ముస్లిం సముదాయం మీద ప్రవక్త ﷺ వారి హక్కులు [వీడియో | టెక్స్ట్]

ముస్లిం సముదాయం మీద ప్రవక్త ﷺ వారి హక్కులు
https://youtu.be/vCfZBWieaic [52 నిముషాలు]
వక్త:ముహమ్మద్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్

ఈ ప్రసంగం ముస్లిం సమాజంపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కుల గురించి వివరిస్తుంది. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్‌ను స్తుతించడంతో ప్రసంగం మొదలవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక జాతికి లేదా ప్రాంతానికి మాత్రమే కాక, యావత్ ప్రపంచానికి ప్రవక్తగా పంపబడ్డారని ఖుర్ఆన్ ఆధారాలతో స్పష్టం చేయబడింది. ఇందులో ప్రధానంగా ఐదు హక్కుల గురించి చర్చించబడింది: 1) ప్రవక్తను విశ్వసించడం, ఇది ప్రతి వ్యక్తి యొక్క ప్రాథమిక బాధ్యత; 2) ప్రవక్తను ప్రాణం కంటే ఎక్కువగా గౌరవించడం మరియు ఆయన సమక్షంలో స్వరాలు పెంచరాదని సహాబీల ఉదాహరణలతో వివరించబడింది; 3) ప్రవక్తను తల్లిదండ్రులు, సంతానం, మరియు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం, జైద్ రజియల్లాహు అన్హు వంటి సహాబీల ఉదాహరణలతో నొక్కి చెప్పబడింది; 4) జీవితంలోని ప్రతి రంగంలో ప్రవక్తను ఆదర్శంగా తీసుకోవడం; 5) ప్రవక్త ఆదేశాలను పాటించడం మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా ఆయనకు విధేయత చూపడం. ఈ హక్కులను నెరవేర్చడం ద్వారానే ఇహపరలోకాలలో సాఫల్యం లభిస్తుందని ఈ ప్రసంగం బోధిస్తుంది.

أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ
(వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్)
نَبِيِّنَا مُحَمْمَدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ
(నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్)

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక,ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు).

ఈనాటి ప్రసంగంలో మనం ముస్లిం సముదాయం మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కులు ఏమిటి అనే విషయాన్ని ఇన్ షా అల్లాహ్ ఖుర్ఆన్, హదీస్ గ్రంథాల వెలుగులో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల ఉదాహరణల ద్వారా కూడా ఇన్ షా అల్లాహ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముందుగా ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రదేశానికి, ఒక దేశానికి, ఒక జాతి వారికి ప్రవక్త కాదు, పూర్తి ప్రపంచానికి ఆయన ప్రవక్తగా పంపించబడ్డారు.

ఖుర్ఆన్ గ్రంథం ఏడవ అధ్యాయము 158 వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ
(ఖుల్ యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుమ్ జమీఅనిల్లజీ లహు ముల్కుస్సమావాతి వల్ అర్ద్)
(ఓ ముహమ్మద్!) వారికి చెప్పు: “ఓ మానవులారా! నిశ్చయంగా నేను మీ అందరి వైపునకు అల్లాహ్ పంపిన ప్రవక్తను. భూమ్యాకాశాల సామ్రాజ్యం ఆయనదే. (7:158)

దాని అర్థం ఏమిటంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి చెప్పు, ఓ ప్రజలారా నేను భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లాహ్ తరఫున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను. మీ అందరి వైపున పంపబడిన ప్రవక్త అంటే అందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దైవదౌత్యము వర్తిస్తుంది. అంటే నా మాటకు అర్థం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తి ప్రపంచానికి, మానవులందరి వైపుకు ప్రవక్తగా పంపబడి ఉన్నారు, ఈ విషయాన్ని ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఇక రండి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన తర్వాత, విశ్వాసి మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరఫున ఏమేమి బాధ్యతలు వస్తాయి, ఏమి హక్కులు అతని మీద ఉంటాయి, ఆ హక్కులు ఏమిటి, వాటిని అతను ఏ విధంగా చెల్లించుకోవాలి అనేది మనం చూద్దాం.

ముందుగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం.

ఖుర్ఆన్ గ్రంథం సూరా తగాబున్ ఎనిమిదవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

فَآمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ
(ఫ ఆమినూ బిల్లాహి వ రసూలిహి)
కనుక మీరు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. (64:8)

అనగా, మీరు అల్లాహ్‌ను విశ్వసించండి మరియు దైవ ప్రవక్త అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించండి. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించండి అని ఆదేశిస్తున్నాడు కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి కొంతమంది విశ్వసించారు. చూడకుండా చాలామంది విశ్వసించారు. అయితే ఒక ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి విశ్వసించిన వారికి ఒక్కసారి శుభవార్త వినిపిస్తే చూడకుండా ఆయనను విశ్వసించిన వారికి ఏడుసార్లు శుభవార్త వినిపించి ఉన్నారు.

طوبى لمن رآني وآمن بي، وطوبى سبع مرات لمن لم يرني وآمن بي
(తూబా లిమన్ రఆనీ వ ఆమన బీ, వ తూబా సబ అ మర్రాతిన్ లిమన్ లమ్ యరనీ వ ఆమన బీ.)
ఇది ప్రామాణికమైన హదీసు. దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే నన్ను చూసి నన్ను విశ్వసించాడో అతనికి ఒక్కసారి శుభవార్త, మరియు ఎవరైతే నన్ను చూడకుండా నన్ను విశ్వసించారో వారికి ఏడుసార్లు శుభవార్త అని ఆ ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. ఆ ప్రకారంగా మనము చాలా సంవత్సరాల తర్వాత ఈ భూమండలం మీద పుట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూడకుండా విశ్వసించాము కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఆ ఏడుసార్లు శుభవార్త ఇన్ షా అల్లాహ్ అది మనకు దక్కుతుంది.

అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి విని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన అతని ముందర జరిగింది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త అన్న విషయాన్ని అతను తెలుసుకొని కూడా ఏ వ్యక్తి అయితే ప్రవక్త వారిని విశ్వసించకుండా తిరస్కారిగా అలాగే ఉండిపోతాడో, అతను నరకానికి చేరుకుంటాడు, నరకవాసి అయిపోతాడు అని కూడా హెచ్చరించబడి ఉంది. ముస్లిం గ్రంథంలో మనం చూచినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా బోధించి ఉన్నారు,

والذي نفس محمد بيده، لا يسمع بي أحد من هذه الأمة يهودي ولا نصراني، ثم يموت ولم يؤمن بالذي أرسلت به، إلا كان من أصحاب النار
(వల్లజీ నఫ్సు ముహమ్మదిన్ బి యదిహి, లా యస్మవు బీ అహదున్ మిన్ హాజిహిల్ ఉమ్మతి యహూదియ్యున్ వలా నస్రానియ్యున్, సుమ్మ యమూతు వలమ్ యుఅమిన్ బిల్లజీ ఉర్సిల్తు బిహి ఇల్లా కాన మిన్ అస్హాబిన్నార్).
దీని భావం ఏమిటంటే, ఎవరి చేతిలో అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రాణము ఉందో ఆ మహా శక్తిశాలి అయిన ప్రభువు సాక్షిగా నా ఈ అనుచర సమాజంలో అతను యూదుడు గాని, క్రైస్తవుడు గాని ఎవరైనా గాని, అతని ముందర నా ప్రస్తావన జరిగింది, అతను నా గురించి విన్నాడు. నా గురించి విని కూడా అతను నన్ను మరియు నా ద్వారా పంపబడిన శాసనాన్ని, ధర్మాన్ని విశ్వసించకుండా అలాగే మరణిస్తాడో అతను నరకవాసులలో చేరిపోతాడు. చూశారా? ప్రవక్త వారి గురించి విని, తెలుసుకొని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా పంపబడిన ధర్మాన్ని గురించి విని తెలుసుకొని కూడా ఏ వ్యక్తి అయితే విశ్వసించకుండా అలాగే మరణిస్తాడో అతను నరకవాసులకు చేరిపోతాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత ఏమిటంటే అతని ముందర ఎప్పుడైతే ప్రవక్త వారి గురించి మరియు ప్రవక్త వారు తీసుకువచ్చిన ధర్మం గురించి ప్రస్తావించబడుతుందో అతను వెంటనే అర్థం చేసుకొని మనసారా ప్రవక్త వారిని విశ్వసించాలి, ప్రవక్త వారి ద్వారా పంపబడిన ధర్మాన్ని అతను స్వీకరించాలి.

ఏ విషయం మమ్మల్ని అడ్డుపడుతూ ఉంది ప్రవక్త వారిని మరియు ప్రవక్త తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించడానికి అంటే చాలామంది కేవలము భయం కారణంగా వెనకడుగు వేస్తూ ఉంటారు. చూడండి నేడు ప్రజలతో గాని, అధికారులతో గాని మనము భయపడి వెనకడుగు వేస్తే రేపు మరణానంతరము మమ్మల్ని వారు వచ్చి రక్షిస్తారా? మాకు అలాంటి గడ్డు పరిస్థితులు కూడా లేవు ప్రపంచంలో. మనము అల్హమ్దులిల్లాహ్ స్వతంత్రులము. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో చూడండి, ప్రజలు పేదరికంలో ఉన్నారు, ప్రజలు బానిసలుగా కూడా ఉన్నారు. బానిసలుగా ఉండి, పేదలుగా ఉండి కూడా వారు గడ్డు పరిస్థితులలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలుసుకొని ప్రవక్త వారి సమక్షంలో హాజరయ్యి ప్రవక్త వారిని విశ్వసించారు, విశ్వాసులుగా మారారు. తత్కారణంగా ప్రజలు, అధికారులు, పెద్దలు వారిని హింసించారు, వారిని విమర్శించారు, వారిని హేళన చేశారు, రకరకాలుగా చిత్రహింసలు చేసినప్పటికినీ వారు మాత్రము విశ్వాసాన్ని వదులుకోకుండా ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని విశ్వాసులుగా చరిత్రలో నిలిచిపోయారు మరియు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వద్ద కూడా గౌరవమైన స్థానం పొందారు. ఉదాహరణకు బిలాల్ రజియల్లాహు అన్హు వారిని చూడండి. ఈయన ఒక యజమాని వద్ద బానిసగా ఉండేవారు. యజమాని పేరు ఉమయ్య బహుశా నాకు గుర్తు రావట్లేదు. ఉమయ్య బిన్ ఖల్ఫ్. అతను ఏం చేసేవాడంటే, బిలాల్ రజియల్లాహు అన్హు వారు ముస్లింలు అయిపోయారు, విశ్వాసి అయిపోయారు అన్న విషయాన్ని విని తెలుసుకొని, బిలాల్ రజియల్లాహు అన్హు వారిని ఈ అరబ్బు దేశంలో ఎడారిలో ఎండాకాలంలో మిట్టమధ్యాహ్నం పూట ఎండ ఎంత తీవ్రంగా ఉంటుంది, ఆ వేడికి ఇసుక ఎంతగా కాలిపోతూ ఉంటుంది, అలాంటి మండుతున్న ఇసుక మీద అర్ధనగ్నంగా ఆయనను పడుకోబెట్టేవాడు, ఆ తర్వాత ఛాతి మీద పెద్ద పెద్ద రాళ్లు పెట్టేసేవాడు. పైన రాయి కాలుతూ ఉంటుంది, బరువుగా ఉంటుంది, కింద ఇసుక కూడా కాలుతూ ఉంటుంది, అలాంటి స్థితిలో ఆయన అల్లాడిపోతూ ఉంటే నీవు విశ్వాసాన్ని వదిలేయి, నేను కూడా నిన్ను హింసించడం వదిలేస్తాను అని చెప్పేవాడు. అవన్నీ భరించి కూడా ఆయన బానిస అయి ఉండి కూడా చిత్రహింసలు భరిస్తూ కూడా అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ పంపించిన సత్య ప్రవక్త అని చాటి చెప్పారు. ఆ తర్వాత అతను అన్నము పెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా ఆకలిదప్పికలతో అలాగే ఉంచేశాడు, చెరసాలలో బంధించాడు, మెడలో తాడు కట్టేసి పోకిరి పిల్లవారికి, కుర్రాళ్ళ చేతికి ఇచ్చేశాడు. వారు బిలాల్ రజియల్లాహు అన్హు వారిని పశువులాగా ఈడ్చుకుంటూ తిరిగేవారు. తత్కారణంగా ఆయన శరీరానికి, కాళ్లకు గాయాలు అయిపోయేవి. అన్ని రకాలుగా ఆయనను హింసించినా అలాంటి గడ్డు పరిస్థితుల్లో బానిసగా అయ్యి ఉండి కూడా ఆయన విశ్వాసం పొందారు, ప్రవక్త వారిని మరియు ప్రవక్త వారు తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించి వచ్చిన సమస్యలని ధైర్యంగా ఎదుర్కొన్నారు. తత్కారణంగా ఆయన గొప్ప విశ్వాసిగా చరిత్రలో మిగిలిపోయారు, అల్లాహ్ వద్ద కూడా వారికి గొప్ప ఉన్నతమైన స్థానాలు ఉన్నాయి. కాబట్టి మనకు

الحمد لله ثم الحمد لله
(అల్హమ్దులిల్లాహ్ సుమ్మా అల్హమ్దులిల్లాహ్),
బానిసత్వం లేదు. అల్లాహ్ దయవల్ల మమ్మల్ని అందరినీ అల్లాహ్ స్వతంత్రులుగా ఉంచాడు కాబట్టి మనము కంగారు పడవలసిన అవసరము లేదు, బెదరవలసిన అవసరము లేదు, భయపడవలసిన వెనకడుగు వేయవలసిన అవసరం అంతకంటే లేదు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలుసుకోండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించండి. తద్వారానే ఇహపరాలా సాఫల్యము మనకు దక్కుతుంది.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించడం ఇది మొదటి హక్కు. ఇక రెండవ హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన తర్వాత ప్రాణం కంటే ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఆయన బ్రతికి ఉన్నప్పుడు శిష్యులకు, సహాబాలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో బిగ్గరగా మాట్లాడకండి, శబ్దము పెంచకండి అని తాకీదు చేసి ఉన్నాడు. మనం చూసినట్లయితే, ఖుర్ఆన్ గ్రంథము 24వ అధ్యాయము 63వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

لَا تَجْعَلُوا دُعَاءَ الرَّسُولِ بَيْنَكُمْ كَدُعَاءِ بَعْضِكُمْ بَعْضًا
(లా తజ్అలూ దుఆ అర్రసూలి బైనకుమ్ క దుఆఇ బఅదికుమ్ బఅదా)
ఓ విశ్వాసులారా! మీలో మీరు ఒకరినొకరు పిలుచుకున్నట్లు ప్రవక్తను పిలవకండి. (24:63)

దాని అర్థం ఏమిటంటే, మీరు దైవప్రవక్త పిలుపును మీలో ఒకరినొకరిని పిలుచుకునే మామూలు పిలుపులా అనుకోకండి. మనం పరస్పరం ఒకరినొకరిని ఏ విధంగా అయితే పిలుచుకుంటామో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయం అలాంటిది కాదు. ప్రవక్త వారితో మాట్లాడేటప్పుడు, వారితో సంభాషించేటప్పుడు మీరు జాగ్రత్తగా, సగౌరవంగా, అణకువతో మాట్లాడండి అని ఆ వాక్యంలో బోధించబడి ఉంది.

అలాగే ఖుర్ఆన్ గ్రంథం 49వ అధ్యాయం, రెండవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلَا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి వలా తజ్హరూ లహు బిల్ ఖౌలి కజహ్రి బఅదికుమ్ లిబఅదిన్)
ఓ విశ్వాసులారా! మీ స్వరాలను ప్రవక్త స్వరం కన్నా బిగ్గరగా చేయకండి, మీలో మీరు ఒకరితో మరొకరు బిగ్గరగా మాట్లాడినట్లు ఆయనతో మాట్లాడకండి. (49:2)

దీని అర్థం ఏమిటంటే, ఓ విశ్వాసులారా మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే హెచ్చుగా ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయనతో బిగ్గరగా మాట్లాడకండి. దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్థమైపోవచ్చు, జాగ్రత్త సుమా. చూశారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎంతగా గౌరవించాలంటే ప్రవక్త వారి సమక్షంలో బిగ్గరగా శబ్దాన్ని పెంచి, హెచ్చించి మాట్లాడరాదు, పలకరాదు. ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయనను గౌరవించకుండా బిగ్గరగా మాట్లాడినట్లయితే, శబ్దాన్ని పెంచినట్లయితే, అది ఒక రకంగా ప్రవక్త వారిని అగౌరవపరిచినట్లు అవుతుంది, తత్కారణంగా మనిషి యొక్క కర్మలు, సత్కార్యాలు, పుణ్యాలన్నీ వృధా అయిపోయే ప్రమాదం ఉంది అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు. దీనికి ఉదాహరణగా మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల గురించి ఒక ఉదాహరణ తీసుకుందాం.

ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు బనూ తమీమ్ అనే తెగకు చెందిన ఒక బిడారము, కొంతమంది సమూహము వచ్చారు. బనూ తమీమ్‌కు చెందిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోకి వచ్చినప్పుడు, అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక సలహా ఇచ్చారు. ఓ దైవప్రవక్త, కాకా బిన్ మాబద్ అనే వ్యక్తిని ఈ సమూహానికి మీరు నాయకునిగా నియమించండి అన్నారు. అయితే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు కూడా అక్కడ ఉన్నారు, ఆయన జోక్యం చేసుకుంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, ఓ దైవప్రవక్త, అక్రా బిన్ హాబిస్ ని ఈ సమూహానికి, ఈ తెగ వారికి నాయకునిగా నియమించండి అని ఆయన సలహా ఇచ్చారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఒక వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ ఉంటే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు మరో వ్యక్తి గురించి ప్రస్తావించారు. అయితే ఇద్దరి మధ్య భేదాభిప్రాయం వచ్చింది కదండీ, వారిద్దరూ కూడా నేను చెప్పిన వ్యక్తే మంచిది, నేను చెప్పిన వ్యక్తిని నియమిస్తేనే మంచిది అని ఒకరంటూ ఉంటే, లేదండి నేను చెప్పిన వ్యక్తిని నియమిస్తేనే మంచిది అని ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఆ తర్వాత మాట మాట పెరిగి వారు పెద్దగా శబ్దాలు చేయడం, హెచ్చుగా మాట్లాడటం ప్రారంభించేశారు. అలా జరిగినప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే ఈ వాక్యాలను అవతరింపజేశాడు. యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి. ఓ విశ్వాసులారా, మీ కంఠస్వరాలను ప్రవక్త వారి కంఠస్వరం వద్ద హెచ్చించకండి అని ఆ వాక్యాన్ని ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవతరింపజేశాడో, మీరు జాగ్రత్త పడకపోతే మీ సత్కార్యాలు, మీ పుణ్యాలు వృధా అయిపోతాయని ఆ వాక్యం చివరలో తెలియజేసి ఉన్నాడు కదా, అది విన్న తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఎంతగా మారిపోయారంటే, ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన ఎంత మెల్లగా మాట్లాడేవారంటే, ఎంత చిన్నగా మాట్లాడేవారంటే, దగ్గరలో కూర్చున్న వ్యక్తి కూడా ఆయన ఏమి చెప్పారో వినలేక రెండవసారి మళ్ళీ అడిగేవారు. అయ్యో మీరు ఏం చెప్పారో సరిగా వినిపించలేదండి, చెప్పండి ఏంటో అని రెండవసారి మళ్ళీ అడగవలసి వచ్చేది. అంత నెమ్మదిగా, అంత చిన్నగా ఆయన మాట్లాడటం అలవాటు చేసుకున్నారు ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఆ వాక్యము అవతరింపజేయబడిన తర్వాత.

కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించటం ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత, కర్తవ్యం. ఇది రెండవ హక్కు. దీనికి ఉదాహరణగా మనము చూచినట్లయితే, సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు, ఆయన స్వరం కొంచెం పెద్దది. మామూలుగా కొంతమందికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గొంతు కొంచెం పెద్దది ఇస్తాడు, వారు మామూలుగా మాట్లాడినా గాని శబ్దం కొంచెం హెచ్చుగా వస్తుంది. ఆ ప్రకారంగా సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారి స్వరము కూడా, కంఠము కూడా కొంచెం పెద్దది. ఆయన మామూలుగా మాట్లాడినా శబ్దం కొంచెం పెద్దగా, హెచ్చుగా వచ్చేది. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యాన్ని అవతరింపజేశాడో, యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి, ఆ వాక్యం అవతరింపజేయబడిన తర్వాత, ఆయన సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి సమావేశంలో రావడం, హాజరవ్వడమే మానేశారు. అసలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన రావడమే మానేశారు. కొద్ది రోజులు గడిచాయి. కొద్ది రోజులు గడిచిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏంటండీ సాబిత్ బిన్ ఖైస్ కనిపించడం లేదు అని సహాబాలతో అడిగారు. అప్పుడు సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు ఏం చెప్పారంటే, ఓ దైవప్రవక్త, నేను ఆయన పొరుగులోనే ఉంటాను. కాబట్టి మీరు అనుమతి ఇస్తే నేను వెళ్లి చూస్తాను, ఆయన ఎందుకు మీ మధ్య రావట్లేదు ఇక్కడ, ఎందుకు పాల్గొనట్లేదు మీ సమావేశంలో, నేను వెళ్లి తెలుసుకొని వస్తాను, మీరు అనుమతి ఇవ్వండి అంటే, ప్రవక్త వారు సరే అని పంపించారు. ఆ తర్వాత సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారి ఇంటికి వెళ్లి చూస్తే, ఆయన తల పట్టుకొని కూర్చొని ఉన్నారు, దిగులుగా ఉన్నారు. సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు వెళ్లి ఏమండీ ప్రవక్త వారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, ఈ మధ్య మీరు ప్రవక్త వారి సమావేశంలో హాజరు కాలేదు, ఎందుకండీ అలా, మిమ్మల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుర్తు చేసుకుంటున్నారు అని అడిగినప్పుడు, సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర బిగ్గరగా, పెద్ద శబ్దంతో మాట్లాడకండి, అలా మాట్లాడితే మీ కర్మలు వృధా అయిపోతాయి అని చెప్పాడు కాబట్టి, నా శబ్దం పెద్దది, నా కంఠం హెచ్చుగా ఉంటుంది కాబట్టి, నేను చేసుకున్న కర్మలన్నీ, సత్కార్యాలన్నీ వృధా అయిపోయాయి, నేను నరకవాసి అయిపోయానేమోనని నాకు భయంగా ఉంది, అందుకోసమే నేను దిగులుగా ఉన్నాను, అక్కడ రాలేకపోతున్నాను అని చెప్పారు. సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు అదంతా విని, తిరిగి వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు. అదంతా తెలియజేసిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మాట విని, వెంటనే ఆ సహాబీకి శుభవార్త తెలియజేశారు, సాద్ రజియల్లాహు అన్హు వారి ద్వారా. మీరు వెళ్ళండి, ఆయనకు తెలియజేయండి, ఆయన నరకవాసులలోని వ్యక్తి కాదు, ఆయన స్వర్గవాసులలోని వ్యక్తి అని శుభవార్త తెలియజేశారు.

ఈ ఉల్లేఖనం బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలో ఉంది. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించే విధానము సహాబాల వద్ద ఎంతగా ఉందో, వారు ఎంతగా ప్రవక్త వారిని గౌరవించేవారో, మరియు ప్రవక్త వారిని అగౌరవపరచడాన్ని ఎంతగా వారు భయపడేవారో చూడండి, దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే, ఎవరెవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తారో, ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవిస్తారో, అలాంటి వారి కోసము శుభవార్త ఉంది. ఖుర్ఆన్ గ్రంథము ఏడవ అధ్యాయము 157 వ వాక్యాన్ని మనం చూచినట్లయితే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

فَالَّذِينَ آمَنُوا بِهِ وَعَزَّرُوهُ وَنَصَرُوهُ وَاتَّبَعُوا النُّورَ الَّذِي أُنْزِلَ مَعَهُ ۙ أُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
(ఫల్లజీన ఆమను బిహి వ అజ్జరూహు వ నసరూహు వత్తబవూన్నూరల్లజీ ఉన్జిల మఅహు ఉలాయిక హుముల్ ముఫ్లిహూన్)
కనుక ఎవరైతే ఆయనను విశ్వసించి, ఆయనను గౌరవించి, ఆయనకు సహాయం చేసి, ఆయనతోపాటు అవతరింపజేయబడిన జ్యోతిని అనుసరిస్తారో, వారే సాఫల్యం పొందేవారు. (7:157)

దాని అర్థం ఏమిటంటే, ఎవరు ఈ ప్రవక్తను విశ్వసించి, అతనికి ఆదరువుగా నిలుస్తారో, తోడ్పాటు నందిస్తారో, ఇంకా అతనితో పాటు పంపబడిన జ్యోతిని అనుసరిస్తారో, వారే సాఫల్యం పొందేవారు. ప్రవక్త వారిని విశ్వసించి, ప్రవక్త వారిని అనుసరించి, ప్రవక్త వారిని గౌరవించేవారు సాఫల్యం పొందేవారు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శుభవార్త తెలియజేసి ఉన్నాడు చూశారా.

