అల్లాహ్ కారుణ్య చాయలోకి ఆ ఏడుగురు! https://youtu.be/Fp0v2wzd9M0 [13 నిముషాలు] షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, ప్రళయ దినం యొక్క భయంకరమైన స్వభావం గురించి మరియు ఆ కఠినమైన రోజున అల్లాహ్ యొక్క కారుణ్య ఛాయలో (అర్ష్ నీడలో) ఆశ్రయం పొందే ఏడుగురు వ్యక్తుల గురించి వివరించబడింది. ఆ రోజు యొక్క తీవ్రత ఖుర్ఆన్ ఆయతుల ద్వారా వర్ణించబడింది. ఆ ఏడుగురు అదృష్టవంతులు: 1. న్యాయమైన పాలకుడు, 2. అల్లాహ్ ఆరాధనలో యవ్వనాన్ని గడిపిన యువకుడు, 3. హృదయం మస్జిద్లకు అంటిపెట్టుకుని ఉండే వ్యక్తి, 4. అల్లాహ్ కొరకు ఒకరినొకరు ప్రేమించుకుని, ఆయన కొరకే కలిసి, ఆయన కొరకే విడిపోయే ఇద్దరు వ్యక్తులు, 5. ఉన్నతమైన మరియు అందమైన స్త్రీ పాపానికి ఆహ్వానించినప్పుడు “నేను అల్లాహ్కు భయపడుతున్నాను” అని చెప్పే వ్యక్తి, 6. కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకుండా గోప్యంగా దానం చేసే వ్యక్తి, 7. ఏకాంతంలో అల్లాహ్ను స్మరించుకుని కన్నీరు కార్చే వ్యక్తి.
అభిమాన సోదరులారా! కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
ఈరోజు మనం ప్రళయ భీభత్సం, ఆ రోజున అల్లాహ్ కారుణ్య ఛాయలో ఉంచబడే ఆ ఏడుగురి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
ప్రళయ దిన భీభత్సం
ప్రియ వీక్షకుల్లారా! ప్రళయం అనేది ఒక భయంకరమైన విషయం. అది చాలా కఠినమైన రోజు. ఆ రోజు సర్వాధిపతి అయిన అల్లాహ్ సమక్షములో ప్రతి ఒక్కరూ హాజరు కావలసి ఉన్నది. ఆ విషయం గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ ముతఫ్ఫిఫీన్లో ఇలా తెలియజేశాడు,
لِيَوْمٍ عَظِيمٍ (లి యౌమిన్ అజీమ్) ఒక మహాదినాన… (83:5)
يَوْمَ يَقُومُ النَّاسُ لِرَبِّ الْعَالَمِينَ (యౌమ యఖూమున్నాసు లి రబ్బిల్ ఆలమీన్) ఆ రోజు జనులంతా సర్వలోకాల ప్రభువు ముందు నిలబడతారు. (83:6)
ప్రజలందరూ సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సమక్షంలో హాజరుపడతారు. ఆ ప్రళయం గురించి, ఆ రోజు ఏ విధంగా భయంకరమైనదిగా ఉంటుంది, ఎంత కఠినంగా ఉంటుంది, ప్రజలు వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది, శారీరక స్థితి ఎలా ఉంటుంది, ఎటువంటి భయాందోళనలకు గురిఅయి ఉంటారు అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రళయం యొక్క కఠినత గురించి సూరతుల్ హజ్లో తెలియజేశాడు.
يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمْ (యా అయ్యుహన్నాసుత్తఖూ రబ్బకుమ్) ఓ ప్రజలారా! మీ ప్రభువుకు భయపడండి. (22:1)
إِنَّ زَلْزَلَةَ السَّاعَةِ شَيْءٌ عَظِيمٌ (ఇన్న జల్ జలతస్సా’అతి షై ఉన్ అజీమ్) నిశ్చయంగా ప్రళయ సమయాన జరిగే ప్రకంపనం మహా (భీకర) విషయం.(22:1)
يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ (యౌమ తరౌనహా తద్ హలు కుల్లు ముర్ది’అతిన్ అమ్మా అర్ద’అత్) ఆనాడు మీరు దాన్ని చూస్తారు… పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. (22:2)
وَتَرَى النَّاسَ سُكَارَىٰ وَمَا هُم بِسُكَارَىٰ وَلَٰكِنَّ عَذَابَ اللَّهِ شَدِيدٌ (వ తరన్నాస సుకారా వమాహుమ్ బి సుకారా వలాకిన్న అదాబల్లాహి షదీద్) ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్ (తరఫున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది. (22:2)
ఈ ఆయత్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రళయం యొక్క భయంకరమైన ఆ స్థితిని తెలియపరిచాడు. అంటే, ఆ రోజు ఎటువంటి భయంకరమైన రోజు అంటే తల్లి తన బిడ్డను, పాలు తాగే బిడ్డను, పసికందును మరిచిపోతుంది అంటే ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుంది. అలాగే గర్భిణి యొక్క గర్భం పోతుంది అంటే ఆ భయం ఏ విధంగా ఉంటుంది. మానవులు మత్తులో ఉన్నట్లు కనిపిస్తారు అంటే వారు ఏమైనా మద్యం సేవించారా? లేదు. కానీ ఆ భయం వలన వారి స్థితి, వారి ముఖాలు, వారి శరీరం ఎలా ఉంటుంది అంటే వారు మత్తులో ఉన్నారు అనిపిస్తుంది కానీ, వాస్తవానికి వారు మత్తులో ఉండరు, అల్లాహ్ యొక్క శిక్ష చాలా కఠినమైనది.
అభిమాన సోదరులారా, అటువంటి ప్రళయం రోజు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ పర్వతాలను ఎగరేస్తాడు. గుట్టలు, వృక్షాలు, చెట్లు, భవనాలు, ఇళ్లు ఏవీ ఉండవు. మరి నీడ? నీడ ఉండదు. ఈరోజు మనం ఒక మంచి ఇంట్లో ఉంటూ, కరెంట్ ఉంటూ, కేవలం ఫ్యాన్ ఉంటే సరిపోవటం లేదు, ఏసీ కావాలి. కాకపోతే ఆ రోజు ఇల్లు లేదు. ఎటువంటి నీడా ఉండదు. అల్లాహ్ కారుణ్య నీడ తప్ప. అల్లాహ్ అర్ష్ నీడ తప్ప. ఏ నీడా ఉండదు. మరి ఆ నీడ, అల్లాహ్ యొక్క కారుణ్య ఛాయలో ఎవరు ఉంటారు? ఆ నీడ ఎవరికి దక్కుతుంది? అనే విషయం గురించి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీసులో సెలవిచ్చారు. అది బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది.
అల్లాహ్ నీడలో ఆశ్రయం పొందే ఏడుగురు
سَبْعَةٌ يُظِلُّهُمُ اللَّهُ فِي ظِلِّهِ يَوْمَ لا ظِلَّ إِلا ظِلُّهُ (సబ్’అతున్ యుదిల్లు హుముల్లాహు ఫీ దిల్లిహి యౌమ లా దిల్లా ఇల్లా దిల్లుహు) ఆ రోజున, ఆయన నీడ తప్ప మరే నీడ లేని రోజున ఏడు రకాల మనుషులకు అల్లాహ్ తన కారుణ్య ఛాయలో నీడను ప్రసాదిస్తాడు.
కేవలం ఏడు రకాల కోవకు చెందిన వారు మాత్రమే ప్రళయ దినాన, ఆ భయంకర రోజున, ఎటువంటి నీడ ఉండదు అల్లాహ్ నీడ తప్ప, ఆ అల్లాహ్ యొక్క నీడలో ఏడు రకాల మనుషులకు ఆ నీడ దక్కుతుంది. ఆ అదృష్టవంతులు ఎవరు? తెలుసుకుందాం.
న్యాయమైన పాలకుడు
إِمَامٌ عَادِلٌ (ఇమామున్ ఆదిలున్) న్యాయం చేసే నాయకుడు
న్యాయం చేసే పరిపాలకుడు, న్యాయం చేసే నాయకుడు. దేశానికి నాయకుడు కావచ్చు, రాజు కావచ్చు. అలాగే ప్రతి ఒక్కరూ తన తమ పరిధిలో ఇది వర్తిస్తుంది న్యాయం చేసేది. అమ్మ, తల్లి అనేది తన పరిధిలో, నాన్న అనేవాడు తన పరిధిలో, ప్రిన్సిపాల్ తన పరిధిలో, యాజమాన్యం తన పరిధిలో ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో ఈ దీనికి వర్తిస్తారు, న్యాయం చేసేవారు. న్యాయం చేసే వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు ప్రళయ దినాన తన కారుణ్య ఛాయలో ఉంచుతాడు. మొదటి వారు.
ఏ యువకుడైతే తన యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో గడిపాడో, అటువంటి యువకులకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు ప్రళయ దినాన తన కారుణ్య ఛాయలో ఉంచుతాడు. వృద్ధాప్యంలో మనిషికి కోరికలు ఎక్కువగా ఉండవు, ఎముకలు బలహీనమైపోతాయి, దాదాపు ఆ వయసులో ఎక్కువ కాంక్షలు ఉండవు కాబట్టి అది ఏదీ గొప్పతనం కాదు వృద్ధాప్యంలో ఎక్కువగా పుణ్యాలు చేయటము. మంచి విషయమే, అది గొప్ప విషయం కాదు యువకులతో పోల్చుకుంటే. అందుకు ప్రత్యేకంగా యువకుల గురించి అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, యవ్వనాన్ని అల్లాహ్ మార్గంలో, యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో గడపాలి. అటువంటి యువకులకు ప్రళయ దినాన అల్లాహ్ యొక్క కారుణ్య ఛాయ దక్కుతుంది.
హృదయం మస్జిద్లకు అంటిపెట్టుకుని ఉండే వ్యక్తి
وَرَجُلٌ قَلْبُهُ مُعَلَّقٌ فِي الْمَسَاجِدِ (వ రజులున్ ఖల్బుహు ము’అల్లఖున్ ఫిల్ మసాజిద్) మనసంతా మస్జిద్లోనే ఉండే వ్యక్తి.
మనసంతా మస్జిద్లోనే ఉండే వ్యక్తి అంటే దానికి అర్థము, పనులు, ఉద్యోగాలు వదిలేసి, భార్య పిల్లలను వదిలేసి మస్జిద్లోనే ఉండిపోవాలా అని కాదు. మనసంతా మస్జిద్లోనే ఉండే మనిషి అంటే, వ్యాపారం చేస్తూ, వ్యవసాయం చేస్తూ, ఉద్యోగాలు చేస్తూ మనసు మాత్రం ఒక నమాజ్ తర్వాత ఇంకో నమాజ్ గురించి ఆలోచనలో ఉంటుంది. మనసు ఏముంటుంది? అసర్ నమాజ్ ఎప్పుడు అవుతుంది? అసర్ నమాజ్ చేసుకుంటే మగ్రిబ్ నమాజ్ సమయం గురించి, మగ్రిబ్ అయిపోతే ఇషా గురించి. ఈ విధంగా ఒక నమాజ్ అయిన తర్వాత ఇంకో నమాజ్ గురించి ఎదురు చూస్తాడు. మనసులో అదే ఆలోచన ఉంటుంది. ఇది దానికి అర్థం, మనసంతా మస్జిద్లో ఉండే మనిషి.
అల్లాహ్ కొరకు ప్రేమించుకునే ఇద్దరు వ్యక్తులు
وَرَجُلانِ تَحَابَّا فِي اللَّهِ اجْتَمَعَا عَلَيْهِ وَتَفَرَّقَا عَلَيْهِ (రజులాని తహాబ్బా ఫిల్లాహిజ్తమ’ఆ అలైహి వ తఫర్రఖా అలైهِ) ఇద్దరు వ్యక్తులు కలుసుకుంటే, పరస్పరం కలుసుకుంటే అల్లాహ్ కోసమే కలుసుకుంటారు. వారిద్దరూ విడిపోతే అల్లాహ్ కోసమే విడిపోతారు.
అంటే స్వార్థం ఉండదు. స్వార్థం లేకుండా కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం. కలిసినా అల్లాహ్ ప్రసన్నత, విడిపోయినా అల్లాహ్ ప్రసన్నత.
పాపానికి ఆహ్వానిస్తే తిరస్కరించే వ్యక్తి
అందం, అంతస్తు గల స్త్రీ చెడు వైపుకి ఆహ్వానిస్తే:
إِنِّي أَخَافُ اللَّهَ رَبَّ الْعَالَمِينَ (ఇన్నీ అఖఫుల్లాహ రబ్బల్ ఆలమీన్) “నేను సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్కు భయపడుతున్నాను” అని చెప్పేవాడు.
ఈ చెడు కార్యానికి పాల్పడను, వ్యభిచారం చేయను, నాకు అల్లాహ్ భయం ఉంది అని చెప్పేవాడు. ఇంత అవకాశం వచ్చాక, అందం, అంతస్తు రెండూ ఉన్న స్త్రీ, ఒకవైపు అందం ఉంది, ఇంకోవైపు అంతస్తు ఉంది, అటువంటి స్త్రీ స్వయంగా ఆహ్వానిస్తుంది చెడు వైపుకి. అటువంటి సమయంలో, “ఇన్నీ అఖాఫుల్లాహ్, నేను అల్లాహ్కు భయపడుతున్నాను” అనే చెప్పే వ్యక్తికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు ప్రళయ దినాన తన కారుణ్య ఛాయలో నీడను ప్రసాదిస్తాడు.
