ప్రళయ దినం మరియు దాని సూచనలు [ఆడియో, టెక్స్ట్]

ఇక్కడ వినండి లేదా ఆడియో డౌన్లోడ్ చేసుకోండి [37నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ప్రళయ దినం యొక్క భయంకరమైన స్వభావం, దాని అనివార్యత మరియు దాని రాకకు ముందు అల్లాహ్ తన కారుణ్యంతో పంపిన సూచనల గురించి వివరించబడింది. ఈ సూచనలు మూడు రకాలుగా విభజించబడ్డాయి: ఇప్పటికే జరిగిపోయినవి (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాక), ప్రస్తుతం జరుగుతూ పెరుగుతున్నవి (అజ్ఞానం మరియు అనైతికత పెరగడం), మరియు ప్రళయానికి అతి సమీపంలో సంభవించే పది పెద్ద సూచనలు. ముఖ్యంగా దజ్జాల్ యొక్క ఫితనా (సంక్షోభం) మరియు దాని నుండి రక్షణ పొందే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టబడింది. ఈ సూచనల గురించిన జ్ఞానం, విశ్వాసులు తమ విశ్వాసాన్ని పటిష్టం చేసుకోవడానికి, సత్కార్యాల వైపు పయనించడానికి మరియు చెడుకు దూరంగా ఉండటానికి ఒక హెచ్చరిక అని వక్త ఉద్బోధించారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

మా సోదరులారా! ప్రళయదినం మరియు దాని యొక్క సూచనల గురించి కొన్ని విషయాలు ఈ రోజు మనం ఇన్ షా అల్లాహ్ తెలుసుకుందాం.

ప్రళయదిన విషయం అనేది చాలా భయంకరమైనది. ఎంత భయంకరమైనదంటే దాన్ని మనం ఊహించలేము ఇప్పుడు. దాని గురించి అల్లాహ్ త’ఆలా సూరె హజ్ లో ఆరంభంలోనే ఒక ఆయత్ లో మూడు విషయాలు తెలిపాడు. ఏ రోజైతే ప్రళయం సంభవిస్తుందో, ఆ రోజు:

يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَى النَّاسَ سُكَارَىٰ وَمَا هُم بِسُكَارَىٰ وَلَٰكِنَّ عَذَابَ اللَّهِ شَدِيدٌ

ఆనాడు మీరు దాన్ని చూస్తారు… పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. గర్భవతుల గర్భాలూ పడిపోతాయి. ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్‌ (తరఫున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది. (22:2)

يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّآ اَرْضَعَتْ
(యౌమ తరౌనహా తద్’హలు కుల్లు ముర్దిఅతిన్ అమ్మా అర్దఅత్)
ఆ రోజు పాలు త్రాపించే తల్లి, పాలు త్రాగే తన పిల్లను మరిచిపోతుంది.

రెండో విషయం చెప్పాడు:

وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا
(వ తదఉ కుల్లు దాతి హమ్లిన్ హమ్లహా)
ప్రతి గర్భిణీ యొక్క గర్భం పడిపోతుంది

మూడో విషయం చెప్పాడు.

وَتَرَى النَّاسَ سُكَارٰى
(వ తరన్ నాస సుకారా)
జనులు ఆ రోజు, ప్రజలు ఆ రోజు మత్తులో ఉంటారు.

وَمَا هُمْ بِسُكَارٰى
(వమా హుమ్ బిసుకారా)
కాని నిజానికి వారు మత్తులో ఉండరు. (22:2)

ఆ మత్తులో ఉండడం అనేది ఏదో మత్తుపదార్థం సేవించినందుకు కాదు.

وَلٰكِنَّ عَذَابَ اللّٰهِ شَدِيْدٌ
(వలాకిన్న అదాబల్లాహి షదీద్)
ఆనాటి అల్లాహ్ యొక్క శిక్ష అనేది చాలా కఠినమైనది. అందుగురించి ప్రళయం సంభవించే రోజు ఇలాంటి పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటారు.

ఆ రోజు రాకముందే విశ్వాసులు సిద్ధమవడం, సత్కార్యాలు ముందుకు పంపుకోవడం, విశ్వాస మార్గాన్ని అవలంబించి ప్రజలందరూ కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ వైపునకు మరలడం తప్పనిసరి. అయితే ప్రళయం అనేది ఈ ప్రపంచమంతా, విశ్వమంతా నాశనమైన రోజు సంభవిస్తుంది. ఆ రోజు వరకు మనం బ్రతికి ఉంటామో లేదో తెలియదు. కానీ ఏ రోజైతే మనకు మన చావు వస్తుందో, ఆ రోజు మన ప్రళయం మనపై సంభవించినట్లే. మనం ఎప్పుడుచనిపోతామో, రేపో మాపో తెలుసా మనకు? తెలియదు. అయితే మనం, మన చావు వచ్చింది అంటే మన ప్రళయం వచ్చేసింది అన్నట్లే. ఆ ప్రళయం గురించి మనం వేచించి ఉండవలసిన అవసరం లేదు. అందుగురించే ఆ ప్రళయ విషయం వచ్చినప్పుడు మనలో ఒక భయం ఏర్పడినప్పుడు మనం సత్కార్యాల వైపునకు ముందుకు వెళ్ళాలి, విశ్వాస మార్గాన్ని బలంగా పట్టుకోవాలి. అప్పుడే మనకు ఇహలోకంతో పాటు పరలోకంలో కూడా మోక్షం అనేది ప్రాప్తమవుతుంది.

అయితే అల్లాహ్ యొక్క దయ మనపై చాలా ఉంది గనక, ఎల్లప్పుడూ మన మేలు కోరేవాడే గనక, ఆ ప్రళయానికి ముందు ఎన్నో సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు సంభవించినప్పుడల్లా మనిషి ప్రళయాన్ని గుర్తు చేసుకోవాలి. మరియు ఆ ప్రళయ రోజు, ప్రళయ దినాన తాను సాఫల్యం పొందిన వారిలో చేరకోవాలి అని తనకు తాను సిద్ధపడుటకు అల్లాహ్ త’ఆలా అలాంటి సూచనలు పంపిస్తూ ఉంటాడు.

ఖుర్ఆన్ లో అల్లాహ్ చెప్పాడు:

فَهَلْ يَنْظُرُوْنَ اِلَّا السَّاعَةَ اَنْ تَأْتِيَهُمْ بَغْتَةً ۚ فَقَدْ جَاۤءَ اَشْرَاطُهَا
(ఫహల్ యన్దురూన ఇల్లస్ సాఅత అన్ త’తియహుమ్ బగ్ తతన్, ఫఖద్ జా’అ అష్రాతుహా)
ఏమిటీ, ప్రళయ ఘడియ హటాత్తుగా తమపైకి రావాలని వారు ఎదురు చూస్తున్నారా? నిస్సందేహంగా దానికి సంబంధించిన సూచనలు (ఇప్పటికే) వచ్చేశాయి. (47:18)

ఏమిటి? ప్రళయం గురించి వారు వేచి చూస్తూ ఉన్నారా? అది ఎప్పుడైనా ముందు నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఏకాయెకిగా రావచ్చు. కానీ ఆ ప్రళయానికంటే ముందు దానికి సంబంధించిన సూచనలు వచ్చేసాయి.

اِقْتَرَبَتِ السَّاعَةُ وَانْشَقَّ الْقَمَرُ
(ఇఖ్ తరబతిస్ సాఅతు వన్ షఖ్ ఖల్ ఖమర్)
ప్రళయం సమీపించినది, చంద్రుడు రెండు ముక్కలయ్యాడు.(54:1)

ఇవన్నీ కూడా ప్రళయ సూచనల్లో.

అయితే సోదరులారా, ప్రళయం గురించి మనం సిద్ధపడడం, అది రాకముందే దాని గురించి మనం తయారీ చేయడం చాలా అవసరం. అయితే ప్రళయానికి ముందు ఏ సూచనలైతే రానున్నాయో, ఆ సూచనలు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతో వివరంగా మనకు తెలిపారు. దానికి సంబంధించిన హదీసులన్నీ ఏవైతే వచ్చాయో, ఆ హదీసులు, పండితులు ఆ సూచనలన్నిటినీ మూడు రకాలుగా విభజించారు.

ఒకటి, కొన్ని సూచనలు వచ్చేసాయి, సమాప్తమైపోయాయి. మరియు కొన్ని రెండో రకమైన సూచనలు, ఆ సూచనలు రావడం మొదలైంది, అది ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మూడో రకమైన సూచనలు ఏమిటంటే, ఆ మూడో రకమైన సూచనలు ప్రళయానికి మరీ దగ్గరగా వస్తాయి, అవి చాలా పెద్ద సూచనలు. అవి రావడం మొదలైంది అంటే ఒకటి వెనుక మరొకటి వస్తూనే పోతాయి. అందులో ఎలాంటి మధ్యలో గ్యాప్ అనేది ఉండదు.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా నియమింపబడి పంపబడడం. ప్రవక్తను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా పంపడం అనేది ప్రళయ సూచనల్లో ఒకటి అని కూడా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చావు, ఆయన ఈ లోకాన్ని వీడిపోవడం కూడా ప్రళయ సూచనల్లో ఒకటి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు:

بُعِثْتُ أَنَا وَالسَّاعَةُ كَهَاتَيْنِ
(బుఇస్తు అన వస్సాఅతు కహాతైన్)
నేను మరియు ప్రళయ ఘడియ ఈ రెండు వేళ్ళ వలే (దగ్గరగా) పంపబడ్డాము.

అంటే మా మధ్యలో ఎక్కువ సమయం లేదు అని భావం. కానీ ఆ సమయం అనేది మన అంచనా ప్రకారంగా కాదు, అల్లాహ్ యొక్క జ్ఞాన ప్రకారంగా.

ఉదాహరణకు, వాటి గురించి ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈ హదీస్ సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది. దాని కొంత భాగం బుఖారీలో కూడా ఉంది.

ఒకసారి జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇస్లాం అంటే ఏమిటి? ఈమాన్ అంటే ఏమిటి? మరియు ఇహ్సాన్ అంటే ఏమిటి? అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దానికి సమాధానం చెప్పారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత ప్రళయం ఎప్పుడు వస్తుంది అని అడిగారు. ప్రళయం ఎప్పుడు వస్తుందో అనేది నాకు తెలియదు అని ప్రవక్త గారు చెప్పారు. అయితే దాని యొక్క సూచనలు ఏవైనా చెప్పండి అని జిబ్రీల్ అడిగినప్పుడు, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు:

أَنْ تَلِدَ الْأَمَةُ رَبَّتَهَا
(అన్ తలిదల్ అమతు రబ్బతహా)
బానిస స్త్రీ తన యజమానురాలికి జన్మనివ్వడం.

మరియు రెండో సూచన ప్రవక్త వారు చెప్పారు, ఒంటిపై గుడ్డ లేనటువంటి వాళ్ళు, కాళ్ళల్లో చెప్పులు లేనటువంటి వాళ్ళు మరియు తిందామంటే టైం కు తిండి దొరకనటువంటి పేదవాళ్ళు, ఎంత ధనం వాళ్ళ చేతుల్లో వచ్చేస్తుందంటే, పెద్ద పెద్ద బిల్డింగులు వాళ్ళు కడతారు.

ఇంకా బుఖారీ ముస్లిం లో మరొక హదీస్ వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయానికి కంటే ముందు కొన్ని సూచనలు సంభవిస్తాయి. విద్య, ధర్మజ్ఞానం అనేది లేపబడుతుంది. అజ్ఞానం పెరిగిపోతుంది. ప్రజలు మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు సేవించడం అధికమైపోతుంది. మరియు వ్యభిచారం కూడా చాలా పెరిగిపోతుంది.

మరొక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయానికి ముందు కొన్ని సూచనలు ఉన్నాయి: అశ్లీలత అనేది ఎక్కువైపోతుంది. ప్రజలు తమ బంధుత్వాన్ని తెంచుకుంటూ ఉంటారు, కలుపుకోవడానికి బదులుగా. మరి ఎవరైతే అమానత్, ఏ విషయమైనా గానీ, నమ్మి ఒకరిని ఏదైనా అతని దగ్గర పెడితే, అలాంటి అమానతులు కాజేసుకునే వాళ్ళు అయిపోతారు. మరి ఎవరైతే మోసం చేసే వాళ్ళు ఉన్నారో, అమానత్ లో ఖియానత్ చేసే వారు ఉన్నారో, అలాంటి వారిని చాలా విశ్వసనీయులు, అమానతులు పాటించే వాళ్ళు అని భావించడం జరుగుతుంది.

ఈ విధంగా ఇంకా ఎన్నో సూచనలు హదీసులో వచ్చి ఉన్నాయి. ఒక సందర్భంలో ఒక గ్రామీణుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, “ప్రవక్తా, ప్రళయం ఎప్పుడు ఉన్నది? దానికి సూచనలు ఏమిటి?” అని అడిగాడు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయం, దానికి సూచన ఏమిటంటే, ఎప్పుడైతే అమానత్, అమానత్ గా ఉండకుండా దాన్ని కాజేసుకోవడం జరుగుతుందో, ఒకరిని విశ్వసనీయుడు, చాలా నమ్మకస్తుడు అని అతని వద్ద ఏదైనా మాట, ఏదైనా వస్తువు పెడితే దానిలో మోసం చేస్తాడో, అప్పుడు నీవు ప్రళయం వస్తుంది అని వేచించు. అయితే అమానత్ లో ఖియానత్ అనేది ఎలా జరుగుతుంది అని ఆ వ్యక్తి అడిగినప్పుడు, ఏ హోదా, ఏ పని, ఏ తగిన మనిషికి ఇవ్వాలో అలా కాకుండా, దానికి అర్హులు లేని వారికి ఇవ్వడం జరుగుతుందో అప్పుడు నీవు ప్రళయం గురించి వేచించు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.

ఈ విధంగా సోదరులారా, ఇక్కడ ఒక విషయం చాలా మనం శ్రద్ధగా మనం గమనించాలి. అదేమిటంటే, ఈ రోజుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే, ఇక ప్రవక్త చెప్పారు గనక, ప్రవక్త మాటల్లో ఎప్పుడూ కూడా అబద్ధం ఉండదు, చెప్పింది జరిగి తీరుతుంది అని ఈ రకంగా కేవలం మనం ఆలోచించి ఉండకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయానికి ముందే సంభవించే సూచనల గురించి మనకు తెలుపుతున్నారు అంటే ఇది కూడా స్వయంగా ఆయన అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త, అల్లాహ్ యొక్క సత్యమైన నిజమైన సందేశ దూత అని భావం. ఎందుకు? ఆయన ఏ మాట కూడా తన ఇష్ట ప్రకారంగా తన నోటితో చెప్పేవారు కాదు.

وَمَا يَنْطِقُ عَنِ الْهَوٰى ۗ‏ اِنْ هُوَ اِلَّا وَحْيٌ يُّوْحٰى
(వమా యన్తిఖు అనిల్ హవా. ఇన్ హువ ఇల్లా వహ్యుయ్యూహా)
అతను తన మనోవాంఛల ప్రకారం మాట్లాడడు. అది పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు. (53:3-4)

ఏదో ముందుకు జరగబోయే విషయాల గురించి ఏదైతే ప్రవక్త గారు చెప్తున్నారో, ఈ రోజుల్లో కొందరు అగోచర జ్ఞానం ఉన్నది, ఆ పండితుడు చాలా ఆరితేరినవాడు, అతను చాలా గొప్పవాడు అని ఏదో పంచాంగం చెప్పినట్లుగా కొన్ని విషయాలు తెలుపుతూ ఉంటారు. ఇలాంటి మోసపూరితమైన మాటలు, నవూదుబిల్లా అస్తగ్ఫిరుల్లా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పేవారు కాదు. అలాంటి విషయాలు ప్రవక్త చెప్పేవారు కాదు. సూర నజ్మ్ లో అల్లాహ్ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన తన కోరికతో ఏదీ మాట్లాడడు. అల్లాహ్ ప్రవక్త గారి గురించి చెప్తున్నాడు, ప్రవక్త వారు తమ కోరికతో, తమ ఇష్టం వచ్చినట్లు ఏదంటే అది మాట్లాడడు. అల్లాహ్ అతని వైపునకు ఏ వహీ పంపుతాడో, ఏ దివ్యవాణి పంపుతాడో, దాని ప్రకారమే ప్రవక్త అల్లాహ్ పంపినటువంటి విషయాల్ని ఇతరులకు తెలియజేస్తాడు.

అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఈ సూచనలు ఎందుకు తెలిపారు? ఇందులో మంచి విషయాలు ఏవైతే కరువవుతాయో, ఏ మంచి విషయాలలో మనం కొరత చూస్తామో, ఆ మంచి చేయడానికి మనం ముందుగా ఉండాలి. ఉదాహరణకు, ప్రళయానికి ముందు ధర్మ విద్య లేపబడుతుంది. అంటే ఏంటి? అది ఎక్కడో ఇట్లా పెట్టి ఉంటది ఎవడో వచ్చి తీసుకుంటాడు అట్లా భావం కాదు. దీనికి రెండు భావాలు ఉన్నాయి. ఒకటి, ధర్మ పండితులు ఎవరైతే ఉన్నారో, వారి చావు అనేది ఎక్కువైపోతుంది. రెండో భావం, ప్రత్యేకంగా ముస్లింలు మరియు ఇతరుల హృదయాల్లో నుండి ధర్మ జ్ఞానం అవలంబించాలి అన్నటువంటి ప్రేమ అనేది తగ్గిపోతుంది.

ఇది ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఏం చేయాలి? మనం ప్రయత్నం చేయాలి. ఇదిగో ఒక చిన్న ఉదాహరణ ఇవ్వాలా. ఇప్పుడు ఈ బండ ఎండల్లో 45-47 వరకు కూడా డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత చేరుకుంటుంది. అయినా గాని పని వదులుకుంటామా మనం? చెమటలు కారుతూ ఉంటాయి. శరీరం మండుతూ ఉంటుంది. కానీ ఎందుకు పని చేస్తాం? ఎందుకు ఆ కష్టాన్ని భరిస్తూ ఉంటాం? ఈ పట్టి కష్టపడితేనే ఈ చెమట మనది వస్తేనే, మనం కొంచెం ఓపిక వహిస్తేనే మనకు జీతం దొరుకుద్ది. అప్పుడే మనం మన కడుపు నింపగలుగుతాము, మన పిల్లల కడుపు నింపగలుగుతాము అని ఆలోచిస్తాం. ఇంతకంటే ఎక్కువ ఆలోచన మనకు కేవలం ఈ శరీరం గురించేనా? ఈ ఆత్మ గురించి వద్దా? ఈ ఆత్మ వీడి పోయింది అంటే ఈ శరీరం ఏదైనా లాభంలో ఉందా? తీసుకెళ్లి బొంద పెడతాం. తీసుకెళ్లి దఫన్ చేసేస్తాం. మట్టిలో అది కుళ్ళిపోతుంది. కానీ ఆత్మ మిగిలి ఉంటుంది. అల్లాహ్ త’ఆలా మరొక శరీరం ప్రసాదిస్తాడు. ఈ శరీరంలో కూడా ఒక వెన్నుముక బీజం ఉంటుంది, ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా రెండోసారి లేపినప్పుడు దాని ద్వారా మళ్ళీ లేపుతాడు.

అయితే, చెప్పే విషయం ఏంటి? ఈ కేవలం శరీరానికి ఎంత సుఖం మనం ఇవ్వదలుచుకుంటున్నామో, దాని గురించి ఎంత కష్టపడుతున్నామో, మనకు ఇష్టం లేని ఒక సత్కార్యం, మనకు ఇష్టం లేని విశ్వాసం, మనకు ఇష్టం లేని ఒక మంచి కార్యం, దాని వైపునకు కూడా మనం మనసును ఒప్పించి అయినా కానీ ముందడుగు వెయ్యాలి.

ఇంకా కొన్ని సూచనలు మనం విన్నాం. ఏంటవి? వ్యభిచారం అధికమైపోవడం. మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు సేవించడం అధికమైపోవడం. అశ్లీలత పెరిగిపోవడం. ఇలాంటి విషయాలు మనం విన్నప్పుడు ఏం చేయాలి? అరే ప్రవక్త చెప్పిండు కదా ఎట్లైనా అయిపోతది అని మనం కూడా దాంట్లో పాల్గొనాలా? కాదు. ప్రవక్త ఈ వార్త మనకు ఇస్తున్నారు అంటే, తమ పరలోకాన్ని సాఫల్యం చేసుకోగోరే వారు, ప్రళయ దినాన తమకు నరకం నుండి మోక్షం కలగాలి, ప్రళయ దినాన వచ్చే కష్టాలన్నీ కూడా దూరం కావాలి అని కోరుకునేవారు ఇహలోకంలో సంభవించే ఈ చెడులకు దూరం ఉండండి. ఏ మంచి విషయాలు తగ్గుతాయి అని తెలుస్తుందో, దాన్ని మనం చేయడానికి ముందడుగు వెయ్యాలి. ఏ చెడు పెరుగుతుంది అని మనకు తెలుస్తుందో, దానికి మనం దూరం ఉండాలి. ఇది అసలు కారణం చెప్పడానికి.

మరి సోదరులారా, ప్రళయం సంభవించేకి ముందు మూడవ రకమైన సూచనలు ఏవైతే సంభవిస్తాయో, అవి చాలా పెద్ద సూచనలు, చాలా ఘోరమైనవి. ఒక సందర్భంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు, అప్పటికి సహాబాలు, ప్రవక్త గారిని విశ్వసించిన సహచరులు ప్రళయం గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. “మీరేం చర్తించుకుంటున్నారు? ఏ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు? పరస్పరం ఏ విషయం మీద చర్చలు జరుగుతుంది?” అని ప్రవక్త గారు అడిగారు. వారు చెప్పారు, “మేము ప్రళయం గురించి పరస్పరం చర్చించుకుంటున్నాము.”

అప్పుడు ప్రవక్త గారు చెప్పారు,

إِنَّهَا لَنْ تَقُومَ حَتَّى تَرَوْنَ قَبْلَهَا عَشْرَ آيَاتٍ
(ఇన్నహా లన్ తఖూమ హత్తా తరౌన ఖబ్లహా అష్ర ఆయాతిన్)
నిశ్చయంగా, ప్రళయం, దానికంటే ముందు పది పెద్ద సూచనలు సంభవించే వరకు ప్రళయం రాదు.

ఏంటి ఆ పెద్ద సూచనలు?

  1. అద్-దుఖాన్ (పొగ): ఒక చాలా విచిత్రమైన మరియు చాలా భయంకరమైన ఒక పొగ ఏర్పడుతుంది. దాని వివరణ మనం వివరంగా మరో సందర్భంలో తెలుసుకుందాము.
  2. అద్-దజ్జాల్: దజ్జాల్ యొక్క రాక.
  3. దాబ్బతుల్ అర్ద్: ఒక జంతువు వస్తుంది. మాట్లాడుతుంది. ఇతను విశ్వాసి, ఇతను అవిశ్వాసి అనేది చెప్తుంది.
  4. సూర్యుడు పడమర నుండి ఉదయించడం: సూర్యుడు ప్రతిరోజు ఎటునుంచి ఉదయిస్తున్నాడు? తూర్పు నుండి. కానీ ప్రళయానికి సమీపంలో ఇటు పడమర వైపు నుండి ఉదయిస్తాడు.
  5. ఈసా ఇబ్ను మర్యం రాక: యేసు క్రీస్తు, ఈసా అలైహిస్సలాం దిగి వస్తారు.
  6. య’జూజ్ మరియు మ’జూజ్: ఒక జాతి, వారు బయటికి వెళ్తారు.
  7. మూడు పెద్ద భూకంపాలు: ఒకటి తూర్పులో, మరొకటి పడమరలో, మరొకటి ఈ జజీరతుల్ అరబ్ (అరబ్ ద్వీపంలో). చాలా గాంభీర్యంగా భూమి క్రుంగిపోతుంది.
  8. యమన్ నుండి ఒక అగ్ని: ఇందులో చివరి పెద్ద సూచన, యమన్ నుండి ఒక అగ్ని వెలుదేరుతుంది, అగ్ని వెళ్తుంది. ఆ అగ్ని వెళ్ళింది అంటే చాలా పెద్ద పెద్దగా ఉంటుంది. ప్రజల్ని నెట్టేసుకుంటూ వస్తుంది. ప్రజలు పరిగెడుతూ ఉంటారు. ఎక్కడ? షామ్ (సిరియా) వైపున. అది చివరి యొక్క పెద్ద సూచన అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.

అయితే ఈ పెద్ద సూచనలు ఒకటి తర్వాత మరొకటి, ఒకటి తర్వాత మరొకటి ఈ విధంగా మొదలై కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. వాటి మధ్యలో ఏ గ్యాప్ అనేది ఉండదు.

వీటన్నిటిలో అతి భయంకరమైనది దజ్జాల్ యొక్క సంక్షోభం, దజ్జాల్ యొక్క ఫితనా. దజ్జాల్ ఎవడు? అతడు ఒక మానవుడు, ఒక మనిషే. కానీ ప్రళయానికి ముందు అతడు వస్తాడు. అల్లాహ్ త’ఆలా అతనికి ఒక శక్తిని ఇస్తాడు. దాని మూలంగా అతడు ఎన్నో మహిమల పేరు మీద ప్రజలను మోసం చేసి, నేను మీ దేవుణ్ణి, నేను మీ అనారోగ్యులకు, రోగంతో ఉన్నవారికి స్వస్థత ప్రసాదించేవాణ్ణి, మీలో కష్టంలో ఉన్నవారికి సుఖం ఇచ్చేవాణ్ణి, నేను మీ యొక్క ప్రభువుని అని తనకు తాను చాటింపు చేసుకుంటాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే దజ్జాల్ బయలుదేరాడు అని వింటారో, అతనితోని ఎదుర్కోవడానికి, అతని ముందుకు వచ్చే ప్రయత్నం చేయొద్దు, దూరమే ఉండాలి. ఎందుకంటే ఆ సందర్భంలో ఒక విశ్వాసి నా విశ్వాసం చాలా బలంగా ఉంది, నేను ఎలాంటి మోసంలో పడను అని అనుకుంటాడు. కానీ వాడు ఎలాంటి మాయాజాలం చూపిస్తాడో, దానికి మోసపోయి తన విశ్వాసాన్ని కోల్పోతాడు. అతన్ని ప్రభువుగా నమ్మేస్తాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు:

“చూడండి ఇంతకముందు వచ్చిన ప్రవక్తలందరూ కూడా దజ్జాల్ గురించి హెచ్చరించారు. ఎందుకంటే ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం వచ్చే వరకు ఎన్ని ఫితనాలు, ఎన్ని సంక్షోభాలు, ఎన్ని ఇలాంటి ఉపద్రవాలు జరిస్తాయో, పుడతాయో, వాటన్నిటిలో అతిపెద్ద భయంకరమైన ఫితనా, ఉపద్రవం దజ్జాల్ యొక్క ఫితనా. అందుగురించే ప్రతి ప్రవక్త తమ జాతి వారికి అతని గురించి హెచ్చరించారు. నేను కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.

వినండి, అతను తనకు తాను ప్రభువుగా చాటింపు చేసుకుంటాడు. అయితే మీ ప్రభువు కేవలం అల్లాహ్ మాత్రమే. దజ్జాల్ ను మీరు గుర్తు పట్టాలంటే అతనికి రెండు కళ్ళు ఉండవు. ఒకే ఒక కన్ను ఉంటది, ఒంటి కన్ను అంటాం కదా. ఒకే కన్ను ఉంటుంది. ఆ ఒక కన్ను కూడా సామాన్య మనుషుల కన్నుల మాదిరిగా ఉండదు, బయటికి వచ్చి ఒక ద్రాక్ష పండు పెద్దది ఎలా ఉంటుందో ఆ విధంగా భయంకరంగా ఉంటుంది. మరియు అతని తల మీద, నుదుటి మీద ك ف ر (కాఫ్-ఫా-రా) కాఫిర్ అన్న పదం రాసి ఉంటుంది. చదివిన వాళ్ళు, చదవని వాళ్ళు, జ్ఞానులు, అజ్ఞానులు అందరూ కూడా ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతారు.