అలాగే, సహాబాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎలా గౌరవించేవారో, ఒక అవిశ్వాసి అలనాటి అవిశ్వాసి, ఆయన పేరు ఉర్వా బిన్ మసూద్ సఖఫీ. తర్వాత, అప్పటి వరకు ఆయన ఇస్లాం స్వీకరించలేదు, తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించారని ధర్మ పండితులు తెలియజేసి ఉన్నారు. ఉర్వా బిన్ మసూద్ సఖఫీ, ఈ సంఘటన జరిగే సమయానికి ఆయన ఇంకా ఇస్లాం స్వీకరించలేరు. సులహ్ హుదైబియా, హుదైబియా ఒప్పందం సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన ప్రవక్త వారితో మాట్లాడటానికి వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడటానికి వచ్చినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమావేశంలో సహాబాలు ఏ విధంగా అణకువతో ఉన్నారో, ప్రవక్త వారిని ఏ విధంగా గౌరవిస్తున్నారో కళ్లారా చూశాడు. కళ్లారా చూసి, తర్వాత మళ్ళీ మక్కాలో ఉన్న అవిశ్వాసుల వద్దకు వెళ్లి, అక్కడ చూసిన దృశ్యాన్ని ఈ విధంగా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఏమంటున్నారో చూడండి: “ఓ నా జాతి ప్రజలారా, నేను పెద్ద పెద్ద రాజుల దర్బారులలోకి కూడా వెళ్ళాను. నేను రోమ్ చక్రవర్తి మరియు అలాగే ఈరాన్ చక్రవర్తి వారి దర్బారులలోకి కూడా నేను వెళ్ళాను. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, పెద్ద పెద్ద రాజులను కూడా అతని దర్బారులో ఉన్న మంత్రులు అంతగా గౌరవించరు, ఎంతగా అయితే ప్రవక్త వారి శిష్యులు ప్రవక్త వారిని గౌరవిస్తున్నారో. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ప్రవక్త వారి నోటి నుండి ఉమ్మి కూడా ఒకవేళ బయటికి వచ్చేస్తే, శిష్యులు ఆ ఉమ్మిని తీసుకొని శరీరానికి పూసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రవక్త వారు ఉజూ చేస్తే, ఆయన ఉజూ చేసిన నీటిని శిష్యులు తీసుకోవాలని పోటీ పడుతూ ఉన్నారు. ఆయన కేవలం సైగ చేస్తే చాలు, వెంటనే ఆ పని చేసి పెట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అలా నేను గౌరవించబడటము, పెద్ద పెద్ద రాజులని సైతము నేను చూడలేదు. అంతగా ప్రవక్త వారి శిష్యులు ప్రవక్తను గౌరవిస్తున్నారు” అని తెలియజేశాడు.

చూశారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహాబాలు ఏ విధంగా గౌరవించారు? అలాగే మనము కూడా ప్రవక్త వారిని గౌరవించాలి. ప్రవక్త వారు మన మధ్య లేరు కదా, మరి ఏ విధంగా మనము గౌరవించాలి అంటే, ప్రవక్త వారి ఆదేశాలు మన మధ్య ఉన్నాయి. ప్రవక్త వారి ఆదేశాలు, హదీసుల రూపంలో, ఉల్లేఖనాల రూపంలో మన మధ్య ఉన్నాయి. ఆ హదీసులు చదవబడేటప్పుడు, వినిపించేటప్పుడు మనము గౌరవంగా ఉండాలి, శ్రద్ధగా వినాలి. అలాగే, ప్రవక్త వారి ఆదేశాలను అదే గౌరవంతో మనము ఆచరించాలి.

ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించడం, ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కు. అయితే, గౌరవించాలి, ప్రతి ముస్లిం యొక్క హక్కు అని తెలుసుకున్న తర్వాత రెండు ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మొదటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రవక్తను గౌరవించడం అనే పదాన్ని తీసుకొని, ప్రవక్త వారి విషయంలో హద్దు మీరిపోవడం సరికాదు. గౌరవంలో చాలామంది హద్దు మీరిపోతూ ఉంటారు. అంటే, ప్రవక్తను ప్రవక్త స్థానంలో కాకుండా, తీసుకెళ్లి దైవ స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు, దీనిని గులు అని అంటారు. అల్లాహ్ సుబ్ హాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ విషయాన్ని ఇష్టపడలేదు, ప్రవక్త వారు వారించి ఉన్నారు. మనం చూచినట్లయితే, బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, ప్రవక్త వారు తెలియజేశారు:

لا تطروني كما أطرت النصارى ابن مريم، فإنما أنا عبد فقولوا عبد الله ورسوله
(లా తత్రూనీ కమా అతరతిన్నసారా ఇబ్న మర్యమ. ఇన్నమా అన అబ్దున్, ఫఖూలూ అబ్దుల్లాహి వ రసూలుహు.)
చూశారా, మర్యం కుమారుడు ఈసా, ఏసుక్రీస్తు అంటారు కదండీ, ಮರ್ಯಮ್ ಕುಮಾರడైన ఈసా అలైహిస్సలాం వారి విషయంలో క్రైస్తవులు ఏ విధంగా అయితే హద్దు మీరిపోయారో, మీరు, అనగా ముస్లింలకు ఆదేశిస్తున్నారు, మీరు నా విషయంలో ఆ విధంగా హద్దు మీరకండి. నేను అల్లాహ్ దాసుడిని మరియు అల్లాహ్ ప్రవక్తని. నాకు ఉన్న స్థానంలో మాత్రమే నన్ను మీరు ఉంచి గౌరవించండి, నాకు లేని స్థానము నాకు కల్పించే ప్రయత్నం చేయకండి అని ప్రవక్త వారు వారించారు.

చూశారా, కాబట్టి ప్రవక్త వారిని గౌరవిస్తున్నాము అని చెబుతూ చాలామంది ప్రవక్త వారికి ఉన్న స్థానం కంటే ఎక్కువ స్థానము ఇచ్చేటట్టుగా అల్లాహ్ స్థానంలోకి తీసుకుని వెళ్లి నిలబెట్టేటట్టుగా చేస్తూ ఉంటారు, అలా చేయడం సరికాదు.

అలాగే, దీనికి విరుద్ధమైన విషయం. చాలామంది మూర్ఖులు అనలో, పాపిష్టులు అనలో, ఇంకేమనాలో తెలియదు, ప్రవక్త వారిని కించపరుస్తూ ఉంటారు. అల్లాహ్ మమ్మల్ని ఏమంటున్నాడు, ప్రవక్త వారిని గౌరవించాలి అంటున్నాడు. కానీ నేడు మనం చూస్తున్నాం, ముస్లింలు మనము అని చెప్పుకునే చాలామంది మూర్ఖులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నారు. వారి మాటల ద్వారా, వారి చేష్టల ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నారు. ఈ మధ్యనే ఒక వ్యక్తి మీడియా ముందర వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నాడు. స్వయంగా నేను ముస్లిం అని కూడా మళ్లీ ప్రకటించుకుంటూ ఉన్నాడు. ఎంతటి మూర్ఖత్వం అండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా చెప్పుకున్న తర్వాతే ఒక వ్యక్తి ముస్లిం అవుతున్నాడు. అలాంటి వ్యక్తి, ప్రవక్త వారిని విశ్వసించిన తర్వాతే ముస్లిం అవుతున్న వ్యక్తి, ప్రవక్త వారిని కించపరచటం, అగౌరవపరచటం ఏమిటండి ఇది?

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎవరైతే కించపరుస్తారో, అగౌరవపరుస్తారో, ప్రపంచంలో కూడా శిక్షించబడతాడు, పరలోకంలో కూడా వారు శిక్షించబడతారు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథము సూరా తౌబా 61వ వాక్యంలో తెలియజేసి ఉన్నాడు కాబట్టి, జాగ్రత్త. కర్మలు వృధా అయిపోతాయి, నష్టపోతారు ప్రపంచంలో కూడా శిక్షించబడతారు, పరలోకంలోనూ మరియు ప్రపంచంలోనూ. కాబట్టి ప్రవక్త వారిని అగౌరవపరచటం పెద్ద నేరం, అలాంటి నేరానికి పాల్పడరాదు, జాగ్రత్త అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది.

ముస్లిం సముదాయం మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కులలో నుంచి రెండు హక్కుల గురించి తెలుసుకున్నాం అండి. విశ్వసించడం ప్రథమ హక్కు, ప్రవక్త వారిని గౌరవించడం రెండవ హక్కు. ఇక మూడవ హక్కు ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించాలి, ప్రేమించాలి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,

ثلاث من كن فيه وجد حلاوة الإيمان
(సలాసున్ మన్ కున్న ఫీహి వజద హలావతల్ ఈమాన్.)
మూడు విషయాలు ఎవరిలో ఉంటాయో, అతను ఈమాన్ విశ్వాసం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించాడు అన్నారు.
ఆ మూడు విషయాలు ఏమిటి అంటే, మొదటి విషయం:

أن يكون الله ورسوله أحب إليه مما سواهما
(అన్ యకూనల్లాహు వ రసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా.)
అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్త అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ వ్యక్తి అందరికంటే ఎక్కువగా అభిమానించాలి, ప్రేమించాలి.
అందరికంటే ఎక్కువ అంటే, తనకంటే, తన కుటుంబ సభ్యుల కంటే, తన తల్లిదండ్రుల కంటే, బంధుమిత్రుల కంటే, ప్రపంచంలో ఉన్న వారందరి కంటే, చివరికి తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రవక్త వారిని అభిమానించాలని దాని అర్థం.

దీనికి ఉదాహరణగా మనము చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరే ఉల్లేఖనంలో ఈ విధంగా తెలియజేశారు:

لا يؤمن أحدكم حتى أكون أحب إليه من ولده ووالده والناس أجمعين
(లా యూమిను అహదుకుమ్ హత్తా అకూన అహబ్బ ఇలైహి మిన్ వలదిహి వ వాలిదిహి వన్నాసి అజ్మయీన్.)
మీలో ఏ వ్యక్తి కూడా అప్పటి వరకు విశ్వాసి కాజాలడు, ఎప్పటి వరకు అయితే అతను నన్ను తన సంతానము కంటే, తన తల్లిదండ్రుల కంటే, మానవులందరి కంటే ఎక్కువగా నన్ను అభిమానించడో అన్నారు. అంటే, తల్లిదండ్రుల కంటే, భార్యాబిడ్డల కంటే, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కంటే ఎక్కువగా ప్రవక్త వారిని అభిమానించినప్పుడే వ్యక్తి విశ్వాసి అవుతాడు.

ఉమర్ రజియల్లాహు అన్హు వారి గురించి ఉదాహరణ చాలా ప్రచారం చెంది ఉంది. ఉమర్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో హాజరయ్యి,

يا رسول الله، لأنت أحب إلي من كل شيء إلا من نفسي
(యా రసూలల్లాహ్, లఅంత అహబ్బు ఇలయ్య మిన్ కుల్లి శైఇన్ ఇల్లా మిన్ నఫ్సీ)
అన్నారు. ఓ దైవప్రవక్త, మీరు నాకు అందరికంటే ఎక్కువగా ఇష్టులు, నేను మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను, అయితే నా ప్రాణము నాకు మీకంటే ఎక్కువ ప్రియమైనది అన్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,

لا، والذي نفسي بيده، حتى أكون أحب إليك من نفسك
(లా వల్లజీ నఫ్సీ బియదిహి, హత్తా అకూన అహబ్బ ఇలైక మిన్ నఫ్సిక్.)
లేదు లేదు ఓ ఉమర్, ఎవరి చేతిలో అయితే నా ప్రాణము ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, నీవు నీ ప్రాణము కంటే ఎక్కువగా నన్ను అభిమానించనంత వరకు పూర్తి సంపూర్ణ విశ్వాసి కాజాలవు అన్నారు.

ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించారు. ఆ తర్వాత ప్రవక్త వారి వద్దకు వచ్చి, ఓ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఇప్పుడు మిమ్మల్ని నా ప్రాణము కంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను అని తెలియజేసినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,

الآن يا عمر
(అల్ ఆన యా ఉమర్.)
ఓ ఉమర్, ఇప్పుడు నీ విశ్వాసము సంపూర్ణమైంది అని తెలియజేశారు.

చూశారా, కాబట్టి ప్రతి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించాలి. ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించినప్పుడే అతను సంపూర్ణ విశ్వాసి కాగలడు, లేని యెడల అతని విశ్వాసము సంపూర్ణము కాజాలదు అని తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనము ఒక ఉదాహరణ తీసుకుందాం.

జైద్ రజియల్లాహు అన్హు వారి గురించి మనము చూచినట్లయితే, జైద్ రజియల్లాహు అన్హు వారిని ఆయన పసితనంలోనే దుండగులు దొంగలించారు. మన మొరటు భాషలో చెప్పాలంటే ఆయనను కిడ్నాప్ చేసేశారు. ఆయనను దొంగలు పట్టుకెళ్లి వేరే ప్రదేశాలలో అమ్మేశారు. ఆ తర్వాత నుండి ఆయన బానిస అయిపోయారు. ఆ తర్వాత చేతులు మారుతూ ఉన్నారు. ఒక వ్యక్తి ఆయనను కొన్నారు, తర్వాత వేరే వ్యక్తికి అమ్మేశారు, ఆ తర్వాత మరో వ్యక్తి మరో వ్యక్తిని అమ్మేశారు. ఆ ప్రకారంగా అమ్ముతూ అమ్ముతూ ఉన్నారు. ఆ విధంగా ఆయన చేతులు మారుతూ మారుతూ మారుతూ మక్కాలో ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారి వద్దకు వచ్చారు. ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారు జైద్ వారిని కొని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కానుకగా ఇచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కానుకగా ఇచ్చి, ఓ దైవప్రవక్త, ఈయనతో మీరు సేవలు చేయించుకోండి అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జైద్ రజియల్లాహు త’ఆలా అన్హు వారితో సేవలు చేయించుకుంటూ ఉన్నారు. సేవలు చేయించుకుంటూ ఉంటున్నప్పుడు, ఒకరోజు అనుకోకుండా ఆయన కాబతుల్లాలో తిరుగుతూ ఉంటే, వారి తల్లిదండ్రులు కూడా హజ్ చేయడానికి వచ్చి కాబతుల్లా వద్ద ప్రదక్షిణలు, తవాఫ్ చేస్తూ ఉన్నారు. వెంటనే తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను చూసి గుర్తుపట్టి, జైద్ రజియల్లాహు అన్హు వారు వెళ్లి, “నేను పసితనంలో తప్పిపోయిన మీ అబ్బాయిని” అని తెలియజేశారు. మీ అబ్బాయిని అని ఎప్పుడైతే తెలియజేశారో, కుటుంబ సభ్యులు వెంటనే జైద్ రజియల్లాహు అన్హు వారిని పట్టుకొని, చిన్ననాటి రోజుల్లో తప్పిపోయిన బిడ్డ దొరికాడు అని వారు చాలా సంతోషించారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవప్రవక్త, మా అబ్బాయి పసితనంలో తప్పిపోయాడు, ఇప్పుడు అనుకొని ఊహించని రీతిలో ఇక్కడ బానిసగా ఉన్నాడు, మీరు అనుమతి ఇస్తే మా అబ్బాయిని మేము మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాము అని అడిగినప్పుడు, ప్రవక్త వారు అన్నారు, మీరు సంతోషంగా తీసుకువెళ్ళవచ్చు, అయితే నిబంధన ఏమిటంటే, మీరు ఒకసారి జైద్ తో మాట్లాడండి, సంప్రదించి చూడండి. జైద్ వారు మీతో పాటు రావడానికి ఆయన సిద్ధమైతేనే మీరు తీసుకువెళ్ళండి, లేదంటే లేదు అని చెప్పారు.

ఆ తర్వాత, జైద్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వెళ్లి, చూడండి దైవప్రవక్త వారు మీ ఇష్టం మీద వదిలేశారు, ఇక మాకు అనుమతి దొరికినట్లే, కాబట్టి పదండి మేము మా ఇంటికి వెళ్లిపోదాము అని అంటే, జైద్ రజియల్లాహు అన్హు వారు లేదు నేను రాను, నేను ప్రవక్త వద్దనే ఉండిపోతాను అని తేల్చి చెప్పేశారు.

ఏంటండీ, ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలు ఆలోచించాలి. ఒక విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుమతి ఇచ్చేశారు, జైద్ రజియల్లాహు అన్హు వారికి ఇక బానిసత్వం నుంచి విముక్తి లభిస్తుంది, స్వతంత్రుడిగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి హాయిగా జీవించుకోవచ్చు. కానీ స్వతంత్రుడిగా వెళ్లి కుటుంబ సభ్యులతో హాయిగా జీవించుకోవడానికి ఆయన ఇష్టపడట్లేదు, ప్రవక్త వారి వద్ద బానిసగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నారు అంటే, ప్రవక్త వారిని ఆయన ఎంతగా అభిమానించేవారో, ఎంతగా ప్రేమించేవారో చూడండి. అలాగే, ప్రవక్త ఆయనతో ఎంత మంచిగా ప్రవర్తిస్తూ ఉంటే ఆయన ప్రవక్త వారిని అంతగా అభిమానిస్తున్నారు చూడండి.

కాబట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహాబాలు ఎంతగా ప్రేమించేవారో, ఎంతగా అభిమానించేవారో ఈ ఉదాహరణల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది.

అలాగే మిత్రులారా, మరొక ఉదాహరణ మనము చూచినట్లయితే, ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రవక్త వారు ఆయనను చూసి ఏమండీ, ఏంటో మీరు కంగారుగా ఉన్నారు అని అడిగినప్పుడు, ఆయన అంటున్నారు, ఓ దైవప్రవక్త, మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు మీరు గుర్తుకు వస్తే, వెంటనే మిమ్మల్ని చూడాలనుకుంటాను, కాబట్టి నేను ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ మస్జిద్ లోకి వస్తాను. మీరు మస్జిద్ లో ఏదో ఒక చోట సహాబాలతో సమావేశమై ఉంటారు లేదంటే నమాజ్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక విధంగా మీరు నన్ను కనిపిస్తారు. మిమ్మల్ని చూడగానే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. అయితే ఈరోజు నాకు ఒక ఆలోచన తట్టింది, ఆ ఆలోచన కారణంగా నేను అయోమయంలో పడిపోయాను, నాకు బాధగా ఉంది, కంగారుగా ఉంది. అదేమిటంటే, మరణించిన తర్వాత పరలోకంలో మీరేమో ప్రవక్త కాబట్టి స్వర్గంలోని ఉన్నతమైన శిఖరాలకు చేరుకుంటారు, నేను ఒక సాధారణమైన వ్యక్తి కాబట్టి, అల్లాహ్ దయవల్ల నేను కూడా స్వర్గానికి వచ్చేసినా, నేను స్వర్గంలోనే మామూలు స్థానాలలో ఉంటాను. అక్కడ కూడా నాకు మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు నేను మిమ్మల్ని అక్కడ ఎలా చూడగలను, అక్కడ చూడలేనేమోనని నాకు బాధగా ఉంది, కంగారుగా ఉంది, ఓ దైవప్రవక్త అన్నారు.

చూశారా, ఎంతటి తపన ఉందో ఆయనలో ప్రవక్త వారిని చూడాలనే తపన, ప్రవక్త వారిని చూసి మనశ్శాంతి పొందాలన్న అభిమానం చూశారా. ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాలు అవతరింపజేశాడు.

وَمَنْ يُطِعِ اللَّهَ وَالرَّسُولَ فَأُولَٰئِكَ مَعَ الَّذِينَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِمْ مِنَ النَّبِيِّينَ وَالصِّدِّيقِينَ وَالشُّهَدَاءِ وَالصَّالِحِينَ ۚ وَحَسُنَ أُولَٰئِكَ رَفِيقًا
(వమయ్ యుతిఇల్లాహ వర్రసూల ఫఉలాయిక మఅల్లజీన అన్అమల్లాహు అలైహిమ్ మినన్నబియ్యీన వస్సిద్దీఖీన వష్షుహదాఇ వస్సాలిహీన వహసున ఉలాయిక రఫీఖా)
ఎవరైతే అల్లాహ్‌కు, ప్రవక్తకు విధేయత చూపుతారో వారు, అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలు, సత్యసంధులు, అమరగతులు, సద్వర్తనులతో పాటు ఉంటారు. వారు ఎంత మంచి స్నేహితులు! (4:69)
ఖుర్ఆన్ గ్రంథం నాలుగవ అధ్యాయము 69 వ వాక్యము.

దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్‌కు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత కనబరుస్తారో, వారే అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోను, సత్యసంధులతోను, షహీదులతోను, సద్వర్తనులతోను ఉంటారు. వీరు ఎంతో మంచి స్నేహితులు.

ఎవరైతే అల్లాహ్‌ను మరియు ప్రవక్త వారిని విశ్వసించి, అభిమానించి, ఆ ప్రకారంగా నడుచుకుంటారో వారు ప్రవక్తలతో పాటు ఉంటారట, సిద్దీఖీన్లతో పాటు సత్యసంధులతో పాటు ఉంటారట, షహీద్ వీరమరణం పొందిన వారితో పాటు ఉంటారట. ఎంతటి గౌరవం చూశారా?

سبحان الله ثم سبحان الله
(సుబ్ హానల్లాహ్ సుమ్మా సుబ్ హానల్లాహ్).

అయితే మిత్రులారా, ఒకే మాట చెప్పి ఇన్ షా అల్లాహ్ ఒక విషయం వైపు మీ దృష్టిని నేను తీసుకువెళ్లాలనుకుంటున్నాను.. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి

متى الساعة؟
(మతస్సాఅ)
ప్రళయం ఎప్పుడు వస్తుంది అని అడిగాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన వైపు చూసి

ماذا أعددت لها؟
(మాజా ఆదత్త లహా)
అని తిరిగి ప్రశ్నించారు. ప్రళయం గురించి నీవు అడుగుతున్నావు సరే, కానీ ఆ ప్రళయం కోసము నీవు ఏమి సిద్ధం చేసుకున్నావు అన్నారు.
అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఓ దైవప్రవక్త, నేను పెద్దగా నమాజులు ఏమి చదువుకోలేదు, నేను పెద్దగా ఉపవాసాలు ఏమి ఉండలేదు, చెప్పుకోదగ్గ పెద్ద పుణ్యకార్యం నేను ఏమి చేసుకోలేదు. నా మీద ఉన్న బాధ్యత మాత్రం నేను నెరవేర్చుకుంటూ ఉన్నాను, పెద్దగా చెప్పుకోదగ్గ పుణ్యకార్యము నేను ఏదీ చేయలేదు. కాకపోతే నేను నా గుండెల నిండా మీ అభిమానం ఉంచుకొని ఉన్నాను అన్నారు.


ఆయన ఏమంటున్నాడండి, నా గుండెల నిండా నేను మీ అభిమానాన్ని ఉంచుకొని ఉన్నాను అంటే వెంటనే ప్రవక్త వారు తెలియజేశారు,

أنت مع من أحببت
(అంత మఅ మన్ అహబబ్త.)
నీవు ఎవరినైతే అభిమానిస్తున్నావో, రేపు వారితో పాటే పరలోకంలో ఉంటావు అని చెప్పారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ వ్యక్తి పూర్తి అభిమానిస్తున్నాడు కాబట్టి, ప్రవక్త వారు తెలియజేసిన శుభవార్త ప్రకారము ఆ వ్యక్తి ప్రవక్త వారి దగ్గరిలో స్వర్గంలో ఉంటాడు. అయితే, ఇక్కడ ఇప్పుడు నేను మిమ్మల్ని ఆలోచింపజేస్తున్న విషయం ఏమిటంటే, ముస్లింలము మేము, ముస్లింలము మేము అని ప్రకటించుకునే ప్రతి వ్యక్తి ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, మీ గుండెల్లో ఎవరి అభిమానం ఎక్కువగా ఉంది? అల్లాహ్ అభిమానం ఎక్కువగా ఉందా? ప్రవక్త అభిమానం ఎక్కువగా ఉందా? లేక చింపిరి చింపిరి బట్టలు వేసుకున్న మహిళలతో నృత్యాలు చేసే, ఎగిరే, చిందేసే నాటక నటీనటుల అభిమానము ఉందా ఆలోచించండి. ఒకవేళ మీరు అందరి కంటే ఎక్కువగా అల్లాహ్‌ను అభిమానిస్తున్నారు, ప్రవక్త వారిని అభిమానిస్తున్నారు అంటే, అల్హమ్దులిల్లాహ్, చాలా సంతోషకరమైన విషయం. అలా కాకుండా మీరు అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ఎక్కువగా నటీనటులను, వేరే వేరే వ్యక్తులను అభిమానిస్తున్నారు అంటే రేపు మీరు ఎవరితో పాటు ఉంటారు పరలోకంలో ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారం ఆలోచించండి.

