విత్ర్ నమాజు ఘనత, రకాతుల సంఖ్య Witr Namazu Ghanata, Rakatul sankhya أهمية صلاة الوتر
[వ్యవధి: 6:04 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
విత్ర్ నమాజ్:
అలాగే ముస్లిం విత్ర్ నమాజును పాటించుట ధర్మం. ఇది కూడా సున్నతె ముఅక్కద. దీని సమయం ఇషా తరువాత నుండి ఉషోదయం వరకు ఉంటుంది. అయితే రాత్రి చివరి ఘడియలో మేల్కొనగల వారికి ఆ సమయమే ఉత్తమం.
ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాల్లో ఎలాంటి సాంప్రదాయమంటే; ప్రవక్త మహా నీయులు ఎప్పుడూ విడనాడ లేదు. ప్రయాణంలో ఉన్నా, లేదా స్థానికంగా ఉన్నా తప్పకుండా చేసేవారు.
కనిష్ట సంఖ్య ఒక్క రకాతు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రుల్లో పదకుండు రకాతులు చేసేవారు. ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖనంలో ఉంది:
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి పూట 11 రకాతులు చేసేవారు, అందులో ఒక రకాతు విత్ర్ చేసేవారు. (ముస్లిం 736).
రాత్రి నమాజు రెండేసి రకాతులు.
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రాత్రి నమాజ గురించి ప్రశ్నించాడు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
“రాత్రి వేళ నఫిల్ నమాజు రెండేసి రకాతుల చొప్పున చేయాలి. ఇక ఉషోదయం కావస్తోందని భావించినప్పుడు ఒక రకాతు చేయి. దీనివల్ల మొత్తం నమాజు విత్ర్ (బేసి సంఖ్య నమాజ్) అయిపోతుంది”.
(బుఖారి 991, ముస్లిం 749).
విత్ర్ లో దుఆయె ఖునూత్ చేయడం మంచిది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హసన్ బిన్ అలీ (రజియల్లాహు అన్హు) గారికి విత్ర్ లో చదివే దుఆ నేర్పారు. కాని ఎల్లప్పుడు చేయకూడదు. ఎందుకనగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి విత్ర్ నమాజు విధానం గురించి ఉల్లేఖించిన సహచరులు ఖునూత్ గురించి చెప్పలేదు.
రాత్రి నమాజు చేయలేకపోయినవారు మరుసటి రోజు రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండు ఇష్టమున్నన్ని రకాతులు చేయుట మంచిది. ఎప్పుడైనా రాత్రి నమాజు తప్పి పోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే చేసేవారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఫజ్ర్ కు ముందు సున్నతుల ఘనత Fajr ku mundu Sunnatul Ghanata فضل ركعتي الفحر (تلغو Telugu)
[వ్యవధి: 3:22 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఫజ్ర్ సున్నతులు:
ప్రవక్త ﷺ పాబందీగా పాటించే సున్నతుల్లో ఫజ్ర్ సున్నతులు కూడా, వాటిని ఆయన ప్రయాణంలో ఉన్నా, స్థానికంగా ఉన్నా విడనాడకపోయేవారు. ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం:
“ఆ రెండు రకాతులు నాకు ప్రపంచం మరియు, అందులో ఉన్న వాటికన్నా చాలా ప్రియమైనవి”. (ముస్లిం 725).
మొదటి రకాతులో (సూర ఫాతిహా తర్వాత) సూర కాఫిరూన్ మరియు రెండవ రకాతులో (సూర ఫాతిహ తర్వాత) సూర ఇఖ్లాస్ చదువుట ధర్మం. ఒక్కోసారి మొదటి రకాతులో “ఖూలూ ఆమన్నా బిల్లాహి వమా ఉంజిల ఇలైనా….” (అల్ బఖర 2: 136) ఆయతులు మరియు రెండవ రకాతులో “ఖుల్ యా అహ్లల్ కితాబి తఆలౌ ఇలా కలిమతిన్ సవాఇమ్ బైననా వ బైనకుమ్….” (ఆలె ఇమ్రాన్ 3: 64) ఆయతులు పఠించుట మంచిది.
ప్రవక్తను అనుసరిస్తూ వాటిని సంక్షిప్తంగా చేయాలి.
