అంతిమ దినం పై విశ్వాసం యొక్క ఆవశ్యకతలు [3] – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్] 

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُ 

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత : 

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.

ఓ ముస్లింలారా! అల్లాహ్ తో భయపడండి, ఎల్లవేళలా ఆయన దైవ భీతిని కలిగి ఉండండి. మనసులో ఆయన భయాన్ని సజీవంగా ఉంచండి. ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుంచి దూరంగా ఉండండి. .

మరియు తెలుసుకోండి! అల్లాహ్ తన ధర్మస్థాపనలో తాను లిఖించినటువంటి విధిరాతలో మరియు శిక్షించడంలో, ప్రతిఫలం ప్రసాదించడంలో ఆయన ఎంతో వివేకవంతుడు. మరియు అల్లాహ్ తఆలా యొక్క వివేకం ఏమిటంటే ఆయన తన సృష్టి కొరకు అంతిమ దినాన్ని నియమించాడు. ఆ రోజున ఆయన సమస్త సృష్టిరాశులకు తమ ఆచరణ యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్తల ద్వారా తన దాసులకు చేరవేశాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ فَتَعَالَى اللَّهُ الْمَلِكُ الْحَقُّ

(“మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా? అల్లాహ్‌యే నిజమైన సార్వభౌముడు. ఆయన మహోన్నతుడు.) (సూరా అల్ మూ ‘మినూన్ 23:115-116)

ఓ విశ్వాసులారా! గడిచిన ఖుత్బాలో మనం అంతిమ దినంపై విశ్వాసంలో భాగంగా  శంఖం పూరించడం, ప్రళయ సూచనలు, సృష్టి పునరుత్థాన, ప్రజలు హష్ర్ మైదానంలో సమీకరించబడటం గురించి తెలుసుకున్నాము. ఈ రోజు మనం ఆ హష్ర్  మైదానంలో సమస్త మానవాళి సమావేశమైనప్పటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాము. ఈ రోజు మనం లెక్కల పత్రము, శిక్ష ప్రతిఫలం గురించి తెలుసుకుందాం.   

ఓ అల్లాహ్ దాసులారా! లెక్కల పత్రము మరియు శిక్ష లేక ప్రతిఫలం అనేవి సత్యం. ఖుర్ఆన్ మరియు హదీసు ద్వారా ఎన్నో ఆధారాలు మనకు లభిస్తాయి. మరియు సమస్త విశ్వాసులు ఈ విషయాన్ని ఏకీభవిస్తారు. దీని గురించి తెలియజేస్తూ అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు. 

అంతిమ దినం పై విశ్వాసం యొక్క ఆవశ్యకతలు [2] – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్] 

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُ 

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత : 

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.

ఓ ముస్లింలారా! అల్లాహ్ తో భయపడండి, ఎల్లవేళలా ఆయన దైవ భీతిని కలిగి ఉండండి. మనసులో ఆయన భయాన్ని సజీవంగా ఉంచండి. ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుంచి దూరంగా ఉండండి. .

మరియు తెలుసుకోండి! అల్లాహ్ తన ధర్మస్థాపనలో తాను లిఖించినటువంటి విధిరాతలో మరియు శిక్షించడంలో, ప్రతిఫలం ప్రసాదించడంలో ఆయన ఎంతో వివేకవంతుడు. మరియు అల్లాహ్ తఆలా యొక్క వివేకం ఏమిటంటే ఆయన తన సృష్టి కొరకు అంతిమ దినాన్ని నియమించాడు. ఆ రోజున ఆయన సమస్త సృష్టిరాశులకు తమ ఆచరణ యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్తల ద్వారా తన దాసులకు చేరవేశాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ فَتَعَالَى اللَّهُ الْمَلِكُ الْحَقُّ

(“మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా? అల్లాహ్‌యే నిజమైన సార్వభౌముడు. ఆయన మహోన్నతుడు.) (సూరా అల్ మూ ‘మినూన్ 23:115-116)

ఓ విశ్వాసులారా! గడిచిన ఖుత్బాలో మనం అంతిమ దినంపై విశ్వాసంలో భాగంగా శంఖం పూరించడం, ప్రళయ సూచనలు, సృష్టి పునరుత్థాన, ప్రజలు హష్ర్ మైదానంలో సమీకరించబడటం గురించి తెలుసుకున్నాము. ఈ రోజు మనం ఆ హష్ర్ మైదానంలో సమస్త మానవాళి సమావేశమైనప్పటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాము. 

ఓ అల్లాహ్ దాసులారా! హష్ర్ మైదానంలో నాలుగు విషయాలు జరుగుతాయి. 

సూరె హజ్ లో అల్లాహ్ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. 

يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمْ ۚ إِنَّ زَلْزَلَةَ السَّاعَةِ شَيْءٌ عَظِيمٌ يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَى النَّاسَ سُكَارَىٰ وَمَا هُم بِسُكَارَىٰ وَلَٰكِنَّ عَذَابَ اللَّهِ شَدِيدٌ

(ఓ ప్రజలారా! మీ ప్రభువుకు భయపడండి. నిశ్చయంగా ప్రళయ సమయాన జరిగే ప్రకంపనం మహా (భీకర) విషయం. ఆనాడు మీరు దాన్ని చూస్తారు… పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. గర్భవతుల గర్భాలూ పడిపోతాయి. ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్‌ (తరఫున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది.) (సూరా అల్ హజ్ 22:1-2)

అంతిమ దినం పై విశ్వాసం యొక్క ఆవశ్యకతలు [1] – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్] 

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُ

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.

ఓ ముస్లింలారా! అల్లాహ్ తో భయపడండి, ఎల్లవేళలా ఆయన దైవ భీతిని కలిగి ఉండండి. మనసులో ఆయన భయాన్ని సజీవంగా ఉంచండి. ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుంచి దూరంగా ఉండండి. .

మరియు తెలుసుకోండి! అల్లాహ్ తన ధర్మస్థాపనలో తాను లిఖించినటువంటి విధిరాతలో మరియు శిక్షించడంలో, ప్రతిఫలం ప్రసాదించడంలో ఆయన ఎంతో వివేకవంతుడు. మరియు అల్లాహ్ తఆలా యొక్క వివేకం ఏమిటంటే ఆయన తన సృష్టి కొరకు అంతిమ దినాన్ని నియమించాడు. ఆ రోజున ఆయన సమస్త సృష్టిరాశులకు తమ ఆచరణ యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్తల ద్వారా తన దాసులకు చేరవేశాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ فَتَعَالَى اللَّهُ الْمَلِكُ الْحَقُّ

(“మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా? అల్లాహ్‌యే నిజమైన సార్వభౌముడు. ఆయన మహోన్నతుడు.) (సూరా అల్ మూ ‘మినూన్ 23:115-116)

ఆ రోజుకు అంతిమదినం అని పేరు రావడానికి గల కారణం ఏమిటంటే అదే చివరి రోజు. ఆ తర్వాత మరో రోజు ఉండదు. ఆ రోజున స్వర్గవాసులు స్వర్గంలోకి మరియు నరక వాసులు నరకంలోకి వెళ్తారు. ఆ రోజుని ప్రళయ దినం అని కూడా అంటారు ఎందుకంటే ఆ రోజున సమస్త మానవాళి అల్లాహ్ ముందు హాజరవడం జరుగుతుంది.

يَوْمَ يَقُومُ النَّاسُ لِرَبِّ الْعَالَمِينَ
(ఆ రోజు జనులంతా సర్వలోకాల ప్రభువు ముందు నిలబడతారు.) (83:6)

ఓ విశ్వాసులారా! అంతిమ దినాన్ని విశ్వసించడంలో ఆరు విషయాలు ఉన్నాయి. శంఖం పూరించడం, సృష్టి పునరుత్థాన, ప్రళయ దిన సూచనలు బహిర్గతమవడం , ప్రజలు హష్ర్ మైదానం లో సమావేశమవడం, లెక్కా పత్రం , శిక్షా ప్రతిఫలం, స్వర్గం నరకం.

పరలోకం పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

పరలోకం పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ
https://youtu.be/NsqbSZr8XQI [14 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ విశ్వాసంలోని ఐదవ ముఖ్యమైన అంశమైన పరలోక జీవితంపై విశ్వాసం గురించి వివరించబడింది. పరలోకం అంటే ఏమిటి, దాని ఉనికికి ఖురాన్ మరియు హదీసుల నుండి ఆధారాలు, మరియు ప్రపంచంలో జరిగే అన్యాయాలకు అంతిమ న్యాయం జరగాల్సిన ఆవశ్యకత వంటి విషయాలు చర్చించబడ్డాయి. పరలోకంలో జరిగే ముఖ్య సంఘటనలైన హషర్ మైదానం (సమావేశ స్థలం), కర్మపత్రాల పంపిణీ, మీజాన్ (త్రాసు), జహన్నం (నరకం), మరియు జన్నత్ (స్వర్గం) గురించి కూడా ప్రస్తావించబడింది. చివరగా, పరలోకంపై విశ్వాసం ఒక వ్యక్తిని దైవభీతితో జీవించేలా, పుణ్యకార్యాల వైపు ప్రేరేపించేలా మరియు పాపాలకు దూరంగా ఉంచేలా ఎలా చేస్తుందో, తద్వారా సమాజంలో శాంతి ఎలా నెలకొంటుందో వివరించబడింది.

అల్ హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్.

అన్ని రకాల ప్రశంసలు, పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలు మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ప్రసంగంలో, విశ్వాస ముఖ్యాంశాలలోని ఐదవ ముఖ్యాంశం పరలోకం పట్ల విశ్వాసం గురించి తెలుసుకుందాం.

పరలోకం అంటే ఏమిటి? పరలోకాన్ని విశ్వసించడానికి మన వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? పరలోకంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటి? పరలోకాన్ని విశ్వసిస్తే మనిషికి కలిగే ప్రయోజనము ఏమిటి? ఇవన్నీ ఇన్ షా అల్లాహ్ ఈ ప్రసంగంలో వస్తాయి.

ఆ హదీస్ మరొక్కసారి మనము విందాం. జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్తా, ఈమాన్ అంటే ఏమిటి అని ప్రశ్నించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇస్తూ, అల్లాహ్ ను విశ్వసించటం, దూతలను విశ్వసించటం, గ్రంథాలను విశ్వసించటం, ప్రవక్తలను విశ్వసించటం, పరలోకాన్ని విశ్వసించటం, విధివ్రాతను విశ్వసించటం అని సమాధానం ఇచ్చినప్పుడు, జిబ్రీల్ అలైహిస్సలాం వారు నిజమే అని ధ్రువీకరించారు కదండీ. ఆ ప్రకారంగా ఈమాన్ (విశ్వాసం) అంటే ఆరు విషయాలను విశ్వసించవలసి ఉంది కదండీ. అందులోని ఐదవ విషయం, పరలోకం పట్ల విశ్వాసం. ఈ పరలోకం పట్ల విశ్వాసం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మీ ముందర ఉంచుతున్నాను. ఇన్ షా అల్లాహ్, శ్రద్ధగా విని ఆచరించే ప్రయత్నము చేయండి.

ముందుగా, పరలోకం అంటే ఏమిటి తెలుసుకుందాం. పరలోకం అంటే, మానవులందరూ కూడా మరణించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవులందరినీ ఒక రోజు మళ్ళీ బ్రతికిస్తాడు. ఆ రోజు వారి కర్మల లెక్కింపు జరుగుతుంది. ఎవరైతే సత్కార్యాలు ఎక్కువగా చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, వారికి బహుమానాలు ఇవ్వబడతాయి. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, వారికి శిక్షలు విధించటం జరుగుతుంది. ఇలా జరిగే దినాన్ని పరలోక దినం, లెక్కింపు దినం అని కూడా అంటూ ఉంటారు.

పరలోకం ఉంది అని నమ్మటానికి ఆధారాలు మనము ఇప్పుడు చూచినట్లయితే, ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పదేపదే పరలోకం గురించి మరియు పరలోకంలో జరగబోయే విషయాల గురించి మనకు తెలియపరిచి ఉన్నాడు. హదీసులలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలలో కూడా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట పరలోకము మరియు పరలోకంలో జరగబోయే విషయాల ప్రస్తావన మనకు కనబడుతూ ఉంటుంది. ఒక ఉదాహరణ మీ ముందర ఉంచుతున్నాను చూడండి. ఖురాన్ గ్రంథము 23వ అధ్యాయము 15, 16 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

ثُمَّ اِنَّكُمْ بَعْدَ ذٰلِكَ لَمَيِّتُوْنَ ثُمَّ اِنَّكُمْ يَوْمَ الْقِيٰمَةِ تُبْعَثُوْنَ
ఆ తరువాత మీరంతా తప్పకుండా మరణిస్తారు. మరి ప్రళయ దినాన మీరంతా నిశ్చయంగా లేపబడతారు. (23:15-16)

ఈ రెండు వాక్యాలలో ప్రళయ దినం ప్రస్తావన కూడా వచ్చి ఉంది. మనిషి మరణించిన తర్వాత మళ్ళీ బ్రతికించబడతారు అనే ప్రస్తావన కూడా వచ్చి ఉంది. ఇలా చాలా వాక్యాలు ఉన్నాయి, చాలా హదీసులు, ఉల్లేఖనాలు ఉన్నాయి. తద్వారా, పరలోకము తప్పనిసరిగా ఉంది అని గ్రంథాల ద్వారా స్పష్టమవుతూ ఉంది. ప్రతి విశ్వాసి కూడా పరలోకాన్నే విశ్వసించటం తప్పనిసరి.

ఇక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే, పరలోకం సంభవిస్తుంది అని కూడా మనకు తెలుస్తుంది. అది ఎలాగంటే, మనం చూస్తూ ఉంటాం. చాలా చోట్ల ప్రపంచంలో, బలవంతులు, దౌర్జన్యపరులు నిరుపేదలపై, బలహీనులపై దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు. హత్యలు చేస్తూ ఉంటారు, అత్యాచారాలు చేస్తూ ఉంటారు, ప్రాణాలు తీసేసి ఇది ప్రమాదము అని చిత్రీకరిస్తూ ఉంటారు, అరాచకాలు సృష్టిస్తూనే ఉంటారు, కబ్జాల మీద కబ్జాలు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉంటే, మనం చూస్తూ ఉంటాం. బలహీనులు న్యాయం కావాలి అని ఎదురు చూస్తూనే ఉంటారు, కానీ వారికి ఎక్కడ కూడా న్యాయం దొరకదు, చివరికి వారు అలాగే బాధపడుతూనే మరణించి ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. బలవంతుల్లో కొందరు, రాజకీయ నాయకుల, అధికారుల అండదండలతో, ధనముతో తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. వారు చేసిన అరాచకాలకు శిక్షలు పడవు. ఏదో ఒక రకంగా పలుకుబడి ద్వారా వారు తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. చివరికి వారు కూడా ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు.

ప్రశ్న ఏమిటంటే, మరి అన్యాయానికి గురి అయిన ఈ పీడితులకు, దేవుడు కూడా న్యాయం చేయడా? అన్యాయము చేసి, అరాచకాలు సృష్టించిన ఈ దుర్మార్గులకు, దేవుడు కూడా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కూడా శిక్షించడా? అంటే, దానికి ఇస్లాం ఇచ్చే సమాధానం ఏమిటంటే, తప్పనిసరిగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు, మరియు అతనికి న్యాయం చేస్తాడు. అలాగే ప్రతి నేరస్తునికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని నేరానికి సరిపడేటట్టుగానే శిక్షిస్తాడు. ఎంతటి నేరము ఉంటుందో అంతటి కఠినమైన శిక్ష కూడా విధిస్తాడు. దీనికి సరైన ప్రదేశము పరలోకము.

పరలోకంలో నిరుపేద, ధనికుడు, బలహీనుడు, బలవంతుడు, రాజకీయ అండదండలు, ధనము, పలుకుబడి ఇవన్నీ ఏమీ గానీ ఉండవు, పనికిరావు కూడా. అక్కడ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు మరియు ప్రతి నేరస్తునికి అతని నేరానికి తగినంత శిక్ష కూడా విధిస్తాడు. ఆ రోజు న్యాయము స్థాపించబడుతుంది. ఆ ప్రకారంగా పరలోకము తప్పనిసరిగా సంభవిస్తుంది అని మనకు స్పష్టమవుతుంది మిత్రులారా.

