు సుమారు 17, 18 సంవత్సరాల వయసులో బగ్దాద్ లో వచ్చారు. ఆనాటి కాలంలో బగ్దాద్ లో ప్రఖ్యాతిగాంచిన చాలా గొప్ప పండితులు ఉన్నారు. వారితో విద్య అభ్యసించారు.
[నేను ఎక్కువ వివరాల్లో వెళ్లకుండా, మూడు విషయాలు మీ ముందు తెలియజేస్తాను అని చెప్పాను గనుక ప్రతి దాంట్లో కొంత భాగాన్ని తీసుకుని, ఆయన పేరు మీద జరుగుతున్న దురాచారాల గురించి కొంత వివరంగా, స్పష్టంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.]
షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై సుమారు 90 సంవత్సరాల వయసు అల్లాహ్ వారికి ఇచ్చారు. ఇంచుమించు 40 నుండి 50 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన చాలా లోతుగా, మరీ ఎంతో శ్రమించి, కష్టపడి విద్య నేర్చుకున్నారు. ధర్మ విద్యలో ఎన్నో రకాలు కేవలం ఖుర్ఆన్ హిఫ్జ్ మరియు కొన్ని హదీసులు హిఫ్జ్ చేసుకోవడమే కాదు, ఇందులో ఉసూలె తఫ్సీర్, తఫ్సీర్, ఉసూలె హదీస్, హదీస్, ఫిఖ్, ఉసూలె ఫిఖ్ ఇవన్నీ కూడా వస్తాయి. అంతేకాకుండా తజ్కియె నఫ్స్ అంటే మనశ్శుద్ధి, మనిషి యొక్క మనసు ఎల్లప్పుడూ పరలోక విషయంలో ఆలోచిస్తూ ఉండే విధంగా, ఇహలోక జీవితంలోని క్షణం క్షణం కూడా పరలోక లాభానికై గడిపేటువంటి ఆలోచన మనసులో రావాలి. దాని గురించి కొన్ని ప్రత్యేక శిక్షణలు ఇస్లాం ఇచ్చిన ఆదేశ ప్రకారం, వేరే తసవ్వుఫ్ మరియు కొన్ని బిద్అతులు తసవ్వుఫ్ పేరు మీద ఏదైతే మొదలయ్యాయో అలా కాకుండా, అందులో కూడా షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ప్రఖ్యాతిగాంచారు.
ఇంకా మహాశయులారా, విద్య అభ్యసించే కాలంలో ఆయనపై ఎన్నో ఆపదలు వచ్చాయి. ఎన్నెన్నో రోజులు తినడానికి బుక్కెడు కూడు దొరికేది కాదు. అలాంటి కష్టాలను కూడా ఆయన భరించారు. ఆ తర్వాత అల్లాహు తఆలా ఇంచుమించు 40 సంవత్సరాల కన్నా కొంచెం ఎక్కువగా ఆయన ప్రజలకు ఇక విద్య నేర్పడం మొదలుపెట్టారు అంటే అందులో కూడా అల్హందులిల్లాహ్ అల్లాహు తఆలా చాలా సేవలు ఆయన నుండి తీసుకున్నాడు. అల్లాహ్ తఆలా వాటన్నిటినీ స్వీకరించి, షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై సమాధిని అల్లాహ్ నూర్ తో, కాంతితో నింపుగాక. అల్లాహు తఆలా ఆయన యొక్క సమాధిలో స్వర్గపు ద్వారాలు తెరువగాక. ఎల్లవేళల్లో అల్లాహు తఆలా తన కరుణా కటాక్షాలు ఆయనపై కురిపిస్తూ ఉండుగాక. మరియు అల్లాహు తఆలా ఆయనతో సంతోషించి ఆయన ఇహలోకంలో ఇన్ని సత్కార్యాలు చేశారో వాటన్నిటిని స్వీకరించి, ఆయనతో జరిగిన పొరపాట్లను అల్లాహ్ క్షమించుగాక, మన్నించుగాక. ఆమీన్.
మహాశయులారా, షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై గారు కొన్ని పుస్తకాలు, గ్రంథాలు కూడా రచించారు. అందులో “గునియతుత్ తాలిబీన్” అని చాలా ప్రఖ్యాతిగాంచింది. ఇంకా వేరే కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. మరియు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై వారు వారి యొక్క బోధనలు, వారు తమ గ్రంథంలో రాసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తే, చదివితే మరియు వారి పేరు తీసుకొని ఈ రోజుల్లో ఎవరెవరైతే గ్యారవీలు, జెండాలు ఇట్లా అన్నీ చేస్తున్నారో వారి యొక్క పరిస్థితి చూస్తే చాలా భిన్నంగా కనబడుతుంది.
తౌహీద్, సున్నత్ పై ఆయన బోధనలు
ఉదాహరణకు, తౌహీద్ విషయంలో ఒక సందర్భంలో షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై చెప్పారు, “ఓ ప్రజలారా, ఏ సృష్టి చేతిలో కూడా ఎలాంటి అధికారం లేదు. అందరూ కూడా బలహీనులు మరియు ఇహలోకంలో ఎవరైనా రాజు అయినా, ప్రజా అయినా, సిరిసంపదలు గలవాడైనా లేక పేదవాడైనా అందరూ కూడా అల్లాహ్ విధివ్రాతకు లొంగిబడి ఉన్నారు. వారందరి యొక్క హృదయాలు కేవలం అల్లాహ్ చేతిలోనే ఉన్నాయి. అల్లాహ్ తాను కోరినట్లు వారి యొక్క హృదయాలను మారుస్తూ ఉంటాడు.” ఈ విషయం ఆయన రచించిన ఒక గ్రంథం “అల్-ఫత్హుర్ రబ్బానీ” అని 88వ పేజీలో ఉంది.
ఇంకా మహాశయులారా, ఇదే గ్రంథంలోని 191వ పేజీలో,
“ఓ ప్రజలారా, షరీఅత్ ను అనుసరించండి. బిద్అత్లను మీరు కల్పించకండి. మీరు షరీఅత్ ను అనుసరిస్తూ దాని వ్యతిరేకత నుండి దూరం ఉండండి. అల్లాహ్ యొక్క మాట విని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించండి. ఎప్పుడూ కూడా అల్లాహ్ కు మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తకు అవిధేయులుగా కాకండి. తమలో ఇఖ్లాస్, సంకల్ప శుద్ధి మీరు పాటించే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితిలో కూడా షిర్క్ మరియు దాని దరిదాపులకు తాకకండి. ఎల్లప్పుడూ అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని చాటుతూ ఉండండి. అల్లాహ్ యొక్క దర్బార్, అల్లాహ్ యొక్క ముందు నుండి మీరు దూరం కాకండి. కేవలం అల్లాహ్ తో మాత్రమే అర్ధించండి. అల్లాహ్ తప్ప ఇంకా ఎవరి ముందు కూడా మీరు మీ చెయ్యి చాపకండి. ఏ సహాయమైనా గాని అల్లాహ్ తప్ప ఇంకా ఎవరితో కోరకండి. కేవలం అల్లాహ్ మీద మాత్రమే మీరు నమ్మకం, భారం వేసి ఉండండి. అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఎవరి మీద కూడా మీరు మీ నమ్మకాన్ని ఉంచుకోకండి.”