గోప్యంగా దానం చేసే వ్యక్తి
رَجُلٌ تَصَدَّقَ بِصَدَقَةٍ فَأَخْفَاهَا حَتَّى لا تَعْلَمَ شِمَالُهُ مَا تُنْفِقُ يَمِينُهُ (రజులున్ తసద్దఖ బి సదఖతిన్ ఫ అఖ్ఫాహా హత్తా లా త’అలమ షిమాలుహు మా తున్ఫిఖు యమీనుహు) గోప్యంగా దానం చేసేవాడు. కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియదు.
అంత రహస్యంగా, గోప్యంగా దానం చేసే వ్యక్తికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు ప్రళయ దినాన తన కారుణ్య ఛాయలో నీడను ప్రసాదిస్తాడు. కారుణ్య ఛాయ దక్కుతుంది. అంటే, ప్రదర్శనా బుద్ధితో కాకుండా, ప్రజల మెప్పు కోసం కాకుండా, కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే దానం చేసే వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రళయ దినాన తన నీడను ప్రసాదిస్తాడు.
ఏకాంతంలో అల్లాహ్ను స్మరించి ఏడ్చే వ్యక్తి
وَرَجُلٌ ذَكَرَ اللَّهَ خَالِيًا فَفَاضَتْ عَيْنَاهُ (రజులున్ దకరల్లాహ ఖాలియన్ ఫ ఫాదత్ ఐనాహు) ఏకాంతములో అల్లాహ్ను గుర్తు చేసుకుని కన్నీరు కార్చే వ్యక్తి.
ఏకాంతంలో ఉన్నారు, అతను ఎవరికీ చూడటం లేదు, ఎవరూ అతనికీ చూడటం లేదు, ఆ స్థితే లేదు. ఏకాంతంలో ఉన్నాడు, అల్లాహ్ గుర్తుకు వచ్చాడు. అల్లాహ్ శిక్ష గుర్తుకు వచ్చింది, అల్లాహ్ వరాలు గుర్తుకు వచ్చాయి, తన వాస్తవం ఏమిటో తెలుసుకున్నాడు, కుమిలిపోతూ ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, అటువంటి వ్యక్తికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు ప్రళయ దినాన తన కారుణ్య ఛాయలో నీడను ప్రసాదిస్తాడు.
ప్రియ వీక్షకుల్లారా, చివర్లో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ మనల్ని ప్రళయ దినాన ఈ ఏడుగురిలో మనకి కూడా చేర్పించు గాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మానవుల కర్మల నమోదు – [మరణానంతర జీవితం – పార్ట్ 50] https://youtu.be/acqUQX3MOKQ [22 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో ప్రళయదినాన విశ్వాసులకు ప్రసాదించబడే ఒక గొప్ప వరం, “హౌదె కౌసర్” గురించి వివరించబడింది. తీర్పుదినం యొక్క భయంకరమైన పరిస్థితులలో, ప్రజలు తీవ్రమైన దాహంతో ఉన్నప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ ద్వారా ఈ ప్రత్యేకమైన కొలను (హౌద్) ప్రసాదించబడుతుంది. దాని నీరు పాలకన్నా తెల్లగా, తేనెకన్నా తియ్యగా ఉంటుంది. ఎవరైతే దాని నుండి త్రాగుతారో వారు స్వర్గంలో ప్రవేశించే వరకు మళ్ళీ దాహం గొనరు. ఈ హౌద్ వద్దకు ప్రవక్త అనుచరులు మాత్రమే చేరగలుగుతారు, మరియు వారిని ప్రవక్త తమ చేతులతో నీరు త్రాగిస్తారు. అయితే, ప్రవక్త తర్వాత ధర్మంలో కొత్త విషయాలను కల్పించినవారు (బిద్అత్ చేసినవారు) మరియు ఆయన మార్గాన్ని అనుసరించని వారు ఈ గొప్ప భాగ్యానికి నోచుకోలేరు మరియు హౌద్ నుండి దూరంగా నెట్టివేయబడతారు. ధర్మంపై స్థిరంగా ఉండి, కష్టాలలో సహనం వహించిన వారికి ఈ భాగ్యం లభిస్తుందని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది.
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
హౌదె కౌసర్ (కౌసర్ కొలను)
మహాశయులారా, ప్రళయ దినాన ఎంతటి భయంకరమైన స్థితి అలుముకుంటుంది, ప్రజలందరూ చెమటలో మునిగి, దీర్ఘకాలం వల్ల వేచి చూస్తూ వేచి చూస్తూ అలసిపోయి, సిఫారసు చేయడానికి ప్రవక్తలను సైతం విన్నవించుకొని నానా రకాల బాధలకు గురి అవుతూ ఉన్న ఆ సందర్భంలో, ఎన్నో ఘట్టాలు వారి ముందు దాటుతూ ఉంటాయి. లెక్కతీర్పు తీసుకోవడం జరుగుతుంది, అది కూడా చాలా క్లిష్ట పరిస్థితి. అటువైపున త్రాసులో తూకం చేయడం జరుగుతుంది. మరోవైపు కుడిచేతిలో కర్మపత్రాలు పొందే వారు కొందరు ఉంటే, ఎడమచేతిలో కర్మపత్రాలు పొందే వారు మరికొందరు అభాగ్యులు ఉంటారు.
ఇలాంటి ఈ సందర్భంలో సమయం చాలా గడిచిపోతూ ఉంటుంది, వారికి దాహం కూడా కలుగుతూ ఉంటుంది. కనీసం ఒక చుక్క బొట్టు నీళ్లు దొరికినా ఎంత బాగుండును అని వారికి ఆవేదన కలుగుతుంది. అలాంటి సందర్భంలో హౌదె కౌసర్ అన్నటువంటి ఒక పెద్ద గొప్ప వరం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వడం జరుగుతుంది.
ఆ సందర్భంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు లభించే అతి గొప్ప వరం హౌదె కౌసర్. అంటే, అది ఒక మహా విశాలమైన హౌద్. ఒక నెల మీరు ప్రయాణం చేసినా దాని పొడుగు అనేది అంతము కాదు. వెడల్పు కూడా అలాగే ఉంటుంది. మరియు దాని యొక్క నీళ్లు పాలకంటే తెల్లగా, తేనెకంటే తీపిగా ఉంటాయి. ఆ హౌద్ లో వచ్చిపడే నీళ్లు స్వర్గంలో ఉన్నటువంటి నహరె కౌసర్ (కౌసర్ నది) నుండి వస్తాయి.
మహాశయులారా, దాని ప్రస్తావన ఇక్కడ ఎందుకు అంటే, దానిని విశ్వసించడం కూడా మరణానంతర జీవితాన్ని విశ్వసించడంలోని ఒక భాగం. మరియు ఆ హౌదె కౌసర్, దాని నుండి ఎవరికి కనీసం ఒక గ్లాస్ నీళ్లు ప్రాప్తమవుతాయో, వారు స్వర్గంలో వెళ్లే అంతవరకు వారికి దాహం కలగదు.
అయితే, ఆ హౌదె కౌసర్ నీరును పొందే అదృష్టవంతులు ఎవరో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ అది ప్రాప్తించదు. హౌదె కౌసర్ వద్ద ఆ నీరు త్రాగడానికి ఏ పాత్రలైతే ఉంటాయో, వెండి బంగారపు పాత్రలు ఉంటాయి మరియు వాటి సంఖ్య ఆకాశంలో నక్షత్రాల్లాంటి సంఖ్య. అక్కడ ఆ హౌదె కౌసర్ వద్దకు రావడానికి ప్రతి ఒక్కరికీ పర్మిషన్, అనుమతి అనేది ఉండదు. మరియు అక్కడ ప్రతి ఒక్కరు తమిష్టానుసారం త్రాగలేరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేత, వారి యొక్క శుభ హస్తాలతో అది ఇవ్వడం జరుగుతుంది. వారి శుభ హస్తాలతో ఆ హౌదె కౌసర్ నీరు త్రాగే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.
సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ ఇబ్నిల్ ఆస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీద్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
حَوْضِي مَسِيرَةُ شَهْرٍ، وَزَوَايَاهُ سَوَاءٌ (హౌదీ మసీరతు షహ్రిన్, వ జవాయాహు సవా) “నాకు అక్కడ ఇవ్వబడే హౌద్ దాని యొక్క పొడుగు ఒక నెల ప్రయాణం చేసే అంత దూరం ఉంటుంది మరియు దాని యొక్క వెడల్పు కూడా అంతే ఉంటుంది.”
مَاؤُهُ أَبْيَضُ مِنَ اللَّبَنِ، وَرِيحُهُ أَطْيَبُ مِنَ الْمِسْكِ (మాఉహు అభ్యదు మినల్లబన్, వ రీహుహు అత్యబు మినల్ మిస్క్) “దాని యొక్క రంగు పాలకంటే తెల్లగా మరియు దాని యొక్క సువాసన కస్తూరి కంటే ఎక్కువ సువాసన“
మరియు అక్కడ త్రాగడానికి పాత్రలు ఆకాశంలో నక్షత్రాలు ఉన్న విధంగా ఉంటాయి.
مَنْ يَشْرَبْ مِنْهَا فَلا يَظْمَأُ أَبَدًا (మన్ యష్రబ్ మిన్హా ఫలా యద్మఉ అబదా) “ఎవరైతే దాని నుండి త్రాగుతారో వారు ఎప్పటికీ దాహం గొనరు.”
మరి ఎవరైతే ఒకసారి ఆ హౌదె కౌసర్ నుండి త్రాగుతారో ప్రవక్త శుభ హస్తాలతో, వారికి ఆ తర్వాత ఎప్పుడూ దాహం ఏర్పడదు.
ఆ ప్రళయ దినం, అక్కడ ఆ దీర్ఘకాలం, ఒక మైల్ దూరాన ఉన్న సూర్యుడు, చెమటలతో, చెమటలు కారుతూ కారుతూ, దాహం పెరిగిపోతుంది. అక్కడ ఆ దాహం తీరడానికి కేవలం ఒకే ఒక మార్గం ఉంటుంది. అదే హౌదె కౌసర్.
అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ శుభ హస్తాలతో విశ్వాసులకు ఆ నీరు త్రాగిస్తూ ఉంటారు. ఆ నీరును త్రాగిన వారే భాగ్యవంతులు. మరియు ఆ నీరు త్రాగడం నుండి తోయబడిన వారు, దూరం చేయబడిన వారే అభాగ్యులు. ఒకసారి ఈ హదీథును వినండి, భాగ్యవంతులు ఎవరో, అభాగ్యులు ఎవరో తెలుసుకొని భాగ్యవంతుల్లో చేరే ప్రయత్నం చేయండి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
إِنِّي فَرَطُكُمْ عَلَى الْحَوْضِ (ఇన్నీ ఫరతుకుమ్ అలల్ హౌద్) “నిశ్చయంగా, నేను హౌదె కౌసర్ పై మీ గురించి వేచి చూస్తూ ఉంటాను“
مَنْ مَرَّ بِي شَرِبَ (మన్ మర్ర బీ షరిబ్) “ఎవరైతే నా వద్దకు వస్తారో వారు త్రాగి ఉంటారు“
ఎవరైతే నా వద్దకు వస్తారో, వారు నా శుభ హస్తాలతో ఆ హౌదె కౌసర్ నీరు త్రాగి ఉంటారు.
وَمَنْ شَرِبَ لَمْ يَظْمَأْ أَبَدًا (వమన్ షరిబ లమ్ యద్మఅ అబదా) “మరి ఎవరైతే త్రాగుతారో, వారు ఆ తర్వాత ఎప్పుడూ కూడా దాహానికి గురి కారు.“
“హౌదె కౌసర్ వద్దకు నా దగ్గరికి కొందరు వస్తారు. నేను వారిని గుర్తుపడతాను, వారు నన్ను గుర్తుపడతారు. అంతలోనే నా మధ్యలో, వారి మధ్యలో ఒక అడ్డు వేయడం జరుగుతుంది. నేను అంటాను, వారు నా వారు, వారిని రానివ్వండి. అప్పుడు చెప్పడం జరుగుతుంది, నీకు తెలియదు నీ తర్వాత వీరు నీ సత్య ధర్మంలో ఎలాంటి మార్పులు చేసుకున్నారో. అప్పుడు నేను అంటాను, ఇలా నా ధర్మంలో మార్పు చేసుకున్న వారు నాకు దూరమే ఉండాలి, దూరమే ఉండాలి, దగ్గరికి రాకూడదు అని“
గమనించారా? హౌదె కౌసర్ ఆ రోజు లభించే ఆ నీరు మన కొరకు ఎంత శుభకరమైనది. కానీ అల్లాహ్ పంపిన సత్య ధర్మం, అల్లాహ్ పంపినటువంటి చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించనందుకు, లేదా విశ్వసించి ఆయన అడుగుజాడలలో జీవితం గడపనందుకు, ఆయన తెచ్చిన సత్య ధర్మంలో ఇష్టానుసారం మార్పులు చేసుకొని, అవి కూడా ధర్మానికి సంబంధించిన విషయాలని భావించి జీవితం గడిపేవారు ఎంత దురదృష్టానికి గురవుతారు. మరియు ఇలాంటివారే అభాగ్యులు. ఆ రోజు ప్రవక్త శుభ హస్తాల ద్వారా హౌదె కౌసర్ నీరు నోచుకొని వారు.