మరియు అతడు ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజలకు ఎన్నో మోసపెడుతూ వారిని నేను ప్రభువుగా నమ్మండి అని అంటూ ఉంటాడు. అయితే ప్రజల్ని నమ్మించడానికి ఒక సందర్భంలో అతనికి ఎలాంటి శక్తి లభిస్తుంది అంటే చాలా పెద్ద సంఖ్యలో అతని వెంట జనం ఉంటుంది. ఒక సందర్భంలో ప్రవక్త గారు చెప్పారు, అతన్ని అనుసరించే వారిలో స్త్రీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది అని. ఒక సందర్భంలో అతని వెంట చాలా పెద్ద జనం ఉంటుంది. అతడు ఆకాశాన్ని ఆదేశిస్తే వర్షం కురుస్తుంది. భూమిని ఆదేశిస్తే పంట వెళ్తుంది. చూడు, నేను ప్రభువును కాదా అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాడు.

ప్రజలు కొందరు నమ్మరు. ఆ సందర్భంలో ఒక వ్యక్తిని ముందుకు తీసుకువచ్చి నీ తల్లిదండ్రిని బ్రతికించి చూపించాలా అని అంటాడు. అయితే అతని వెంట షైతానులు ఉంటాయి. ఇద్దరు షైతానులు అతని యొక్క తల్లిదండ్రి యొక్క రూపంలో అతని ముందుకు వస్తారు. ఇలాంటి మోసం జరుగుద్ది మరియు అల్లాహ్ యొక్క ఎంత గొప్ప దయ మనపై గమనించండి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కూడా మొత్తం మన విశ్వాసంలో పడకుండా, విశ్వాసంపై స్థిరంగా ఉండడానికి అల్లాహ్ మనకు ప్రవక్త ద్వారా ఈ విషయాలు తెలియపరిచాడు. కానీ మన దురదృష్టం ఏంటంటే చదువుకు, విద్యకు ఎంతో దూరం ఉండిపోతున్నాం. విషయాలన్నీ తెలుసుకోవాలి. రోజు కొంచెం ఒక పేజీ అయినా గానీ ఖుర్ఆన్ దాని అనువాదంతో చదవాలి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులను చదువుతూ ఉండాలి. ప్రవక్త వారి యొక్క జీవితం చదువుతూ ఉండాలి. ఈ కాంక్ష ఇంకా ఎప్పుడు మనలో పుడుతుంది?

వాస్తవానికి ఈ రోజుల్లో గమనిస్తే, ఏ ఉపద్రవాలు, సంక్షోభాలు, ఫితనా ఎక్కువ అవుతూ ఉన్నాయో, అందులో నేనైతే అనుకుంటా, మన చేతులో ఇలాంటి పెద్ద పెద్ద షైతానులు రావడం అని కూడా ఒకటి భావిస్తాను. ఎందుకో తెలుసా? వాస్తవానికి దీని వెనక నిజంగా వీటి ద్వారా, అంటే ఈ మొబైల్ సెట్స్, స్మార్ట్ ఫోన్స్, మరి ఇలాంటి దీనికి సంబంధించిన ఎన్నో పరికరాలు ఏవైతే ఉన్నాయో, వీటి వలన కొంత ప్రయోజనం, ఎంతో లాభం ఉండవచ్చు. కానీ ఈ రోజుల్లో జనం ఆ లాభానికంటే ఎక్కువగా నష్టంలో దాన్ని ఉపయోగిస్తున్నారు, వాటిని ఉపయోగిస్తున్నారు. గంటల తరబడి పేజీ పైకి చేస్తూ, చేస్తూ, Facebook నుండి, Facebook లో చూసి చూసి మన ఫేస్ ఏ పాడైపోతుంది. కానీ దానిని మనం గమనించడం లేదు. దానికి బదులుగా ఏదైనా మంచి విషయం చదవాలి అంటే కోరిక పుట్టడం లేదు. ఉదాహరణకు Facebook ఇచ్చాను. ఈ విధంగా ఎన్నో విషయాలు ఉన్నాయి. అంతకు ముందు, ఇవి రాకముందు డిష్ లు, టీవీలు, మంచి మంచి ప్రోగ్రాంలో అని అనుకునేవాళ్ళం. స్త్రీలు ఫిలింలు, సీరియల్ లలో, పురుషులు ఎంతో మంది ఎన్నో రకాల ఆటల్లో, క్రికెట్ అని కొందరు, మరికొందరికి మరికొన్ని కాంక్షలు.

సోదరులారా, అల్లాహ్ మనపై కరుణించి, ఆయన మనకు ఎంతో మనపై దయచేసి, ప్రళయానికి ముందు సంభవించే సూచనల గురించి ఏ చిన్న చిన్న వివరాలు అయితే తెలిపాడో, మన ప్రవక్త ద్వారా వాటిని తెలుసుకొని మంచి విషయాలకు ముందుకు వెళ్లి, చెడు నుండి మనం దూరం ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడే మన ఇహలోకం బాగుపడుతుంది, మన పరలోకం కూడా మనకు బాగుపడుతుంది. అక్కడ నరకం నుండి మోక్షం పొంది స్వర్గంలో మనం చేరగలుగుతాం.

దజ్జాల్ ఇక్కడ ఉండేది ఎన్ని రోజులు? కేవలం 40 రోజులు మాత్రమే ఈ ప్రపంచంలో. కానీ మొదటి రోజు ఒక సంవత్సరం మాదిరి, రెండో రోజు ఒక నెల మాదిరిగా, మూడో రోజు ఒక వారం మాదిరిగా, మిగితా రోజులు 37 సామాన్య రోజులుగా ఉంటాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. చివరికి ఈసా అలైహిస్సలాం దిగి వస్తారు. విశ్వాసుల ఒక సంఖ్య, విశ్వాసుల ఒక గ్రూప్ వారి వెంట ఉంటుంది. ఈసా అలైహిస్సలాం దజ్జాల్ ను వెతికి, దజ్జాల్ ను చంపేస్తారు. హత్య చేస్తారు.

కానీ ఒక విషయం, ఇతడు చాలా పెద్ద దజ్జాల్, భయంకరమైనవాడు. అయినా గానీ రెండు విషయాలు దీంట్లో మనం గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటి? ఇతని ఉపద్రవాలు, ఇతని యొక్క ఫితనా, ఇతను ప్రజల్ని దుర్మార్గంలో పడవేయడానికి ఎంత ఏ ప్రయత్నం చేసినా గానీ, అల్లాహ్ పై గట్టి నమ్మకంతో అతన్ని ఎదురించకుండా, మనం ఉన్నకాడ మనం ఉండి, విశ్వాసంపై స్థిరంగా ఉండి, సత్కార్యాలు చేస్తూ ఉండి, ప్రత్యేకంగా దజ్జాల్ నుండి రక్షణకై, దజ్జాల్ నుండి అల్లాహ్ మనల్ని రక్షించాలని ప్రవక్త ఏ దుఆలు అయితే మనకు నేర్పారో, ఏ ప్రత్యేక కార్యాలు అయితే మనకు నేర్పారో అవి చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు అతని ఎన్ని భయంకరమైన, ఎన్ని మోసాలు, ఎన్ని మాయాజాలం మహిమలు అని చూపించినా గానీ అందులో ఇన్ షా అల్లాహ్ మనం పడం. కానీ విశ్వాసం మరియు ప్రవక్త చూపిన విధానంలో మనం ఉండాలి, కరెక్ట్ గా ఆచరణలో ఉండాలి. ఉదాహరణకు ప్రతి నమాజులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు,

اَللّٰهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ، وَمِنْ عَذَابِ جَهَنَّمَ، وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ، وَمِنْ شَرِّ فِتْنَةِ الْمَسِيْحِ الدَّجَّالِ
(అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ అదాబిల్ ఖబ్ర్, వ మిన్ అదాబి జహన్నమ్, వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాత్, వ మిన్ షర్రి ఫిత్నతిల్ మసీహిద్ దజ్జాల్)

అని చదివేవారు. ఇది చదువుతూ ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు ప్రతి జుమా రోజు ఏం చదవాలి? సూరె కహఫ్ చదువుతూ ఉండండి అని చెప్పారు. అది చదువుతూ ఉండాలి.

ఈ రోజుల్లో మన పరిస్థితి ఏమైంది? మా తల్లిదండ్రి మమ్మల్ని స్కూల్ కు పంపలేదు, మా తల్లిదండ్రి మమ్మల్ని మదరసాలో చేర్పించలేదు, మాకు ఖుర్ఆన్ చిన్నప్పుడు నేర్పలేదు అని ఇప్పటివరకు మనం నేర్చుకోలేకపోతున్నాము. కానీ మన చిన్నప్పుడు ఇట్లాంటి మొబైల్స్ ఉండెనా? వీటిని ఎలా ఆపరేటింగ్ చేయాలో అవన్నీ తెలుసా? అక్షరజ్ఞానం లేని వాళ్ళు కూడా ఇవి ఉపయోగించుకుంటున్నారు, దీన్ని వాడుతున్నారు. ఏమీ రాని వ్యక్తి కూడా తనకు ఇష్టమైన పాట దాంట్లో ఎన్నుకొని వింటున్నాడు, ఇష్టమైన ఫిలిం దాంట్లో తీసి చూస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు ఆ చెడులో ఏ జ్ఞానం అయితే మనది ఉపయోగపడుతుందో, మంచి తెలుసుకోవడానికి నాకైతే చదువు రాదు, చలో ఈ రోజు నేను ఏం చేస్తా, ఈ ఖుర్ఆన్ అప్లికేషన్ దీంట్లో స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేసి ఆ ఈరోజు జుమ్మా కదా, జుమ్మా రోజు నేను సూర కహఫ్, నాకు చదవ రాదు, కనీసం చూసుకుంటూ శ్రద్ధగా వింటూ ఉంటా. అట్లా ఎవరైనా ఆలోచిస్తున్నారా? బహుశా వెయ్యిలో ఎవరైనా ఒకరు ఉంటే ఉండవచ్చునేమో. ఇలాంటి ప్రయత్నాలు చేయాలి మనం.

రెండో విషయం, ఆ పెద్ద దజ్జాల్ నుండి మనం రక్షణ పొందాలంటే, అతని యొక్క మాయాజాలంలో మనం చిక్కిపోకూడదు అంటే ఈ పనులు చేయడంతో పాటు, ఆ పెద్ద దజ్జాల్ రాకముందు ఎందరో చిన్న చిన్న దజ్జాల్లు వస్తూ ఉంటారు. వాటి మాయాజాలకు కూడా మనం దూరం ఉండాలి. ఈ రోజుల్లో ఎందరో ఉన్నారు. గారడీ ఆటల్లాంటివి ఆడిపిస్తారు, మంత్రాలు చేస్తున్నాము, చేతబడి చేస్తున్నాము, మా దగ్గర మాయాజాలం ఉన్నది, మా దగ్గర ఫలానా శక్తి ఉన్నది, దేవుడు నాలో వదిగి వచ్చాడు, దేవుడు నాలో ఈ విధంగా చూపించుకుంటూ ప్రజల్ని మోసం చేసి, ప్రజల యొక్క నజరానాలు, ప్రజల యొక్క డబ్బులు, ప్రజల యొక్క ఆస్తులు అన్నీ కాజేసుకుంటూ దేవుని పేరు మీద తింటూ ఉన్నారు. అల్లాహ్ పేరు మీద తింటూ ఉన్నారు. ఇక ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఆ పేర్లు చెప్పేది ఉంటే కొందరికి కోపాలే వస్తాయి.

మన బర్రార్ లలో కూడా ఎన్నో మజార్లు, దర్గాలు, దర్బారులు, బాబాల యొక్క ఏమైతే అనుకుంటామో అక్కడ కూడా ఇలాంటి విషయాలు ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అందుగురించి సోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇలాంటి మోసాల్లో పడకుండా, దుర్మార్గంలో పడకుండా, విశ్వాసంపై మన యొక్క చావు కావాలి అంటే తప్పకుండా మనం ఏం చేయాలి? విశ్వాస మార్గం మీద ఉండాలి. ఖుర్ఆన్ హదీస్ చదువుతూ ఉండాలి. ధర్మ జ్ఞానం మనం నేర్చుకుంటూ ఉండాలి. అల్లాహ్ త’ఆలా ఇలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ప్రళయం రాకముందు ఏ సూచనలైతే సంభవిస్తా ఉన్నాయో, అల్లాహ్ ఆ సూచనల్లోని చెడు విషయాల నుండి మనల్ని దూరం ఉంచి, ఏ మంచి విషయాలు కరువవుతాయో వాటికి చేరువై, దగ్గరై, అలాంటి విషయాలు నేర్చుకొని మన వాళ్ళల్లో వాటిని ఇంకింత పెంపొందించే భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ త’ఆలా దజ్జాల్, దజ్జాల్ కు ముందు వచ్చే ఇంకా చిన్న చిన్న దజ్జాల్ ల వారందరి ఫితనాల నుండి కూడా మనల్ని అల్లాహ్ కాపాడుగాక.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వబరకాతుహు.

పరలోకం (The Hereafter)
https://teluguislam.net/hereafter/

షైతాన్ నుండి రక్షణ ఎలా పొందాలి? [ఆడియో, టెక్స్ట్]

షైతాన్ నుండి రక్షణ ఎలా పొందాలి?
https://www.youtube.com/watch?v=1qamx6aMM3U [33 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

”నిశ్చయంగా షైతాన్‌ మీ శత్రువు. కనుక మీరు కూడా వాణ్ణి శత్రువు గానే పరిగణించండి. వాడు తన సమూహాన్ని, వారంతా నరకవాసులలో చేరిపోవడానికే పిలుస్తున్నాడు”. (సూరా ఫాతిర్‌: 06)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:
”నిశ్చయంగా షైతాన్‌ మనిషి నరాల్లో రక్తం వలె ప్రవహిస్తుంటాడు”. (బుఖారీ)


ఈ ఆడియో లో క్రింది విషయాలు వివరించబడ్డాయి:

  1. అల్లాహ్ యొక్క జిక్ర్ 
  2. షిర్క్  నుండి  & పాపకార్యాల నుండి దూరముండుట 
  3. అల్లాహ్ పై బలమైన విశ్వాసం మరియు నమ్మకం 
  4. వివిధ సందర్భాలలో దుఆలు పఠించడం 
  5. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు చదివే దుఆ చదవడం 
  6. 100 సార్లు “లా ఇల్లల్లాహు వహ్దహు లా షరీకలహు …” చదవడం 
  7. మితి మీరిన కోపానికి దూరముండుట, కోపం వచ్చినప్పుడు “అవూజు బిల్లాహి మినష్ షైతానిర్రజీమ్” చదువుట  
  8. సూరా అల్ ఫలఖ్ , సూరా అల్ నాస్ చదవడం 
  9. ఇంట్లో ప్రవేశించేటప్పుడు , తినేముందు, తాగేముందు బిస్మిల్లాహ్ తో ప్రారంభించడం 
  10. ఇంట్లో సురా బఖర చదవడం 
  11. నిద్ర పోయే ముందు “అయతుల్ కుర్సీ” చదవడం 
  12. నిద్ర పోయే ముందు సురా బఖర చివరి రెండు అయతులు చదవడం 
  13. మస్జిద్ లోకి ప్రవేశించేటప్పుడు చేసే దుఆ చేసుకోవడం 

ఈ ప్రసంగంలో షైతాన్ నుండి రక్షణ పొందటానికి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివిధ పద్ధతులు వివరించబడ్డాయి. ఈ అంశం రెండు భాగాలుగా విభజించబడింది: మొదటిది, షైతాన్ యొక్క చెడు ప్రేరేపణలు మరియు గుసగుసల (వస్వసా) నుండి మనల్ని మనం కాపాడుకోవడం. రెండవది, షైతాన్ లేదా జిన్నాతుల భౌతిక హాని, అనగా ఆవహించడం లేదా ఇంట్లో నివసించడం వంటి సమస్యల నుండి రక్షణ. ప్రసంగంలో అల్లాహ్ స్మరణ (ధిక్ర్), ఆయతుల్ కుర్సీ, సూరహ్ అల్-బఖరాలోని చివరి రెండు ఆయతులు మరియు ముఅవ్విదతైన్ (సూరహ్ అల్-ఫలఖ్ మరియు సూరహ్ అన్-నాస్) పఠించడం యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్పబడింది. అలాగే, ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు, ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మరియు మస్జిద్ లోకి ప్రవేశించేటప్పుడు పఠించవలసిన దుఆలు మరియు వాటి ప్రయోజనాలు వివరించబడ్డాయి. షిర్క్ మరియు బిద్అత్ చర్యలైన బాబాల వద్దకు వెళ్లడం, తాయత్తులు కట్టడం వంటి వాటి నుండి దూరంగా ఉండాలని గట్టిగా సూచించబడింది.

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం. అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బద్.

సోదరులారా! ఈరోజు, షైతాన్ నుండి మనం ఎలా రక్షణ పొందాలి? అన్న శీర్షికపై, టాపిక్ పై మీ ముందు ఖురాన్ మరియు హదీసు ఆధారంగా కొన్ని విషయాలు తెలుపుతాను.

చూడండి, అల్లాహ్ త’ఆలా మనల్ని పుట్టించింది, మనం కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుటకు. కానీ, షైతాన్ వాడు మనల్ని అల్లాహ్ మార్గం నుండి దూరం చేసి నరకం వైపునకు తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికై షైతాన్ సాఫల్యం పొందుటకు ఎన్నో రకాలుగా మానవులను పెడమార్గం పట్టిస్తూ ఉంటాడు. ఖురాన్లో దీని గురించి ఎన్నో ఆయతులు ఉన్నాయి, కానీ ఆ వివరాల్లో నేను ఇప్పుడు వెళ్లడం లేదు. సంక్షిప్తంగా ఈ రోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, షైతాన్ నుండి మనం ఎలా రక్షణ పొందగలుగుతాము.

ఉన్న ఈ టాపిక్ లో రెండు భాగాలు అనుకోండి. ఒకటి, షైతాన్ యొక్క వస్వసాల నుండి, అతని ప్రేరేపణల నుండి, అతను చెడు కార్యాలు చేయుటకు మనలో ఏ బీజమైతే నాటే ప్రయత్నం చేస్తాడో, ఎలాంటి కోరికలను పెంపొందించే ప్రయత్నం చేస్తాడో, వాటి నుండి మనం ఎలా దూరం ఉండగలుగుతాము. పుణ్యంపై, సత్కార్యంపై, అల్లాహ్ యొక్క విధేయతపై ఎలా స్థిరంగా ఉండగలుగుతాము. ఇది ఒక భాగం.

రెండో భాగం, సామాన్యంగా మనం వింటూ ఉంటాం కదా, అయ్యో ఆ మనిషికి షైతాన్ పట్టిందట, అతనిలో జిన్ చొరబడ్డదంట, “షైతాన్ పకడ్ లియా ఉసే, ఆసేబ్ హోగయా” ఉర్దూలో అంటారు కదా. లేక, ఓ వాళ్ళ ఇంటి మీద షైతాన్ వాలి ఉంది, ఎప్పుడూ ఏదో ఒక విచిత్ర కార్యాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక, ఇలాంటి అనుమానాల్లో పడ్డ తర్వాత, ఒక మనిషికి షైతాన్ వాస్తవంగా పట్టి ఉండేది ఉంటే, లేదా ఎవరి ఇంటిలోనైనా షైతాన్ నివాసం చేసి అక్కడ ఉన్న ఇంటి వారికి ఏదైనా పరేషాన్ చేస్తూ వారి జీవితం సుఖంగా జరగకుండా ఏదైనా ఇబ్బంది పాలు చేస్తే, ఖురాన్, హదీసులు మనకు అలాంటి ఇబ్బందుల నుండి దూరం ఉండటానికి ఏ మార్గం చూపుతుందో ఈ రోజుల్లో ప్రజలు తెలుసుకోకుండా చాలా దూరంగా ఉన్నారు. ఏం చేస్తారు? వెంటనే ఫలానా బాబా దగ్గరికి వెళ్దాము, ఫలానా పీర్ దగ్గరికి వెళ్దాము, ఫలానా సమాధి వద్దకు వెళ్దాము, ఫలానా తాయీజ్ వేద్దాము, లేదా ఇంటి రక్షణ కొరకు షైతాన్ నుండి ఆ ఇంటి నలువైపులా ఏదో దర్గాల కాడి నుండి చదివించుకుని వచ్చి మొళలు నాటడం, లేదా ఇంటి కడపకు ఆ మిరపకాయలు లేదా నిమ్మకాయ, లేకుంటే బూడిద గుమ్మడికాయ ఇలాంటివి తగిలించడం, లేక మరి మా చిన్నప్పుడు మేము చూసాము కొన్ని ప్రాంతాల్లో, చెత్త కుప్ప ఎక్కడైతే వేస్తారో అక్కడ ఒక గుంజ, ఒక నాటు వేసి దానికి ఒక చెప్పు, ఒక చీపురు తగిలేసేవారు. ఈ వాడ మీద ఏ ఆ రేపు రాక్షసులు వస్తున్నాయి, ఆ ఇది రాకుండా జాగ్రత్తగా ఉంటాయి. అంటే ఇలాంటి, లేదా తాయీజులు, తాయత్తులు ఇలాంటి విషయాలకు పాల్పడుతున్నారు.

అయితే సోదరులారా! ఇవన్నీ కూడా తప్పు. ఇవన్నీ కూడా మనల్ని ఇంకింత షిర్క్ లో, ఇంకింత పాపంలో, బహుశా కొన్ని సందర్భాల్లో ఏదైనా కొందరికి కొంత లాభం కనబడుతుంది కావచ్చు. కానీ, అసలైన లాభం అల్లాహ్ తో సంబంధం ఏదైతే ఉంటుందో, విశ్వాసం ఏదైతే ఉండాలో అవన్నీ కోల్పోతారు. అందు గురించి ఇక రండి, ఈ రెండు భాగాలు ఏదైతే నేను చెప్పానో వాటన్నిటికీ నేను ఈ రోజు చెప్పబోయే విషయాల్లో మీకు సమాధానం అనేది ఇన్ షా అల్లాహ్ లభిస్తుంది.

ఒక మనిషి షైతాన్ నుండి దూరం ఉండడానికి ఏం చేయాలి? లక్ష్మణ రేఖ అని ఎప్పుడైనా విన్నారా మీరు? ఏంటిది? సీత బయటికి వెళ్ళకుండా రాముడు గీసిన గీత కాదు, మన ఇళ్లల్లో మనం చీమలు రాకుండా, ఒక చాక్ పీస్ ల వస్తది ఉంటది, దానితో గీస్తాం కదా. సామాన్యంగా ఏం చూడడం జరిగింది? చీమలు రాకుండానే ఉంటాయి. చూసారా లేదా? రాత్రి దోమలు రాకుండా ఏం చేస్తారు? మఛ్ఛర్ దాని గాని, ఆ లేదా అంటే, ఆ ఆరెస్సా, టిఆర్ఎస్ ఏవో మందులు కూడా ఉంటాయి కదా అట్లాంటివి. లేక మీరు అనండి, ఎక్కడైతే అగ్ని మండుతుందో, దాని మీద నీళ్లు పోస్తే ఏమైపోతుంది? అగ్ని ఆరిపోతుందా? ఈ సామెతలు ఎందుకు ఇస్తున్నాను? ఈ సామెతలు, ఇలాంటి ఉదాహరణలు మనకు తెలుసు. ఎగ్జాక్ట్లీ ఇంతకంటే గొప్ప ఉదాహరణ మనకు ఇవ్వడం జరిగింది. అదేమిటి? ఎక్కడైతే అల్లాహ్ యొక్క ధిక్ర్ ఉంటుందో అక్కడ షైతాన్ రావడానికి ఆస్కారం ఉండదు. ఇంతకుముందు ఉదాహరణలు, సామెతలు ఏవైతే చెప్పుకున్నామో, పెద్దలు చెప్పిన విషయాలు, కొందరి అనుభవించినవి లేకుంటే అనుభవశాలుల అనుభవాలు. కానీ, షైతాన్ మనకు దగ్గరగా రాకుండా, షైతాన్ వస్వసాలలో మనం పడకుండా, షైతాన్ మనకు ఎలాంటి హాని కలిగించకుండా మనం ఉండాలంటే, దానికి మొట్టమొదటి, అతి ముఖ్యమైనది, అతి గొప్పది, అతి పెద్ద నివారణ, చికిత్స, రేఖ, హద్దు, బందిష్, ఏదేనా పేరు పెట్టుకోండి మీరు. ఏంటది? అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ యొక్క ధిక్ర్. ఎక్కడ అల్లాహ్ యొక్క ధిక్ర్ ఉంటుందో అక్కడ షైతాన్ కు ఏ మాత్రం అవకాశం దొరకదు. 

ఈ విషయం నేను ఎన్నో హదీసులు, ఎన్నో ఆయతులు ఉన్నాయి కానీ ఒక మంచి ఉదాహరణ ద్వారా ముస్నద్ అహ్మద్ లో ఒక హదీస్ ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్ త’ఆలా యహ్యా అలైహిస్సలాంకు ఐదు విషయాల గురించి ఆదేశించాడు. అందులో ఒకటి ఏమిటి? “వఆమురుకుం అన్ తద్కురుల్లాహ్” అల్లాహ్ నాకు ఇచ్చిన ఆదేశం, నేను మీకు ఇస్తున్నాను, ఏమిటి? వఆమురుకుం, నేను మీకు ఆదేశిస్తున్నాను, అన్ తద్కురుల్లాహ్, మీరు అల్లాహ్ ను ఎక్కువగా స్మరించండి. అల్లాహ్ యొక్క ధిక్ర్ అధికంగా చేస్తూ ఉండండి. “ఫఇన్న మసల దాలిక్”, దీని ఉదాహరణ ఎలాంటిది అంటే, “కమసలి రజులిన్ ఖరజల్ అదువ్వు ఫీ అసరిహి సిరాఅన్ హత్తా ఇదా అతా అలా హిస్నిన్ హసీనిన్ ఫ అహ్రజ నఫ్సహు మిన్హు”. ఒక వ్యక్తి పరుగుతున్నాడు, ఉరుకుతున్నాడు, అతని వెనుక అతని శత్రువులు ఉన్నారు. ఆ మనిషి శత్రువుల చేతిలో చిక్కకుండా పరుగులు తీస్తున్నాడు. చాలా వేగంగా. ముందుకు వెళ్ళిన తర్వాత చాలా బలమైన ఒక గట్టి కోటలో “అహ్రజ నఫ్సహు” తనను తాను బంధించుకుంటాడు. అక్కడ వెళ్ళి రక్షణ పొందుతాడు. ఆ కోటలో వెళ్ళిన తర్వాత, వెనుక శత్రువులు ఏదైతే పరుగెత్తుకుంటూ వస్తున్నారు కదా, ఇతన్ని పట్టుకోవడానికి, వాళ్ళు ఓడిపోతారు. అంటే ఇక పరుగు పెట్టకుండా, అల్లా ఇక ముంగట అతను చాలా మంచి బలమైన కోటలో వెళ్ళిపోయిండు. ఇక అక్కడి వరకు వెళ్ళి అతన్ని పట్టుకోవడానికి మనకు ఎలాంటి తాకత్ లేదు అన్నట్టుగా వాళ్ళు ఓడిపోతారు. అల్లాహ్ ఏం చెప్పారు, యహ్యా అలైహిస్సలాంకి? ఈ ఉదాహరణ ఎలాంటిది?

كَذَلِكَ الْعَبْدُ لاَ يُحْرِزُ نَفْسَهُ مِنَ الشَّيْطَانِ إِلاَّ بِذِكْرِ اللَّهِ
(కధాలికల్ అబ్దు లా యుహ్రిజు నఫ్సహు మినష్-షైతాని ఇల్లా బిధిక్-రిల్లాహ్)
అదేవిధంగా, ఒక దాసుడు అల్లాహ్ స్మరణ ద్వారా తప్ప షైతాన్ నుండి తనను తాను రక్షించుకోలేడు.