పరలోకంలో ఏమేమి ఉంటాయి అనే విషయాలు మనం చూచినట్లయితే, చాలా విషయాలు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియపరిచి ఉన్నారు. కొన్ని విషయాలు మాత్రమే ఈ ప్రసంగంలో చెబుతున్నాను. ఇన్ షా అల్లాహ్, పరలోకంలో ఏమి జరుగుతుంది అనే ప్రసంగం వినండి, అందులో వివరాలు ఇన్ షా అల్లాహ్ మీకు దొరుకుతాయి. ఇక రండి, కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పరలోకంలో హషర్ మైదానము ఉంది. హషర్ మైదానము అంటే ఏమిటి? ప్రళయం సంభవించిన తర్వాత, యుగాంతము సంభవించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ భూమి ఆకాశాలను సృష్టిస్తాడు. ఆ రోజు భూమి ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక చదరపు మైదానములా, పాన్పు లాగా ఉంటుంది. ఆ మైదానంలో ఒక చెట్టు గానీ, ఒక గుట్ట గానీ, ఒక భవనము గానీ ఉండదు. ఆ మైదానంలో, ఆది మానవుడైన ఆదమ్ అలైహిస్సలాం వద్ద నుండి యుగాంతం సంభవించినంత వరకు ఎంతమంది మానవులైతే జన్మించి, మరణించారో వారందరినీ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ బ్రతికించి నిలబెడతాడు.

వారందరూ కూడా ఆ మైదానంలో నిలబడినప్పుడు, వారి వారి చేతికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. ఎవరైతే సత్కార్యాలు చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, కుడిచేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు వారి కర్మలను, వారి సత్కార్యాలను చూసి, చదివి సంతోషిస్తూ ఉంటారు, వారి మొహము ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, అరాచకాలు సృష్టించి ఉంటారో, ఎడమ చేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు చేసుకున్న పాపాలన్నీ వారు ఆ రోజు చదువుకుంటూ, ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. వారి మొహం ఆ రోజు నల్లబడిపోతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే, దానిని హషర్ మైదానము అని అంటారు.

అలాగే పరలోకంలో ఏముంది అని మనం చూచినట్లయితే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మీజాన్ ఉంచి ఉన్నాడు. మీజాన్ అంటే ఏమిటి? త్రాసు అని అర్థం. ఆ త్రాసులో ఏమి తూంచబడుతుంది అంటే, ప్రజల పుణ్యాలు, పాపాలు తూచబడతాయి. ఎవరి పుణ్యాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు విజేతలుగా నిలబడతారు. ఎవరి పాపాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు దోషులుగా నిలబడతారు. ఆ రోజు తుది నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాదే. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎవరిని మన్నించాలనుకుంటాడో వారిని మన్నిస్తాడు. మరి ఎవరినైతే శిక్షించాలనుకుంటాడో వారిని శిక్షిస్తాడు. నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చేతిలోనే ఉంటుంది. కాకపోతే, విశ్వాసం ప్రామాణికమైనది అవుతుంది కాబట్టి మిత్రులారా, ఆ రోజు రానున్నది. ప్రపంచంలోనే విశ్వసించండి, సత్కార్యాలు చేయండి అని మనకు తెలపబడింది. మొత్తానికి పరలోకంలో త్రాసు ఉంది, అందులో ప్రజల కర్మలు తూచబడతాయి.

అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జహన్నం సిద్ధం చేసి ఉంచాడు. జహన్నం అంటే నరకం అని అర్థం. నరకంలో ఏముంది అంటే, అది ఒక పెద్ద బావి, దాని నిండా అగ్ని ఉంది. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కారానికి పాల్పడి ఉంటారో, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అలాంటి వారిని శిక్షించడానికి నరకంలో పడవేస్తాడు. ఎవరు ఎన్ని ఘోరమైన నేరాలు, పాపాలు చేసి ఉంటారో, వారికి నరకంలో అంత కఠినమైన శిక్ష కూడా విధించబడుతుంది. అల్లాహ్ మన అందరికీ దాని నుండి, దాని శిక్షల నుండి రక్షించుగాక, ఆమీన్.

అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జన్నహ్, ఉర్దూలో జన్నత్, తెలుగులో స్వర్గం సిద్ధం చేసి ఉన్నాడు. స్వర్గంలో ఏమున్నాయి అంటే, అందులో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అనుగ్రహాలు అన్నీ ఉంచి ఉన్నాడు. ఆ అనుగ్రహాలు ఎవరికి దక్కుతాయి అంటే, ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు, పుణ్యాలు ఎక్కువగా చేసుకుని ఉంటారో, వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆ స్వర్గము ప్రసాదిస్తాడు. ఎవరు ఎన్ని ఎక్కువ పుణ్యాలు చేసుకొని ఉంటారో, వారు స్వర్గంలో అంత ఉన్నతమైన స్థానాలలో చేరుకుంటారు. స్వర్గంలో ఉన్నవారు, ప్రశాంతంగా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి భయము లేకుండా, సంతోషంగా జీవించుకుంటూ ఉంటారు. అలాంటి స్వర్గం అల్లాహ్ మన అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.

పరలోకంలో ఇంకా ఏమి ఉంటాయి అంటే, పరలోకంలో హౌదె కౌసర్ ఉంది, పరలోకంలో పుల్ సిరాత్ ఉంది, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మీరు పరలోకంలో ఏమి జరుగుతుంది, పరలోక విశేషాలు అనే ప్రసంగాలు వినండి, ఇన్ షా అల్లాహ్ తెలుస్తుంది. సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి, ఇక చివరులో మనము…

పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి అనేది ఇన్ షా అల్లాహ్ తెలుసుకొని మాటను ముగిద్దాం. పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటట? మనిషి పరలోకాన్ని విశ్వసించటం వలన దైవభీతితో జీవిస్తాడు. పుణ్యాలు బాగా చేసి, పరలోక అనుగ్రహాలు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. పాపాలు చేస్తే పరలోకంలో శిక్షలు తప్పవు అని భయపడుతూ ఉంటాడు. మరియు అలా భయపడటం వలన, అతను అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అలా చేయటం వలన సమాజంలో శాంతి నెలకొంటుంది.

ఒకసారి ఆలోచించి చూడండి. ప్రతి వ్యక్తి పరలోకాన్ని విశ్వసించి, పరలోకంలో ఉన్న అనుగ్రహాలను విశ్వసించి, పరలోకంలో ఉన్న శిక్షలను కూడా విశ్వసించి, వాటిని దృష్టిలో పెట్టుకుని జీవిస్తున్నప్పుడు, సత్కార్యాలు చేసుకుందాం, పుణ్యాలు సంపాదించుకుని స్వర్గానికి చేరుకుందాం అనుకుంటూ ఉంటే, అలాగే పాపాలు చేయవద్దు, చేస్తే నరకానికి వెళ్లి శిక్షలు అనుభవించవలసి ఉంటుంది కాబట్టి, వద్దు అయ్యా పాపాలు, నేరాలు అని దానికి దూరంగా ఉంటూ ఉంటే, ప్రతి వ్యక్తి ఆ విధంగా విశ్వసించి జీవించుకుంటే, అలాంటి సమాజము శాంతియుతంగా ఉంటుంది అని చెప్పటానికి ఇంకేమి కావాలి మిత్రులారా.

కాబట్టి, నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మన అందరికీ సంపూర్ణ విశ్వాసులుగా జీవించే భాగ్యం ప్రసాదించుగాక. నరక శిక్షల నుండి అల్లాహ్ మమ్మల్ని కాపాడి, స్వర్గవాసులుగా మమ్మల్ని అందరినీ స్వర్గానికి చేర్చుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30634

పరలోకం (The Hereafter) – మెయిన్ పేజీ
https://teluguislam.net/hereafter/

దైవప్రవక్త (ﷺ) వారు అల్లాహ్ ను చూసారా? [ఆడియో & టెక్స్ట్]

దైవప్రవక్త (ﷺ) వారు అల్లాహ్ ను చూసారా?
https://www.youtube.com/watch?v=085GXx38_nE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూశారా? అనే ప్రశ్నకు ఈ ప్రసంగం సమాధానమిస్తుంది. ప్రవక్త అల్లాహ్‌ను చూడలేదని స్పష్టంగా చెప్పబడింది. ఈ వాదనను బలపరచడానికి, సహీహ్ ముస్లిం మరియు సహీహ్ బుఖారీ నుండి రెండు హదీసులు ఉదహరించబడ్డాయి. మొదటి హదీసులో, అబూ దర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్తను నేరుగా అడిగినప్పుడు, “అతను కాంతి (నూర్), నేను ఎలా చూడగలను?” అని ప్రవక్త సమాధానమిచ్చారు. రెండవ హదీసులో, మస్రూక్ ఇదే ప్రశ్నను ఆయిషా (రదియల్లాహు అన్హా)ను అడిగినప్పుడు, ప్రవక్త అల్లాహ్‌ను చూశారని చెప్పేవారు అబద్ధం చెప్పినట్లేనని ఆమె తీవ్రంగా స్పందించి, ఖురాన్ ఆయత్‌ను ఉదహరించారు. అయితే, ప్రళయ దినాన స్వర్గంలో విశ్వాసులందరూ అల్లాహ్‌ను చూస్తారని కూడా వివరించబడింది.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను చూశారా? సరైన సమాధానం చూడలేదు. అవును, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను చూడలేదు.కొందరు అనుకుంటారు మేరాజ్ పోయినప్పుడు చూశారు కదా అని. కానీ, ఇది సరైన మాట కాదు.

సహీహ్ ముస్లిం షరీఫ్ లో హదీస్ నెంబర్ 178, అబూ దర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు.

سَأَلْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، هَلْ رَأَيْتَ رَبَّكَ؟ قَالَ: نُورٌ أَنَّى أَرَاهُ
(స’అల్తు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, హల్ ర’అయిత రబ్బక్? ఖాల్: నూరున్ అన్నా అరాహు)

“నేను స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించాను. ‘ప్రవక్తా, మీరు మీ ప్రభువును చూశారా?’ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ‘అతను సర్వమూ నూర్ (కాంతి). నేను ఎలా చూడగలుగుతాను?'”

అతను సర్వమూ నూర్, కాంతి, ప్రకాశం. నేను ఎలా చూడగలుగుతాను? అబూ దర్ రదియల్లాహు అన్హు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగితే ప్రవక్త ఇలా సమాధానం ఇచ్చారు.

అయితే మరొక హదీస్ చూడండి సహీహ్ బుఖారీలో వచ్చింది. హదీస్ నెంబర్ 4855. ఇంతకుముందు దీనిలోని ఒక భాగం మనం విని ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ టాపిక్‌కు సంబంధించిన విషయం వినండి.

మస్రూక్ రహిమహుల్లాహ్, ఆయిషా రదియల్లాహు అన్హాతో ప్రశ్నించారు, “ఓ మాతృమూర్తి!,

هَلْ رَأَى مُحَمَّدٌ صلى الله عليه وسلم رَبَّهُ
(హల్ ర’ఆ ముహమ్మదున్ సల్లల్లాహు అలైహి వసల్లం రబ్బహు)
‘ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుని చూశారా?'”

فَقَالَتْ لَقَدْ قَفَّ شَعْرِي مِمَّا قُلْتَ
(ఫఖాలత్ లఖద్ ఖఫ్ఫ ష’రీ మిమ్మా ఖుల్త్)
వినండి, ఆయిషా రదియల్లాహు అన్హా ఏమంటున్నారు, మస్రూక్ అంటున్నారు, ఫఖాలత్ (ఆయిషా రదియల్లాహు అన్హా చెప్పారు),

“నీవు చెప్పిన ఈ మాటతో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.ఈ మూడు మాటల నుండి, విషయాల నుండి నువ్వు ఎక్కడున్నావు? తెలియకుండా ఇంకా ఎందుకున్నావు? ఎవరైతే నీతో చెబుతాడో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుని చూశారని, فَقَدْ كَذَبَ (ఫఖద్ కదబ్) “అతడు అబద్ధం పలికాడు.” అసత్యం మాట్లాడాడు.

మళ్ళీ ఆయిషా రదియల్లాహు తా’ఆలా అన్హా ఈ ఆయత్ ను పఠించారు:

لَا تُدْرِكُهُ الْأَبْصَارُ وَهُوَ يُدْرِكُ الْأَبْصَارَ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ
(లా తుద్రికుహుల్ అబ్సారు వహువ యుద్రికుల్ అబ్సార వహువల్లతీఫుల్ ఖబీర్)

“ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మ దృష్టి కలవాడు, సర్వమూ తెలిసినవాడు.”

ఈ విధంగా ఈ రెండు హదీసులు మరియు ఖురాన్ ఆయత్ ద్వారా మనకు తెలిసిన బోధ ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్‌కు వెళ్ళినప్పుడు గానీ, ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలం గానీ, ఎప్పుడూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూడలేదు.

అయితే ప్రళయ దినాన స్వర్గంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అల్లాహ్‌ను చూస్తారు మరియు ఇన్ షా అల్లాహ్ విశ్వాసులందరూ కూడా తప్పకుండా చూస్తారు.

وُجُوهٌ يَوْمَئِذٍ نَاضِرَةٌ * إِلَى رَبِّهَا نَاظِرَةٌ
(వుజూహున్ యవ్‌మఇదిన్ నాదిరహ్, ఇలా రబ్బిహా నాదిరహ్)
“ఆ రోజు కొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి. తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటాయి.”

ఇంకా వేరే ఎన్నో ఆయతులు, హదీసులు కూడా దీనికి దలీలుగా ఉన్నాయి.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ : https://teluguislam.net/?p=11473

పరలోక చింతన (Fikr-e-Akhirat) [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

పరలోక చింతన (Fikr-e-Akhirat)
https://www.youtube.com/watch?v=H8KcdaHAgEE [20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ అబూబక్ర్ బేగ్ ఉమ్రీ (ఏలూరు)

ఈ ప్రసంగంలో, వక్త పరలోక చింతన (ఆఖిరత్ కా ఫిక్ర్) యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. సూరా అల్-హషర్ మరియు సూరా అల్-హజ్ నుండి ఖురాన్ వచనాలను ఉటంకిస్తూ, విశ్వాసులు రేపటి కోసం (పరలోకం కోసం) ఏమి సిద్ధం చేసుకున్నారో ఆలోచించాలని మరియు అల్లాహ్‌కు భయపడాలని (తఖ్వా) గుర్తుచేస్తారు. తఖ్వా యొక్క నిజమైన అర్ధాన్ని వివరించడానికి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మరియు హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) మధ్య జరిగిన సంభాషణను ఉదాహరణగా చూపిస్తారు. పాపాలు మరియు ప్రాపంచిక ప్రలోభాలు నిండిన జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకోవడమే తఖ్వా అని వివరిస్తారు. సహాబాల జీవితాల నుండి ఉదాహరణలు ఇస్తూ, వారు ప్రాపంచిక జీవితం కంటే పరలోక జీవితానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో వివరిస్తారు. ఆధునిక ముస్లింలు ‘వహన్’ (ప్రపంచ ప్రేమ మరియు మరణ భయం) అనే వ్యాధితో బాధపడుతున్నారని, ఇది వారి బలహీనతకు కారణమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసును ఉటంకిస్తారు. ఇహలోక జీవితం తాత్కాలికమని, పరలోక జీవితమే శాశ్వతమైనదని మరియు శ్రేష్ఠమైనదని ఖురాన్ మరియు కవిత్వం ద్వారా ప్రసంగాన్ని ముగిస్తారు.

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్)
శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్‌ శరణు వేడుకుంటున్నాను.

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం)
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్‌ పేరుతో (ప్రారంభిస్తున్నాను).