లేదండి, మేము ప్రవక్త వారిని ఎక్కువగా అభిమానిస్తున్నాం అండి అని చాలామంది నోటితో ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. నోటితో మాట్లాడితే సరిపోదు. మీ మాట్లాడే తీరు, మీ డ్రెస్ కోడ్, మీరు ధరించే దుస్తులు, మీ హెయిర్ స్టైల్, మీ వెంట్రుకలు, అలాగే మీ బట్టలు, మీ మాట్లాడే తీరు, మీ హెయిర్ స్టైల్, అలాగే మీరు, మీ కుటుంబ సభ్యులలో ఉన్న వ్యవహార శైలి ఇవన్నీ మీరు ఎవరిని అభిమానిస్తున్నారో, ఎవరిని మీరు ఫాలో అవుతున్నారో చెప్పకనే చెబుతూ ఉన్నాయి. ముస్లింలు అంటున్న వారు, వారి బట్టలను చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విధంగా వారు దుస్తులు ధరిస్తున్నారా? ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారంగా వారు వెంట్రుకలు ఉంచుతున్నారా? ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారము వ్యవహార శైలిగా నడుచుకుంటున్నారా? అక్కడ మనకు తెలిసిపోతుంది ఎవరు ఎవరిని మనం ఫాలో చేస్తున్నాం, ఎవరిని మనం అభిమానిస్తున్నాం, ఎవరి ఫోటోలు కాపీలలో, నోట్ బుక్కులలో, ఇంట్లోని గోడల మీద అతిక్కించుకుంటున్నాం, అక్కడ మనకు తెలిసిపోతుంది మన అభిమానులు ఎవరో, మనం ఎవరిని అభిమానిస్తున్నాము అనేది.

కాబట్టి జాగ్రత్త, ఎవరిని అభిమానిస్తున్నారో వారితోనే రేపు ఉంటారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నమ్మటం, విశ్వసించటం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించటం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించటం, మూడు హక్కుల గురించి తెలుసుకున్నాం కదండీ. ఇక మరొక హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శమూర్తిగా, రోల్ మోడల్ గా, ఆదర్శనీయుడిగా తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో నడుచుకోవాలి. ప్రతి పనిలో, ప్రతి విషయంలో, ఆరాధనల్లో, వ్యవహారాల్లో, అలాగే విశ్వాసంలో, ప్రతి విషయంలో ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకోవాలి.

ఖుర్ఆన్ గ్రంథం 33వ అధ్యాయం 21వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ لِمَنْ كَانَ يَرْجُو اللَّهَ وَالْيَوْمَ الْآخِرَ وَذَكَرَ اللَّهَ كَثِيرًا
(లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనతున్ లిమన్ కాన యర్జుల్లాహ వల్ యౌమల్ ఆఖిర వ జకరల్లాహ కసీరా)
వాస్తవానికి అల్లాహ్‌ ప్రవక్తలో మీ కొరకు – అంటే అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని ఆశించేవారికీ, అల్లాహ్‌ను అధికంగా స్మరించే వారికీ – ఒక ఉత్తమ ఆదర్శం ఉంది. (33:21)

అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శము ఉంది అన్నారు. ఏ వ్యక్తి అయినా సరే ఆయన తండ్రిగా ఉంటాడు లేదా కుమారునిగా ఉంటాడు లేదా వృత్తిపరంగా ఒక బోధకునిగా, ఒక టీచర్‌గా ఉంటాడు లేదా ఒక డాక్టర్‌గా ఉంటాడు, ఏ రంగానికి చెందిన వ్యక్తి అయినా సరే, ఏ వయసులో ఉన్న వ్యక్తి అయినా సరే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఒక తండ్రిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదర్శనీయులు, ఒక కుమారునిగా కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక భర్తగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక గురువుగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక వ్యాపారిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక డాక్టర్‌గా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక బోధకునిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక లీడర్‌గా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక పొరుగువానిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, అలాగే ఒక సైన్యాధిపతిగా కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు. మనిషి జీవితంలోని ప్రతి రంగంలో కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు. కాబట్టి, ఏ వ్యక్తి అయినా సరే, ఏ రంగంలో ఉన్న వ్యక్తి అయినా సరే, ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకోవాలి.

ఇప్పుడు మనం ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నాం? ఎవరిని ఆదర్శంగా తీసుకొని మనము జీవించుకుంటున్నాం? మన జీవన వ్యవహారాలు, మన జీవన శైలి ఎలా ఉంది, మన లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కసారి ఆలోచించుకోండి మిత్రులారా. ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకొని మనము జీవించాలి, ఇది ముస్లింల సముదాయం మీద ఉన్న మరొక హక్కు.

ఇక సమయం ఎక్కువైపోతుంది కాబట్టి, క్లుప్తంగా ఇన్ షా అల్లాహ్ చెబుతూ నా మాటను ముగించే ప్రయత్నం చేస్తాను.
ప్రవక్త వారి తరఫున ముస్లిం సముదాయం మీద ఉన్న ముఖ్యమైన, ముఖ్యమైన, ముఖ్యమైన హక్కు, బాధ్యత ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విధేయత చూపాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. అనుసరించటం, విధేయత చూపటం అంటే ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ పనులకైతే మమ్మల్ని చేయమని ఆదేశించారో, ఆ పనులను చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ పనులైతే చేయవద్దు అని వారించారో, ఆ పనులు చేయకుండా వాటికి దూరంగా ఉండాలి. మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త వారు ప్రతి భక్తి కార్యానికి, ప్రతి మంచి కార్యానికి చేయమని ఆదేశించి ఉన్నారు. అలాగే, ప్రతి పాపానికి మరియు ప్రతి తప్పు కార్యానికి దూరంగా ఉండండి అని వారించి ఉన్నారు. ప్రవక్త వారు వారించిన విషయాలకు దూరంగా ఉండాలి, ప్రవక్త వారు బోధించిన, చేయమని చెప్పిన విషయాలను మనము చేయాలి. దీనినే ఇతాఅత్, ఇత్తెబా అని అరబీలో అంటారు, విధేయత అని తెలుగులో అంటారు, అనుసరించటం అని అంటారు.

ఖుర్ఆన్ గ్రంథం సూరా మాయిదా 92 వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు,

وَأَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ
(వ అతీవుల్లాహ వ అతీవుర్రసూల్)
అల్లాహ్‌కు విధేయత చూపండి, ప్రవక్తకు కూడా విధేయత చూపండి. (5:92)

అల్లాహ్‌కు విధేయత చూపండి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా విధేయత చూపండి, అనుసరించండి. ఎలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మనము విధేయత చూపాలి, అనుసరించాలంటే ఒక రెండు ఉదాహరణలు చెప్పిఇన్ షా అల్లాహ్ మాటను ముగించి ముందుకు కొనసాగిస్తాను.

ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందుకు వచ్చాడు. ఆయన బంగారపు ఉంగరము ధరించి ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచి, ఆ ఉంగరము తీసేసి పక్కన పడేశారు. పురుషులు బంగారము ధరించడము ఇస్లాం నియమాల నిబంధనల ప్రకారము అది వ్యతిరేకం. పురుషులు బంగారము ధరించరాదు, ఇది ఇస్లాం మనకు బోధించే విషయం. ఆ వ్యక్తి బంగారము ధరించి ఉన్నారు కాబట్టి ప్రవక్త వారు ఆ బంగారపు ఉంగరము తీసి పక్కన పడేసి, మీరు నరకము యొక్క అగ్నిని ముట్టుకోవటము, చేతిలో పట్టుకోవటము ఇష్టపడతారా, మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పారు. తర్వాత ప్రవక్త వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు, ఆ వ్యక్తి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇతర శిష్యులు ఆ వ్యక్తిని పిలిచి, చూడండి, ఆ బంగారము ధరించవద్దు అని ప్రవక్త వారు తెలియజేశారు కాబట్టి, ఆ బంగారము మీరు ధరించవద్దు, కానీ అది అక్కడ పడిపోయి ఉంది కాబట్టి, అది మీరు తీసుకువెళ్ళండి, వేరే పనుల కోసం ఉపయోగించుకోండి అన్నారు. అయితే, ఆయన ఏమన్నారో తెలుసా,

لا والله، لا آخذه أبداً، وقد طرحه رسول الله صلى الله عليه وسلم
(లా వల్లాహి, లా ఆఖుజుహు అబదా, వఖద్ తరహహు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం.)
అల్లాహ్ సాక్షిగా, అలా నేను చేయనంటే చేయను. ఏ పరికరాన్ని అయితే ప్రవక్త వారు తొలగించి పక్కన పడేశారో, దాన్ని నేను ముట్టుకోనంటే ముట్టుకోను అని చెప్పారు.

అలాగే మనం చూచినట్లయితే, అలీ రజియల్లాహు అన్హు వారు ఒకసారి పట్టు వస్త్రాలు ధరించి వెళ్తూ ఉన్నారు, ప్రవక్త వారి కంటపడ్డారు. ప్రవక్త వారు అలీ రజియల్లాహు అన్హు వారు పట్టు వస్త్రాలు ధరించి ఉన్న విషయాన్ని చూసి, ప్రవక్త వారికి ఆ విషయం నచ్చలేదు. ప్రవక్త వారికి నచ్చలేదన్న విషయం ఆయన ముఖ కవళికల ద్వారా కనపడింది. వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు గుర్తుపట్టి, ఇంటికి వచ్చేసి ఆ వస్త్రాలు తీసి, చించేసి మహిళలకు ఇచ్చేశారు. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఇస్లామీయ నిబంధనల ప్రకారము పట్టు వస్త్రాలు పురుషులకు యోగ్యమైనవి కావు. పట్టు వస్త్రాలు మహిళలకే ప్రత్యేకం. పురుషులు పట్టు వస్త్రాలు ధరించరాదు, ఇది ఇస్లామీయ నిబంధన. అయితే అలీ రజియల్లాహు అన్హు వారు పట్టు వస్త్రాలు ధరించారు కాబట్టి, ప్రవక్త వారు ఆ విషయాన్ని ఇష్టపడలేదు. వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు ఆ విషయాన్ని గ్రహించి, ఆ పట్టు వస్త్రాలు ఇంటికి వెళ్లి చించేసి, మహిళల చేతికి ఇచ్చేశారు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఈ బట్టలతో ఏమైనా చేసుకోండి అని.

చూశారా, ప్రవక్త వారు ఇష్టపడలేదు, వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు ఆ దుస్తులను తొలగించేశారు. చూశారా, ఆ ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము అనుసరించాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము విధేయత చూపాలి. ఏ విషయాలనైతే ప్రవక్త వారు మమ్మల్ని వారించారో వాటికి దూరంగా ఉండాలి.

అలాగే, ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కులలో మరొక హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకువచ్చిన ధర్మాన్ని వ్యాపింపజేయాలి, ప్రచారం చేయాలి, ప్రజల వద్దకు తీసుకువెళ్లి చేరవేయాలి. ఆ పని ప్రవక్తలు చేశారు. ప్రవక్త, మీకు నేను చివరి ప్రవక్తని, నా తర్వాత ప్రవక్తలు రారు. ఇక దీని ప్రచారం యొక్క బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి వెళ్ళిన తర్వాత సహాబాలు ఆ బాధ్యత నెరవేర్చారు. ఆ తర్వాత వారు కూడా బాధ్యత నెరవేర్చారు. మనము కూడా ఆ బాధ్యత నెరవేర్చాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులను అభిమానించాలి. ఎవరిని కూడా కించపరచరాదు, దూషించరాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూద్ పఠించాలి, ఇది కూడా మన మీద ఉన్న బాధ్యత మరియు హక్కు. దరూద్ శుభాలు అనే ప్రసంగము

إِنْ شَاءَ ٱللَّٰهُ
(ఇన్ షా అల్లాహ్)
వినండి, అక్కడ దరూద్ గురించి, అది ఎంత విశిష్టమైన కార్యమో తెలపజడం జరిగింది. అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్నేహితులతో మనము కూడా అభిమానం చూపించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శత్రువులతో మనము కూడా శత్రుత్వాన్ని వ్యక్తపరచాలి. ఇవి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కులు. క్లుప్తంగా మీ ముందర ఉంచడం జరిగింది. నేను అల్లాహ్‌తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని అందరినీ అన్న, విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక,ఆమీన్.

وَ جَزَاكُمُ اللّٰهُ خَيْرًا
(వ జజాకుముల్లాహు ఖైరన్).

وَعَلَيْكُمُ السَّلَامُ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వ అలైకుమ్ అస్సలామ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు).

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

కితాబ్ అత్-తౌహీద్ (ఏక దైవారాధన) – ముహమ్మద్ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

రచయిత: ముహమ్మద్ ఇక్బాల్ కైలానీ
అనువాదం: అబ్దుల్ బాసిత్ ఉమరీ
హదీసు పబ్లికేషన్స్, హైదరాబాద్ ఎ. పి., ఇండియా

[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
https://teluguislam.net/wp-content/uploads/2022/03/kitab-at-tawheed-iqbal-kailani-mobile-friendly.pdf
[194 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

విషయ సూచిక

  1. తొలిపలుకులు [PDF] [84p]
  2. సంకల్ప ఆదేశాలు [PDF] [2p]
  3. అల్లాహ్ యొక్క ఏక దైవత్వం పట్ల విశ్వాసం కలిగి ఉండటం [PDF] [7p]
  4. అల్లాహ్ యొక్క ఏక దైవత్వం పట్ల విశ్వాసం- దాని ప్రాముఖ్యత [PDF] [4p]
  5. దివ్య ఖుర్ఆన్ – అల్లాహ్ యొక్క అద్వితీయత [PDF] [9p]
  6. అల్లాహ్ యొక్క ఏక దైవత్వం పట్ల విశ్వాసం – దాని వివరణ దాని రకాలు [PDF] [2p]
  7. అల్లాహ్ ఒక్కడే సత్య దేవుడు [PDF] [5p]
  8. అల్లాహ్ ఒక్కడే సర్వ విధాల ఆరాధనలకు, అన్ని రకాల పూజలకు అర్హుడని విశ్వసించటం [PDF] [13p]
  9. అల్లాహ్ తన సద్గుణ విశేషణాల యందు అద్వితీయుడని విశ్వసించటం [PDF] [21p]
  10. దైవత్వంలో అల్లాహ్ కు సాటి కల్పించటం – దాని రకాలు [PDF] [3p]
  11. దివ్య ఖుర్ఆన్ ద్వారా షిర్క్ ఖండన [PDF] [11p]
  12. ప్రవక్తగారి ప్రవచనాల ద్వారా షిర్క్ ఖండన [PDF] [7p]
  13. చిన్న షిర్క్ వివరాలు [PDF] [6p]
  14. నిరాధార, కల్పిత వచనాలు [PDF] [4p]

డౌన్లోడ్ ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books):
https://telugusialm.net/?p=4259

ప్రవక్త(ﷺ) చూపిన రుజుమార్గంలో ప్రళయం వరకూ సత్యంపై ఉండే జమాత్? [ఆడియో]

ప్రవక్త(ﷺ) చూపిన రుజుమార్గంలో ప్రళయం వరకూ సత్యంపై ఉండే జమాత్?
షరీఫ్ మదనీ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/BokURAxRYRE – 38 నిముషాలు

6:153 وَأَنَّ هَٰذَا صِرَاطِي مُسْتَقِيمًا فَاتَّبِعُوهُ ۖ وَلَا تَتَّبِعُوا السُّبُلَ فَتَفَرَّقَ بِكُمْ عَن سَبِيلِهِ ۚ ذَٰلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَتَّقُونَ
ఇదే నా రుజుమార్గం. కనుక మీరు దీనినే అనుసరించండి. ఇతరత్రా మార్గాలను అనుసరించకండి. అవి మిమ్మల్ని అల్లాహ్‌ మార్గం నుండి వేరు పరుస్తాయి. మీరు భయభక్తుల వైఖరిని అవలంబించేటందుకుగాను అల్లాహ్‌ మీకు ఈ విధంగా తాకీదు చేశాడు. (సూరా అల్ – అన్ ఆమ్ 6:153)

ఈ ప్రసంగంలో, వక్త ఖురాన్ మరియు హదీసుల వెలుగులో ‘రుజుమార్గం’ (సరైన మార్గం) యొక్క ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇస్లాం మాత్రమే అల్లాహ్ చూపిన రుజుమార్గమని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అది పరిపూర్తి చేయబడిందని నొక్కి చెబుతారు. ప్రవక్త (స) తరువాత ఇస్లాంలో ఏర్పడిన వివిధ ఆలోచనా విధానాలు, వర్గాలు (హనఫీ, మాలికీ, షాఫఈ, హంబలీ) గురించి చర్చిస్తూ, అసలైన మార్గం ప్రవక్త మరియు ఆయన సహచరులు అనుసరించినదేనని స్పష్టం చేస్తారు. ‘అహలె హదీస్’ అనే పదం యొక్క మూలాన్ని, దాని నిర్వచనాన్ని వివరిస్తూ, ఇది ఖురాన్ మరియు హదీసులను సహచరుల అవగాహన ప్రకారం అనుసరించే విధానమని పేర్కొంటారు. చివరగా, ముస్లింలందరూ విభేదాలను వీడి, ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఐక్యంగా ఉండాలని, ఈ ఐక్యత కోసం భారతదేశంలోని ‘జమియతే అహలె హదీస్’ సంస్థతో కలిసి పనిచేయాలని పిలుపునిస్తారు.

నేను అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను, శపించబడిన షైతాన్ యొక్క కీడు నుండి. షైతాన్ యొక్క చేష్టల నుండి రక్షణ పొందుట కొరకు, అనంత కరుణామయుడు, అపార కృపా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

ప్రియులారా, నేను మీ ముందు పవిత్ర ఖురాన్ గ్రంథం, సూరె అన్ఆమ్, వాక్యము సంఖ్య 153 పఠించాను. ఇందులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తున్నాడు ప్రవక్త వారితో. ప్రవక్త వారు అంటూ ఉన్నారు:

وَأَنَّ هَٰذَا صِرَاطِي مُسْتَقِيمًا فَاتَّبِعُوهُ ۖ وَلَا تَتَّبِعُوا السُّبُلَ فَتَفَرَّقَ بِكُمْ عَن سَبِيلِهِ ۚ ذَٰلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَتَّقُونَ
(వ అన్న హాదా సిరాతీ ముస్తఖీమన్ ఫత్తబిఊహు వలా తత్తబిఊ స్సుబుల ఫతఫర్రఖ బికమ్ అన్ సబీలిహీ, దాలికుమ్ వస్సాకుమ్ బిహీ ల అల్లకుమ్ తత్తఖూన్)

నిశ్చయంగా ఇదే నా రుజుమార్గం. కనుక మీరు దీనినే అనుసరించండి. ఇతర మార్గాలను అవలంబించకండి. అలా చేస్తే అవి మిమ్మల్ని ఆయన మార్గం నుండి తప్పించి చెల్లాచెదురు చేస్తాయి.” మీరు భయభక్తులు కలిగి ఉండటానికి అల్లాహ్‌ మీకు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు. (6:153)

“వ అన్న హాదా సిరాతీ ముస్తఖీమా” – ఇది రుజుమార్గం. ఖురాన్ అంటుంది, “వ అన్న హాదా సిరాతీ ముస్తఖీమా” – ఇది రుజుమార్గము. “ఫత్తబిఊహు” – మీరు ఈ రుజుమార్గాన్ని అనుసరించండి. “వలా తత్తబిఊ స్సుబుల” – ఈ మార్గాన్ని విడిచిపెట్టి వేరే మార్గాల వెంట వెళ్ళకండి. “ఫతఫర్రఖ బికమ్ అన్ సబీలిహీ” – మీరు గనక ఈ మార్గాన్ని విడిచిపెట్టి వేరే మార్గాల వెంట వెళితే మీరు నా మార్గము నుండి తప్పిపోతారు అని ప్రవక్త వారు తెలియజేశారు. ఆ మార్గం, ఏ మార్గం? అదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసిన మార్గం. “ఫతఫర్రఖ బికమ్ అన్ సబీలిహీ” – మీరు గనక ఆ మార్గాన్ని విడిచిపెడితే మీరు తప్పిపోతారు. “దాలికుమ్ వస్సాకుమ్ బిహీ ల అల్లకుమ్ తత్తఖూన్” – మీరు భక్తిపరులు అవుతారన్న సంగతి వలన, బహుశా మీరు భక్తిపరులు కాగలరని మీకు ఈ విధంగా ఆజ్ఞాపించటం జరుగుతుంది అని ఖురాన్ గ్రంథం చెబుతోంది.

మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ఆ రుజుమార్గం ఏమిటి? ఏ రుజుమార్గం వలన అయితే మనిషి ప్రతి నమాజులో అల్లాహ్ త’ఆలాతో ప్రార్థిస్తాడు:

اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ
(ఇహ్‌దినస్సిరాతల్ ముస్తఖీమ్)
ఓ అల్లాహ్, మాకు రుజుమార్గం (సన్మార్గం) చూపు. (1:6)

అల్లాహ్, నేను నీ నుండి రుజుమార్గాన్ని ఆశిస్తున్నాను. నాకు రుజుమార్గమును ప్రసాదించు. అల్లాహ్ త’ఆలాతో రోజుకు మనిషి అభ్యర్థిస్తాడు. మరి అల్లాహ్ త’ఆలా చూపిన ఆ రుజుమార్గం ఏమిటి? వాస్తవానికి ఆ రుజుమార్గం ఇస్లాం ధర్మం ప్రియులారా. ఇస్లాం అనే ధర్మం, ఇదే మానవులందరి కోసం వచ్చిన రుజుమార్గం. ఇస్లాం అనే ధర్మం ఏదైతే రుజుమార్గమో, మరి మనం స్వర్గానికి వెళ్ళాలంటే ఎలాంటి రుజుమార్గాన్ని అనుసరించాలి? ఏ రుజుమార్గం అయితే ప్రవక్త వారిపై పూర్తి చేయబడినదో, ఏ విధంగానైతే పవిత్ర ఖురాన్ గ్రంథం, ఐదవ సూరా, సూరె మాయిదా, వాక్యము సంఖ్య మూడు ప్రాంతంలో అల్లాహ్ త’ఆలా ఏమంటున్నారు మూడులో? అల్లాహ్ ఏమంటున్నారంటే:

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا
(అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్మమ్తు అలైకుమ్ ని’మతీ వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా)
“ఈ రోజు నేను మీ కోసం మీ ధర్మాన్ని పరిపూర్ణం చేశాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు ఇస్లాంను ధర్మంగా ఇష్టపడ్డాను.” (5:3)

మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అరఫా మైదానంలో ఉన్నారు. ప్రవక్త వారు జీవితంలో ఒకే ఒక హజ్ యాత్ర చేశారండి. హిజ్రీ పదవ సంవత్సరం, జుల్ హిజ్జా మాసం, తొమ్మిదవ తారీఖు, ప్రవక్త వారు అరఫాత్ మైదానంలో ఉండగా, అల్లాహ్ త’ఆలా వాక్యాన్ని దింపారు. “అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్” – ఈ రోజు నేను ఇస్లాం అనే ధర్మాన్ని నీపై పరిపూర్తి చేశాను. మరి రుజుమార్గం అనగా ఏ ధర్మం అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై సీలు వేయబడినదో, అదే రుజుమార్గం.

మరి ఈనాటి ముస్లిం సమాజం ఆ రుజుమార్గాన్ని పొందాలి అంటే, మరి ఆ ప్రవక్త వారిపై ధర్మశాస్త్రం సీలు వేయబడిన తరువాత, ఏదైతే ఇస్లాంలో వివిధ రకాల మనుషులు వచ్చి వివిధ రకాల ఆలోచనా భావాలు కల్పించారో, ఆ ఆలోచనా భావాలను మనము తీసుకుంటే రుజుమార్గంపై ఉన్నట్లా? లేకపోతే ప్రవక్త వారిపై ఏ ధర్మశాస్త్రం అయితే పూర్తి చేయబడిందో ఆ ధర్మశాస్త్రంపై ఆచరించే వారు రుజుమార్గంలో ఉన్నట్లా? ఆ తరువాత, ప్రవక్త గతించారు. ప్రవక్త గతించిన తరువాత, సల్లల్లాహు అలైహి వసల్లం, బాగా వినండి. ఇది హిజ్రీ 1442వ సంవత్సరం. హిజ్రీ 1442వ సంవత్సరం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచం నుండి ఏ హిజ్రీలో గతించారు? హిజ్రీ 11వ సంవత్సరంలో ప్రవక్త పరమపదించారు. ఆ తరువాత ఇస్లాం ధర్మశాస్త్రంలో అనేక రకాలైన ఆలోచనా భావాలు కలిగిన విద్వాంసులు వచ్చారు.