ఈ హౌదె కౌసర్ గురించి మరికొన్ని వివరాలు ఉన్నాయి. మహాశయులారా, హౌదె కౌసర్ గురించి సహీ ముస్లిం షరీఫ్ లోని మరో ఉల్లేఖన వినండి. ఈ హదీథులో భాగ్యవంతులు, అభాగ్యులు ఇద్దరి ప్రస్తావన ఉంది.
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
“నా వద్దకు హౌదె కౌసర్ దగ్గరికి అనేక మంది ప్రజలు వస్తారు. ఎలాగైతే ఒక వ్యక్తి ఒంటెల మందలో నుండి తన ఒంటెలను తన వైపునకు తీసుకొని వెళ్తాడో, ఆ విధంగా ప్రజలందరి మధ్యలో నుండి నా అనుచర సంఘాన్ని నేను తీసుకొని పక్కకు జరుపుతాను, హౌదె కౌసర్ వైపునకు తీసుకెళ్లడానికి. అప్పుడు సహాబాలు, సహచరులు అడిగారు, “ప్రవక్తా, తారిఫునా? ఆ రోజు అంత మందిలో, అంత పెద్ద సంఖ్యలో మీరు మమ్మల్ని గుర్తుపడతారా?” ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, “అవును, మీకంటూ ఓ ప్రత్యేక చిహ్నం, ఓ గుర్తు అనేది ఉంటుంది, అది మరెవరికీ ఉండదు.”
గమనించండి. మీకంటూ ఓ ప్రత్యేక చిహ్నం, గుర్తు అనేది ఉంటుంది, లైస లిఅహదిన్ గైరికుమ్. అది మీ తప్ప ఇంకా ఎవరికీ అలాంటి గుర్తింపు అనేది ఉండదు. అదేమిటి?
تَرِدُونَ عَلَىَّ غُرًّا مُحَجَّلِينَ مِنْ آثَارِ الْوُضُوءِ (తరిదూన అలయ్య గుర్రమ్ ముహజ్జలీన మిన్ ఆసారిల్ వుదూ) “మీరు వుదూ ఆనవాళ్ల వల్ల ప్రకాశవంతమైన ముఖాలు, కాళ్ళు మరియు చేతులతో నా వద్దకు వస్తారు.”
మీలో ఐదు వేళల నమాజులు చేస్తూ ఉన్నవారు, వారు నమాజు గురించి వుదూ చేస్తూ ఉంటారు, ఆ వుదూ చేయడం వల్ల వుదూ యొక్క అవయవాలు మెరుస్తూ ఉంటాయి. అదే సందర్భంలో,
وَلَيُصَدَّنَّ عَنِّي طَائِفَةٌ مِنْكُمْ (వల యుసద్దన్న అన్నీ తాయిఫతుమ్ మిన్కుమ్) “అయితే మీలోని ఒక వర్గం వారు నా నుండి అడ్డగించబడతారు.”
ఆ సందర్భంలో ఒక వర్గం వారిని నా వద్దకు రాకుండా ఆపడం, అటు తోయడం జరుగుతుంది. ఫలా యసిలూన్. వారు నా వరకు చేరుకోరు. ఫఅఖూల్, అప్పుడు నేను అంటాను,
يَا رَبِّ هُمْ مِنْ أَصْحَابِي (యా రబ్బి హుమ్ మిన్ అస్ హాబీ) “ఓ ప్రభూ! వీరు నా అనుచరులే.”
ఓ ప్రభువా, వీరు కూడా నన్ను విశ్వసించేవారు, నా వారు అని.
فَيُجِيبُنِي مَلَكٌ (ఫయుజీబునీ మలకున్) “అప్పుడు ఒక దైవదూత నాకు సమాధానమిస్తాడు.”
وَهَلْ تَدْرِي مَاذَا أَحْدَثُوا بَعْدَكَ (వహల్ తద్రీ మాదా అహదసూ బాదక్) “నీ తర్వాత వారు ఏమేమి కొత్తవి కల్పించారో నీకు తెలుసా?”
ప్రవక్తా, నీవు చనిపోయిన తర్వాత, నీ వెనుక వారు నీవు తెచ్చిన సత్య ధర్మంలో ఎలాంటి మార్పులు చేశారో నీకు తెలుసా? మరొక ఉల్లేఖనంలో ఉంది,
إِنَّهُمُ ارْتَدُّوا عَلَى أَدْبَارِهِمُ الْقَهْقَرَى (ఇన్నహు ముర్తద్దూ అలా అద్బారిహిముల్ ఖహ్ఖరా) “వారు నీ తర్వాత సత్య ధర్మాన్ని వదిలేసి వెనుదిరిగారు“
అయితే మహాశయులారా, ఈ హదీద్ ద్వారా మనకు తెలిసిన విషయాలు ఏమిటి?
ఒకటి, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజు ప్రజలందరి మధ్యలో తమ అనుచర సంఘాన్ని గుర్తుపడతారు.
రెండో విషయం మనకు తెలిసింది, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని గుర్తుపట్టి హౌదె కౌసర్ వైపునకు మనల్ని తీసుకెళ్లి తమ శుభ హస్తాలతో మనకు హౌదె కౌసర్ నీరు త్రాగించాలి అని మనం అనుకుంటే, తప్పకుండా వుదూ చేస్తూ ఉండాలి, నమాజ్ చేస్తూ ఉండాలి.
మూడో విషయం, నమాజ్, వుదూ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా, ఇక నమాజు, వుదూ తర్వాత జీవితంలో మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శాన్ని పాటించాలి. ఆయన తెచ్చిన ధర్మాన్ని మాత్రమే అనుసరించాలి. నమాజ్ అయితే చేస్తున్నాము కదా అని జీవిత ఇతర విషయాల్లో ప్రవక్త విధానానికి వ్యతిరేకంగా కొత్త కొత్త విషయాలు పుట్టించుకొని, మనకిష్టమైన ఆచారాలను ఆచరిస్తూ ప్రవక్త తెచ్చిన ధర్మాన్ని, ఆయన ఆదర్శాన్ని విడనాడడం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభ హస్తాలతో హౌదె కౌసర్ నీరు పొందకుండా ఉండడానికి కూడా కారణం కావచ్చు. ఏమన్నారు ప్రవక్త గారు? మిమ్మల్ని నేను వుదూ యొక్క అవయవాలు మెరుస్తుండడం వల్ల గుర్తుపడతాను, కానీ అదే సందర్భంలో మీలోని కొందరిని, మీలోని ఒక వర్గాన్ని నా వద్దకు రాకుండా, వారు నా వరకు చేరకుండా ఒక అడ్డు వేసి వారిని దూరం చేయడం జరుగుతుంది. అంటే, వారి యొక్క అవయవాలు మెరుస్తున్నాయి, కానీ వారిలో మరికొన్ని ఇతర చెడులు కూడా ఉన్నాయి.
అందుకు మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదర్శం మన జీవిత వ్యవహారంలోని ప్రతీ విషయంలో పాటించాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రళయ దినాన గొప్ప వరంగా బహుకరించబడే ఈ హౌద్, దీనిని తిరస్కరించడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన హదీథులు చాలా ఉన్నాయి. హదీథ్ పరిభాషలో అహాదీథె ముతవాతిరా అని అంటారు. అంటే సంకోశానికి, అంటే అనుమానానికి, సందేహానికి ఏ తావు లేనటువంటి సంఖ్యలో అన్ని హదీథులు వచ్చి ఉన్నాయి అని భావం.
మరొక విషయం, ప్రళయ దినాన కేవలం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక్కరికే కాదు, ఇతర ప్రవక్తలకు కూడా హౌద్ ఇవ్వబడుతుంది. వారి వారి అనుచర సంఘాలు వారి వద్దకు వచ్చి వారి శుభ హస్తాలతో కూడా వారు ఆ నీరు త్రాగుతారు. కానీ అతిపెద్ద సంఖ్యలో మన ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకే ప్రజలు హాజరవుతారు. వారిని అనుసరించిన వారి సంఖ్యనే అందరికంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాగే ఎన్నో హదీథులు వచ్చి ఉన్నాయి. ఉదాహరణకు, తిర్మిదిలోని హదీథ్, షేఖ్ అల్బానీ రహమహుల్లా సహీహుల్ జామేలో ప్రస్తావించారు. హదీథ్ నెంబర్ 2156.
إِنَّ لِكُلِّ نَبِيٍّ حَوْضًا (ఇన్న లికుల్లి నబియ్యిన్ హౌదా) “నిశ్చయంగా, ప్రతి ప్రవక్తకు ఒక హౌద్ ఉంటుంది.”
మరో ఉల్లేఖనంలో ఉంది,
وَإِنَّ لِكُلِّ نَبِيٍّ حَوْضًا تَرِدُهُ أُمَّتُهُ (వ ఇన్న లికుల్లి నబియ్యిన్ హౌదన్ తరిదుహు ఉమ్మతుహు) “ప్రతి ప్రవక్తకు హౌద్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరియు ఆ హౌద్ వద్దకు ఆ ప్రవక్త యొక్క అనుచర సంఘం హాజరవుతుంది“
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభ హస్తాలతో హౌదె కౌసర్ నీరు పొందడానికి మరొక గొప్ప అవకాశం ఎలాంటి వారికి లభిస్తుందంటే, ఎవరైతే ధర్మంపై స్థిరంగా ఉండి, ఏ కష్టాలు, ఏ ఆపదలు, ఏ ఇబ్బందులు, ఏ ఆటంకాలు ఎదురైనా సహనం వహిస్తూ ఉంటారో, అలాంటి వారు తప్పకుండా ఈ శుభ అవకాశాన్ని పొందుతారు.
గమనించండి ఈ హదీథును. సహీ బుఖారీ, సహీ ముస్లింలోని హదీథ్.
إِنَّكُمْ سَتَلْقَوْنَ بَعْدِي أَثَرَةً فَاصْبِرُوا حَتَّى تَلْقَوْنِي عَلَى الْحَوْضِ (ఇన్నకుమ్ సతల్ ఖౌన బాదీ అసరతన్, ఫస్బిరూ హత్తా తల్ ఖౌనీ అలల్ హౌద్) “నిశ్చయంగా, నా తర్వాత మీరు పక్షపాతాన్ని చూస్తారు. కనుక, మీరు నన్ను హౌద్ వద్ద కలిసే వరకు సహనం వహించండి.”
నా తర్వాత మీరు హక్కు గల వారికి ఇవ్వవలసిన హక్కు ఇవ్వకుండా, హక్కు లేని వారికి ఇవ్వడం, ఇలాంటి వ్యవహారాలు చూస్తూ ఉంటారు. అయితే మీరు సహనం వహిస్తూ ఉండండి. ఎంతవరకు సహనం వహించాలి? మరణం వచ్చేవరకు సహనము వహించండి, నా హౌద్ వద్దకు మీరు వచ్చేంతవరకు సహనం వహిస్తూ ఉండండి. ఈ విధంగా ఈ హదీథులో మనకు అల్లాహ్ ధర్మంపై స్థిరంగా ఉండడంలో, ప్రపంచంలోని ఏదైనా ఒక హక్కు మనకు లభించకున్నా, అందులో మనం ధర్మానికి వ్యతిరేకంగా ఏ కార్యం చేయకుండా, ప్రవక్త ఈ శుభవార్తను అందుకొని మనం ప్రవక్త ఆదర్శాన్ని పాటిస్తూ ఉండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆ పరలోకాన కలుసుకునే అంతవరకు మనం సహనం వహిస్తూ ఉంటే, తప్పకుండా ప్రవక్త శుభ హస్తాలతో ఆ నీరు మనం త్రాగవచ్చు.
అయితే మహాశయులారా, ప్రతి ప్రవక్తకు ఒక హౌద్ ఇవ్వడం జరుగుతుంది అని ఏదైతే చెప్పబడిందో, అందులో కూడా ఆ ప్రవక్తలను ఆ కాలంలో వారు అనుసరించి ఉంటేనే వారికి అది ప్రాప్తమవుతుంది. ఇది ఒక విషయం. రెండో విషయం, ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని తిరస్కరించి, నేను గత ప్రవక్తలను నమ్ముతున్నాను అన్నంత మాత్రాన, వారికి ఆ ప్రవక్తల నుండి కూడా హౌదె కౌసర్, అంటే వారికి లభించే హౌద్ నుండి నీరు త్రాగే అవకాశం దొరుకుతుంది అని భావించవద్దు. ఎందుకంటే ప్రతి ప్రవక్త తమ వెనుక వచ్చే ప్రవక్త గురించి శుభవార్త ఇచ్చారు. తమ వెనుక వచ్చే ప్రవక్తను విశ్వసించాలి అని కూడా చెప్పారు. ఇదే విషయం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఉన్న ఏసుక్రీస్తు వారు, హజరత్ ఈసా అలైహిస్సలాం చెప్పారు,
يَأْتِي مِنْ بَعْدِي اسْمُهُ أَحْمَدُ (యాతీ మిమ్ బాదీ ఇస్ముహూ అహ్మద్) “నా తరువాత ఒక ప్రవక్త రాబోతున్నాడు. ఆయన పేరు అహ్మద్.” (అస్-సఫ్ఫ్ 61:6)
నా తర్వాత అహ్మద్ పేరు గల ఒక ప్రవక్త వస్తారు. ఆ ప్రవక్తను మీరు విశ్వసించండి. ఆ ప్రవక్తను మీరు నమ్మండి అని. మరియు బైబిల్ గ్రంథంలో ఆదరణకర్త అన్న పేరుతో కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రస్తావన వచ్చి ఉంది.
అందుకొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని తిరస్కరించి, మనం మా ప్రవక్తలను నమ్ముతున్నాము, అందుగురించి పరలోకంలో మేము సాఫల్యం పొందుతాము, మా ప్రవక్తల ద్వారా మేము హౌద్ నీళ్ళను పొందుతాము, ఆ పరలోకంలోని ఘట్టాలను మేము చాలా సులభతరంగా దాటిపోతాము అన్నటువంటి భ్రమలో ఉండకూడదు. ఇది భ్రమగానే అయిపోతుంది. మరియు ఆ రోజు చాలా నష్టంలో పడవలసి ఉంటుంది. అల్లాహ్ మనందరినీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించి, వారి ఆదర్శాన్ని పాటించి, ధర్మంపై స్థిరంగా ఉండి, ఆయన తెచ్చిన ధర్మంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేసుకోకుండా, ఆయన చూపిన మార్గాన్ని అవలంబిస్తూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించు గాక.
జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హిజ్రత్ (షిర్క్ ప్రాంతం నుండి, ఇస్లాం ప్రాంతానికి వలసపోవుట) ఈ ఉమ్మత్ పై విధిగా ఉంది త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ https://youtu.be/GWB2_SlYVsw [14 నిముషాలు]
ముస్లిం ఉమ్మత్ పై హిజ్రత్ (వలస) అనేది ప్రళయం వరకు విధిగా ఉంది. షిర్క్ (బహుదైవారాధన) జరిగే ప్రదేశం నుండి ఇస్లాం ఉన్న ప్రదేశానికి వెళ్లడమే హిజ్రత్. తౌహీద్ (ఏకదైవారాధన) పై స్థిరంగా ఉండటం, కేవలం అల్లాహ్ ను ఆరాధించడం కష్టంగా లేదా అసాధ్యంగా ఉన్నప్పుడు, మరియు దాని కారణంగా హింసించబడుతున్నప్పుడు, ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టాలి. ఇది దేశం నుండి దేశానికి మాత్రమే కాదు, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి కూడా కావచ్చు. అయితే, స్వేచ్ఛగా ఇస్లాంను ఆచరించగలిగే మరియు ఇస్లాం గురించి ప్రచారం చేయగలిగే అవకాశం ఉన్న చోట హిజ్రత్ అవసరం లేదు. శక్తి ఉండి కూడా, ప్రపంచ ప్రయోజనాల కోసం హిజ్రత్ చేయని వారికి ఖుర్ఆన్ లో కఠినమైన హెచ్చరిక ఉంది. కానీ నిజంగా బలహీనులకు, మార్గం తెలియని వారికి మినహాయింపు ఉంది. హిజ్రత్ చేయని వాడు పాపాత్ముడు అవుతాడు కానీ అవిశ్వాసి కాడు. పశ్చాత్తాప ద్వారం మూసుకుపోయే వరకు (సూర్యుడు పడమర నుండి ఉదయించే వరకు) హిజ్రత్ కొనసాగుతుంది, కానీ వ్యక్తిగత పశ్చాత్తాపం మరణ ఘడియ రాకముందే చేయాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [1] – సంకల్ప శుద్ధి, సత్ప్రవర్తన [మరణానంతర జీవితం – పార్ట్ 23] [21 నిముషాలు] https://www.youtube.com/watch?v=bqcAR6CBK80 వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والعاقبة للمتقين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد
మహాశయులారా, మరణానంతర జీవితం అనే అంశంలో మీకు స్వాగతం. మరణానంతర జీవితం అనే అంశంలో ఒక ముఖ్య శీర్షిక ప్రళయ దినాన త్రాసు యొక్క ఏర్పాటు చేయడం, అందులో కర్మలను, కర్మ పత్రాలను, ఆ కర్మలు చేసిన మానవుల్ని కూడా తూకం చేయబడటం దాని గురించి మనం ఎన్నో వివరాలు విని ఉన్నాము. అయితే, ఇందులోనే ఒక ముఖ్య శీర్షిక త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు ఏమిటి?
మహాశయులారా, ఇలాంటి విషయాలు మనం ఎక్కువగా చదవడం, వినడం, తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసు బరువుగా ఉన్నప్పుడే మనం స్వర్గాల్లోకి ప్రవేశించగలుగుతాము. ఒకవేళ మన సత్కార్యాల పళ్ళెం బరువుగా కాకుండా తేలికగా ఉంటే, అల్లాహ్ కాపాడుగాక మనందరినీ రక్షించుగాక, నరకంలోనికి వెళ్ళవలసి వస్తుంది. అందుకొరకు ఈనాటి నుండి మనం అల్లాహ్ యొక్క దయవల్ల ఏ సత్కార్యాలు ప్రళయ దినాన మన త్రాసును బరువుగా చేస్తాయి, ఆ సత్కార్యాల గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాము.
ఇందులో మొదటి విషయం ఇఖ్లాస్. అంటే సంకల్ప శుద్ధి. ఏ కార్యం ఎంత ఎక్కువగా సంకల్ప శుద్ధితో కూడుకొని ఉంటుందో అంతే ఎక్కువగా దాని పుణ్యం పెరుగుతుంది. ఎంత పుణ్యం ఎక్కువగా పెరుగుతుందో అంతే పళ్ళెంలో, సత్కార్యాల త్రాసులో అది బరువుగా ఉంటుంది. ఎవరైనా ఎంత పెద్ద సత్కార్యం చేసినా, అది చూడడానికి ఎంత గొప్పగా ఉన్నా, సంకల్ప శుద్ధి కలిగి లేకుంటే, అది కేవలం అల్లాహ్ యొక్క సంతృష్టి కొరకు చేయబడకుంటే దాని యొక్క సత్ఫలితం మనిషికి ఏ మాత్రం దొరకడమే కాదు, ఏనాడైతే మనిషి దాని సత్ఫలితం పొందుదాము అని ప్రలోకాన హాజరవుతాడో అప్పుడు దుమ్ము ధూళి వలె అది వృధా అయిపోతుంది. ఏమీ ఫలితము మనిషికి లభించదు. చూడడానికి ఇహలోకంలో అతను ఎంతో కష్టపడ్డాడు. చూడడానికి ఆ కార్యం చేయడానికి అతను ఎంతో శ్రమించాడు, కానీ సంకల్ప శుద్ధి లేని వల్ల దాని పుణ్యం తుడుచుకుపోతుంది. సత్ఫలితం లేకుండా చేస్తుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
త్రాసు అంటే ఏమిటి? ప్రళయ దినాన దాని యొక్క గాంభీర్యత, కష్టతరం అనేది ఎలా ఉంటుంది? [మరణానంతర జీవితం – పార్ట్ 19] [21 నిముషాలు] https://www.youtube.com/watch?v=kKaOZfTuxe0 వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి వహద, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బాద అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ఈనాటి శీర్షిక: త్రాసు అంటే ఏమిటి? ప్రళయ దినాన దాని యొక్క గాంభీర్యత, కష్టతరం అనేది ఎలా ఉంటుంది?
మహాశయులారా, సృష్టికర్త అయిన అల్లాహ్ సర్వము తెలిసినవాడు. మరియు ఆయన ఎవరి పట్ల కూడా ఎలాంటి అన్యాయం చేయనివాడు. ఆయన కరుణామయుడు, కృపాశీలుడు మరియు దాసులకు వారి పుణ్యాలకంటే ఎంతో ఎక్కువ రేట్లో ఉపకారాలు చేసి వారిని మన్నిస్తూ ఉండేవాడు. కానీ రవ్వంత కూడా ఎవరిపై ఏ అన్యాయము చేయడు.
ఆయన ప్రళయ దినాన తలచుకుంటే, దాసుల పట్ల ఆయనకున్న పరిజ్ఞానంతో వారి యొక్క విశ్వాసం, అవిశ్వాసం, సత్కార్యాలు, దుష్కార్యాలు అనే ఆధారం మీద వారిని స్వర్గంలో పంపడం, నరకంలో పంపడం వంటి తీర్పులు చేయగలడు. అలా చేసే అధికారం అతనికి ఉంది. కానీ, అలా చేయకుండా వారి యొక్క లెక్క, వారి యొక్క తీర్పు, సాక్ష్యాధారాలను, ఇంకా ఆ రోజు త్రాసును నెలకొల్పుతాడు.
త్రాసును నెలకొల్పి, అందులో ప్రజలు చేసినటువంటి సత్కార్యాలను ఒకవైపున, దుష్కార్యాలను మరోవైపున తూకం చేస్తాడు. స్వయంగా సత్కార్యాలు, దుష్కార్యాలు చేసిన ప్రజలను కూడా అందులో పెట్టడం జరుగుతుంది. అంతేకాదు, ఏ కర్మపత్రాలు దైవదూతలు రాస్తూ ఉన్నారో, ఆ పత్రాలను కూడా, ఆ ఫైల్లను కూడా అందులో తూకం చేయడం జరుగుతుంది. ఇదంతా దేని కొరకు? ప్రజలు కూడా స్వయంగా వారు తృప్తికరమైన న్యాయం వారికి లభించినది అని వారికి మనస్తృప్తి కలగాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ ముస్లింలారా! అల్లాహ్ తో భయపడండి, ఎల్లవేళలా ఆయన దైవ భీతిని కలిగి ఉండండి. మనసులో ఆయన భయాన్ని సజీవంగా ఉంచండి. ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుంచి దూరంగా ఉండండి. .
మరియు తెలుసుకోండి! అల్లాహ్ తన ధర్మస్థాపనలో తాను లిఖించినటువంటి విధిరాతలో మరియు శిక్షించడంలో, ప్రతిఫలం ప్రసాదించడంలో ఆయన ఎంతో వివేకవంతుడు. మరియు అల్లాహ్ తఆలా యొక్క వివేకం ఏమిటంటే ఆయన తన సృష్టి కొరకు అంతిమ దినాన్ని నియమించాడు. ఆ రోజున ఆయన సమస్త సృష్టిరాశులకు తమ ఆచరణ యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్తల ద్వారా తన దాసులకు చేరవేశాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.
(“మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా? అల్లాహ్యే నిజమైన సార్వభౌముడు. ఆయన మహోన్నతుడు.) (సూరా అల్ మూ ‘మినూన్ 23:115-116)
ఓ విశ్వాసులారా! గడిచిన ఖుత్బాలో మనం అంతిమ దినంపై విశ్వాసంలో భాగంగా శంఖం పూరించడం, ప్రళయ సూచనలు, సృష్టి పునరుత్థాన, ప్రజలు హష్ర్ మైదానంలో సమీకరించబడటం గురించి తెలుసుకున్నాము. ఈ రోజు మనం ఆ హష్ర్ మైదానంలో సమస్త మానవాళి సమావేశమైనప్పటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాము.
ఓ అల్లాహ్ దాసులారా! హష్ర్ మైదానంలో నాలుగు విషయాలు జరుగుతాయి.
[1] జనులు భయకంపితులై ఉంటారు
సూరె హజ్ లో అల్లాహ్ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు.
(ఓ ప్రజలారా! మీ ప్రభువుకు భయపడండి. నిశ్చయంగా ప్రళయ సమయాన జరిగే ప్రకంపనం మహా (భీకర) విషయం. ఆనాడు మీరు దాన్ని చూస్తారు… పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. గర్భవతుల గర్భాలూ పడిపోతాయి. ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్ (తరఫున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది.) (సూరా అల్ హజ్ 22:1-2)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ ముస్లింలారా! అల్లాహ్ తో భయపడండి, ఎల్లవేళలా ఆయన దైవ భీతిని కలిగి ఉండండి. మనసులో ఆయన భయాన్ని సజీవంగా ఉంచండి. ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుంచి దూరంగా ఉండండి. .
మరియు తెలుసుకోండి! అల్లాహ్ తన ధర్మస్థాపనలో తాను లిఖించినటువంటి విధిరాతలో మరియు శిక్షించడంలో, ప్రతిఫలం ప్రసాదించడంలో ఆయన ఎంతో వివేకవంతుడు. మరియు అల్లాహ్ తఆలా యొక్క వివేకం ఏమిటంటే ఆయన తన సృష్టి కొరకు అంతిమ దినాన్ని నియమించాడు. ఆ రోజున ఆయన సమస్త సృష్టిరాశులకు తమ ఆచరణ యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్తల ద్వారా తన దాసులకు చేరవేశాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.
(“మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా? అల్లాహ్యే నిజమైన సార్వభౌముడు. ఆయన మహోన్నతుడు.) (సూరా అల్ మూ ‘మినూన్ 23:115-116)
ఆ రోజుకు అంతిమదినం అని పేరు రావడానికి గల కారణం ఏమిటంటే అదే చివరి రోజు. ఆ తర్వాత మరో రోజు ఉండదు. ఆ రోజున స్వర్గవాసులు స్వర్గంలోకి మరియు నరక వాసులు నరకంలోకి వెళ్తారు. ఆ రోజుని ప్రళయ దినం అని కూడా అంటారు ఎందుకంటే ఆ రోజున సమస్త మానవాళి అల్లాహ్ ముందు హాజరవడం జరుగుతుంది.