అల్హందులిల్లాహి వహ్ దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బஃదా అమ్మా బஃద్. ఫ అఊదు బిల్లాహిస్సమీయిల్ అలీమ్ మినష్షైతానిర్రజీమ్ మిన్ హమదిహి వ నఫ్ఖిహి వ నఫ్సిహి బిస్మిల్లాహిర్రహ్మా నిర్రహీం.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ
(యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహి వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్)
“ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడవలసిన విధంగా భయపడండి. మరియు ముస్లింలుగా తప్ప మరణించకండి.” (3:102)

వ ఖాలల్లాహు తబారక వ త’ఆలా ఫీ మౌదయిన్ ఆఖర్

سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا ۖ إِنَّكَ أَنتَ الْعَلِيمُ الْحَكِيمُ
(సుబ్ హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అన్తల్ అలీముల్ హకీమ్)
“నీవు పవిత్రుడవు. నీవు మాకు నేర్పినది తప్ప మాకు మరే జ్ఞానమూ లేదు. నిశ్చయంగా నీవు సర్వజ్ఞుడవు, వివేచనాపరుడవు.” (2:32)

రబ్బిష్రహ్లీ సద్రీ వ యస్సిర్లీ అమ్ రీ వహ్ లుల్ ఉఖ్ దతమ్మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ, అల్లాహుమ్మ రబ్బి జిద్నీ ఇల్మా.

తొలగింపబడిన షైతానుకు ఎక్కిన రక్షింప ఉందుటకై అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫల దినానికి యజమాని అయినటువంటి అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క శుభ నామముతో ప్రారంభిస్తున్నాను. అన్ని రకాల పొగడ్తలు, ప్రశంసలు, సకల స్తోత్రములు ఆ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకే అంకితము. ఎవరైతే సమస్త సృష్టిని సృష్టించి, తన అధికార పీఠాన్ని అధిష్టించి, ఆయన సృష్టించినటువంటి సృష్టిరాశులన్నింటిలో కల్లా ఉన్నతమైనటువంటి జీవిగా మానవుడిని మలిచి మరియు వారి వైపునకు సందేశాన్ని జారీ చేసేటటువంటి ఉద్దేశంతో ప్రవక్తల యొక్క పరంపరను ప్రారంభించాడు. ఈ ప్రవక్తల యొక్క పరంపర హజ్రతే ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ఆదర్శ మహామూర్తి, కారుణ్య మూర్తి, హృదయాల విజేత, జనాబే ముస్తఫా, అహ్మదే ముజ్తబా, ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై తన దైవదౌత్యాన్ని పరిసమాప్తం గావించాడు. అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ ధరణిపై ఎంతమంది దైవ ప్రవక్తలనైతే ప్రభవింపజేశాడో, వారందరిపై కూడా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క శాంతి మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ముఖ్యంగా, చిట్టచివరి ప్రవక్త మహనీయుడైనటువంటి ప్రవక్త, ముహమ్మదే అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క కోటానుకోట్ల దరూద్లు మరియు సలాములు, శుభాలు మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ఆమీన్.

సోదరీ సోదర మహాశయులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథములో 59వ సూరా, సూరా అల్-హషర్, వాక్య నెంబర్ 18లో అల్లాహ్ త’ఆలా ఇలా అంటున్నాడు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَلْتَنظُرْ نَفْسٌ مَّا قَدَّمَتْ لِغَدٍ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ

విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. ప్రతి వ్యక్తీ రేపటి (తీర్పుదినం) కొరకు తానేం పంపుకున్నాడో చూసుకోవాలి. ఎల్ల వేళలా అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా మీరు ఏమేం చేస్తున్నారో అల్లాహ్ కనిపెట్టుకునే ఉన్నాడు.” (59:18)

ఒకే వాక్యంలో అల్లాహ్ తబారక వ త’ఆలా ఇక్కడ రెండుసార్లు ‘యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ్’ – ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్ తబారక వ త’ఆలాకు భయపడండి అని చెబుతూ, తర్వాత అల్లాహ్ తబారక వ త’ఆలా వల్ తన్జుర్ నఫ్సుమ్మా ఖద్దమత్ లిగదిన్ వత్తఖుల్లాహ్ మరియు ప్రతీ వ్యక్తి రేపటి కోసం తాను ఏమి తయారు చేసుకున్నాడో దాని గురించి చూసుకోవాలని చెప్పి, దాని తర్వాత మరొక్కసారి అల్లాహ్ తబారక వ త’ఆలా ఒకే వాక్యంలో రెండుసార్లు ‘ఇత్తఖుల్లాహ్’ అల్లాహ్ తబారక వ త’ఆలాకు భయపడండి, రెండుసార్లు తఖ్వా గురించి ప్రస్తావించడం జరిగింది.

అమీరుల్ మోమినీన్ హజ్రతే ఉమర్ ఫారూఖ్ రది అల్లాహు అన్హు గారు హజ్రతే ఉబై బిన్ కాబ్ రది అల్లాహు అన్హు గారిని ప్రశ్నిస్తూ ఈ విధంగా అన్నారు, “తఖ్వా అంటే ఏమిటి?”. హజ్రతే ఉబై బిన్ కాబ్ రది అల్లాహు అన్హు గారు హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు గారిని ప్రశ్నిస్తున్నారు, “ఓ ఉమర్ రది అల్లాహు అన్హు, అమా సలక్త తరీఖన్ దా షౌకిన్?” ఓ ఉమర్ రది అల్లాహు అన్హు, మీరు మీ జీవితంలో ముళ్ల కంచెలతో నిండి ఉన్నటువంటి ఎక్కడైనా ఒక ఇరుకైనటువంటి మార్గము గుండా మీరు పయనించారా?” అని హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు వారిని అడిగారు. అప్పుడు హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు గారు అన్నారు, “ఖాల బలా”, నేను అటువంటి మార్గంపై నడిచాను. హజ్రతే ఉబై బిన్ కాబ్ రది అల్లాహు అన్హు గారు ప్రశ్నిస్తున్నారు, ఒకవేళ నువ్వు అటువంటి మార్గంపై నడిచినట్లయితే, “ఫమా అమిల్త?” నువ్వు అటువంటి మార్గంపై నడిచినప్పుడు నువ్వు ఏం చేశావు అని చెప్పేసి అంటే, హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు వారు అంటున్నారు, “షమ్మర్తు వజ్తహత్తు”, నేను చాలా కష్టపడ్డాను, చాలా జాగ్రత్తగా నా యొక్క వస్త్రాలు, నా యొక్క బట్టలు వాటికి అంటకుండా, ముళ్ల కంచెలకు తగలకుండా నేను చాలా జాగ్రత్తగా దానిలో నుంచి బయటకు వచ్చేసానని హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు గారు జవాబు పలుకుతున్నారు. ఉబై బిన్ కాబ్ రది అల్లాహు అన్హు వారు అంటున్నారు, “ఫదాలికత్ తఖ్వా”, ఇదే తఖ్వా అంటే.

కాబట్టి సోదర మహాశయులారా, ఇక్కడ ముళ్ల కంచెలు అంటే మన ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నటువంటి మహాపాపాలు మరి అదే విధంగా అశ్లీలమైనటువంటి కార్యాలు, మరి ఈ ఇరుకైనటువంటి సందు ఏమిటంటే మన జీవితం సోదరులారా, మరి మన జీవితంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి అశ్లీలమైనటువంటి పనులు మరి అదే విధంగా మహాపాప కార్యాల నుండి మనల్ని మనము అదే విధంగా మన యొక్క విశ్వాసాన్ని రక్షించుకుంటూ బయటకు వెళ్లిపోవటమే తఖ్వా.

అల్లాహ్ తబారక వ త’ఆలా సూరా అల్-హషర్ 59వ సూరాలో 18వ వాక్యంలో ఒకే వాక్యంలో రెండుసార్లు ప్రస్తావిస్తున్నాడు: య్యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ్ – ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు భయపడండి దేని గురించి? వల్ తన్జుర్ నఫ్సుమ్మా ఖద్దమత్ లిగదిన్ – అంటే రేపటి కోసం అంటే మీరు పరలోకం కోసం ఏమి తయారు చేసుకున్నారో ఆ విషయంలో మీరు భయపడండి. మరి దాని తర్వాత అల్లాహ్ తబారక వ త’ఆలా మళ్ళీ అంటున్నాడు: వత్తఖుల్లాహ్ ఇన్నల్లాహ ఖబీరుమ్ బిమా త’మలూన్ – ఈ ఇహలోకంలో మీరు ఏం చేస్తున్నారో అల్లాహ్ తబారక వ త’ఆలా దాని గురించి సమస్తము ఎరిగి ఉన్నాడు, కాబట్టి ఆ విషయంలో కూడా మీరు అల్లాహ్ తబారక వ త’ఆలాకు భయపడండి అని ఇటు ఇహలోకము, అటు పరలోకము, ఈ రెండు విషయాల్లో కూడా ఒకే వాక్యంలో అల్లాహ్ తబారక వ త’ఆలా రెండుసార్లు తఖ్వా కలిగి ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి అని చెప్పడం జరిగింది.

సూరా అంబియా, 21వ సూరా, ఒకటో వాక్యంలో అల్లాహ్ తబారక వ త’ఆలా మరోచోట ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:

اقْتَرَبَ لِلنَّاسِ حِسَابُهُمْ وَهُمْ فِي غَفْلَةٍ مُّعْرِضُونَ
ప్రజల లెక్కల ఘడియ సమీపించింది. అయినప్పటికీ వారు పరధ్యానంలో పడి, విముఖత చూపుతున్నారు. (21:1)

మానవుల యొక్క లెక్కల గడియ సమీపించింది. అయినా వారు పరధ్యానంలో పడి ఉన్నారు అని అల్లాహ్ తబారక వ త’ఆలా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు.

ఈ విధంగా అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ రెండు వాక్యాల్లో కూడా మనకు పరలోక చింతనను కలుగజేస్తూ, పరలోకం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతగా ఉందో తెలియజేస్తున్నాడు. సోదర మహాశయులారా, ఖురాన్ గ్రంథంలో అతి ముఖ్యంగా ప్రస్తావించబడినటువంటి మూడు ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకటి, ఈమాన్ బిల్లాహ్ (అల్లాహ్ తబారక వ త’ఆలా పై విశ్వాసము). రెండు, ఈమాన్ బిర్రుసుల్ (ప్రవక్తలపై విశ్వాసము). మరి మూడవది, ఈమాన్ బిల్ ఆఖిరా (అంటే పరలోకంపై విశ్వాసము). ఈరోజు ఏవైతే మీ వాక్యాలు మీ ముందు ప్రస్తావించబడ్డాయో, ఇందులో అల్లాహ్ తబారక వ త’ఆలా పరలోకం గురించి ప్రస్తావిస్తూ, పరలోక చింతన ఏ విధంగా కలిగి ఉండాలో అల్లాహ్ తబారక వ త’ఆలా తెలియజేస్తున్నాడు.

సూరా అల్-హజ్, 22వ సూరా, మొదటి వాక్యంలో అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:

يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمْ ۚ إِنَّ زَلْزَلَةَ السَّاعَةِ شَيْءٌ عَظِيمٌ ‎﴿١﴾‏ يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَى النَّاسَ سُكَارَىٰ وَمَا هُم بِسُكَارَىٰ وَلَٰكِنَّ عَذَابَ اللَّهِ شَدِيدٌ ‎﴿٢﴾

ఓ ప్రజలారా! మీ ప్రభువుకు భయపడండి. నిశ్చయంగా ప్రళయ సమయాన జరిగే ప్రకంపనం మహా (భీకర) విషయం. ఆనాడు మీరు దాన్ని చూస్తారు. పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. గర్భవతుల గర్భాలూ పడిపోతాయి. ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్‌ (తరఫున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది. (22:1-2)

అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ వాక్యంలో ఇలా ప్రస్తావిస్తున్నాడు: “యా అయ్యుహన్నాసుత్తఖూ రబ్బకుమ్” – ఓ మానవులారా, మీ ప్రభువు పట్ల మీరు భయపడండి. “ఇన్న జల్జలతస్సాఅతి షైయున్ అజీమ్” – ఎందుకంటే ప్రళయం రోజు వచ్చేటటువంటి జల్జలా (భూకంపము) అది ఎంతో భయంకరమైనటువంటిది. ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుందంటే అల్లాహ్ తబారక వ త’ఆలా అంటున్నాడు: “యౌమ తరౌనహా తద్ హలు కుల్లు ముర్దిఅతిన్ అమ్మా అర్దఅత్” – ఆ రోజు ఆవరించినప్పుడు పాలిచ్చేటటువంటి ప్రతి స్త్రీ తన చంటిబిడ్డను మరచిపోవటాన్ని, గర్భవతి అయిన ప్రతి స్త్రీ తన గర్భాన్ని కోల్పోవటాన్ని నీవు చూస్తావు. “వతరన్నాస సుకారా వమాహుమ్ బిసుకారా వలాకిన్న అదాబల్లాహి షదీద్” – మరియు మానవులందరినీ మత్తులో ఉన్నట్లు నీవు చూస్తావు, కానీ వాస్తవానికి వారు త్రాగి మత్తులో ఉండరు. కానీ అల్లాహ్ తబారక వ త’ఆలా శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ శిక్షను చూసి, ఆ ప్రళయాన్ని చూసి వారి మతిస్థిమితం పోతుంది అని దైవం ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు.

కాబట్టి సోదర మహాశయులారా, మనిషి జీవితంలో ఇహపరలోకాలలో సాఫల్యం చెందడానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి వాటిలో ఒక ముఖ్యమైనటువంటి అంశము పరలోక చింత. అయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులు, సహాబాలలో పరలోక చింత ఎంతగా ఉండేదంటే వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనకాలే నమాజులు చదివేటటువంటి వారు, వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పగానే ఉపవాసాలు ఉండేటటువంటి వారు, వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆజ్ఞాపించగానే జకాత్‌ను చెల్లించేటటువంటి వారు. మరి అదే విధంగా వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పగానే అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క మార్గంలో పోరాడడానికి కూడా వారు వెనకాడినటువంటి వారు కాదు.

అయినప్పటికీ కూడా సహాబాలలో పరలోక చింత ఎంతగా ఉండేది అంటే, ఉదాహరణకు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, హజ్రతే ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు: “ఖాల యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇஃదిల్లీ అస్అలుక అన్ కలిమతిన్ ఖద్ అమ్రదత్నీ వ అస్ఖమత్నీ వ అహ్జనత్నీ.” ఫఖాల నబియ్యుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం “సల్నీ అమ్మా షిஃతా.” హజ్రతే ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారు అంటున్నారు, ఈ హదీసును ముస్నదే అహ్మద్‌లో ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ రహమహుల్లాహ్ గారు 22,122వ నెంబర్ హదీసులో తీసుకొచ్చారు. హజ్రతే ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నిస్తున్నారు: “ఓ ప్రవక్తా, నా లోపల ఒక రకమైనటువంటి చింత ఉంది. అది నన్ను లోలోపల నుంచి ఎంతగా తినేస్తుందంటే, ఖద్ అమ్రదత్నీ వ అస్ఖమత్నీ వ అహ్జనత్నీ – నన్ను బాధకు గురిచేస్తుంది, నా లోలోపలే అది తినేస్తుంది.” ఎలాగైతే సోదరులారా, ఒక వ్యక్తి యవ్వనుడైనప్పటికీ కూడా అతని లోపల బాధ గనుక, దుఃఖము గనుక లోలోపల అతన్ని తినివేస్తూ ఉన్నప్పుడు, అతడు ఎంత యవ్వనుడున్నా కూడా ఆ యవ్వనము ఉన్నప్పటికీ కూడా అతని ముఖంపై ముసలి యొక్క కవళికలు కనిపించడం ప్రారంభమవుతాయి. హజ్రతే ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారిని చూసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతున్నారు, “ఓ ముఆద్, అదేమిటో అడుగు. ఇస్సల్నీ అమ్మా షిஃతా – ఏమిటో అడుగు” అంటే, ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారు సోదర మహాశయులారా అడుగుతున్నారు. ఏమన్నారంటే: “యా నబియ్యల్లాహ్, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, హద్దిస్నీ బి అమలిన్ యుద్ఖిల్నియల్ జన్నహ్” – ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, స్వర్గములో ఎలా ప్రవేశించాలో ఏదైనా అమలు ఉంటే అది చెప్పండి అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారు ప్రస్తావిస్తున్నారు. ఈ హదీసును ఇమామ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీగా ధృవీకరించారు.