ఇంకా, ఒక సందర్భంలో షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై తమ యొక్క శిష్యునికి బోధ చేస్తూ, “వాస్తవమైన సాఫల్యం పొందడానికి ఒక ఉత్తమమైన చిట్కా తెలుసుకో” అని ఇలా తెలిపారు, “ఒకవేళ నీవు సాఫల్యం కోరితే, నీ మనసులో నుండి, నీ హృదయంలో నుండి అల్లాహ్ తప్ప ఇతరులందరినీ కూడా తీసేసెయ్. అంటే, అల్లాహ్ తప్ప ఇంకా ఎవరితో కూడా భయపడకు. అల్లాహ్ తప్ప ఇంకా ఎవరి మీద కూడా ఎలాంటి ఆశ పెట్టుకోకు. అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఎవరితోనైనా నీకు ఏదైనా శాంతి లభిస్తుంది అని కూడా నీవు ఆశించకు. ఇంకా, అన్ని విధాలుగా, అన్ని రకాలుగా నీవు అందరినీ అసహ్యించుకొని కేవలం అల్లాహ్ ను మాత్రమే ఇష్టపడి, ఆయన ప్రేమను మాత్రమే పొందే ప్రయత్నం చెయ్.” ఇక్కడ అందరినీ అసహ్యించుకోవడము అంటే అల్లాహ్ ఎదుట. అంటే అల్లాహ్ కంటే ఎక్కువగా వేరే ఎవరినైనా ప్రేమించడం, అల్లాహ్ కంటే ఎక్కువగా ఎవరితోనైనా భయపడడం, దీన్ని ఖండిస్తున్నారు. “గమనించు, నీవు అల్లాహ్ ను కాకుండా ఎవరిదైనా ప్రేమ నీ మనసులో వచ్చింది అంటే, నీవు ఒక ముర్దార్, ఒక శవాన్ని, ఒక చనిపోయిన దానిని ఎలా చూసి నీ మనసులో ఛీ అనుకుంటావో అలా భావించు. ఎందుకంటే అల్లాహ్ యొక్క జిక్ర్, అల్లాహ్ యొక్క స్మరణ తప్ప నీకు ఎక్కడా కూడా ఆత్మశాంతి అనేది లభించదు. అల్లాహ్ ను వదిలి నీవు ఇతరులను స్మరిస్తూ ఉంటే, అల్లాహ్ ను వదిలి నీవు ఇతరులను నీవు ఇష్టపడినావంటే నీకు ఎప్పుడూ కూడా సుఖము, శాంతి లభించదు.”
ఈ విధంగా మహాశయులారా, చెబుతూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఇత్తిబా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించే విషయంలో కూడా ఎంతో ఖరాఖండిగా, ఎంతో క్లియర్ గా చెప్పేశారు. “ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించడం లేదో, అంటే ప్రవక్త తీసుకువచ్చిన ధర్మానిని అనుసరించకుండా ఆయన యొక్క అనుసరణను వదిలి ఇంకా వేరే ఎవరినైనా అనుసరణను అతడు అవలంబిస్తాడో, అతడు ఎన్నటికీ అల్లాహ్ వద్దకు చేరుకోలేడు. అల్లాహ్ యొక్క ప్రవక్త అల్లాహ్ వద్ద చేరుకోవడానికి ఒక మాధ్యమంగా వచ్చారు. ఆయనను అనుసరించడం తప్పనిసరి. ఆయన అనుసరణ ఎవరైతే వదులుకుంటారో, అతడు నాశనమైపోతాడు. నాశనమైపోతాడు, నాశనమైపోతాడు. అతడు దుర్మార్గంలో పడిపోతాడు, దుర్మార్గంలో పడిపోతాడు.” ఈ విషయం “అల్-ఫత్హుర్ రబ్బానీ” పేజీ నంబర్ 115 లో రాసి ఉంది.
ఇంతేకాకుండా ఇంకా షిర్క్ నుండి, అల్లాహ్ ను కాకుండా వేరే వారిపై నమ్మకాలు ఉంచుకునే దాని గురించి కూడా ఇంకా ఎంతో స్పష్టంగా తెలిపారు. అయితే మహాశయులారా, ఇక రండి మనం కొన్ని క్షణాల్లో ఈ రోజుల్లో జరుగుతున్న గ్యారవీ మరియు జెండాలు, గుండాలు వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మార్గభ్రష్ట ఆచారాలు – గ్యారవీ
మహాశయులారా, షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై విషయంలో మన సమాజంలో ఒక రకం ప్రజలలో ఎలా ఉన్నారు? ఆయనను ఎంతో గొప్పగా భావించి, నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్ అల్లాహ్ యొక్క వలీ, అల్లాహ్ యొక్క భక్తుడు అని అంటారు కానీ, ఆయన గురించి నమ్మకం, ఆయన గురించి విశ్వాసం, ఆయన గురించి మనసులో ప్రేమ, ఆయన గురించి తమ మనసులో భయం అల్లాహ్ పట్ల ఎలా ఉండాలో అలా ఉంటుంది కొందరికి. ఇది చాలా తప్పు విషయం. చెప్పడానికి నోటితో చెబుతారు, నేను ఈ మాట అన్నందుకు “లేదు నువ్వు తప్పు చెబుతున్నావు” అని తిరుగబడతారు. కానీ నేను చెప్పే ఈ మాట వారి యొక్క రోజువారీ జీవితం ఏదైతే ఉందో, దైనందిన జీవితంలో వారి యొక్క పరిస్థితి ఏదైతే మనం కళ్ళారా చూసామో దానిని చూసి నేను చెబుతున్నాను.
ఉదాహరణకు, మన సమాజంలో చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. గ్యారవీ చేయకుంటే ఈ సంవత్సరం మనకు ఏదైనా నష్టం చేకూరుతుంది. పీరానే పీర్ సాబ్ యొక్క గ్యారవీ అది చేస్తేనే కదా మనకు అన్ని రకాల బాగులు, అన్ని రకాల మంచితనాలు మన ఇంట్లో జరిగేది. చివరికి ప్రతి ఈ నెలలో కొత్త జెండాలు ఏదైతే నాటుతారో, పచ్చ జెండాలు ఏదైతే తమ ఇంటి మీద ఎగురవేస్తారో ఈ జెండాలు ఎప్పటివరకైతే పచ్చగా ఉంటాయో అప్పటివరకు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై గారి యొక్క దీవెనలు, ఆయన యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఉంటాయి. చివరికి కొందరు పల్లెటూర్లలోని విషయం, గ్రామాల్లోని విషయం స్వయంగా నేను ఎందరో గ్రామస్థులతో విన్న విషయం. ఈ సంవత్సరం మా బర్రె ఏదైతే చనిపోయిందో, ఈ సంవత్సరం మా పంటలో, పొలంలో ఏదైతే నష్టం జరిగిందో ఎవడో మొల్వి సాబ్ అట వాడు వచ్చి చెప్పిండు గ్యారవీ చేయొద్దు అని. అందు గురించి మేము చేయడం మానేసుకున్నాము. మాకు ఇదంతా నష్టం జరిగింది. పీరానే పీర్ సాబ్ మా మీద ఎంత కోపంగా ఉన్నాడో ఏమో మేము ఆయన పేరు మీద ఈ సంవత్సరం గ్యారవీ చేయలేదని. ఈ విధంగా వారి యొక్క నమ్మకాలు ఉన్నాయి.