يَوْمَ يَقُومُ النَّاسُ لِرَبِّ الْعَالَمِينَ (ఆ రోజు జనులంతా సర్వలోకాల ప్రభువు ముందు నిలబడతారు.) (83:6)
ఓ విశ్వాసులారా! అంతిమ దినాన్ని విశ్వసించడంలో ఆరు విషయాలు ఉన్నాయి. శంఖం పూరించడం, సృష్టి పునరుత్థాన, ప్రళయ దిన సూచనలు బహిర్గతమవడం , ప్రజలు హష్ర్ మైదానం లో సమావేశమవడం, లెక్కా పత్రం , శిక్షా ప్రతిఫలం, స్వర్గం నరకం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
99. సూరా అజ్ జిల్ జాల్ (భూకంపం) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) https://youtu.be/BaJGDgkkjvc [38 min] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ సూరా మదీనా కాలానికి చెందినది. ఇందులో 8 ఆయతులు ఉన్నాయి. తీర్పుదినం గురించి ఈ సూరా ముఖ్యంగా బోధించింది. ఈ సూరాలో ప్రస్తావనకు వచ్చిన ‘జిల్ జాల్’ (భూకంపం) అన్న పదాన్ని దీనికి పేరుగా పెట్టడం జరిగింది. తీర్పుదినం నాటి భయానక స్థితిని, ఆనాటి ప్రకంపనాలను ఈ సూరా వర్ణించింది. ఆ రోజు భూమి తీవ్రంగా కుదిపివేయ బడుతుంది. భూగర్భంలో ఉన్న సమస్తాన్ని వెళ్ళ గ్రక్కుతుంది. అంటే మృతులను బయటకు వెళ్ళగ్రక్కుతుంది. ప్రజలు ఆ రోజు తమ కర్మలను చూసుకునేందుకు భిన్న పరిస్థితుల్లో తమ ప్రభువు వైపునకు మరలుతారు. శిక్షా లేదా బహుమానాలు పొందుతారు.
ఈ ప్రసంగం ఖురాన్లోని 99వ అధ్యాయం, సూరతుల్ జిల్జాల్ యొక్క వివరణాత్మక వ్యాఖ్యానం (తఫ్సీర్). భూమి తీవ్రంగా ప్రకంపించబడటం, తనలోని శవాలను, నిధులను బయటకు వెళ్లగ్రక్కడం, మానవుడు నిశ్చేష్టుడై “దీనికేమైంది?” అని ప్రశ్నించడం వంటి ప్రళయదినపు భయానక సంఘటనలను వక్త వివరిస్తారు. ఈ సూరా యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దానిని తన నమాజులో పఠించడం, అది సహచరులపై చూపిన గాఢమైన ప్రభావం గురించిన హదీసులను ఉదహరిస్తారు. భూమి స్వయంగా మానవుడు చేసిన ప్రతి చిన్న, పెద్ద కర్మకు సాక్ష్యమిస్తుందని, జవాబుదారీతనం అనే ప్రధాన సందేశాన్ని ఈ సూరా తెలియజేస్తుందని వివరిస్తారు. అణువంత మంచి చేసినా, చెడు చేసినా అది దాని కర్తకు చూపించబడుతుందని, కనుక ఈ జీవితంలో మన కర్మల పట్ల జాగ్రత్త వహించాలని శ్రోతలను హెచ్చరిస్తూ ప్రసంగం ముగుస్తుంది.
السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.)
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ (అవూజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్) శాపగ్రస్తుడైన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ (బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్) అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో (ప్రారంభిస్తున్నాను).
إِذَا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا (ఇదా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా) భూమి చాలా తీవ్రమైన తన ప్రకంపనలతో కంపింపజేయబడినప్పుడు (సూరా అజ్-జిల్జాల్ 99:1)
ఇదా జుల్జిలత్. కంపించ చేయబడినప్పుడు. అల్ అర్ద్, భూమి. మళ్ళీ దాని యొక్క మస్దర్ జిల్జాలహా అని ఏదైతే వచ్చిందో, హా అంటే ఆ భూమి అని దాని వైపునకు సైగ చేయడం జరుగుతుంది. జిల్జాల్ అని వచ్చిన మరోసారి చెప్పబడిన పదానికి తీవ్రమైన రీతిలో. అంటే ఏమిటి? భూమి చాలా తీవ్రమైన తన ప్రకంపనలతో కంపించ చేయబడినప్పుడు.
وَأَخْرَجَتِ الْأَرْضُ أَثْقَالَهَا (వ అఖ్రజతిల్ అర్దు అస్ఖాలహా) మరి భూమి తన బరువులన్నింటినీ తీసి బయట పడవేసినప్పుడు, (సూరా అజ్-జిల్జాల్ 99:2)
వ అఖ్రజత్ బయట పడవేసినప్పుడు. అల్ అర్ద్ ఆ భూమి. దేనిని బయట పడేసినప్పుడు? తనలో ఉన్నటువంటి బరువులన్నింటినీ. మరి భూమి తన బరువులన్నింటినీ తీసి బయట పడవేసినప్పుడు,
وَقَالَ الْإِنسَانُ مَا لَهَا (వ ఖాలల్ ఇన్సాను మాలహా) “అరె! దీనికేమైపోయిందీ?” అని మనిషి (కలవరపడుతూ)అంటాడు. (సూరా అజ్-జిల్జాల్ 99:3)
మనిషి అంటాడు, మాలహా? అరె! దీనికి ఏమైపోయింది?
يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا (యౌమఇదిన్ తుహద్దిసు అఖ్బారహా) ఆ రోజు భూమి తన సంగతులన్నీ వివరిస్తుంది. (సూరా అజ్-జిల్జాల్ 99:4)
యౌమఇదిన్ ఆ రోజు తుహద్దిసు వివరిస్తుంది. అఖ్బారహా. తుహద్దిసు అంటే ఇక్కడ అర్ద్. అరబీలో అర్ద్ స్త్రీలింగం, ఫీమేల్ వర్డ్ గా ఉపయోగించడం జరుగుతుంది. అందుకొరకే తుహద్దిసు వచ్చింది. పురుషలింగం అయితే యుహద్దిసు వచ్చేది. తుహద్దిసు, భూమి వివరిస్తుంది, తెలియజేస్తుంది. అఖ్బారహా తన సంగతులన్నీ, తన సమాచారాలన్నీ.
بِأَنَّ رَبَّكَ أَوْحَىٰ لَهَا (బి అన్న రబ్బక అవ్హాలహా) ఎందుకంటే నీ ప్రభువు దానికి, ఆ మేరకు ఆజ్ఞాపించి ఉంటాడు.(సూరా అజ్-జిల్జాల్ 99:5)
అలా ఎందుకు చేస్తుంది? ఎందుకు వివరిస్తుంది? ఎందుకంటే బి అన్న, ఎందుకంటే రబ్బక నీ ప్రభువు అవ్హాలహా దానికి ఆజ్ఞాపించి ఉంటాడు అలా చేయాలని.
يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ (యౌమఇదిన్ యస్దురున్నాసు అష్తాతల్ లియురవ్ అఅమాలహుమ్) ఆ రోజు జనులు – వారి కర్మలు వారికి చూపబడేందుకుగాను – వేర్వేరు బృందాలుగా తరలి వస్తారు. (సూరా అజ్-జిల్జాల్ 99:6)
యౌమఇదిన్ ఆ రోజు. యస్దురున్నాస్, యస్దురు తరలి వస్తారు, తిరిగి వస్తారు. అన్నాస్ జనులు, ప్రజలు. అష్ తాతా వేరు వేరు బృందాలుగా. లియురవ్ వారికి చూపబడేందుకు అఅమాలహుమ్ వారి యొక్క కర్మలు. ఆ రోజు జనులు వారి కర్మలు వారికి చూపబడేందుకు గాను వేరు వేరు బృందాలుగా తరలి వస్తారు.
فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ (ఫమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరయ్యరహ్) కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. (సూరా అజ్-జిల్జాల్ 99:7)
వమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరయ్యరహ్. కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా. ఫమన్ ఎవడైనా గానీ, ఎవడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. యఅమల్ చేస్తాడో, చేసినా. మిస్ఖాల దర్రహ్ అణువంత. దర్రహ్ చీమల కంటే చిన్నగా, చీమల యొక్క గుడ్లు, చీమల యొక్క పిల్లలు, అంతకంటే మరీ చిన్నది. ఖైరన్ ఏదైనా సత్కార్యం. యరహు దాన్ని అతడు చూసుకుంటాడు. కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు.
وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ (వమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ షర్రయ్యరహ్) మరెవడు అణుమాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. (సూరా అజ్-జిల్జాల్ 99:8)
మరెవరు అణుమాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు.
సూరతుల్ జిల్జాల్ యొక్క ప్రాముఖ్యత
సోదర మహాశయులారా! ఖురాన్ సూరతులలోని క్రమంలో ఈ 99వ సూరత్, సూరతుల్ జిల్జాల్, చాలా ప్రాముఖ్యత గల సూరా. ఈ సూరా యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని సందర్భాల్లో, ఎలాగైతే ముస్నద్ అహ్మద్ లో హదీస్ వచ్చి ఉందో, అబూ ఉమామా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు:
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి కాలంలో కొంచెం బరువు పెరిగారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విత్ర్ చేసిన తర్వాత కూర్చుండి రెండు రకాతులు ఎప్పుడైనా చేసేవారు. ఆ రెండు రకాతులలోని మొదటి రకాతులో సూరే ఫాతిహా తర్వాత ఇదా జుల్జిలతిల్ అర్ద్ చదివేవారు. మరియు రెండవ రకాతులో సూరే ఫాతిహా తర్వాత ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ (قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ) చదివేవారు.
దీని ప్రాముఖ్యతను గమనించడానికి, అబూ దావూద్ లో వచ్చినటువంటి ఒక హదీస్, 816 హదీస్ నెంబర్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రోజు ఫజర్ నమాజులోని రెండు రకాతుల్లో కూడా ఇదే సూరత్ జిల్జాల్. చదివారు.
సోదర మహాశయులారా! ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, సహాబాల యొక్క జీవితాల్లో, ఈ సూరా పట్ల ఎలాంటి ప్రాముఖ్యత ఉండినది, చాలా భయంకరమైన గొప్ప విషయాలు చెప్పుకోవడానికి, సూక్ష్మమైన విషయాల గురించి ప్రస్తావన చేసుకునేటందుకు, ఏ చిన్న, అతి చిన్న, మరీ చిన్న పుణ్య కార్యమైనా చేసుకోవడానికి ముందుకు రావాలని, ఏ చిన్న, ఏ అతి చిన్న, మరీ చిన్న పాపమైనా తప్పకుండా దానితో దూరం ఉండాలని ఈ సూరా ద్వారా గుణపాఠం తెచ్చుకొని ఇతరులకు బోధించేవారు, నేర్పేవారు ఈ సూరా ఆధారంగా.
సోదర మహాశయులారా! ఈ సూరా యొక్క ప్రాముఖ్యత మరొక హదీస్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ఆ హదీసును కొందరు ధర్మవేత్తలు జయీఫ్ (ضَعِيفٌ) అన్నారు కానీ, ముస్నద్ అహ్మద్ ఏదైతే చాలా ఎక్కువ వాల్యూమ్ లో పూర్తి రీసెర్చ్ తో ప్రింట్ అయిందో, 35-40 కంటే ఎక్కువ వాల్యూమ్స్ లో, దాని యొక్క రీసెర్చ్ చేసిన ముహఖ్ఖిఖీన్ (مُحَقِّقِينَ) దానిని బలమైనదిగానే చెప్పారు. ఆ హదీస్ కొంచెం పొడుగ్గా ఉంది, సారాంశం చెబుతున్నాను:
ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో నాకు ఏమైనా సూరా నేర్పండి అని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ సూరాలు అయితే అలిఫ్ లామ్ రా (الر) తో స్టార్ట్ అవుతాయో, ప్రారంభం అవుతాయో, అవి నీవు నేర్చుకో, చదువు. ఆ మనిషి చెప్పాడు, ప్రవక్తా, నన్ను మీరు చూస్తూనే ఉన్నారు, ఎంత వయసు పైబడ్డాను, మరియు నా యొక్క మనసు కూడా, నా హృదయం కూడా అంతగా విషయాన్ని గ్రహించే స్థితిలో ఇప్పుడు లేదు, మరి నా నాలుక కూడా అంత తిరగదు. అయితే ప్రవక్త చెప్పారు, హా మీమ్ (حم) అన్న పదం అక్షరాలతో మొదలయ్యే సూరాలు నేర్చుకో, చదువు. అతడు మళ్ళీ అదే రిపీట్ చేశాడు. మూడోసారి ప్రవక్త చెప్పారు, సరే మంచిది, సబ్బహ, యుసబ్బిహు (سَبَّحَ، يُسَبِّحُ) అన్నటువంటి పదాలతో స్టార్ట్ అయ్యే సూరాలు నేర్చుకో, చదువు. ఆ మనిషి మళ్ళీ అదే మాటను రిపీట్ చేశాడు. అప్పుడు ప్రవక్త చెప్పారు, నీవు ఒక జామిఅ (جَامِعَةٌ) సూరా చదువుకో, నేర్చుకో, గుర్తుంచుకో. జామిఅ అని ఎప్పుడైతే ఈ పదం వస్తుందో, సూరాల విషయంలో ఏదైనా విషయం చెప్పడానికి, అందులో అన్ని రకాల విషయాల గురించి బోధించబడింది అన్నటువంటి భావం కూడా వస్తుంది. అదేమిటి సూరా అంటే, ఇదా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా.