అయితే సోదరులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, సహాబా అనుచరులు, వారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనక నమాజులు చదువుతూ కూడా, వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ కూడా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఎంతో మంది సహాబాలు అడుగుతున్నారు, “దుల్లనీ అలా అమలిన్ ఇదా అమిల్తుహు దఖల్తుల్ జన్నహ్” – ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ ఆచరణ ఏదైనా ఉంటే చెప్పండి, దాన్ని చేసి నేను స్వర్గంలో ప్రవేశించడానికి. ఏ విధంగా సహాబాలలో పరలోకం అనేటటువంటి చింత ఎంత అధికంగా ఉండేదో మనం ఇక్కడ గమనించగలం.

అంతేకాదు సోదరులారా, హజ్రతే అబూదర్ రిఫారీ రది అల్లాహు అన్హు వారైతే ఆయన అంటున్నారు, నన్ను గనక ఒక వృక్షంగాను అల్లాహ్ తబారక వ త’ఆలా చేసి ఉంటే ఎంత బాగుణ్ణు, ఎవరైనా దాన్ని నరికి వెళ్ళిపోయేటటువంటి వారు, నాకు పరలోకంలో అల్లాహ్ తబారక వ త’ఆలా లేపి నువ్వు ఈ పని ఎందుకు చేశావు అనేటటువంటి అడిగేటటువంటి ప్రసక్తి ఉండేది కాదేమో అని ఈ విధంగా సహాబాలు దుఃఖించేటటువంటి వారు.

ముస్నద్ ఏ అహ్మద్ లో 13,150వ హదీసులో హజ్రతే ఆయిషా రది అల్లాహు అన్హా వారి యొక్క ఉల్లేఖనంలో ఈ హదీస్ వస్తుంది. ఆయిషా రది అల్లాహు అన్హా వారు అంటున్నారు, “సమిஃతున్నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లం యఖూలు ఫీ బஃది సలాతిహి, అల్లాహుమ్మ హాసిబ్నీ హిసాబయ్యసీరా.” హజ్రతే ఆయిషా రది అల్లాహు అన్హా వారు అంటున్నారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన చదివేటటువంటి నమాజుల్లో కొన్నింటిలో ఈ విధంగా ప్రార్థించేటటువంటి వారు: “అల్లాహుమ్మ హాసిబ్నీ హిసాబయ్యసీరా” – ఓ అల్లాహ్, నా యొక్క లెక్కలను తేలికపాటి లెక్కలుగా నువ్వు తీసుకో. అమ్మా ఆయిషా రది అల్లాహు అన్హా వారు అడుగుతున్నారు, “ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ తేలికపాటి లెక్కలంటే ఏమిటి?” అని ఆయిషా రది అల్లాహు అన్హా వారు హజ్రతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుగుతున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జవాబు చెబుతూ అంటున్నారు, “ఖాల అయ్ యన్జుర ఫీ కితాబిహి ఫయతజావదు అన్హు.” దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “ఓ ఆయిషా, నువ్వు భలే ప్రశ్నలు వేస్తావే! వాస్తవానికి తేలికపాటి లెక్కలంటే ఏమిటంటే అల్లాహ్ తబారక వ త’ఆలా తన దాసుల యొక్క కర్మపత్రాలను చూసిన తర్వాత వారిని అట్టే విడిచిపెట్టటము లేక వారిని అలాగే క్షమించివేయటము ఇదే తేలికపాటి లెక్కలు. ఎందుకంటే ఆయిషా, ఒకవేళ అల్లాహ్ తబారక వ త’ఆలా గనక ప్రశ్నించటం ప్రారంభిస్తే, ఆయన ప్రశ్నించేటటువంటి జవాబులు చెప్పేటటువంటి ధైర్యము గానీ లేక జవాబు చెప్పేటటువంటి స్తోమత ఎవరికీ ఉంటుంది? ఒకవేళ అల్లాహ్ తబారక వ త’ఆలా గనక ప్రశ్నించటం మొదలుపెడితే, వివరంగా అడగటం మొదలుపెడితే ఆ వ్యక్తి నాశనమైపోతాడు” అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులో ప్రస్తావిస్తున్నారు.

ఈ హదీస్ ద్వారా మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఎంతగా పరలోకం గురించి చింతన చెందేటటువంటి వారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. అయితే సోదర మహాశయులారా, ఒకసారి మన జీవితాల్ని మనం చూసుకున్నట్లయితే, మన జీవితాల్లో మనం నడుస్తున్నటువంటి మార్గం ఏమిటి? వాస్తవానికి మనం పరలోక జీవితం గురించి ఆలోచించి మన యొక్క జీవితాన్ని గడుపుతున్నామా? ఇహలోక జీవితంలో పడిపోయి పరలోక జీవితాన్ని మరచి నడుస్తున్నామా? అల్లాహ్ తబారక వ త’ఆలా అందుకనే ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు, “ఇఖ్ తరబలిన్నాసి హిసాబుహుమ్ వహుమ్ ఫీ గఫ్లతిమ్ ముஃరిదూన్” – ప్రజల యొక్క లెక్కల గడియ సమీపిస్తున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం పరధ్యానంలో పడి ఉన్నారని దైవం అంటున్నాడు.

అందుకనే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొక హదీసులో ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు. అబూ దావూద్ లో 4297వ నెంబర్ లో హదీస్ ఈ విధంగా ప్రస్తావించబడింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు: “యూషికుల్ ఉమము అన్ తదాఅ అలైకుమ్ కమా తదాఅల్ అకలతు ఇలా ఖస్అతిహా.” ఫఖాల ఖాయిలున్ వమిన్ ఖిల్లాతిన్నహ్ను యౌమయిదిన్? ఖాల “బల్ అన్తుమ్ యౌమయిదిన్ కసీరున్ వలాకిన్నకుమ్ గుసాఅన్ క గుసాయిస్సైల్. వలయన్ది అన్నల్లాహు మిన్ సుదూరి అదువ్వికుముల్ మహాబత మిన్కుమ్, వలయఖ్దిఫన్నల్లాహు ఫీ ఖులూబికుముల్ వహన్.” ఫఖాల ఖాయిలున్ “యా రసూలల్లాహ్, వమల్ వహన్?” ఖాల “హుబ్బుద్దునియా వకరాహియతుల్ మౌత్.”

ప్రళయానికి సమీప కాలంలో ముస్లిం సమాజంపై ఇస్లాం వ్యతిరేక శక్తులన్నీ కూడా ఆ విధంగా విరుచుకొని పడతాయి, ఏ విధంగానైతే వడ్డించినటువంటి విస్తరిపై ఆకలితో ఉన్నటువంటి జంతువు విరుచుకొని పడుతుందో. అప్పుడు ఒక అతను అడుగుతున్నాడు, “ఫఖాల ఖాయిలున్ వమిన్ ఖిల్లాతిన్నహ్ను యౌమయిదిన్” – ఆ సమయంలో మా యొక్క సంఖ్య అతి స్వల్పంగా ఉంటుందా? అని అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, లేదు, “బల్ అన్తుమ్ కసీరున్ వలాకిన్నకుమ్ గుసాఅన్ క గుసాయిస్సైల్.” మీరు ఆ సమయంలో అత్యధికంగా ఉంటారు, కానీ మీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే నీటికి విరుద్ధంగా నురగ మాదిరిగా మీరు మారిపోయి ఉంటారు. ఎలాగైతే సముద్రంలో ఉండేటటువంటి నురగ ఉంటుందో. వాస్తవానికి ఇక్కడ ఆలోచించినట్లయితే సోదర మహాశయులారా, ఎవరైనా దాహము, దప్పికతో ఉంటే ఒక గ్లాసు నీళ్లు అతనికి దప్పిక తగ్గడానికి, దాహం తీరడానికి మనం ఇచ్చినట్లయితే అతడు ఆ గ్లాసు నీళ్లు తాగి దాహాన్ని తీర్చుకోగలడు గానీ అదే గనక మనం అదే గ్లాసులో మనం ఒక గ్లాసు నురగ అతనికి ఇచ్చినట్లయితే ఆ నురగతో అతనికి ఏ విధమైనటువంటి ప్రయోజనం కలగదు. ఎందుకంటే నీటికి విలువ ఉంది గానీ నురగకు ఆ విలువ ఉండదు. మరి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నీటికి విరుద్ధంగా నురగ మాదిరిగా మీరు మారిపోతారు. మరి అటువంటి సమయంలో ఏమి జరుగుతుంది? “వలయన్ది అన్నల్లాహు మిన్ సుదూరి అదువ్వికుముల్ మహాబత మిన్కుమ్” – మీ యొక్క శత్రువుల యొక్క హృదయాల్లో మీ పట్ల ఉన్నటువంటి భయాన్ని అల్లాహ్ తబారక వ త’ఆలా తొలగిస్తాడు. మరి అదే విధంగా, “వలయఖ్దిఫన్నల్లాహు ఫీ ఖులూబికుముల్ వహన్” – మీ యొక్క హృదయాలలో అల్లాహ్ తబారక వ త’ఆలా ఆ సమయంలో ఒక రోగాన్ని జనింపజేస్తాడు. ఏమిటండీ ఆ రోగము అంటే, బీపీనా? కాదు సోదరులారా. షుగరా? కాదు సోదరులారా. మరి ఇటువంటి వ్యాధులేమీ కానప్పుడు అది ఏ వ్యాధి అండీ అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక వింతైనటువంటి పదాన్ని వినియోగించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “వలయఖ్దిఫన్నల్లాహు ఫీ ఖులూబికుముల్ వహన్” – అదేమిటంటే మీ హృదయాల్లో జనించేటటువంటి వ్యాధి, ఆ వ్యాధి పేరే వహన్. మరి ఈ వ్యాధి వహన్ అన్నటువంటిది అరబ్బులో కూడా సహాబాలు కొత్తగా విన్నారు. సహాబాలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడుగుతున్నారు, “వమల్ వహను యా రసూలల్లాహ్?” ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ వహన్ అంటే ఏమిటి అని అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “హుబ్బుద్దునియా వకరాహియతుల్ మౌత్” – పరలోక చింత వదిలేసి ఇహలోక వ్యామోహంలో పడిపోవటము ఈ వ్యాధికి ఉన్నటువంటి మొదటి లక్షణము. మరి రెండవ లక్షణం ఏమిటండీ అంటే మరణము అంటే భయము.

అయితే సోదర మహాశయులారా, ఈరోజు మన సమాజంలో మనం చూసుకున్నట్లయితే, మరి మన సమాజం దేని వైపునైతే పరుగెడుతుందో, ఆ పరుగును మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం చెప్పగలిగినటువంటి విషయం ఏమిటంటే ఈరోజు మన సమాజము ఇహలోకం అన్నటువంటి వ్యామోహంలో కొట్టిమిట్టాడుతుంది. పరలోక ధ్యానాన్ని మరిచిపోయి ఉన్నాము. అల్లాహ్ త’ఆలా సూరతుల్ ఆలాలో ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు:

بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا ‎﴿١٦﴾‏ وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ ‎﴿١٧﴾‏
కాని మీరు మాత్రం ప్రాపంచిక జీవితానికే ప్రాముఖ్యమిస్తున్నారు.వాస్తవానికి పరలోకం ఎంతో మేలైనది, ఎప్పటికీ మిగిలి ఉండేది. (87:16-17)

అయినప్పటికీ ఎన్ని విషయాలు చెప్పబడ్డాయి, సుహుఫి ఇబ్రాహీమ వ మూసా – ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారి యొక్క సహీఫాలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది, మూసా అలైహిస్సలాతు వస్సలాం గారికి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది, అయినప్పటికీ కూడా మీ పరిస్థితి ఎలా ఉంది అంటే “బల్ తుஃసిరూనల్ హయాతద్దునియా” – మీరు అయినప్పటికీ ఇహలోక జీవితానికే ప్రాధాన్యతనిస్తున్నారే గానీ, పరలోక జీవితం ఎటువంటిది? అల్లాహ్ త’ఆలా అంటున్నాడు, “బల్ తుஃసిరూనల్ హయాతద్దునియా వల్ ఆఖిరతు ఖైరువ్ వ అబ్ఖా.” వాస్తవానికి ఇహలోక జీవితం కన్నా పరలోక జీవితం ఎంతో మేలైనటువంటిది. ఎందుకంటే అది కలకాలం ఉండిపోయేటటువంటిది. ఇహలోక జీవితం అంతమైపోయేటటువంటిది.

అందుకనే సోదర మహాశయులారా, ఒక కవి తెలుగులో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:

ఇల్లు వాకిలి నాటి ఇల్లాలు నాదనుచు ఎల భ్రమచితివోయి మనసా! కాలూని వలలోన కానేక చిక్కేవు కడచేరుటే త్రోవ మనసా! తనయులు చుట్టాలు తనవారని నమ్మి తలపోయకే వెర్రి మనసా! నీ తనువు వెళ్ళేడి సమయంబు లోపల నీవెంట రాదేది మనసా!

ఇల్లు, వాకిలి, నీవు కట్టుకున్నటువంటి ఇల్లాలు ఇవన్నీ నీవే అని అనుకుంటున్నావు. కాలూని వలలోన కానేక చిక్కేవు, కడచేరుటే త్రోవ మనసా. బంధుత్వం అన్నటువంటి వలలో చిక్కుకొని పోయావు, మరి ఈ బంధుత్వాన్ని బ్యాలెన్స్ గా చేసుకొని ఇహపరలోకాలలో సాఫల్యం చెందటం అంటే మామూలు విషయం కాదు. నీ తనువు వెళ్ళేడి సమయంబు లోపల నీ వెంట రాదేది మనసా. కానీ నీ తనయులు, చుట్టాలు నీ వారని నమ్ముతున్నావేమో, నువ్వు చచ్చిపోయేటప్పుడు నీతో పాటు వచ్చేది కేవలం నువ్వు చేసుకున్నటువంటి నీ పాపపుణ్యాలు తప్ప మరొకటి ఏమీ రాదు అన్నటువంటి విషయాన్ని ఒక కవి కూడా తెలుగులో ఈ విధంగా చక్కగా తన తెలుగు కవితంలో తెలియజేస్తున్నాడు.

అల్లాహ్ తబారక వ త’ఆలా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అంటున్నాడు, వాస్తవానికి పరలోక జీవితమే అసలైనటువంటి జీవితము. ఇహలోక జీవితము కేవలం ఒక ఆటవినోదం తప్ప మరేమీ కాదు. ఒక మోసపూరితమైనటువంటి జీవితం తప్ప మరేమీ కాదు అని దైవం ఎన్నో చోట్ల అల్లాహ్ తబారక వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది.

అల్లాహ్ తబారక వ త’ఆలాతో దువా ఏమనగా, అల్లాహ్ తబారక వ త’ఆలా మనందరికీ కూడా పరలోక చింతనను కలిగి ఉండేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎప్పటివరకైతే మనం ఇహలోకంలో బ్రతికి ఉంటామో అప్పటివరకు కూడా అల్లాహ్ తబారక వ త’ఆలాను ఆరాధిస్తూ బ్రతికి ఉండేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. మరియు ఎప్పుడైతే మనం మరణిస్తామో అల్లాహ్ తబారక వ త’ఆలా వైపునకు విశ్వాస స్థితిలోనే అల్లాహ్ వైపునకు మరలేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.

رَبَّنَا تَقَبَّلْ مِنَّا ۖ إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ وَتُبْ عَلَيْنَا ۖ إِنَّكَ أَنتَ التَّوَّابُ الرَّحِيمُ
(రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్సమీయుల్ అలీమ్ వతుబ్ అలైనా ఇన్నక అంతత్తవ్వాబుర్రహీమ్)

سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَامٌ عَلَى الْمُرْسَلِينَ وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(సుబ్ హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)

వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.