మనిషి తనను తాను షైతాన్ చిక్కులో చిక్కకుండా రక్షణగా ఉండాలంటే అల్లాహ్ యొక్క ధిక్ర్. అల్లాహ్ ధిక్ర్ లో ఎప్పుడైతే వచ్చేస్తాడో అతను ఒక బలమైన కోటలో ప్రవేశించినట్లు, షైతాన్ అతని మీద ఎలాంటి దాడి, షైతాన్ యొక్క యొక్క ఎలాంటి పగ అనేది తీరకుండా ఉంటుంది.

సోదరులారా! అల్లాహ్ యొక్క ధిక్ర్ లో చాలా గొప్ప శక్తి ఉంది. అందు గురించే ఖురాన్లో కూడా మనకు ఇలాంటి ధిక్ర్ లు, ఇలాంటి దుఆలు ఎక్కువగా చదువుతూ ఉండడానికి చెప్పడం జరిగింది. మనిషి దగ్గరికి షైతాన్ రావడానికి ఎన్నో పాప కార్యాలు, ఎన్నో తప్పుడు పనులు చేయడం కూడా ఒక సబబే. అందు గురించి మనిషి సాధ్యమైనంత వరకు ఏం చేయాలి? గట్టి బలమైన విశ్వాసం మీద ఉండాలి. సూర నహల్ మీరు చదివారంటే, అల్లాహ్ త’ఆలా అందులో తెలిపాడు, ఎవరైతే విశ్వాసులో, అలాంటి వారిపై షైతాన్ తన యొక్క పన్నాగం పన్నలేడు.

إِنَّهُ لَيْسَ لَهُ سُلْطَانٌ عَلَى الَّذِينَ آمَنُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
(ఇన్నహూ లైస లహూ సుల్తానున్ అలల్లదీన ఆమనూ వ అలా రబ్బిహిమ్ యతవక్కలూన్)
విశ్వసించి, తమ ప్రభువుపైనే భారం మోపిన వారిపై వాడికి (షైతానుకు) ఎలాంటి అధికారం ఉండదు (16:99)

إِنَّمَا سُلْطَانُهُ عَلَى الَّذِينَ يَتَوَلَّوْنَهُ وَالَّذِينَ هُم بِهِ مُشْرِكُونَ
(ఇన్నమా సుల్తానుహూ అలల్లదీన యతవల్లౌనహూ వల్లదీన హుమ్ బిహీ ముష్రికూన్)
అయితే వాడితో స్నేహం చేసి, వాడిని అల్లాహ్‌కు భాగస్వామిగా నిలబెట్టే వారిపై మాత్రం వాడి అధికారం నడుస్తుంది (16:100)

షైతాన్ ఎవరితో ఉంటాడు? ఎవరితో ఉండడు? అన్న విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. దీని ద్వారా మనకు ఏం తెలిసింది? షైతాన్ మనకు తోడుగా ఉండకూడదు అంటే, లేక షైతాన్ వలలో మనం చిక్కకూడదు అంటే, విశ్వాసం మరియు అల్లాహ్ పై భరోసా చాలా గట్టిగా ఉండాలి. మరి ఎవరైతే షిర్క్ పనులు చేస్తారో, స్వయంగా షైతాన్ కు ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉంటాడో, అతను షైతాన్ ను స్నేహితునిగా చేసుకున్నట్లు. ఇక మీరు ఆలోచించండి, ఇక్కడ ముఖ్యంగా షిర్క్ పదం వచ్చేసింది. ఇంకా, పాటలు వినడం, నమాజులు వదలడం ఇలాంటి కార్యాలన్నీ షైతాన్ కు ఇష్టం ఉన్నాయా, లేవా? ఇష్టం ఉన్నాయి. అలాంటి కార్యాలు మనం చేస్తే షైతాన్ కు ఇంకా దగ్గరగా అవుతాము. అందు గురించి ఇది అతి ముఖ్యమైన విషయం, గుర్తుంచుకోవాలి.

అందు గురించే ఇస్లాం ధర్మంలో ఎన్నో సందర్భాల్లో మనకు కొన్ని దుఆలు నేర్పడం జరిగినాయి. ఆ దుఆలను మనం ఖచ్చితంగా పాటిస్తూ ఉంటే, ఇన్ షా అల్లాహ్, అల్లాహ్ యొక్క దయవల్ల షైతాన్ వలలో చిక్కకుండా ఉండగలుగుతాము.

ఉదాహరణకు, ఇంటి నుండి మనం బయల్దేరినప్పుడు. ఏదైనా పని మీద మనం బయటికి వెళ్తాం. బయట షైతాన్ మనలో చిక్కకుండా ఉండడానికి ముందు ఏం చేయాలి మనం? ఇంటి నుండి బయల్దేరునప్పుడు ఏ దుఆ అయితే ప్రవక్త గారు మనకు నేర్పారో ఆ దుఆ చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైతే ఇంటి నుండి బయల్దేరుతూ, “బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహ్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” చదువుతారో, వారికి ఏ కార్యం మీద వారు వెళ్తున్నారో అందులో అతనికి మార్గం చూపబడుతుంది, అతని గురించి అల్లాహ్ సరిపోతాడు, “వ తనహ్హా అన్హుష్-షైతాన్” షైతాన్ అతడి నుండి దూరమైపోతాడు.

చూడండి ఎంత గొప్ప లాభం ఉంది. ఇది అబూ దావూద్ లో హదీస్ ఉంది, సహీ హదీస్.

ఇక బయటికి వెళ్ళాం మనం. ఈ దుఆ పాబందీగా చదువుకుంటూ వెళ్ళాము. ఆ తర్వాత అక్కడ ఏ అవకాశం ఉన్నా గానీ మనం ఏం చేయాలి?

لاَ إِلَهَ إِلاَّ اللَّهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ، وَلَهُ الْحَمْدُ، وَهْوَ عَلَى كُلِّ شَىْءٍ قَدِيرٌ
(లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వ లహుల్ హందు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్)

ఈ దుఆ మనం చదువుతూ ఉన్నామంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే ఒక రోజులో వంద సార్లు ఇది చదువుతారో, “కానత్ లహు అద్ల అష్ర రిఖాబ్”, అతను పది బానిసలను విముక్తి కలిగించినంత పుణ్యం లభిస్తుంది. అతనికి గురించి వంద పుణ్యాలు రాయబడతాయి అతని గురించి. మరియు మూడో లాభం, వంద పాపాలు అతనివి తుడిచివేయబడతాయి. నాలుగవది, “కానత్ లహు హిర్ జమ్ మినష్-షైతాన్”. ఈ వంద సార్లు ఈ దుఆను చదవడం ద్వారా షైతాన్ నుండి అది అతనికి ఒక రక్షణగా ఉంటుంది. ఐదవ లాభం, ఆ రోజు అతని కంటే ఉత్తముడు, మంచివాడు ఇంకా ఎవడూ ఉండడు. ఎవరైనా ఉంటే ఎవరు? వంద సార్లు చదివిన వ్యక్తి లేదా అంతకంటే ఎక్కువ చదివిన వ్యక్తి.

కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే చెప్పారో, షైతాన్ నుండి రక్షణ కలుగుతుంది అని, అక్కడ ఇంకో విషయం చెప్పారు. ఏంటిది? పొద్దున చదివేది ఉంటే సాయంకాలం వరకు. ఈ విధంగా పొద్దున వంద సార్లు, సాయంకాలం వంద సార్లు చదవడానికి. ఇక కొందరు అజ్ఞానులు ఏమంటారో తెలుసా? ఇక ఇదేం, మనం భజన చేసుకుంటూనే ఉండాలి, ఇవే జపించుకుంటూ జపం చేసుకుంటూ ఉండాలి. అస్తగ్ఫిరుల్లాహ్. ఉన్నారా అలాంటి కొందరు మూర్ఖులు కూడా. అల్లాహ్ వారికి, మనకు అందరికీ హిదాయత్ ఇవ్వు గాక.

“లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వ లహుల్ హందు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్” వంద సార్లు చదవడానికి ఐదు నిమిషాలు కూడా పట్టవు. మరి ఎవరైనా చాలా స్లోగా చదివేది ఉంటే, ఆరేడు నిమిషాలు పట్టినా గానీ, 24 గంటల్లోకి వెళ్ళా, ఆరేడు నిమిషాలు, పది నిమిషాలు, దీని ద్వారానే అయితే మనకు పొద్దంతా షైతాన్ నుండి రక్షణ కలుగుతుందో, అలాంటి వాటికి మనం ఐదు, పది నిమిషాలు కేటాయించలేకపోతామా? గమనించండి. మళ్ళీ పోతే ఇవి ఓ మూల కూర్చుని మీరు చదివే అవసరం లేదు. నడుస్తూ నడుస్తూ చదవవచ్చు. ఎక్కడైనా ఏదైనా వెయిటింగ్ లో ఉన్నారు, అక్కడ కూర్చుని చదవండి. కానీ ఏందంటే కొంచెం మనసు పెట్టి చదవండి.

బయటికి వెళ్ళి ఏదైనా పనిలో ఉంటాము, ఏదైనా కార్యంలో ఉంటాము, ఎవరితోనైనా మాట్లాడతాము, అక్కడ ఏం జరుగుతుంది? కోపం వస్తుంది. అల్లాహ్ మనందరినీ కూడా అధర్మ కోపం నుండి కాపాడు గాక. ధర్మపరమైన కోపంలో కూడా హద్దులో ఉండే భాగ్యం కలిగించు గాక. కోపం మితిమీరినప్పుడు కూడా షైతాన్ కు మంచి అవకాశం దొరుకుతుంది. అందు గురించి సామాన్యంగా మనం ఎక్కువగా కోపంలో రాకుండా జాగ్రత్తగా ఉండాలి. చూడండి కొందరికి, కోపం దాని హద్దు మీరింది అంటే, బట్టలు చింపుకుంటాడు, ఏ వస్తువు ఉన్నా గానీ మొబైల్ ఉన్నా గానీ, గంజి ఉన్నా గానీ, చెంచా ఉన్నా గానీ తీసి విసిరేస్తాడు. ఎవరి నెత్తి మీద తలుగుతుంది, ముఖం మీద తలుగుతుంది, ఎలాంటిది ఏదీ చూడడు. అల్లాహ్ త’ఆలా మనందరినీ షైతాన్ నుండి రక్షించు గాక.

అందు గురించి ఏం చేయాలి? “అఊదు బిల్లాహి మినష్-షైతానిర్-రజీమ్” ఎక్కువ చదువుతూ ఉండాలి. మనిషికి కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? “అఊదు బిల్లాహి మినష్-షైతానిర్-రజీమ్” చదువుతూ ఉండాలి. ఒకసారి హజ్రత్ సులైమాన్ బిన్ సురద్ రదియల్లాహు అన్హు ప్రవక్తతో ఉన్నారు. అక్కడే కొంచెం దగ్గర్లో ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. చివరికి బూతు మాటలకు దిగారు, తిట్టుకుంటున్నారు. అందులో ఒక వ్యక్తి ఎంత కోపానికి వచ్చేసాడు అంటే హదీస్ లో ఉంది, అతని చెంపలు ఉబ్బుతున్నాయి, ముఖం ఎర్రగా అయిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, “ఇన్నీ ల అ’లము కలిమతన్”. నాకు ఒక వచనం, ఒక మాట తెలుసు. ఆ మాట ఆ వ్యక్తి పలుకుతే అతని కోపం దిగజారిపోతుంది. మళ్ళీ చెప్పారు, “లౌ కాల అఊదు బిల్లాహి మినష్-షైతాన్”, ఇంకో రివాయత్ లో ఉంది “రజీమ్” అని కూడా. “దహబ అన్హు మా యజిద్”. ఒకవేళ అతను షైతాన్ నుండి అల్లాహ్ రక్షణ కోరుతూ ఉంటే, “అఊదు బిల్లాహి మినష్-షైతానిర్-రజీమ్” చదువుతూ ఉంటే, ఏమవుతుంది? అతని కోపం చల్లారుతుంది, దిగజారిపోతుంది. అందు గురించి కోపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇంకా, షైతాన్ నుండి రక్షణ కొరకు చాలా గట్టి మంచి ఆయుధం. బుల్లెట్ తగలకుండా ఏం చేస్తారు? బుల్లెట్ ప్రూఫ్. ఏదైనా అగ్ని మంటల్లో ఏదైనా పని చేస్తే అట్లాంటి పరిస్థితి వస్తే లేకుంటే అలాంటి భయం ఉండేది ఉంటే, ఏమంటారు దాన్ని? ఫైర్ ప్రూఫ్. అలాంటివి వేసుకొని వెళ్తారు కదా. షైతాన్ ప్రూఫ్ ఏంటి? షైతాన్ నుండి రక్షణ ఉండడానికి ఒకటి “అఊదు బిల్లాహి మినష్-షైతానిర్-రజీమ్” విన్నాం కదా. ఇంకొకటి, “ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలఖ్” మరియు “ఖుల్ అఊదు బిరబ్బిన్-నాస్“. ఈ రెండు సూరాలు, ప్రత్యేకంగా “ఖుల్ అఊదు బిరబ్బిన్-నాస్” ఏముంది?

مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ
(మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్)
గోచర, అగోచరంగా ఉండి చెడు ప్రేరేపణలు చేసేవాని కీడు నుండి. (114:4)
ఎవరి గురించి ఇది? షైతాన్ గురించి.

అయితే ఈ రెండు సూరాలు మంచిగా గుర్తుంచుకోవాలి. మరి ఈ రెండు సూరాల ఘనత ఇంతకు ముందే మనం ఒక సందర్భంలో విని ఉన్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశానుసారం, ప్రతి నమాజ్ తర్వాత చదవాలి, ఒక్కొక్కసారి. “ఖుల్ హువల్లాహు అహద్” అది కూడా ఒకసారి చదవాలి. మరియు పడుకునే ముందు మూడు మూడు సార్లు చదవాలి. చేతి మీద ఊదుకోవాలి. సాధ్యమైనంత వరకు తుడుచుకోవాలి. ఇంకా పొద్దున మూడు సార్లు, సాయంకాలం మూడు సార్లు చదవాలి. ఈ విధంగా మీరు గమనించండి, కనీసం ఒక ముస్లిం పొద్దంతా “ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలఖ్”, “ఖుల్ అఊదు బిరబ్బిన్-నాస్” మరియు “ఖుల్ హువల్లాహు అహద్” రోజుకు 14 సార్లు చదవాలి అన్నటువంటి ఆదేశం మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చారు. ఎన్ని సార్లు? 14 అయినాయా? ఉదయం మూడు సార్లు, సాయంకాలం మూడు సార్లు, పడుకునేటప్పుడు మూడు సార్లు, తొమ్మిది. ఐదు నమాజుల తర్వాత ఒక్కొక్కసారి. ఐదు + తొమ్మిది, 14. ఈ విధంగా.

షైతాన్ నుండి రక్షణ కొరకు, ఇప్పటి వరకు మనం ఇంటి నుండి బయటికి వెళ్ళిన తర్వాత విషయాలు వినుకుంటూ వచ్చాము. ఇక ఇంటికి వచ్చిన తర్వాత, పిల్లల బాధ్యత కూడా చాలా గొప్పగా ఉంటుంది. షైతాన్ అక్కడ కూడా, ఇంకో హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది, షైతాన్ షిర్క్ తర్వాత ఏ పాపంతోని ఎక్కువగా సంతోషిస్తాడో తెలుసా? భార్యాభర్తల్లో దూరం చేయడానికి. ఎవరైతే భార్యాభర్తల్లో లేకుంటే ఇద్దరు స్నేహితుల్లో మంచిగా కలిసి ఉన్న వాళ్లల్లో తెగతెంపులు వేస్తాడో, అలాంటి షైతాన్ తోని షైతాన్ యొక్క నాయకుడు చాలా సంతోషించి అతన్ని దగ్గరకు తీసుకొని అతన్ని షాబాష్ అని అంటాడు.

అందు గురించి ఇంట్లో కూడా షైతాన్ రాకుండా, షైతాన్ నుండి రక్షణ పొంది ఇంటిని, మనల్ని అన్నిటినీ కాపాడుకోవడానికి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొన్ని పద్ధతులు నేర్పారు. అతి ముఖ్యంగా ఇంట్లో ప్రవేశిస్తున్నప్పుడు ఏం చెప్పాలి, ఏం పలకాలి? ఇంట్లో ప్రవేశిస్తున్నప్పుడు ఏం చదువుకొని వెళ్ళాలి? కనీసం ఒక పదం చెప్పండి. ఒక్క మాటలో చెప్పండి. బిస్మిల్లాహ్, షాబాష్. కనీసం “బిస్మిల్లాహ్” అని చదవాలి.

సహీ ముస్లిం షరీఫ్ లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎప్పుడైతే ఒక ముస్లిం ఇంట్లో ప్రవేశిస్తూ బిస్మిల్లాహ్ అంటాడో, అల్లాహ్ యొక్క పేరు తీసుకుంటాడో, అల్లాహ్ యొక్క నామస్మరణ చేస్తాడో, మరియు భోజనం చేస్తున్నప్పుడు కూడా అల్లాహ్ నామస్మరణ చేస్తాడో, షైతాన్ అంటాడు తన యొక్క చిన్న వాళ్లతోని, అసిస్టెంట్లతోని, ఈ ఇంట్లో మనకు ఉండడానికి స్థలము లేదు, తినడానికి తిండి లేదు.

అతి ముఖ్యంగా కనీసం ఈ దుఆ తప్పకుండా చదవాలి, ఈ పదం “బిస్మిల్లాహ్” అని అనాలి. ఇక ఆ తర్వాత రండి, కొన్ని విషయాలు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి, ఈ రోజు నుండే ఇంట్లో పాటించే ప్రయత్నం చేయండి. అల్లాహ్ ఈ సద్భాగ్యం నాకు, మీకు అందరికీ ప్రసాదించు గాక. ఇంట్లో ఎంతైనా గానీ సాధ్యమైనంత వరకు సూర బఖరా చదువుతూ ఉండే ప్రయత్నం చేయాలి. ఖురాన్లో అతి పొడుగు, దీర్ఘంగా, అతి పెద్ద సూర, సూర బఖరా. ప్రతి రోజు సూర బఖరా చదువుకుంటూ ఉంటే ఇక అన్ని పనులు, పాటలు అన్నీ వదిలేసేయాలి మౌల్వి సాబ్ అని అంటారు. అట్లా కాకుండా, ఎంతైనా గానీ కనీసం ఒక పేజీ, ఒక సగం పేజీ, చదువుతూ ఉండే అలవాటు చేసుకోవాలి. ఎందుకు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, “లా తజ్అలూ బుయూతకుమ్ మఖాబిర్”. “మీరు మీ ఇళ్లను సమాధులుగా చేసుకోకండి.”

إِنَّ الشَّيْطَانَ يَنْفِرُ مِنَ الْبَيْتِ الَّذِي تُقْرَأُ فِيهِ سُورَةُ الْبَقَرَةِ
(ఇన్నష్-షైతాన యన్ఫిరు మినల్-బైతిల్లదీ తుఖ్రఉ ఫీహి సూరతుల్-బఖరహ్)
నిశ్చయంగా, ఏ ఇంట్లో సూరతుల్ బఖరా పారాయణం చేయబడుతుందో, ఆ ఇంటి నుండి షైతాన్ పారిపోతాడు.

ఎంత గొప్ప లాభం. సూర బఖరాలోనే ఆయత్ నెంబర్ 255. ఆయతుల్ కుర్సీ అని. కనీసం ఈ సూర, ప్రత్యేకంగా పడుకునేటప్పుడు, ప్రత్యేకంగా పడుకునేటప్పుడు తప్పకుండా చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, సహీ బుఖారీలో హదీస్, “ఇదా ఆవైత ఇలా ఫిరాషిక్”. నీవు నీ పడకపై పడుకోవడానికి వచ్చినప్పుడు, “ఫఖ్ర ఆయతల్ కుర్సీ”, “అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్” ఆయత్ కంప్లీట్ గా చదువు. “హత్తా తఖ్తిమల్ ఆయ” చివరి వరకు. “ఫఇన్నక లన్ యజాల అలైక మినల్లాహి హాఫిద్”. నీవు ఈ ఆయత్ చదివిన తర్వాత, నీ తోడుగా అల్లాహ్ వైపు నుండి ఒక రక్షకుడు ఉంటాడు. అల్లాహు అక్బర్. ఎంత గొప్ప విషయం. కేవలం మనం చదివినందుకు అల్లాహ్ సంతోషపడి అల్లాహ్ మన యొక్క, మనల్ని కాపాడడానికి ఒక రక్షకుణ్ణి నియమిస్తాడు. “వలా యఖ్రబన్నక షైతానున్ హత్తా తుస్బిహ్”. తెల్లవారే వరకు షైతాన్ “లా యఖ్రబన్నక్”, నీ దగ్గరికి రాడు.

అల్లాహ్ నాకు, మీకు మనందరికీ హిదాయత్ ఇవ్వు గాక. ఇంట్లో బిస్మిల్లాహ్ అని ప్రవేశించాము. ఆయతుల్ కుర్సీ చదువుకొని పడక మీద పడుకుంటున్నాము? మరి? ఇష్టమైన మంచి పాటలు వినుకుంటూ, ఫిల్మ్ లు చూసుకుంటూ పడుకుంటున్నాము. ఏమవుతుంది? చోర్ దర్వాజా ఓపెన్ చేసినట్టే కదా. జాగ్రత్తగా ఉండాలి.

ఇంకా సోదరులారా! సూర బఖరాలోనే చివరి రెండు ఆయతులు ఉన్నాయి. సూర బఖరాలో చివరి రెండు ఆయతులు ఉన్నాయి. వాటి గురించి కూడా హదీస్ లో చాలా గొప్ప శుభవార్త, ఎంతో పెద్ద ఘనత తెలుపబడింది. అదేమిటి? సహీ తర్ గీబ్ లో హదీస్ ఉంది. తిర్మిదిలో కూడా.

إِنَّ اللَّهَ كَتَبَ كِتَابًا قَبْلَ أَنْ يَخْلُقَ السَّمَوَاتِ وَالأَرْضَ بِأَلْفَىْ عَامٍ أَنْزَلَ مِنْهُ آيَتَيْنِ خَتَمَ بِهِمَا سُورَةَ الْبَقَرَةِ وَلاَ يُقْرَآنِ فِي دَارٍ ثَلاَثَ لَيَالٍ فَيَقْرَبُهَا شَيْطَانٌ
(ఇన్నల్లాహ కతబ కితాబన్ ఖబ్ల అన్ యఖ్ లుఖస్-సమావాతి వల్-అర్ద బి అల్ఫై ఆమ్, అన్ జల మిన్హు ఆయతైని ఖతమ బిహిమా సూరతల్-బఖరహ్, వలా యుఖ్రఆని ఫీ దారిన్ సలాస లయాలిన్ ఫయఖ్రబహా షైతానున్.)

అల్లాహ్ త’ఆలా భూమ్యాకాశాలను పుట్టించక ముందే రెండు వేల సంవత్సరాల ముందే ఒక కితాబ్, ఒక పుస్తకం రాసాడు. అందులో నుండి రెండు ఆయతులు సూర బఖరా చివరిలో అవతరింపజేశాడు. ఏ ఇంట్లో మూడు రోజుల వరకు దీని తిలావత్ జరుగుతూ ఉంటుందో, అక్కడికి షైతాన్ సమీపించడు. 

ఈ ఆయతులు ఏవి? “ఆమనర-రసూలు బిమా ఉన్ జిల ఇలైహి మిర్-రబ్బిహి వల్-ముఅమినూన్…” అంటే సూర బఖరాలోని చివరి రెండు ఆయతులు.

ఎంత గొప్ప శుభవార్తలో గమనించండి. ఈ రోజుల్లో మనం ఖురాన్ తోని డైరెక్ట్ సంబంధం పెట్టుకొని స్వయంగా మనం చదవడానికి బదులుగా ఏం చేస్తున్నాము? స్వయంగా నమాజ్ సాబ్, అన్ని ఇష్టమైన పాపాలన్నీ చేసుకోవచ్చు, వడ్డీ తినవచ్చు, లంచాలు తినవచ్చు, మంచి హాయిగా పెద్ద బిల్డింగ్ కట్టుకొని అన్ని అక్రమ సంపాదనలతో ఇంట్లో షైతాన్ రాకుండా, అరే ఓ మద్రసా కే బచ్చోంకో బులారే, ఖురాన్ పడా, ఖురాన్ ఖానీ కరా. ఆ మద్రసా పిల్లలను పిలుచుకొచ్చి ఖురాన్ ఖానీ చేస్తే, ఖలాస్ ఇక షైతాన్లన్నీ పారిపోతాయి అనుకుంటారు. సోదరులారా! ఇలాంటి దురాచారాలకు, ఇలాంటి బిద్అత్ లకు మనం పాల్పడకూడదు. మనం ఇష్టం వచ్చినట్లు జీవించుకొని, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని, మనం స్వయంగా ఐదు పూటల నమాజ్ చేయకుండా, స్వయంగా మనం ఇంట్లో ఖురాన్ చదవకుండా, మన పిల్లలకు ఖురాన్ శిక్షణ సరియైన విధంగా ఇవ్వకుండా, ఎవరో వచ్చి మద్రసాలో చదివే పిల్లవాళ్ళు వచ్చి చదివిపోతే ఇంట్లో అంతా బరకతే బరకత్ అవుతుంది, చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి, ఇలాంటి పద్ధతులు సరియైనవి కావు. ఇలాంటి దురాలోచనలకు దూరం ఉండాలి, దురాచారాలకు కూడా మనం దూరం ఉండాలి.

ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సోదరులారా ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ ఇంటి నుండి వెళ్లేటప్పుడు, ఇంట్లో ప్రవేశించేటప్పుడు, ఇంట్లో పాటించేవి, లేక పాటించనివి పద్ధతులు ప్రత్యేకంగా ఇస్లాంలో మనకు ఏవైతే చూపించబడ్డాయో వాటిని మనం అవలంబించాలి. అలాగే మస్జిద్ లో వెళ్ళినప్పుడు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సామాన్యంగా ఒక దుఆ “అల్లాహుమ్మఫ్-తహ్లీ అబ్వాబ రహ్మతిక్” అని నేర్పారు. కానీ అదే కాకుండా ఇంకా ఎన్నో దుఆలు కూడా ఉన్నాయి. “అఊదు బిల్లాహిల్-అజీమ్, వబివజ్-హిహిల్-కరీమ్, వసుల్తానిహిల్-ఖదీమ్, మినష్-షైతానిర్-రజీమ్”.

సునన్ అబూ దావూద్ లో ఈ దుఆ కూడా ఉంది, మస్జిద్ లో వెళ్లేటప్పుడు చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే ఈ దుఆ చదువుకుంటారో, ఒక షైతాన్ అక్కడ ఉండి అంటాడు, ఈ రోజు పొద్దంతా ఇతన్ని నా నుండి కాపాడడం జరిగింది. షైతాన్ స్వయంగా అంటాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఎవరైతే మస్జిద్ లో ప్రవేశించినప్పుడు “అఊదు బిల్లాహిల్-అజీమ్, వబివజ్-హిహిల్-కరీమ్, వసుల్తానిహిల్-ఖదీమ్, మినష్-షైతానిర్-రజీమ్” చదువుతాడో, షైతాన్ ఏమంటాడు? పొద్దంతా ఇతన్ని నా నుండి కాపాడడం జరిగింది. కొన్ని మస్జిద్ ల మీద ఈ దుఆ రాసి కూడా ఉంటుంది. లేనికాడ మీరు ప్రింట్ చేయించుకొని దాన్ని అతికించే ప్రయత్నం చేయండి. కనీసం చూసి అయినా గానీ చదవవచ్చు.