ఉదాహరణకి, నేటి ముస్లిం సమాజం ఏ విధంగానైతే ప్రపంచవ్యాప్తంగా నాలుగు రకాల ఆలోచనా భావాలను ముస్లిం సమాజం తమలోకి తీసుకుంది. ఈ నాలుగు రకాల ఆలోచనా భావాలు ఏమిటి? వారు ఏమంటారంటే, ముస్లిం సమాజంలో అనేకమంది తమకు తాము మేము అహలె సున్నత్ వల్ జమాత్, అహలుస్సున్నా వల్ జమాత్, మేమే అహలుస్సున్నా వల్ జమాత్. ఎవరైతే అహలుస్సున్నా వల్ జమాత్, నలుగురు ఇమాముల తరువాత ముస్లిం సమాజం తీసుకొచ్చింది. బాగా వినండి. నాలుగు రకాల స్కూల్స్, నాలుగు రకాల ఆలోచనా భావాలు ఇస్లాంలోకి వచ్చాయి. మొదటి ఆలోచనా భావన, ప్రవక్త గతించిన 69 సంవత్సరాల తరువాత పుట్టిన అబూ హనీఫా రహిమహుల్లాహ్. ప్రవక్త హిజ్రీ 11లో చనిపోతే, 80 హిజ్రీలో పుట్టిన అబూ హనీఫా రహిమహుల్లాహ్ వారి ఎవరైతే అనుచరులు ఉన్నారో, వారు హనఫీ స్కూల్ తీసుకొచ్చారు. హనఫీ ఇస్లామిక్ జ్యూరిస్ప్రుడెన్స్. ఆ తరువాత 93లో పుట్టిన మాలిక్ రహిమహుల్లాహ్, ఇమామ్ మాలిక్ రహిమహుల్లాహ్, అతనిది ఒక ఆలోచనా విధానం. ఆ తరువాత ప్రియులారా, హిజ్రీ 150లో పుట్టిన ఇమామ్ షాఫఈ రహిమహుల్లాహ్, అతనిది ఒక ఆలోచనా విధానం. హిజ్రీ 164లో పుట్టిన ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లాహ్ ది ఒక ఆలోచనా విధానం. వీరి నలుగురిని ప్రపంచం ఏమంటుంది? ఇమామ్ అబూ హనీఫా వెంట నడిస్తే హనఫీలు, ఇమామ్ మాలిక్ వెంట నడిస్తే మాలికీలు, ఇమామ్ షాఫఈ వెంట నడిస్తే షాఫఈ మస్లక్ వారని, ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ వెనకాతల నడిస్తే హంబలీ అంటారు.

కాలక్రమేణా ప్రపంచంలో ఇలా రోజులు గడుస్తూ గడుస్తూ, భారతదేశంలో కూడా జమాత్ లు వెలసిల్లాయి. ఇక్కడ కూడా ఇస్లాం పేరుతో అనేక రకాలైన జమాత్ లు ఆవిర్భవించాయి. అల్లాహ్ రక్షించుగాక! ఈరోజు ప్రపంచంలో అత్యధిక బిద్అత్, అత్యధిక భ్రష్టు పట్టించే మూల స్థానం ఉంది అంటే, అల్లాహ్ రక్షించుగాక, ఇదే భారతదేశం నుండి ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైన బిద్అత్ లను స్థాపించే వ్యవస్థలు ఇక్కడే మూల కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాయి. అదే క్రమంలో, మన మాట ప్రియులారా, నేను చెబుతున్న మాట, ప్రవక్త వారిపై అల్లాహ్ ఏ ఇస్లాంనైతే పరిపూర్తి చేశాడో, ఆ ఇస్లామే రుజుమార్గం. ఆ ఇస్లాం ఎక్కడ దొరుకుతుంది? మనం అన్వేషించే ప్రయత్నం చెయ్యాలి. భారతదేశంలో అనేక రకాలైన మనుషులు, పెద్ద పెద్ద ఇమాములు అనేక రకాలైన ఆలోచనా భావాలతో, ఏదైతే మన సమాజంలో బరేల్వీ వ్యవస్థ ఉంది. ఈ బరేల్వీ వ్యవస్థ ఎప్పుడు స్థాపించబడింది? సుమారు 1800 ప్రాంతంలోనే అహ్మద్ రజా ఖాన్ బరేల్వీ అనే వ్యక్తి ఉత్తర ప్రదేశ్ లో బరేల్వీ ప్రాంతంలో ఉంటూ బరేల్వీ అనే వర్గాన్ని స్థాపించారు. ఆ తరువాత దేవ్ బంద్ వర్గం వచ్చింది, ఖాసిం నానోతవి రహిమహుల్లాహ్. ఆ తరువాత మనకి తెలుసు ఇస్లాం నుండి బయటకు వెళ్లిన ఖాదియానీ వచ్చింది, మీర్జా గులాం అహ్మద్ ఖాదియానీ స్థాపించారు. మనం చూస్తున్నాం తబ్లీగీ జమాత్ వచ్చింది, మౌలానా ఇలియాస్ రహిమహుల్లాహ్ స్థాపించారు. జమాతె ఇస్లామీ హింద్ అనే సంస్థను చూశాం మనం, దాన్ని మౌదూదీ గారు స్థాపించారు. ఇలా వేరువేరు భావాలు గల, వేరువేరు ఆలోచనా విధానాలు గల ఇస్లాం జమాతులు ఈ యొక్క ప్రపంచంలో, మన భారతదేశంలో ఆవిర్భవించాయి.

అహలె హదీస్: మూలం మరియు నిర్వచనం

ఇదే క్రమంలో భారతదేశంలో అహలె హదీస్ అనే పేరుతో కూడా ఒక ఉద్యమం ప్రారంభించబడింది. ఈ అహలె హదీస్ లు ఎవరైతే అనబడ్డారో, వీరిని భారతదేశంలో ఉన్న మెజారిటీ ముస్లింలలో, హనఫీ వర్గంలో ఉన్నవారు తిడుతూ వచ్చారు. వీరు వహాబీలు, వీరి వెనకాతల నమాజ్ అవ్వదు, వీరికి సలాం చెప్పకండి, మేమంతా ముఖల్లిదులం, వీరు గైర్ ముఖల్లిదులు, వీరు ఇస్లాంలో కొత్త విధానాలు తీసుకొచ్చారు. మా తాత ముత్తాతల వరకు చెయ్యి కింద కట్టే వాళ్ళం, వీరొచ్చి చెయ్యి పైన కట్టే విధానం తీసుకొచ్చారు. మా తాత ముత్తాతలు ఆమీన్ గట్టిగా చెప్పేవారు కాదు, వీరొచ్చి మేము ఆమీన్ గట్టిగా చెప్పాలంటున్నారు. మా తాత ముత్తాతల కాలంలో మేము తక్బీర్ తో చేతులు ఎత్తేవారం కాదు, వీరు చేతులు ఎత్తుతున్నారు. మా తాత ముత్తాతల కాలంలో నమాజ్ అయిన తరువాత ఇజ్తిమాయీ దుఆ ఇమామ్ గారు చేసేవారు, మేము వెనకాతల ఆమీన్ ఆమీన్ పలికేవాళ్ళం, వీరు ఇది తీశారు. ఎన్ని తీశారండి? ఆమీన్ తీసేశారు, దుఆ తీసేశారు, చేతులు మాటిమాటికి పైకి ఎత్తుతున్నారు, చేతులు పైకి కడుతున్నారు, ఇదొక కొత్త వ్యవస్థ. వీరు గైర్ ముఖల్లిదులు. నఊజుబిల్లాహి మినస్సాలిక్.

ఒక మాట వాస్తవంగా మీరు తెలుసుకుంటే సోదరులారా, నేను ఏమీ ఆధారాలతో సహా మాట్లాడుతున్నాను. ఒక వర్గం వైపు నేను మోజుతో ఆ వర్గానికి సపోర్టుగా మాట్లాడను, ఒక వర్గం పైన వైరి వలన ఆ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడడ కోవాల్సిన అవసరం మనకి లేదు. మనం మాట్లాడుకోవలసినది ఖురాన్ మరియు హదీసు మాట. ఈరోజు మనం చెబుతున్న మాట ఏమిటంటే, ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఇస్లాం ధర్మము పరిపూర్తి చేయబడిందో, “అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్” అల్లాహ్ అన్నాడు, ప్రవక్తా, నీపై నేను ఇస్లాం ధర్మాన్ని పరిసమాప్తము చేసేసాను. ఆ విధానము ఎవరి వద్దనైతే ఈరోజు ప్రపంచంలో ఉందో, వారినే అహలె హదీస్ విధానం అన్నారు ప్రియులారా. ఈ అహలె హదీస్ విధానం ఎవడో నలుగురు నాలుగు తప్పులుగా మన గురించి చెప్పితే మనం తప్పు అయిపోం. మనము ఇన్షా అల్లాహ్ సత్యంపై ఉన్నవాళ్ళం. ఎందుకు? హదీసుల ద్వారా కొన్ని ఆలోచనలు చెబుతాను వినండి. ఫస్ట్ హదీస్, ప్రవక్త ఏం చెప్పారండి? “నా యొక్క ఉమ్మత్, నా అనుచర సమాజం 73 వర్గాలుగా చీలిపోతుంది,” ప్రవక్త అన్నారు. 73 వర్గాలుగా చీలిపోతుంది. “ఇల్లా మిల్లాతన్ వాహిదా” వారందరూ నరకానికి వెళ్తారు. “కుల్లుహుమ్ ఫిన్నార్” వారందరూ నరకంలోకి వెళ్తారు. ఇల్లా, కానీ “మిల్లాతన్ వాహిదా,” ఒకే ఒక సంఘము తప్ప. ప్రవక్త వారితో సహబాలు అడిగారు, “మన్ హియ యా రసూలల్లాహ్?” ప్రవక్తా, ఆ ఒక్క సంఘం ఏది? దేని గురించి అయితే మీరు స్వర్గానికి వెళ్తున్నారు అన్నారో? ప్రవక్త వారు ఏమన్నారు? “మా అన అలైహి వ అస్ హాబీ,” ఎవరైతే నన్ను అనుసరిస్తారో, నా సహబాలను అనుసరిస్తారో, వారు స్వర్గానికి వెళ్తారు అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. సుబ్ హా నల్లాహ్. ఆ ఒకే ఒక వర్గం ఎవరు? మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెండో హదీస్, తిర్మిజీ గ్రంథంలో ఒక హదీస్ ఉల్లేఖించబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, “లా తజాలు తాఇఫతుమ్ మిన్ ఉమ్మతీ,” నా యొక్క ఉమ్మత్ లో ఒక వర్గం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. “మన్సూరీన్,” ఆ వర్గానికి విజయం ప్రాప్తమవుతుంది. ప్రజలు ఆ వర్గానికి సహాయము చేసినా, సహాయము చేయకపోయినా, వారు ఎల్లప్పుడూ సత్యంపై ఉంటారు. “హత్తా తఖూమస్సాఅ,” ఆఖరికి ప్రళయం వచ్చేస్తుంది, ఆ వర్గం మాత్రం సత్యంపై నిలబడుతుంది, వారికి విజయం ప్రాప్తమవుతుంది అని ప్రవక్త వారు అన్నారు. ఈ హదీసులో ఆ వర్గం, “తాఇఫా,” ఆ వర్గం అన్న మాటకు బుఖారీ రహిమహుల్లాహ్ వారి గురువు గారు, అలీ మదీనీ రహిమహుల్లాహ్ రాస్తున్నారు, ప్రవక్త వారు చెప్పిన ఆ వర్గం పేరు అహలుల్ హదీస్. బుఖారీ రహిమహుల్లాహ్ వారి గురువు గారు రాస్తున్నారు, ప్రవక్త చెప్పిన ఆ వర్గం పేరు అహలుల్ హదీస్. ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లాహ్ రాస్తున్నారు, ప్రవక్త చెప్పిన ఆ వర్గం పేరు అహలుల్ హదీస్. దాని తర్వాత, పీరానె పీర్, పీరానె పీర్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లాహ్ అంటున్నారు, గున్ యతుత్ తాలిబీన్ అనే వారి పుస్తకం. పీరానె పీర్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లాహ్ రాసిన గున్ యతుత్ తాలిబీన్ పుస్తకంలో రాస్తున్నారు అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లాహ్, ఆ వర్గం పేరు అహలుల్ హదీస్. ఆ తరువాత, అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లాహ్ ఒక గొప్ప మాట చెప్పారండి. ఆయన ఏం చెప్పారంటే, బిద్అతీలను ఎలా మనం పోల్చుకోవాలి? అబ్దుల్ ఖాదిర్ జీలానీ అంటున్నారు రహిమహుల్లాహ్, బిద్అతీలను పోల్చుకునే మార్గం ఏమిటంటే, బిద్అతీలు ఎల్లప్పుడూ అహలె హదీస్ ల గురించి చెడుగా మాట్లాడుతుంటారు. ఎవడైతే అహలె హదీస్ గురించి చెడుగా మాట్లాడుతాడో, వాడు బిద్అతీ అని మనం పోల్చుకోవాలి అని అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లాహ్ చెప్పారు. నేను చెప్పే మాట ఏమిటంటే, కన్ఫ్యూజ్, ఈరోజు ఏంటండీ ముస్లింల మనం? ఒకరంటారు ఫలానా అహలుస్సున్నా, ఒకరంటారు అహలె హదీస్, ఒకరంటారు ఫలానా తబ్లీగ్, ఒకరంటారు ఫలానా కజా, వ కజా, ఇన్ని మాటలు. ఇందులో ఈరోజు సత్యమైన వ్యవస్థ, ఖురాన్ మరియు హదీస్ వరకు మిమ్మల్ని చేర్చే వ్యవస్థ, ఎప్పుడైనా పరికించారా? ఎప్పుడైనా ఆలోచించారా? పుస్తకాలు తెరిచి చూసే ప్రయత్నం చేశారా? ఈరోజు సుబ్ హా నల్లాహ్, ఈ అహలుల్ హదీస్ అన్న మాట, అహలె హదీస్ అనే ఈ సంఘం, ఏ వ్యక్తి చేత స్థాపించబడలేదు. ఎలాగైతే నేను ఇందాక ప్రస్తావించాను, సుబ్ హా నల్లాహ్, మనం చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ జమాత్ గురించి చెడుగా మాట్లాడే హక్కు మాకు లేదు, మాట్లాడం ప్రియులారా. మనం బిద్అతులను, ఇస్లాం ధర్మశాస్త్రంలో నవీన పోకడలను ఖండిస్తాం. మనం తీసుకుందాం, మీరు చూపించండి, ప్రశ్నిస్తున్నాను, ఇన్ని నాళ్ళలో వస్తున్నాం మస్జిద్ లకు, ఒక వ్యవస్థ మనం తెలుసుకునే ప్రయత్నం చేశామా? అహలె హదీస్ అంటే ఏమిటి అసలు? అహలె హదీస్ అంటే ఒక మనిషి చేత స్థాపించబడిన ఒక జమాతా? అరె అన్ని జమాతులు, బరేల్వీ, సయ్యద్ అహ్మద్ రజా ఖాన్ బరేల్వీ. తబ్లీగీ జమాత్, ఫలానా మౌలానా ఇలియాస్. జమాతె ఇస్లామీ, ఫలానా అబుల్ అలా మౌదూదీ. ప్రతి జమాత్ ఏదైతే ఇస్లాం అన్న పేరుతో భారతదేశంలో ఉందో, ప్రతి జమాత్ ను ఒక వ్యక్తి స్థాపించాడు. కానీ ఈ అహలుల్ హదీస్ అనే వర్గాన్ని సుబ్ హా నల్లాహ్, సహబాల కాలము నుండి అహలె హదీస్ అన్న మాట వస్తుంది. ఆధారాలు చూపించాను. బుఖారీ రహిమహుల్లాహ్ వారి ఉస్తాద్ అలీ మదనీ రహిమహుల్లాహ్ అహలె హదీస్ అనే పదాన్ని ఉపయోగించారు. వాస్తవానికి అహలె హదీస్ అంటే ఏమిటి? చాలామంది నఊజుబిల్లా రకరకాల మాటలు పలికారు. భారతదేశంలో బ్రిటిష్ వారు తయారు చేశారు వహాబీలను, ఇదంతా తప్పుడు మాట ప్రియులారా. అహలె హదీస్ ప్రవక్త యొక్క సహబాల కాలం నుండి సుబ్ హా నల్లాహ్ ఉంది. దీన్నే అహలె హదీస్ అన్నారు, అహలె ఇత్తిబా అన్నారు, అహలుల్ అసర్ అన్నారు, అహలుత్ తౌహీద్ అన్నారు, ఫిర్కతున్ నాజియా అన్నారు. రకరకాల పేర్లతో దీన్ని పిలవడం జరిగింది. మన భారతదేశంలో ఇది అహలె హదీస్ గా పిలవడం జరుగుతుంది. దీనిలోనే మన కోసం స్వర్గం ఉంది ప్రియులారా. దానికి ఆధారం, అహలె హదీస్ అంటే అర్థం ఏంటి? అహల్, అహల్ అంటే అర్థము చెందిన వారు. అహల్ అంటే అర్థము చెందిన వారు. హదీస్ అంటే ఖురాన్ మరియు హదీస్. హదీస్ అనే పదం కేవలం హదీస్ కు మాత్రమే మనం దాన్ని ఇది చేయకూడదు ప్రియులారా. హదీస్ అంటే ఖురాన్ మరియు హదీస్ రెండింటినీ కలిపి ఇస్లామీయ ధర్మశాస్త్రం హదీస్ అని చెప్పింది ప్రియులారా. అంటే అహలె హదీస్ అంటే ఏమిటి? ఖురాన్ మరియు హదీస్ లపై ఆచరించే వారినే అహలె హదీస్ అన్నారు ప్రియులారా. మరి ఆచరణలో ఆలోచనా విధానం ఎలా ఉండాలి? ప్రతి ఒక్కడు వచ్చి ఖురాన్ ఎత్తి ఈ ఆయత్ ఇలాగ అర్థమైంది, ఈ ఆయత్ ఇలాగ అర్థమైంది, ఈ ఆయత్ ఇలాగ అర్థమైంది, లేదు. అహలె హదీస్ అంటే అదే ఖురాన్ చెప్తుంది, ఎలా ఖురాన్ హదీస్ ను నమ్మాలి? ఉదాహరణకి అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో చెప్పాడు, “లా తఖ్రబుస్సలాత వ అన్తుమ్ సుకారా,” మీరు మధ్యము స్థితిలో ఉన్నప్పుడు నమాజు దరిదాపులకు వెళ్ళకండి. అరె, చూడండి చూడండి, అల్లాహ్ త’ఆలా మీరు నమాజు దరిదాపులకు వెళ్ళకండి, మధ్యము స్థితిలో ఉన్నప్పుడు, అంటే నమాజు చేసేటప్పుడు మధ్యం తాగకూడదేమో, నమాజు చేయని స్థితిలో మధ్యం తాగొచ్చేమో, అర్థం చేసుకునే వాడు ఇలా అర్థం చేసుకుంటాడు. కాబట్టి దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు, అది ఎప్పుడు అవతరించింది? ఎలా అవతరించింది? ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? ప్రవక్త వారి శిష్యులు ఏ విధంగా అర్థం చేసుకున్నారో, ఆ విధంగా ఖురాన్ హదీస్ ను అర్థం చేసుకోవాలి. దానికి ఆధారం ఇదే ఖురాన్, రెండవ సూరా, వాక్యం సంఖ్య 137. అల్లాహ్ ఏమన్నారంటే:

فَإِنْ آمَنُوا بِمِثْلِ مَا آمَنْتُم بِهِ فَقَدِ اهْتَدَوا
(ఫ ఇన్ ఆమనూ బి మిస్లి మా ఆమన్తుమ్ బిహీ ఫఖదిహ్ తదవ్)

వారు కూడా మీరు విశ్వసించినట్లే విశ్వసిస్తే సన్మార్గం పొందుతారు. (2:137)

ఏ విధంగానైతే సహబాలు విశ్వసించారో, ఆ విధంగా విశ్వసిస్తేనే వారు మార్గదర్శకత్వంపై ఉన్నట్లు ప్రియులారా. కాబట్టి అహలె హదీస్ విధానం నిస్సంకోచంగా మిమ్మల్ని సహబాల విధానం వరకు తీసుకువెళ్తుంది. ఎవరైతే ఈ అహలె హదీస్ అనే మనహజ్ కాకుండా, అహలె హదీస్ మనహజ్ కాకుండా, ప్రవక్త మనహజ్ కాకుండా, సహబాల విధానం కాకుండా వేరే విధానాలపైకి వెళ్తే, వారు నరకంలోనికి వెళ్ళిపోతారు. ఆధారం, నాలుగవ సూరా, సూరె నిసా, వాక్యము సంఖ్య 115. అల్లాహ్ ఏమన్నారంటే, మనం చదవాలి, ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఖురాన్ అంటుంది:

وَمَن يُشَاقِقِ الرَّسُولَ مِن بَعْدِ مَا تَبَيَّنَ لَهُ الْهُدَىٰ وَيَتَّبِعْ غَيْرَ سَبِيلِ الْمُؤْمِنِينَ نُوَلِّهِ مَا تَوَلَّىٰ وَنُصْلِهِ جَهَنَّمَ ۖ وَسَاءَتْ مَصِيرًا
(వ మన్ యుషాఖిఖిర్రసూల మిన్ బ’ది మా తబయ్యన లహుల్ హుదా వ యత్తబి’ గైర సబీలిల్ ము’మినీన నువల్లిహీ మా తవల్లా వ నుస్లిహీ జహన్నమ వసాఅత్ మసీరా)

సన్మార్గం స్పష్టమైన తర్వాత కూడా ప్రవక్తకు విరోధం వహించి, విశ్వాసుల మార్గాన్ని కాకుండా ఇతర మార్గాన్ని అవలంబించేవాడిని మేము వాడు తిరిగిన వైపుకే తిప్పివేస్తాము. వాడిని నరకాగ్నిలో పడవేస్తాము. అది చాలా చెడ్డ గమ్యస్థానం. (4:115)

ఎవరైతే మీకు ప్రవక్త విధానం చూపించి, సహబాల విధానం చూపించి, ప్రవక్త మరియు సహబాల విధానము తెలిసిన తరువాత ఆ విధానాన్ని విడిచిపెట్టి, వేరే విధానం వెంట వెళితే వాడిని మేము నరకంలో వేస్తాం అల్లాహ్ అన్నాడు. నేను చెప్పట్లేదు అల్లాహ్ అన్నాడు. ప్రవక్త మరియు సహబాల విధానం తెలిసిన తరువాత అల్లాహ్ మరియు ప్రవక్త విధానానికి దూరంగా వెళితే వాడిని మేము నరకంలో పడవేస్తాం. మరి ఈరోజు మనం అల్లాహ్ మార్గం, ప్రవక్త మార్గం, సహబాల మార్గంపై ఎంతవరకు ఉన్నట్లు? ఎంతవరకు ఈ ప్రపంచం మిమ్మల్ని పిలుస్తోంది? మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ప్రపంచంలో ఆ అల్లాహ్ మార్గం, అల్లాహ్ ప్రవక్త మార్గం, సహబాల మార్గం మిమ్మల్ని అహలె హదీస్ అనే విధానం సుబ్ హా నల్లాహ్ పిలుస్తుంది. మీరు చెప్పట్లేదు అహలె హదీస్ చెప్పండి, చెప్పండి, కానీ ఈరోజు అహలె హదీస్ అనే విధానం మిమ్మల్ని స్వర్గం వరకు తీసుకువెళ్తుందని చెబుతున్నాము. ప్రపంచవ్యాప్తంగా ప్రియులారా దీన్నే సలఫీ వ్యవస్థ అన్నారు, అహలుల్ హదీస్ వ్యవస్థ అన్నారు, రకరకాల పేర్లతో పిలవడం జరిగింది. మా విధానం ఏంటండీ? మా విధానం ఏంటి? నలుగురు ఇమాములను ప్రేమిస్తాం. నలుగురు ఇమాముల పట్ల ప్రేమ ఉంది. ఏ ఇమామ్ ను తిరస్కరించరు అహలె హదీస్. ఈరోజు ప్రపంచంలో అన్ని ముస్లింలు, పెద్ద పెద్ద ముఫ్తీలు ఏమంటున్నారంటే లేదండి, అహలె హదీస్ కొత్తగా వచ్చిందండి, మా అబూ హనీఫా చెప్పిందే మాకు కావాలండి, మా షాఫఈ చెప్పిందే మాకు కావాలండి, ప్రవక్త చెప్పినా వద్దు. మేమేమంటున్నామంటే, ఖురాన్ తీయండి, నాలుగవ సూరా, మనం తెలుసుకోవాలి, 59వ వాక్యం:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ وَأُولِي الْأَمْرِ مِنكُمْ ۖ فَإِن تَنَازَعْتُمْ فِي شَيْءٍ فَرُدُّوهُ إِلَى اللَّهِ وَالرَّسُولِ
(యా అయ్యుహల్లదీన ఆమనూ అతీఉల్లాహ వ అతీఉర్రసూల వ ఉలిల్ అమ్ రి మిన్కుమ్, ఫ ఇన్ తనాత’తుమ్ ఫీ షైఇన్ ఫరుద్దూహు ఇలల్లాహి వర్రసూల్)