ప్రళయ దినం మరియు దాని సూచనలు [ఆడియో, టెక్స్ట్]

ఇక్కడ వినండి లేదా ఆడియో డౌన్లోడ్ చేసుకోండి [37నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ప్రళయ దినం యొక్క భయంకరమైన స్వభావం, దాని అనివార్యత మరియు దాని రాకకు ముందు అల్లాహ్ తన కారుణ్యంతో పంపిన సూచనల గురించి వివరించబడింది. ఈ సూచనలు మూడు రకాలుగా విభజించబడ్డాయి: ఇప్పటికే జరిగిపోయినవి (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాక), ప్రస్తుతం జరుగుతూ పెరుగుతున్నవి (అజ్ఞానం మరియు అనైతికత పెరగడం), మరియు ప్రళయానికి అతి సమీపంలో సంభవించే పది పెద్ద సూచనలు. ముఖ్యంగా దజ్జాల్ యొక్క ఫితనా (సంక్షోభం) మరియు దాని నుండి రక్షణ పొందే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టబడింది. ఈ సూచనల గురించిన జ్ఞానం, విశ్వాసులు తమ విశ్వాసాన్ని పటిష్టం చేసుకోవడానికి, సత్కార్యాల వైపు పయనించడానికి మరియు చెడుకు దూరంగా ఉండటానికి ఒక హెచ్చరిక అని వక్త ఉద్బోధించారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

మా సోదరులారా! ప్రళయదినం మరియు దాని యొక్క సూచనల గురించి కొన్ని విషయాలు ఈ రోజు మనం ఇన్ షా అల్లాహ్ తెలుసుకుందాం.

ప్రళయదిన విషయం అనేది చాలా భయంకరమైనది. ఎంత భయంకరమైనదంటే దాన్ని మనం ఊహించలేము ఇప్పుడు. దాని గురించి అల్లాహ్ త’ఆలా సూరె హజ్ లో ఆరంభంలోనే ఒక ఆయత్ లో మూడు విషయాలు తెలిపాడు. ఏ రోజైతే ప్రళయం సంభవిస్తుందో, ఆ రోజు:

يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَى النَّاسَ سُكَارَىٰ وَمَا هُم بِسُكَارَىٰ وَلَٰكِنَّ عَذَابَ اللَّهِ شَدِيدٌ

ఆనాడు మీరు దాన్ని చూస్తారు… పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. గర్భవతుల గర్భాలూ పడిపోతాయి. ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్‌ (తరఫున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది. (22:2)

يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّآ اَرْضَعَتْ
(యౌమ తరౌనహా తద్’హలు కుల్లు ముర్దిఅతిన్ అమ్మా అర్దఅత్)
ఆ రోజు పాలు త్రాపించే తల్లి, పాలు త్రాగే తన పిల్లను మరిచిపోతుంది.

రెండో విషయం చెప్పాడు:

وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا
(వ తదఉ కుల్లు దాతి హమ్లిన్ హమ్లహా)
ప్రతి గర్భిణీ యొక్క గర్భం పడిపోతుంది

మూడో విషయం చెప్పాడు.

وَتَرَى النَّاسَ سُكَارٰى
(వ తరన్ నాస సుకారా)
జనులు ఆ రోజు, ప్రజలు ఆ రోజు మత్తులో ఉంటారు.

وَمَا هُمْ بِسُكَارٰى
(వమా హుమ్ బిసుకారా)
కాని నిజానికి వారు మత్తులో ఉండరు. (22:2)

ఆ మత్తులో ఉండడం అనేది ఏదో మత్తుపదార్థం సేవించినందుకు కాదు.

وَلٰكِنَّ عَذَابَ اللّٰهِ شَدِيْدٌ
(వలాకిన్న అదాబల్లాహి షదీద్)
ఆనాటి అల్లాహ్ యొక్క శిక్ష అనేది చాలా కఠినమైనది. అందుగురించి ప్రళయం సంభవించే రోజు ఇలాంటి పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటారు.

ఆ రోజు రాకముందే విశ్వాసులు సిద్ధమవడం, సత్కార్యాలు ముందుకు పంపుకోవడం, విశ్వాస మార్గాన్ని అవలంబించి ప్రజలందరూ కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ వైపునకు మరలడం తప్పనిసరి. అయితే ప్రళయం అనేది ఈ ప్రపంచమంతా, విశ్వమంతా నాశనమైన రోజు సంభవిస్తుంది. ఆ రోజు వరకు మనం బ్రతికి ఉంటామో లేదో తెలియదు. కానీ ఏ రోజైతే మనకు మన చావు వస్తుందో, ఆ రోజు మన ప్రళయం మనపై సంభవించినట్లే. మనం ఎప్పుడుచనిపోతామో, రేపో మాపో తెలుసా మనకు? తెలియదు. అయితే మనం, మన చావు వచ్చింది అంటే మన ప్రళయం వచ్చేసింది అన్నట్లే. ఆ ప్రళయం గురించి మనం వేచించి ఉండవలసిన అవసరం లేదు. అందుగురించే ఆ ప్రళయ విషయం వచ్చినప్పుడు మనలో ఒక భయం ఏర్పడినప్పుడు మనం సత్కార్యాల వైపునకు ముందుకు వెళ్ళాలి, విశ్వాస మార్గాన్ని బలంగా పట్టుకోవాలి. అప్పుడే మనకు ఇహలోకంతో పాటు పరలోకంలో కూడా మోక్షం అనేది ప్రాప్తమవుతుంది.

అయితే అల్లాహ్ యొక్క దయ మనపై చాలా ఉంది గనక, ఎల్లప్పుడూ మన మేలు కోరేవాడే గనక, ఆ ప్రళయానికి ముందు ఎన్నో సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు సంభవించినప్పుడల్లా మనిషి ప్రళయాన్ని గుర్తు చేసుకోవాలి. మరియు ఆ ప్రళయ రోజు, ప్రళయ దినాన తాను సాఫల్యం పొందిన వారిలో చేరకోవాలి అని తనకు తాను సిద్ధపడుటకు అల్లాహ్ త’ఆలా అలాంటి సూచనలు పంపిస్తూ ఉంటాడు.

ఖుర్ఆన్ లో అల్లాహ్ చెప్పాడు:

فَهَلْ يَنْظُرُوْنَ اِلَّا السَّاعَةَ اَنْ تَأْتِيَهُمْ بَغْتَةً ۚ فَقَدْ جَاۤءَ اَشْرَاطُهَا
(ఫహల్ యన్దురూన ఇల్లస్ సాఅత అన్ త’తియహుమ్ బగ్ తతన్, ఫఖద్ జా’అ అష్రాతుహా)
ఏమిటీ, ప్రళయ ఘడియ హటాత్తుగా తమపైకి రావాలని వారు ఎదురు చూస్తున్నారా? నిస్సందేహంగా దానికి సంబంధించిన సూచనలు (ఇప్పటికే) వచ్చేశాయి. (47:18)

ఏమిటి? ప్రళయం గురించి వారు వేచి చూస్తూ ఉన్నారా? అది ఎప్పుడైనా ముందు నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఏకాయెకిగా రావచ్చు. కానీ ఆ ప్రళయానికంటే ముందు దానికి సంబంధించిన సూచనలు వచ్చేసాయి.

اِقْتَرَبَتِ السَّاعَةُ وَانْشَقَّ الْقَمَرُ
(ఇఖ్ తరబతిస్ సాఅతు వన్ షఖ్ ఖల్ ఖమర్)
ప్రళయం సమీపించినది, చంద్రుడు రెండు ముక్కలయ్యాడు.(54:1)

ఇవన్నీ కూడా ప్రళయ సూచనల్లో.

అయితే సోదరులారా, ప్రళయం గురించి మనం సిద్ధపడడం, అది రాకముందే దాని గురించి మనం తయారీ చేయడం చాలా అవసరం. అయితే ప్రళయానికి ముందు ఏ సూచనలైతే రానున్నాయో, ఆ సూచనలు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతో వివరంగా మనకు తెలిపారు. దానికి సంబంధించిన హదీసులన్నీ ఏవైతే వచ్చాయో, ఆ హదీసులు, పండితులు ఆ సూచనలన్నిటినీ మూడు రకాలుగా విభజించారు.

ఒకటి, కొన్ని సూచనలు వచ్చేసాయి, సమాప్తమైపోయాయి. మరియు కొన్ని రెండో రకమైన సూచనలు, ఆ సూచనలు రావడం మొదలైంది, అది ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మూడో రకమైన సూచనలు ఏమిటంటే, ఆ మూడో రకమైన సూచనలు ప్రళయానికి మరీ దగ్గరగా వస్తాయి, అవి చాలా పెద్ద సూచనలు. అవి రావడం మొదలైంది అంటే ఒకటి వెనుక మరొకటి వస్తూనే పోతాయి. అందులో ఎలాంటి మధ్యలో గ్యాప్ అనేది ఉండదు.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా నియమింపబడి పంపబడడం. ప్రవక్తను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా పంపడం అనేది ప్రళయ సూచనల్లో ఒకటి అని కూడా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చావు, ఆయన ఈ లోకాన్ని వీడిపోవడం కూడా ప్రళయ సూచనల్లో ఒకటి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు:

بُعِثْتُ أَنَا وَالسَّاعَةُ كَهَاتَيْنِ
(బుఇస్తు అన వస్సాఅతు కహాతైన్)
నేను మరియు ప్రళయ ఘడియ ఈ రెండు వేళ్ళ వలే (దగ్గరగా) పంపబడ్డాము.

అంటే మా మధ్యలో ఎక్కువ సమయం లేదు అని భావం. కానీ ఆ సమయం అనేది మన అంచనా ప్రకారంగా కాదు, అల్లాహ్ యొక్క జ్ఞాన ప్రకారంగా.

ఉదాహరణకు, వాటి గురించి ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈ హదీస్ సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది. దాని కొంత భాగం బుఖారీలో కూడా ఉంది.

ఒకసారి జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇస్లాం అంటే ఏమిటి? ఈమాన్ అంటే ఏమిటి? మరియు ఇహ్సాన్ అంటే ఏమిటి? అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దానికి సమాధానం చెప్పారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత ప్రళయం ఎప్పుడు వస్తుంది అని అడిగారు. ప్రళయం ఎప్పుడు వస్తుందో అనేది నాకు తెలియదు అని ప్రవక్త గారు చెప్పారు. అయితే దాని యొక్క సూచనలు ఏవైనా చెప్పండి అని జిబ్రీల్ అడిగినప్పుడు, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు:

أَنْ تَلِدَ الْأَمَةُ رَبَّتَهَا
(అన్ తలిదల్ అమతు రబ్బతహా)
బానిస స్త్రీ తన యజమానురాలికి జన్మనివ్వడం.

మరియు రెండో సూచన ప్రవక్త వారు చెప్పారు, ఒంటిపై గుడ్డ లేనటువంటి వాళ్ళు, కాళ్ళల్లో చెప్పులు లేనటువంటి వాళ్ళు మరియు తిందామంటే టైం కు తిండి దొరకనటువంటి పేదవాళ్ళు, ఎంత ధనం వాళ్ళ చేతుల్లో వచ్చేస్తుందంటే, పెద్ద పెద్ద బిల్డింగులు వాళ్ళు కడతారు.

ఇంకా బుఖారీ ముస్లిం లో మరొక హదీస్ వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయానికి కంటే ముందు కొన్ని సూచనలు సంభవిస్తాయి. విద్య, ధర్మజ్ఞానం అనేది లేపబడుతుంది. అజ్ఞానం పెరిగిపోతుంది. ప్రజలు మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు సేవించడం అధికమైపోతుంది. మరియు వ్యభిచారం కూడా చాలా పెరిగిపోతుంది.

మరొక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయానికి ముందు కొన్ని సూచనలు ఉన్నాయి: అశ్లీలత అనేది ఎక్కువైపోతుంది. ప్రజలు తమ బంధుత్వాన్ని తెంచుకుంటూ ఉంటారు, కలుపుకోవడానికి బదులుగా. మరి ఎవరైతే అమానత్, ఏ విషయమైనా గానీ, నమ్మి ఒకరిని ఏదైనా అతని దగ్గర పెడితే, అలాంటి అమానతులు కాజేసుకునే వాళ్ళు అయిపోతారు. మరి ఎవరైతే మోసం చేసే వాళ్ళు ఉన్నారో, అమానత్ లో ఖియానత్ చేసే వారు ఉన్నారో, అలాంటి వారిని చాలా విశ్వసనీయులు, అమానతులు పాటించే వాళ్ళు అని భావించడం జరుగుతుంది.

ఈ విధంగా ఇంకా ఎన్నో సూచనలు హదీసులో వచ్చి ఉన్నాయి. ఒక సందర్భంలో ఒక గ్రామీణుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, “ప్రవక్తా, ప్రళయం ఎప్పుడు ఉన్నది? దానికి సూచనలు ఏమిటి?” అని అడిగాడు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయం, దానికి సూచన ఏమిటంటే, ఎప్పుడైతే అమానత్, అమానత్ గా ఉండకుండా దాన్ని కాజేసుకోవడం జరుగుతుందో, ఒకరిని విశ్వసనీయుడు, చాలా నమ్మకస్తుడు అని అతని వద్ద ఏదైనా మాట, ఏదైనా వస్తువు పెడితే దానిలో మోసం చేస్తాడో, అప్పుడు నీవు ప్రళయం వస్తుంది అని వేచించు. అయితే అమానత్ లో ఖియానత్ అనేది ఎలా జరుగుతుంది అని ఆ వ్యక్తి అడిగినప్పుడు, ఏ హోదా, ఏ పని, ఏ తగిన మనిషికి ఇవ్వాలో అలా కాకుండా, దానికి అర్హులు లేని వారికి ఇవ్వడం జరుగుతుందో అప్పుడు నీవు ప్రళయం గురించి వేచించు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.

ఈ విధంగా సోదరులారా, ఇక్కడ ఒక విషయం చాలా మనం శ్రద్ధగా మనం గమనించాలి. అదేమిటంటే, ఈ రోజుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే, ఇక ప్రవక్త చెప్పారు గనక, ప్రవక్త మాటల్లో ఎప్పుడూ కూడా అబద్ధం ఉండదు, చెప్పింది జరిగి తీరుతుంది అని ఈ రకంగా కేవలం మనం ఆలోచించి ఉండకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయానికి ముందే సంభవించే సూచనల గురించి మనకు తెలుపుతున్నారు అంటే ఇది కూడా స్వయంగా ఆయన అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త, అల్లాహ్ యొక్క సత్యమైన నిజమైన సందేశ దూత అని భావం. ఎందుకు? ఆయన ఏ మాట కూడా తన ఇష్ట ప్రకారంగా తన నోటితో చెప్పేవారు కాదు.

وَمَا يَنْطِقُ عَنِ الْهَوٰى ۗ‏ اِنْ هُوَ اِلَّا وَحْيٌ يُّوْحٰى
(వమా యన్తిఖు అనిల్ హవా. ఇన్ హువ ఇల్లా వహ్యుయ్యూహా)
అతను తన మనోవాంఛల ప్రకారం మాట్లాడడు. అది పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు. (53:3-4)

ఏదో ముందుకు జరగబోయే విషయాల గురించి ఏదైతే ప్రవక్త గారు చెప్తున్నారో, ఈ రోజుల్లో కొందరు అగోచర జ్ఞానం ఉన్నది, ఆ పండితుడు చాలా ఆరితేరినవాడు, అతను చాలా గొప్పవాడు అని ఏదో పంచాంగం చెప్పినట్లుగా కొన్ని విషయాలు తెలుపుతూ ఉంటారు. ఇలాంటి మోసపూరితమైన మాటలు, నవూదుబిల్లా అస్తగ్ఫిరుల్లా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పేవారు కాదు. అలాంటి విషయాలు ప్రవక్త చెప్పేవారు కాదు. సూర నజ్మ్ లో అల్లాహ్ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన తన కోరికతో ఏదీ మాట్లాడడు. అల్లాహ్ ప్రవక్త గారి గురించి చెప్తున్నాడు, ప్రవక్త వారు తమ కోరికతో, తమ ఇష్టం వచ్చినట్లు ఏదంటే అది మాట్లాడడు. అల్లాహ్ అతని వైపునకు ఏ వహీ పంపుతాడో, ఏ దివ్యవాణి పంపుతాడో, దాని ప్రకారమే ప్రవక్త అల్లాహ్ పంపినటువంటి విషయాల్ని ఇతరులకు తెలియజేస్తాడు.

అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఈ సూచనలు ఎందుకు తెలిపారు? ఇందులో మంచి విషయాలు ఏవైతే కరువవుతాయో, ఏ మంచి విషయాలలో మనం కొరత చూస్తామో, ఆ మంచి చేయడానికి మనం ముందుగా ఉండాలి. ఉదాహరణకు, ప్రళయానికి ముందు ధర్మ విద్య లేపబడుతుంది. అంటే ఏంటి? అది ఎక్కడో ఇట్లా పెట్టి ఉంటది ఎవడో వచ్చి తీసుకుంటాడు అట్లా భావం కాదు. దీనికి రెండు భావాలు ఉన్నాయి. ఒకటి, ధర్మ పండితులు ఎవరైతే ఉన్నారో, వారి చావు అనేది ఎక్కువైపోతుంది. రెండో భావం, ప్రత్యేకంగా ముస్లింలు మరియు ఇతరుల హృదయాల్లో నుండి ధర్మ జ్ఞానం అవలంబించాలి అన్నటువంటి ప్రేమ అనేది తగ్గిపోతుంది.

ఇది ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఏం చేయాలి? మనం ప్రయత్నం చేయాలి. ఇదిగో ఒక చిన్న ఉదాహరణ ఇవ్వాలా. ఇప్పుడు ఈ బండ ఎండల్లో 45-47 వరకు కూడా డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత చేరుకుంటుంది. అయినా గాని పని వదులుకుంటామా మనం? చెమటలు కారుతూ ఉంటాయి. శరీరం మండుతూ ఉంటుంది. కానీ ఎందుకు పని చేస్తాం? ఎందుకు ఆ కష్టాన్ని భరిస్తూ ఉంటాం? ఈ పట్టి కష్టపడితేనే ఈ చెమట మనది వస్తేనే, మనం కొంచెం ఓపిక వహిస్తేనే మనకు జీతం దొరుకుద్ది. అప్పుడే మనం మన కడుపు నింపగలుగుతాము, మన పిల్లల కడుపు నింపగలుగుతాము అని ఆలోచిస్తాం. ఇంతకంటే ఎక్కువ ఆలోచన మనకు కేవలం ఈ శరీరం గురించేనా? ఈ ఆత్మ గురించి వద్దా? ఈ ఆత్మ వీడి పోయింది అంటే ఈ శరీరం ఏదైనా లాభంలో ఉందా? తీసుకెళ్లి బొంద పెడతాం. తీసుకెళ్లి దఫన్ చేసేస్తాం. మట్టిలో అది కుళ్ళిపోతుంది. కానీ ఆత్మ మిగిలి ఉంటుంది. అల్లాహ్ త’ఆలా మరొక శరీరం ప్రసాదిస్తాడు. ఈ శరీరంలో కూడా ఒక వెన్నుముక బీజం ఉంటుంది, ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా రెండోసారి లేపినప్పుడు దాని ద్వారా మళ్ళీ లేపుతాడు.

అయితే, చెప్పే విషయం ఏంటి? ఈ కేవలం శరీరానికి ఎంత సుఖం మనం ఇవ్వదలుచుకుంటున్నామో, దాని గురించి ఎంత కష్టపడుతున్నామో, మనకు ఇష్టం లేని ఒక సత్కార్యం, మనకు ఇష్టం లేని విశ్వాసం, మనకు ఇష్టం లేని ఒక మంచి కార్యం, దాని వైపునకు కూడా మనం మనసును ఒప్పించి అయినా కానీ ముందడుగు వెయ్యాలి.

ఇంకా కొన్ని సూచనలు మనం విన్నాం. ఏంటవి? వ్యభిచారం అధికమైపోవడం. మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు సేవించడం అధికమైపోవడం. అశ్లీలత పెరిగిపోవడం. ఇలాంటి విషయాలు మనం విన్నప్పుడు ఏం చేయాలి? అరే ప్రవక్త చెప్పిండు కదా ఎట్లైనా అయిపోతది అని మనం కూడా దాంట్లో పాల్గొనాలా? కాదు. ప్రవక్త ఈ వార్త మనకు ఇస్తున్నారు అంటే, తమ పరలోకాన్ని సాఫల్యం చేసుకోగోరే వారు, ప్రళయ దినాన తమకు నరకం నుండి మోక్షం కలగాలి, ప్రళయ దినాన వచ్చే కష్టాలన్నీ కూడా దూరం కావాలి అని కోరుకునేవారు ఇహలోకంలో సంభవించే ఈ చెడులకు దూరం ఉండండి. ఏ మంచి విషయాలు తగ్గుతాయి అని తెలుస్తుందో, దాన్ని మనం చేయడానికి ముందడుగు వెయ్యాలి. ఏ చెడు పెరుగుతుంది అని మనకు తెలుస్తుందో, దానికి మనం దూరం ఉండాలి. ఇది అసలు కారణం చెప్పడానికి.

మరి సోదరులారా, ప్రళయం సంభవించేకి ముందు మూడవ రకమైన సూచనలు ఏవైతే సంభవిస్తాయో, అవి చాలా పెద్ద సూచనలు, చాలా ఘోరమైనవి. ఒక సందర్భంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు, అప్పటికి సహాబాలు, ప్రవక్త గారిని విశ్వసించిన సహచరులు ప్రళయం గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. “మీరేం చర్తించుకుంటున్నారు? ఏ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు? పరస్పరం ఏ విషయం మీద చర్చలు జరుగుతుంది?” అని ప్రవక్త గారు అడిగారు. వారు చెప్పారు, “మేము ప్రళయం గురించి పరస్పరం చర్చించుకుంటున్నాము.”

అప్పుడు ప్రవక్త గారు చెప్పారు,

إِنَّهَا لَنْ تَقُومَ حَتَّى تَرَوْنَ قَبْلَهَا عَشْرَ آيَاتٍ
(ఇన్నహా లన్ తఖూమ హత్తా తరౌన ఖబ్లహా అష్ర ఆయాతిన్)
నిశ్చయంగా, ప్రళయం, దానికంటే ముందు పది పెద్ద సూచనలు సంభవించే వరకు ప్రళయం రాదు.

ఏంటి ఆ పెద్ద సూచనలు?

  1. అద్-దుఖాన్ (పొగ): ఒక చాలా విచిత్రమైన మరియు చాలా భయంకరమైన ఒక పొగ ఏర్పడుతుంది. దాని వివరణ మనం వివరంగా మరో సందర్భంలో తెలుసుకుందాము.
  2. అద్-దజ్జాల్: దజ్జాల్ యొక్క రాక.
  3. దాబ్బతుల్ అర్ద్: ఒక జంతువు వస్తుంది. మాట్లాడుతుంది. ఇతను విశ్వాసి, ఇతను అవిశ్వాసి అనేది చెప్తుంది.
  4. సూర్యుడు పడమర నుండి ఉదయించడం: సూర్యుడు ప్రతిరోజు ఎటునుంచి ఉదయిస్తున్నాడు? తూర్పు నుండి. కానీ ప్రళయానికి సమీపంలో ఇటు పడమర వైపు నుండి ఉదయిస్తాడు.
  5. ఈసా ఇబ్ను మర్యం రాక: యేసు క్రీస్తు, ఈసా అలైహిస్సలాం దిగి వస్తారు.
  6. య’జూజ్ మరియు మ’జూజ్: ఒక జాతి, వారు బయటికి వెళ్తారు.
  7. మూడు పెద్ద భూకంపాలు: ఒకటి తూర్పులో, మరొకటి పడమరలో, మరొకటి ఈ జజీరతుల్ అరబ్ (అరబ్ ద్వీపంలో). చాలా గాంభీర్యంగా భూమి క్రుంగిపోతుంది.
  8. యమన్ నుండి ఒక అగ్ని: ఇందులో చివరి పెద్ద సూచన, యమన్ నుండి ఒక అగ్ని వెలుదేరుతుంది, అగ్ని వెళ్తుంది. ఆ అగ్ని వెళ్ళింది అంటే చాలా పెద్ద పెద్దగా ఉంటుంది. ప్రజల్ని నెట్టేసుకుంటూ వస్తుంది. ప్రజలు పరిగెడుతూ ఉంటారు. ఎక్కడ? షామ్ (సిరియా) వైపున. అది చివరి యొక్క పెద్ద సూచన అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.

అయితే ఈ పెద్ద సూచనలు ఒకటి తర్వాత మరొకటి, ఒకటి తర్వాత మరొకటి ఈ విధంగా మొదలై కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. వాటి మధ్యలో ఏ గ్యాప్ అనేది ఉండదు.

వీటన్నిటిలో అతి భయంకరమైనది దజ్జాల్ యొక్క సంక్షోభం, దజ్జాల్ యొక్క ఫితనా. దజ్జాల్ ఎవడు? అతడు ఒక మానవుడు, ఒక మనిషే. కానీ ప్రళయానికి ముందు అతడు వస్తాడు. అల్లాహ్ త’ఆలా అతనికి ఒక శక్తిని ఇస్తాడు. దాని మూలంగా అతడు ఎన్నో మహిమల పేరు మీద ప్రజలను మోసం చేసి, నేను మీ దేవుణ్ణి, నేను మీ అనారోగ్యులకు, రోగంతో ఉన్నవారికి స్వస్థత ప్రసాదించేవాణ్ణి, మీలో కష్టంలో ఉన్నవారికి సుఖం ఇచ్చేవాణ్ణి, నేను మీ యొక్క ప్రభువుని అని తనకు తాను చాటింపు చేసుకుంటాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే దజ్జాల్ బయలుదేరాడు అని వింటారో, అతనితోని ఎదుర్కోవడానికి, అతని ముందుకు వచ్చే ప్రయత్నం చేయొద్దు, దూరమే ఉండాలి. ఎందుకంటే ఆ సందర్భంలో ఒక విశ్వాసి నా విశ్వాసం చాలా బలంగా ఉంది, నేను ఎలాంటి మోసంలో పడను అని అనుకుంటాడు. కానీ వాడు ఎలాంటి మాయాజాలం చూపిస్తాడో, దానికి మోసపోయి తన విశ్వాసాన్ని కోల్పోతాడు. అతన్ని ప్రభువుగా నమ్మేస్తాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు:

“చూడండి ఇంతకముందు వచ్చిన ప్రవక్తలందరూ కూడా దజ్జాల్ గురించి హెచ్చరించారు. ఎందుకంటే ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం వచ్చే వరకు ఎన్ని ఫితనాలు, ఎన్ని సంక్షోభాలు, ఎన్ని ఇలాంటి ఉపద్రవాలు జరిస్తాయో, పుడతాయో, వాటన్నిటిలో అతిపెద్ద భయంకరమైన ఫితనా, ఉపద్రవం దజ్జాల్ యొక్క ఫితనా. అందుగురించే ప్రతి ప్రవక్త తమ జాతి వారికి అతని గురించి హెచ్చరించారు. నేను కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.

వినండి, అతను తనకు తాను ప్రభువుగా చాటింపు చేసుకుంటాడు. అయితే మీ ప్రభువు కేవలం అల్లాహ్ మాత్రమే. దజ్జాల్ ను మీరు గుర్తు పట్టాలంటే అతనికి రెండు కళ్ళు ఉండవు. ఒకే ఒక కన్ను ఉంటది, ఒంటి కన్ను అంటాం కదా. ఒకే కన్ను ఉంటుంది. ఆ ఒక కన్ను కూడా సామాన్య మనుషుల కన్నుల మాదిరిగా ఉండదు, బయటికి వచ్చి ఒక ద్రాక్ష పండు పెద్దది ఎలా ఉంటుందో ఆ విధంగా భయంకరంగా ఉంటుంది. మరియు అతని తల మీద, నుదుటి మీద ك ف ر (కాఫ్-ఫా-రా) కాఫిర్ అన్న పదం రాసి ఉంటుంది. చదివిన వాళ్ళు, చదవని వాళ్ళు, జ్ఞానులు, అజ్ఞానులు అందరూ కూడా ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతారు.

మరియు అతడు ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజలకు ఎన్నో మోసపెడుతూ వారిని నేను ప్రభువుగా నమ్మండి అని అంటూ ఉంటాడు. అయితే ప్రజల్ని నమ్మించడానికి ఒక సందర్భంలో అతనికి ఎలాంటి శక్తి లభిస్తుంది అంటే చాలా పెద్ద సంఖ్యలో అతని వెంట జనం ఉంటుంది. ఒక సందర్భంలో ప్రవక్త గారు చెప్పారు, అతన్ని అనుసరించే వారిలో స్త్రీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది అని. ఒక సందర్భంలో అతని వెంట చాలా పెద్ద జనం ఉంటుంది. అతడు ఆకాశాన్ని ఆదేశిస్తే వర్షం కురుస్తుంది. భూమిని ఆదేశిస్తే పంట వెళ్తుంది. చూడు, నేను ప్రభువును కాదా అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాడు.

ప్రజలు కొందరు నమ్మరు. ఆ సందర్భంలో ఒక వ్యక్తిని ముందుకు తీసుకువచ్చి నీ తల్లిదండ్రిని బ్రతికించి చూపించాలా అని అంటాడు. అయితే అతని వెంట షైతానులు ఉంటాయి. ఇద్దరు షైతానులు అతని యొక్క తల్లిదండ్రి యొక్క రూపంలో అతని ముందుకు వస్తారు. ఇలాంటి మోసం జరుగుద్ది మరియు అల్లాహ్ యొక్క ఎంత గొప్ప దయ మనపై గమనించండి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కూడా మొత్తం మన విశ్వాసంలో పడకుండా, విశ్వాసంపై స్థిరంగా ఉండడానికి అల్లాహ్ మనకు ప్రవక్త ద్వారా ఈ విషయాలు తెలియపరిచాడు. కానీ మన దురదృష్టం ఏంటంటే చదువుకు, విద్యకు ఎంతో దూరం ఉండిపోతున్నాం. విషయాలన్నీ తెలుసుకోవాలి. రోజు కొంచెం ఒక పేజీ అయినా గానీ ఖుర్ఆన్ దాని అనువాదంతో చదవాలి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులను చదువుతూ ఉండాలి. ప్రవక్త వారి యొక్క జీవితం చదువుతూ ఉండాలి. ఈ కాంక్ష ఇంకా ఎప్పుడు మనలో పుడుతుంది?

వాస్తవానికి ఈ రోజుల్లో గమనిస్తే, ఏ ఉపద్రవాలు, సంక్షోభాలు, ఫితనా ఎక్కువ అవుతూ ఉన్నాయో, అందులో నేనైతే అనుకుంటా, మన చేతులో ఇలాంటి పెద్ద పెద్ద షైతానులు రావడం అని కూడా ఒకటి భావిస్తాను. ఎందుకో తెలుసా? వాస్తవానికి దీని వెనక నిజంగా వీటి ద్వారా, అంటే ఈ మొబైల్ సెట్స్, స్మార్ట్ ఫోన్స్, మరి ఇలాంటి దీనికి సంబంధించిన ఎన్నో పరికరాలు ఏవైతే ఉన్నాయో, వీటి వలన కొంత ప్రయోజనం, ఎంతో లాభం ఉండవచ్చు. కానీ ఈ రోజుల్లో జనం ఆ లాభానికంటే ఎక్కువగా నష్టంలో దాన్ని ఉపయోగిస్తున్నారు, వాటిని ఉపయోగిస్తున్నారు. గంటల తరబడి పేజీ పైకి చేస్తూ, చేస్తూ, Facebook నుండి, Facebook లో చూసి చూసి మన ఫేస్ ఏ పాడైపోతుంది. కానీ దానిని మనం గమనించడం లేదు. దానికి బదులుగా ఏదైనా మంచి విషయం చదవాలి అంటే కోరిక పుట్టడం లేదు. ఉదాహరణకు Facebook ఇచ్చాను. ఈ విధంగా ఎన్నో విషయాలు ఉన్నాయి. అంతకు ముందు, ఇవి రాకముందు డిష్ లు, టీవీలు, మంచి మంచి ప్రోగ్రాంలో అని అనుకునేవాళ్ళం. స్త్రీలు ఫిలింలు, సీరియల్ లలో, పురుషులు ఎంతో మంది ఎన్నో రకాల ఆటల్లో, క్రికెట్ అని కొందరు, మరికొందరికి మరికొన్ని కాంక్షలు.

సోదరులారా, అల్లాహ్ మనపై కరుణించి, ఆయన మనకు ఎంతో మనపై దయచేసి, ప్రళయానికి ముందు సంభవించే సూచనల గురించి ఏ చిన్న చిన్న వివరాలు అయితే తెలిపాడో, మన ప్రవక్త ద్వారా వాటిని తెలుసుకొని మంచి విషయాలకు ముందుకు వెళ్లి, చెడు నుండి మనం దూరం ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడే మన ఇహలోకం బాగుపడుతుంది, మన పరలోకం కూడా మనకు బాగుపడుతుంది. అక్కడ నరకం నుండి మోక్షం పొంది స్వర్గంలో మనం చేరగలుగుతాం.