ఈ రోజు మనం హదీస్ ల ఆధారంగా, కొన్ని ఖురాన్ ఆయతుల ఆధారంగా షైతాన్ నుండి రక్షణ పొందుటకు ఏ కొన్ని మార్గాలైతే మనం విన్నామో, కొన్ని పద్ధతులు తెలుసుకున్నామో, వాటిపై ఆచరించే భాగ్యం అల్లాహ్ మనకు, మనందరికీ ప్రసాదించు గాక. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

జుమా నమాజును వదలడం పాపమా? [ఆడియో, టెక్స్ట్]

[5 నిముషాలు]
https://youtu.be/J8IAEgfxvtk
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

జూమా నమాజ్ వదిలివేయడం ఘోరమైన పాపాలలో ఒకటి మరియు కబీరా గునా (పెద్ద పాపం). దీనికి సాధారణ పుణ్యాలు ప్రాయశ్చిత్తం కావు, ప్రత్యేకమైన తౌబా (పశ్చిత్తాపం) అవసరం. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జూమాను విడిచిపెట్టిన వారి ఇళ్లను తగలబెట్టాలని తీవ్రంగా ఆకాంక్షించారు, ఇది ఈ పాపం యొక్క తీవ్రతను సూచిస్తుంది. సరైన కారణం లేకుండా ఉద్దేశపూర్వకంగా వరుసగా మూడు జూమా నమాజ్‌లను వదిలివేసే వారి హృదయాలపై అల్లాహ్ ముద్ర వేస్తాడని మరియు వారు ఏమరుపాటులో పడినవారిలో కలిసిపోతారని కూడా ఆయన హెచ్చరించారు.అందువల్ల, ప్రతి ముస్లిం జూమా నమాజ్‌ను తప్పనిసరిగా పాటించాలి మరియు దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

జూమా నమాజ్‌ను వదలడం పాపమా?

సోదర మహాశయులారా, ఈ రోజుల్లో మనిషి ప్రాపంచిక జీవితంలో లీనమైపోయి మరియు పరలోకాన్ని మరిచిపోయి, ఐదు పూటల నమాజ్‌లను విలువ లేకుండా, ఎలాంటి భయం లేకుండా వదిలేస్తున్నాడంటే, జూమా నమాజ్‌లను కూడా ఎంతోమంది ఎన్నో సాకులు చెప్పుకుంటూ వదిలేస్తున్నారు.

అయితే, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం ఒక విషయం, రెండు హదీసులను మీకు వినిపిస్తాను. దీని ద్వారా మీరు గుణపాఠం నేర్చుకొని ఇక నుండి ఏ ఒక్క రోజు కూడా జూమా వదలకుండా ఉండడానికి జాగ్రత్త పడండి.

ఒక విషయం ఏంటి? సోదర మహాశయులారా, జూమా నమాజ్‌ను వదలడం చిన్న పాపం కాదు. సరైన కారణం లేకుండా జూమా నమాజ్‌ను వదలడం ఘోరమైన పాపాల్లో ఒకటి, ‘కబీరా గునా’ అని ఏదైతే అంటారో. మరియు సామాన్యంగా ఖురాన్ ఆయతులు మరియు హదీసుల ద్వారా మనకు ఏం తెలుస్తుంది?

إِن تَجْتَنِبُوا كَبَائِرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنكُمْ سَيِّئَاتِكُمْ
(ఇన్ తజ్తనిబూ కబాయిర మా తున్‌హౌన అన్‌హు నుకఫ్ఫిర్ అన్‌కుం సయ్యిఆతికుమ్)
మీకు నిషేధించబడిన ఘోరమైన పాపాలను మీరు వదిలివేస్తే, మేము మీ చెడులను మీ నుండి తొలగిస్తాము.

ఇంకా వేరే ఇలాంటి ఆయతులు ఈ భావంలో హదీసులు ఉన్నాయి. అంటే ఈ కబీరా గునా, ఘోరమైన పాపాలు అట్లే క్షమింపబడవు. దాని గురించి ప్రత్యేకమైన తౌబా (పశ్చిత్తాపం) అవసరం. కొన్ని సందర్భాల్లో కొన్ని పుణ్యాలు చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని మనం వింటాము కదా? అలాంటి పాపాల్లో ఈ జుమాను వదలడం రాదు. అందు గురించి భయపడండి.

అంతేకాదు, ప్రవక్త మహానీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జూమా నమాజ్‌కు ఎంత గొప్ప విలువ ఇచ్చారో గమనించండి. సహీ ముస్లిం షరీఫ్‌లోని హదీస్, హదీస్ నెంబర్ 652.

హజ్రత్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు:

قَالَ لِقَوْمٍ يَتَخَلَّفُونَ عَنِ الْجُمُعَةِ: لَقَدْ هَمَمْتُ أَنْ آمُرَ رَجُلاً يُصَلِّي بِالنَّاسِ، ثُمَّ أُحَرِّقَ عَلَى رِجَالٍ يَتَخَلَّفُونَ عَنِ الْجُمُعَةِ بُيُوتَهُمْ.
(ఖాల లిఖౌమిన్ యతఖల్లఫూన అనిల్-జుముఅతి: లఖద్ హమమ్తు అన్ ఆముర రజులన్ యుసల్లీ బిన్నాసి, సుమ్మ ఉహర్రిక అలా రిజాలిన్ యతఖల్లఫూన అనిల్-జుముఅతి బుయూతహుమ్)

జూమా నమాజ్ నుండి వెనుక ఉండిపోయే ప్రజల గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ప్రజలకు నమాజ్ చేయించడానికి నేను ఒక వ్యక్తిని ఆదేశించి, ఆ తర్వాత జూమాకు రాకుండా తమ ఇళ్లలో ఉండిపోయిన వారి ఇళ్లను తగలబెట్టాలని నేను నిశ్చయించుకున్నాను.”

వారి ఇండ్లకు మంట పెట్టాలి అన్నటువంటి కాంక్ష ఉంది. కానీ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అలా చేయలేదు. సోదర మహాశయులారా, ప్రవక్త ఇంత భయంకరమైన శిక్ష వారికి తమ జీవిత కాలంలో ఇవ్వాలని, వారు బ్రతికి ఉన్నప్పుడే వారి ఇండ్లను కాలబెట్టాలని కోరారంటే, ఈ పాపం చిన్న పాపమా సోదరులారా?

మరొక హదీసును విన్నారంటే, ఇంకా భయకంపితలు అయిపోవాలి. జుమా ఇక ఎన్నడూ వదలకుండా ఉండడానికి అన్ని రకాల మనం సంసిద్ధతలు ముందే చేసుకొని ఉండాలి. ఈ హదీస్ కూడా సహీ ముస్లింలో ఉంది, హదీస్ నెంబర్ 865.

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ మరియు హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా మేము విన్నాము అని అంటున్నారు. ఏం చెప్పారు ప్రవక్త?

لَيَنْتَهِيَنَّ أَقْوَامٌ عَنْ وَدْعِهِمُ الْجُمُعَاتِ، أَوْ لَيَخْتِمَنَّ اللَّهُ عَلَى قُلُوبِهِمْ، ثُمَّ لَيَكُونُنَّ مِنَ الْغَافِلِينَ.
(లయన్‌తహియన్న అఖ్వామున్ అన్ వద్ఇహిముల్-జుముఆతి, అవ్ లయఖ్తిమన్నల్లాహు అలా ఖులూబిహిమ్, సుమ్మ లయకూనున్న మినల్-గాఫిలీన్)

“ప్రజలు జూమా నమాజ్‌లను వదిలివేయడం మానుకోవాలి, లేకపోతే అల్లాహ్ వారి హృదయాలపై ముద్ర వేస్తాడు, అప్పుడు వారు ఏమరుపాటులో పడినవారిలో కలిసిపోతారు.”

ఎవరి హృదయాలపై ముద్ర పడిపోతుందో వారు ఏమరుపాటులో గురి అయిన వారిలో కలిసిపోతారు. అల్లాహ్ ఇలాంటి వారి నుండి మనల్ని కాపాడుగాక. ఖురాన్‌లో ‘గఫ్లా’ (ఏమరుపాటు), ‘గాఫిలీన్’ (ఏమరుపాటులో పడినవారు) అన్న పదం ఎక్కడెక్కడ వచ్చిందో చూసి, దాని అనువాదం, దాని వెనకా ముందు ఉన్నటువంటి శిక్షలు చదివి చూడండి.

జుమాలను వదిలినందుకు రెండు శిక్షలు ఇక్కడ ఇవ్వబడుతున్నాయి చూడండి. ఒకటి ఈ హదీసులో మనం ఇప్పుడు తెలుసుకున్న హదీసులో: ఒకటి, అల్లాహ్ ముద్ర వేసేస్తాడు. రెండవది, ఏమరుపాటిలో గురి అయిన వారిలో మనం కలిసిపోతామంటే, భయంకరమైన శిక్ష కాదా?

అల్లాహు తఆలా మనందరికీ హిదాయత్ ఇవ్వుగాక. ఇకనైనా భయపడండి. ఇన్ని రోజుల జీవితం ఇహలోకంలో. అల్లాహ్ యొక్క ఆదేశాల ప్రకారం జీవితం గడిపి, మనం భక్తుల్లో, నరకం నుండి ముక్తి పొందే వారిలో, సత్పురుషుల్లో చేరే ప్రయత్నం చేద్దాము.

అల్లాహ్ మనందరికీ స్వర్గంలో చేర్పించేటువంటి ప్రతి సత్కార్యం చేసే సద్భాగ్యం ప్రసాదించుగాక. వ ఆఖిరు దావాన అనిల్-హందులిల్లాహ్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

భార్యతో మలమార్గం ద్వారా సంభోగించడం | ఇస్లామీయ నిషిద్ధతలు [వీడియో| టెక్స్ట్ ]

ఈ ప్రసంగంలో, భార్యతో మల మార్గం ద్వారా సంభోగించడం ఇస్లాంలో ఘోరమైన పాపమని, దీనికి పాల్పడే వారిపై అల్లాహ్ శాపం ఉంటుందని హదీసుల ఆధారంగా వివరించబడింది. కొందరు భర్తలు తమ కోరికలను తీర్చుకోవడానికి ఖుర్ఆన్ ఆయతులను తప్పుగా అన్వయించి, భార్యలను మోసం చేయడం లేదా బెదిరించడం వంటివి చేస్తున్నారని ప్రస్తావించబడింది. ఈ దుశ్చర్యలకు కారణం అజ్ఞానం, వివాహానికి ముందున్న చెడు అలవాట్లు, మరియు పాశ్చాత్య సంస్కృతి, నీలి చిత్రాల ప్రభావం అని పేర్కొనబడింది. ఇస్లాం పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, మలమూత్ర విసర్జన తర్వాత ఎడమ చేతితో శుభ్రపరుచుకోవాలని చెప్పిన ధర్మంలో, నోటితో మర్మాంగాలను తాకడం వంటివి ఎంతమాత్రం అనుమతించబడవని స్పష్టం చేయబడింది. వైవాహిక జీవితంలో ఇస్లామీయ హద్దులను పాటించి, పవిత్రంగా జీవించాలని, చెడు అలవాట్లను విడిచిపెట్టి పశ్చాత్తాపం చెందాలని ఉపదేశించబడింది.

కొందరు బలహీన విశ్వాసులు తమ భార్యలతో మల మార్గం ద్వారా సంభోగించడంలో వెనకాడరు. ఇది ఘోర పాపాల్లో పరిగణించబడుతుంది. ఇది ఘోర పాపాల్లో పరిగణించబడుతుందని బహుశా వారికి తెలియదేమో. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా శపించారో గుర్తుందా? అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీస్ వినండి:

مَلْعُونٌ مَنْ أَتَى امْرَأَتَهُ فِي دُبُرِهَا
(మల్’ఊనున్ మన్ అతా ఇమ్రఅతహూ ఫీ దుబురిహా)
తన భార్యతో మల మార్గం ద్వారా సంభోగించే వాడిపై శాపం కురియు గాక. (అబూ దావూద్ 2162 సహీహుల్ జామి 5865).

అల్లాహ్ అన్ని రకాల శాపనాల నుండి, శాపనాలకు గురి అయ్యే కార్యాల నుండి దూరం ఉంచు గాక.

అయితే సోదర మహాశయులారా, ఇంతకుముందే మనం ఒక హదీస్ చదివి ఉన్నాము, రుతుస్రావంలో కలిసే వారి గురించి. ఆ హదీస్ ఇక్కడ కూడా వస్తుంది. ఎందుకంటే అందులో కూడా వచ్చింది,

مَنْ أَتَى حَائِضًا أَوْ امْرَأَةً فِي دُبُرِهَا أَوْ كَاهِنًا فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ ﷺ

“రుతువుస్రావంలో ఉన్న భార్యతో సంభోగించువాడు, లేదా భార్యతో మల మార్గం ద్వారా సంభోగించువాడు మరియు జ్యోతిష్యుని వద్దకు వెళ్ళేవాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించినదానిని తిరస్కరించినవాడగును“. (తిర్మిజి 135, సహీహుల్ జామి 5918).

సోదర మహాశయులారా, స్వాభావిక గుణం గల ఎందరో భార్యలు ఈ పద్ధతిని తిరస్కరిస్తారు. కానీ కొందరు భర్తలే విడాకులిస్తానని బెదిరిస్తారు. మల మార్గం ద్వారా వారు తమ కోరికను పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. అయితే వారు గమనించాలి, వారు రెండు రకాల పాపాలు, రెండు రకాల ఘోరమైన స్థితులకు గురవుతున్నారు. ఒకటి, శాపం వారిపై పడుతుంది. రెండవది, కుఫ్ర్ లో పడిపోతున్నారు వారు.

ఇక మరికొందరు భర్తలు ఎలా ఉన్నారంటే నవూజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, ఖుర్ఆన్ ఆయత్ యొక్క భావం తప్పుగా చెప్తారు. అరే భర్త అయితే ఖుర్ఆన్ ఆయత్ చెప్తున్నాడు, తన తప్పుడు కోరికను పూర్తి చేసుకోవడానికి, మరి ఎవరైనా ఆలిమ్ ను అడుగుదామా, ఈ ఆయత్ యొక్క సరైన భావం ఏంటి అని అనుకుంటారు కొందరు స్త్రీలు. కానీ సిగ్గుపడి అడగలేరు. వారి గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది, శ్రద్ధ వహించండి. పండితులతో ప్రశ్నించి తెలుసుకోవడానికి సిగ్గుపడే తమ భార్యలను కొందరు భర్తలు మోసం చేసి మల మార్గం ద్వారా వారి కోరికను పూర్తి చేసుకునే విధానం యోగ్యమని ఖుర్ఆన్ యొక్క ఈ ఆయత్ చూపుతారు. ఏంటి ఆ ఆయత్?

[نِسَاؤُكُمْ حَرْثٌ لَكُمْ فَأْتُوا حَرْثَكُمْ أَنَّى شِئْتُمْ]
(నిసాఉకుమ్ హర్సుల్లకుమ్ ఫ’తూ హర్సకుమ్ అన్నా షి’తుమ్)
మీ భార్యలు మీకు పంటపొలాల (వంటివారు), కావున మీ పొలాలకు మీరు కోరిన విధంగా పోవచ్చు. (బఖర 2: 223).

మీరు కోరిన విధంగా మీ యొక్క భార్యలతో మీరు ఉండండి అన్నటువంటి విషయం దీన్ని ప్రస్తావించి, తమ ఆ నిషిద్ధ కార్యం చేయడానికి ఈ ఆయత్ ను దలీల్ గా తీసుకుంటారు. కానీ వారికి తెలిసి ఉండాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులు ఖుర్ఆన్ ఆయతుల భావాన్ని విశదీకరిస్తాయి. అయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో చెప్పారు, భర్త తన భార్యతో సంభోగించడానికి ఆమె ముందు నుండి, ఆమె వెనుక నుండి ఎలా వచ్చినా సరే, కానీ సంతానం కలిగే దారి నుండే సంభోగించాలి.

అయితే మలము వచ్చే దారి నుండి సంతానం కలగదు అన్న విషయం అందరికీ తెలిసినదే. ఇంతటి ఘోర పాపానికి ఒడిగట్టే కారణాలు ఏమిటో తెలుసా? పవిత్ర దాంపత్య జీవితంలో కాలు మోపే ముందు అజ్ఞానపు దుశ్చేష్టలకు పాల్పడి ఉండడం. నిషిద్ధమైన, భిన్నమైన, అసాధారణ పద్ధతులకు వారు అలవాటు పడి ఉండడం. లేదా నీలి చిత్రాల్లోని, కొందరికి బ్లూ ఫిలిమ్స్ చూసేటటువంటి అలవాటు, ఇక పెళ్ళైన తర్వాత కూడా ఆ రోజుల్లో లేక ఆ సమయంలో కూడా చూస్తూ ఉండేటటువంటి కొన్ని సంఘటనలు వారి జ్ఞాపక శక్తిలో నాటుకుపోయాయో వాటిని వారు వదులుకోలేకపోతారు.

అయితే ఇలాంటి వారందరూ కూడా తమ దుశ్చేష్టలను మానుకోవాలి, చెడ్డ అలవాటులను వదులుకోవాలి. అల్లాహ్ తో స్వచ్ఛమైన తౌబా చేయాలి. వారు చేయరు గనక ఇంకింత అలాంటి పాపాల్లోనే కూరుకుపోతూ ఉంటారు.

మరొక ముఖ్య విషయం గమనించండి, భార్య భర్తలిద్దరూ ఏకమై, ఇష్టపడి ఈ దుష్కార్యం చేసుకున్నా అది నిషిద్ధమే అవుతుంది. ఏదైనా నిషిద్ధ కార్యం ఇష్టపడి చేసినంత మాత్రాన ధర్మసమ్మతం కాజాలదు.

సోదర మహాశయులారా, ఇక్కడి వరకు ఈనాటి పాఠాలు పూర్తిగా అయిపోయాయి. కానీ చివరిలో లేక ఈ రోజులో చదివినటువంటి పాఠాల్లో భార్య భర్తల విషయం గురించి ఎన్నో అంశాలు వచ్చినాయి గనక మరొక విషయం చాలా ముఖ్యమైనది మిగిలిపోతుంది. దాన్ని సంక్షిప్తంగా చెప్పేసి నేను నా పాఠాన్ని ముగించేస్తాను.

చివరి పాఠంలో మీరు ఒక విషయం విన్నారు కదా, కొందరు భర్తలు భార్యలకు మోసం చేసి ఖుర్ఆన్ ఆయతులతో తప్పుడు భావం చెప్పే ప్రయత్నం చేస్తారు. విన్నారు కదా? అలాగే మరికొందరు భర్తలు ఖుర్ఆన్ లోని మరొక ఆయత్:

هُنَّ لِبَاسٌ لَّكُمْ وَأَنتُمْ لِبَاسٌ لَّهُنَّ
(హున్న లిబాసుల్లకుమ్ వ అన్తుమ్ లిబాసుల్లహున్న)
వారు (భార్యలు) మీ కొరకు వస్త్రధారణ, మీరు వారి కొరకు వస్త్రధారణ. (2:187)

భార్యలు భర్తల కొరకు, భర్తలు భార్యల కొరకు వారి యొక్క వస్త్రధారణ, అని ఏదైతే ఆయత్ ఉందో, దీని ద్వారా భార్యలకు మోసం చేసి మరిన్ని చెడు అలవాట్లకు పాల్పడతారు. దుష్కార్యాలకు పాల్పడతారు. అదేంటి? కొందరు భర్తలు భార్యలకు బలవంతం చేస్తారు వారి మర్మాంగాన్ని తమ నోట్లో తీసుకోవాలని.

ఎందరో పురుషులు పరస్పరం కలుసుకొని, ప్రత్యేకంగా కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి యువకులు తమ యొక్క ఫ్రెండ్స్ తో తమ యొక్క భార్యల గురించి ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ ఉంటారు. కొందరు పురుషులు కూడా వచ్చి ఇలాంటి ప్రశ్నలు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి.

భార్య భర్తలిద్దరూ కూడా ఒకరు మరొకరి మర్మాంగాన్ని నోట్లో తీసుకోవడం, ఇంకా వేరే ఇలాంటి ఏ పనులైనా గానీ, ఇవన్నీ కూడా తప్పుడు అలవాటులు. వాస్తవానికి ఈ కల్చర్ చాలా చెండాలమైనది. ఇస్లామీయ సంస్కృతి, కల్చర్ ఎంతమాత్రం కాదు. వెస్ట్రన్ కల్చర్ ఇది. వాస్తవంగా ఈ సమస్య సుమారు ఈనాటికి 20 సంవత్సరాల క్రితమే కొందరు చాలా అరుదుగా అడిగారు. అప్పుడే నేను ఆనాటి, అంటే 20 సంవత్సరాల క్రితమే అప్పుడు చాలా పెద్ద వయసులో ఉన్న కొందరు ఉలమాలను అడిగితే, వారు ఆశ్చర్యపడ్డారు. ఇలాంటి వాటికి కూడా పాల్పడతారా? వాస్తవానికి ఇది వెస్ట్రన్ నుండి వచ్చినదే. ఈ బ్లూ ఫిలిమ్ లు, ఇంకా వెస్ట్రన్ యొక్క నగ్న చిత్రాలు, ఫిలిమ్ లు అన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రబలిపోతున్నాయి.

ఇందులో ఉన్నటువంటి చెడులను నేను సైంటిఫిక్ పరంగా తెలపడం లేదు. మీ బుద్ధి జ్ఞానాలకు అర్థమయ్యే రీతిలో, సులభమైన రీతిలో కొన్ని విషయాలు చెప్తున్నాను, గమనించండి. ఏ పవిత్రమైన, పరిశుభ్రమైన ఇస్లాం ధర్మం, ఎడమ చేతితోనే ఇస్తింజా చేయాలి, మలమూత్ర విసర్జన తర్వాత శుభ్రత అనేది కేవలం ఎడమ చెయ్యితో చేయాలి, కుడి చెయ్యిని కూడా తాకనివ్వకూడదు అని చెప్పిందో, అలాంటి ధర్మం నోట్లో తీసుకోవడానికి, నాకడానికి, ఆ ఇలాంటి ఇంకా చెడు వాటికి అనుమతి ఇస్తుందా? గమనించండి.

భార్య భర్తలు ఇద్దరు, వారి మధ్యలో ఏ పరదా లేదు అంటే ఇక వేరే ఏ హద్దులూ లేవు, ఎలా ఇష్టం ఉంటే అలా, ఇలాంటి భావం తీసుకోవడం చాలా తప్పు. అందుకొరకే ఇస్లాం ధర్మం గురించి తెలుసుకునే ప్రయత్నం ఇంకా చేస్తూ ఉండాలి కానీ, ఎక్కడో ఒక ఆయత్, ఎక్కడో ఒక హదీస్ తీసుకొని, విని, తన ఇష్ట ప్రకారంగా దాన్ని ధర్మపరంగా అనుమతించినదే అని భావిస్తూ చేయడం ఇది మరీ చాలా ఘోరమైన పొరపాటు, ఘోరమైన తప్పు.

ఇక ఇలాంటి ఈ దుశ్చేష్టల వల్ల, నోట్లో తీసుకునే అటువంటి బలవంతాలు చేయడం ద్వారా ఏ ఏ రోగాలకు గురి అవుతున్నారో, వాటి గురించి నేను ఆ వివరణలోకి వెళ్ళను. ధర్మవేత్తలు కొందరు, డాక్టర్ల యొక్క సలహాలతో అవన్నీ వివరాలు కూడా తెలిపారు. సంక్షిప్తంగా చెప్పేది ఏంటంటే, వీటన్నిటికీ దూరంగా ఉండండి, ధర్మంగా జీవించే ప్రయత్నం చేయండి. ఇస్లాం ధర్మం, ఇది ఎవరో కొందరు థింక్ ట్యాంకర్స్ లేదా పరిశోధన చేసిన ప్రయత్నాలు కావు. మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్, మనందరి కొరకు కారుణ్యమూర్తిగా చేసి పంపిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా పంపినటువంటి సత్య ధర్మం. ప్రళయం వరకు వచ్చే అన్ని సమస్యలకు ఉత్తమ మంచి పరిష్కారం ఉంది. చివరికి వైవాహిక జీవితంలో, సామాజిక జీవితంలో, భార్య భర్తల జీవితంలో కూడా, ఇందులో ఏ నిషిద్ధతలు ఉన్నాయో, ఏ చెడులు ఉన్నాయో వాటికి దూరంగా ఉండడంలోనే మన జీవితాలు పరిశుభ్రంగా ఉంటాయి.

అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక. అన్ని రకాల చెడుల నుండి దూరం ఉంచు గాక. ఆమీన్. వా ఆఖిరు ద’వాన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=7377

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

మరణం మరియు సమాధి శిక్షల వివరాలు, సందేహ సమాధానాలు [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణం మరియు సమాధి శిక్షల వివరాలు, సందేహ సమాధానాలు
https://www.youtube.com/watch?v=_HrW7uu-pc4 [14 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం మరణం మరియు సమాధి జీవితం (బర్ జఖ్) గురించిన వివిధ ప్రశ్నలకు సమాధానమిస్తుంది. మరణ దూత (మలకుల్ మౌత్) అందరికీ ఒకరేనని, వేర్వేరు మతాల వారికి వేర్వేరు దూతలు ఉండరని స్పష్టం చేస్తుంది. విశ్వాసులు మరియు అవిశ్వాసుల మరణ అనుభవాలలో తేడా ఉంటుందని సహీ హదీసుల ఆధారంగా వివరిస్తుంది. విశ్వాసి ఆత్మ శాంతియుతంగా తీయబడి, స్వర్గపు సువాసనలతో స్వీకరించబడి, ఆకాశాలలో గౌరవించబడుతుంది. దీనికి విరుద్ధంగా, అవిశ్వాసి ఆత్మ కఠినంగా తీయబడి, నరకపు దుర్వాసనలతో అవమానించబడుతుంది. సమాధిలో పెట్టడం అనేది సాధారణ పద్ధతి అయినప్పటికీ, దహనం చేయబడిన లేదా ఏ విధంగానైనా శరీరం నాశనమైనప్పటికీ, ఆత్మకు శిక్ష లేదా బహుమానం తప్పదని ఖురాన్ మరియు హదీసుల ద్వారా వివరిస్తుంది. ఈ మధ్య కాలాన్ని “బర్ జఖ్” అని అంటారు. చివరగా, సమాధిలో జరిగే ముగ్గురు దేవదూతల ప్రశ్నలు (నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? నీ ప్రవక్త ఎవరు?) మరియు వాటికి విశ్వాసులు, అవిశ్వాసులు ఇచ్చే సమాధానాలను చర్చిస్తుంది.

أَسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ
(అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బ’అద్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు. మరియు ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారి కుటుంబ సభ్యులు మరియు సహచరులందరిపై శాంతి మరియు శుభాలు కురియుగాక. ఇక ఆ తర్వాత.

చావు మరియు సమాధి శిక్షణ గురించి ఒక ప్రశ్న వచ్చింది. వాస్తవానికి ఆ ప్రశ్నలో ఎన్నో ఇంకా లింక్ ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానంగా ఈ ఆడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. శ్రద్ధగా వింటారని, విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.

మొదటి విషయం ఏమిటంటే, సామాన్యంగా చావు దూత అని, మలకుల్ మౌత్ అని, మౌత్ కా ఫరిష్తా అని, లేదా యమదూత అని ఏదైతే అంటారో, హిందువులకు వేరు, ముస్లింలకు వేరు, క్రైస్తవులకు వేరు, వేరే ఇంకా మతాలు అవలంబించే వారికి వేరు, అలాగా ఏమీ లేరు. ఇలాంటి భ్రమలో నుండి మనం బయటికి రావాలి. వాస్తవానికి, ప్రాణం తీసే దూత మరియు ఆయనకు తోడుగా వచ్చే అటువంటి దూతలు, ఆ తోడుగా వచ్చే దూతల యొక్క సంఖ్య అల్లాహ్ కు మాత్రమే తెలుసు. అయితే, ఇక్కడ మనకు ఖురాన్ హదీస్ ద్వారా తెలుస్తున్న విషయం ఏంటంటే, విశ్వాసులు, పుణ్యాత్ములు వీరికి వీరి యొక్క ప్రాణం ఒక రకంగా తీయడం జరుగుతుంది మరియు ఎవరైతే అవిశ్వాసులు లేదా విశ్వాసులుగా ఉండి కలిమా చదివి కూడా మహా పాపాత్ములు ఉంటారో వారి యొక్క ప్రాణం మరో రకంగా తీయడం జరుగుతుంది అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఖురాన్ యొక్క ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఏదైనా వేరే సందర్భంలో ఆ ఆయతులు, ఆ వాటి యొక్క అర్థం భావం అనేది ఇన్ షా అల్లాహ్ రికార్డ్ చేసి పంపుదాము. కానీ సంక్షిప్తంగా ప్రస్తుతం ఏంటంటే, సహీ హదీస్లో వచ్చిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు.