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు విధేయత చూపండి. ప్రవక్తకు విధేయత చూపండి. మీలోని అధికారులకు విధేయత చూపండి. ఏదైనా విషయంలో మీకు మధ్య అభిప్రాయభేదం వస్తే, దాన్ని అల్లాహ్‌ మరియు ప్రవక్త వైపుకు మరల్చండి. (4:59)

ఓ విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ కు విధేయత చూపండి, ప్రవక్తకు విధేయత చూపండి, మీలో పెద్దలకు విధేయత చూపండి. తఫ్సీర్ లో ఉలమాలు రాశారు, ఒకవేళ అక్కడ ఏదైనా ఖురాన్ హదీస్ కు వ్యతిరేకంగా ఉంటే మీరు పెద్దల్ని విడిచిపెట్టి అల్లాహ్ మరియు ప్రవక్త వైపునకు మరలిపోండి. నేను నలుగురిని, ఎంతమందికి ఐడియా కలిగి ఉన్నారో, ఐడియా లేకపోతే వినండి. ఐడియా, ఎందుకంటే ఈరోజు ఏందంటే అరె, ఏంది నేను హనఫియన్, హనఫియన్, ఎవరికి కావాలి? మీరు హనఫీ అవ్వొచ్చు మాస్టర్ అవ్వండి. కానీ ఇతరులను గైర్ ముఖల్లిదులు, వాళ్ళు ఇది, అది, ఓ చిన్న ఉదాహరణ ఇచ్చి మాట ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాను. అహలె హదీస్ కు, అహలె హదీస్ కు, ఇతర ముఖల్లిదులకు, ఎవరైతే లేదు హనఫీ, లేదు షాఫఈ, లేదు మాలికీ, లేదు హంబలీ, ఎవరైతే ఉన్నారో వాళ్లకి మనకి చిన్న తేడా చూపే ప్రయత్నం చేసి ముందుకు వెళ్తాను. ఏమిటంటే, ఒక చిన్న స్టోరీ చెప్పాలి మీకు. ఒక వ్యక్తి ఉండేవాడు, బహుశా మీరు విని ఉంటారు. తమిళనాడు రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో రామనాథపురానికి చెందిన ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన చనిపోయాడు. ఆయన ముందు జీవితంలో షాఫఈ మస్లక్ లో ఉండేవాడు, జమాత్ తో తిరిగేవాడు. ఇండోనేషియా, జపాన్, ఎక్కడెక్కడికో వెళ్ళాడు. జీవితపు చరమాంకంలో అహలె హదీస్ విధానానికి దగ్గరయ్యాడు, సుబ్ హా నల్లాహ్. నేను ప్రశ్నించాను, అయ్యా మీరు జీవితంలో ఇన్నేళ్ల పాటు ఫలానా జమాత్ తో, ఇన్ని దేశాలు, ఇన్ని ఏళ్ళు తిరిగారు కదా, ఎందుకు విడిచిపెట్టేశారు? ఆయన స్టోరీ చెప్పాడు, అయ్యా నేను షాఫఈ అనే మస్లక్ లో ఉండేవాడిని. నేను ఒకసారి హజ్ యాత్రకు బయలుదేరాను. నేను తిరుచిరాపల్లి ఎయిర్పోర్ట్ కు వచ్చాను. తిరుచిరాపల్లి ఎయిర్పోర్ట్ కు వచ్చి ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు, మా మస్జిద్ ఇమామ్ గారు నా చెవిలో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, అయ్యా, నువ్వు హజ్ యాత్ర చేయటానికి వెళ్తున్నావ్, నీ ఫ్లైట్ జెడ్డాలో ల్యాండ్ అవ్వడానికి ముందు మీకాత్ వస్తుంది. మీకాత్ ప్రాంతంలో మనం ఏం చేస్తామంటే సంకల్పం చేస్తాం. నేను ఉమ్రా చేయడానికి వెళ్తున్నాను. అల్లాహుమ్మ లబ్బైక ఉమ్రతన్, అల్లాహుమ్మ లబ్బైక హజ్జన్ అని మనం హజ్ లేదా ఉమ్రాకి ఫ్లైట్ లోనే మీకాత్ లో సంకల్పం చేస్తాం. గురువుగారు ఏం చెప్పారంటే చెవిలో, అరేయ్, నువ్వు హజ్ యాత్రకు వెళ్తున్నావ్, మీకాత్ రాగానే, అల్లాహ్ నేను హజ్ కు కోసం సంకల్పం చేస్తున్నాను, దానితోపాటే షాఫఈ నుండి హనఫీగా మారిపోతున్నాను అని సంకల్పం చేసుకో అన్నారు. ఇదేంటి గురువుగారు, తెల్లవారితే హనఫీలొక వ్యతిరేకంగా మనం ఉన్నాం, ఇప్పుడెందుకు హజ్ కు వెళ్తుంటే ఇప్పుడు హనఫీగా మారిపోమంటారు ఏమిటి అని బాధపడ్డాడు. గురువుగారు చెప్పారు, లేదు నాయనా, మన షాఫఈ మస్లక్ ప్రకారం ఏముందంటే పురుషుడు వజూ చేసిన తరువాత, పురుషుడు వజూ చేసిన తరువాత స్త్రీని ముట్టుకుంటే పురుషుడి వజూ భగ్నమైపోతుంది. నువ్వు హజ్ యాత్రకు వెళ్తున్నావ్, అక్కడ అనేక మంది పురుషులు స్త్రీలు ఉంటారు. నీకు తెలియకుండానే ఏదో స్త్రీ తవాఫ్, ప్రదక్షిణ చేసే కంగారులో నిన్ను తాకి వెళ్ళిపోతుంది, నీ వజూ విరిగిపోతుంది. నువ్వు షాఫఈ మస్లక్ లో ఉండిపోతే, మాటిమాటికి ఎవరో తగులుతుంటారు, వజూ చేస్తూ ఉంటావ్, నీ హజ్ యాత్ర మొత్తం వజూలోనే పోతుంది. అలా కాకుండా హనఫీ మస్లక్ ప్రకారం అయితే పురుషుడు వజూ చేసి స్త్రీని ముట్టుకుంటే పురుషుడి వజూ విరగదు. కాబట్టి హజ్ యాత్ర అంతా చేసుకో హనఫీ మస్లక్ లో, తిరిగి ఇండియాలో ల్యాండ్ అయిపోయినప్పుడు నేను షాఫఈగా మారిపోయాను అని చెప్పి ల్యాండ్ అయిపో అన్నాడు. ఇదేంది ఇస్లాం? హనఫీ మస్లక్ లో ఒకటి, షాఫఈ మస్లక్ లో ఒకటి. అహలె హదీస్, ఇది వినండి. అహలె హదీస్ ఏం చెప్తుంది? మనం షాఫఈని గౌరవిస్తాం, హనఫీని గౌరవిస్తాం. మనం ఏం చూస్తాం? ప్రవక్త ఏం చేశారు అని మనం చూస్తాం. సుబ్ హా నల్లాహ్, హదీస్. అమ్మా ఆయిషా సిద్దీకా రదియల్లాహు త’ఆలా అన్హా అంటున్నారు, రాత్రి పూట ప్రవక్త వారు తహజ్జుద్ నమాజ్ చేసేవారు. నేను ప్రవక్త ముందు పడుకునే దానిని, ప్రవక్త వారు తహజ్జుద్ నమాజ్ చేస్తూ సజ్దా చేసినప్పుడు ప్రవక్త వారి తల నా మోకాళ్లకు, ముడుపులకు తగిలేది. ఎప్పుడైతే ప్రవక్త తల నా కాళ్లకు తగిలేదో, నేను రెండు కాళ్లు ముడుచుకునే దానిని. అమ్మా ఆయిషా అంటున్నారు. దీని బట్టి ఏం తెలిసింది? పురుషుడు వజూ చేసి కేవలం స్త్రీని ముట్టుకుంటే వజూ విరగదు. ఇదే అహలె హదీస్. మనం నమ్ముతాం, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం. కానీ బండగా ఇది చేశారు ఆ గురువుగారు, చెయ్యం. ఖురాన్ లో ఉందా? హదీస్ లో ఉందా? ఇదే నిజమైన సహబాల మార్గం, ప్రవక్త మార్గం, స్వర్గానికి తీసుకువెళ్లే మార్గం. ఇదే వ్యవస్థను భారతదేశంలో అత్యధికంగా అహలె హదీస్ గా పిలుస్తారు. ఇదేదో కొత్తగా వచ్చింది కాదు, ఈరోజు అహలె హదీస్ అని చెప్పుకోవటానికి భయపడక్కర్లేదు. ఎందుకంటే ఇది ఒక మనిషి పెట్టిన సంస్థ కాదు. సహబాల విధానాన్నే అహలె హదీస్ అన్నారు.

జమియతే అహలె హదీస్ మరియు దాని పిలుపు

మరి ఇండియాలో దీని తారీఖ్ ఏంటి? ఇండియాలో ఎప్పుడు పూర్తి అధికారికంగా మనం మాట్లాడుకుంటే, భారతదేశంలో ప్రియులారా, ఈ అహలె హదీస్ జమాత్ ఎప్పుడు కమిటీగా, అహలె హదీస్ వ్యవస్థ ఉంది, ఎప్పుడు కమిటీగా స్థాపించబడింది అంటే, 1906వ సంవత్సరంలో ప్రియులారా, 1906, 1906వ సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో ఆరా అనే ప్రాంతంలో అహ్మదియా అనే ఒక మదరసా ఉండేది. ఆ మదరసా యొక్క వార్షికోత్సవములో అహలె హదీస్ కాన్ఫరెన్స్ పేరుతో మొట్టమొదటి ఇజ్తిమా భారతదేశంలో జరిగింది 1906లో ప్రియులారా. అప్పుడు ఈ జమియత్, ఒక కమిటీ పరంగా, మనుషులైతే ఎప్పుడో ఉన్నారు సుబ్ హా నల్లాహ్, కమిటీ పరంగా భారతదేశంలో 1906 నుండి ఆవిర్భావంలోనికి వచ్చింది. కానీ ముస్లింలు ఎప్పుడున్నారు? 1906లో వచ్చారా? ముస్లింలు సహబాల కాలంలోనే ఇండియాలోనికి వచ్చారు. రాసేవాళ్ళు రాస్తారు పుస్తకాల్లో, భారతదేశంలో ముస్లింలు 712 క్రీస్తుశకం సింధూ దండయాత్ర ద్వారా దేశంలోనికి వచ్చారు. ఇది అబద్ధం. 712లో మహమ్మద్ గజనవి, గోరి, పేర్లు ఉంటాయి కదా, గజనీ మహమ్మద్, ఇలాంటి పేర్లు ఉంటాయి. వారి ద్వారా దండయాత్ర ద్వారా, 712లో ముస్లింలు వచ్చారు, అబద్ధం. ఇస్లాం భారతదేశంలో ప్రవక్త కాలంలో వచ్చింది. భారతదేశంలో ఇప్పటికీ మొట్టమొదటి మస్జిద్ ఉంది, వెళ్లి చూడండి. ఇండియాలో మొట్టమొదటి మస్జిద్ 629లో కట్టారు, సుబ్ హా నల్లాహ్. ఇది 2021 అయితే, భారతదేశంలో మొదటి మస్జిద్ 629లో కట్టబడింది. ఇప్పటికీ కేరళలో, మలబార్ ప్రాంతంలో, చెరమాన్ పెరుమాళ్ జుమా మస్జిద్ పేరుతో మస్జిద్ వర్ధిల్లుతుంది ప్రియులారా. ఏది ఏమైనప్పటికీ, సుబ్ హా నల్లాహ్, మనం ఒక మంచి వ్యవస్థను కలిగి ఉండాలి, ఖురాన్ హదీస్ వ్యవస్థ, అదే అహలె హదీస్ వ్యవస్థ, అదే సహబాల కాలం నాటి నుండి ఉంది. ఇమాముల కాలం నాటి నుండి ఉంది. ప్రతి ఇమామ్ ఈ అహలె హదీస్ విధానాన్ని గౌరవించారు. ఇదే సత్యమని ధ్రువీకరించారు. ఈరోజు ప్రవక్తపై అవతరించిన ఇస్లాం, ఏదైతే అహలె హదీస్ రూపంలో మాత్రమే భారతదేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో మిగిలి ఉంది ప్రియులారా. ఇండియాలో దీని ఆవిర్భావం 1906లో జరిగింది, సుబ్ హా నల్లాహ్. అప్పటి నుండి ఇదొక జమియత్ గా అవతరించింది. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత, ఇది మర్కజీ జమియతే అహలె హదీస్ గా మారింది ప్రియులారా. అనేక శాఖలు కలిగి ఉంది, సుబ్ హా నల్లాహ్. ఇది ప్రపంచానికి శాంతి వైపునకు పిలుస్తుంది. దీని ద్వారా ప్రపంచానికి లాభాలు తప్ప నష్టాలు లేవు. ఈరోజు భారతదేశంలో మేమే అహలుస్సున్నా వల్ జమాత్, అహలుస్సున్నత్, అహలుస్సున్నత్, వీరంతా అహలె బిద్అత్ పనులు చేస్తున్నారు. ఈరోజు దేశంలో ఇస్లాంకు సంబంధించి, షరియత్ కు సంబంధించి విషయాలు కోర్టులకెక్కినాయి అంటే, ఎవరు కోర్టుకెక్కించారు? ఈరోజు ఇస్లాం షరియత్ లో భారతదేశం యొక్క కోర్టులు వచ్చి చుచ్చును పోయాయి అంటే ఎవరు చుచ్చు చేశారు? త్రిపుల్ తలాఖ్ తీసుకోండి. ఈ త్రిపుల్ తలాఖ్ అంశం భారతదేశంలో షరియత్, షరియత్ లోకి కోర్టు వచ్చింది అంటే త్రిపుల్ తలాఖ్ నియమం ఉంది. కానీ వాస్తవానికి ఖురాన్ హదీస్ ప్రకారం త్రిపుల్ తలాఖ్ ఇస్తే, మూడు తలాఖులు కాదు. ఎవడైనా మనిషి తన భార్యకు మూడు సార్లు తలాఖ్ చెబితే, షరియత్ ప్రకారం ఒక్క తలాఖ్ మాత్రమే అవుతుంది. స్త్రీ గౌరవాన్ని కాపాడే వ్యవస్థ అహలె హదీస్ వ్యవస్థ ప్రియులారా. ఈరోజు దేశంలో ఒక ఉద్యమం, స్త్రీలు మస్జిద్ లోకి రాకూడదు, స్త్రీల కోసం మస్జిద్ లో ఏర్పాటు లేదు, దీనికోసం కేరళలో ఒక స్త్రీ ఏం చేసింది? జుమా రోజు మీరు మస్జిద్ లకు స్త్రీలను రానివ్వటం లేదు, నేను ఇమామత్ చేయిస్తా, నఊజుబిల్లా, జుమా రోజు ఇమామత్ చేయించింది ఒక స్త్రీ. అల్లాహ్ రక్షించుగాక! దేని వలన? మీరు స్త్రీలకు మస్జిద్ లో పర్మిషన్ ఇవ్వకపోవడం వలన. కానీ ఈరోజు మేరు భారతదేశంలో అహలె హదీస్ మస్జిదులు స్త్రీల కోసం తలుపులు తెరుస్తున్నాయి, మాషా అల్లాహ్. మీరు మస్జిద్ కు వచ్చి పురుషులతో పాటు పరదా వ్యవస్థతో నమాజ్ స్థాపించవచ్చు. అహలె హదీస్ విధానం, దేశంలో ఇస్లాంకు వ్యతిరేకంగా గొంతెత్తే వారికి సమాధానం మన వద్ద ఉందండి. త్రిపుల్ తలాఖ్ కోసం మాట్లాడేవారు, మేము అహలె హదీస్ సమాధానం ఇస్తాం. ఎవరైనా స్త్రీ మస్జిద్ కు రాకూడదంటే, సమాధానం ఇవ్వగలదు అహలె హదీస్. ఈరోజు భారతదేశంలో ముస్లింల పట్ల ద్వేషం దేనికోసం అండి? కోపం, కొంతమంది ముస్లింలు, జ్ఞానం లేని ముస్లింలు ఏం చేస్తున్నారు? పండగ వస్తే, ఒక జెండాలు పెడతారు. ఆ జెండా దేనిని రిసెంబుల్ చేస్తుంది? అది పక్క దేశం యొక్క జెండాలాగా ఉంది. మరి ఆ జెండాలు పెట్టకుండా, ఈరోజు ఇస్లాంను పూర్తిగా వాస్తవ రూపంలో తెలియజేసేది అహలె హదీస్. ఒక అహలె హదీస్ మస్జిద్ వద్ద ఏదైనా పండగ వస్తే జెండా చూస్తారా? అల్లాహ్ రక్షించుగాక! మనమంతా బిద్అత్ ప్రియులారా. ఈరోజు అహలె హదీస్ విధానం, దేశంలో అనేక మంది హిందువులు తిడుతుంటారు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు అనేక నగరాలలో మధ్యలో దర్గాల పేర్లతో, సమాధుల పేర్లతో సమాధులు ఉంటాయి. కానీ సమాధులు భూమికి ఇంత ఎత్తులో కూడా ఉండకూడదు, తొలగించాలని చెప్పిన వ్యవస్థ ఇస్లాం వ్యవస్థ. దీనితో దేశానికి శాంతి ఉంది. మరి ఎంతమంది ఈరోజు స్వర్గానికి వెళ్ళే ఈ వ్యవస్థ, దేశంలో ప్రజలకు శాంతి కలిగించే ఈ వ్యవస్థ, దేశంలో ప్రజలకు స్వచ్ఛమైన తౌహీద్ బోధించే ఈ వ్యవస్థతో కలిసి ఉన్నారు? కలవండి. ఈరోజు అహలె హదీస్ అనే ఈ విధానంతో, ఈ మస్లక్ ఎందుకంటే ప్రియులారా, నేను చెప్పే మాట, ఇంతకీ ఎందుకయ్యా చెప్తున్నారు ఈయన? నేను చెప్పే మాట, ఈరోజు మనమంతా ఒక శక్తి ప్రియులారా. ఈ శక్తి చిన్నాభిన్నం కాకూడదు. మనం ముక్కలు కాకూడదు. మనం ముక్కలైతే ఏమవుతుంది? ఖురాన్ తీయండి. అల్లాహ్ అంటున్నారు:

وَأَطِيعُوا اللَّهَ وَرَسُولَهُ وَلَا تَنَازَعُوا فَتَفْشَلُوا وَتَذْهَبَ رِيحُكُمْ ۖ وَاصْبِرُوا ۚ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ
(వ అతీఉల్లాహ వ రసూలహూ వలా తనాత’ఊ ఫతఫ్షలూ వ తద్ హబ రీహుకుమ్ వస్బిరూ ఇన్నల్లాహ మ’అస్సాబిరీన్)

అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి. పరస్పరం కలహించుకోకండి. అలా చేస్తే మీరు బలహీనులైపోతారు. మీ బలం నశిస్తుంది. ఓర్పు వహించండి. నిశ్చయంగా అల్లాహ్‌ ఓర్పు వహించేవారికి తోడుగా ఉంటాడు. (8:46)

అల్లాహ్ ఏమన్నాడు? “వ అతీఉల్లాహ,” అల్లాహ్ కు విధేయత చూపండి. “వ రసూల,” ప్రవక్తకు విధేయత చూపండి. “వలా తనాత’ఊ,” పరస్పరం కలహాలకు గురి కాకండి. మీరు కలహాలకు గురైతే “ఫతఫ్షలూ వ తద్ హబ రీహుకుమ్,” మీరు గనక కలహాలకు గురైతే మీరు ముక్కలైపోతారు, మీ గాలి, అంటే మీ బలం కాస్తా తగ్గిపోతుంది. “వస్బిరూ ఇన్నల్లాహ మ’అస్సాబిరీన్,” ఓర్పు వహించండి. అల్లాహ్ ఓర్పు వహించే వారికి తోడున్నాడు. ఒక సంఘంగా ఉండండి. ఖురాన్ యే చెప్పింది:

وَاعْتَصِمُوا بِحَبْلِ اللَّهِ جَمِيعًا وَلَا تَفَرَّقُوا
(వ’తసిమూ బిహబ్లిల్లాహి జమీఅన్ వలా తఫర్రఖూ)

మీరందరూ కలిసి అల్లాహ్‌ త్రాడును గట్టిగా పట్టుకోండి. పరస్పరం విడిపోకండి. (3:103)