దజ్జాల్ ఇక్కడ ఉండేది ఎన్ని రోజులు? కేవలం 40 రోజులు మాత్రమే ఈ ప్రపంచంలో. కానీ మొదటి రోజు ఒక సంవత్సరం మాదిరి, రెండో రోజు ఒక నెల మాదిరిగా, మూడో రోజు ఒక వారం మాదిరిగా, మిగితా రోజులు 37 సామాన్య రోజులుగా ఉంటాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. చివరికి ఈసా అలైహిస్సలాం దిగి వస్తారు. విశ్వాసుల ఒక సంఖ్య, విశ్వాసుల ఒక గ్రూప్ వారి వెంట ఉంటుంది. ఈసా అలైహిస్సలాం దజ్జాల్ ను వెతికి, దజ్జాల్ ను చంపేస్తారు. హత్య చేస్తారు.

కానీ ఒక విషయం, ఇతడు చాలా పెద్ద దజ్జాల్, భయంకరమైనవాడు. అయినా గానీ రెండు విషయాలు దీంట్లో మనం గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటి? ఇతని ఉపద్రవాలు, ఇతని యొక్క ఫితనా, ఇతను ప్రజల్ని దుర్మార్గంలో పడవేయడానికి ఎంత ఏ ప్రయత్నం చేసినా గానీ, అల్లాహ్ పై గట్టి నమ్మకంతో అతన్ని ఎదురించకుండా, మనం ఉన్నకాడ మనం ఉండి, విశ్వాసంపై స్థిరంగా ఉండి, సత్కార్యాలు చేస్తూ ఉండి, ప్రత్యేకంగా దజ్జాల్ నుండి రక్షణకై, దజ్జాల్ నుండి అల్లాహ్ మనల్ని రక్షించాలని ప్రవక్త ఏ దుఆలు అయితే మనకు నేర్పారో, ఏ ప్రత్యేక కార్యాలు అయితే మనకు నేర్పారో అవి చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు అతని ఎన్ని భయంకరమైన, ఎన్ని మోసాలు, ఎన్ని మాయాజాలం మహిమలు అని చూపించినా గానీ అందులో ఇన్ షా అల్లాహ్ మనం పడం. కానీ విశ్వాసం మరియు ప్రవక్త చూపిన విధానంలో మనం ఉండాలి, కరెక్ట్ గా ఆచరణలో ఉండాలి. ఉదాహరణకు ప్రతి నమాజులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు,

اَللّٰهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ، وَمِنْ عَذَابِ جَهَنَّمَ، وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ، وَمِنْ شَرِّ فِتْنَةِ الْمَسِيْحِ الدَّجَّالِ
(అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ అదాబిల్ ఖబ్ర్, వ మిన్ అదాబి జహన్నమ్, వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాత్, వ మిన్ షర్రి ఫిత్నతిల్ మసీహిద్ దజ్జాల్)

అని చదివేవారు. ఇది చదువుతూ ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు ప్రతి జుమా రోజు ఏం చదవాలి? సూరె కహఫ్ చదువుతూ ఉండండి అని చెప్పారు. అది చదువుతూ ఉండాలి.

ఈ రోజుల్లో మన పరిస్థితి ఏమైంది? మా తల్లిదండ్రి మమ్మల్ని స్కూల్ కు పంపలేదు, మా తల్లిదండ్రి మమ్మల్ని మదరసాలో చేర్పించలేదు, మాకు ఖుర్ఆన్ చిన్నప్పుడు నేర్పలేదు అని ఇప్పటివరకు మనం నేర్చుకోలేకపోతున్నాము. కానీ మన చిన్నప్పుడు ఇట్లాంటి మొబైల్స్ ఉండెనా? వీటిని ఎలా ఆపరేటింగ్ చేయాలో అవన్నీ తెలుసా? అక్షరజ్ఞానం లేని వాళ్ళు కూడా ఇవి ఉపయోగించుకుంటున్నారు, దీన్ని వాడుతున్నారు. ఏమీ రాని వ్యక్తి కూడా తనకు ఇష్టమైన పాట దాంట్లో ఎన్నుకొని వింటున్నాడు, ఇష్టమైన ఫిలిం దాంట్లో తీసి చూస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు ఆ చెడులో ఏ జ్ఞానం అయితే మనది ఉపయోగపడుతుందో, మంచి తెలుసుకోవడానికి నాకైతే చదువు రాదు, చలో ఈ రోజు నేను ఏం చేస్తా, ఈ ఖుర్ఆన్ అప్లికేషన్ దీంట్లో స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేసి ఆ ఈరోజు జుమ్మా కదా, జుమ్మా రోజు నేను సూర కహఫ్, నాకు చదవ రాదు, కనీసం చూసుకుంటూ శ్రద్ధగా వింటూ ఉంటా. అట్లా ఎవరైనా ఆలోచిస్తున్నారా? బహుశా వెయ్యిలో ఎవరైనా ఒకరు ఉంటే ఉండవచ్చునేమో. ఇలాంటి ప్రయత్నాలు చేయాలి మనం.

రెండో విషయం, ఆ పెద్ద దజ్జాల్ నుండి మనం రక్షణ పొందాలంటే, అతని యొక్క మాయాజాలంలో మనం చిక్కిపోకూడదు అంటే ఈ పనులు చేయడంతో పాటు, ఆ పెద్ద దజ్జాల్ రాకముందు ఎందరో చిన్న చిన్న దజ్జాల్లు వస్తూ ఉంటారు. వాటి మాయాజాలకు కూడా మనం దూరం ఉండాలి. ఈ రోజుల్లో ఎందరో ఉన్నారు. గారడీ ఆటల్లాంటివి ఆడిపిస్తారు, మంత్రాలు చేస్తున్నాము, చేతబడి చేస్తున్నాము, మా దగ్గర మాయాజాలం ఉన్నది, మా దగ్గర ఫలానా శక్తి ఉన్నది, దేవుడు నాలో వదిగి వచ్చాడు, దేవుడు నాలో ఈ విధంగా చూపించుకుంటూ ప్రజల్ని మోసం చేసి, ప్రజల యొక్క నజరానాలు, ప్రజల యొక్క డబ్బులు, ప్రజల యొక్క ఆస్తులు అన్నీ కాజేసుకుంటూ దేవుని పేరు మీద తింటూ ఉన్నారు. అల్లాహ్ పేరు మీద తింటూ ఉన్నారు. ఇక ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఆ పేర్లు చెప్పేది ఉంటే కొందరికి కోపాలే వస్తాయి.

మన బర్రార్ లలో కూడా ఎన్నో మజార్లు, దర్గాలు, దర్బారులు, బాబాల యొక్క ఏమైతే అనుకుంటామో అక్కడ కూడా ఇలాంటి విషయాలు ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అందుగురించి సోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇలాంటి మోసాల్లో పడకుండా, దుర్మార్గంలో పడకుండా, విశ్వాసంపై మన యొక్క చావు కావాలి అంటే తప్పకుండా మనం ఏం చేయాలి? విశ్వాస మార్గం మీద ఉండాలి. ఖుర్ఆన్ హదీస్ చదువుతూ ఉండాలి. ధర్మ జ్ఞానం మనం నేర్చుకుంటూ ఉండాలి. అల్లాహ్ త’ఆలా ఇలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ప్రళయం రాకముందు ఏ సూచనలైతే సంభవిస్తా ఉన్నాయో, అల్లాహ్ ఆ సూచనల్లోని చెడు విషయాల నుండి మనల్ని దూరం ఉంచి, ఏ మంచి విషయాలు కరువవుతాయో వాటికి చేరువై, దగ్గరై, అలాంటి విషయాలు నేర్చుకొని మన వాళ్ళల్లో వాటిని ఇంకింత పెంపొందించే భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ త’ఆలా దజ్జాల్, దజ్జాల్ కు ముందు వచ్చే ఇంకా చిన్న చిన్న దజ్జాల్ ల వారందరి ఫితనాల నుండి కూడా మనల్ని అల్లాహ్ కాపాడుగాక.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వబరకాతుహు.

పరలోకం (The Hereafter)
https://teluguislam.net/hereafter/

ఇస్బాల్ – మగవారు దుస్తులు చీలమండలం (Ankles) క్రిందికి ధరించడం నిషిద్ధం [వీడియో & టెక్స్ట్]

ఇస్బాల్ – మగవారు దుస్తులు చీలమండలం (Ankles) క్రిందికి ధరించడం నిషిద్ధం
https://youtu.be/RpDjA_KkfMo [11 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

దుస్తులు చీలమండలం క్రిందికి ఉంచుట men wearing below ankles

ప్రస్తుత ప్రసంగంలో, వస్త్రాలను చీలమండలాల క్రిందకు ధరించడం (ఇస్బాల్) ఇస్లాంలో తీవ్రమైన పాపంగా పరిగణించ బడుతుందని వివరించబడింది. గర్వంతో లేదా గర్వం లేకుండా పురుషులు తమ ప్యాంటు, లుంగీ లేదా మరేదైనా వస్త్రాన్ని చీలమండలాల క్రిందకు వేలాడదీయడం నిషిద్ధమని, అలా చేసిన వారికి ప్రళయ దినాన అల్లాహ్ కరుణ లభించదని హదీసుల ఆధారంగా స్పష్టం చేయబడింది. అయితే, స్త్రీలకు పరదృశ్యుల నుండి తమ పాదాలను కప్పి ఉంచే నిమిత్తం, తమ వస్త్రాలను చీలమండలాల నుండి ఒక మూరెడు వరకు క్రిందకు వేలాడదీయడానికి అనుమతి ఉంది, కానీ అంతకంటే ఎక్కువ పొడవు ఉండరాదు. ఆధునిక ఫ్యాషన్ల పేరిట స్త్రీలు పొట్టి దుస్తులు ధరించడం లేదా వివాహాలలో నేలపై ఈడ్చుకుంటూ వెళ్లే పొడవాటి గౌనులు ధరించడం కూడా ఇస్లాంలో నిషిద్ధమని హెచ్చరించబడింది.

దుస్తులు చీల మండలం క్రిందికి ఉంచుట. ఇక స్త్రీలు అనుకుంటున్నారు కావచ్చు, ఇందులో మాదేముందయ్యా, మగోళ్లకే కదా ఈ ఆదేశాలు? కొంచెం ఓపిక వహించండి శ్రద్ధగా వినండి.

దుస్తులు చీల మండలం క్రిందికి ఉంచుట, దీన్ని ప్రజలు చాలా చిన్నదిగా, విలువ లేనిదిగా భావిస్తారు. ఏమంత పెద్ద పాపం కాదయ్య, నాకైతే గర్వ ఉద్దేశ్యం లేదు కదా అనేస్తారు. కానీ ఇది అల్లాహ్ దృష్టిలో పెద్ద పాపాల్లో ఒకటి. అంటే, లుంగీ, ప్యాంట్ వగైరా చీల మండలం క్రిందికి ఉంచుట. కొందరి దుస్తులు నేలకు తాకుతూ ఉంటాయి. మరి కొందరివి భూమిపై వేలాడుతూ ఉంటాయి. దీనినే కొందరు ఏమంటారు? అయ్యా మున్సిపాలిటీ వాళ్ళు చప్రాసీ పని నీకు ఇచ్చారా, నీ ప్యాంటు ద్వారా గంత గలీజు ఊడ్చుకుంటూ వెళ్తున్నావు? ఎవరైనా ప్యాంటును ఈడ్చుకుంటూ వెళ్లేవారు కోపానికి రాకండి. కొందరు అలా జోక్ గా మాట్లాడుకుంటారు అని అంటున్నాను. వాళ్ళు అలా మాట్లాడుకునే పరిస్థితి మీరు తీసుకురాకండి, మీ ప్యాంట్లు, మీ యొక్క లుంగీలు, మీ యొక్క బట్టలు, పైజామాలు గిట్ల కిందికి వ్రేలాడదీసి.

హజ్రత్ అబూజర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించిన హదీద్ లో ఉంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

ثَلَاثَةٌ لَا يُكَلِّمُهُمُ اللَّهُ يَوْمَ الْقِيَامَةِ وَلَا يَنْظُرُ إِلَيْهِمْ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ : الْمُسْبِلُ ( وَفِي رِوَايَةٍ : إِزَارَهُ ) وَالْمَنَّانُ ( وَفِي رِوَايَةٍ : الَّذِي لَا يُعْطِي شَيْئًا إِلَّا مَنَّهُ ) وَالْمُنَفِّقُ سِلْعَتَهُ بِالْحَلِفِ الْكَاذِبِ
“మూడు రకాల వ్యక్తులున్నారు. అల్లాహ్‌ వారితో సంభాషించడు. దయాభావంతో కన్నెత్తి చూడడు. వారిని పరిశుద్ధ పరచడు. వారికి తీవ్రమైన శిక్ష విధిసాడు. తన లుంగి (ప్యాంటు…) ను చీలమండలానికి క్రింది వరకు ఉంచేవాడు. ఉపకారం చేసి మాటిమాటికి చెప్పుకునేవాడు. దెప్పి పొడిచేవాడు. తన సరుకును అసత్య ప్రమాణాలతో అమ్మేవాడు” (ముస్లిం 106).

అల్లాహు అక్బర్. నాలుగు రకాల ఘోరమైన విషయాలు, చూస్తున్నారా? అల్లాహ్ మాట్లాడడు, కన్నెత్తి చూడడు, పరిశుద్ధ పరచడు, పైగా వారికి తీవ్ర శిక్ష ఉంటుంది.

ఎవరు వారు? అల్ ముస్బిల్. తన లుంగీ, ప్యాంట్, పైజామా ఏదైనా, ఏది అయినా తొడిగేది, సాక్స్ కాకుండా, ఎందుకంటే సాక్స్ కింది నుండి పైకి వస్తాయి. పై నుండి కిందికి వచ్చేటివి ఏ వస్త్రాలైనా గానీ చీల మండలానికి కిందిగా ఉన్నాయి అంటే, అతడికి ఈ శిక్ష ఉంది. ఇంకా రెండో వాడు ఎవడు? ఉపకారం చేసి, ఎవరికైనా ఏదైనా మేలు చేసి, మాటిమాటికి చెప్పుకునేవాడు, దెప్పిపొడిచేవాడు. మూడో వాడు ఎవడయ్యా? తన సరుకును అసత్య ప్రమాణాలతో అమ్మేవాడు.

కొందరు, నేను గర్వకారణంగా తొడగడం లేదు అని చెప్పి తన పవిత్రతను చాటుకుంటాడు. కాని అతని మాట చెల్లదు. గర్వం ఉద్దేశ్యం ఉన్నా లేకపోయినా అన్ని స్దితుల్లో అది నిషిద్ధం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఈ హదీసును గమనించండి:

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసును గమనించండి:

مَا تَحْتَ الْكَعْبَيْنِ مِنَ الإِزَارِ فَفِي النَّارِ
(మా తహ్తల్ క’బైని మినల్ ఇజారి ఫఫిన్నార్)
“ఎవరి లుంగి (ప్యాంటు వగైరా) చీలమండలానికి క్రిందికి ఉండునో అది అగ్నికి ఆహుతి అవుతుంది”. (నిసాయీ 5330, ముస్నద్‌ అహ్మద్‌ 6/254).

ఒకవేళ గర్వంతో క్రిందికి వదిలితే. దాని శిక్ష ఇంకా పెద్దది, భయంకర మైనది. ఇదే తరహా స్పష్టీకరణ ప్రవక్తగారి ఈ ప్రవచనంలో ఉన్నది:

مَنْ جَرَّ ثَوْبَهُ خُيَلَاءَ لَمْ يَنْظُرِ اللَّهُ إِلَيْهِ يَوْمَ الْقِيَامَةِ
“ఎవరైతే తన వస్త్రాన్ని గర్వంతో వ్రేలాడ దీస్తాడో ప్రళయదినాన అల్లాహ్‌ అతని వైపు కన్నెత్తి చూడడు’. (బుఖారి 3665, ముస్లిం 2085).