విశ్వాసుడు, పుణ్యాత్ముడు అతని ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు, ప్రాణం తీసే దూత, ఆయన కూడా దైవదూతనే, ప్రాణం తీసే దూత వస్తాడు మరియు స్వర్గం నుండి కరుణ దూతలు కూడా హాజరవుతారు. స్వర్గం నుండి వారు సువాసనతో కూడి ఉన్నటువంటి వస్త్రాలు తీసుకొని వస్తారు. ఆ తర్వాత అతని దగ్గర కూర్చుండి, ప్రభువు యొక్క కారుణ్యం వైపునకు, అల్లాహ్ యొక్క సంతృష్టి వైపునకు వచ్చేసెయ్ ఓ పవిత్ర ఆత్మా, ఈ రోజు నీపై నీ ప్రభువు ఏమీ కోపగించుకోకుండా నీ పట్ల సంతృప్తి కలిగి ఉన్నాడు అన్నటువంటి శుభవార్తలు వినిపిస్తూ ఉంటారు. దీని సంక్షిప్త విషయం ఖురాన్ సూరే హామీమ్ అస్సజ్దాలో కూడా వచ్చి ఉంది.

وَأَبْشِرُوا بِالْجَنَّةِ الَّتِي كُنتُمْ تُوعَدُونَ
(వ అబ్షిరూ బిల్ జన్నతిల్లతీ కున్తుం తూ’అదూన్)
“మీకు వాగ్దానం చేయబడిన స్వర్గం ఇదేనని సంతోషించండి.” (41:30)

ఇక ప్రాణం తీసే దూత ఎంతో సునాయాసంగా, నిదానంగా మంచి విధంగా అతని యొక్క ప్రాణం తీస్తాడు. ఆ మనిషి యొక్క ఆత్మ కూడా మంచి విధంగా ఆ ప్రాణం తీసే దూత యొక్క చేతుల్లోకి వచ్చేస్తుంది. దానికి కూడా హదీసుల్లో కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ దైవదూతలు వెంటనే ఆ సువాసనలతో కూడి ఉన్నటువంటి స్వర్గపు వస్త్రాలలో ఆ ఆత్మను చుట్టుకొని ఆకాశం పైకి వెళ్తారు. మొదటి ఆకాశం ద్వారాలు మూయబడి ఉంటాయి. అయితే అక్కడ తీసుకుపోయే దూతలు పర్మిషన్ కోరుతారు. ఆకాశపు యొక్క ఆ దూతలు అడుగుతారు, ఈ మంచి ఆత్మ ఎవరిది మీరు తీసుకొని వస్తున్నారు? అయితే అతని యొక్క మంచి పేరు, మంచి గుణాలు ఈ దైవదూతలు తెలియజేస్తారు. ఆకాశపు ద్వారాలు తెరవబడతాయి. ఆ మొదటి ఆకాశపు దైవదూతలు ఘనంగా ఇతన్ని స్వాగతిస్తూ ఆ దూతలతో కలిసి ఇంకా పైకి వెళ్తారు. ఈ విధంగా రెండో ఆకాశం పైకి చేరుతారు. అలాగే అక్కడ కూడా స్వాగతం జరుగుతుంది, ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. చివరికి ప్రతి ఆకాశంలో కూడా అలాగే జరుగుతుంది. ఏడో ఆకాశం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అలాగే జరుగుతుంది. అప్పుడు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆదేశం వస్తుంది. నా యొక్క ఈ దాసుని యొక్క ఆ నామము عِلِّيِّينَ (ఇల్లియీన్) ఉన్నతమైన స్థానం లో రాయండి. మరో ఉల్లేఖన ప్రకారం, ఇతని యొక్క ఆత్మ అనేది ఏదైతే ఉందో, దీని ఇతడు స్వర్గపు యొక్క రుచులు, స్వర్గపు యొక్క మంచి అనుభవాలు పొందుతూ ఉంటాడు. కానీ, మళ్ళీ అతన్ని ప్రశ్నించడానికి తిరిగి ఆ మనిషిని ఏదైతే సమాధిలో ఖననం చేయడం జరుగుతుందో, ఆ అతని శరీరంలో పంపడం జరుగుతుంది. ఇది విశ్వాసుడు, పుణ్యాత్ముని యొక్క ఆత్మ ఏదైతే తీయడం జరుగుతుందో దాని యొక్క సంక్షిప్త విషయం.

ఇక మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కాఫిర్ (అవిశ్వాసుడు), ఫాసిఖ్ వ ఫాజిర్ (పాపాత్ములు) వారి యొక్క ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు ప్రాణం తీసే దూత వస్తాడు మరియు నరకం నుండి శిక్ష దూతలు దుర్వాసనతో కూడి ఉన్న చెడ్డ వస్త్రాలను తీసుకొని వస్తారు. ప్రాణం తీసే దూత ఓ చెడు ఆత్మా, వచ్చేసెయ్ అల్లాహ్ యొక్క కోపం, ఆగ్రహం వైపునకు అని అంటారు. అతని యొక్క ఆత్మ శరీరంలో తిరుగుతుంది. ఆ ప్రాణం తీసే దైవదూత చేతిలోకి రావడానికి రెడీగా ఉండదు. కానీ బలవంతంగా తీయడం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే ఆ దూతలు ఆ వస్త్రాల్లో చుట్టుకొని పైకి వెళ్తారు. కానీ ఆకాశపు ద్వారాలు తెరవబడవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ లోని ఈ ఆయత్ కూడా చదివారు:

لَا تُفَتَّحُ لَهُمْ أَبْوَابُ السَّمَاءِ
(లా తుఫత్తహు లహుమ్ అబ్వాబుస్ సమా’)
వారి కొరకు ఆకాశ ద్వారాలు తెరవబడవు. (7:40)

మళ్ళీ అక్కడి నుండే అతని యొక్క ఆత్మను క్రిందికి విసిరివేయడం జరుగుతుంది. మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరే హజ్ లోని ఆయత్ చదివారు:

وَمَن يُشْرِكْ بِاللَّهِ فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ فَتَخْطَفُهُ الطَّيْرُ أَوْ تَهْوِي بِهِ الرِّيحُ فِي مَكَانٍ سَحِيقٍ
(వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫక అన్నమా ఖర్ర మినస్ సమా’ఇ ఫతఖ్తఫుహుత్ తైరు అవ్ తహ్వీ బిహిర్ రీహు ఫీ మకానిన్ సహీఖ్)
అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించేవాడు ఆకాశం నుండి క్రింద పడిపోయిన వాని వంటివాడు. పక్షులు అతన్ని తన్నుకుపోతాయి, లేదా గాలి అతన్ని దూరప్రాంతానికి విసిరివేస్తుంది. (22:31)

అంటే అల్లాహ్ తో పాటు షిర్క్ చేసేవారు, ఇలా పాపాలలో తమ జీవితం పూర్తిగా గడిపేవారు, పాపాలలో విలీనమైన వారు, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వారి యొక్క ఉపమానం ఎలా తెలుపుతున్నాడంటే,

فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ
(ఫక అన్నమా ఖర్ర మినస్ సమా)
ఆకాశం నుండి పడిపోయిన వాని వలె.
ఆకాశం నుండి పడిపోయిన వారు, ఇక అతనిని పక్షులు తమ యొక్క చుంచులతో వేటాడుతాయి, లాక్కుంటాయి, లేదా గాలి అనేది అటు ఇటు ఎక్కడైనా విసిరి పారేస్తుంది. అక్కడి నుండి పారేయడం జరుగుతుంది. అయితే ఏడు భూముల కింద سِجِّين (సిజ్జీన్) ఖైదీల చిట్టా అనే ఏదైతే దఫ్తర్ (రిజిస్టర్), ప్రాంతం ఏదైతే ఉందో అందులో అతని నామం రాయడం జరుగుతుంది. ఇక అతన్ని, ఆ శరీరం, భౌతికాయాన్ని అతని బంధువులు ఖననం చేశారంటే, అక్కడ ప్రశ్నోత్తరాల గురించి అందులో పంపడం జరుగుతుంది.

ఇక ఆ తర్వాత, సమాధిలో ఏదైతే పెట్టడం జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుంది సంక్షిప్తంగా వినండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరంగా ఆ విషయాలు తెలిపారు. కానీ ఆ విషయాల యొక్క వివరణలో వెళ్ళేకి ముందు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోండి. అదేమిటంటే, సామాన్యంగా సమాధి యొక్క శిక్ష లేదా సమాధి యొక్క వరాలు అని ఏదైతే అనడం జరుగుతుందో, ఇక్కడ ఇలా ఎందుకు అనడం జరుగుతుంది అంటే, వాస్తవానికి మానవ చరిత్రలో మానవునికి ఇవ్వబడిన ఆదేశ ప్రకారం అతన్ని సమాధిలో పెట్టడమే. ఇక ఎవరైతే సమాధిలో పెట్టకుండా వేరే పద్ధతులు అవలంబిస్తున్నారో, వారు స్వభావానికి, ప్రకృతికి విరుద్ధమైన పని చేస్తున్నారు. ఇదొక మాట అయితే, రెండో మాట ఏమిటంటే, అధిక శాతం చనిపోయే వారిని సమాధిలో పెట్టడం జరుగుతుంది. అందుకొరకే ఈ పదాలు ఉపయోగించబడ్డాయి.

కానీ ఇక ఎవరైనా, ఎవరిదైనా కాల్చివేయడం జరిగితే, లేదా ఎవరైనా అగ్నికి ఆహుతి అయి పూర్తిగా బూడిదైపోతే, లేదా ఏదైనా మృగ జంతువు యొక్క ఆహారంగా మారిపోతే, ఇంకా సంక్షిప్తంగా చెప్పాలంటే, మనిషిని బొందలో పెట్టకుండా, సమాధిలో పెట్టకుండా ఏ విధంగా ఏది జరిగినా గానీ, ఈ శరీరం ఏదైతే ఉందో, భౌతికాయం అని ఏదైతే అంటామో అది నాశనమైపోతుంది. కానీ ఆత్మ అయితే ఉంటుంది. అల్లాహ్ త’ఆలా తలుచుకుంటే ఆత్మకైనా శిక్ష ఇవ్వవచ్చు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలై దీనికి సంబంధించిన ఎన్నో వివరాలు తెలిపి ఉన్నారు. అల్లాహ్ తలుచుకుంటే ఆ కుళ్ళిపోయిన, కాలిపోయిన, ఆహారంగా మారిపోయిన ఆ శరీరాన్ని మరోసారి ఉనికిలోకి తీసుకురావచ్చు. లేదా అల్లాహ్ త’ఆలా తలుచుకుంటే కొత్త శరీరం ప్రసాదించవచ్చు. అల్లాహ్ తలుచుకుంటే, సమాధి యొక్క శిక్షలు మరియు వరాలు ఏవైతే ఉన్నాయో, శిక్షలు అంటే అవిశ్వాసులకు పాపాత్ములకు, వరాలు అంటే, అనుగ్రహాలు అంటే విశ్వాసులకు మరియు పుణ్యాత్ములకు, ఈ సమాధి శిక్షలు లేదా అనుగ్రహాలు, వరాలు ఇవి ప్రతి ఒక్కరికీ జరిగి ఉంటాయి.

وَمِن وَرَائِهِم بَرْزَخٌ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
(వ మిన్ వరా’ఇహిమ్ బర్ జ ఖున్ ఇలా యౌమి యుబ్ ‘అసూన్)
వారి వెనుక పునరుత్థాన దినం వరకు ఒక అడ్డుతెర (బర్ జఖ్) ఉంటుంది. (23:100)

దీన్నే కొందరు మధ్య కాలం, ఇటు ఇహలోకం అటు పరలోకం, దాని మధ్య లోకం ఇది. మధ్య లోకంలో ఇవి తప్పకుండా జరిగి ఉంటాయి. తప్పకుండా జరిగి ఉంటాయి. ఈ విశ్వాసం మనం తప్పకుండా మనసులో నిశ్చయించాలి. ఈ విషయాలను నమ్మాలి.

ఇక సమాధిలో… సమాధి అంటే ఇక్కడ గుర్తు ఉంది కదా, ఒకవేళ ఎవరినైనా సమాధిలో పెట్టడం జరగకపోయినా గానీ వారిని ప్రశ్నించడం జరుగుతుంది. వచ్చి దైవదూత అడుగుతాడు, నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? మరియు నీ ప్రవక్త ఎవరు? అప్పుడు విశ్వాసుడు అయితే, నా ప్రభువు అల్లాహ్, నా యొక్క ధర్మం ఇస్లాం మరియు నా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని సమాధానం ఇస్తాడు. తర్వాత నాలుగో ప్రశ్న అడగడం జరుగుతుంది, ఈ విషయాలు నీవు ఎలా తెలుసుకున్నావు అని? అతడు చెబుతాడు, నేను ఖురాన్ ను చదివాను, ధర్మం నేర్చుకున్నాను అని.

ఇక ఎవరైతే అవిశ్వాసి లేదా పాపాత్ముడై ఉంటాడో, మహా ఘోరమైన పాపాత్ముడు, అలాంటి వారు ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వరు. అయ్యో, మాకు తెలియదు, ప్రజలు అన్నట్లుగా మేమన్నాము అని అంటారు. నువ్వు ఎందుకు తెలుసుకోలేదు, ఎందుకు చదువుకోలేదు, ఎందుకు చదువుకున్న వారిని అనుసరించి ఖురాన్ పారాయణం చేయలేదు అని చెప్పుకుంటూ వారిని కొట్టడం, శిక్షించడం జరుగుతుంది.

ఇక సమాధిలో, ఈ మధ్య లోకంలో జరిగే అటువంటి మరికొన్ని వివరాలు కూడా ఉన్నాయి. కానీ సమయం ఇప్పటికే ఎక్కువైనందుకు నేను ఇంతటితో ముగిస్తున్నాను. కానీ మీ యొక్క ప్రశ్నకు సమాధానం లభించింది అని ఆశిస్తున్నాను. సంక్షిప్తంగా మీ ప్రశ్న ఏముండే? ఎవరి చావు ఎట్లా వస్తుంది? హిందువులకు వేరే రకంగా యమదూత వస్తాడా, ప్రాణం తీసే దూత వస్తాడా? ఇంకా ముస్లింలకు వేరే దూతనా? మనలాంటి, మనకు జరిగే విధంగానే వారికి జరుగుతాయా? మరి వారినైతే సమాధిలో పెట్టడం జరగదు కదా, కాల్చేస్తారు కదా, మరి వారికి ఎలా జరుగుతుంది? ఇలాంటి ప్రశ్నలు ఏవైతే వచ్చాయో వాటన్నిటినీ కలుపుకొని ఈ సంక్షిప్త విషయం తెలపడం జరిగింది.

చనిపోయిన తర్వాత నుండి మొదలుకొని, మళ్ళీ అల్లాహ్ యొక్క మైదానే మహ్షర్ లో నిలబడే వరకు ఏ ఏ సంఘటనలు జరుగుతాయని ఖురాన్ మరియు సహీ హదీసులలో తెలపబడ్డాయో, వాటన్నిటినీ మనం విశ్వసించి ఆ ప్రకారంగా మన విశ్వాసాన్ని బలపరుచుకొని ఉంచేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా ఆఖరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు.

أَسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక

అజాన్ తర్వాత చేసే రెండు దుఆల ఘనత [వీడియో & టెక్స్ట్]

అజాన్ తర్వాత చేసే రెండు దుఆల ఘనత (فضل الذكر بعد الآذان)
https://www.youtube.com/watch?v=IUyKck4lvfI [ 2 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

అజాన్ తర్వాత చెదివే ఈ రెండు దుఆల ఘనత చాలా గొప్పగా ఉంది
ప్రతి అజాన్ తర్వాత చదవండి, అనేకానేక పుణ్యాలు, లాభాలు పొందండి

ఈ వీడియో లో చెప్పబడిన దుఆలు ఇక్కడ నేర్చుకోవచ్చు: అజాన్ తర్వాత చేయు దుఆలు 

ఈ ప్రసంగంలో అజాన్ తర్వాత పఠించవలసిన రెండు ముఖ్యమైన దువాల గురించి వివరించబడింది. మొదటి దువా సహీహ్ ముస్లిం నుండి ఉల్లేఖించబడింది, దీనిని పఠించడం ద్వారా గత పాపాలు క్షమించబడతాయి. రెండవ దువా సహీహ్ బుఖారీ నుండి తీసుకోబడింది, దీనిని పఠించిన వారికి ప్రళయ దినాన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సిఫారసు లభిస్తుంది. ఈ రెండు దువాల యొక్క ప్రాముఖ్యత మరియు వాటి ద్వారా లభించే గొప్ప ప్రయోజనాలను వక్త నొక్కి చెప్పారు.

మహాశయులారా, ఇప్పుడు మనం అజాన్ తర్వాత రెండు రకాల దువాలు మనకు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పారు. ప్రతీ ఒక్క దువాలో మన గురించి ఎంతో గొప్ప లాభం ఉంది.

మొదటి హదీస్ సహీహ్ ముస్లిం లోనిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ఎవరైతే అజాన్ విన్న తర్వాత, అజాన్ కు సమాధానం చెబుతూ అజాన్ పూర్తిగా విన్న తర్వాత

أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ، وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، رَضِيتُ بِاللهِ رَبًّا، وَبِمُحَمَّدٍ رَسُولًا، وَبِالْإِسْلَامِ دِينًا

(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వహ్ దహూ లా షరీక లహూ, వ అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, రదీతు బిల్లాహి రబ్బన్, వబి ముహమ్మదిన్ రసూలన్, వబిల్ ఇస్లామి దీనా)

“అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్య దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఏకైక దేవుడు, ఆయనకు భాగస్వాములు లేరు మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. నేను అల్లాహ్ ను ప్రభువుగా, ముహమ్మద్ ను ప్రవక్తగా మరియు ఇస్లాంను నా ధర్మంగా స్వీకరించాను.”

అని చదువుతారో,

غُفِرَ لَهُ ذَنْبُهُ
(గుఫిర లహూ దన్బుహూ)

వారి యొక్క పాపాలు క్షమించబడతాయి, మన్నించబడతాయి అని శుభవార్త ఇవ్వడం జరిగింది.

ఇది ఒక దువా. మరోసారి విని మీరు దీన్ని జ్ఞాపకం ఉంచుకునే ప్రయత్నం చేయండి. సామాన్యంగా మనం దీనిలో సగ భాగం అంతకంటే ఎక్కువగా నేర్చుకునే ఉంటాము ఇంతకుముందు.

ఇక రెండవ దువా, సహీహ్ బుఖారీలోని పదాలు ఈ విధంగా ఉన్నాయి. జాబిర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే అజాన్ విన్న తర్వాత ఈ దువా చదువుతారో, ప్రళయ దినాన వారికి నా సిఫారసు తప్పకుండా లభిస్తుంది. అల్లాహు అక్బర్! ఎంత గొప్ప అదృష్టమో గమనించండి. ప్రళయ దినాన ప్రవక్తలు సిఫారసు చేయాలి అని మనం తహతహలాడుతూ ఉంటాము. ఆ రోజు మనకు ఈ సిఫారసు పొందడానికి ఈ రోజు ఐదు పూటల నమాజులు చేయాలి. అజాన్ విన్నప్పుడు, అజాన్ అయిన తర్వాత దువా మనం చదవాలి.

اللَّهُمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ، وَالصَّلَاةِ الْقَائِمَةِ، آتِ مُحَمَّدًا الْوَسِيلَةَ وَالْفَضِيلَةَ، وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي وَعَدْتَهُ

(అల్లాహుమ్మ రబ్బ హాదిహి ద్దావతి త్తామ్మ, వస్సలాతిల్ ఖాయిమ, ఆతి ముహమ్మదన్ అల్ వసీలత వల్ ఫదీల, వబ్ అత్ హు మఖామమ్ మహ్మూదన్ అల్లదీ వ అత్తహ్)

“ఓ అల్లాహ్! ఈ సంపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడిన నమాజుకు ప్రభువా! ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మధ్యవర్తిత్వం మరియు శ్రేష్టతను ప్రసాదించు. మరియు నీవు వాగ్దానం చేసిన ప్రశంసనీయమైన ఉన్నత స్థానానికి ఆయనను చేర్చు.”

అల్లాహ్ త’ఆలా ఈ దువాలను ప్రతీ అజాన్ తర్వాత చదువుతూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక. వీటి యొక్క బరకత్ లో, శుభంలో అల్లాహ్ మన పాపాలను మన్నించి ప్రళయ దినాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు మనకు ప్రాప్తి చేయుగాక.

ఈ పోస్ట్ లింక్: https://teluguislam.net/?p=5568

పురుషులు బంగారం వేసుకొనుట | ఇస్లామీయ నిషిద్ధతలు [వీడియో | టెక్స్ట్]

పురుషులు బంగారం వేసుకొనుట (ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు)
https://youtu.be/7NYeGuNGHnk (6 నిముషాలు)
 ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో పురుషులు బంగారం ధరించడం పూర్తిగా నిషిద్ధం (హరామ్) అని స్పష్టంగా వివరించబడింది. బంగారం ఏ రూపంలో ఉన్నా – ఉంగరం, గొలుసు, బ్రాస్‌లెట్ వంటివి – పురుషులు వాడకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల ప్రకారం, బంగారం మరియు పట్టు స్త్రీలకు ధర్మసమ్మతం కానీ పురుషులకు నిషిద్ధం. ఒక సహాబీ చేతిలో బంగారు ఉంగరం చూసినప్పుడు ప్రవక్త దానిని తీసి పారేసి, అది నరక జ్వాల వంటిదని హెచ్చరించిన సంఘటన వివరించబడింది. ఆ సహాబీ, ప్రవక్త పారేసిన దానిని తిరిగి తీసుకోకపోవడం, ప్రవక్త పట్ల వారికున్న గౌరవం మరియు అనుసరణకు నిదర్శనం. ఆధునిక కాలంలో గడియారాలు, బటన్లు, పెన్నులు వంటి వస్తువులలో కూడా బంగారం వాడకంపై హెచ్చరిక చేయబడింది. చెడును శక్తి ఉన్నప్పుడు చేతితో ఆపాలని, నిషిద్ధమని తెలిసిన వెంటనే దానిని వదిలివేయాలని ఈ ప్రసంగం బోధిస్తుంది.

బంగారం ఏ రూపంలో ఉన్నా, దానిని పురుషులు వాడుట నిషిద్ధం. శ్రద్దగా వినండి. బంగారం ఏ రూపంలో ఉన్నా, గొలుసు రూపంలో కొందరు వేసుకుంటారు, ఏదైనా ఒక బ్యాంగిల్ రూపంలో చేతిలో వేసుకుంటారు పురుషులు. మరి కొందరు ఉన్నారు, రెండు చెవులలో నుండి ఏదైనా ఒక చెవిలో, ఇలా కొందరు ఈనాటి కాలంలో అలవాటు పడుతున్నారు. అయితే బంగారం ఏ రూపంలో ఉన్నా, దానిని పురుషులు వాడుట నిషిద్ధం.

అబూ మూసా అష్’అరీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

أُحِلَّ لِإِنَاثِ أُمَّتِي الْحَرِيرُ وَالذَّهَبُ وَحُرِّمَ عَلَى ذُكُورِهَا
బంగారం, పట్టు నా అనుచర సంఘంలోని స్త్రీలకు ధర్మసమ్మతం. పురు షులకు నిషిద్ధం”.
(ముస్నద్ అహ్మద్: 4/393. సహీహుల్ జామి 207).

ఈరోజు మార్కెట్లో గడియారాలు, అద్దాలు, బటన్లు, పెన్నులు, చైన్లు ఇంకా మెడల్ పేరుతో బంగారపు లేదా బంగారు వన్నె ఎక్కించినవి చాలా ఉన్నాయి. ఇంకా పురుషులకు స్వర్ణ గడియారం అని కొన్ని కాంపిటీషన్లలో ప్రకటించబడుతుంది. అయితే ఇవి నిషిద్ధం అని తెలుసుకోవాలి.

సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చినటువంటి హదీస్. శ్రద్ధగా వింటారు, అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను.

أنَّ رسُولَ الله ﷺ رَأَى خَاتَمًا مِنْ ذَهَبٍ فِي يَدِ رَجُلٍ فَنَزَعَهُ فَطَرَحَهُ وَقَالَ: يَعْمِدُ أَحَدُكُمْ إِلَى جَمْرَةٍ مِنْ نَارٍ فَيَجْعَلُهَا فِي يَدِهِ فَقِيلَ لِلرَّجُلِ بَعْدَ مَا ذَهَبَ رَسُولُ الله ﷺ خُذْ خَاتِمَكَ انْتَفِعْ بِهِ قَالَ لَا وَالله لَا آخُذُهُ أَبَدًا وَقَدْ طَرَحَهُ رَسُولُ الله ﷺ

అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన ప్రకారం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక వ్యక్తి చేతికి బంగారపు ఉంగరం చూశారు. ఆయన దానిని తీసిపారేశారు. మళ్ళీ ఇలా హెచ్చరించారు: “మీలో ఎవరికైనా నరకజ్వాల కావాలని ఉంటే దీనిని తన చేతిలో తొడగవచ్చు”. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నవారన్నారు: ‘నీ ఉంగరాన్ని తీసుకో, వేరే విధంగా దానితో ప్రయోజనం పొందవచ్చు’. అప్పుడు అతనన్నాడు: ‘లేదు. అల్లాహ్ సాక్షిగా! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తీసిపారేసిన దాన్ని నేను ఎన్నడూ తీసుకోను’. (ముస్లిం 2090).

ఎవరైతే చేతిలో బంగారపు ఏదైనా వస్తువు వేసుకుంటారో, ఉంగరం కానీ, గాజు కానీ, ఇంకా ఇలాంటిది ఏదైనా, అయితే వారు నరక శిక్షకు ఆహుతి అవుతారు అని హెచ్చరిక ఇది.

అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అటు వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ ఉన్నవారు ఆ సహాబీకి చెప్పారు, “నీ ఉంగరాన్ని తీసుకో, వేరే విధంగా దానితో ప్రయోజనం పొందవచ్చు.” అప్పుడు ఆ సహాబీ అన్నారు, “లేదు. అల్లాహ్ సాక్షిగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసి పారేసిన దానిని నేను ఎన్నడూ తీసుకోను.” ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఉన్నటువంటి గౌరవ అభిమానం. ప్రవక్తకు ఏ విషయం ఇష్టం లేదో, ప్రవక్త తన చేతితో దానిని తీసి పారేశారో, అలాంటి దాని దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి? ఒక విషయాన్ని ప్రవక్త నిషిద్ధం అని అన్నప్పుడు, దానికి నేను ఎందుకు పాల్పడాలి? ఇలాంటి కాంక్ష ఎంత గొప్పగా ఉండిందో గమనించండి.

ఈ రోజుల్లో, “అరే ఈ తాయెత్తు వేసుకోవద్దు, ఈ ఉంగరం బంగారపుది పురుషులు వేసుకోకూడదు” అని చెప్పినప్పుడు, “సరే, నేను తర్వాత తీసేస్తాను, లేదు ఇంట్లో నేను మా అమ్మతోని ఒకసారి మాట్లాడి ఆ తర్వాత తీస్తాను” ఈ విధంగా మన యొక్క సాకులు ఉంటాయి. కానీ సహాబీ, గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసి పారేసిన విషయానికి దగ్గరగా పోదలుచుకోలేదు.