వారు అల్లాహ్ ఎవరు అని అడిగితే మీరు “అల్లాహ్ ఒక్కడే, మన యొక్క దేవుడు” అని అంటారు. మన యొక్క ఆరాధనీయుడు అని అంటారు. అందరికంటే ఎక్కువగా ఎవరితో భయపడతావు అని అంటే “అల్లాహ్ తో” అని అంటారు. ఎవరి మీద నీకు నమ్మకం అనేది ఉంటే “అల్లాహ్ మీద” అని అంటారు. అయితే కేవలం నోటితో అనడం సరిపోదు సోదరులారా. వారి యొక్క జీవితంలో వ్యవహారం ఎలా ఉంది? ఏదైనా నష్టం జరిగింది అంటే “అయ్యో ఫలానా దర్గా కాడికి మేము పోలే కదా. మేము ఫలానా పీరానే పీర్ సాబ్ యొక్క చిల్లాఖానా నుండి మేము దాటాము కానీ కనీసం మేము అక్కడ కొంచెం చందా కూడా ఇయ్యలేదేమో, నజరానా వేయలేదు. అందుగురించి వాళ్ళ యొక్క పీడ మా మీద పడింది.” ఇది ఏంటి? లాభనష్టాలు అల్లాహ్ కాకుండా, అల్లాహ్ చేతిలో కాకుండా ఇంకా వేరే వారి చేతిలో కూడా ఉన్నాయి అని నమ్మడమే కదా! అందు గురించి మనం మహాశయులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వయంగా షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ఏమంటున్నారు? “నీ మనసులో నుండి అల్లాహ్ తప్ప ఇతరులందరినీ తీసేసెయ్. అల్లాహ్ పట్ల మాత్రమే ప్రేమ, అల్లాహ్ తో మాత్రమే భయం, అల్లాహ్ తో మాత్రమే ఆశ, అల్లాహ్ మీదనే నమ్మకం నీవు ఉంచుకో. అప్పుడే నీవు సాఫల్యం పొందుతావు” అని పీరానే పీర్ రహమతుల్లాహి అలై గారు తెలుపుతున్నారు.
సరైన మధ్య మార్గం
ఒక రకం మన ప్రజలలో ఇలాంటి వారు. ప్రజలు కొందరు ఇలా చేస్తున్నారు అని మరికొందరు ఏక్ దం అపోజిట్ గా మారుతారు. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ ప్రవక్తనా? ఏమైనా నబీనా? మనం వారిని అంతగా పొగడడానికి, అంతగా వారిని ప్రశంసించడానికి, ఆయన యొక్క పేరు అంతగా తీసుకోవడానికి, ఆయన కూడా ఒక సామాన్య మనిషి, ఆయన యొక్క ప్రస్తావనే ఎందుకు మనం తీసుకురావాలి? అని ఏ మాత్రం విలువ లేకుండా కూడా చేస్తూ ఉంటారు. అయితే మధ్యే మార్గం అదే సరైన మార్గం ఏమిటంటే షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై అల్లాహ్ యొక్క దాసుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచర సంఘంలోని ఒక ఉత్తమ వ్యక్తి మరియు ఆయన ఇన్ షా అల్లాహ్ అల్లాహ్ యొక్క గొప్ప వలీ అని కూడా మనం నమ్మవచ్చు. ఆయన చేసిన సేవలను బట్టి, ఆయన ఇస్లాం ధర్మ వ్యాప్తి కొరకు ఏ సేవలైతే అందించారో వాటిని బట్టి మనం అల్లాహ్ యొక్క గొప్ప వలీ అని అనడంలో కూడా ఇన్ షా అల్లాహ్ ఎలాంటి అభ్యంతరం లేదు.
కల్పిత కథలు
కానీ ఎన్నో చరిత్ర పుటల్లో మరియు ఈ రోజుల్లో రాయబడే ఎన్నో పుస్తకాల్లో కూడా ఆయన గురించి ఎన్నో మితిమీరిన విషయాలు రాయబడ్డాయి. ఎన్నో మితిమీరిన విషయాలు రాయబడ్డాయి. వాస్తవానికి కొన్ని సందర్భాలలో వింటే కూడా ఆ విషయాలు వింటే మన విశ్వాసం ఎక్కడ పాడైపోతుందో అన్నటువంటి భయం కూడా కలుగుతుంది.
మాకు అప్పుడు అంత జ్ఞానం లేదు ధర్మం గురించి. ఇంకా చాలా చిన్న వారిమి. బహుశా 13-14 సంవత్సరాల వయసు ఉండవచ్చు, బహుశా. రోడ్డు మీద వెళ్తున్నాము, ఒక మస్జిద్ లో ప్రసంగం జరుగుతుంది. ఈ రోజు ఇంత రాత్రి ప్రసంగం ఏంటి? ఇషా నమాజ్ అయిపోయి గంట, రెండు గంటలు అయిపోయింది కదా అని అక్కడ కొంతసేపు వెళ్లి కూర్చున్నాము. బహుశా అది ఈ రబీఉల్ ఆఖర్ నెల, ప్రజలు కొందరు ఏమంటారు దీన్ని? గ్యారవీ కా మహినా. రబీఉల్ ఆఖర్, రబీఉస్సానీ అని కూడా గుర్తు లేదు. అయితే అక్కడ మౌల్వీ సాబ్ ప్రసంగం చేస్తూ చేస్తూ నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై గారి యొక్క కరామతులు తెలుపుతూ నఊదు బిల్లాహ్, సుమ్మ నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్ ఒక వ్యక్తి ఏమన్నాడు మాట్లాడుతూ, అల్లాహు తఆలా మరియు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ఇద్దరూ, మన వాడుక భాషలో ఈ రోజుల్లో చెప్పాలనుకుంటే, వాకింగ్ చేస్తున్నారు ఆకాశం మీద. నడుస్తూ నడుస్తూ నఊదు బిల్లాహ్, సుమ్మ నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్ నకలె కుఫ్ర్ కుఫ్ర్ న బాషద్, అల్లాహ్ యొక్క కాలు జారిపడిందంట నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. అప్పుడు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ అల్లాహ్ ను పట్టుకున్నాడంట. అందు గురించే అప్పటి నుండి ఆయన పేరు దస్తగీర్ అని పడ్డది. ఈ బిరుదు ఆయనకు లభించినది. దస్తగీర్ ఈ పేరు, ఈ బిరుదు ఎలా లభించినది అని వావ్ వావ్ అస్తగ్ఫిరుల్లాహ్ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ పట్ల ఎలాంటి పరిహాసం జరుగుతుంది? ఎలాంటి అవిశ్వాస మాటలు మాట్లాడుతున్నారో ప్రజలు దీన్ని గమనించడం లేదు.
కానీ అస్తగ్ఫిరుల్లాహ్ మనం నేను ఈ మాట చెప్పినప్పుడు ఇలాంటి మాటలు ఎవరూ చెప్పరు అని అంటారు. కానీ అక్కడ వారి పండితులు చెప్పే యొక్క ఆ విధానం, ఉర్దూలో సామాన్యంగా మేము విన్న విషయాలు కదా ఇవి, ఇప్పుడు నేను వాటిని తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఆ ఉర్దూలో పాడుకుంటూ ఎంతో ఆ..ఆ అనుకుంటూ ఏదైతే చెబుతారో దాంట్లో ప్రజలు అల్లాహ్ పట్ల ఎలాంటి అవిశ్వాస మాటలు, పరిహాసం జరుగుతుంది అది ఆలోచించరు. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై గారి యొక్క గొప్పతనం గురించి ఆలోచించుకుంటూ వారు వెళ్తారు. అదే ధోరణిలో వారికి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఆయనను ప్రశంసించడం, ఆయన యొక్క గొప్ప విషయాలు అన్నట్టుగా వారు అర్థం చేసుకుంటారు. కానీ సోదరులారా, ఇప్పటికీ ఉన్నాయి ఇలాంటి తప్పుడు భావనలు.