ఎందుకనగా అందులో రెండురకాల నిషిద్ధతలున్నాయి. ఒకటి గర్వం, రెండవది చీలమండలం క్రిందికి ధరించడం.

చీలమండలానికి క్రింద ధరించే నిషిద్ధత అన్ని రకాల దుస్తులపై ఉంది. అబ్దుల్లాహ్ బిన్‌ ఉమర్‌ (రజియల్లాహు అన్హు)  ప్రవక్తతో ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

الْإِسْبَالُ فِي الْإِزَارِ وَالْقَمِيصِ وَالْعِمَامَةِ، مَنْ جَرَّ مِنْهَا شَيْئًا خُيَلَاءَ لَمْ يَنْظُرِ اللَّهُ إِلَيْهِ يَوْمَ الْقِيَامَةِ
“లుంగీని, చొక్కాను మరియు తలపాగను (చీలమండలానికి క్రిందకి) వ్రేలాడదీయుట (ఘోరపాపం). అయితే ఎవరైతే వీటిలో ఏ ఒక్కటినైనా గర్వంతో వ్రేలాడతీస్తాడో, ప్రళయ దినాన అల్లాహ్‌ అతనివైపు కన్నెత్తి చూడడు ‘. (అబూదావూద్‌ 4094, సహీహుల్‌ జామి 2770).

ఇక, కొందరు ఏమంటారు, నాకు గర్వం లేదు అని అంటారు కదా, ఆ మాట చెల్లదని ఇంతకు ముందే మనం తెలుసుకున్నాము. వారికి ప్రత్యేకమైన శిక్ష ఉంది. అయితే రండి, మరొక హదీస్, ఇది నిసాయి లో వచ్చి ఉంది.

وارْفَعْ إِزَارَكَ إِلَى نِصْفِ السَّاقِ، فَإِنْ أَبَيْتَ فَإِلَى الْكَعْبَيْنِ، وَإِيَّاكَ وَإِسْبَالَ الْإِزَارِ، فَإِنَّهَا مِنَ الْمَخِيلَةِ، وَإِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمَخِيلَةَ
“నీ లుంగీని సగం పిక్కల వరకు లేపి ఉంచు, అంతపైకి కుదరదనుకుంటే చీలమండలం వరకు, చీలమండలానికి క్రిందికి ధరించడం నుండి దూరముండు, అది గర్వాహంకారంలో లెక్కించబడుతుంది మరియు అల్లాహ్ గర్వాహంకారాలను ఇష్టపడడు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సహాబీకి చెప్పారు, “నీ లుంగీని సగం పిక్క వరకు లేపి ఉంచు. అంత పైకి కుదరదనుకుంటే, చీల మండలం వరకు.” చీల మండలం అంటే అందరికీ అర్థమైందా? గిట్టలు (ankles) అని అంటారు చూడండి, ఎక్కడైతే మన పాదం మొదలవుతుందో మరియు మన యొక్క పిక్క కింది కాలు భాగం పూర్తి అయి జాయింట్ ఏదైతే ఉంటుందో, రెండు వైపులా కొంచెం ఎక్కువగా వచ్చి ఉంటాయి ఆ ఎముకలు, గిట్టెలు అని కూడా కొందరు అంటారు, చీల మండలం అని అంటారు. దానిని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబీకి చెప్పారు, ఒకవేళ నీవు సగం పిక్క వరకు కుదరదు అనుకుంటే చీలమండలం వరకు, అంటే అది కనబడాలి. దానిపైకి ఉండాలి వస్త్రం.

وَإِيَّاكَ وَإِسْبَالَ الْإِزَارِ؛ فَإِنَّهَا مِنَ الْمَخِيلَةِ، وَإِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمَخِيلَةَ
(వ ఇయ్యాక వ ఇస్బాలల్ ఇజార్, ఫ ఇన్నహా మినల్ మఖీలా, వ ఇన్నల్లాహ లా యుహిబ్బుల్ మఖీలా)
“చీల మండలానికి క్రిందికి ధరించడం నుండి నువ్వు దూరం ఉండు. ఉద్దేశ్యం నీది లేకపోయినా గాని, ఇది గర్వ అహంకారం లో లెక్కించబడుతుంది. మరియు అల్లాహ్ త’ఆలా గర్వ అహంకారాలను ఇష్టపడడు.”

ఇక స్త్రీల మాటకు వస్తారా? ఈ నిషిద్ధత స్త్రీలకు కూడా వర్తిస్తుంది. అయితే, వారి శరీరంలో ఏ కొంత భాగం కూడా పరపురుషులకు కనబడకుండా ఉండుట తప్పనిసరి గనక, ఆమె తన పాదాలు కనబడకుండా క్రిందికి వ్రేలాడదీయవచ్చును. కానీ ఎంత? అంతకంటే ఎక్కువ ఉంటే ఆమెకు కూడా శిక్షనే మరి. ఎంత? ఈ హదీసుపై శ్రద్ధ వహించండి. తిర్మిజీలో ఉన్న సహీ హదీస్, అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హుమా ఉల్లేఖించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

مَنْ جَرَّ ثَوْبَهُ خُيَلَاءَ لَمْ يَنْظُرِ اللَّهُ إِلَيْهِ يَوْمَ الْقِيَامَةِ
(మన్ జర్ర సౌబహు ఖుయలాఅ లమ్ యందురిల్లాహు ఇలైహి యౌమల్ ఖియామా)
ఎవరైతే తమ యొక్క వస్త్రాలను చీలమండలానికి క్రిందిగా వేలాడదీస్తారో, హుయలా (గర్వ అహంకారాలతో), అల్లాహ్ అలాంటి వారి వైపున ప్రళయదినాన చూడడు. అక్కడ ఉమ్మె సలమా రదియల్లాహు త’ఆలా అన్హా అడిగినది, ప్రశ్నించినది:

فَكَيْفَ يَصْنَعْنَ النِّsسَاءُ بِذُيُولِهِنَّ؟
(ఫకైఫ యస్న’అన్నిసాఉ బి దుయూలిహిన్?)
“స్త్రీలు వారి యొక్క వస్త్రాలలో ఏదైతే కిందికి వేలాడి ఉంటాయో వారి పరిస్థితి ఏమిటి?”

يُرْخِينَ شِبْرًا
(యుర్ఖీన షిబ్రా)
ప్రవక్త చెప్పారు: “ఒక జానెడు వారు కిందికి వేలాడదీయవచ్చు.” ఈ జానెడు అంటే ఎక్కడి నుండి జానెడు? చీల మండలం నుండి జానెడు, ఎందుకంటే అక్కడి వరకే తొడగాలని ముందు చెప్పారు కదా.

ఈ హదీసును స్త్రీలు చాలా శ్రద్ధగా వినాలి. ప్రత్యేకంగా ఈ రోజుల్లో లెగ్గింగ్స్ వేసుకొని, జీన్స్ ప్యాంట్లు వేసుకొని, చర్మానికి, తోలుకు మొత్తం అతుక్కుపోయే విధంగా, చాలా టైట్ గా ఉండే అటువంటి ప్యాంట్లు, పైజామాలు ఏదైతే స్త్రీలు తొడుగుతున్నారో, బయటికి వెళ్తున్నారో, భయపడండి అల్లాహ్ తో, గమనించండి. వారి యొక్క ఆ పైజామాలు, ప్యాంట్లు, లెగ్గింగ్స్ అన్నీ పైకి ఉంటాయి. అలాంటి వారు ప్రత్యేకంగా ఈ హదీసును వినాలి.

స్త్రీలము మేము మా పాదాలు కూడా పర పురుషులకు కనబడకుండా ఉండాలి కదా, మరి ఎవరైతే చీలమండలానికి క్రిందిగా తొడుగుతారో వారికి నరకశిక్ష ఉన్నది అని, ప్రళయ దినాన అల్లాహ్ చూడడు అని మీరు అంటున్నారు కదా ప్రవక్తా, మరి మా స్త్రీల పరిస్థితి ఏమిటి అంటే, “ఒక జానెడు వేలాడదీయండి” అని చెప్పారు. అయితే ఉమ్మె సలమా రదియల్లాహు త’ఆలా అన్హా అడిగారు:

إِذًا تَنْكَشِفُ أَقْدَامُهُنَّ
(ఇదన్ తన్కషిఫు అఖ్దాముహున్నా)
“నిలబడి ఉండి జానెడు కిందికి తీస్తే పర్లేదు, కానీ నడుస్తున్నప్పుడు వాళ్ళ యొక్క పాదాలు తెరచిఉంటాయి క కదా?” అప్పుడు ప్రవక్త చెప్పారు:

فَيُرْخِينَهُ ذِرَاعًا لَا يَزِدْنَ عَلَيْهِ
(ఫ యుర్ఖీనహు దిరా’అన్, లా యజీద్న అలై)
“ఒక మూరెడు వారు కిందికి ఉంచవచ్చు. అంతకంటే ఇంకా ఎక్కువ పొడుగ్గా ఉంచడం ఇది కుదరదు.” అందువల్ల వారు కూడా శిక్షలకు గురి అవుతున్నారు.

కానీ మన సమాజంలోని స్త్రీలలో రెండు రకాల ఫ్యాషన్లు వారిని నాశనానికి, వినాశనానికి గురి చేస్తున్నాయి. ఒకటి, ఆఫీసుల్లో జాబ్ చేసే స్త్రీలు అని గానీ, కాలేజీల్లో చదివే అమ్మాయిలు గానీ, స్కర్టులు వేసుకోవడం, ఇంకా ఏదేదో కొత్త కొత్త పేర్లతో ఏమేమో వేసుకోవడం, వారి యొక్క పాదాలు, చీలమండలు, సగం పిక్కలు, మోకాళ్ల వరకు కూడా కనబడి ఉండటం, ఇదొక ఫిత్నా అయిపోతుంది. ఇదొక చాలా వినాశనానికి వారు దారి తీస్తున్నారు. మరియు మరోవైపున, కొన్ని ఫంక్షన్లలో, కొన్ని ఫంక్షన్లలో, కొన్ని రకాల బట్టలు ఎలా కుట్టిస్తారంటే ఒక మీటర్, రెండు మీటర్లు, మూడు మీటర్లు వెనక్కి అది వేలాడుతూ ఉంటాయి. ఇది ఒక గర్వంగా, ఇది ఒక ఫ్యాషన్ గా, ఇది ఒక మోడల్ గా, ఆ, ఇది మా యొక్క పెళ్లికి ప్రత్యేక చిహ్నం అండి అన్నట్లుగా చెప్పుకుంటారు. కానీ ఈ హదీసు ఆధారంగా అది కూడా నిషిద్ధం. కొందరు పెళ్లికూతుర్లు ధరించే దుస్తులు మీటర్ కంటే ఎక్కువ కిందికి ఉంటాయి. ఒక్కోసారి ఎంతకంటే పొడుగ్గా ఉంటాయి, వెనక ఉన్నవారు ఎత్తి పట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి కూడా యోగ్యం కావు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=6512

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

అజాన్ తర్వాత చేసే రెండు దుఆల ఘనత [వీడియో & టెక్స్ట్]

అజాన్ తర్వాత చేసే రెండు దుఆల ఘనత (فضل الذكر بعد الآذان)
https://www.youtube.com/watch?v=IUyKck4lvfI [ 2 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

అజాన్ తర్వాత చెదివే ఈ రెండు దుఆల ఘనత చాలా గొప్పగా ఉంది
ప్రతి అజాన్ తర్వాత చదవండి, అనేకానేక పుణ్యాలు, లాభాలు పొందండి

ఈ వీడియో లో చెప్పబడిన దుఆలు ఇక్కడ నేర్చుకోవచ్చు: అజాన్ తర్వాత చేయు దుఆలు 

ఈ ప్రసంగంలో అజాన్ తర్వాత పఠించవలసిన రెండు ముఖ్యమైన దువాల గురించి వివరించబడింది. మొదటి దువా సహీహ్ ముస్లిం నుండి ఉల్లేఖించబడింది, దీనిని పఠించడం ద్వారా గత పాపాలు క్షమించబడతాయి. రెండవ దువా సహీహ్ బుఖారీ నుండి తీసుకోబడింది, దీనిని పఠించిన వారికి ప్రళయ దినాన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సిఫారసు లభిస్తుంది. ఈ రెండు దువాల యొక్క ప్రాముఖ్యత మరియు వాటి ద్వారా లభించే గొప్ప ప్రయోజనాలను వక్త నొక్కి చెప్పారు.

మహాశయులారా, ఇప్పుడు మనం అజాన్ తర్వాత రెండు రకాల దువాలు మనకు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పారు. ప్రతీ ఒక్క దువాలో మన గురించి ఎంతో గొప్ప లాభం ఉంది.

మొదటి హదీస్ సహీహ్ ముస్లిం లోనిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ఎవరైతే అజాన్ విన్న తర్వాత, అజాన్ కు సమాధానం చెబుతూ అజాన్ పూర్తిగా విన్న తర్వాత

أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ، وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، رَضِيتُ بِاللهِ رَبًّا، وَبِمُحَمَّدٍ رَسُولًا، وَبِالْإِسْلَامِ دِينًا

(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వహ్ దహూ లా షరీక లహూ, వ అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, రదీతు బిల్లాహి రబ్బన్, వబి ముహమ్మదిన్ రసూలన్, వబిల్ ఇస్లామి దీనా)

“అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్య దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఏకైక దేవుడు, ఆయనకు భాగస్వాములు లేరు మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. నేను అల్లాహ్ ను ప్రభువుగా, ముహమ్మద్ ను ప్రవక్తగా మరియు ఇస్లాంను నా ధర్మంగా స్వీకరించాను.”

అని చదువుతారో,

غُفِرَ لَهُ ذَنْبُهُ
(గుఫిర లహూ దన్బుహూ)

వారి యొక్క పాపాలు క్షమించబడతాయి, మన్నించబడతాయి అని శుభవార్త ఇవ్వడం జరిగింది.

ఇది ఒక దువా. మరోసారి విని మీరు దీన్ని జ్ఞాపకం ఉంచుకునే ప్రయత్నం చేయండి. సామాన్యంగా మనం దీనిలో సగ భాగం అంతకంటే ఎక్కువగా నేర్చుకునే ఉంటాము ఇంతకుముందు.

ఇక రెండవ దువా, సహీహ్ బుఖారీలోని పదాలు ఈ విధంగా ఉన్నాయి. జాబిర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే అజాన్ విన్న తర్వాత ఈ దువా చదువుతారో, ప్రళయ దినాన వారికి నా సిఫారసు తప్పకుండా లభిస్తుంది. అల్లాహు అక్బర్! ఎంత గొప్ప అదృష్టమో గమనించండి. ప్రళయ దినాన ప్రవక్తలు సిఫారసు చేయాలి అని మనం తహతహలాడుతూ ఉంటాము. ఆ రోజు మనకు ఈ సిఫారసు పొందడానికి ఈ రోజు ఐదు పూటల నమాజులు చేయాలి. అజాన్ విన్నప్పుడు, అజాన్ అయిన తర్వాత దువా మనం చదవాలి.

اللَّهُمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ، وَالصَّلَاةِ الْقَائِمَةِ، آتِ مُحَمَّدًا الْوَسِيلَةَ وَالْفَضِيلَةَ، وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي وَعَدْتَهُ

(అల్లాహుమ్మ రబ్బ హాదిహి ద్దావతి త్తామ్మ, వస్సలాతిల్ ఖాయిమ, ఆతి ముహమ్మదన్ అల్ వసీలత వల్ ఫదీల, వబ్ అత్ హు మఖామమ్ మహ్మూదన్ అల్లదీ వ అత్తహ్)

“ఓ అల్లాహ్! ఈ సంపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడిన నమాజుకు ప్రభువా! ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మధ్యవర్తిత్వం మరియు శ్రేష్టతను ప్రసాదించు. మరియు నీవు వాగ్దానం చేసిన ప్రశంసనీయమైన ఉన్నత స్థానానికి ఆయనను చేర్చు.”

అల్లాహ్ త’ఆలా ఈ దువాలను ప్రతీ అజాన్ తర్వాత చదువుతూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక. వీటి యొక్క బరకత్ లో, శుభంలో అల్లాహ్ మన పాపాలను మన్నించి ప్రళయ దినాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు మనకు ప్రాప్తి చేయుగాక.

ఈ పోస్ట్ లింక్: https://teluguislam.net/?p=5568