  1. బంగారపు ఉంగరం వేసుకొనుట నరక శిక్షకు కారణమవుతుంది.
  2. తన శక్తి పరిధిలో ఉన్నప్పుడు మనిషి చెడును తన చేతితో ఖండించాలి. ఎవరికి అధికారం ఉన్నదో వారే చేయాలి, వేరే వారు చేసి ఇంకా నష్టానికి గురికాకూడదు.
  3. పురుషుడు బంగారపు ఉంగరం వేసుకొని ఉంటే, తెలిసిన వెంటనే, ఏ ఆలస్యం చేయకుండా తన చేతిలో నుండి తీసి కనీసం జేబులోనైనా వేసుకోవాలి. కానీ ఇక ఆ చేతిలో ఉంచుకోకూడదు. మెడలో ఉంటే మెడలో నుండి తీసేయాలి. తర్వాత తన ఇంట్లోని స్త్రీలకు ఇవ్వచ్చు, స్త్రీలు దాన్ని ఉపయోగించవచ్చును.
  4. సహాబాలు ప్రవక్త అనుకరణలో ఎంత ముందుగా ఉండేవారన్న విషయం తెలిసింది.

అయితే ఇక్కడ గమనించండి మరొక విషయం. అదేమిటంటే, ఈ రోజుల్లో కొందరు ఏమంటున్నారు? సరే ఇక బంగారం నిషిద్ధం అన్నారు కదా, మరి వెండిది వేయవచ్చా? “లేదు మా అబ్బాయి వాళ్ళ స్నేహితులు క్లాస్మేట్లు ఎవరో వేసుకున్నారంట, ఇంట్లో వచ్చి అడుగుతున్నాడు, నాకు కూడా ఒక చిన్న ఏదైనా వెండి యొక్క చైన్ ఇవ్వమని, లేదా చేతిలో ఏదైనా చైన్ వేసుకుంటా” అని. లేదు. ఇన్ షా అల్లాహ్ ఆ మాట తర్వాత కూడా వస్తుంది. స్త్రీలు పురుషుల పోలిక, పురుషులు స్త్రీల పోలిక అవలంబించకూడదు అని. కానీ ఇక్కడ ఒక మాట వచ్చింది గనక నేను దాన్ని గుర్తు చేశాను, చెప్పేశాను.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5351

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

స్త్రీ సుగంధం (సెంట్) పూసుకొని బైటికి వెళ్ళుట [వీడియో| టెక్స్ట్]

https://youtu.be/kfJHzMYHTnE [7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, ఒక స్త్రీ సుగంధం పూసుకుని బయటికి వెళ్లడం ఇస్లాంలో తీవ్రంగా పరిగణించబడే పాపమని హెచ్చరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ప్రకారం, పురుషులు తన సువాసనను ఆఘ్రాణించాలని బయటికి వెళ్లే స్త్రీ వ్యభిచారిణిగా పరిగణించబడుతుందని చెప్పబడింది. ఇంట్లో సుగంధం పూసుకున్న స్త్రీ మస్జిద్ వంటి పవిత్ర స్థలానికి వెళ్లాలనుకున్నా సరే, బయటికి వెళ్లే ముందు తప్పనిసరిగా జనాబత్ స్నానం (సంపూర్ణ స్నానం) చేయాలని, లేకపోతే ఆమె నమాజ్ అంగీకరించబడదని స్పష్టం చేయబడింది. ఆధునిక కాలంలో వివాహాలు, పండుగలు, బజార్లకు, చివరకు రమదాన్‌లో తరావీహ్ నమాజ్‌కు కూడా మహిళలు బలమైన పరిమళాలను ఉపయోగించడం పట్ల విచారం వ్యక్తం చేయబడింది. ఈ చర్యల యొక్క తీవ్రతను అర్థం చేసుకుని, పురుషులు తమ కుటుంబంలోని స్త్రీలకు మార్గనిర్దేశం చేయాలని మరియు స్త్రీలు స్వయంగా ఈ నిషిద్ధతలకు దూరంగా ఉండాలని ఉపదేశించబడింది.

స్త్రీ సుగంధం పూసుకొని బయటికి వెళ్లుట

నేను ఆఫీసులో జాబ్ చేస్తున్నానండీ. నేను ఫలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాను, ఫలానా ఫ్యాక్టరీలో పెద్ద మంచి పోస్ట్ ఉంది నాది. అక్కడికి వెళ్ళేటప్పుడు నేను కనీసం ఏదైనా సువాసన పూసుకోకుంటే ఎలా? నేను ఇప్పుడు ఫంక్షన్లో వెళ్లాలి. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వస్తాయి కదా. శ్రద్ధగా వినండి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో కఠినంగా హెచ్చరించినప్పటికీ స్త్రీలు సువాసనలు పూసుకొని ఇంటి బయటికి వెళ్లుట, పురుషుల ముందు నుండి దాటుట ఈ కాలంలో చాలా ప్రబలిపోతుంది. ప్రవక్త వారి ఆదేశం ఏంటి?

أَيُّمَا امْرَأَةٍ اسْتَعْطَرَتْ ثُمَّ مَرَّتْ عَلَى الْقَوْمِ لِيَجِدُوا رِيحَهَا فَهِيَ زَانِيَةٌ
“ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని ఆమె సువాసన పురుషులు ఆఘ్రాణించాలని వారి ముందు నుండి దాటుతుందో ఆమె వ్యభిచారిణి “ (ముస్నద్‌ అహ్మద్‌ 4/418, సహీహుల్‌ జామి 105).

అవూదుబిల్లాహ్, అవూదుబిల్లాహ్. వింటున్నారా? చూస్తున్నారా?

కొందరు స్త్రీలు నిర్లక్ష్యపు భావనతో దీనిని చాలా చిన్న విషయం అనుకొని డ్రైవర్, సేల్స్‌మేన్ మరియు పాఠశాలల వాచ్‌మేన్‌ల ముందు నుండి వెళ్తారు, అయితే సువాసన పూసుకున్న స్త్రీ బయటికి వెళ్లదలచినప్పుడు, ఆ బయటికి వెళ్లడం మస్జిద్ లాంటి పవిత్ర స్థలానికైనా సరే, అర్థమవుతుందా?

ఒక స్త్రీ సువాసన పూసుకొని ఉంది, ఇంట్లో ఉంది. కొంతసేపటి తరవాత అచానక్, యేకాయేక్యిగా బయటికి వెళ్లాలనిపించింది ఏదైనా పని మీద గానీ, లేదా జుమా నమాజ్ సమయం అయితుంది లేదా జుమా ఈరోజు మస్జిద్లో ఏదో పెద్ద ఆలిమ్ వచ్చి ప్రసంగిస్తున్నారు, అక్కడ స్త్రీలకు కూడా పర్దా ఏర్పాటు ఉంది, అయితే మస్జిద్కు వెళ్లాలనుకుంటుంది. ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని ఉన్నదో, ఆ తర్వాత ఆమె బయటికి వెళ్లాలనుకుంటుందో, చివరికి ఆమె మస్జిదుకు వెళ్లాలి అని కోరినా, అక్కడికి వెళ్లేకి ముందు, బయటికి వెళ్లేకి ముందు గుస్లే జనాబత్ చెయ్యాలి. గుస్లే జనాబత్ అంటే పెద్దవారికి తెలిసిన విషయమే. స్వప్న స్థలనం వల్ల లేదా భార్యాభర్తలు కలుసుకోవడం వల్ల ఏ స్థితిలో మనిషి ఉంటాడో దానిని జనాబత్, అశుద్ధత, నాపాకీ అంటారు. దాని వల్ల స్నానం చేయడం విధి అవుతుంది. దానికి స్నానం ఎలా చేయాలి? ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. ఆ రీతిలో స్నానం చేయనంతవరకు ఆమె బయటికి వెళ్లకూడదు. కఠినంగా దీని గురించి ఆదేశం వచ్చింది. శ్రద్ధగా వినండి.

أَيُّمَا امْرَأَةٍ تَطَيَّبَتْ ثُمَّ خَرَجَتْ إِلَى الْمَسْجِدِ لِيُوجَدَ رِيحُهَا لَمْ يُقْبَلْ مِنْهَا صَلَاةٌ حَتَّى تَغْتَسِلَ اغْتِسَالَهَا مِنْ الْجَنَابَةِ
“ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని అక్కడ ఉన్నవారు ఆమె సువాసన ఆఘ్రాణించాలని మస్టిద్‌ వస్తుందో, ఆమె జనాబత్‌ వల్ల చేసే విధంగా స్నానం చేసిరానంత వరకు ఆమె నమాజు అంగీకరింపబడదు”. (ముస్నద్‌ అహ్మద్‌ 2/444, సహీహుల్‌ జామి 2703).

అల్లాహు అక్బర్. నమాజ్ ఎందువల్ల అంగీకరింపబడదు? ఎవరైనా స్త్రీ సువాసన పూసుకొని బయటికి వస్తుంది, పురుషులు ఉంటారు, వారు కూడా ఆ సువాసన పీలుస్తారు, ఇవన్నీ తెలిసి కూడా, స్త్రీ వాటి నుండి జాగ్రత్తపడి రాకుంటే ఎంత భయంకరమైన విషయమో గమనించండి.

ఈ రోజుల్లో స్త్రీలు ఉపయోగించే సుగంధాలు ఏవైతే కొన్ని రకాలు తెలపడం జరుగుతున్నాయో, ఈ సుగంధాల విషయంలో ఇక అల్లాహ్ తోనే మొరపెట్టుకోవాలి. అల్లాహ్, మా ఈ స్త్రీలకు హిదాయత్ ఇవ్వు అని ఇలా దుఆ చేసుకోవాలి. ఆయనే మనకు మార్గం చూపువాడు. ఎందుకనగా, ఈనాటి స్త్రీలు పెళ్లిళ్లలో, ఉత్సవాల్లో వెళ్లేముందు ఉపయోగించే సాంబ్రాణి ధూపములు, అదేవిధంగా బజారుల్లో, వాహనాల్లో అందరూ ఏకమై కలిసేచోట, చివరికి రమదాన్ మాసంలో తరావీహ్‌ల కొరకు ఏదైతే మస్జిదులో వస్తారో, ఇతర రోజుల్లో మస్జిదులో వెళ్లేటప్పుడు కూడా చాలా సేపటి వరకు మరియు దూరం వరకు ఆఘ్రాణించగల, పీల్చబడే అటువంటి సుగంధములు వాడుతూ ఉంటారు. అయితే ఈ సందర్భాలు ఏవైతే ఇప్పుడు తెలపబడ్డాయో, ఇలాంటి సందర్భాల్లో అలాంటి సువాసనలు వాడడం నిషిద్ధం అని వారు తెలుసుకోవడం లేదు.

ధర్మపరంగా స్త్రీలు ఉపయోగించవలసిన పరిమళాలు ఎలా ఉండాలి? వాటి రంగు కానరావాలి. కానరావాలి అంటే పర పురుషులకు కాదు. ఇంట్లో ఉన్న స్త్రీలకు లేదా భర్తకు. కానీ సువాసన రాకూడదు. అల్లాహ్, మాలోని కొందరు మూర్ఖ ప్రజలు చేసిన తప్పుల వల్ల మాలోని పుణ్యాత్ములను శిక్షించకు, మా అందరికీ సన్మార్గం ప్రసాదించు ఓ అల్లాహ్. ఆమీన్.

విషయం అర్థమైందా? మనం మన స్త్రీలను జాగ్రత్తలో, వారి యొక్క అన్ని రకాల పరువు మానాలు భద్రంగా ఉండేందుకు, వారి యొక్క విశ్వాసం కూడా బలంగా ఉండేందుకు, ఇలాంటి నిషిద్ధతలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉంచే ప్రయత్నం మనం పురుషులము, భర్తలము చేయాలి, తండ్రులము చేయాలి. మరియు స్త్రీలు కూడా స్వయంగా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు, భర్తలు గానీ, తండ్రులు గానీ, సోదరులు గానీ మాటిమాటికి చెప్పే అటువంటి పరిస్థితి రానివ్వకూడదు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5314

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

మల మూత్ర విసర్జన ఇస్లామీయ పద్ధతులు [వీడియో & టెక్స్ట్]

ఇస్లాం మానవ జీవితంలోని ప్రతి కోణానికి సంబంధించిన ప్రతి విషయం గురించి సన్మార్గం చూపుతుంది. చివరికి మల మూత్ర విసర్జన పద్ధతులను కూడా తెలిపింది, అయితే వీటి వివరాలు ఇందులో తెలుసుకోండి.

మల మూత్ర విసర్జన ఇస్లామీయ పద్ధతులు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
https://www.youtube.com/watch?v=O_Eu55VE-KA [30 నిమిషాలు]

ఈ ప్రసంగంలో, వక్త మలమూత్ర విసర్జన చేసేటప్పుడు పాటించవలసిన ఇస్లామీయ పద్ధతులను హదీసుల ఆధారంగా వివరించారు. ప్రధాన అంశాలు: ఏకాంతాన్ని పాటించడం, ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించుకోవడంలో తప్పులేదని చెప్పడం, భూమికి దగ్గరైన తర్వాతే బట్టలు పైకి తీయడం, మరుగుదొడ్డిలోకి ప్రవేశించే ముందు మరియు బయటకు వచ్చిన తర్వాత దువాలు చదవడం, ఆ సమయంలో మాట్లాడకూడదని చెప్పడం, అల్లాహ్ పేరు ఉన్న వస్తువులను లోపలికి తీసుకువెళ్లకపోవడం, ఖిబ్లా వైపు ముఖం లేదా వీపు పెట్టకపోవడం (కట్టడాలలో మినహాయింపు ఉంది), శపించబడిన ప్రదేశాలలో (దారి, నీడ, నీటి వనరులు) విసర్జన చేయకపోవడం, శరీరం లేదా దుస్తులపై తుంపరలు పడకుండా జాగ్రత్తపడటం, శుభ్రత కోసం నీటిని (మరియు రాళ్లను) ఉపయోగించడం, ఎడమ చేతిని మాత్రమే వాడటం, కనీసం మూడుసార్లు శుభ్రపరచడం, ఎముక మరియు పేడతో శుభ్రపరచకపోవడం, ఆ సమయంలో సలాంకు జవాబు ఇవ్వకపోవడం, మరియు అవసరమైతే నిలబడి మూత్రవిసర్జన చేయడం అనుమతించబడినప్పటికీ, తుంపరల పట్ల చాలా జాగ్రత్తగా ఉండటం.

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వఆలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్.

మహాశయులారా! అల్లాహ్ యొక్క దయవల్ల ఈ రోజు మనం మలమూత్ర విసర్జన ఇస్లామీయ పద్ధతులు ఏమిటో తెలుసుకుందాము.

మొదటి విషయం, మలమూత్ర విసర్జన కొరకు నాలుగు గోడల మధ్యలో లేదా ఎడారి ప్రాంతంలో పోయే అవసరం ఉన్నప్పుడు కానీ ప్రజల చూపులకు, వారి దృష్టికి దూరంగా వెళ్ళాల్సిన ఆదేశం ఇస్లాం ఇస్తుంది. ఎందుకనగా ప్రతి మనిషి తన మర్మ అవయవాలను ఇతర చూపులకు దూరంగా ఉంచడం తప్పనిసరి విషయం.

దీనికి సంబంధించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల్లో ఒక హదీస్, సహీ బుఖారీ హదీస్ నెంబర్ 148. ఇంకా అలాగే సహీ బుఖారీలోని హదీస్ నెంబర్ 363 లో కూడా ఈ ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ముగైరా బిన్ షోబా రదియల్లాహు త’ఆలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సేవలో ఉండేవారు. ఆయన తెలుపుతున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైనా కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు,

فَانْطَلَقَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم حَتَّى تَوَارَى عَنِّي فَقَضَى حَاجَتَهُ
(ఫన్తలఖ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం హత్తా తవారా అన్నీ ఫఖదా హాజతహు)
నాకు కనబడనంత దూరంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళారు, తమ అవసరాన్ని తీర్చుకొని తిరిగి వచ్చేశారు.”

సామాన్యంగా కొన్ని పల్లెటూర్లలో ఇప్పుడు అంతగా లేదు కావచ్చు, కానీ అయినా గాని కొన్ని ప్రాంతాల్లో ఉండవచ్చు, ఇళ్లల్లో మరుగుదొడ్లను నిర్మించుకోవడం మంచిగా భావించరు. కానీ ఇందులో ఎలాంటి అభ్యంతరం ఇస్లామీయ ధర్మ ప్రకారంగా గానీ, ఇందులో ఎలాంటి పాపం అనేది లేదు. స్వయంగా ఆ కాలంలో కూడా మహనీయ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తమ ఇంటి మీద ఇలాంటి ఒక సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయం కూడా సహీ బుఖారీలో ఉంది. అందుగురించి ఇమామ్ బుఖారీ రహమతుల్లా అలై ఒక చాప్టర్ పేరేమి పెట్టారు? ఇళ్లల్లో కాలకృత్యాలు తీర్చుకోవడం.

రెండో విషయం, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు, నాలుగు గోడల మధ్యలో ఉన్నప్పుడు ఎలాంటి సందేహం లేదు, లోపలికి వెళ్లి తలుపేసుకున్న తర్వాతే బట్టలు విప్పుతాము. కానీ ఎడారి ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఎక్కడైతే ఒక పరదా లాంటి స్థలం, ప్రజల చూపులకు మనం కనబడకుండా ఉన్నాము అన్నటువంటి నమ్మకం అయిన తర్వాత, ఏ స్థలంలో మనం కూర్చోవాలి అని అనుకుంటున్నామో అక్కడ కూర్చోవడానికి సిద్ధమవుతూ, కిందికి వంగుతూ బట్టలను ఎత్తుకోవాలి.

హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు:

أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ إِذَا أَرَادَ حَاجَةً لاَ يَرْفَعُ ثَوْبَهُ حَتَّى يَدْنُوَ مِنَ الأَرْضِ
(అన్నన్ నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లం కాన ఇదా అరాద హాజతన్ లా యర్ఫవు సౌబహు హత్తా యద్నువ మినల్ అర్ద్)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకోవడానికి, తమ అవసరాన్ని తీర్చుకోవడానికి ఉద్దేశించినప్పుడు భూమికి దగ్గరగా అయ్యేంతవరకు తమ వస్త్రాలు, తమ బట్టలు తీసేవారు కాదు.” (సునన్ అబీ దావూద్: 14)

అయితే ఎంతగా మనం మన మర్మావయవాలను ఇతర చూపుల నుండి దాచి ఉంచవలసిన అవసరం ఉందో, దీని గురించి ఎంత మంచి శిక్షణ స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ ఆచరణ ద్వారా మనకు చూపుతున్నారో గమనించండి. ఈ హదీస్ సునన్ అబీ దావూద్ లో హదీస్ నెంబర్ 14.

మరుగుదొడ్డిలో ప్రవేశిస్తూ లేదా ఎడారి ప్రాంతంలో వెళ్ళినప్పుడు అక్కడ సామాన్యంగా ప్రజలకు తెలిసి ఉంటుంది, అర కిలోమీటర్, పావు కిలోమీటర్, కిలోమీటర్ నడిచి వెళ్తారు, కానీ ఇక్కడి నుండి కాలకృత్యాలు తీర్చుకునే ఈ ప్రాంతం అన్నటువంటి ఒక ఏర్పాటు అనేది అందరికీ తెలిసి ఉంటుంది. ఆ ప్రాంతంలో ప్రవేశించిన తర్వాతనే దుఆ చదువుకోవాలి. ఇక మరుగుదొడ్డి ఏదైతే ఉంటే, నాలుగు గోడల మధ్యలో ఏదైతే ఉంటే, బాత్రూంలో, టాయిలెట్లో ప్రవేశించేకి ముందే దాన్ని చదువుకోవాలి.

బిస్మిల్లాహ్ అనాలి, ఆ తర్వాత,

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْخُبُثِ وَالْخَبَائِثِ
అల్లాహుమ్మ ఇన్నీ అవూదుబిక మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్
ఓ అల్లాహ్, నేను నీ శరణులో జొచ్చుచున్నాను, స్త్రీ, పురుషుల జిన్నాతుల నుండి

ఇది సహీ బుఖారీలో ఉంది హదీస్ నెంబర్ 142. కానీ బిస్మిల్లాహ్ గురించి ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంత గొప్ప విషయం చెప్పారో గమనించండి. కాలకృత్యాలు తీర్చుకునే సందర్భంలో మనిషి తన మర్మ అవయవాలను దాచి ఉంచలేకపోతాడు గనుక, ఆ సందర్భంలో జిన్నాతులు కూడా చూసే అవకాశం ఉంటుందా లేదా? అందుగురించి మీరు బిస్మిల్లాహ్ అని ఆ సందర్భంలో ముందే అనేది ఉంటే మీకు మరియు జిన్నాతులకు మధ్యలో ఒక పరదా ఏర్పడుతుంది, వారు మీ మర్మ అవయవాలను చూడలేరు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు.

కాలకృత్యాలు తీర్చుకొని పరిశుభ్రత, పరిశుభ్రం చేసుకున్న తర్వాత తిరిగి ఎప్పుడైతే వస్తారో, బయటికి వచ్చిన తర్వాత “గుఫ్రానక” అని అనాలి. బిస్మిల్లా – అల్లాహ్ యొక్క పేరుతో నేను ఈ నా అవసరాన్ని తీర్చుకోవడానికి వెళ్తున్నాను అన్న భావం. అల్లాహుమ్మ ఇన్నీ అవూదుబిక – ఓ అల్లాహ్, నేను నీ శరణులో జొచ్చుచున్నాను, మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్ – స్త్రీ, పురుషుల జిన్నాతుల నుండి. తిరిగి వచ్చిన తర్వాత ఏమనాలి? గుఫ్రానక – అంటే ఓ దేవా, నీవు నన్ను క్షమించు.

నాలుగవ విషయం, కాలకృత్యాలు తీర్చుకునే సందర్భంలో మాట్లాడవద్దు. ఏ మాత్రం మాట్లాడవద్దు. మరీ ఏదైనా అత్యవసర విషయం ఉండి సంక్షిప్తంగా ఏదైనా మాట్లాడితే అది వేరే విషయం అని కొందరు పండితులు చెప్పారు. కానీ ఒక సామాన్య పద్ధతి ఏమిటి? మన కాలకృత్యాలు తీర్చుకునే సందర్భంలో మాట్లాడవద్దు. సహీహాలో ఈ హదీస్ ఉంది, షేక్ అల్బానీ రహిమహుల్లాహ్ గారు సహీ అని చెప్పారు.

إِذَا تَغَوَّطَ الرَّجُلَانِ فَلْيَتَوَارَ كُلُّ وَاحِدٍ مِنْهُمَا عَنْ صَاحِبِهِ وَلَا يَتَحَدَّثَانِ عَلَى طَوْفِهِمَا فَإِنَّ اللَّهَ يَمْقُتُ عَلَى ذَلِكَ
ఇద్దరు మనుషులు కలిసి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కడూ తన స్నేహితుని చూపులకు దూరంగా ఉండే అటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళిపోవాలి. మరి తమ అవసరం తీర్చుకున్న సందర్భంలో ఏ మాత్రం మాట్లాడవద్దు. ఇందువల్ల అల్లాహ్ త’ఆలా వారిపై చాలా ఆగ్రహపడతాడు.”

ఐదవ విషయం, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు సామాన్యంగా అల్లాహ్ యొక్క పేరు గల ఏ వస్తువు కూడా వెంట తీసుకెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఈ విషయంలో వచ్చిన ఒక హదీస్ బలహీనంగా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉంగరం మీద “ముహమ్మద్ రసూల్ అల్లాహ్” అంటే ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త అన్న భావం, ఈ మూడు పదాలు ఉండేవి. అయితే అల్లాహ్ యొక్క పేరు కూడా వచ్చింది గనుక దాన్ని తీసి బయట పెట్టి వెళ్ళేవారు అని. కానీ హదీస్ దయీఫ్ ఉంది. అయినా గానీ సర్వసామాన్యంగా పండితులందరూ కూడా ఏకీభవించారు, అల్లాహ్ పేరు గల ఏ వస్తువు కూడా ఎంబడి తీసుకొని వెళ్ళకూడదు.

కానీ కొన్ని వస్తువులు దాన్ని బయట పెట్టి వెళ్ళడం ద్వారా ఏదైనా మనకు నష్టం ఉంది, దాన్ని కాపాడలేకపోతాము, అలాంటి సందర్భంలో మరికొందరు పండితులు ఏం ఫత్వా ఇచ్చారంటే దానిని బహిరంగంగా ఉండకుండా జేబు లోపల గానీ, దస్తీ లోపల గానీ, ఇలాంటివన్నీ దాచిపెట్టి పోయే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనిషి ఖురాన్ కంఠస్థం చేసి ఉంటాడు, దాన్ని బయటికి తీసి వెళ్ళలేడు కదా. అయితే దాని యొక్క పోలిక అని కొందరు పండితులు చెప్పారు. అలాగే జవ్వాలల్లో ఉదాహరణకు ఖురాన్ ఉంటుంది, లేదా ఏదైనా కాయితం ఉంది, ఏదైనా దువాల పుస్తకం ఉంది, అలాంటివి బయట పెట్టి వెళ్ళడం వల్ల, బయట పెట్టి వెళ్ళడం వల్ల ఏదైనా నష్టం అన్నటువంటి భయం ఉండేది ఉంటే లోపల పెట్టి వెళ్ళవచ్చు అని చెప్పారు.

ఆరో విషయం, ప్రత్యేకంగా ఎడారి ప్రాంతంలో, ఓపెన్ ప్లేస్ లో కాలకృత్యాలు తీర్చుకునే సందర్భంలో ఖిబ్లా దిశలో ముఖము గానీ వీపు గానీ ఉండకూడదు. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 394 లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు అన్హు ఉల్లేఖకులు:

إِذَا أَتَيْتُمُ الْغَائِطَ فَلاَ تَسْتَقْبِلُوا الْقِبْلَةَ وَلاَ تَسْتَدْبِرُوهَا
“మీరు మీ అవసరాన్ని తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఖిబ్లా వైపునకు ముఖము చేయకండి, వీపు చేయకండి.”

కానీ నాలుగు గోడల మధ్యలో ఉండేది ఉంటే అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అలా కూడా ఉండకుండా ముందు నుండే జాగ్రత్తపడటం మరీ మంచిది. ఎందుకనగా అబూ దావూద్ లో హదీస్ నెంబర్ 11 లో, ఇంకా సహీ బుఖారీ వేరే చోట కూడా ఈ హదీస్ ఉంది ఈ భావంలో, సహీ బుఖారీలో ఉంది 148, ఇబ్నె ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఒకసారి ఏదో అవసరం పడి తమ సోదరి అయిన హఫ్సా రదియల్లాహు త’ఆలా అన్హా గారి ఇంటి కప్పు మీదికి వెళ్ళడానికి పైన ఎక్కుతున్నారు. ఆ సందర్భంలో ప్రవక్త గారు ఖిబ్లా దిశలో, ఖిబ్లా దిశలో వీపు పెట్టి తమ కాలకృత్యాలు తీర్చుకున్నట్టు కనబడింది, తర్వాత బహుశా ఆ విషయంలో అడిగారు. అయితే ఈ హదీస్ ద్వారా ధర్మవేత్తలు ఏమన్నారంటే నాలుగు గోడల మధ్యలో ఉండేది ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదు. అదే కాకుండా ఒక సందర్భంలో ఇబ్ను ఉమర్ స్వయంగా ప్రయాణంలో ఉన్నారు, అప్పుడు తమ ఒంటెను నిలిపారు, ఖిబ్లా దిశలో మూత్రం పోశారు. ఆ సందర్భంలో మర్వానల్ అస్ఫర్ అనే ఒక వ్యక్తి ఈ సంఘటనను చూసి వెంటనే ప్రశ్నించారు: “యా అబా అబ్దిర్రహ్మాన్, అలైస ఖద్ నుహియ అన్ హాదా? ఖిబ్లా దిశలో ఉండి, ఖిబ్లా దిశలో ముఖం గానీ వీపు గానీ చేసి కాలకృత్యాలు తీర్చుకోవద్దు, మూత్ర మలమూత్రానికి వెళ్ళవద్దు అని మనకు నిషేధించబడలేదా?“అయితే అబ్దుల్లా బిన్ ఉమర్ ఏమన్నారు?