ఇంకో మాట కొందరితో విన్నాను. నేను స్వయంగా వినలేదు కానీ ఎంతోమంది చెప్పారు. వారు విన్నారు ప్రసంగాలలో అని. ఒక ముసలామె ఆమెకు కేవలం ఒకే ఒక కొడుకు ఉండేనట. అయితే ఆ కొడుకు చనిపోతే షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ వద్దకు ఆమె వచ్చింది. చాలా బతిమిలాడింది. అప్పుడు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ డైరెక్ట్ ఆదేశించాడంట మలకుల్ మౌత్ కు. ప్రాణాలు తీసే ఆత్మ దూత ఎవరైతే ఉన్నారో ఆయనకు మలకుల్ మౌత్ కు “నీవు ఈ రోజు ఆ అబ్బాయి యొక్క ప్రాణం ఏదైతే తీసుకున్నావో తిరిగి వేసెయ్. ఆ అబ్బాయి యొక్క అవసరం ఆ అతని యొక్క తల్లి ముసలామెకు చాలా ఉంది అని.” నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, నఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. మలకుల్ మౌత్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మాట వినలేదంట. దాని మూలంగా షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ కోపంతో ఆయన ఆ రోజు ఎవరెవరి ప్రాణాలైతే తీసుకుని పోతున్నాడో ఆ సంచిని కొట్టేస్తే, ఎంతమంది ప్రాణాలు ఆ రోజు తీసుకోబడ్డాయో వారందరూ బ్రతికిపోయారంట నఊదు బిల్లాహ్. ఇంకా ఇదే సంఘటనను ఇంకా వేరే ఎన్నో రకాలుగా కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు కొందరు.
ఏంటి ఇవన్నీ విషయాలు? ఇలాంటి అతిశయం, ఇలాంటి మితిమీరిన మాటలు, ధర్మానికి వ్యతిరేకమైన మాటలు, ధర్మానికి వ్యతిరేకమైన విశ్వాసాలు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఇలాంటి మాసాల్లో ఈ గ్యారవీల యొక్క మహఫిల్లు, సమావేశాలు ఏదైతే జరుగుతాయో అందరూ కొందరు ప్రసంగం చేసేవారు, ప్రసంగిస్తూ ఈ మాటలు చెబుతూ ఉంటారు.
గ్యారవీకి సమర్థనల ఖండన
అయితే మహాశయులారా, ఇలాంటి విశ్వాసాలకు, ఇలాంటి తప్పుడు ధోరణికి, ఇలాంటి మూఢనమ్మకాలకు మనం చాలా దూరం ఉండాలి. ఆయన అల్లాహ్ యొక్క మంచి భక్తులు, ఇస్లాం వ్యాప్తి కొరకు చాలా ప్రయత్నం చేశారు, చాలా కృషిపడ్డారు. ఇస్లాం అభ్యాసన గురించి మరియు తర్వాత ఇస్లాం యొక్క శిక్షణ ప్రజలకు ఇవ్వడానికి చాలా ఆయన యొక్క త్యాగాలు ఉన్నాయి. అల్లాహ్ తఆలా వాటన్నిటినీ స్వీకరించుగాక అని మనం చెప్పాలి. కానీ ఇలాంటి మూఢనమ్మకాలలో మనం వెళ్ళకూడదు.
ఇక గ్యారవీ విషయం నఊదు బిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. కొందరు రాశారు కొన్ని పుస్తకాలలో. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చాలీస్వా చేసేవారంట. అంటే వారి యొక్క నమ్మకం ప్రకారంగా ఈ మాటనే తప్పు. మరియు ఒకవేళ ఈ మాట చెప్పినా గాని కొంచెం ఆలోచించి చెప్పలేదు గనుక ఆ తప్పు మరింత స్పష్టంగా కనబడుతుంది. ఏంటి? గ్యారహ్, పదకొండు రబీఉస్సానీకి చాలీస్వా చేసేవారు. పదకొండు రబీఉస్సానీకి చాలీస్వా చేసేవారు అనేది ఉంటే ఎక్కడ కుదురుతుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పన్నెండు రబీఉల్ అవ్వల్ కు చనిపోయారు కదా. పన్నెండు తర్వాత చాలీస్వా ఎప్పుడు వస్తుంది? నలభైవ రోజులు ఎప్పుడు వస్తాయి? రబీఉస్సానీ 22వ తారీఖు, 23వ తారీఖు. కానీ మరి ఇక రాసేవాళ్ళు ఎలాంటి ఆలోచనలో రాశారో. అందు గురించేమంటారు? బిద్అతులు ఏవైతే ఉంటాయో, దురాచారాలు ఏవైతే ఉంటాయో వాటికి కాళ్ళు, రెక్కలు, వాటికి పునాదులు అనేటివి ఉండవు.
అయితే, రాసిన విషయం ఏంటంటే, షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ఈ రబీఉస్సానీలో ప్రతి సంవత్సరం 11వ తారీఖుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరు మీద చాలీస్వా చేసేవారంట. అది ప్రజలకు ఎంత ఇష్టమైంది అంటే, ప్రజలు ఎంత ఇష్టపడ్డారు అంటే చివరికి ప్రతి నెల 11వ తారీఖుకు చేయడం మొదలు పెట్టారంట. అరబీ హిజ్రీ ప్రకారంగా ప్రతి అరబీ నెల 11వ తారీఖుకు. ఇక షేఖ్ అబ్దుల్ ఖాదిర్ రహమతుల్లాహి అలై చనిపోయిన తర్వాత ప్రజలు ఆయన పేరు మీదనే ఉరుసు మొదలుపెట్టి, ఆయన పేరు మీదనే గ్యారవీలు చేయడం మొదలు పెట్టారు అని. వాస్తవానికి ఇవన్నీ కూడా అబద్ధాలు, అసత్యాలు. ఎందుకంటే షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ఇలాంటి ఏ పనులు చేయలేదు, ఇలాంటి పనులు చేయాలని ఎప్పుడూ కూడా చెప్పలేదు. ఆయన తన జీవితంలో చెప్పిన మాట ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించండి. మీరు సాఫల్యం పొందాలంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. ఆయన అనుసరణను వదిలారంటే మీరు నాశనమైపోతారు, మీరు దుర్మార్గంలో పడిపోతారు అని చెప్పారు.
ఇంకా మహాశయులారా, గ్యారవీ ఎప్పటి నుండి మొదలైంది దీని గురించి ఖచ్చితంగా ఆధారం అనేది లేదు. ఇప్పుడు నేను చెప్పినట్లుగా కొందరు రాశారు పుస్తకాలలో, కానీ అది ఏ మాత్రం నిజమైన మాట కాదు. మరొక విచిత్ర విషయం ఏంటో తెలుసా? షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ఇరాక్ లో పుట్టారు, అక్కడే జన్మించారు, అక్కడే మరణించారు, అక్కడే ఆయన బుగ్దాద్ లో ఉండి సేవలు, ధర్మ సేవలు అన్నీ కూడా అందించారు. అయితే ఆయన పేరు మీద దురాచారాలు ఎన్నో జరుగుతాయి ఇటు అరబ్ దేశాల్లో కూడా. కానీ గ్యారవీ యొక్క బిద్అత్ అరబ్ దేశంలో లేదు. కేవలం మన దేశాల్లోనే ఉంది. అంటే ఆయన పేరు మీద మన దేశంలో ఇది కొందరు ఎవరైనా మొదలుపెట్టి ఉంటారు.