ఆ మనిషి చాలా సంతోషంగా ప్రవక్త వద్ద నుండి తిరిగి వెళ్తూ, అల్లాహ్ యే సత్యంతో మిమ్మల్ని పంపాడో ఆ అల్లాహ్ యొక్క సాక్ష్యంతో చెబుతున్నాను, తప్పకుండా ఈ సూరాను నేను నేర్చుకుంటాను, నేను ఇంతకంటే ఎక్కువగా బహుశా నేర్చుకోలేకపోతాను కావచ్చు కానీ దీనిని అయితే తప్పకుండా నేర్చుకుంటాను అని వెనుతిరిగి పోయాడు అక్కడి నుండి. అతడు వెళ్తున్నది చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, “ఇతడు సాఫల్యం పొందాడు, ఇతడు విజయం పొందాడు“.
సోదర మహాశయులారా! గమనిస్తున్నారా? ఇక మీలో ఎవరెవరికైతే ఈ సూరా రాదో, లేక ఈ సూరా యొక్క భావాన్ని ఇంతవరకు అర్థం చేసుకొని ప్రయత్నం చేయలేదో, ఇక శ్రద్ధగా వినండి, ఆయత్ యొక్క వ్యాఖ్యానాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ ఈ హదీస్ మరియు ఇంతకుముందు తెలుసుకున్న హదీసుల ద్వారా దీని యొక్క ప్రాముఖ్యతను గ్రహించండి. మరియు ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి ఈ సూరా ఖురాన్ లోని సగం సూరా, ఈ సూరా ఖురాన్ లోని నాలుగో వంతుకు సమానం, కానీ అలాంటి హదీసులు సహీ లేవు అని ఎందరో ధర్మవేత్తలు చెప్పి ఉన్నారు.
పరలోక విశ్వాసాన్ని పెంచే సూరా
సోదర మహాశయులారా! ఈ సూరాలో పరలోకం పట్ల మన యొక్క విశ్వాసం పెరిగే రీతిలో, పరలోకానికి సంబంధించిన రెండు సందర్భాలను ప్రస్తావించడం జరిగింది. ఒకటి, మొదటి శంఖు ఊదబడినప్పుడు ఈ విశ్వం అంతా చెల్లాచెదురై నాశనమవుతున్న సందర్భాన్ని, మరొకటి రెండవ శంఖు ఊదబడిన తర్వాత ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తారు, గమ్యస్థానాలు ఏమవుతాయి, పరిస్థితి ఏముంటుంది దాని గురించి చెప్పడం జరిగింది.
సోదర మహాశయులారా! ఇక్కడ మీరు చూస్తున్నట్లు, ఇదా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా. జుల్జిలత్ అని క్రియ రూపంలో ఉన్న ఒక పదాన్ని చెప్పిన వెంటనే మళ్ళీ జిల్జాలహా అని ఫార్మాట్ చేంజ్ చేసి మస్దర్ రూపంలో తీసుకువచ్చి, అల్లాహ్ త’ఆలా చెప్పదలచినది ఏమిటంటే, ఈ ప్రళయ సమయాన ఏ భూకంపం ఏర్పడుతుందో, ఈ మొత్తం భూమిలో ఏ ప్రకంపనలు స్టార్ట్ అవుతాయో, అవి ఏమో చిన్నవి కావు, చాలా భయంకరమైనవి.
గమనించండి ఒక్కసారి మీరు, ఎక్కడో ఇండోనేషియాకు ఎంతో దూరంలో, అది కూడా సముద్రం లోపలని భూమిలో ప్రకంపనలు మొదలౌతే, వాటి యొక్క ప్రభావమే కాదు, నష్టం వేలాది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మన భారతదేశానికి కూడా చేరుకొని, సునామీ అన్న పేరుతో ఈ రోజు కూడా మర్చిపోని స్థితిలో ఉన్నాము కదా. అయితే అది సునామీ అన్నటువంటి పేరు ఏదైతే ఉందో, కేవలం సముద్రాల, సముద్రం యొక్క అలలు, కెరటాలు పెరిగి ఏదో నష్టం జరిగింది కాదు కదా. ఎక్కడ ఇండోనేషియా, ఎక్కడ సముద్రం లోపలి భాగంలో సంభవించిన ప్రకంపన, భూకంపం, అక్కడ భూమి దద్దరిల్లింది. ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో దాని నష్టం ఇంతా అంతా కాదు, కోట్ల కోట్లలో జరిగింది, ప్రాణాలు పోయాయి, ప్రాణ నష్టంతో పాటు ధన నష్టం కూడా జరిగింది. సోదర మహాశయులారా! ఒక్కసారి ఒక్కచోట వచ్చిన ఈ భూకంపం ఎంత దూరం నష్టం చేకూర్చింది, ఇక ప్రళయదినాన్ని గుర్తుంచుకోండి, గుర్తు తెచ్చుకోండి, ఈ మొత్తం భూమిలో ఎక్కడా కూడా ఖాళీ లేకుండా అంతటా ఈ భూకంపం వచ్చినప్పుడు పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో ఆలోచించగలమా మనం?
ఎక్కడైనా ఒకచోట భూకంపం వస్తుంది అంటే రాని చోటకు ప్రజలు పరిగెత్తుతారు. కదా? మరి ఆ రోజు పరిగెత్తడానికి ఎక్కడ స్థలం ఉన్నది? ఎక్కడ స్థలం ఉన్నది? అందుకొరకు సోదర మహాశయులారా! ఖురాన్ ఆయతులను గ్రహించి, గమనించి మన జీవితంలో మార్పు తెచ్చుకునే మనం ప్రయత్నం చేయాలి. లేదా అంటే మన శక్తి ఏం శక్తి? మనం ఏం చేయగలుగుతాము? ఎలాంటి విపత్తులు మనం అడ్డుకోగలుగుతాము?
ఆ రోజు, వ అఖ్రజతిల్ అర్దు అస్ఖాలహా. భూమి తన యొక్క బరువులన్నింటినీ. ఇక్కడ బరువులు అంటే ఒకటి కాదు రెండు కాదు, అనేక విషయాల ప్రస్తావన ఉంది. ఒకటి, ఇక్కడ ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని చివరి మానవుని వరకు ఎవరు ఎక్కడ ఎలా చనిపోయారో, వారిని కాల్చడం జరిగినా, వారిని పూడ్చడం జరిగినా, వారు ఏదైనా జంతువుకి ఆహుతి అయిపోయినా, ఏదైనా అగ్నికి ఆహుతి అయిపోయినా, ఏదైనా జంతు మృగ జీవికి ఒక నివాలా అయిపోయినా, ఏ పరిస్థితిలో చనిపోయినా వారిని సమాధి చేయబడినా, చేయబడకపోయినా అంతా కూడా తిరిగి వచ్చేది మట్టి వైపునకే. 77వ సూరా సూరతుల్ ముర్సలాత్ లో వచ్చిన ఒక ఆయత్ ను గమనించండి,
أَلَمْ نَجْعَلِ الْأَرْضَ كِفَاتًا أَحْيَاءً وَأَمْوَاتًا (అలం నజ్అలిల్ అర్ద కిఫాతా అహ్యాఅవ్ వ అమ్ వాతా.) మేము ఈ భూమిని వారి యొక్క జీవుల కొరకు మరియు చనిపోయిన వారి కొరకు అందరి కొరకు సరిపోయేదిగా చేసి ఉంచాము.
గమనించండి, ఈ ఆయత్ లో ఇంకా వేరే ఎన్నో బోధనలు ఉన్నాయి వేరే సందర్భంలో. కానీ చెప్పే ఉద్దేశ్యం ఏమిటి, తిరస్కరించిన వారైనా, నమ్మిన వారైనా, విశ్వాసులైనా, అవిశ్వాసులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా, అందరూ కూడా ఈ భూమిలోకి ఏదైతే పోయారో ఏ రీతిలోనైనా వెలికి వస్తారు. తప్పకుండా బయటికి వస్తారు. సూరతుల్ ఇన్షికాఖ్ (سُورَةُ الْإِنْشِقَاقِ) లో చదవండి, ముతఫ్ఫిఫీన్ (مُطَفِّفِينَ) తర్వాత సూరత్,
وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ (వ అల్ఖత్ మా ఫీహా వ తఖల్లత్.) ఇక బరువులన్నింటినీ తీసివేస్తుంది బయటికి అని రెండవ భావం, ఈ భూమిలో ఎక్కడెక్కడ ఏ ఖజానాలు ఉన్నాయో, ఏ కోశాగారాలు ఉన్నాయో, ఏ ఏ రకమైన ధాతువులు ఉన్నాయో, వెండి బంగారం రూపులోనైనా, ఇంకా వేరే ఏ రీతిలోనైనా అంతా కూడా బయటికి వచ్చి పడుతుంది. మనిషి ఎటు నడిచినా గానీ బంగారం, వెండి అంతకంటే ఇంకా విలువైనది వేరే ఎంతో సామాగ్రి అతను కళ్ళతో చూస్తాడు. సహీ ముస్లిం లోని ఒక హదీస్ శ్రద్ధగా వినండి, అల్లాహు అక్బర్.
تَقِيءُ الْأَرْضُ أَفْلَاذَ كَبِدِهَا أَمْثَالَ الْأُسْطُوَانِ مِنَ الذَّهَبِ وَالْفِضَّةِ (తఫిల్ అర్దు అఫ్లాద కబిదిహా అమ్సాలల్ ఉస్తువాన్ మిన దహబి వల్ ఫిద్దా.) ప్రళయదినాన ఈ భూమి తనలో ఉన్నటువంటి ఖజానాలన్నిటినీ బయటికి పడేస్తుంది.పెద్ద పెద్ద గుట్టలు, పర్వతాల మాదిరిగా మనిషి కళ్ళ ముందు వెండి బంగారాలు పడి ఉంటాయి.
అప్పుడు ఒక హంతకుడు వస్తాడు, అయ్యో, ఈ బంగారం వెండి కొరకే కదా నేను ఫలానా వ్యక్తిని చంపి ఈ ధన ఆశలో ఒకరి ప్రాణం తీసుకున్నాను, ఇప్పుడు ఇంతగా నా కళ్ళ ముందు ఉంది కానీ నాకు ఏ ప్రయోజనం చేకూర్చదు ఇది, దీనిని తీసుకొని ఏ లాభం పొందలేను. మరొక వ్యక్తి వస్తాడు, అయ్యో, నేను ఈ డబ్బు ధన ఆశలో బంధుత్వాలను తెంచాను, నా యొక్క సంబంధాలను పాడు చేసుకున్నాను, నేను ఈ యొక్క డబ్బు ధన ఆశలో ఎందరి నా దగ్గర వారిని దూరం చేసుకున్నాను, అయ్యో అని వాపోతాడు. కానీ అది అతనికి ఏ ప్రయోజనం చేకూర్చదు. దొంగ వస్తాడు, అతడు ఇదంతా చూసి, అయ్యో, దీని గురించేనా నా యొక్క చేతులు నరికి వేయబడినవి, ఈ రోజు తీసుకుందాం అంటే కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తర్వాత వారి కళ్ళ ముందు ఉంటుంది కానీ ఎవరు దానిని ముట్టరు, ఏమీ తీసుకోలేరు.
ఇదంతా కూడా ఇంత స్పష్టంగా వివరంగా మనకు చెప్పబడినప్పుడు, ఈ రోజుల్లో మనం నా తాత భూమి నా అయ్యకు దొరకలేదు, ఇక ఇప్పుడు నేను ఇంత అధికారంలో వచ్చిన కదా, నా చిన్నాయనలకు, నా పెదనాయనలకు అందరికీ ఇక నేను జైల్లో వేస్తాను, వారి సంతానాలనే వేస్తాను, వారి యొక్క వంశమే గుర్తుంచుకోవాలి అన్నటువంటి పన్నాగలు పన్ని, ఏ ఏ ప్రయత్నాలు చేస్తారో, దౌర్జన్యాలు చేసి ఒకరి భూమిని ఏదైతే ఆక్రమించుకుంటారో, ఏ ఏ రీతిలో చివరికి ఒక మాట ఇక్కడ చెప్పవచ్చు కదా, కట్నకానుకల రూపంలో అమ్మాయిల తల్లిదండ్రులపై దౌర్జన్యాలు చేసి ఏ ఏ సొమ్ము లూటీ చేస్తున్నారో, ఈ సూరత్ యొక్క వ్యాఖ్యానంలో వచ్చిన హదీస్ ద్వారా గుణపాఠం నేర్చుకోవాలి.
భూమి తన బరువులన్నింటినీ తీసి బయట పడేసినప్పుడు, మనిషి, అయ్యో, అరె దీనికి ఏమైపోయింది, ఇది ఇలా ఎందుకు చేస్తుంది? అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. మనిషి ఇలా మొత్తుకుంటాడు కానీ ఏమీ లాభం.