మీరంతా అల్లాహ్ మరియు ప్రవక్త త్రాడును గట్టిగా పట్టుకోండి. ముక్కలైపోకండి. ఈరోజు ముక్కలు చెక్కలైపోయాం ప్రియులారా. నేను ఒక మాట అంటాను, వ్యక్తిగతంగా మీరు ఏమనుకున్నా అనుకోండి, కానీ జమాత్ పరంగా, జమియత్ పరంగా ఈరోజు దేశానికి అవసరం ఈ అహలె హదీస్ విధానం ప్రియులారా. కాబట్టి దీని కోసం మనం పని చేయాలి, మనమంతా కలిసి ఉండాలి, ఒక సంఘంగా. ముస్లిమేతర శక్తులు, ముస్లిమేతర శక్తులు ఇస్లాంను అపఖ్యాతి పాలు చేయటానికి ఎంత స్ట్రాంగ్ గా పనిచేస్తున్నాయో, అల్లాహ్ చెప్పాడు ఖురాన్ గ్రంథంలో, తీయండి ఇంటికెళ్ళి ఎనిమిదవ సూరా, సుమారు వాక్యం సంఖ్య 72 లేదా 76, తీయండి. అల్లాహ్ ఏమన్నాడు? వారు అవిశ్వాసులు. వారు అవిశ్వాసులు, ఒకరికొకరు స్నేహితులు. ఈరోజు జెండాలు పట్టుకుని మనం పరిగెత్తుంటాం, సుబ్ హా నల్లాహ్, పరిగెట్టు, పరిగెట్టు, నమాజ్ అయినా కూడా ఇటు రాదు ధ్యాస, అటే వస్తుంది ధ్యాస. వారు అవిశ్వాసులు, ఒకరికొకరు స్నేహితులు. ఓ విశ్వాసులారా, మీరు గనక స్నేహితులు కాకపోతే, భూమిలో కల్లోలం చెలరేగుతుంది అని అల్లాహ్ త’ఆలా చెప్పాడు. స్నేహితులు అవుదామా లేదా? అవుదాం. చాలు ఆ మాటలు. మనం పరస్పరం వ్యక్తిగతంగా ఏమైనా పెట్టుకుందాం. కానీ అల్లాహ్ కోసం, ప్రవక్త కోసం, ఖురాన్ హదీస్ కోసం, ఈరోజు ఇస్లాం కోసం, ముస్లింలంతా ఒక శక్తిగా ఉండాలి ప్రియులారా. దీనికోసం సుబ్ హా నల్లాహ్, నేనేదైతే ఇందాక నుంచి జమాతె అహలె హదీస్ అంటున్నానో, ఇది కూడా ఒక వ్యవస్థ లాగా ఉంది, దీనికి కార్యచరణ ఉంది. దీనికి వెనకా ముందు ఏమీ లేకుండా లేదండి. ఢిల్లీ నుండి సుబ్ హా నల్లాహ్ మన జమియత్ ఉంది ప్రియులారా. మన జమియత్ ఈ దేశంలో 1906లో రిజిస్ట్రేషన్ అయినప్పటి నుండి తన పని చేస్తూ పోతుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత నుండి జమియత్ ఆవిర్భవించింది ప్రియులారా. చెప్పడం జరుగుతుంది, వల్లాహు ఆలమ్, ఈ యొక్క అహలె హదీస్ మనహజ్ పై నడిచే వారు, నేను విన్నాను హైదరాబాద్ లో, అల్లాహు ఆలమ్, సుమారు నాలుగు కోట్ల మంది మనం దేశంలో నివసిస్తున్నాం. కానీ మనం ఒక శక్తిగా నివసించటానికి మనమొక సంస్థను స్థాపించుకున్నాం. బయట బోర్డు కూడా పెట్టారు ప్రియులారా, మర్కజీ జమియతే అహలె హదీస్ హింద్, అఖిల భారత జమియతే అహలె హదీస్ హింద్ సంస్థ. ఇది ఢిల్లీ నగరంలో తన యొక్క ముఖ్య కేంద్రాన్ని కలిగి ఉంది. ప్రతి రాష్ట్రంలో రాష్ట్రీయ శాఖలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో జిల్లా శాఖలు ఉన్నాయి. జిల్లాలలో నగర శాఖలు ఉన్నాయి. నగరాల కింద ప్రాంతీయ శాఖలు ఉన్నాయి, సుబ్ హా నల్లాహ్. ఢిల్లీలో మన అమీర్ గారు ఉన్నారు. స్టేట్ లో అమీర్ గారు ఉన్నారు. జిల్లాకి అమీర్ గారు ఉన్నారు. నగరానికి అమీర్ గారు ఉన్నారు. మనమొక సంస్థగా, ఒక బలంగా తయారవ్వాలంటే జమియత్ తో సంబంధం కలిగి ఉండాలి ప్రియులారా. అదే కోవలో తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ నగర జమియతే అహలె హదీస్ మిమ్మల్నందరినీ ఆహ్వానిస్తుంది, ఈ సంఘంతో ముడిపడండి. మనమంతా కలిసి పనిచేద్దాం, ఖురాన్ హదీస్ ప్రపంచానికి తెలియజేద్దాం. ఎవరయ్యా, నేను ఏ జమాత్ లో లేనండి, నాకు అమీర్ లేడండి. లేదు ప్రియులారా. జమాత్ లో ఉంటేనే నీపై అల్లాహ్ యొక్క చెయ్యి ఉంటుంది. హదీస్ లో ప్రవక్త వారు ఏం చెప్పారు? “యదుల్లాహి అలల్ జమాఅ,” జమాత్ పై అల్లాహ్ యొక్క చెయ్యి ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈరోజు జమాత్ వ్యవస్థతో మనం ఎంతవరకు కలిసి ఉన్నాం? ప్రియులారా అవసరం. నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, రోజుకొకటండి, అల్లాహ్ రక్షించుగాక, మన గురించి మాట్లాడేవాడు లేడు దేశంలో. అల్లాహ్ రక్షించుగాక, మొన్న ఇద్దరు నర్స్ అండి, ఇద్దరు సిస్టర్స్ ఢిల్లీలో ట్రైన్ ఎక్కారు, ఒడిస్సా వెళ్తున్నారు. ఎవరో ఇద్దరితో మాట్లాడుతున్నారట, సంథింగ్ ఎవరికో డౌట్ వచ్చింది. ఝాన్సీ రైల్వే స్టేషన్ లో దింపేశారు. దానికోసం ఒక సీఎం లేఖ రాసేస్తాడు, హోం మినిస్టర్ జవాబు ఇస్తాడు, మేము యాక్షన్ తీసుకుంటాం ట్రైన్ లో దింపిన వారిపై. ఒక ఇద్దరు నన్స్, ఒక ఇద్దరి కోసం దేశమంతా కోడై కూస్తుంది. వారి సంఘాలు ఆవురావురు కేకలు వేస్తున్నాయి. నేను ఒక కోటి పెట్టుకున్నాను, నాపై ముద్ర వేసేవారు ఉగ్రవాది అని ముద్ర వేస్తున్నారు. నాపై నుండి కింద నుండి, ఎందుకు కారణం? ఒకటి దేశంలో ముస్లింలు ఈ సున్నత్ ను విడిచిపెట్టకపోవడం. అల్లాహు అక్బర్, మనం ప్రతి ఒక్కరం ముస్లింలుగా ఉండి, దేశంలో ఉన్న 20% ముస్లింలు సుబ్ హా నల్లాహ్ ఈ గడ్డం వ్యవస్థ పాటిస్తే ఎవ్వరూ మిమ్మల్ని చూడరు. సుబ్ హా నల్లాహ్, ముస్లింల వ్యవహారం ఏది? ఈరోజు మనం చాలా మంది భయపడుతున్నాం షరియత్ ను ఆచరించడానికి, నడిపితే భయం. అల్లాహ్ మనకి తోడున్నాడు. కానీ చెప్పే మాట, ఇద్దరి గురించి మాట్లాడితే దేశం కోడై కూస్తుంది, మన కోసం మాట్లాడేవాడు నోరొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. పొద్దున్న లేగిస్తే పేపర్ లో ఇస్లామిక్ ఉగ్రవాదం అని రాస్తున్నాడు. ఎంతమంది బాధపడుతున్నాం? నేను అంటున్నాను ప్రియులారా, మనం ఏ ఫీల్డ్ లోనైతే ఆరితేరి ఉన్నామో, మనం ప్రశ్నించే వ్యవస్థగా మారాలంటే మనమంతా జమాత్ కు మన యొక్క సహాయం అందించాలి. ఎవరు, ఒక మెడికల్ ఫీల్డ్ లో నేను ఉన్నానండి, జమియత్ శబ్దం ఇస్తే నేను దాని కోసం పనిచేస్తున్నాను. ఫలానా ఫీల్డ్ లో, ఎంతమంది అయితే మీకు కలలు ఉన్నాయో, ఈ కలలన్నీ, గురువుగారు ఫలానా ఫీల్డ్ నాకు తెలుసండి, నేను జమియత్ కు సహకరిస్తాను. టెన్త్ క్లాస్ అయిపోయింది పిల్లవాడికి, టెన్త్ తరువాత ఏం చేయాలి? పిల్లలకు తెలియడం లేదు. నేను ఉన్నానండి, టెన్త్ తరువాత పిల్లలు ఎలా చదువుకోవాలో నేను చెప్పగలను, నేను జమియత్ కు ఈ విధంగా సహాయం చేస్తాను. గురువుగారు ఫలానా ఫీల్డ్ మెడికల్ నాకు తెలుసండి, నేను ఇన్షా అల్లాహ్ మనం ముస్లింల కోసం, ప్రతి ఒక్కరూ తన, తన అంటున్నారు, మనం? వాడు, వాడు, వాడు, వాడు, వాడు, వాడు, మేమేమో… ఈ దేశానికి అవసరం ప్రియులారా. ప్రతి ఒక్కరూ మనం అంటున్నారు, మనం మాత్రం నేను అనుకుంటున్నాం. పనికిరాదు ప్రియులారా. కాబట్టి మనమంతా మనముగా పని చేయాలంటే మనం జమియత్ తో కలవాలి ప్రియులారా. ఈ జమియత్ మీకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసింది. బయట గోడ మీద పెట్టించిందంట అక్కడ. ఈ జమియత్ యొక్క సభ్యత్వం తీసుకోండి. 18 సంవత్సరాలు వస్తే మీరు జమియత్ యొక్క సభ్యత్వం తీసుకోవచ్చు. జమియత్ లో మీ సలహా ఇవ్వవచ్చు, మీ సంపదింపులు ఇవ్వవచ్చు, జమియత్ మీతో మాట్లాడుతుంది. జమియత్ ఏదైనా నిర్ణయం చేసుకుంటే మిమ్మల్ని కూడా సంప్రదిస్తుంది. మీరు జమియత్ లోకి రాకుండా, జమియత్ మూల సిద్ధాంతాలకు రాజీ కాకుండా, జమియత్ గురించి చెడుగా మాట్లాడుతూ, జమాత్ మమ్మల్ని పట్టించుకోదండి, మా వైపునకు చూడదండి, మాతో మాట్లాడదు అంటే, అవదు ప్రియులారా. కాబట్టి ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని. కాకినాడ నగర జమియత్ యొక్క బాధ్యులతో సంప్రదించండి. ఈ జమియత్ యొక్క సభ్యత్వ ఫారం నమోదు చేయండి. మనమంతా కలుద్దాం, ఒక శక్తిగా భారతదేశంలో పని చేద్దాం. ఇస్లాంకు వ్యతిరేకంగా ఏవైతే గొంతుకలు లేగుస్తున్నాయో, వాటిని మనం ఎదుర్కోవాలంటే శక్తి అవసరం ప్రియులారా. రెండో మాట ఏందీ, ఈ శక్తి అంటున్నారు, ఎదుర్కోవాలంటున్నారు, ఎవడు పడితే వాడు, నా విధానం ఇదండి, మీరు ఈ జెండా పట్టుకుంటాను, లేదు. ఆ విధానం కూడా ఖురాన్ హదీస్ మనకు తెలియజేసాయి. ఆ విధానాలను జమియత్ మీకు తెలియజేస్తుంది ప్రియులారా. కాబట్టి మరొక్కసారి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రియులారా, మనమంతా కలిసి పనిచేద్దాం, ఖురాన్ హదీస్ ప్రపంచానికి అందిద్దాం. ఈరోజు అదే ఖురాన్ హదీస్ నిర్మలముగా, స్వచ్ఛముగా ప్రపంచానికి అందజేయటానికి భారతదేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ పేరు జమియతే అహలె హదీస్ హింద్, మర్కజీ జమియతే అహలె హదీస్ హింద్. ఈ యొక్క జమియత్ లో మనమంతా భాగస్వాములవుదాం, ఇన్షా అల్లాహ్ త’ఆలా భారతదేశంలో పనిచేద్దాం. అల్లాహ్ ఈ జమియత్ తో కలిసి పనిచేసే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.



యూట్యూబ్ ప్లే లిస్ట్ – షరీఫ్ మదనీ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0AKZXyDn6KYNFu5ok4ZFtb

క్రింది వీడియో కూడా తప్పకుండా వినండి:
మన్’హజె సలఫ్ యొక్క ప్రాధాన్యత, అఖీదా (విశ్వాసం) మరియు ఆచరణలో [వీడియో]

ప్రస్తుత కాలంలో షరియత్ (ధర్మ శాస్త్రం)లో మార్పులు సాధ్యమేనా? [వీడియో]

బిస్మిల్లాహ్
ప్రస్తుత కాలంలో షరియత్ (ధర్మ శాస్త్రం)లో మార్పులు సాధ్యమేనా? – షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/Y55gGxIgxeM

[63 నిముషాలు]
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త సహచరుల మధ్య విభేదాల, అంతఃకలహాల విషయంలో అహ్లె సున్నత్ వల్ జమాఅత్ వైఖరి – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

అల్లాహ్ ఏకత్వం (అఖీదా ఏ తౌహీద్) పుస్తకం
Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

ప్రవక్త సహచరుల మధ్య విభేదాల, అంతఃకలహాల విషయంలో అహ్లె సున్నత్ వల్ జమాఅత్ వైఖరి :

ఉపద్రవానికి మూలం: ప్రవక్త ప్రియ సహచరుల మధ్య చీలిక రావటానికి ప్రధాన కారకులు యూదులు. వారు ఇస్లాంకు, ముస్లిములకు వ్యతిరేకంగా కుట్రపన్నారు. వారు వంచనా శిల్పనిష్ణాతుడైన, యమన్ దేశస్థుడైన అబ్దుల్లాహ్ బిన్ సబా అనే యూద వ్యక్తిని దీని కొరకు సిద్ధం చేశారు. వాడు ఇస్లాం స్వీకరిస్తున్నట్లు నాటకమాడి తన చుట్టూ ఓ సుందర వలయాన్ని అల్లుకున్నాడు. తరువాత అతను తృతీయ ఖలీఫా అయిన హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)కు వ్యతిరేకంగా దుర్విమర్శలు చేయటం మొదలెట్టాడు. చివరకు ఆయనపై విషం కక్కాడు. ఆయనపై అపనిందలు కూడా మోపాడు. తత్ఫలితంగా సంకుచిత స్వభావులు, బలహీన విశ్వాసం గలవారు కొందరు అతని మాటల్లో పడి, అసమ్మతి వాదులుగా అతని చుట్టూ చేరారు. వారి కుట్ర మూలంగా హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) నిర్దాక్షిణ్యంగా హత్యచేయబడ్డారు. ఆయన (రదియల్లాహు అన్హు) అమరగతినొందిన తరువాత ముస్లిములలో విభేదాలు పొడసూపాయి. దానికి తోడు యూదులు చాపకింద నీరులా ప్రవహించి ప్రజలను రెచ్చగొట్టడంతో ప్రవక్త సహచరుల మధ్య విభేదాలు మరింత తీవ్రరూపం దాల్చాయి. వారు తమ తమ ఇత్తెహాద్ ప్రకారం (అంటే వారిలో ప్రతి ఒక్కరూ తాము ఎన్నుకునే విధానమే సరైనదని భావించటం వల్ల) కలహాలకు, యుద్ధాలకు తెరలేచింది. 

‘అఖీదయే తహావీయ’ వ్యాఖ్యాత ఇలా అంటున్నారు:

“రఫ్ద్ (షియాతత్వం) అనే ఉపద్రవాన్ని ఓ కపట విశ్వాసి సృష్టించాడు. ఇస్లాం ధర్మాన్ని రూపుమాపి, ఇస్లాం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వ్యక్తిత్వాన్ని కళంకితం చేయాలన్నది వాడి ఉద్దేశ్యం. అందుకే అబ్దుల్లాహ్ బిన్ సబా ఇస్లాం స్వీకరించినట్లు ప్రకటించగానే తన వంచనాపూరిత, మోసపూరిత చేష్టల ద్వారా ఇస్లాం ధర్మానికి తూట్లు పొడవటం మొదలెట్టాడు. క్రైస్తవ మతం పట్ల పౌల్ వ్యవహరించినట్లే ఇతనూ వ్యవహరించాడు. అంటే తనను ఒక మహా సాత్వికునిగా, దుష్ట శిక్షకు శిష్టరక్షణకు నడుం బిగించిన వానిగా చాటుకుని తనచుట్టూ ఓ సుందరవలయాన్ని అల్లుకున్నాడు. ఆ తరువాత హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)కు వ్యతిరేకంగా అసంతృప్త వాదాన్ని వ్యాపింపజేసి, ఆయన్ని హతమార్చే ప్రయత్నం చేశాడు. దరిమిలా ‘కూఫా’ వచ్చి, హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు)కి వీరాభిమానిగా ప్రకటించుకుని, ఆయనను పొగడటంలో అతిశయిల్లి రాగానపడ్డాడు. ఆ విధంగా ఆయన (రదియల్లాహు అన్హు)అభిమానం చూరగొని, తన తుచ్ఛమయిన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకుందామనుకున్నాడు. అతని కుత్సితబుద్ధి గురించి తెలియగానే హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు), అతన్ని హతమార్చమని ఆదేశించారు. దాంతో వాడు ‘ఖర్‌ ఖైస్’కు పలాయనం చిత్తగించాడు. అతని పూర్తి వృత్తాంతం చరిత్రపుటల్లో ఉంది.” 

షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు :

హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) అమరగతి నొందిన తరువాత ప్రజల గుండెలు శోకంతో అవిసిపోయాయి. వారి హృదయాలు భగ్న హృదయాలైపోయాయి. ముస్లింలపై దుఃఖ పర్వతం విరుచుకుపడింది. దుష్టశక్తులు చెలరేగిపోయాయి. సజ్జనుల ఆత్మ విశ్వాసం సన్నిగిల్లిపోయింది. అప్పటి వరకూ అణగిమణగి ఉండేవారు ఉపద్రవాన్ని వ్యాపింపజేయటంలో కృతకృత్యులైపోయారు. సంస్కరణా సరణిని అవలంబించదలచిన వారు అశక్తులైపోయారు. అందువల్ల వారంతా ఖిలాఫతకు అందరికన్నా ఎక్కువ అర్హులైన హజ్రత్ అలీ బిన్ అబితాలిబ్ (రదియల్లాహు అన్హు) చేతులపై ప్రతిజ్ఞ (బైఅత్) చేశారు. కాని అప్పటికే ఉపద్రవాగ్ని రాజుకుని ఉండటం వల్ల, ప్రజల హృదయాలు భగ్నమై ఉండటం వల్ల సమాజంలో సమైక్యత, సంఘఠితత్వం సాధ్యం కాలేకపోయింది. ముస్లింలలో సామూహికత వేళ్లూను కోలేక పోయింది. ఆనాటి ఖలీఫాగానీ, సమాజంలో మానవనవనీతంగా పరిగణించబడే మంచివారుగాని ఎంతగా అభిలషించినప్పటికీ అనుకున్న మంచిని సాధించలేకపోయారు. విచ్చిన్నకరమైన ఆ వాతావరణంలో మరికొందరు స్వార్ధపరులు కూడా జొరబడ్డారు. ఆ తరువాత జరగవలసినదంతా జరిగిపోయింది.”

(మజ్మూఅ అల్ ఫతావా : 25/304, 305) 

ఇకపోతే హజ్రత్ అలీ, ముఆవియా (రదియల్లాహు అన్హుమ్)ల యుద్ధంలో పాల్గొన్న ప్రవక్త ప్రియ సహచరుల సంజాయిషీ (కారణం)ని వివరిస్తూ షేఖుల్ ఇస్లాం ఇలా అభిప్రాయపడ్డారు: 

ముఆవియా (రదియల్లాహు అన్హు) అలీ (రదియల్లాహు అన్హు)తో యుద్దానికి సంసిద్ధమైనపుడు ఖిలాఫత్ తనకే చెందాలని ఆయన కోరలేదు. ఆయనకు ఖిలాఫత్ కట్టబెట్టే విషయమై బైఅత్ (ప్రతిజ్ఞ) కూడా చేయించలేదు. తానొక ఖలీఫా అనే భావనతో ఆయన యుద్ధానికి రాలేదు. ఈ విషయం గురించి ముఆవియా (రదియల్లాహు అన్హు)ను ఎవరు ప్రశ్నించినా వారి ముందు ఆయన ఇదంతా చెప్పేవారు. ఆయన అనుయాయులు కూడా అంతే. వారు అలీ (రదియల్లాహు అన్హు)తోనూ, అలీ సహచరులతోనూ యుద్ధానికి ముందంజ వేయలేదు. అదే సమయంలో హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు), మరియు ఆయన సహచరుల ఆలోచనలు మరోవిధంగా ఉన్నాయి – తానొక ఖలీఫా కావటం చేత ముఆవియ మరియు ముఆవియా సహచరులు వచ్చి తన చేతుల మీద ప్రమాణ స్వీకారం చేయాలన్నది అలీ (రదియల్లాహు అన్హు) అభిలాష. ఎందుకంటే ముస్లింలకు ఖలీఫాగా ఒకే వ్యక్తి ఉండాలి. కాని వారు తనకు విధేయత చూపటం లేదు. తన చేతిపై ‘ప్రమాణం’ చేయటం లేదు సరికదా, తమను స్వతంత్రులుగా ఊహించుకుంటున్నారు. తమ వద్ద శక్తి ఉంది. అధికార బలం ఉంది. అయినప్పటికీ వారు మాట వినటం లేదు. కాబట్టి వారితో యుద్ధం చేసి, వారిని దారికి రప్పించాలి. తద్వారా వారు ఖలీఫాకు విధేయులవుతారు. ఆ విధంగా ముస్లింల సామూహిక వ్యవస్థ పటిష్టంగా ఉండగలుగుతుంది – ఇదీ హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) మరియు ఆయన సహచరుల ఆలోచన. కాగా; హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) మరియు ఆయన సహచరుల ఆలోచనా తీరు తద్భిన్నంగా ఉంది : తాము అలీ (రదియల్లాహు అన్హు)చేతులపై ‘ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. ఈ కారణంగా ఒకవేళ తమతో యుద్ధం చేయబడినా తాము బాధిత ప్రజల కోవకే చెందుతాము. ఎందుకంటే తృతీయ ఖలీఫా హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)దారుణంగా హత్య చేయబడ్డారు. ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)ను హత్య చేయటంలో కీలకపాత్ర పోషించినవారు ప్రస్తుతం హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) సైన్యంలో ఉన్నారు. సైనిక విభాగంలో వారి ప్రాబల్యం కూడా ఎక్కువగానే ఉంది. మనం గనక ఈ సమయంలో నిర్లిప్తంగా ఉండిపోతే వారు మరింతగా విజృంభించి మనపై జులుంకు ఒడిగట్టవచ్చు. అదే గనక జరిగితే ఖలీఫా హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) వారిని నిలువరించలేరు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)ను ముట్టడించినపుడు అలీ (రదియల్లాహు అన్హు) ఎలా నిస్సహాయులుగా ఉండిపోయారో అలాగే ఉండిపోవచ్చు. కాబట్టి మనకు న్యాయం చేసే ప్రతిభావంతుడైన ఖలీఫా చేతుల మీద మాత్రమే మనం బైఅత్ (ప్రతిజ్ఞ) చేయాలి.” 

సహాబా (రదియల్లాహు అన్హుమ్)మధ్య పొడసూపిన విభేదాలు, అంతఃకలహాల ఫలితంగా జరిగిన యుద్ధాలు – ఈ విషయంలో అహ్లె సున్నత్ వల్ జమాఅత్ వైఖరి రెండు విషయాలపై ఆధారపడి ఉంది. 

ఒకటి : ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రియసహచరుల (రదియల్లాహు అన్హుమ్) మధ్య తలెత్తిన వివాదాలపై, అవాంఛనీయ ఘటనలపై అహ్లె సున్నత్ వల్ జమాఅత్ కి చెందిన వారు నోరెత్తకుండా మౌనం వహించటమే శ్రేయస్కరమని భావిస్తారు. ఈ రగడపై వారు తర్జనభర్జన చేయటంగానీ, తమవైన అభిప్రాయాలు వ్యక్తపరచటం గానీ చేయరు. పైగా వారిలా వేడుకుంటూ ఉంటారు: 

“మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయా లలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదుస్వభావుడవు. కనికరించేవాడవు.” (అల్ హష్ర్ :10) 

రెండు: సహాబా (ప్రవక్త సహచరులు రదియల్లాహు అన్హుమ్) గురించి ప్రాచుర్యంలో ఉన్న కథనాలకు సమాధానాలివ్వటం. దీనికి సంబంధించిన కొన్ని పద్ధతులు ఇవి : 

మొదటి పద్దతి: 

అలాంటి కథనాల (ఆసార్)లో కొన్ని పచ్చి అబద్దాలు. ప్రవక్త సహచరులకు అపఖ్యాతి అంటగట్టడానికి ఇస్లాం విరోధులచే సృష్టించబడిన కట్టుకథలవి. 

రెండవ పద్ధతి: 

సహాబాకు సంబంధించిన మరికొన్ని కథనాలున్నాయి. వాటిలో హెచ్చుతగ్గులు, మార్పులు చేర్పులుచేయబడ్డాయి. ఆ విధంగా వాటి రూపురేఖలనే మార్చివేయటం జరిగింది. అందులో అబద్దం పాళ్ళు అధికం. కాబట్టి అలాంటి వాటిని కూడా పట్టించుకోకుండా ఉండటమే శ్రేయస్కరం. 

మూడవ పద్ధతి: 

ఆ కథనాలలో ప్రామాణికం అనదగినవి, అలాంటివి చాలా తక్కువే. ఈ విషయంలో మటుకు ప్రవక్త సహచరులు అశక్తులు, క్షంతవ్యులు. ఎందుకంటే వారు ఆ విషయాలలో తమ ‘ఇత్తెహాద్’ ప్రకారం పనిచేశారు. అందులో వారు సత్యం వరకూ చేరుకున్నారు లేదా వారివల్ల పొరపాటు కూడా జరిగి ఉండవచ్చు. ఎందుకంటే వారు ‘ముజ్తహిద్’ లు (సమకాలీన సవాళ్ళను షరీఅత్ బద్దంగా అన్వయించటానికి శాయశక్తులా కృషిచేసిన విజ్ఞులు). ఈ అన్వయింపు ప్రయత్నంలో వారు సరైన ఆజ్ఞ వరకూ చేరగలిగితే వారికి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ఒకవేళ వారు సరైన నిర్ణయానికి చేరుకోలేకపోయినప్పటికీ – వారివల్ల పొరపాటు జరిగినప్పటికీ – చిత్తశుద్దితో కూడిన వారి కృషికి గాను ఒకింత పుణ్యఫలం లభిస్తుంది. మరోవైపు వారి తప్పు కూడా మన్నించబడుతుంది. ఎందుకంటే హదీసులో ఇలా అనబడింది

న్యాయ నిర్ణయం గైకొనే వ్యక్తి ‘ఇజ్తిహాద్’ చేసినపుడు అతను సరైన నిర్ణయానికి చేరుకోగలిగితే అతనికి రెండింతల ప్రతిఫలం ప్రాప్తమవుతుంది. ఒకవేళ అతని వల్ల పొరపాటు జరిగినట్లయితే అతనికి ఒకింత ప్రతిఫలం లభిస్తుంది.” (బుఖారీ, ముస్లిం) 

నాల్గవ పద్ధతి: 

ప్రవక్త సహచరులు (సహాబా రదియల్లాహు అన్హుమ్) కూడా మానవమాత్రులే. వారివల్ల కూడా తప్పులు జరగటం సహజం. వ్యక్తిగతంగా చూస్తే వారు దోషరహితులు కారు. అయితే వారివల్ల జరిగే పొరపాట్లను పరిహరించే మరెన్నో పనులు, అంశాలున్నాయి. అవి వారి పాపాలకు పరిహారంగా ఉపయోగపడతాయి. అలాంటి వాటిలో కొన్ని ఇవి 

1. బహుశా వారు పశ్చాత్తాపపడ్డారేమో! తప్పులు ఎన్ని జరిగి ఉన్నాసరే, పశ్చాత్తాపం (తౌబా) వాటిని రూపుమాపుతుంది. 