نُهِيَ عَنْ ذَلِكَ فِي الْفَضَاءِ
“ఎడారి ప్రాంతంలో, ఓపెన్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఇలా చేయకూడదు అని నిషేధించబడింది.”

فَإِذَا كَانَ بَيْنَكَ وَبَيْنَ الْقِبْلَةِ شَيْءٌ يَسْتُرُكَ فَلاَ بَأْسَ
“ఒకవేళ నీ మధ్యలో మరియు ఖిబ్లా మధ్యలో ఏదైనా అడ్డు ఉండి దాని వెనుక నీవు నీ అవసరాన్ని తీర్చుకుంటే అందులో ఎలాంటి అభ్యంతరం లేదు” అని అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు చెప్పారు.

నాలుగు గోడల మధ్యలో ఖిబ్లా దిశలో ఉన్నా గానీ మన టాయిలెట్, ఎలాంటి అభ్యంతరం లేదు అని హదీసుల ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయినా గానీ ఎవరైనా ముందు నుండే దాన్ని కట్టేటప్పుడు ఖిబ్లాకు వ్యతిరేక దిశలో కట్టేది ఉంటే మరీ మంచిది.

ఏడవ విషయం, శాపనకు గురి కావలసిన స్థలాల్లో మలమూత్రం చేయకూడదు. శాపనకు గురి కావలసిన స్థలాల్లో అంటే ఏంటి? హదీస్ లో ఇలాగే ఉంది. ముస్లిం షరీఫ్ 269 లో హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు:

اتَّقُوا اللَّعَّانَيْنِ
(ఇత్తఖుల్ లఅనైన్)
“అధికంగా శాపం ఇచ్చే రెండు విషయాల నుండి మీరు జాగ్రత్త పడండి.”

ప్రవక్తను అడిగారు, వమల్ లఅనాని యా రసూలల్లాహ్? ప్రవక్తా, ఆ రెండు అధికంగా శాపనానికి గురి అయ్యే ఆ విషయాలు ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు:

الَّذِي يَتَخَلَّى فِي طَرِيقِ النَّاسِ أَوْ فِي ظِلِّهِمْ
(అల్లది యతఖల్లా ఫీ తరీఖిన్నాసి అవ్ ఫీ దిల్లిహిమ్)
“ప్రజల దారి మధ్యలో లేదా నీడలో మలమూత్ర విసర్జన చేసేవాడు.”

అంటే ఆ మలమూత్ర విసర్జన అనేది ఆ ప్రాంతంలో చేయడం ద్వారా ప్రజలు అసహ్యించుకుంటారు, ప్రజలు శపిస్తారు, ఆ శాపనకు అలాంటి వారు గురి అవుతారు.

సునన్ అబీ దావూద్ లో హదీస్ నెంబర్ 26 లో ఉంది, ముఆద్ ఇబ్ను జబల్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు:

اتَّقُوا الْمَلَاعِنِ الثَّلَاثَةَ
(ఇత్తఖుల్ మలాయినిస్ సలాస)
“మూడు శాపనానికి గురి అయ్యే విషయాల నుండి మీరు దూరం ఉండండి:
అల్ బరాజ్ ఫిల్ మవారిద్, వఖారిఅతిత్ తరీఖ్, వ దిల్ల్.
నీళ్ళు త్రాగేచోట మల విసర్జన చేయడం, లేదా దారి మధ్యలో దారి పక్కన, ఇంకా నీడ ఉన్నచోట.”

ఎనిమిదవ విషయం, శరీరం లేక మన దుస్తులపై ఎలాంటి మలమూత్ర తుంపరలు పడకుండా జాగ్రత్త పడాలి. ఇందులో ఎలాంటి అలసత్వం చేయకపోవడం చాలా మంచిది. ఎందుకనగా ఇది చాలా భయంకరమైన విషయం, ఇది చాలా పెద్ద పాపంలో లెక్కించబడుతుంది. ఘోర పాపంలో. అందుగురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు సునన్ ఇబ్నె మాజా హదీస్ నెంబర్ 348 లో,

أَكْثَرُ عَذَابِ الْقَبْرِ مِنَ الْبَوْلِ
(అక్సరు అదాబిల్ ఖబ్రి మినల్ బౌల్)
“సమాధిలో ఎక్కువగా శిక్ష దేని గురించి అయితే జరుగుతుందో, అది మూత్ర విసర్జనలో అశ్రద్ధ చేయడం, లేక మూత్ర తుంపరల నుండి జాగ్రత్త పడకపోవడం, లేదా మూత్రం పోసిన తర్వాత పరిశుభ్రత విషయంలో అశ్రద్ధకు గురి కావడం.”
ఇవన్నీ భావాలు కూడా అందులో వస్తాయి.

ఇంకా సహీ బుఖారీ హదీస్ నెంబర్ 216 లో ఉంది. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్తూ ఉంటే రెండు సమాధులు కనబడ్డాయి. అందులో ఉన్న ఆ ఇద్దరు మనుషులకు, శవాలకు చాలా శిక్ష అవుతుంది అని చెప్పారు. అయితే ప్రవక్తలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అందులో ఒకరి గురించి చెప్పారు,

كَانَ أَحَدُهُمَا لَا يَسْتَتِرُ مِنْ بَوْلِهِ
(కాన అహదుహుమా లా యస్తతిరు మిన్ బౌలిహి)
“ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి తన మూత్రం నుండి జాగ్రత్త పడేవాడు కాడు, మూత్ర తుంపరలు మీద పడకుండా తనను తాను కాపాడుకునేవాడు కాడు, ఇంకా మూత్రం పోసిన తర్వాత శుభ్రం చేసుకునేవాడు కాడు, శుభ్రం చేసుకున్నా అందులో కూడా అశ్రద్ధతనం పాటించేవాడు.”
ఇవన్నీ భావాలు కూడా ఈ హదీస్ లో వస్తాయి. రెండో వ్యక్తి ఎవరు? చాడీలు చెప్పేవాడు.

తొమ్మిదవ విషయం, మలమూత్ర విసర్జన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. నీళ్లు ఉపయోగించాలి. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 150 లో ఉంది, “ఇదా ఖరజ లిహాజతిహి అజీవు అన వగులామున్ మఅనా ఇదావతున్ మిమ్మాఇన్ యఅనీ యస్తంజీ బిహి.” హజరత్ అనస్ రదియల్లాహు అన్హు గారు ఈ విషయం తెలుపుతున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మలమూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు నేను మరియు ఇంకో నాలాంటి యువకుడు, మేము ఇద్దరము ప్రవక్త గారి వెంట వెళ్ళేవాళ్ళము, మా వెంట మేము నీళ్ళు తీసుకొని వెళ్ళేవాళ్ళము. అయితే ఎక్కడి వరకైతే వెళ్ళేవారో అక్కడికి వెళ్లి, ఆ తర్వాత ఎక్కడనైతే ప్రజల చూపులకు కనబడకుండా వెళ్ళేది ఉందో, అక్కడి నుండి ప్రవక్త ఆ నీళ్లు తమ వెంట తీసుకొని వెళ్ళేవారు. అయితే నీళ్ళతో పరిశుభ్రత అనేది పాటించాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పాటించేవారు అన్న విషయం మనకి ఈ హదీస్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది.

అంతే కాదు, సునన్ తిర్మిదీలో, సునన్ తిర్మిదీలో హదీస్ నెంబర్ 19, హజరత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా స్త్రీలతో చెప్పారు. “ముర్న అజ్వాజకున్న అన్ యస్తతీబూ బిల్ మాఇ ఫఇన్నీ అస్తహ్యీహిమ్, ఫఇన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కాన యఫ్అలు.” “మీరు మీ భర్తలకు, మీ పురుషులకు నీళ్ళతో శుభ్రపరుచుకోవాలని, మలమూత్ర విసర్జన తర్వాత నీళ్లు ఉపయోగించాలని, నీళ్లతో శుభ్రపరుచుకోవాలని మీరు ఆదేశించండి. వారికి నేను చెప్పడంలో సిగ్గుపడుతున్నాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే చేసేవారు.”

ఒకవేళ నీళ్ళు లేని సందర్భంలో లేదా నీళ్లతో పాటు కూడా ఇటిక పెడ్డలను, నీళ్ళు పీల్చే రాయిని లేక టిష్యూ పేపర్, ఇలాంటి వాటిని కూడా ఉపయోగించడం మరీ మంచిది. మరీ మంచిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో వచ్చిన తర్వాత సూరె తౌబాలో ఆయత్ నెంబర్ 108 లో,

فِيهِ رِجَالٌ يُحِبُّونَ أَن يَتَطَهَّرُوا وَاللَّهُ يُحِبُّ الْمُطَّهِّرِينَ
(ఫీహి రిజాలున్ యుహిబ్బూన అన్ యతతహర్రూ, వల్లాహు యుహిబ్బుల్ ముత్తహిరిన్)
“దానిలో పవిత్రంగా ఉండటాన్ని ప్రేమించేవారున్నారు. అల్లాహ్ పవిత్రంగా ఉండేవారిని ప్రేమిస్తాడు.” (9:108)

ఈ మదీనా వాసుల్లో అన్సార్ లో కొందరు, ప్రత్యేకంగా ఖుబా వాసులు, ఖుబా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్నవారు, వారిని ప్రశంసిస్తూ ఈ ఆయత్ అవతరించింది. ఏంటి? అక్కడి వాసుల్లో కొందరు పరిశుభ్రంగా ఉండడాన్ని చాలా ప్రేమిస్తారు, మరియు అల్లాహ్ పరిశుభ్రత పాటించే వారిని కూడా ప్రేమిస్తాడు. ఆ మనుషులు ఎవరు? పరిశుభ్రతను చాలా ఇష్టపడతారు. అయితే వారిని ప్రశంసిస్తూ అల్లాహ్ ఏమన్నాడు? వల్లాహు యుహిబ్బుల్ ముత్తహిరిన్ – అల్లాహ్ పరిశుభ్రత పాటించే వారిని ప్రేమిస్తాడు.

అయితే హజరత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు గారు అంటున్నారు, ఇబ్నె ఖుజైమాలో ఈ హదీస్ ఉంది, సహీ హదీస్, వారు నీళ్ళను ఉపయోగించేవారు. అందుగురించి వారి యొక్క ప్రశంసలో అల్లాహ్ త’ఆలా ఈ ఆయత్ ను అవతరింపజేశాడు. అయితే అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు తఫ్సీర్ గ్రంథాల్లో ఈ విషయం ఉంది, వారు నీళ్లతో పాటు మట్టి పెడ్డలను, ఇటికలను ఇలాంటి వాటిని, నీళ్లు పీల్చే అలాంటి వస్తువులను ఉపయోగించేవారు, రెండిటి ద్వారా వారు పరిశుభ్రతను పాటించేవారు గనుక వారిని ప్రశంసిస్తూ అల్లాహ్ త’ఆలా ఈ ఆయత్ ని అవతరింపజేశాడు. అంటే విషయం ఏంటి ఇక్కడ? నీళ్ళు అయితే కంపల్సరీ వాడాలి, నీళ్ళు లేని సందర్భంలో లేక నీళ్లతో పాటు కూడా ఈ వస్తువులు వాడడం కూడా మరీ మంచిది అన్న విషయం ఈ ఆయత్ మరియు దీనికి సంబంధించిన తఫ్సీర్ల ద్వారా మనకు తెలుస్తుంది.

అయితే పరిశుభ్రత కొరకు ఎడమ చెయ్యి మాత్రమే ఉపయోగించాలి, కుడి చెయ్యి ఉపయోగించకూడదు. సహీ బుఖారీలో హదీస్ ఉంది, అబూ ఖతాదా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు:

إِذَا بَالَ أَحَدُكُمْ فَلَا يَأْخُذَنَّ ذَكَرَهُ بِيَمِينِهِ وَلَا يَسْتَنْجِ بِيَمِينِهِ
“మీలో ఎవరైనా మూత్రం పోయినప్పుడు తన మూత్రాంగాన్ని కుడి చేత్తో పట్టుకోకూడదు. కుడి చేతితో పరిశుభ్రత కూడా చేయకూడదు.”

అలాగే పరిశుభ్రత సందర్భంలో నీళ్లతో మనం పరిశుభ్రం చేసినా గానీ, పెడ్డలతో చేసినా, టిష్యూ పేపర్ తో చేసినా గానీ, మూడేసి సార్లు చేయాలి. కానీ కనీసం. అంతకంటే ఎక్కువ చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. ఏదైనా ఎక్కడికైనా వెళ్లారు, నీళ్ళు లేవు, పెడ్డలు ఉపయోగిస్తాము, మూడు పెడ్డలు తీసుకోవాలి. లేదా ఒక పెద్ద రాయి తీసుకొని మూడు దిక్కుల్లో, మూడు సార్లు… ఈ విషయాన్ని వివరంగా చెప్పడంలో చాలా సిగ్గుపడుతూ ఉంటాము, కానీ అర్థం కావడానికి, ఒక పెడ్డ తీసుకున్నాము, మూత్రం పోసిన తర్వాత తొందరపాటు పడవద్దు. మధ్యలో ఆగి ఉన్న చుక్కలన్నీ పడిపోయేంతవరకు వేచి ఉండాలి. ఆ తర్వాత పెడ్డ తీసుకొని ఒక వైపున తుడువాలి, దాన్ని తిప్పేసి రెండోసారి తుడువాలి, మళ్ళీ తింపేసి మూడోసారి తుడువాలి. లేదా మూడు వేరేవేరే రాళ్లు పెడ్డలు తీసుకోవాలి. అంటే కనీసం మూడుసార్లు ఈ కడగడం అనేది, తుడువడం అనేది జరగాలి.

ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే ఆదేశించారో, ఇబ్నె మాజాలో ఈ హదీస్ ఉన్నది, హదీస్ నెంబర్ 350. కానీ దీని యొక్క లాభాన్ని హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఎలా చెబుతున్నారో శ్రద్ధ వహించండి. ఈ ప్రవక్త గారి ఆదేశం వచ్చిన తర్వాత మేము మూడేసి సార్లు కడిగేవాళ్ళం,

فَوَجَدْنَاهُ دَوَاءً وَطَهُورًا
(ఫవజద్నాహు దవాఅన్ వతహూరా)
“దాని మూలంగా దానివల్ల పరిశుభ్రత కూడా పొందినాము, ఎన్నో రోగాలకు చికిత్స కూడా మేము పొందాము.”

అలాగే పరిశుభ్రత కొరకు ఎముక, బొక్క, లేదా పేడ లేదా ఎండిన పిడిక, పెండను పిడికగా చేస్తారు కదా, ఆ పిడికలను గానీ ఏ మాత్రం ఉపయోగించకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ సహీ బుఖారీలో 3571 లో ఉంది. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సహాబీకి ఆదేశించారు రాళ్లు తీసుకురమ్మని, కానీ ఏం చెప్పారు?

وَلاَ تَأْتِنِي بِعَظْمٍ وَلاَ بِرَوْثَةٍ
(వలా తఅతినీ బిఅద్మిన్ వలా బిరౌసతిన్)
“ఎముక గానీ లేదా పేడ గానీ తీసుకురాకు.”

కాలకృత్యాలు తీర్చుకున్నారు, అన్నీ పరిశుభ్రతలు అయిపోయినాయి, తర్వాత ఆ సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగారు, “మీరు ఎందుకు ఈ రెండిటినీ తీసుకురావద్దని చెప్పారు?” అని. అవి మీ సోదరులైన జిన్నాతులకు ఆహారంగా పనిచేస్తాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు.

మలమూత్ర విసర్జన సందర్భంలో సలాం కూడా చేయరాదు, ఎవరైనా సలాం చేస్తే సమాధానం కూడా, జవాబు కూడా ఇవ్వకూడదు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మూత్రం పోస్తున్నారు. కొంచెం దూరంగా ఒక వ్యక్తి వెళ్తూ వెళ్తూ సలాం చేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధానం చెప్పలేదు. తర్వాత అతనితో కలిసి చెప్పారు, ఇలాంటి సందర్భంలో మీరు సలాం చేయకండి. ఒకవేళ మీరు సలాం చేసినా నేను మీకు సమాధానం పలుకను. ఈ హదీస్ ఇబ్నె మాజాలో ఉంది 346.

ఇంతవరకు అల్లాహ్ యొక్క దయవల్ల మనం మలమూత్ర విసర్జనకు సంబంధించిన ఇంచుమించు 14, 13 పద్ధతులను, విషయాలను ఆధారాలతో సహా విన్నాము.

చివరి విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో నిలబడి మూత్రం పోసే అవసరం పడవచ్చు. అది ఇస్లాంలో ధర్మమేనా లేదా? అందులో ఎలాంటి అనుమానం లేదు, అది యోగ్యమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఒక సందర్భంలో ఇలాంటి అవసరం పడింది, నిలబడి మూత్రం పోశారు అన్న విషయం సహీ బుఖారీలో హదీస్ నెంబర్ 224 లో ఉంది.

కానీ అవసరం ఉండి నిలబడి పోసినా లేదా సామాన్యంగా కూర్చుండి మూత్రం పోసినా, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే తుంపరలు, మూత్రపు చుక్కలు మీద పడకుండా చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే సమాధిలో ఎక్కువగా శిక్ష దీని గురించే జరుగుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు.

ఈరోజు అల్లాహ్ యొక్క దయవల్ల ఈ విషయాలు ఏదైతే మనం తెలుసుకున్నామో, ఇలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సరైన పద్ధతిలో ఈ అవసరాలు ఇంకా మన సర్వ జీవితం గడిపే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరన్ వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వబరకాతుహ్.

కొన్ని మలమూత్ర విసర్జన పద్దతులు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

1- మరుగుదొడ్డిలో ఎడమ కాలుతో ప్రవేశిస్తూ, ప్రవేశముకు ముందే చదవాలిః

اللَّهُمَّ إِنِّي أَعُوْذُ بِكَ مِنَ الْخُبُثِ وَالْخَبَائِثِ
బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్‌ ఖుబుసి వల్ ఖబాయిస్ .
(అల్లాహ్‌ పేరుతో, ఓ అల్లాహ్‌ నేను దుష్ట జిన్నాతు స్త్రీ పురుషుల నుండి నీ శరణు జొచ్చుచున్నాను). (బుఖారి 142, ముస్లిం 375).

మరుగుదొడ్డి నుండి కుడి కాలు ముందు వేస్తూ బయటకు వచ్చి చదవాలి:

غُفْرَانَك (గుఫ్రానక)
(నీ మన్నింపుకై అర్ధిస్తున్నాను) (తిర్మిజి 7).


2- అల్లాహ్‌ పేరుగల ఏ వస్తువూ మరుగుదొడ్డిలోకి తీసుకెళ్ళకూడదు. కాని దాన్ని తీసి పెట్టడంలో ఏదైనా నష్టం ఉంటే వెంట తీసుకెళ్ళవచ్చును.

3- ఎడారి ప్రదేశంలో కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఖిబ్లా వైపున ముఖము, వీపు గానీ పెట్టి కూర్చోకూడదు. నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు ఏలాంటి అభ్యంతరము లేదు.

4- సతర్‌ పరిధిలోకి వచ్చే శరీర భాగాన్ని ప్రజల చూపులకు మరుగు పరచాలి. ఇందులో ఏ కొంచమైనా అశ్రద్ధ వహించకూడదు. పురుషుల సతర్‌ నాభి నుండి మోకాళ్ళ వరకు. స్తీ యొక్క పూర్తి శరీరం, నమాజులో కేవలం ముఖము తప్ప. స్తీ నమాజులో ఉన్నప్పుడు పరపురుషులు ఎదురౌవుతే ముఖముపై ముసుగు వేసుకోవాలి.

5- శరీరం లేక దుస్తులపై మలమూత్ర తుంపరులు పడకుండా జాగ్రత్త వహించాలి.

6- మలమూత్ర విసర్దన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. నీళ్ళు లేనప్పుడు నజాసత్‌ మరకలను దూరము చేయుటకు రాళ్ళు, కాగితము లాంటివి ఉపయోగించవచ్చును. పరిశుభ్రత కొరకు ఎడమ చెయ్యి మాత్రమే ఉపయోగించాలి.

[ఇది నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)  గారు రాసిన “శుద్ధి & నమాజు (Tahara and Salah)” అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5168

ఇతరములు :

అల్లాహ్ యేతరులతో దుఆ చేయు నష్టాలు [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ యేతరులతో దుఆ చేయు నష్టాలు (خطورة الدعاء مع غير الله)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

https://www.youtube.com/watch?v=k3vxVbMjq6g [27 నిముషాలు]

ఈ ప్రసంగంలో, వక్త దుఆ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత మరియు దానిని సరైన పద్ధతిలో ఎలా చేయాలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివరిస్తున్నారు. దుఆ కేవలం అల్లాహ్ కే చెందాలని, ఆయనను కాకుండా ఇతరులను ప్రార్థించడం షిర్క్ (బహుదైవారాధన) మరియు కుఫ్ర్ (అవిశ్వాసం) అవుతుందని స్పష్టం చేస్తున్నారు. దుఆయే అసలైన ఇబాదత్ (ఆరాధన) అని, ఇతరులతో దుఆ చేయడం మహా అన్యాయం మరియు దౌర్జన్యం అని నొక్కిచెప్పారు. అల్లాహ్ ను వదిలి ప్రార్థించబడే వారికి ఎలాంటి శక్తి లేదని, వారు మన మొరలు వినలేరని, సహాయం చేయలేరని మరియు ప్రళయ దినాన మనకు శత్రువులుగా మారిపోతారని ఖురాన్ ఆయతుల ద్వారా హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ప్రతి ఒక్కరూ తమ కష్టసుఖాలలో కేవలం ఏకైక అల్లాహ్ ను మాత్రమే వేడుకోవాలని ఈ ప్రసంగం యొక్క సారాంశం.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

సోదర సోదరీమణులారా! దుఆ అల్లాహ్ యేతరులతో చేయడం ఎంత నష్టమో ఎప్పుడైనా మనం గమనించామా? ఈరోజు ఈ అతి ముఖ్యమైన శీర్షికకు సంబంధించిన కొన్ని ఆయతులు దివ్య ఖురాన్ ద్వారా మరియు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక రెండు హదీసులు కూడా మనం విందాము.

మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఎందరు ప్రవక్తలు గతించారో, వారందరి జాతి వారు ఏ రకమైన షిర్క్ కు పాల్పడ్డారో అందులో అతి భయంకరమైనది, వారిని నరకంలో పడవేసినది అది దుఆ మిన్ దూనిల్లాహ్. అల్లాహ్ తప్ప ఇతరులతో దుఆ చేయడం. ఉదాహరణకు ఎవరైనా అనారోగ్యానికి గురవుతారు, ఎవరిపైనా ఏదైనా కష్టాలు ఆపదలు వస్తాయి, ఎవరికైనా సంతానం కలగదు. ఈ రోజు మనం సమాజంలో చూస్తున్నాము, వారు అల్లాహ్ ను కాకుండా ఇతరులను అర్ధిస్తారు, ఇతరులను ప్రార్థిస్తారు, ఇతరులతో దుఆ చేస్తారు. వారికి సంతానం కలగాలని, వారికి ఆరోగ్యం ప్రాప్తించాలని, వారి కష్టాలు దూరమైపోవాలని. ఇది ఎంత ఘోరమైన పాపమో ఎప్పుడైనా మనం ఆలోచించామా? అయితే నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఖురాన్ ఆయతుల ఆధారంగా కొన్ని ముఖ్య విషయాలు చెబుతున్నాను, ఈ ముఖ్యమైన శీర్షికకు సంబంధించినది. మీరు శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను.

ఇందులో మొదటి విషయం, అసలు దుఆ ఎవరి హక్కు? అంటే మనం దాసులము, ఎవరితో దుఆ చేయాలి? దీని గురించి ఖురాన్ చాలా స్పష్టంగా మనకు తెలియజేసింది.

సూరతుర్ రాద్, సూర నెంబర్ 13, ఆయత్ నెంబర్ 14 లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు:

لَهُ دَعْوَةُ الْحَقِّ
(లహు ద’వతుల్ హఖ్)
దుఆ యొక్క హక్కు కేవలం అల్లాహ్ ది మాత్రమే.” (13:14)

ఆయన తప్ప ఇంకా ఎవరితో దుఆ చేయడం ఇది న్యాయం, ధర్మం ఎంత మాత్రం కాదు.

ఇంకా, సూరె లుఖ్మాన్, ఆయత్ నెంబర్ 30 లో అల్లాహ్ తెలిపాడు:

وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ الْبَاطِلُ
(వ అన్న మా యద్ఊన మిన్ దూనిహిల్ బాతిల్)
అల్లాహ్ తప్ప వారు ఎవరెవరితో దుఆ చేస్తున్నారో ఇదంతా కూడా వ్యర్థం, వృధా, అసత్యం.” (31:30)

అల్లాహు అక్బర్, గమనించారా? స్వయంగా మన సృష్టికర్త అయిన అల్లాహ్, మనం ఎవరితో దుఆ చేయాలని మనకు ఆదేశించాడు? ఈ విషయానికి వస్తే, ఖురాన్ లో ఒక సందర్భంలో కాదు, ఎన్నో చోట్ల. ఉదాహరణకు, సూరతు గాఫిర్, దాని యొక్క మరొక పేరు సూరతుల్ మూమిన్, ఆయత్ నెంబర్ 60 లో తెలిపాడు:

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ
(వ ఖాల రబ్బుకుముద్ ఊనీ అస్తజిబ్ లకుమ్)
మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను (40:60)

వ ఖాల రబ్బుకుమ్, మీ ప్రభువు మీకు ఈ ఆదేశం ఇస్తున్నాడు, ఉద్’ఊనీ, మీరు నాతో మాత్రమే దుఆ చేయండి, అస్తజిబ్ లకుమ్, నేను మీ దుఆలను అంగీకరిస్తాను. అల్లాహు అక్బర్, గమనించారా? నేను మీ దుఆలను అంగీకరిస్తాను అంటున్నాడు అల్లాహ్ త’ఆలా.

ఇంకా సోదర మహాశయులారా, దుఆ ఇది అసలైన ఇబాదత్, అసలైన ఆరాధన, అసలైన ప్రార్థన, దుఆ. ఇదే సూరత్, సూరత్ గాఫిర్, సూరతుల్ మూమిన్ ఆయత్ నెంబర్ 60 లో, అల్లాహ్ ఇలా తెలియజేశాడు:

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ ۖ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ

మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే, “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా దాస్యం పట్ల గర్వాహంకారం ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించటం తథ్యం.”( 40:60)

దుఆ యొక్క ఆదేశం ఇచ్చిన వెంటనే, నా ఆరాధన పట్ల ఎవరైతే అహంకారానికి గురి అవుతాడో అని అంటున్నాడు అల్లాహ్ త’ఆలా, దుఆను ఆరాధన, దుఆ అసలైన ఇబాదత్ అని తెలిపాడు. ఎవరైతే దుఆ చేయరో అల్లాహ్ త’ఆలా తో, ఏం జరుగుతుంది? సయద్ ఖులూన జహన్నమ దాఖిరీన్. అవమానకరంగా వారు నరకంలో ప్రవేశిస్తారు. అల్లాహు అక్బర్. ఇంకా సోదర మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

الدُّعَاءُ هُوَ الْعِبَادَةُ
(అద్దుఆఉ హువల్ ఇబాదహ్)
దుఆ అసలైన ఇబాదత్.

మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే సూర గాఫిర్ యొక్క ఆయత్ పారాయణం చేశారు.