మరొక వ్యాఖ్యానం, బరువులన్నీ తీసి బయట పడేసినప్పుడు అన్న దానికి ధర్మవేత్తలు, ఖురాన్ వ్యాఖ్యానకర్తలు తెలిపారు, అదేమిటంటే, ఆ రోజు మనిషి ఏ ఏ విషయాలను నమ్మకపోయేదో ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు, ఆ సత్యాలు వాస్తవాలన్నీ కూడా అతని కళ్ల ముందుకు వచ్చేస్తాయి. అప్పుడు అతను ఆ విషయాలన్నింటినీ, వేటినైతే ప్రవక్తలు, ప్రవక్తల యొక్క నాయబులు, వారి యొక్క మార్గంపై ఉన్నటువంటి దాయిలు, ప్రచారకులు ఏ సత్యాలు ఖురాన్ హదీస్ ఆధారంగా తెలిపినప్పటికీ తిరస్కరించేవారో, నమ్మకుండా ఉండేవారో వారికి ఆ వాస్తవాలన్నీ కూడా ముందుకు వచ్చేస్తాయి. సోదర మహాశయులారా! ఈ సందర్భంలో మనిషి చాలా బాధగా అంటాడు, అయ్యో ఇదేమైపోయింది, ఇది ఎలా ఎందుకు జరుగుతుంది, మరియు ఈ సందర్భం అనేది ఖురాన్ లో ఇంకా వేరే సూరాలలో కూడా చెప్పడం జరిగినది. ఉదాహరణకు సూరత్ యాసీన్ చదువుతారు కదా, ఎంత మన దౌర్భాగ్యం గమనించండి, సూర యాసీన్,
لِّيُنذِرَ مَن كَانَ حَيًّا (లియున్దిర మన్ కాన హయ్యా) బ్రతికి ఉన్న వారి కొరకు ఇదిగో హెచ్చరిక అని అల్లాహ్ అదే సూరాలో చెబుతున్నాడు.
బ్రతికి ఉన్న వారు చదివి గుణపాఠం నేర్చుకోవడం లేదు, చనిపోయిన వారి మీద చదువుతున్నారు, వారు వినడానికి కూడా ఏ శక్తి వారిలో లేదు. అదే సూరత్ యాసీన్ లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు,
هَٰذَا مَا وَعَدَ الرَّحْمَٰنُ وَصَدَقَ الْمُرْسَلُونَ (హాదా మా వఅదర్ రహ్మాను వ సదఖల్ ముర్సలూన్.) అప్పుడు వారి కళ్లు తెరిచినట్లు అవుతాయి, వారి కళ్ల మీద ఉన్నటువంటి ముసుగు తొలగిపోయినట్లు ఏర్పడుతుంది, అప్పుడు అంటారు అయ్యో, మమ్మల్ని మా సమాధుల నుండి ఎక్కడైతే హాయిగా పడుకొని ఉంటిమో, ఎవరు లేపేశారు మమ్మల్ని? రహ్మాన్ చేసిన వాగ్దానం ఇదే కదా అది. ప్రవక్తలు చెప్పుకుంటూ వచ్చినటువంటి విషయాలు ఇప్పుడు నిజంగానే జరుగుతున్నాయి, అవే కదా ఇవి. కానీ అప్పుడు మనిషి వాటన్నిటినీ సత్యంగా నమ్మితే ఏ లాభం ఉండదు.
భూమి తన సంగతులను వివరిస్తుంది
సోదర మహాశయులారా! ఇదా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా, ఇదా దీనిని అరబీ గ్రామర్ ప్రకారంగా ఒక షర్తియా పదం అంటారు, దాని యొక్క సమాధానం నాలుగో ఆయత్ లో అల్లాహ్ ఇస్తున్నాడు, యౌమఇదిన్ తుహద్దిసు అఖ్బారహా. అల్లాహు అక్బర్. ఆయత్ నెంబర్ రెండులో చూశారు మీరు, తన బరువులన్నింటినీ వెలికి తీస్తుంది అని.
ఇక ఆయత్ నెంబర్ నాలుగులో ఉన్న విచిత్రం గమనించండి, ఆ రోజు భూమి తన సంగతులన్నీ వివరిస్తుంది. ఏమిటి ఆ సంగతులు? ఏమిటి ఆ సంగతులు? అల్లాహు అక్బర్. అల్లాహ్ త’ఆలా మనిషిని పుట్టించినప్పటి నుండి కాదు అంతకు ముందు నుండి ఈ భూమి ఉంది. ప్రళయం వరకు ఎక్కడెక్కడ ఏమి జరిగినదో అదంతా కూడా ఈ భూమి అంతా వివరిస్తూ ఉంటుంది. అల్లాహు అక్బర్.
హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం వస్తుంది. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఈ సూరతుల్ జిల్జాల్ తిలావత్ చేశారు. సూరత్ జిల్జాల్ తిలావత్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ ఆయత్ నెంబర్ నాలుగు వరకు చేరుకున్నారో, మీకు తెలుసా దాని యొక్క సమాచారాలన్నీ కూడా ఏమిటి? మీకు తెలుసా దాని యొక్క సంగతులన్నీ ఏమిటి? అది ఏం వివరిస్తుంది? ఆ సమయంలో సహాబాలు సామాన్యంగా జవాబు ఇచ్చినట్లుగానే ఇచ్చారు, అల్లాహ్ మరియు ప్రవక్తకే తెలుసు. అప్పుడు ప్రవక్త తెలిపారు,
فَإِنَّ أَخْبَارَهَا أَنْ تَشْهَدَ عَلَى كُلِّ عَبْدٍ وَأَمَةٍ (ఫఇన్న అఖ్బారహా అన్ తష్హద అలా కుల్లి అబ్దివ్ వ అమతిన్.) ప్రతి మానవుడు పురుషుడు అయినా, స్త్రీ అయినా భూమిలోని ఏ చోట ఉండి ఏ పని చేశాడో దాని గురించి ఆ భూమి వివరిస్తుంది. ఫలానా వ్యక్తి ఇక్కడ ఉండి ఇలాంటి పని చేశాడు, ఇక్కడ ఉండి ఇలాంటి పని చేశాడు. అందుకొరకే రబీఆ ఉల్లేఖించిన ఒక ఉల్లేఖనంలో తబరానీ కబీర్ లో వచ్చింది,
تَحَفَّظُوا مِنَ الْأَرْضِ، فَإِنَّهَا أُمُّكُمْ (తహఫ్ఫదూ మినల్ అర్ద్, ఫఇన్నహా ఉమ్ముకుమ్.) మీరు చాలా జాగ్రత్తగా ఉండి మీ యొక్క ఈ భూమి నుండి.ఎందుకంటే ఇది మీ యొక్క తల్లి లాంటిది. మీరు ఈ భూమిపై నివసిస్తున్నారు, దీని లోకే వెళ్ళేవారు ఉన్నారు.
وَإِنَّهُ لَيْسَ مِنْ أَحَدٍ عَامِلٌ عَلَيْهَا خَيْرًا أَوْ شَرًّا إِلَّا وَهِيَ مُخْبِرَةٌ بِهِ (వఇన్నహూ లైస మిన్ అహదిన్ ఫాయిలున్ అలైహా ఖైరన్ అవ్ షర్రన్ ఇల్లా వహియ ముఖ్బిరా.) గుర్తుంచుకోండి, గుర్తుంచుకోండి, ఈ భూమి దీనిపై మీరు ఎక్కడ ఉండి ఏ పని చేసినా, మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా ఆ భూమి రేపటి రోజు తప్పకుండా చెప్పనున్నది.
ఈ రెండు హదీసులు ప్రామాణికతలో కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ, ఒకటి మరొకటికి మంచి సపోర్ట్ ఇస్తుంది అని ధర్మవేత్తలు అంటారు. అందుకొరకే వీటిని ప్రస్తావించడం జరిగింది.
సోదర మహాశయులారా! ఇక్కడ మనం భయపడవలసిన విషయం ఏమిటంటే, ఈ భూమిలోని ఏ చోట ఉండి మనం ఏ పని చేస్తున్నామో, అది మన గురించి సాక్ష్యం పలుకుతుంది. వేరే కొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది, హజరత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా, ఇంకా వేరే సహాబాల ద్వారా రుజువైనటువంటి కొన్ని హదీసుల ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే, మనిషి ఎప్పుడూ కూడా ఏ చిన్న సత్కార్యాన్ని విలువ లేకుండా భావించకూడదు. ఇది ఏమవుసరం అన్నట్లుగా భావించకూడదు. అలాగే ఏ పెద్ద సత్కార్యాన్ని కూడా చేయడంలో వెనక ఉండకూడదు. అలాగే ఏ పాప కార్యం పట్ల కూడా ఇది ఎంత నష్టం చేకూరుస్తుంది అన్నటువంటి ధోరణిలో ఉండకూడదు.
ఈ ఆయతుల ద్వారా మనకు బోధపడుతుంది, మనం ఏ సత్కార్యాలు చేసినా, ఏ పాప కార్యాలు చేసినా వాటి గురించి సాక్ష్యాధారాలు తయారవుతూ పోతూ ఉన్నాయి. ఆ రోజు మనం మన నోటితో ఏ విషయాన్ని తిరస్కరించినా, స్వయం మన యొక్క శరీరం నుండే మనకు దానికి వ్యతిరేకంగా సాక్ష్యాలు వచ్చేస్తాయి. అందుకొరకు అల్లాహ్ తో భయపడుతూ ఉండాలి.
మరియు ఆ తర్వాత ఆయత్ నెంబర్ ఆరులో గమనించండి, ఆయత్ నెంబర్ ఐదులో, ఇదంతా కూడా అల్లాహ్ యొక్క అనుమతితో, అల్లాహ్ యొక్క ఆజ్ఞతోనే భూమి చేస్తుంది. గమనించండి, భూమి యొక్క సృష్టికర్త అల్లాహ్ మరియు అల్లాహ్ త’ఆలా ఆజ్ఞ ప్రకారమే అది మసులుకుంటుంది. అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో ఒక చోట చెబుతున్నాడు, భూమి మరియు ఆకాశం ఈ రెండిటికీ అల్లాహ్ త’ఆలా మీకు ఇష్టమైనా లేకపోయినా మీరు విధేయులుగానే రావాలి అని అంటే వారు,
أَتَيْنَا طَائِعِينَ (అతైనా తాయిఈన్) మేము ఓ అల్లాహ్ నీకు విధేయులుగా హాజరయ్యాము అని చెప్పారు.
ఖురాన్ లోని ఆయత్ భావం. ఇంతటి విధేయత ఈ భూమి ఆకాశాలు పాటిస్తూ, ఎక్కడ ఏం మనం చేశామో అవన్నీ వివరిస్తున్నప్పుడు, మనం ఇంకా ఎంత అశ్రద్ధగా ఉంటాము? ఇంకా ఎన్ని రోజులు ఈ అశ్రద్ధ, ఏమరుపాటులో ఉంటాము?
మన కర్మలు మనకు చూపబడతాయి
ఆ తర్వాత అల్లాహ్ త’ఆలా ఆయత్ నెంబర్ ఆరులో తెలియజేస్తున్నాడు,
يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ (యౌమఇదిన్ యస్దురున్నాసు అష్ తాతల్ లియురవ్ అఅమాలహుమ్) “ఆ రోజు జనులు – వారి కర్మలు వారికి చూపబడేందుకుగాను – వేర్వేరు బృందాలుగా తరలి వస్తారు.“
యస్దుర్ (يَصْدُرُ) అని ఏదైతే ఇక్కడ చెప్పడం జరిగిందో, తరలి రావడం, తిరిగి రావడం. సమాధుల నుండి మైదానే మెహషర్ లో లెక్క తీర్పు గురించి మరియు అక్కడ ఎన్నో సంఘటనలు, ఎన్నో ఘట్టాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ రెండవ తిరుగు ఏ గమ్యస్థానం ఉంటుందో ఎవరికి, స్వర్గం నరకం రూపంలో అటువైపున అని. మరియు ఇక్కడ ఏదైతే అష్ తాతా (أَشْتَاتًا), వేరు వేరు బృందాలుగా అని చెప్పడం జరిగిందో దానికి ఖురాన్ లోని ఇంకా ఎన్నో ఆయతులు కూడా సాక్ష్యాధారంగా ఉన్నాయి. దీని యొక్క భావంలో ఎన్నో విషయాలు వస్తాయి. ఒకటి ఏమిటి, అవిశ్వాసులు ఒక బృందం, విశ్వాసులు ఒక బృందం. ఈ విధంగా కూడా చెప్పడం జరిగింది. మరొక భావం ఇక్కడ, ప్రతి ప్రవక్త వారి యొక్క అనుచరుల ప్రకారంగా వేరు వేరు బృందాలు. మరొక భావం ఇందులో, ప్రతి ప్రవక్తతో వారిలో కొందరు విశ్వసించేవారు, మరికొందరు విశ్వసించని వారు. ఈ విధంగా ఖురాన్ లో ఎన్నో సందర్భాల్లో మనకు ఈ విషయాలు తెలుస్తాయి,
وَيَوْمَ نَحْشُرُ مِن كُلِّ أُمَّةٍ فَوْجًا مِّمَّن يُكَذِّبُ بِآيَاتِنَا فَهُمْ يُوزَعُونَ (వయౌమ నహ్షురు మిన్ కుల్లి ఉమ్మతిన్ ఫౌజన్ మిమ్మన్ యుకద్దిబు బి ఆయాతినా ఫహుమ్ యూజఊన్) “ఆ రోజు మేము ప్రతి మానవ సమాజం నుంచి, మా ఆయతులను ధిక్కరించే ఒక్కొక్క సమూహాన్ని చుట్టుముట్టి మరీ తెస్తాము. ఆ తరువాత వారంతా వర్గీకరించబడతారు.” (27:83)
సూరతున్ నహల్ లో, అలాగే ఇంకా వేరే సూరాలలో కూడా ఈ భావం ఉంది. కానీ మళ్ళీ ఇక్కడ మరోసారి మీరు గమనించండి, లియురవ్ అఅమాలహుమ్. ఈ పదం, ఈ పదం ఏదైతే లియురవ్ అఅమాలహుమ్ అని ఉందో మనల్ని కంపించి వేయాలి, మనలో భయాన్ని పుట్టించాలి. ఎందుకు? ఏం చెప్పడం జరుగుతుంది, వారి యొక్క కర్మలు వారికి చూపించడానికి. అల్లాహు అక్బర్.