2. ఒకవేళ వారివల్ల అలాంటిదేదైనా జరిగి ఉన్నా, మరెన్నో విషయాలలో వారు ముందంజవేసి ఉన్నారు. వారివల్ల జరిగిన తప్పుల మన్నింపునకు అవి సాధనం కావచ్చు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : 

నిశ్చయంగా పుణ్యకార్యాలు పాపకార్యాలను దూరం చేస్తాయి.” (హూద్ : 114) 

3. వారి పుణ్యకార్యాలు వేరితరుల కంటే ఎన్నో రెట్లు పెంచబడవచ్చు. గొప్పతనం విషయంలో ఇతర వ్యక్తులు వారితో సరితూగలేరు. వారు మంచి కాలానికి చెందినవారని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి ప్రవచనం ద్వారానే రూఢీ అయింది. వారిలో ఎవరయినా ఒక ‘ముద్’కు సమానంగా దానం చేస్తే అది ఇతరులు ఉహుద్ పర్వతానికి సమానంగా దానం చేసిన బంగారం కన్నా గొప్పది. అల్లాహ్ వారితో ప్రసన్నుడవుగాక! వారిని సంతోషంగా ఉంచుగాక! 

షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు :

“మొత్తం అహ్లె సున్నత్ వల్ జమాఅత్, ధర్మవేత్తల నమ్మకం (అఖీదా) ఏమిటంటే సహాబాలలో ఏ ఒక్కరూ దోష రహితులు, పవిత్రులు కారు. అలాగే ప్రవక్త బంధువులుగానీ, సహాబాలలో తొలికాలానికి చెందినవారు గానీ, ఇతరులు గానీ – వారెవరయినా వారివల్ల తప్పు జరగటం సహజం, సంభవం కూడా. అయితే అల్లాహ్ పశ్చాత్తాపం (తౌబా) ద్వారా వారి పాపాలను క్షమిస్తాడు. వారి అంతస్తులను ఉన్నతం చేస్తాడు. అలాగే పాపాలను రూపుమాపే సత్కార్యాల ద్వారా లేదా ఇతరత్రా కారణాల దృష్ట్యా వారిని క్షమిస్తాడు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : 

ఎవరయితే సత్యధర్మాన్ని తీసుకువచ్చారో, మరెవరయితే దానిని సత్యమని ధ్రువీకరించారో అటువంటివారే భయభక్తులు గలవారు. వారికోసం వారి ప్రభువు దగ్గర వారు కోరినదల్లా ఉంది. సదాచార సంపన్నులకు లభించే ప్రతిఫలం ఇదే. అల్లాహ్ వారి దురాచరణలను వారి నుండి దూరం చేయటానికి, వారు చేసిన సదాచరణలకు గాను ఉత్తమ పుణ్యఫలం ఇవ్వటానికి (ఈ వ్యవస్థను నెలకొల్పుతాడు). (అజ్ జుమర్ : 33-35)

ఇంకా ఈ విధంగా సెలవీయబడింది : 

తుదకు అతను పూర్తి పరిపక్వతకు, అంటే నలభై ఏళ్ళ ప్రాయానికి చేరుకున్నప్పుడు ఇలా విన్నవించుకున్నాడు : “నా ప్రభూ! నీవు నా తల్లిదండ్రులపై కురిపించిన అనుగ్రహ భాగ్యాలకు గాను కృతజ్ఞతలు తెలుపుకునే, నీ ప్రసన్నతను చూరగొనే విధంగా సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. ఇంకా నా సంతానాన్ని కూడా సజ్జనులుగా తీర్చిదిద్దు. నేను నీ వైపునకే మరలుతున్నాను. నేను నీ విధేయులలో ఒకణ్ణి.” ఇలాంటి వారి సత్కార్యాలనే మేము స్వీకరిస్తాము. వారి తప్పులను క్షమిస్తాము. వారికి చేయబడిన సత్య వాగ్దానం ప్రకారం వారు స్వర్గవాసులలో ఉంటారు. (అల్ అహ్ ఖాఫ్ : 15,16) 

(మజ్మూల ఫతావా : 35/69)

ప్రవక్త సహచరుల మధ్య తలెత్తిన విభేదాలను, పోరాటాలను ఇస్లాం శత్రువులు తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ సహాబా వ్యక్తిత్వాలపై బురదజల్లేందుకు ప్రయత్నించారు. వారి గౌరవ మర్యాదలను మంట గలిపేందుకు అవకాశంగా తీసుకున్నారు. అదే రకమయిన నీచ స్వభావంతో ఈనాటి కొందరు రచయితలు, సోకాల్డ్ మేధావులు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. వీరు అనాలోచితంగా సహాబాపై విమర్శలు గుప్పిస్తుంటారు. ఆ విధంగా వారు తమను తాము సహాబా వైఖరిపై తీర్పు చెప్పే న్యాయమూర్తులుగా ఊహించుకుంటున్నారు. తగు ఆధారాలు, నిదర్శనాలు లేకుండానే – కేవలం తమ మనోవాంఛలకు లోబడి – స్వార్థపరుల, కపట విమర్శకుల వ్యాఖ్యలను ఉదాహరిస్తూ కొంతమంది సహాబీలను సత్యవాదులుగా, మరికొంతమంది సహాబీలను దోషులుగా నిర్ధారిస్తున్నారు. అంతేకాదు, ఇస్లామీయ సంస్కృతీ నాగరికతల పట్ల తగు అవగాహన లేని కొంతమంది ముస్లిం యువకులలో – ఇస్లాం యొక్క గొప్ప చరిత్రపట్ల, తొలికాలపు మహనీయుల పట్ల లేనిపోని దురనుమానాలను నూరిపోస్తున్నారు. ఆ విధంగా వారిలో ఇస్లాం పట్ల ఏవగింపును కలిగించి, ముస్లిం సముదాయంలో చీలికను తీసుకురావాలని, తొలికాలపు సజ్జనుల పట్ల చివరి కాలపు ప్రజలలో ద్వేషాన్ని, వైషమ్యాన్ని రగుల్గొల్పాలని చూస్తున్నారు. దీనికి బదులు వారు తొలికాలపు సత్పురుషుల అడుగుజాడలలో నడచి, వారి కొరకు దుఆ చేసినట్లయితే ఎంత బాగుండేది! అలాంటి సద్భావన కలిగి ఉండే వారిని అల్లాహ్ సయితం శ్లాఘిస్తాడు. ఉదాహరణకు – 

వారి తరువాత వచ్చిన వారు (తమ పూర్వీకులను గురించి) ఇలా వేడుకుంటారు : “మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదుస్వభావం కలిగినవాడవు. కనికరించేవాడవు.” (అల్ హష్ర్ : 10) 


నుండి: అల్లాహ్ ఏకత్వం (అఖీదా ఏ తౌహీద్) పుస్తకం
Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

సహాబాలను తూలనాడటం, ముస్లిం సమాజంలోని మార్గదర్శకులను దూషించటం పట్ల వారింపు – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

అల్లాహ్ ఏకత్వం (అఖీదా ఏ తౌహీద్) పుస్తకం
Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

ఆరవ ప్రకరణం: మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరుల(రదియల్లాహు అన్హుమ్)ను, మార్గదర్శక నాయకులను తూలనాడరాదు 

(1) సహాబాలను (రదియల్లాహు అన్హుమ్) తూలనాడటం పట్ల వారింపు: 

అహ్లే సున్నత్ వల్ జమాఅత్ సంవిధానంలో ఉన్న నిబంధనలలో ఒకటేమిటంటే మహాప్రవక్త ప్రియ సహచరుల (రదియల్లాహు అన్హుమ్) విషయంలో వారి ఆంతర్యాలు నిర్మలంగా ఉండాలి. వారి గురించి నోరు జారకూడదు. అల్లాహ్ తన గ్రంథంలో తెలియజేసినట్లుగా ఉండాలి వారి వైఖరి. 

وَٱلَّذِينَ جَآءُو مِنۢ بَعْدِهِمْ يَقُولُونَ رَبَّنَا ٱغْفِرْ لَنَا وَلِإِخْوَٰنِنَا ٱلَّذِينَ سَبَقُونَا بِٱلْإِيمَـٰنِ وَلَا تَجْعَلْ فِى قُلُوبِنَا غِلًّۭا لِّلَّذِينَ ءَامَنُوا۟ رَبَّنَآ إِنَّكَ رَءُوفٌۭ رَّحِيمٌ

వారి తరువాత వచ్చిన వారు (వారి గురించి) ఇలా వేడుకుంటారు: “మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చ యంగా నీవు మృదు స్వభావం కలవాడవు. కనికరించేవాడవు.” (అల్ హష్ర్ 59 : 10) 

ఇంకా వారు – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేసిన ఈ హితవును ఖచ్చితంగా పాటిస్తారు – 

“నా సహచరులను దూషించకండి. ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆ శక్తిమంతుని సాక్షిగా! మీలో ఏ వ్యక్తి అయినా ఉహుద్ పర్వతానికి సమానంగా బంగారం ఖర్చుచేసినా, వారిలో (అంటే నా ప్రత్యక్ష సహచరులలో)ని వారు దానం చేసిన ఒక ‘ముద్’కు, ఆఖరికి ‘ముద్’లో సగభాగానికి కూడా సమానం కాజాలదు.” (బుఖారీ, ముస్లిం) 

అహ్లే సున్నత్ వల్ జమాఅత్ వారు సహాబాలను దూషించే రాఫిధీల (షియా వారి)తో, ఖవారిజ్ వర్గీయులతో తెగతెంపులు చేసుకుంటారు. వారితో ఎలాంటి స్నేహం, సుహృద్భావం కలిగి ఉండరు. తరచూ సహాబాలను కాఫిర్లు (అవిశ్వాసులు)గా ఖరారు చేసే వీరి ధోరణిని ఖండిస్తారు. వీరిలోని ఏ మంచితనాన్ని అంగీకరించరు. 

ప్రవక్త సహచరుల ఔన్నత్యం గురించి ఖుర్ఆన్ హదీసులలో చెప్పబడిన దానిని అహ్లే సున్నత్ వల్ జమాఅత్ వారు శిరసావహిస్తారు. సహాబా ముస్లిం ఉమ్మత్ లో కెల్లా అత్యుత్తములని విశ్వసిస్తారు. ఉదాహరణకు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పినట్లుగా – 

”మీ అందరిలోకెల్లా ఉత్తములు నా కాలానికి చెందినవారు.” (బుఖారీ, ముస్లిం) 

తన ఉమ్మత్ (అనుచర సమాజం) 73 వర్గాలుగా చీలిపోతుందని, వారిలో ఒకే ఒక వర్గం తప్ప మిగిలిన వారంతా నరకానికి పోతారని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పినపుడు, ఆ ఒక్క వర్గం ఏదంటూ ప్రియ సహచరులు (రదియల్లాహు అన్హుమ్) అడిగారు. సమాధానంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఇలా అన్నారు : 

“ఈ రోజు నేను, నా సహచరులు ఏ పద్ధతిపై ఉన్నామో ఆ పద్ధతిపై స్థిరంగా ఉండేవారు.”
(ముస్నదె అహ్మద్, తిర్మిజి 2641 హసన్) 

ఇమామ్ ముస్లిం గురువుల్లో ప్రముఖులైన ఇమామ్ అబూజర్అ ఇలా అంటున్నారు:

“ఏ వ్యక్తి అయినా మహాప్రవక్త ప్రియసహచరులలో ఎవరినయినా తూలనాడుతున్నట్లు మీరు గమనిస్తే అతణ్ణి ధర్మవిహీనునిగా పరిగణించండి. ఎందుకంటే ఖుర్ఆన్ సత్యం. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సత్యం. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెచ్చిన షరీయత్ సత్యబద్దం. కాగా; వీటన్నింటినీ మన వరకూ చేర్చినవారు సహాబీలే (ప్రియ సహచరులే). కాబట్టి వారిని తూలనాడినవాడు ఖుర్ఆన్ హదీసులనే అసత్యంగా ఖరారు చేయదలుస్తున్నాడని అనుకోవాలి. కనుక అలాంటి వ్యక్తి స్వయంగా నిందార్హుడు. అతనిపై ధర్మవిహీనుడు, మార్గవిహీనుడన్న అభియోగం మోపటం చాలా వరకు సమంజసం, సత్యం.” 

అల్లామా ఇబ్నె హమదాన్ తన గ్రంథం ‘నిహాయతున్ ముబ్ త దీన్’లో ఇలా అంటున్నారు :

“ఎవరయితే ప్రవక్త సహచరులను దూషించటం ధర్మసమ్మతం అని భావిస్తూ మరీ దూషిస్తున్నాడో అతను ఖచ్చితంగా కాఫిర్ (అవిశ్వాసి). మరెవరయితే ధర్మసమ్మతం కాదని భావిస్తూ కూడా దూషిస్తాడో అతడు పాపాత్ముడు (ఫాసిఖ్ ).”

ఆయన గారి మరో పలుకు ఇలా ఉంది :

“ఎవరయితే ప్రవక్త ప్రియ సహచరులను దూషిస్తాడో, అతను నిశ్చయంగా కాఫిరే (దాన్ని అతను ధర్మసమ్మతమని భావించినా, భావించక పోయినా). అదేవిధంగా – ఎవరయితే ప్రవక్త సహచరుల (రదియల్లాహు అన్హుమ్)ను అవిధేయులుగా ఖరారు చేస్తాడో లేదా వారి ధర్మావలంబనలో లోపం ఎత్తిచూపిస్తాడో లేదా వారిని కాఫిర్లుగా ఖరారు చేస్తాడో, అతను ముమ్మాటికీ కాఫిర్ (అవిశ్వాసి). (షరహ్ అఖీదతుస్సిఫారీని – 2/388, 389) 

(2) ముస్లిం సమాజంలోని మార్గదర్శకులను దూషించటం పట్ల వారింపు : 

మహిమోన్నతల దృష్ట్యాగానీ, స్థాయి రీత్యాగానీ సహాబా తర్వాత స్థానం, ఉమ్మత్ కు చెందిన మార్గదర్శక నాయకులది. వారే తాబయీన్, తబయె తాబయీన్, ఆ తర్వాత తరానికి చెందిన ఉలమా. వారంతా సహాబాను శాయశక్తులా అనుసరించారు. అల్లాహ్ సెలవిచ్చినట్లుగా ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజవేసిన వారితోనూ, తరువాత చిత్తశుద్దితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతుష్టులయ్యారు. (అత్ తౌబా : 100) 

కనుక వారిని దూషించటం, వారిలోని లోపాలను ఎత్తి చూపటం, వారిపై విమర్శనాస్త్రాలు సంధించటం ఎంతమాత్రం సమ్మతం కాదు. ఎందుకంటే వారంతా మార్గదర్శకులు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : 

ఎవరయినా సన్మార్గం ప్రస్ఫుటం అయిన మీదట కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు వ్యతిరేకంగా పోతే, విశ్వాసులందరి మార్గాన్ని వీడి, ఇతర మార్గాన్ని అనుసరిస్తే, మేమతన్ని అతను మరలదలచుకున్న వైపునకే మరల్చుతాము. కడకు అతన్ని నరకంలో పడవేస్తాము. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. (అన్ నిసా : 115) 

‘కితాబుత్తహావియ’ వ్యాఖ్యాత (ఇమామ్ ఇబ్నె అబీ అజల్ హనఫీ) ఇలా అన్నారు: 

“అల్లాహ్ తో, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో స్నేహపూర్వక సంబంధాల తర్వాత తోటి విశ్వాసులతో కూడా స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవటం ప్రతి ముస్లింకూ తప్పనిసరి. ఈ విషయంలో ఖుర్ఆన్ సర్వ సాధారణమయిన ఆజ్ఞ ఉండనే ఉంది. అయితే మరీ ముఖ్యంగా ప్రవక్తల వారసులతో మనకు స్నేహబంధం ఉండాలి. అల్లాహ్ వారిని ధ్రువతారల మాదిరిగా చేశాడు. నేలలోని, సముద్రాలలోని చీకట్లలో వాటి ద్వారా మార్గం కనుగొనబడుతుంది. వారి మార్గదర్శకత్వంపై, వారి ధర్మావగాహనపై ముస్లింలందరికీ గురి ఉంది.” 

ఎందుకంటే వీరు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనుచర సమాజంలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) శిష్యుల, వారు వదలివెళ్ళిన మృత సంప్రదాయాలను పునరుజ్జీవింప జేసేవారు. వారి మూలంగానే దైవగ్రంథం నెలకొని ఉంది. దాని ఊపిరి మూలంగా వారు కూడా నిలబడి ఉన్నారు. వారి గురించి దైవగ్రంథంలో స్పష్టమయిన వివరణ వచ్చింది. వారు కూడా దానికి ప్రతినిధుల వంటి వారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను అనుసరించటం అనివార్యం (వాజిబ్) అన్న విషయంలో వారందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. కాని ఒకవేళ వారిలో ఎవరి ఉవాచ అయినా ప్రామాణిక హదీసుకు వ్యతిరేకంగా మన ముందుకువస్తే, ఆ హదీసును పరిత్యజించటంలో ఆయన వద్ద తప్పకుండా ఏదో కారణం ఉండి ఉంటుంది అని మనం భావించాలి. 

సాధారణంగా ఆ కారణం మూడు విధాలుగా ఉంటుంది. 

  1. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనం అయి ఉండవచ్చన్న విషయంపై అతనికి నమ్మకం కుదరక పోవచ్చు. 
  2. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ ప్రవచనం ద్వారా చెప్పదలచిన విషయంపై ఇదమిత్థంగా ఒక నిర్ధారణకు రాకపోయి ఉండవచ్చు. 
  3. అది రద్దు అయిపోయిన ఆజ్ఞ కావచ్చు అన్నది అతని నమ్మకం అయి ఉండవచ్చు. 

మొత్తానికి మనందరి మీద వారికి ఆధిక్యత ఉంది. మనకు వారు ఉపకారం చేసినవారు. వారు మనకన్నా ముందే విశ్వసించినవారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అందజేసిన ధర్మాన్ని వారు మన వరకూ చేర్చారు. మనకు అర్థం కాకుండా నిగూఢంగా ఉండిపోయే ఎన్నో విషయాలను వారు మనకు విడమరచి చెప్పారు. అల్లాహ్ వారితో ప్రసన్నుడవుగాక! వారిని సంతుష్టపరచుగాక! 

رَبَّنَا ٱغْفِرْ لَنَا وَلِإِخْوَٰنِنَا ٱلَّذِينَ سَبَقُونَا بِٱلْإِيمَـٰنِ وَلَا تَجْعَلْ فِى قُلُوبِنَا غِلًّۭا لِّلَّذِينَ ءَامَنُوا۟ رَبَّنَآ إِنَّكَ رَءُوفٌۭ رَّحِيمٌ

“మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చ యంగా నీవు మృదు స్వభావం కలవాడవు. కనికరించేవాడవు.” (అల్ హష్ర్ 59 : 10) 

కొంతమంది విద్వాంసుల (ఉలమా)చే ధర్మసూత్రాల అన్వయింపు (ఇత్తెహాదీ) ప్రక్రియలో దొర్లిన తప్పుల మూలంగా వారి స్థాయిని దిగజార్చే ప్రయత్నం చేయటం బిదతీల విధానం. ఇలాంటి వాటి కోసం ఇస్లాం విరోధులు కాచుకుని ఉంటారు. తద్వారా ఇస్లాం గురించి లేనిపోని సందేహాలు సృష్టించటానికి, ముస్లిముల మధ్య వైరభావం పుట్టించటానికి శాయశక్తులా యత్నిస్తారు. భావి తరాలవారు తమ పూర్వీకుల (సలఫ్) పట్ల విముఖతను, విసుగును వ్యక్తం చేసేలా కుట్ర పన్నుతారు. విద్వాంసులకు – నవ యువకులకు మధ్య విభేదాలను సృష్టిస్తారు. వారి మధ్య పూడుకోని అంతరాల అగాధాలను కల్పిస్తారు. నేడు సర్వత్రా జరిగేది కూడా ఇదే. కాబట్టి విద్యార్థి దశలో ఉన్న నవయువకులు ఈ స్వార్థపరుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వారు ధర్మవేత్తల (ఫుకహా) యొక్క, ఇస్లామీయ ధర్మశాస్త్రం (ఫికప్) యొక్క స్థాయిని దిగజారుస్తారు. 

దానిని చదవటం, చదివించటం పట్ల, దానిలో ఉన్న శ్రేయోదాయకమయిన విషయాలను, సత్యాన్ని సంగ్రహించటం పట్ల తమ అనాసక్తతను, విసుగును ప్రదర్శిస్తూ ఉంటారు. మొత్తానికి వారు తమ ఫికహ్ (ధర్మశాస్త్రం)ను గర్వకారణంగా భావించాలి. తమ విద్వాంసులను గౌరవించాలి. మార్గవిహీనుల, స్వార్థపరుల దుష్ప్రచార జాలంలో మాత్రం చిక్కుకోరాదు. 


నుండి: అల్లాహ్ ఏకత్వం (అఖీదా ఏ తౌహీద్) పుస్తకం
Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్

తౌహీద్ మరియు “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భాష్యము – ఏకత్వపు బాటకు సత్యమైన మాట – ఇమామ్ అస్-సాదీ

6 వ అధ్యాయం
తౌహీద్ మరియు “లాఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భాష్యము
అల్ ఖౌలుస్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Imam Muhammad ibn Abdul Wahhab.


అల్లాహ్ ఆదేశం:

أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ يَدْعُونَ يَبْتَغُونَ إِلَىٰ رَبِّهِمُ ٱلْوَسِيلَةَ أَيُّهُمْ أَقْرَبُ وَيَرْجُونَ رَحْمَتَهُۥ وَيَخَافُونَ عَذَابَهُۥٓ

ఈ ప్రజలు మొర పెట్టుకుంటున్న వారే స్వయంగా తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు.”
(బనీ ఇస్రాయీల్ 17 : 57). 

وَإِذْ قَالَ إِبْرَٰهِيمُ لِأَبِيهِ وَقَوْمِهِۦٓ إِنَّنِى بَرَآءٌۭ مِّمَّا تَعْبُدُونَ

“ఇబ్రాహీం తన తండ్రి మరియు తన జాతి వారికీ ఇలా చెప్పిన ఆ సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. “మీరు పూజిస్తున్న వాటితో నాకు ఏ సంబంధమూ లేదు. నా సంబంధం కేవలం నన్ను సృష్టించినవానితోనే ఉన్నది… (జుక్రుఫ్ 43: 26).

ٱتَّخَذُوٓا۟ أَحْبَارَهُمْ وَرُهْبَـٰنَهُمْ أَرْبَابًۭا مِّن دُونِ ٱللَّهِ وَٱلْمَسِيحَ ٱبْنَ مَرْيَمَ وَمَآ أُمِرُوٓا۟ إِلَّا لِيَعْبُدُوٓا۟ إِلَـٰهًۭا وَٰحِدًۭا ۖ لَّآ إِلَـٰهَ إِلَّا هُوَ ۚ سُبْحَـٰنَهُۥ عَمَّا يُشْرِكُونَ

“వారు అల్లాహ్ ను కాదని తమ పండితులను, తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు…” (తౌబా 9: 31).

وَمِنَ ٱلنَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ ٱللَّهِ أَندَادًۭا يُحِبُّونَهُمْ كَحُبِّ ٱللَّهِ ۖ ۗ

“కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి వుండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు…” (బఖర 2:165)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారు:

‘ఎవడు “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్య దైవం మరొక్కడు లేడు) అని, అల్లాహ్ తప్ప ఆరాధింపబడే ఇతరుల్ని తిరస్కరిస్తాడో అతని ధనప్రాణం సురక్షితంగా ఉండును. అతని లెక్క (ఉద్దేశం) అల్లాహ్ చూసుకుంటాడు’. (ముస్లిం).

తరువాత వచ్చే పాఠాల్లో ఇదే వివరణ ఉంది. 