అంతేకాదు సోదరులారా, ఒకవైపున అల్లాహ్ త’ఆలా నాతోనే దుఆ చేయండి అని ఏదైతే ఆదేశించాడో, ఇతరుల ఎవరితోనీ దుఆ చేయకండి అని కూడా చెప్పాడు. ఇతరులతో దుఆ చేయడం నిషేధించాడు, వారించాడు. ఉదాహరణకు, సూరత్ యూనుస్ ఆయత్ నెంబర్ 106 లో తెలిపాడు:

وَلَا تَدْعُ مِن دُونِ اللَّهِ
(వలా తద్’ఉ మిన్ దూనిల్లాహ్)
అల్లాహ్ ను వదిలి మీరు ఎవరినీ అర్ధించకండి, ఎవరితో దుఆ చేయకండి.” (10:106)

సూరతుల్ ఖసస్ ఆయత్ నెంబర్ 88 లో చెప్పాడు:

وَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ
(వలా తద్’ఉ మ’అల్లాహి ఇలాహన్ ఆఖర్)
అల్లాహ్‌తో పాటు మరే దేవుణ్ణీ మొరపెట్టుకోకు. (28:88)

అల్లాహ్ తో పాటు ఇంకా ఎవరితోనీ కూడా, అల్లాహ్ తో పాటు వేరే ఏ దైవమైనా ఉన్నాడు అని భావించి వారితో మీరు దుఆ చేయకండి. సోదర మహాశయులారా, సూరత్ యూనుస్ మరియు సూరతుల్ ఖసస్ లోని ఈ రెండు ఆయతుల ద్వారా మనకు విషయం ఏం తెలిసింది? అల్లాహ్ తో దుఆ చేయడంతో పాటు ఇతరులతో చేయడం ఇది కూడా నిషేధం. అల్లాహ్ ను వదిలి వేరే ఎవరితోనైనా చేయడం ఇది కూడా నిషిద్ధం. మరి చేయవలసింది ఏంటిది? సూర గాఫిర్ లో మనం తెలుసుకున్నాము, కేవలం అల్లాహ్ తో మాత్రమే దుఆ చేయాలి.

అయితే, అల్లాహ్ తప్ప ఇతరులతో దుఆ చేయడం వల్ల మనకు నష్టం ఏమిటి? మహా భయంకరమైన నష్టం. అల్లాహ్ తో పాటు ఇతరులతో దుఆ చేయడం గాని, అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేయడం గాని, ఇది షిర్క్ మరియు కుఫ్ర్ లోకి వస్తుంది. బహుదైవారాధనలో లెక్కించడం జరుగుతుంది. సత్య తిరస్కారంలో లెక్కించడం జరుగుతుంది.

సూరతున్ నహల్ ఆయత్ నెంబర్ 86 గమనించండి.

وَإِذَا رَأَى الَّذِينَ أَشْرَكُوا شُرَكَاءَهُمْ
(వ ఇదా ర అల్లజీన అష్రకూ షురకాఅహుమ్)
ఈ ముష్రిక్కులు తాము (అల్లాహ్‌కు) భాగస్వాములుగా నిలబెట్టే వారిని చూడగానే..”

షిర్క్ చేసినటువంటి వారు, అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వాములుగా కల్పించిన వారు తమ భాగస్వాములను చూస్తారు. ఎప్పుడు ఇది? ప్రళయ దినాన. చూసి ఏమంటారు?

قَالُوا رَبَّنَا هَٰؤُلَاءِ شُرَكَاؤُنَا الَّذِينَ كُنَّا نَدْعُو مِن دُونِكَ
(ఖాలూ రబ్బనా హాఉలాఇ షురకాఉనల్లజీన కున్నా నద్’ఊ మిన్ దూనిక్)
“ఓ మా ప్రభూ! మేము నిన్ను వదిలేసి మొరపెట్టుకున్న మా భాగస్వాములు వీరే” అని అంటారు” (16:86)

గమనిస్తున్నారా సోదరులారా? చదవండి మీరు సూరతున్ నహల్, సూర నెంబర్ 16, ఆయత్ నెంబర్ 86. ప్రళయ దినాన అందరూ హాజరవుతారు కదా, దుఆ చేసిన వారు ఎవరితోనైతే దుఆ చేయడం జరిగిందో. ఎప్పుడైతే వారిని చూస్తారో, “ఓ మా ప్రభువా, నిన్ను వదిలి మేము వారితో దుఆ చేసాము, వారిని మేము నీకు భాగస్వామిగా చేసాము. ఈరోజు వారు మాకు ఏమీ లాభం చేయడం లేదు” అని మొరపెట్టుకుంటారు. అయితే ఈ ఆయత్ లో మనకు చాలా స్పష్టంగా తెలిసింది, వారు స్వయంగా ఒప్పుకుంటున్నారు మేము ఈ షిర్క్ పని చేసాము అని.

అయితే, సూరతుల్ ఆరాఫ్, సూర నెంబర్ 7, ఆయత్ నెంబర్ 37 కూడా మీరు గమనించండి. మీరు కూడా స్వయంగా తెలుగు ఖురాన్ అనువాదాలు తీసి చదవండి, చూడండి, పరిశీలించండి. ఒక విషయం.. క్షమించండి, నేను నా టాపిక్ కు కొంచెం దూరమై ఒక విషయం మీకు అర్థం కావడానికి తెలియజేస్తున్నాను. మనం జానెడు కడుపులో పోయే కూడు తినడానికి మార్కెట్ లోకి వెళ్లి బియ్యం ఏ రకమైనది, ఈ టమాటాలు పాడు అయినాయా, మంచియా, ఉల్లిగడ్డ మంచిగుందా లేదా, ఈ కూరగాయలు మంచియా లేవా, ఒక్కొక్కటి ఏరుకొని మంచి మంచివి తీసుకొని వస్తాము కదా. మన స్వర్గం విషయానికి, ఏ ధర్మ జ్ఞానం మనం నేర్చుకోవాల్సి ఉందో దానిని కూడా మనం వెతకాలి, పరిశీలించాలి, సత్యం ఏదో తెలుసుకోవాలి. సూరతుల్ ఆరాఫ్ ఆయత్ నెంబర్ 37:

حَتَّىٰ إِذَا جَاءَتْهُمْ رُسُلُنَا يَتَوَفَّوْنَهُمْ قَالُوا أَيْنَ مَا كُنتُمْ تَدْعُونَ مِن دُونِ اللَّهِ ۖ قَالُوا ضَلُّوا عَنَّا وَشَهِدُوا عَلَىٰ أَنفُسِهِمْ أَنَّهُمْ كَانُوا كَافِرِينَ

ఆఖరికి మా దూతలు వారి ప్రాణాలు స్వాధీనం చేసుకోవటానికి వారివద్దకు వచ్చినప్పుడు “అల్లాహ్‌ను వదలి మీరు ఆరాధిస్తూ ఉన్నవారు ఇప్పుడెక్కడున్నారు?” అని అడుగుతారు. “వారంతా మా వద్ద నుంచి మటుమాయమై పోయారు” అని వాళ్ళు చెబుతారు. తాము అవిశ్వాసులుగా ఉండేవారన్న విషయాన్ని గురించి వారు స్వయంగా సాక్ష్యమిస్తారు.. (7:37)

అప్పుడు వారు తమకు తాము సాక్ష్యం పలుకుతారు, “అయ్యో, మేము ఎంత కుఫ్ర్ పని చేసాము, ఎంత అవిశ్వాసానికి పాల్పడే పని చేసాము, సత్య తిరస్కారంలో మేము పడి ఉన్నాము“. అయితే ఏం తెలిసింది? అల్లాహ్ తో కాకుండా లేదా అల్లాహ్ తో పాటు ఇతరులతో దుఆ చేయడం షిర్క్, కుఫ్ర్ లో వస్తుంది మరియు వారు ఏమీ వారికి లాభం చేకూర్చలేదు. వారు ఏమీ లాభం చేకూర్చరు అన్న విషయం ఇంకా ఎన్నో ఆయతుల ద్వారా ఇన్ షా అల్లాహ్ నేను తెలియజేస్తున్నాను.

అంతేకాదు సోదర మహాశయులారా, అల్లాహ్ ను వదిలి లేదా అల్లాహ్ తో పాటు ఇంకా వేరే వారితో కూడా దుఆ చేయడం ఇది మహా అన్యాయం, మహా దౌర్జన్యం. ఏ కొందరు యువకులు తమ జాతి వారిని ఎదిరించి, జాతి వారందరూ కూడా షిర్క్ పనులు చేస్తున్నారు, తౌహీద్ కు దూరమై ఉన్నారు, వారు కేవలం అల్లాహ్ ను మాత్రమే, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి అన్న తపనతో తమ గ్రామం నుండి కూడా దూరమయ్యారు. ఆ సందర్భంలో వారు ఏమంటారు, సూరతుల్ కహఫ్ ఆయత్ నెంబర్ 14:

لَّن نَّدْعُوَ مِن دُونِهِ إِلَٰهًا ۖ لَّقَدْ قُلْنَا إِذًا شَطَطًا
(లన్ నద్’ఉవ మిన్ దూనిహి ఇలాహన్, లఖద్ ఖుల్నా ఇదన్ షతతా)
మేము ఆయన్ని తప్ప వేరొక ఆరాధ్య దైవాన్ని పిలవటమన్నది జరగని పని. ఒకవేళ మేము గనక అలా చేస్తే ఎంతో దుర్మార్గపు మాటను పలికిన వారమవుతాము.” (18:14)

లన్ నద్’ఉవ మిన్ దూనిహీ ఇలాహా. మేము అల్లాహ్ ను వదిలి వేరే ఏ భూటకపు దైవాలను మేము ఆరాధించము. అల్లాహ్ ను వదిలి వేరే ఏ దైవంతో మేము దుఆ చేయము. ప్రజలు ఎవరెవరినైతే దైవాలుగా భావిస్తున్నారో, వారి దృష్టిలో, వారి యొక్క అభిప్రాయం ప్రకారం వారు దేవుళ్ళు కావచ్చు, కానీ సత్యమైన దేవుడు కేవలం అల్లాహ్. సత్యమైన ఆరాధ్యుడు కేవలం అల్లాహ్. ఆయన్ని తప్ప మేము ఇంకా ఎవరితో దుఆ చేయము. లఖద్ ఖుల్నా ఇజన్ షతతా. ఒకవేళ మేము ఇలా చేసి ఉంటే ఇది మహా దౌర్జన్యం అయిపోతుంది. గమనించారా? 

అంతేకాదు, అల్లాహ్ ను తప్ప వేరే ఎవరితోనైనా దుఆ చేయడం, అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఎవరితోనైనా దుఆ చేయడం… మహాశయులారా, ఇది అల్లాహ్ యొక్క శిక్షకు గురి చేసే విషయం. అవును, అల్లాహ్ యొక్క శిక్షకు గురి చేసే విషయం. చదవండి ఖురాన్ లో. సూరతుష్ షుఅరా ఆయత్ నెంబర్ 213 లో అల్లాహ్ తెలిపాడు:

فَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَكُونَ مِنَ الْمُعَذَّبِينَ
(ఫలా తద్’ఉ మ’అల్లాహి ఇలాహన్ ఆఖర ఫతకూన మినల్ ము’అద్దబీన్)
కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు అల్లాహ్‌తోపాటు మరే ఇతర దైవాన్నీ మొరపెట్టుకోకు. నువ్వుగాని అలా చేశావంటే శిక్షించబడేవారిలో చేరిపోతావు సుమా!” (26:213)

ఫలా తద్వు మఅల్లాహి ఇలాహన్ ఆఖర్. అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఏ దైవంతో మీరు దుఆ చేయకండి. ఫతకూన మినల్ ముఅజ్జబీన్. అలా చేశావంటే, అలా చేశారంటే శిక్ష ఇవ్వబడిన వారిలో ఎవరికైతే శిక్ష పడుతుందో వారిలో మీరు కలిసిపోతారు. అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరిని ఇహలోకం, పరలోకం అన్ని రకాల శిక్షల నుండి దూరం చేయుగాక, దూరం ఉంచుగాక. మరియు శిక్షలకు గురి చేసే ప్రతి పాపం నుండి కూడా అల్లాహ్ మనల్ని దూరం ఉంచుగాక.

అంతేకాదు, చివరిలో ఒక రెండు ముఖ్యమైన విషయాలు అవేమిటంటే, అల్లాహ్ ను కాకుండా ఎవరినైతే ఆరాధిస్తారో, అల్లాహ్ ను కాకుండా లేదా అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఎవరితోనైతే దుఆ చేస్తారో, వారిలో ఏ శక్తి లేదు. మన మొరలు వినడానికి, మనం వేడుకునే వాటిని ఇవ్వడానికి, మన కష్ట దుఃఖాలు దూరం చేయడానికి, సుఖాలు ప్రసాదించడానికి, ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వడానికి వారిలో ఏ శక్తి లేదు అని అల్లాహ్ చాలా స్పష్టంగా తెలిపాడు. ఒకవేళ వాస్తవంగా అల్లాహ్ ను నమ్మేవారయ్యేది ఉంటే ఈ ఆయతులను చాలా శ్రద్ధగా మనం అర్థం చేసుకోవాలి. సూరత్ ఫాతిర్, ఆయత్ నెంబర్ 13, 14.

وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍ
(వల్లదీన తద్’ఊన మిన్ దూనిహి మా యమ్లికూన మిన్ ఖిత్మీర్)
ఆయన్ని వదలి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారో వారు ఖర్జూరపు టెంకపై ఉండే పొరకు కూడా యజమానులు కారు.” (35:13)

إِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ ۚ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍ
ఒకవేళ మీరు వారిని మొర పెట్టుకున్నా, వారు మీ మొరను ఆలకించరు. ఒకవేళ ఆలకించినా, మీ అక్కరను తీర్చలేరు. పైపెచ్చు ప్రళయదినాన మీరు కల్పించే భాగస్వామ్యాన్ని (షిర్క్‌ను) వారు (సూటిగా) త్రోసిపుచ్చుతారు. అన్నీ తెలిసిన దేవుని మాదిరిగా (సావధానపరిచే సమాచారాన్ని) నీకు తెలిపే వాడెవడూ ఉండడు సుమా! (35:14)

(వల్లజీన తద్వూన మిన్ దూనిహీ). మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే దుఆ చేస్తారో, ఎవరితోనైతే దుఆ చేస్తారో, (మా యమ్లికూన మిన్ కిత్మీర్). ఖర్జూరపు బీజము మీద ఉండేటువంటి సన్నని ఆ పొర. అంతమాత్రం కూడా వారికి ఏ శక్తి లేదు. (ఇన్ తద్వూహుం లా యస్మవూ దుఆఅకుం). మీరు వారితో దుఆ చేస్తే మీ దుఆలను వారు వినలేరు. గమనించండి. సూరత్ ఫాతిర్ ఆయత్ 13, 14. మీరు అల్లాహ్ ను వదిలి ఎవరితోనైతే దుఆ చేస్తారో, వారు ఖర్జూరపు బీజము మీద ఉండేటువంటి సన్నని ఆ పొర ఏదైతే ఉంటుందో అంత మందం కూడా శక్తి కలిగి లేరు. మీరు వారిని అడిగితే, వారితో దుఆ చేస్తే వారు వినరు. కానీ ఈ రోజుల్లో ఎంతో మంది ఉన్నారు కదా, వింటారు అన్నటువంటి మూఢనమ్మకంలో. అయితే అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి. (వలవ్ సమీవూ మస్తజాబూ లకుం). మీ మూఢనమ్మకాల ప్రకారంగా వారు వింటారు అని ఏదైతే అనుకుంటున్నారో, అలా జరిగినా ఎప్పుడైనా, ఏదైనా సందర్భంలో ఒక పరీక్షగా మేము వారికి వినిపించినా, వారు మీ దుఆలకు సమాధానం చెప్పలేరు.

(వ యౌమల్ ఖియామతి యక్ఫురూన బిషిర్కికుం). మీరు ఈ షిర్క్ ఏదైతే చేస్తున్నారో, దుఆ ఇతరులతో చేసి ఏ భాగస్వామ్యం కల్పింపజేస్తున్నారో, దీనిని వారు ప్రళయ దినాన తిరస్కరిస్తారు. (వలా యునబ్బిఉక మిస్లు ఖబీర్). సూక్ష్మ జ్ఞాని అయిన అల్లాహ్ ఆయన తెలిపినటువంటి విషయాలు మీకు తెలిపేవాడు ఇంకా వేరే ఎవడు లేడు.

అలాగే సోదర మహాశయులారా, సూరత్ సబా ఆయత్ నెంబర్ 22 ఒకసారి గమనించండి మీరు.

قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِن شِرْكٍ وَمَا لَهُ مِنْهُم مِّن ظَهِيرٍ

(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవంత అధికారంగానీ, వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్‌కు సహాయకుడు కూడా కాడు. (34:22)

(ఖులిద్ వుల్లజీన జఅంతుం మిన్ దూనిల్లాహ్). మీ మూఢనమ్మకం ప్రకారం అల్లాహ్ ను వదిలి ఎవరెవరిని మీరు ఆరాధిస్తారో, ఎవరెవరిని పూజిస్తారో, ఎవరెవరితో దుఆ చేస్తారో, (ఉద్వూ), మీరు దుఆ చేసి చూడండి. వారిలో ఏముంది? (లా యమ్లికూన మిస్కాల జర్రతిన్ ఫిస్సమావాతి వలా ఫిల్ అర్జ్). ఆకాశాల్లో, భూమిలో రవ్వంత దానికి వారు అధికారం కలిగి లేరు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఇంతకుముందు ఏం చెప్పాడు? సూరె ఫాతిర్ లో, ఖర్జూరపు బీజం మీద ఉండేటువంటి ఒక పొర అంతటి అధికారం కూడా వారికి లేదు. ఇక్కడ జర్రహ్, అణువు. కళ్ళతో కనబడదు మనకు. అంతటి అధికారం కూడా వారిలో లేదు. ఇంకా, (వమాలహుం ఫీహిమా మిన్ షిర్క్). భూమి ఆకాశాల్లో వారికి ఏ భాగస్వామ్యం లేదు.

అల్లాహ్ క్షమించుగాక, అల్లాహ్ కు కాదు ఒక ఉదాహరణ, పోలిక, మనకు అర్థం కావడానికి ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాను. కొన్ని సందర్భంలో ఏమవుతుంది? నా వద్ద ఒక్క పైసా కూడా లేకపోవచ్చు. కానీ నేను ఒకరితో బిజినెస్ లో పార్ట్నర్ కావచ్చు కదా. ఏదైనా పనిలో నేను పొత్తు కలవవచ్చు కదా. ఈ విధంగా ప్రజలు ఏమనుకుంటారు? అరే, అతడు ఫలానా కంపెనీలో ఒక పార్ట్నర్ గా ఉన్నాడు, ఎంతటి మహానుభావుడో అని అనుకుంటాం కదా. అయితే అల్లాహ్ ఇలాంటి భావాన్ని కూడా ఎట్లా దూరం చేస్తున్నాడో గమనించండి. వారికి అణువంత అధికారం కూడా లేదు ఆకాశాల్లో గాని, భూమిలో గాని. అంతేకాదు వారు ఈ భూమి ఆకాశాల్లో అల్లాహ్ కు ఏ పార్ట్నర్ కారు, ఏ భాగస్వామి కారు. అంతెందుకు, కొందరు ఇహలోకం ప్రకారంగా చూసుకుంటే ఏ అధికారం ఉండదు, పార్ట్నర్ ఉండడు. కానీ ఒకరి కంపెనీ నడపడానికి, ఒకరి పని పూర్తి అవ్వడానికి ఏదో తన ఛాయాశక్తి కొంచెం సపోర్ట్ అయినా ఇస్తాడు కదా. అల్లాహ్ ఇలాంటి దానిని కూడా ఖండించాడు. ఏం చెప్పాడు? (వమాలహుం మిన్హుం మిన్ జహీర్). మీరు ఎవరెవరితోనైతే దుఆలు చేస్తున్నారో వారిలో ఏ ఒక్కడు కూడా అల్లాహ్ కు ఎలాంటి మద్దతునిచ్చేవాడు కాదు, ఎలాంటి సహాయం అందించేవాడు కాదు.

ఇక మీరు అలాంటి వారితో ఎందుకు దుఆ చేస్తున్నారు అని అల్లా రబ్బుల్ ఆలమీన్ హెచ్చరిస్తున్నాడు. అల్లాహు అక్బర్. గమనించండి సోదరులారా.

ప్రత్యేకంగా ఎవరైతే అల్లాహ్ ను కాకుండా వేరే ఎవరెవరినైతే ఆరాధిస్తున్నారో, పూజిస్తున్నారో, దుఆలు చేస్తున్నారో, అర్ధిస్తున్నారో, వారి యొక్క స్థితి ఏమిటి? ఇంకా, వారు ఏమైనా ప్రళయ దినాన మనకు లాభం కలగజేస్తారా? ఉపయోగపడతారా? అది కూడా జరగదు. సూరతుల్ అహ్కాఫ్ ఆయత్ నెంబర్ ఐదు, ఆరు వినండి.

وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ
అల్లాహ్ ను వదలి ప్రళయదినం వరకూ తన మొరను ఆమోదించలేని వారిని, పైగా తను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని మొరపెట్టుకునేవానికన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు? (46:5)

وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ
మానవులంతా సమీకరించబడినపుడు వారు వారికి (తమ భక్తులకు) శత్రువులై పోతారు. వీళ్ళ పూజాపురస్కారాలను కూడా వాళ్ళు త్రోసిపుచ్చుతారు. (46:6)

(వ మన్ అదల్లు మిమ్మన్ యద్వూ మిన్ దూనిల్లాహ్). ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేస్తున్నారో వారి కంటే మార్గభ్రష్టులు ఇంకా వేరే ఎవరు లేరు. నేననడం లేదు, ఖురాన్ తీసి చూడండి మీరు. వ మన్ అదల్లు, అతని కంటే మార్గభ్రష్టత్వంలో ఇంకా ఎవరు లేరు. ఎవరు? ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేస్తున్నాడో. ఎలాంటి వారితో దుఆ చేస్తున్నాడు? (మల్లా యస్తజీబు లహు ఇలా యౌమిల్ ఖియామ). ప్రళయ దినం వరకు అతని దుఆలను అంగీకరించడం గాని, దుఆకు సమాధానం గాని చెప్పలేని వారు. అంతేకాదు, (వహుం అన్ దుఆఇహిం గాఫిలూన్). వారు వీరు చేసే దుఆలకు ఏ సంబంధం లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. వారికి తెలియనే తెలియదు, ఎవరో వచ్చి మా సమాధుల వద్ద, ఎవరో మా పేరును తీసుకొని దుఆలు చేస్తున్నారు అని.

(వ ఇజా హుషిరన్నాస్). ప్రళయ దినాన ఎప్పుడైతే సమూహ పరచడం జరుగుతుందో, (కానూ లహుం అదాఅ). ఈ దుఆ చేసేవారు, ఎవరితోనైతే దుఆ చేయడం జరిగిందో వారందరూ పరస్పరం శత్రువులైపోతారు. (వ కానూ బి ఇబాదతిహిం కాఫిరీన్). మరియు వారి యొక్క ఆరాధనలో, వారి యొక్క దుఆలు వాటి గురించి ఇంకార్ చేస్తారు, రద్దు చేస్తారు. వీరు మమ్మల్ని ఆరాధించలేదు, మాతోని దుఆ చేయలేదు అని స్పష్టంగా తెలియజేస్తారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహ్ క్షమించుగాక, ఇహలోక ప్రకారంగా నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను, గమనించండి.

ఉదాహరణకు నీవు ఏదైనా ఆపదలో ఇరుక్కున్నావు. కోర్టులో వెళ్ళవలసి వచ్చింది. ఏం జరిగింది? ఫలానా వకీల్ చాలా పేరు గలవాడు. ఫలానా లాయర్ ఎంతో పేరు గాంచిన వాడు. అతనిని నేను పిలిపించుకుంటే నన్ను ఎట్లనైనా ఈ కేసులో నుండి బయటికి తీసేస్తాడు అని అనుకున్నావు. అతడు వచ్చాడు. వచ్చిన తర్వాత, నీవు అనుకుంటున్నావు ఈ కేసు ఈ కోర్టులో ఆ వకీల్, ఆ లాయర్ నీకు సపోర్ట్ చేసి నీ తరఫు నుండి మాట్లాడి నిన్ను జైలు పాలు కాకుండా, శిక్షకు గురి కాకుండా కాపాడుకుంటాడు అని. తీరా సమయం వచ్చే వరకు ఏం జరిగింది? నీకు వ్యతిరేకమైపోయాడు. అతడు నీకు వ్యతిరేకమైపోయాడు. నీవు ఇంకా పాపంలో ఉన్నావు, నీ పై ఈ అపరాధం అన్నట్టుగా ఎన్నో సాక్షాలు తెచ్చి ఇరికించే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఏమవుతుంది పరిస్థితి గమనించండి. ఇంతకంటే మరీ భయంకరమైన, ఘోరమైన పరిస్థితి అక్కడ రానుంది. అల్లాహ్ మనందరిని కూడా కాపాడుగాక.

ఖురాన్ లో మనం గమనిస్తే, ఆదం అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, యూనుస్ అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాం, సులేమాన్ అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం, యూసుఫ్ అలైహిస్సలాం, షుఐబ్ అలైహిస్సలాం, హూద్ అలైహిస్సలాం, జకరియా అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సుమారు 16 ప్రవక్తలు, వారు అల్లాహ్ తో ఏ దుఆ చేశారో, ఎలా ఎలా మొరపెట్టుకున్నారో ఆ దుఆల ప్రస్తావనలన్నీ కూడా ఖురాన్ లో ఉన్నాయి. ఎక్కడా కూడా వారు అల్లాహ్ తప్ప ఇతరులతో మొరపెట్టుకోలేదు. నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను? ఈ ప్రవక్తల సరైన మార్గాన్ని మనం అవలంబించినప్పుడే కదా మనకు మోక్షం లభించేది.

అంతేకాదు, అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో ఎందరో పుణ్యాత్ముల గురించి కూడా తెలిపాడు. ఉదాహరణకు, ఇమ్రాన్ యొక్క భార్య, ఫిరౌన్ యొక్క భార్య మరియు బిల్ఖీస్ రాణి మరియు ఆ గుహలో, సూర కహఫ్ లో వచ్చిన ప్రస్తావన ఉన్నవారు. ఇంకా విశ్వాసులు, ఎవరైతే ఒక తోటకు అధికారి అయ్యారో వారి యొక్క సంఘటన ఉంది. ఈ విధంగా ఇంకా ఎందరో సంఘటనలు ఖురాన్ లో ఉన్నాయి. వారందరూ కూడా వారి కష్ట సమయాల్లో కేవలం ఏకభాగస్వామ్యం లేకుండా అల్లాహ్ తోనే దుఆ చేశారు, అల్లాహ్ నే మొరపెట్టుకున్నారు.

అందు గురించి సోదరులారా, ఇదే పని మనం కూడా చేయాలి. ఒకవేళ అల్లాహ్ ను కాకుండా వేరే ఎవరినైనా మనం మొరపెట్టుకున్నామో, వేరే ఎవరితోనైనా దుఆ చేసాము అంటే షిర్క్ లో పడిపోతాము, కుఫ్ర్ లో పడిపోతాము, మహా దౌర్జన్యం చేసిన వారమవుతాము, అల్లాహ్ యొక్క శిక్షకు గురి కావలసి వస్తుంది. అంతేకాకుండా అల్లాహ్ ను కాదని మనం ఎవరెవరినీ మొరపెట్టుకుంటామో ఎవరూ కూడా మనకు ఇహలోకంలో పనికిరారు. పరలోకంలోనైతే ఏమాత్రం మనకు లాభం చేకూర్చరు.

అల్లాహ్ మనందరినీ కాపాడుగాక, రక్షించుగాక. ఎల్లవేళల్లో కేవలం అల్లాహ్ తో మాత్రమే దుఆ చేస్తూ ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తప్ప వేరే ఎవరెవరితో మనం ఇంతవరకు తెలిసి తెలియక, అజ్ఞానంలో ఉండి ఏమైతే చేసామో, అల్లాహ్ ఆ పాపాలన్నిటినీ కూడా క్షమించి, మన్నించి మనల్ని తన యొక్క పవిత్రమైన పుణ్య దాసుల్లో చేర్చుగాక.

వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5159