మరి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా, గ్యారవీ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై వారి పేరు మీద చేయడం తప్పు లేదు అని మన వద్ద కొందరు మౌల్వీ సాబులు అంటారు. ఎందుకు? అంటే ముర్దోం కె నామ్ కా ఈసాలె సవాబ్ కర్ సక్తే. అంటే మన బంధువుల్లో గాని, ఇస్లాం ప్రకారంగా ఎవరైనా చనిపోయిన వాళ్ళ పేరు మీద వారి యొక్క ఆత్మలకు, వారికి పుణ్యం లభించాలి అని మనం ఏదైనా సత్కార్యం చేయవచ్చు. దానధర్మాలు, సద్కాలు లాంటివి. ఈ గ్యారవీ కూడా అలాంటి ఈసాలె సవాబ్ అని ప్రజలతో చేయించడానికి వారు చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఇది ఈసాలె సవాబ్ కూడా కాదు. కేవలం కొందరు మౌల్వీ సాబులు చెబుతున్నారు ప్రజలు చేయాలి అని. కానీ ప్రజలు చేస్తున్నది ఏమిటి? ప్రజలు చేస్తున్నది నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లు, ఈ రోజు మనం గ్యారవీ చేస్తే, ఈ సంవత్సరం మనం గ్యారవీ చేస్తే మన ఇంట్లో అంత శుభాలు ఉంటాయి, మన ఇంట్లో అన్ని కరుణా కటాక్షాలు కురుస్తూ ఉంటాయి, మన పంట పొలాలు అన్నీ బాగుపడతాయి, మన బర్రెలు, మన ఆవులు అన్నీ మంచిగా పాలు ఇస్తూ ఉంటాయి, మంచిగా వాటికి కూడా ఈ విధంగా లాభాలు కలుగుతాయి అన్నటువంటి అయితే ఎందరో ముస్లింలలో వారి యొక్క నమ్మకాలు ఏంటి? ఇవన్నీ మనం చేస్తే ఈ లాభాలన్నీ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహమతుల్లాహి అలై ద్వారా లేక ఆయన మాధ్యమంతో, ఉన్కె తవస్సుల్ సే మనకు లభిస్తాయి అని. ఒకవేళ చేయకుంటే మనకు ఏదైనా నష్టం వాటిల్లుతుంది. ఈ విధంగా వాస్తవానికి తఖర్రుబ్ ఇలల్లాహ్, అల్లాహ్ యొక్క ఆరాధన, అల్లాహ్ యొక్క సంతృప్తి పొందడానికి మనం ఏ పుణ్య కార్యాలు అయితే చేస్తామో, ఏ దానధర్మాలు అయితే చేస్తామో, అలాంటిది ఇది గైరుల్లాహ్ (అల్లాహ్ యేతరుల ) కొరకు చేయడం జరుగుతుంది. దీనికి కేవలం పేరు మార్చినంత మాత్రాన ఇది ఈసాలె సవాబ్ పేరు కింద లెక్కింపబడదు. ఎవరైనా బ్రాందీ, విస్కీ ఇది చాలా ఆత్మ శుద్ధి చేస్తుంది, మన యొక్క రక్తంలో చాలా బలం చేకూరుస్తుంది విటమిన్ B మాదిరిగా అనుకుంటూ తాగితే దానిని హలాల్ అని అనవచ్చా? అనరాదు. అందు గురించి ఈ గ్యారవీ అనేది ఈసాలె సవాబ్ కింద లెక్కింపబడదు.
మరొక విషయం నేను ఇంతకు ముందు చెప్పాను కదా? అరబ్ దేశంలో ఇది లేదు. గ్యారవీ అని దీనిని ఏదైతే అంటున్నారో దానికి అరబీలో ఏం పదం వస్తుంది? హాదీ అషర్ అని వస్తుంది. యెహ్దా అషర్ పదకొండు. గ్యారహ్. గ్యారవీ, పదకొండవది. హాదీ అషర్ అని అంటారు. హాదీ అషర్ పేరుతో ఇస్లాంలో ఏదైనా ఈసాలె సవాబ్ కార్యం, ఇస్లాంలో ఏదైనా దానధర్మాల కార్యం ఏదైనా ఉందా? ఏదీ లేదు.
మరొక విషయం మనం ఆలోచించాలి, అదేమిటంటే ఈసాలె సవాబ్ అని ఏదైతే అంటున్నారో సామాన్యంగా ఈసాలె సవాబ్ ఏం జరుగుద్ది? మనం మన తండ్రి వైపు నుండి, మన తల్లికి ఏదైనా పుణ్యం దొరకాలి అని బీదవాళ్లకు బట్టలు కుట్టిస్తాము. ఎవరైనా బీదవాళ్లు వారికి నెలంతా గడవడానికి వారి వద్ద ఎలాంటి తిండి సౌకర్యాలు లేకుంటే వారికి రేషన్ ఇప్పిస్తాము. లేదా ఇంకా ఎవరికైనా నీళ్ళు త్రాగడానికి కష్టంగా ఉండేది ఉంటే బోర్ వెల్, బావి అలాంటిది ఏదైనా వారికి చేసిస్తాము. వాటి యొక్క పుణ్యం మన ఆ తల్లికి, తండ్రికి, మనం ఎవరి గురించి ఆలోచించుకుంటున్నామో, దుఆ చేస్తున్నామో వారికి దొరుకుద్ది. కానీ ఈ గ్యారవీలో చేసినప్పుడు ఏం జరుగుద్ది? అందరూ మనోళ్ళు, మన బంధువులు, మన మౌల్వీ సాబు, వాళ్ళకే, వాళ్ళే తిని వెళ్తూ ఉంటారు. బీదవాళ్లకు ప్రత్యేకంగా ఇక్కడ ఎక్కడ జరుగుతుంది? అయితే “ఈ రోజు నుండి మేము బీదవాళ్లకి ఇచ్చి గ్యారవీ చేస్తాము” అని అనకండి. అలా చేస్తే కూడా ఇది యోగ్యం కాదు.
మరొక విషయం గమనించాలి మహాశయులారా, అదేమిటంటే కొందరిని ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ ఈసాలె సవాబ్ చేసేది ఉంటే మీ తల్లిదండ్రుల హక్కు మీకు ఎక్కువ ఉంది గనుక వారి పేరు మీద చేయండి. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ పేరు మీదనే ఎందుకు? “ఏ లేదు, ఆయన అల్లాహ్ యొక్క చాలా గొప్ప వలీ. ఆయన ధర్మ వ్యాప్తి కొరకు చాలా త్యాగాలు చేశారు. అందు గురించి ఆయన గురించి చేస్తున్నాము.” మరి అంతకంటే ఎక్కువ ఇస్లాం సేవలు చేసిన వారు ఇంకా వేరే ఇమాములు కూడా ఉన్నారు. అంతకంటే ఎక్కువ చేసిన వారు సహాబాలు ఉన్నారు. అంతకంటే ఎక్కువ చేసిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. వారందరి పేరు మీద కూడా ఈసాలె సవాబ్ లు చేసుకుంటూ పోతే ఏదైనా ఒక రోజు మనకు మిగులుద్దా? ఒకసారి గ్యారవీ ఉంటుంది, ఒకసారి బారవీ ఉంటుంది, ఇంకోసారి తేరవీ ఉంటుంది, ఇంకోసారి చౌదవీ ఉంటుంది. ఇక ప్రతి రోజు ఏదో ఒకటి చేస్తూనే పోవాలి. అల్లాహ్ మనకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.