ముఖ్యాంశాలు: 

1. ఇందులో ముఖ్య విశేషం : తౌహీద్ (ఏక దైవ విశ్వాసం) మరియు షహాదత్ (లాఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం) యొక్క వ్యాఖ్యానం ఉంది. దాన్ని అనేక ఆయతుల ద్వారా స్పష్టం చేయడం జరిగింది 

2. బనీ ఇస్రాయీల్ లోని వాక్యం (17:57) – మహాపురుషులతో మొరపెట్టుకునే ముష్రికుల ఆ కార్యాన్ని రద్దు చేస్తూ, ఇదే షిర్క్ అక్బర్ (పెద్ద షిర్క్) అని చెప్పబడింది. 

3. సూరె తౌబాలోని వాక్యం. “యూదులు, క్రైస్తవులు అల్లాహ్ ను గాక తమ పండితులను, సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారని అల్లాహ్ తెలిపాడు”. ఇంకా “కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించవలసిన ఆజ్ఞ వారికి ఇవ్వడం జరిగింద”నీ తెలిపాడు. అయితే వారు తమ పండితుల, సన్యాసులతో మొరపెట్టుకోలేదు. వారి పూజా చేయలేదు. కాని పాపకార్యాల్లో వారి విధేయత పాటించారు. 

4. “మీరు ఆరాధిస్తున్న వాటితో నాకు ఏ సంబంధమూ లేదు. నా సంబంధం కేవలం నన్ను సృష్టించినవానితోనే ఉన్నది? అన్న అవిశ్వాసులకు ఇబ్రాహీం మాట. తమసత్య ప్రభువును ఇతర మిథ్య ఆరాధ్యులతో స్పష్టమైన పద్దతిలో వేరు జేరు. 

ఇలా అవిశ్వాసులతో అసహ్యత, విసుగు మరియు అల్లాహ్ తో ప్రేమయే “లాఇలాహ ఇల్లల్లాహ్” యొక్క పరమార్థము అని అల్లాహ్ తెలిపాడు. అందుకే ఆ వాక్యం తరువాతనే ఈ వాక్యం ఉంది. 

ఇబ్రాహీం ఈ వచనాన్నే తన తరువాత తన సంతానం కోసం విడిచి వెళ్ళాడు, బహుశా వారు దాని వైపునకు మరలుతారని. (జుఖ్ రుఫ్ 43: 28). 

5. మరొకటి బఖరలోని వాక్యం. అందులో ప్రస్తాంవించబడిన అవిశ్వాసుల గురించి, “వారు నరకము నుండి బయటికి వెళ్ళేవారు కారు” అని అల్లాహ్ తెలిపాడు. వారు నియమించుకున్న వారిని అల్లాహ్ ను ప్రేమించవలసినట్లు ప్రేమిస్తారు. వారు అల్లాహ్ ను కూడా ప్రేమించువారు అని దీనితో తెలుస్తుంది. కాని వారి ఈ ప్రేమ వారిని ఇస్లాంలో ప్రవేశింపజేయలేకపోయింది. ఇది వీరి విషయం అయితే, ఎవరయితే తమ నియమించుకున్న వారిని అల్లాహ్ కంటే ఎక్కువ, లేక కేవలం వారినే ప్రేమించి, అల్లాహ్ ను ఏ మాత్రం ప్రేమించరో, వారి సంగతి ఎలా ఉంటుంది….? ఆలోచించండి! 

6. “ఎవరు “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యదైవం మరొక్కడు లేడు) చదివి, అల్లాహ్ తప్ప పూజింపబడే ఇతరుల్ని తిరస్కరిస్తాడో అతని ధనప్రాణాలు సురక్షితంగా ఉండును. అతని వ్యవహారం అల్లాహ్ చూసుకుంటాడు” అన్న ప్రవక్త ప్రవచనం “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావాన్ని తెలిపే దానిలో ముఖ్యమైనది. కేవలం నోటి పలుకుల ద్వారానే అతని ధన ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని చెప్పలేదు. ఆ పదాలు, దాని భావం తెలుసుకున్నవాని గురించే ఆ ఘనత లేదు. లేక దాన్ని కేవలం ఒప్పుకున్న వానికే రక్షణ లేదు. లేక అతడు కేవలం అల్లాహ్ తోనే మొరపెట్టుకుంటున్నందుకని కాదు. అతడు దాన్ని పలుకడంతో పాటు మిథ్యా దైవాలను తిరస్క.రించనంతవరకు అతని ధనప్రాణాలకు రక్షణ లేదు. ఇంకా అతడు అందులో సందేహపడితే, ఆలస్యం చేస్తే కూడా రక్షణ లేదు. ఈ విషయం ఎంతో ముఖ్యమైనది, గొప్పదైనది!. ఎంతో స్పష్టంగా తెలుపబడింది! వ్యెతిరేకులకు విరుద్ధంగా ఎంతో ప్రమాణికమైన నిదర్శన ఉంది.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

వాస్తవానికి తౌహీద్ యొక్క భావం ఏమనగా: “అల్లాహ్ అద్వితీయుడని అతని గుణాలతో తెలుసుకొని, నమ్ముట. కేవలం అయన్ని మాత్రమే ఆరాధించుట.” 

ఇది రెండు రకాలు: 

ఒకటి: అల్లాహ్ యేతరుల ఉలూహియత్ (ఆరాధన)ను తిరస్కరించుట. అది ఎలా అనగా; సృష్టిలోని ప్రవక్త, దైవదూత, ఇంకెవరయినా ఆరాధనకు అర్హులు కారని, వారికి ఏ కొంత భాగం కూడా అందులో లేదని తెలుసుకొని విశ్వసించుట. 

రెండవది: ఉలూహియత్ కు అర్హుడు అల్లాహ్ మాత్రమేనని, ఆయనకి సాటి మరొకడు లేడని విశ్వసించుట. కేవలం ఇంతే సరిపోదు. ధర్మాన్ని కేవలం అల్లాహ్ కే అంకితం చేసి, ఇస్లాం, ఈమాన్, ఇహాసాన్ ను పూర్తి చేసి, అల్లాహ్ హక్కులతో పాటు అల్లాహ్ దాసుల హక్కులను అల్లాహ్ సంతృప్తి, దాని ప్రతిఫలం పొందడానికే పూర్తి చేయుట. 

దాని సంపూర్ణ భావంలో మరొకటి: అల్లాహ్ యేతరుల ఆరాధన నుండి అసహ్యత, విసుగు చెందుట. అల్లాహ్ ను గాక ఇతరులను అల్లాహ్ కు సమానులుగా నిలబెట్టి, అల్లాహ్ ను ప్రేమించినట్లు వారిని ప్రేమించుట, అల్లాహ్ కు విధేయత చూపినట్లు వారికి విధేయత చూపుట “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావానికి విరుద్ధమైనది


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

యూట్యూబ్ ప్లే లిస్ట్ (ఏకత్వపు బాటకు సత్యమైన మాట)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0VrU7pg90uGfghChg9Bptl

నిశ్చయంగా ధర్మం సులువైనది, దాని అనుసరణలో కాఠిన్య వైఖరి పాటించవద్దు | విశ్వాస పాఠాలు | 10వ హదీస్ [వీడియో]

బిస్మిల్లాహ్

మొదటి భాగం

[10 నిముషాలు]

రెండవ భాగం

[20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

عَنْ أَبِي هُرَيْرَةَ عَنْ النَّبِيِّ قَالَ: (إِنَّ الدِّينَ يُسْرٌ وَلَنْ يُشَادَّ الدِّينَ أَحَدٌ إِلَّا غَلَبَهُ فَسَدِّدُوا وَقَارِبُوا وَأَبْشِرُوا وَاسْتَعِينُوا بِالْغَدْوَةِ وَالرَّوْحَةِ وَشَيْءٍ مِنْ الدُّلْجَةِ).

10 ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని, అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

“నిశ్చయంగా ధర్మం సులువైనది. ఏ వ్యక్తి అయినా ధర్మం అనుసరణలో కాఠిన్య వైఖరి అవలంబిస్తే ధర్మమే అతనిపై ఆధిక్యత  సాధిస్తుంది. (హెచ్చుతగ్గులు లేకుండా) సంపూర్ణ విధానాన్ని అవలంభించండి. లేదా దాని (సంపూర్ణతకు) సమీపాన చేరండి. (మీకు లభించే ప్రతిఫలంతో) సంబర పడండి. ఉదయసాయంకాల, మరి కొంత రాత్రి సమయాల్లో (ఆరాధన చేయటం) ద్వారా సహాయాన్ని అర్థించండి”. (బుఖారి 39).

ఈ హదీసులో:

దీర్ఘ కాలం వరకు అల్లాహ్ ఆరాధన చేస్తూ ఉండడానికి మనిషి చురుకుగా ఉండే సమయాల సహాయం తీసుకోవాలి. అంటే ఆ సమయాల్లో ఆరాధనలు పాటించాలి. ఎల్లప్పుడూ చేస్తూ ఉండే అల్పమైన ఆచరణలు, కొంత కాలం చేసి వదిలేసే అధిక ఆచరణల కంటే మేలైనవి. ఇస్లాం ధర్మం ప్రత్యేకతల్లో ఒకటి ఏమిటంటే అది చాలా సులభమైన ధర్మం. దాని ఆదేశాలు, నివారణలు మనిషి పాటించగలిగినవే. (అంటే మనిషి శక్తికి మించినవి కావు). శక్తికి మించిన శ్రమ భారాన్ని, ప్రవక్త సాంప్రదాయానికి భిన్నంగా అదనపు ఆరాధనల పాటింపును నెత్తిన వేసుకోవడం నివారించబడినది. ఎలాంటి హెచ్చుతగ్గింపులు లేకుండా మధ్యేమార్గాన్ని అవలంభించాలన్న తాకీదు ఉంది. అదే రుజుమార్గం. మనిషి తన ఆరాధనలో పరిపూర్ణతకు చేరుకోలేక పోయినా దాని సమీపానికి చేరుకునే ప్రయత్నం చేయాలి. ఉదయం చేసే ఆరాధన, సత్కార్యాల ఘనత తెలిసింది. ఆ సమయం సత్కార్యాల అంగీకార రీత్యా, మరియు వాటిని పాటించుట కూడా చాలా అనుకూలమైనది. రాత్రి పూట కొంత సమయం తహజ్జుద్ లో గడిపే ఘనత కూడా తెలిసింది. అది అల్లాహ్ దయతో సదుద్దేశాలు సంపూర్ణమగుటకు ఆయన సహాయం లభించును. అస్ర్ అయిన వెంటనే మరియు మగ్రిబ్ కు ముందు ఖుర్ఆన్ పారాయణం, అల్లాహ్ స్మరణ (జిక్ర్)లో ఉండుట అభిలషణీయం. మధ్యేమార్గంలో ఉండి, అల్లాహ్ ప్రసన్నత పొందే సత్కార్యాలు చేస్తూ, ప్రవక్త సంప్రదాయాన్ని ఖచ్చితంగా అనుసరిస్తున్న విశ్వాసునికి మంచి శుభవార్తలు ఇవ్వబడ్డాయి.


విశ్వాస పాఠాలు [పుస్తకం] & వీడియో పాఠాలు:
https://teluguislam.net/2019/11/14/aqeeda-lessons/

విశ్వాస పాఠాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3zyecdeAcRg4nd8ZRnA2Uw

అన్ని ధర్మాల్లో అల్లాహ్ కు అతి ప్రియమైన ధర్మం | విశ్వాస పాఠాలు | 9వ హదీస్ [వీడియో]

బిస్మిల్లాహ్

[20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قِيلَ لِرَسُولِ اللهِ : أَيُّ الْأَدْيَانِ أَحَبُّ إِلَى اللهِ قَالَ: (الْحَنِيفِيَّةُ السَّمْحَةُ).

9- ఇబ్ను అబ్బాస్ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ప్రకారం, ధర్మాల్లో ఏ ధర్మం అల్లాహ్ కు చాలా ప్రియమైనదని ప్రవక్త వద్దకు వచ్చిన ప్రశ్నకు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం

అతిసులభమైన, షిర్క్ కు దూరమైన ఇస్లాం ధర్మం (హనీఫియ్య) ” అని సమాధానమిచ్చారు.

(అహ్మద్ 1/236. హాఫిజ్ ఇబ్ను హజర్ రహిమహుల్లాహ్ ఫత్హుల్ బారి (హ. 38 తర్వాత) లో ఈ హదీసును “హసన్” అని చెప్పారు).

ఈ హదీసులో:

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పంపబడిన ఇస్లాం ధర్మం, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కు ఇవ్వబడిన సవ్యమైన ధర్మమే. అది చాలా సులభమైనది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మెత్తగా ప్రవర్తించుటకు, వారిపై మోపబడిన భారాన్ని తగ్గించుటకు, వారి శృంఖలాలను తెంచుటకు పంపబడ్డారు. అల్లాహ్ ప్రేమిస్తాడని తెలిసింది. కాని అది ఆయనకు తగిన రీతిలో అని నమ్మాలి. సృష్టిరాసుల పరస్పర ప్రేమతో పోల్చరాదు.

ఘనత పరంగా ధర్మాల్లో వ్యత్యాసం గలదు. ఇబ్రాహీం అలైహిస్సలాం కు అతి చేరువుగా ఉన్నవారు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మెత్తగా ప్రవర్తించుట, శుభవార్త వినిపిస్తూ మెలగుట మంచిదని, కష్టం కలిగించకుండా, విరక్తి కలిగించకుండా ఉండాలని చెప్పబడింది. ఈ విషయంలో ఈ హదీసు చాలా స్పష్టంగా ఉందిః

“మెత్తగా మెలగండి, కఠినంగా మెలగకండి. సంతృప్తి కలిగించండి. విరక్తి కలిగించకండి”.
(బుఖారి 69, ముస్లిం 1732)


విశ్వాస పాఠాలు [పుస్తకం] & వీడియో పాఠాలు:
https://teluguislam.net/2019/11/14/aqeeda-lessons/

విశ్వాస పాఠాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3zyecdeAcRg4nd8ZRnA2Uw

విశ్వాస పాఠాలు -5: ఇస్లాం స్వీకరణ గత పాపాల విమోచనానికి మంచి సబబు [వీడియో]

బిస్మిల్లాహ్

[30 నిముషాలు]
విశ్వాస పాఠాలు – 5 – ఇస్లాం ఘనత -1 (హదీస్ #8) : ఇస్లాం స్వీకరణ గత పాపాల విమోచనానికి మంచి సబబు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఇస్లాం ఘనత -1 (హదీస్ #8)

ఇస్లాం స్వీకరణ గత పాపాల విమోచనానికి మంచి సబబు

عَنْ ابْنِ شِمَاسَةَ الْمَهْرِيِّ قَالَ حَضَرْنَا عَمْرَو بْنَ الْعَاصِ > وَهُوَ فِي سِيَاقَةِ الْمَوْتِ فَبَكَى طَوِيلًا وَحَوَّلَ وَجْهَهُ إِلَى الْجِدَارِ فَجَعَلَ ابْنُهُ يَقُولُ يَا أَبَتَاهُ أَمَا بَشَّرَكَ رَسُولُ الله  ﷺ  بِكَذَا أَمَا بَشَّرَكَ رَسُولُ الله ﷺ  بِكَذَا قَالَ فَأَقْبَلَ بِوَجْهِهِ فَقَالَ إِنَّ أَفْضَلَ مَا نُعِدُّ شَهَادَةُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ إِنِّي كُنْتُ عَلَى أَطْبَاقٍ ثَلَاثٍ لَقَدْ رَأَيْتُنِي وَمَا أَحَدٌ أَشَدَّ بُغْضًا لِرَسُولِ الله ﷺ مِنِّي وَلَا أَحَبَّ إِلَيَّ أَنْ أَكُونَ قَدْ اسْتَمْكَنْتُ مِنْهُ فَقَتَلْتُهُ فَلَوْ مُتُّ عَلَى تِلْكَ الْحَالِ لَكُنْتُ مِنْ أَهْلِ النَّارِ فَلَمَّا جَعَلَ اللهُ الْإِسْلَامَ فِي قَلْبِي أَتَيْتُ النَّبِيَّ ﷺ فَقُلْتُ ابْسُطْ يَمِينَكَ فَلْأُبَايِعْكَ فَبَسَطَ يَمِينَهُ قَالَ فَقَبَضْتُ يَدِي قَالَ: (مَا لَكَ يَا عَمْرُو؟) قَالَ: قُلْتُ أَرَدْتُ أَنْ أَشْتَرِطَ قَالَ: (تَشْتَرِطُ بِمَاذَا؟) قُلْتُ: أَنْ يُغْفَرَ لِي قَالَ: (أَمَا عَلِمْتَ أَنَّ الْإِسْلَامَ يَهْدِمُ مَا كَانَ قَبْلَهُ وَأَنَّ الْهِجْرَةَ تَهْدِمُ مَا كَانَ قَبْلهَا وَأَنَّ الْحَجَّ يَهْدِمُ مَا كَانَ قَبْلَهُ). وَمَا كَانَ أَحَدٌ أَحَبَّ إِلَيَّ مِنْ رَسُولِ الله ﷺ وَلَا أَجَلَّ فِي عَيْنِي مِنْهُ وَمَا كُنْتُ أُطِيقُ أَنْ أَمْلَأَ عَيْنَيَّ مِنْهُ إِجْلَالًا لَهُ وَلَوْ سُئِلْتُ أَنْ أَصِفَهُ مَا أَطَقْتُ لِأَنِّي لَمْ أَكُنْ أَمْلَأُ عَيْنَيَّ مِنْهُ وَلَوْ مُتُّ عَلَى تِلْكَ الْحَالِ لَرَجَوْتُ أَنْ أَكُونَ مِنْ أَهْلِ الْجَنَّةِ ثُمَّ وَلِينَا أَشْيَاءَ مَا أَدْرِي مَا حَالِي فِيهَا فَإِذَا أَنَا مُتُّ فَلَا تَصْحَبْنِي نَائِحَةٌ وَلَا نَارٌ فَإِذَا دَفَنْتُمُونِي فَشُنُّوا عَلَيَّ التُّرَابَ شَنًّا ثُمَّ أَقِيمُوا حَوْلَ قَبْرِي قَدْرَ مَا تُنْحَرُ جَزُورٌ وَيُقْسَمُ لَحْمُهَا حَتَّى أَسْتَأْنِسَ بِكُمْ وَأَنْظُرَ مَاذَا أُرَاجِعُ بِهِ رُسُلَ رَبِّي).

8-  ఇబ్ను షిమాస అల్ మహ్రీ ఉల్లేఖించారు: మేము అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు మరణ సమీపాన అతని వద్ద కూర్చొని ఉండగా, అతను చాలా సేపు ఏడ్చి తన ముఖాన్ని గోడ వైపు త్రిప్పుకున్నాడు. అప్పుడే అతని కుమారుడు నాన్నా! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఫలానా, ఫలానా శుభవార్తలు ఇవ్వలేదా? అని తృప్తినిచ్చారు. ఇది విని అతను తన ముఖాన్ని (మావైపు) త్రిప్పి ఇలా చెప్పారుః “లాఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్” సాక్ష్యాన్ని అన్నిటి కంటే అతిఉత్తమముగా భావించేవారము. విషయమేమిటంటే, నా జీవితంలో మూడు దశలు గడిచాయి. ప్రవక్తకంటే ఎక్కువ ద్వేషం మరెవ్వరితో లేని రోజులు గడిచాయి. అప్పట్లో నాకు మరీ ఇష్టమైన కార్యం ఏదైనా ఉంటే ఆయన్ను వశపరుచుకొని హతమార్చాలన్నదే. కాని ఒకవేళ నేను ఆ స్థితిలో చనిపోయి ఉంటే నరకవాసుల్లో చేరేవాడ్ని. కాని అల్లాహ్ కు దయ కలిగింది. అల్లాహ్ ఇస్లాం కొరకు నా హృదయాన్ని తెరిచాడు. నేను ప్రవక్త వద్దకు వచ్చి, ప్రవక్తా! మీ కుడి చేతిని చాపండి. నేను ఇస్లాం స్వీకరిస్తూ శపథం చేస్తాను అని అన్నాను. ప్రవక్త తమ చెయ్యి చాపారు. కాని నేను వెంటనే నా చేతిని వెనక్కి తీసుకున్నాను. “నీకేమయింది, అమ్ర్!” అని ప్రవక్త ఆశ్చర్యంతో అడిగారు. నేను ఒక షరతు పెట్టదలుచుకున్నాను అని చెప్పాను. “నీ షరతు ఏమిటి?” అని ప్రవక్త అడిగారు. నా పాపాలన్నీ మన్నింపబడాలని నేను చెప్పాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తృప్తి పరిచారుః “ఏమీటి, నీకు తెలియదా? ఇస్లాం (స్వీకరణ) గత పాపాలన్నిటిని తుడిచి పెడుతుంది. హిజ్రత్ (ధర్మ రక్షణకై వలసపోవుట) పూర్వ పాపాలన్నిటిని తుడిచి పెడుతుంది. మరియు హజ్ కూడా పూర్వ తప్పిదాలను తుడిచి పెడుతుంది”. (ఆ పిదప నేను ఇస్లాం స్వీకరించాను).

ఆ నాటి నుండి నాకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ప్రియమైనవారు, మరియు నా దృష్టిలో ఆయనకంటే గొప్పవారు మరెవ్వరూ లేరు. వారి ఔన్నత్యపు గాంభీర్యం వల్ల నేను వారిని నా కళ్ళారా చూడగలిగేవాణ్ణి కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రూపు రేఖల్ని వర్ణించమని ఎవరైనా నన్ను అడిగితే నేను వర్ణించలేను. ఎందుకనగ నేను ఎన్నడూ వారిని నా కళ్ళారా చూడనేలేదు. ఇదే స్థితిలో గనక నేను చనిపోతే నిశ్చయంగా స్వర్గవాసుల్లో ఒకడిని అని ఆశించేవాడిని.

ఆ తర్వాత నాపై (ప్రభుత్వపరంగా) ఎన్నో బాధ్యతలు మోపబడ్డాయి. వాటి గురించి (నేను ప్రశ్నింపబడినప్పుడు) నా పరిస్థితి ఏమవుతుందో తెలియదు?

నేను చనిపోయిన తర్వాత నా జనాజ వెంట రోదించే, కేకలు పెట్టే స్త్రీలుగాని, అగ్నిగాని రాకూడదు. నన్ను ఖననం చేస్తున్నప్పుడు నా సమాధిపై కొద్ది కొద్దిగా మట్టి పోయండి. ఒంటెను కోసి దాని మాంసం పంచిపెట్టినంత సేపు మీరు నా సమాధి వద్దనే నిలిచి ఉండండి. నేను ధైర్యం, తృప్తి పొందుతాను. నా ప్రభువు పంపే దూతలకు నేనేమి సమాధానం చెబుతానో చూస్తాను. (ముస్లిం 121).

ఈ హదీసులోః

ఇస్లాం స్వీకరణ గత పాపాల విమోచనానికి మంచి సబబు. ఎవరు ఇస్లాంపై స్థిరంగా ఉంటాడో అతను పూర్వ పాపాల గురించి పట్టుబడడు. అలాగే హిజ్రత్ మరియు హజ్ కూడా పూర్వ పాపాల మన్నింపులకు కారణమవుతాయి.

గమనికః ఇస్లాం స్వీకరణ వల్ల చిన్నవి, పెద్దవి అన్ని పాపాల ప్రక్షాళన జరుగు తుంది. కాని హిజ్రత్, మరియు హజ్ వల్ల చిన్నవి, పెద్దవి అన్ని పాపాల మన్నింపు విషయంలో భేదాభిప్రాయం ఉంది. ఎందుకనగా పెద్ద పాపాల మన్నింపుకై స్వచ్ఛమైన తౌబా తప్పనిసరి. సత్కార్యాలు కూడా పాపాల మన్నింపుకై కారణమవుతాయి. ఎంత పెద్ద సత్కార్యముండునో అంతే పాపాలు మన్నించబడుతాయి. (ఖనన సంస్కారాలు పూర్తైన తర్వాత సమాధి వద్ద కొంత సేపు ఉండి దైవదూతలు వచ్చి అడిగే ప్రశ్నలకు అతను సరియైన సమాధానం చెప్పగలగాలని అల్లాహ్ తో అతని కొరకు దుఆ చేయాలని ఇతర హదీసుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పి ఉన్నారు. ఉః అబూదావూద్, కితాబుల్ జనాయిజ్, బాబుల్ ఇస్తిగ్ఫారి ఇందల్ ఖబ్రి లిల్ మయ్యిత్… -అనువాదకుడు-).


విశ్వాస పాఠాలు [పుస్తకం] & వీడియో పాఠాలు:
https://teluguislam.net/2019/11/14/aqeeda-lessons/

విశ్వాస పాఠాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3zyecdeAcRg4nd8ZRnA2Uw