సోదర మహాశయులారా! ఎలాగైతే కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా సీక్రెట్ సీసీటీవీలు, కెమెరాలు ఉంటాయి. ఇక్కడ మనల్ని ఎవరు చూడటం లేదు అని ఏదో నేరానికి పాల్పడతాము. కానీ పట్టుబడిన తర్వాత ఎప్పుడైతే ఆ సీసీ ఫొటేజ్ లను మన ముందు స్పష్టంగా ఒక స్క్రీన్ లో చూపించడం జరుగుతుందో, మనం ఆ ప్రాంతంలో ఎటు నుండి వస్తున్నాము, ఎలా వస్తున్నాము, ఏ ఏ ఆయుధాలతో, ఏ ఏ సాధనాలతో వస్తున్నాము, ఎలా లూటీ, దోపిడీ ఇంకా వేరే నేరాలకు పాల్పడుతున్నాము అదంతా మన కళ్ళారా మనం చూసుకుంటూ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఈ లోకంలో ఒక్కసారి గమనించండి. ఇది ఏదో ఒక్కసారి చేసినటువంటి పొరపాటు, అది ఏదో రికార్డ్ అయిపోయింది, కానీ దాని గురించి విని మనం కొన్ని సందర్భాల్లో సిగ్గుకు గురి అవుతాము, ఎంతో సందర్భాల్లో ఛీ ఇలాంటి పనులు ఎందుకు చేయాలి అని అనుకుంటాము.
కానీ ఇక్కడ గమనించండి, అటువైపున భూమి సాక్ష్యం పలుకుతుంది, భూమి అంతా కూడా తెలియజేస్తుంది, మళ్ళీ అల్లాహ్ వద్దకు హాజరవుతున్నాము, అక్కడ ఈ ఫొటో, సీసీటీవీలలో మొత్తం రికార్డ్ అయినటువంటి మన పూర్తి జీవితం యొక్క ఫ్లాష్ బ్యాక్ రికార్డ్ వీడియో మొత్తం బయటికి వస్తుంది, అప్పుడు మనం ఎక్కడ తల దాచుకుంటాము? అప్పుడు మనం ఎక్కడ అల్లాహ్ యొక్క శిక్షల నుండి పారిపోతాము? ఏదైనా అవకాశం ఉందా?
లియురవ్ అఅమాలహుమ్, వారికి వారి కర్మలన్నీ చూపడం జరుగుతుంది అంటే దైవదూతలు రాసుకున్నటువంటి ఆ దఫ్తర్లు, రిజిస్టర్లు ఓపెన్ చేసి చూపిస్తారు అనే ఒక్కటే భావంలో మీరు ఉండకండి. ఆ చూపించడం అనేది మనకు, మనం ఇక్కడ లోకంలో ఏ రీతిలో మనం మసులుకుంటూ ఉంటామో ఆ ప్రకారంగా అక్కడ మనతో పరిస్థితి జరుగుతుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం చేసిన తప్పులను ఒప్పుకొని అల్లాహ్ తో ఆ సమయంలో కూడా ఒకవేళ ఇహలోకంలో విశ్వాసంగా ఉండి కొన్ని పొరపాట్లు జరిగితే, తౌహీద్ పై ఉండి వేరే కొన్ని పాపాలు జరిగితే బహుశా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనల్ని మన్నించేస్తాడు అన్నటువంటి ఆశ ఉంచవచ్చు కూడా. అవును, ఒక హదీస్ ద్వారా కూడా ఈ భావం మనకు కనబడుతుంది. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పి ఉన్నారు కూడా, మీలో ప్రతి ఒక్కడు ఎన్ని పాపాలు చేసినా గానీ విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవాలి, తౌబా ఇస్తిగ్ఫార్ లాంటివి చేసుకుంటూ ఉండాలి, కానీ దానితో పాటు ఏంటి, ఏ పాపం జరిగినప్పటికీ అల్లాహ్ పట్ల సదుద్దేశంతో ఉండాలి. అల్లాహ్ నా విశ్వాసాన్ని స్వీకరించి, నా పుణ్యాలను స్వీకరించి, నా పాపాలను మన్నిస్తాడు అని. కానీ ఆ ఉద్దేశం ప్రకారంగా తన యొక్క విశ్వాసం, ఆచరణ కూడా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ అలా ప్రయత్నం చేయకుండా కేవలం బూటకపు అబద్ధపు ఆశలను పెట్టుకొని మనం చెడును చెడుగా భావించి ఛీ అన్నట్లుగా మన మనసులో లేకుంటే ఈ పశ్చాత్తాపం, ఈ ఆశ అనేది మనకు ఏ ప్రయోజనం చేకూర్చదు.
ఆ తర్వాత ఆయత్ నెంబర్ ఏడు మరియు ఎనిమిది, ఇది కూడా చాలా భయంకరమైన విషయం ఇందులో ఉంది. ఏమిటంటే, ఎక్కడ ఏ లోకంలో ఏ చాటున, ఏ గుహలో, ఏ రీతిలో ఎక్కడ ఉండి కూడా రవ్వంత, అణువంత, ఏ చిన్న పుణ్య కార్యం చేసినా అది మనం చూసుకుంటాము. మరియు ఇహలోకంలో ఏ చెడు చేసినా దాన్ని కూడా పరలోకంలో చూసుకుంటాము. ఈ భావంలో కూడా ఖురాన్ లో ఎన్నో ఆయతులు ఉన్నాయి,
وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا ۗ وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا (వవజదూ మా అమిలూ హాదిరా వలా యద్లిము రబ్బుక అహదా.) అల్లాహ్ త’ఆలా మీరు చేసిన పూర్తి మీ యొక్క జీవితమంతా ఏ ఏ కార్యాల్లో గడిసిందో దాన్నంతా కూడా హాజరు పరుస్తాడు, అల్లాహ్ ఎవరిపైనా కూడా ఏ కొంచెం అన్యాయం చేయడు.
సహీ బుఖారీలో వచ్చినటువంటి ఒక ఉల్లేఖనం ద్వారా మనం చాలా భయకంపితులైపోవాలి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో విషయాలు తెలియజేస్తూ, గుర్రం గురించి నేను నిన్నటి క్లాస్ లో ఏదైతే ఒక హదీస్ సంక్షిప్త భావం చెప్పానో అది ఒకరి కొరకు అజ్ర్ (أَجْرٌ) ఉంటే మరొకరి కొరకు సిత్ర్ (سِتْرٌ) మరియు ఇంకో వారికి అది పాపంగా ఉంటుంది, మూడు రకాల విషయాలు, రకాల గుర్రాలు ఉన్నాయి అని. ఆ హదీస్ వివరించిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఒక సహాబీ అడిగారు, ప్రవక్తా, ఈ గుర్రం గురించి అయితే బాగానే చెప్పారు, మరి ఈ గాడిదల గురించి ఏంటి ప్రస్తావన అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏంటో గమనించండి,
مَا أُنْزِلَ فِيهَا شَيْءٌ إِلَّا هَذِهِ الْآيَةُ الْفَاذَّةُ الْجَامِعَةُ (మా ఉన్జిల ఫీహా షైఅన్ ఇల్లా హాదిహిల్ ఆయతిల్ ఫాద్దతిల్ జామిఆ.) మీరు అడిగిన ప్రశ్నకు నా వైపు నుండి నాకు ఏ సమాధానం లేదు, అల్లాహ్ ఏదైతే అవతరింపజేస్తూ ఉంటాడో, వహీ చేస్తూ ఉంటాడో దాని ప్రకారంగా నేను మీకు చెబుతూ ఉంటాను, ఇప్పుడు మీరు దీని గురించి ఏదైతే అడిగారో ఇక్కడ గుర్తుంచుకోండి, ప్రత్యేకంగా దీని గురించి నాకైతే ఏమీ ఆదేశం రాలేదు, ఏ వహీ రాలేదు, కానీ ఒక జామిఅ ఆయత్, ఒక విచిత్రమైన, ఒక యునీక్ లాంటి ఆయత్ అది మీరు గుర్తుంచుకోండి,
فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ (ఫమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరయ్యరహ్, వమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ షర్రయ్యరహ్) “కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. మరెవడు అణుమాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు.”
సోదర మహాశయులారా! ఫరజ్దఖ్ అని ఒక చాలా ప్రఖ్యాతి గాంచిన కవి. అయితే ఆ కవి యొక్క బాబాయి ప్రవక్త సల్లల్లాهُ అలైహి వసల్లం వద్దకు వచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని ముందు ఈ సూరా చదువుతూ, ఫమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరయ్యరహ్, వమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ షర్రయ్యరహ్ అని తిలావత్ చేశారు. ఆ మనిషి, అతడు కూడా అరబ్, అరబీ భాష పట్ల మంచి అవగాహన. విన్న వెంటనే ఏమన్నాడు, చాలు చాలు చాలు, ఇక మీరు ఆపండి. ఈ విషయమే నాకు సరిపోయింది, మనం గుణపాఠం తెచ్చుకోవడానికి, జీవితంలో ఒక మార్పు తెచ్చుకోవడానికి, ఇక బహుశా దీని తర్వాత ఏది వినే అవసరం ఉండదు అని చెప్పుకొచ్చాడు.
అంటే ఏంటి, మనం ఏదైతే ఇహలోకంలో పుణ్యం చేస్తామో, పరలోకంలో దాని గురించి మనకు తప్పకుండా ప్రతిఫలం లభించడమే కాదు, ఆ పుణ్య కార్యాన్ని కూడా మనం చూస్తాము వీడియో రూపంలో. మరియు ఎక్కడైతే ఏ పాపాలు చేస్తామో వాటిని కూడా వీడియో రూపంలో చూస్తాము. అలాంటి సందర్భంలో మన పరిస్థితి ఏముంటుందో, భయపడాలి అల్లాహ్ తో.
అందుకొరకే సోదర మహాశయులారా! సమయం కూడా కావస్తుంది గనుక, ఈ విధంగా హదీస్ గ్రంథాల్లో ఒక సూరాకు సంబంధించి, ఆ సూరాలోని కొన్ని ఆయతులకు సంబంధించి ఏ ఏ హదీసులు వస్తాయో, వాటిలో ఏ ఏ గుణపాఠాలు ఉంటాయో వాటి ద్వారా మనం మంచి బోధ నేర్చుకొని మన జీవితంలో మార్పు తెచ్చుకోవాలి. పరలోకం పట్ల విశ్వాసం మనది చాలా బలంగా ఉండాలి మరియు ఇహలోకంలోనే మనం మార్పు తెచ్చుకొని పుణ్యాల వైపునకు రావాలి లేదా అంటే చాలా నష్టంలో ఉంటాము.
అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఖురాన్ ను శ్రద్ధగా చదివి అర్థం చేసుకుంటూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక.
آمِينَ وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ. وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (ఆమీన్ వ ఆఖిరు దఅవాన అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 40 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ప్రళయం గురించి, ఆ రోజున మరణించిన వారు మళ్ళీ లేపబడడం గురించి, తీర్పుదినం గురించి, శిక్షా బహుమానాల గురించి బోధించింది. మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం అన్నది ఒక భ్రమ ఎంతమాత్రం కాదని, అనివార్యంగా చోటుచేసుకునే సంఘటన అనీ ఈ సూరా హెచ్చరించింది. ప్రళయం రోజు భయాందోళనలతో అందరూ కళ్ళు తేలవేస్తారు. చంద్రుడు కాంతివిహీనుడై పోతాడు. సూర్యచంద్రులు తమ కాంతిని కోల్పోతారు. తీర్పుదినాన ప్రతి ఒక్కరికి వారి కర్మల గురించి తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి నాలుక, కాళ్ళుచేతులు అవి చేసిన పనులకు సాక్ష్యం చెబుతాయి. మనిషిని ఒక వీర్యపు బిందువుతో పుట్టించిన అల్లాహ్ చనిపోయిన తర్వాత మళ్ళీ లేపి నిలబెట్టే శక్తిసామర్ధ్యాలు ఉన్నవాడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net