ముగింపు
అందు గురించి చెప్పే విషయం ఏంటంటే, మహాశయులారా, మీరు కూడా ఆలోచించండి. ఒకవేళ మీరు చేస్తూ ఉంటే ఇలాంటి కార్యాలు, గ్యారవీలు, ఆ జెండాలు గిట్ల పెట్టడం, ఇలాంటి చేస్తూ ఉండేది ఉంటే మాకు వ్యతిరేకంగా చెప్పాడు అని మాట వినడం వదులుకోకండి. అల్లాహ్ ఇచ్చిన బుద్ధి జ్ఞానంతో ఆలోచించండి. అల్లాహ్ మనకు ఒక ఖుర్ఆన్ ఇచ్చాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసులు ఇచ్చాడు. మనం
لا إله إلا الله محمد رسول الله [లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్] అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు, ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త.
అని చదువుతున్నాము. ఈ జెండాలు పెట్టాలి అని ఎక్కడైనా ఖుర్ఆన్ లో ఉందా? ఎక్కడైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు హదీస్ లో చెప్పారా? ఈ గ్యారవీలు చేయాలి అని ఎక్కడైనా ఖుర్ఆన్ లో ఉందా? మనకు ఎక్కడైనా హదీస్ లో ఉందా?
ఈ రోజు ఒక వెబ్సైట్ చూస్తున్నాను నేను, ఎవరైతే సామాన్యంగా తమకు తాము అహ్లె సున్నత్ వల్ జమాఅత్ అని అనుకుంటూ ఉంటారో, అలాంటి వారి ఒక వెబ్సైట్. వారు తమ వెబ్సైట్ లో ఏం రాశారు? “గ్యారవీ చేయడం చాలా సున్నత్ పని, ముస్తహబ్ పని, మంచి కార్యం.” ఎందుకు? అందులో మనం అన్నీ మంచి కార్యాలు చేస్తూ ఉంటాము. ఏంటి? అందులో మనం జమా అయి ఖుర్ఆన్ చదువుతూ ఉంటాము. ఖుర్ఆన్ చదవడం తప్పా? అందులో ఆ ఆ రోజు మనం జమా అయి ఒకచోట మనం ఒకరికొకరు బోధ చేసుకుని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చరిత్ర చెప్పుకుంటాము, ఆఖిరత్ గురించి, పరలోకం గురించి గుర్తు చేసుకుంటాము. ఇది తప్పా? ఆ రోజు ఏదైనా కొంచెం మంచి వంటకాలు వండుకొని స్వయం మనం తింటాము మరియు బీదవాళ్లకు తినిపిస్తాము. ఇది తప్పా? ఇలాంటి విషయాలు రాసి ప్రజలను ప్రోత్సహిస్తున్నారు గ్యారవీ చేయాలి అని.
కానీ మీరే బుద్ధిపూర్వకంగా ఆలోచించండి. ఖుర్ఆన్ చదవడం తప్పు అని ఎవరైనా అంటారా? కాదు కదా! దానికి ప్రత్యేకంగా గ్యారవీ అనే పేరు పెట్టుకోవడం ఎందుకు? ప్రతి రోజూ ఖుర్ఆన్ చదవండి. నలుగురు ఎక్కడైనా జమా అయి, సమకూరి ఏదైనా మనం ఖుర్ఆన్ విద్య నేర్చుకోవడం, పరలోక విషయం నేర్చుకోవడం, పరలోకం గుర్తించే అటువంటి విషయాలు మనం తెలుసుకోవడం ఇది తప్పా? కాదు. మరి దాని గురించి గ్యారవీ అని పేరు పెట్టి ఒకచోట ఎందుకు జమా కావడం? ప్రతి రోజూ లేక మీకు వీలున్నప్పుడు వారంలో ఒకసారి, నెలకొకసారి, పదిహేను రోజులకొకసారి మీరు కూర్చోండి, జమా అయి మీ యొక్క విద్యా గురువును పిలిచుకుని కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండండి. గ్యారవీ అని దానికి పేరు పెట్టే అవసరం ఏంటి? అలాగే దానధర్మాలు చేయడం, మంచి వంటకాలు వండుకోవడం, ఇస్లాం మనల్ని నిరాకరిస్తుందా? లేదు. మీరు మీ ఇంట్లో మీ బంధువులకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఎంతగా చెప్పారు? మీరు వండుకున్న కూరలో కొన్ని నీళ్లు ఎక్కువ పోసి మీ పొరుగువారికి ఇవ్వండి. సంతోషంలో పాలు పంచుకోండి. అయితే మనం మనకు ఇష్టమున్న రోజు ఇవన్నీ చేసుకోవచ్చు. దానికి గ్యారవీ అని పేరు పెట్టుకుని ఇవన్నీ ఎందుకు చేయడం? గ్యారవీ అని, పీరానే పీర్ పేరు మీద అని, ప్రజలు వారిలో ఉన్నటువంటి విశ్వాసం అది వేరు. ఇక్కడ మొల్వి సాబులు చెబుతున్న విషయం వేరు. దానికి ఈసాలె సవాబ్ అని పేరు ఇవ్వడం, ఖుర్ఆనే కదా, ఇదే కదా, ఇదే కదా అని కొన్ని పుణ్యాలను లెక్కించడం, ఈ పుణ్యాలు చేస్తూ ఉండడానికి గ్యారవీ అన్న పేరు దాని గురించి ఎందుకు? ఆలోచించండి, గ్రహించండి, ఇస్లాం నుండి, ఇస్లాం పేరు మీద దూరం అయ్యే ప్రయత్నం చేయకండి. ఎప్పటివరకైతే మనం ఖుర్ఆన్ హదీసును చదవడం మానుకుంటామో, చదవడం లేదో, ఇలాంటి కొందరు ఇస్లాం మీద వ్యాపారం చేసి మనల్ని ఇస్లాం నుండి దూరం చేస్తూ ఉంటారు కానీ మనం గ్రహించలేకపోతాము. అల్లాహ్ తఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఇలాంటి దురాచారాల నుండి దూరం ఉంచుగాక.
جزاكم الله خيرا والسلام عليكم ورحمة الله وبركاته [జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్] అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చుగాక, మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.
ముఖ్య సూచనలు
షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ వంటి ధార్మిక శ్రేష్ఠులను గౌరవించాలి, కానీ వారి విషయంలో అతిశయోక్తికి పాల్పడి, అల్లాహ్ కు ఇవ్వాల్సిన స్థానాన్ని వారికి ఇవ్వకూడదు.
‘గ్యారవీ’ మరియు జెండాలు ఎగురవేయడం వంటివి ధర్మంలో నూతనంగా కల్పించబడిన ఆచారాలు (బిద్అత్). వాటికి ఖుర్ఆన్ మరియు సున్నత్లో ఎలాంటి ఆధారం లేదు, కనుక వాటికి దూరంగా ఉండాలి.
లాభనష్టాలు కేవలం అల్లాహ్ చేతిలో మాత్రమే ఉన్నాయి. ఆయన తప్ప మరెవరూ మనకు మేలు గానీ, కీడు గానీ చేయలేరని దృఢంగా విశ్వసించాలి.
ధర్మంలో ఏ ఆచరణ అయినా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి మార్గనిర్దేశం ప్రకారమే ఉండాలి. ఆయనను అనుసరించడంలోనే సాఫల్యం ఉంది.
ధార్మిక విషయాలను గుడ్డిగా అనుసరించకుండా, ఖుర్ఆన్ మరియు సహీ హదీసుల వెలుగులో విశ్లేషించి, అర్థం చేసుకోవాలి.
దానధర్మాలు మరియు పుణ్యకార్యాలు ఏ ప్రత్యేక రోజుకో పరిమితం చేయకుండా, నిరంతరం చేస్తూ ఉండాలి.
అల్లాహ్ మీ కొరకు నిషేధించినవి ఇవే: చచ్చిన జంతువులు, (ప్రవహించిన) రక్తం, పందిమాంసం, ఇంకా అల్లాహ్ తప్ప ఇతరుల పేరు ఉచ్చరించబడినది. ఎవరయినా ఉద్దేశపూర్వకంగా కాకుండా, హద్దులను అతిక్రమించకుండా – గత్యంతరం లేని స్థితిలో – తింటే పాపం కాదు. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, జాలి చూపేవాడు. (సూరా అల్ బఖర 2:173)
ప్రియ సోదరులారా! ఇది ఇస్లామీయ నాల్గవ నెల రబీఉస్సానీ కొందరు ఈ నెలను గ్యారవీ నెలగా గుర్తిస్తారు. ఈ నెలలో అబ్దుల్ ఖాదిర్ జీలానీ పేరు మీద మొక్క బడులు, నైవేద్యాలు చెల్లిస్తారు. అతని పేరుపై పెంచబడిన పశువులను అతని పేరుతో జబహ్ చేస్తారు. ఎందుకంటే ఈ నెలలోనే 11వ తేదీనాడు అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరణించారు. వారి సాన్నిహిత్యం పొందటానికి, వారిని సంతోష పరచటానికి ఈ మూఢాచారాలను నెరవేరుస్తారు. దీని ప్రాముఖ్యతను ఎంత గొప్పగా చెప్పుకుంటారంటే నమాజ్, రోజాలను ఆచరించనివాడు కూడా వీళ్ళ దృష్టిలో పాపాత్ముడేమీ కాదు. కానీ గ్యారవీ చేయని వాడిని మాత్రం మహా పాపాత్ముడుగా భావించి దూషిస్తారు.
గ్యారవీ అనే ఈ మూఢాచారాన్ని కల్పించిన వాడు మౌల్వీ అహ్మద్ రజాఖాన్ బరేల్వీ. వీడు అజ్ఞానకాలం నాటి ఒక ధర్మాన్ని స్థాపించాడు. దీన్ని నిర్మూలించటానికే అనేక మంది ప్రవక్తలు పంపబడ్డారు. చివరిగా మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చి ప్రజలకు దైవ ధర్మసందేశాన్ని అందజేసారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించిన 1260 సంవత్సరాల తర్వాత బరేల్వియత్ స్థాపించబడింది. అయినా ప్రజలు దీన్ని ధర్మంగా భావించి స్వీకరించారు.
గ్యారవీ స్థాపకుడు మౌల్వీ అహ్మద్ రజాఖాన్ బరేల్వి ఈ మూఢాచారాన్ని స్థాపించి అబ్దుల్ ఖాదిర్ జీలానీని దైవస్థానానికి చేర్చివేసాడు. బరేల్వీ గ్రంధాల ప్రకారం అహ్మద్ రజాఖాన్ తన రచన కితాబుబరకాతి ఇమ్ దాద్ లో ఇలా వ్రాసాడు. “కష్టాల్లో, ఆపదల్లో ఎవరైనా నన్ను సహాయం అర్ధిస్తే, నేను అతని కష్టాలను దూరం చేస్తానని, ఇంకా పిలిచేవాని పిలుపు విని అతని విన్నపాన్ని స్వీకరిస్తానని, మరియు అల్లాహ్ సాన్నిహిత్యం . మన కు పొందటానికి నన్ను మధ్యవర్తిగా భావించడం తప్పని సరి అని అబ్దుల్ ఖాదిర్ జీలానీ అన్నారు”. మరోచోట ఇలా వ్రాసాడు- “నేను నా జీవితంలో అబ్దుల్ ఖాదిర్ జీలానీని వదలి ఇతరులను ఎన్నడూ మొరపెట్టుకోలేదు. సహాయం అర్ధించలేదు. ఒకసారి ఇతన్ని వదలి మహబూబ్ అలీని పిలిచే ప్రయత్నం చేసాను. కాని నా నోట యాగౌస్ పాక్ అనే రాసాగింది.” (మల్ పూజాజ్ అహ్మద్ రజా/ 307)
ఇటువంటి అనేక చిన్న చిన్న కల్పిత సంఘటనలు అబ్దుల్ ఖాదిర్ జీలానీ పై మోపబడ్డాయి. వాస్తవం ఏమిటంటే వీరందరూ అల్లాహ్ దాసులే వీరి బలహీనత, అసహాయతకు సంబంధించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకి – షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ ఒకసారి ఇలా అన్నారు. “నాకు అన్నిటికంటే ప్రజలకు అన్నం పెట్టటమంటే చాలా ఇష్టం. కాని ఏంచేయను బలహీనుణ్ణి, ప్రతి రోజు ప్రజలకు అన్నం పెట్టేంత ధనం నాదగ్గర లేదు.’ (ఫత్ హుర్రబ్బానీ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ).
ఈసంఘటన వల్ల తెలిసిన విషయం ఏమిటంటే షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ కి తన జీవితంలో తాను కోరింది చేసే శక్తి ఉండేది కాదు. ఎందుకంటే అల్లాహ్ శక్తి ముందు మానవులందరూ అసహాయులే అటువంటప్పుడు షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరణానంతరం ప్రజల కష్టాలను దుఃఖాలను, కోరికలను ఏలా తీర్చగలరు?
ఈ గ్యారవీ మూఢాచారాన్ని ప్రోత్సహించే నిమిత్తం అనేక నిరాధారమైన కాల్పనిక కధలు ప్రచారం చేయబడ్డాయి. అంతేగాక ఇవి పరలోక సాఫల్యానికి సాధనాలుగా భావించ డ్డాయి.
ఈ మూఢాచారానికి సంబంధించిన వాస్తవాలు అవాస్తవాలు ఇవి :
షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరణం రబీ ఉస్సానీ 11వ తేదీన సంభవించింది అని భావిస్తారు. షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ జయంతి జరుపుకోవటం ఆయన ప్రీతి పొందే ఒక విధానం అనే మూఢాచారాన్ని నమ్ముతారు. అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరణ తేదీ గురించి సంబలీ గారు కితాబుహాలాత్ షేక్ లో ఇలా రచించారు – “అబ్దుల్ ఖాదిర్ జీలానీ గారి మరణ తేదీలో, నెలలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కొందరు సఫర్ మాసంగా మరికొందరు రబీఉస్సానీగా మరికొందరు 27వ తేదిగా 8వ తేదిగా, 9వ తేదీగా, 11వ తేదీగా మరికొందరు 13, 14 గా పేర్కొన్నారు. భారతదేశంలో దీన్ని 11 రబీఉస్సానీ నాడు జరుపు కుంటారు”. భాగ్దాద్లో 17 రబీఉస్సానీ నాడు జరుపుకుంటారు. మరణ తేదిలో ఇన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా భారత దేశంలో మాత్రం 11వ తేదీన గ్యారవీగా జరుపుకుంటారు.
అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరణతేది గురించి హాఫిజ్ అబ్దుల్ అజీజ్ నక్ష్ బందీ ముహమ్మద్ ముర్తుజాయీ ఇలా పేర్కొన్నారు – “షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ తన జీవితంలోని అధిక భాగం బాగ్దాద్ లో గడిపారు. 91 సంవత్సరాల వయస్సులో 561 హిజ్రీ లో 8 రబీ ఉస్సానీ ఆదివారం నాడు మరణించారు. తన మదరసాలో ఖననం చేయబడ్డారు. మరికొందరు ఆయన మరణం శుక్రవారం జరిగిందని పేర్కొన్నారు“. (హదియదస్తగీర్/7)
ఇప్పుడు అసలు విషయం అంటే ఆయన్ను సంతోషపరచటానికి ఆయన మరణది నాన్ని జరుపుకోవటం గురించి ఆయన బోధనలను పరిశీలిస్తే ఆయన ఏ ఒక్కరి వర్ధంతిని జరుపుకోమని బోధించడం గానీ, చెప్పడంగానీ, ఉత్సాహం చూపడం గానీ చేయలేదని తెలుస్తుంది. చివరికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అబూబకర్ (రదియల్లాహు అన్హు), ఉమర్ (రదియల్లాహు అన్హు), హుసైన్ (రదియల్లాహు అన్హు) ల మరణదినాన్ని కూడా జరుపుకునే వారు కారు. అందువల్లే ఆయన ఇలా అన్నారు.-
“అంటే ఒకవేళ హుసైన్ (రదియల్లాహు అన్హు) మరణదినాన్ని జరుపుకోవటం ధర్మ సమ్మతమే అయితే అంతకుముందు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), అబూబకర్ (రదియల్లాహు అన్హు),ల మరణదినాన్ని కూడా జరుపుకోవడం ధర్మసమ్మతం అయి ఉండేది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరుల ఆచరణ కూడా కొనసాగుతూ ఉండేది.” (గునియతుత్తాలిబీన్)
షేఫ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ యొక్క ఈ అభిప్రాయం వల్ల ఆయన ఎవరి వర్ధంతిని జరుపుకోవడాన్ని ఏకీభవించేవారు కారని ఇతరులకు ఆదేశించేవారు కారని తేలిపోయింది. వాస్తవం ఏమిటంటే ఈ మూఢాచారాల్లో కొన్ని అల్లాహ్ కు సాటి కల్పించేపనులు, దాసులై ధర్మాన్ని మార్పులు చేర్పులకు గురిచేయడం, ఇవన్ని అల్లాహ్ కు సాటి కల్పించడానికి, ధర్మంలో అధర్మకార్యాలకు చోటు కల్పించడంతో సమానం, ఈ వేడుక, ఇటువంటి కార్యాలు ఇతని బోధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి.
అబ్దుల్ ఖాదిర్ జీలానీ ఇలా ఉపదేశించారు.
“అంటే అల్లాహ్ గ్రంధాన్నీ, ప్రవక్త సాంప్రదాయాన్ని అనుసరించండి. ధర్మంలో వింత విషయాలను కల్పించకండి. అల్లాహ్ కూ ఆయన ప్రవక్తకూ విధేయత చూపండి. అవిధేయతకు పాల్పడకండి”
తన సంతానానికి కూడా ఈ విధంగానే బోధించారు. దీన్ని గురించి ఈ క్రింది వీలునామాలో పేర్కొనడం జరిగింది.
వీలునామా
షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ 470 హిజ్రీ లో జన్మించారు. 18 సంవత్సరాల వరకు విద్యాభ్యాసంలో నిమగ్నమయి ఉన్నారు. విద్యాభ్యాసం తరువాత 488 హిజ్రీలో బాగ్దాద్ చేరుకున్నారు. 91 సంవత్సరాల వరకు ఇస్లామ్ మరియు ముస్లిముల సేవచేసి 561 హిజ్రీ లో మరణించారు. మరణానికి కొన్ని రోజుల ముందు తన కొడుకు అబ్దుల్ వహ్హాబ్ కు హితబోధ చేసారు. ఇవి సువర్ణాక్షరాలతో వ్రాయదగినవి.
ఇలా బోధించారు :–
“కుమారా! అల్లాహ్ పై తప్ప ఇతరులెవ్వరి పైననూ ఆశలు పెట్టుకోకూడదు. అవసరం ఎటువంటిదైనా అల్లాహ్ యే తీర్చగలడు. కుమారా! అల్లాహ్ నే నమ్ముకోవాలి. ప్రపంచ ప్రజలందరూ కలసి నీకు లాభం చేకూర్చదలచినా అల్లాహ్ అభీష్టానికి వ్యతిరేకంగా రవ్వంత లాభం కూడా చేకూర్చలేరు. అదేవిధంగా అల్లాహ్ నీకు లాభం చేకూర్చదలిస్తే ప్రపంచంలోని ఏశక్తి నీకు నష్టం కలిగించ లేదు. కుమారా! ఏకత్వం (తౌహీద్) పైనే స్థిరంగా ఉండాలి. ఇందులోనే నీ సాఫల్యం ఉంది”. (ఫత్ హుర్రబ్బానీ: అబ్దుల్ ఖాదిర్ జీలానీ)
పై వీలునామాలో పేర్కొన్న ఒకొక్క పదం ఏకత్వాన్నే సూచిస్తుంది ఎక్కడైనా, ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనూ మతి మరుపువల్ల కూడా తన సంతానానికి గ్యారవీ చేయమని ఆదేశించలేదు.
మనం అబ్దుల్ ఖాదిర్ జీలానీ బోధనలను తెలుసుకొని వారు చూపిన మార్గాన్నే అనుసరించి ఉంటే ఎంత బాగుండేది?. వారి బోధనలకు వ్యతిరేకంగా, వారి పేరనే మొక్కుబడులు నైవేద్యాలు చెల్లిస్తున్నాం. అయితే మొక్కుబడులు నైవేద్యాలు కూడా ఆరాధనే. ఇవన్నీ అల్లాహ్ కే సొంతం ఇతరులకు ఇవి ఎంతమాత్రం చెల్లవు.
ఇమ్రాన్ భార్య అల్లాహ్ ను ఇలా ప్రార్ధించినపుడు – ‘ప్రభూ! నాగర్భంలో ఉన్న శిశువును నేను నీకు సమర్పించు కుంటున్నాను. అది నీ సేవకే అంకితం నా ఈ కానుకను స్వీకరించు నీవు అన్నీ వినేవాడవు, అన్ని తెలిసినవాడవూను‘. (ఆలిఇమ్రాన్ – 35)
“చివరకు ఆమె ప్రభువు ఆ బాలికను సంతోషంతో స్వీకరించి ఆమెను ఒక ఉత్తమ బాలికగా తీర్చి దిద్దాడు.” (ఆలిఇమ్రాన్ – 37)
ఖుర్ఆన్లోని ఈ వాక్యం ద్వారా తెలిసిందేమిటంటే మొక్కుబడులు, నైవేద్యాలు, సమర్పణలు మొదలైనవన్నీ కేవలం అల్లాహ్ కే చెందుతాయి. స్వీకరించబడతాయి కూడా. నిర్ణయం పాఠకులకు వదలి పెడుతున్నాము. ఈ గ్యారవీ ఆచారం షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ బోధనలకు, ఉపదేశాలకు అభిప్రాయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఉందా? ఉంటే సరే కాని ఒక వేళ వీటికీ విరుద్ధంగా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీటిని వదలి వేయడం తప్పనిసరి.
అల్లాహ్ (త’ఆలా) మనం దరికీ సన్మార్గం ప్రసాదించుగాక! అల్లాహ్ (త’ఆలా) మనందరికి ఏకత్వం పై ఏకదైవారాధన పై స్థిరంగా ఉంచుగాక! అల్లాహ్ మనందరికీ అల్లాహ్ కూ, ఆయన ప్రవక్తకూ విధేయత చూపే భాగ్యం ప్రసాదించుగాక! అల్లాహ్ (త’ఆలా) మనందరికీ షిర్క్ కి, కల్పితాలకూ, బిద్ఆత్ లకూ దూరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక! అల్లాహ్ (త’ఆలా) మనందరికీ సత్కార్యాలు చేసే భాగ్యం ప్రసాదించుగాక! అల్లాహ్ (త’ఆలా) మనందరికీ స్వర్గ ప్రవేశ భాగ్యం ప్రసాదించు గాక! ఆమీన్!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.