ఫర్జ్ నమాజుకు ముందు వాటిని చేయలేకపోయిన వ్యక్తి నమాజు తర్వాత కూడా చేయవచ్చును. అయితే సూర్యోదయం తర్వాత సూర్యుడు బల్లెమంత పైకి వచ్చాక చేయడం మరీ ఉత్తమం. దీని సమయం పగటిలి పొద్దు వాలేకి ముందు వరకు ఉంటుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
సున్నతె ముఅక్కద:
స్థానికులైన ప్రతి ముస్లిం స్త్రీ పురుషులు పన్నెండు రకాతులు పాటించడం ఎంతో పుణ్యకార్యం. అవి జొహ్ర్ కు ముందు 4, దాని తరువాత 2, మగ్రిబ్ తరువాత 2, ఇషా తరువాత 2, ఫజ్ర్ కు ముందు 2 రకాతులు. స్వయంగా ప్రవక్తసల్లల్లాహు అలైహి వసల్లం ఈ సున్నతులు పాటించేవారు. ఇంకా ఆయన ఇలా శుభవార్త ఇచ్చారని ఉమ్మె హబీబ రజియల్లాహు అన్హా తెలిపారుః
“ఏ ముస్లిం భక్తుడు రాత్రి పగల్లో ఫర్జ్ కాకుండా పన్నెండు రకాతుల అదనపు (నఫిల్) నమాజు చేస్తూ ఉంటాడో అతనికి వాటికి బదులుగా అల్లాహ్ ఒక గృహము స్వర్గంలో నిర్మిస్తాడు, లేదా ఒక గృహం స్వర్గంలో నిర్మించచబడును“. (ముస్లిం 728).
సున్నతె ముఅక్కద మరియు సాధరణంగా నఫిల్ నమాజులన్నియూ ఇంట్లో చేయడం చాలా ఉత్తమం. ప్రవక్త ﷺ ప్రబోధించారని, జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
“మీలోనెవరైనా మస్జిదులో (ఫర్జ్) నమాజు నెరవేర్చుకున్నాక, తన ఇంటి కొరకు కూడా (సున్నతులు, నఫిల్ల లాంటి) నమాజుల యొక్క కొంత భాగాన్ని మిగిలించుకోవాలి. అల్లాహ్ అతని నమాజుకు బదులుగా అతని ఇంట్లో మేలే చేకూర్చుతాడు”. (ముస్లిం 778).
జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
493. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కధనం :-
శుక్రవారం రోజు ఎవరు జనాబత్ గుస్ల్ (పూర్తి స్థాయి స్నానం) చేసి (పెందలాడే) జుమా నమాజు చేయడానికి వెళ్తాడో, అతను ఒక ఒంటెను బలి ఇచ్చిన వాడవుతాడు. (తర్వాత) రెండవ వేళలో ఇలా వెళ్ళిన వ్యక్తికి ఒక ఆవును బలి ఇచ్చిన పుణ్యం లభిస్తుంది. మూడవ వేళలో వెళ్ళే వాడికి ఒక పోట్టేలును బలిచ్చిన పుణ్యం, నాల్గవ వేళలో వెళ్ళే వాడికి ఒక కోడిని బలిచ్చిన పుణ్యం లభిస్తుంది. అయిదవ వేళలో వెళ్ళేవాడు దైవమార్గంలో ఒక కోడిగ్రుడ్డును దానం చేసిన వాడవుతాడు. ఆ తరువాత ఇమామ్ మస్జిదులో ప్రవేశించగానే దైవదూతలు కూడా అతని ప్రసంగం వినడానికి వస్తారు. (ఆ తరువాత వచ్చే వారికి దైవదూతలు హాజరు వేయరు).
[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 4 వ అధ్యాయం -ఫజ్లిల్ జూముఆ]
జుమా ప్రకరణం – 2 వ అధ్యాయం – శుక్రవారం రోజు సువాసనలు పూసుకోవడం, మిస్వాక్ చేయటం మంచిది.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
ఇతరములు:
జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
أَسْتَغْفِرُ الله أَسْتَغْفِرُ الله أَسْتَغْفِرُ الله. اَللهُمَّ أَنْتَ السَّلامُ ومِنْكَ السَّلامُ تَبَارَكْتَ يَا ذَا الجَلالِ وَ الإكْرَام.
అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుచున్నాను, అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుచున్నాను, అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుచున్నాను. ఓ అల్లాహ్ నీవు ఏలాంటి లోపాలు లేనివాడవు. నీవే రక్షణ నొసంగువాడవు. ఓ ఘనుడవు, పరమదాతయువు నీవు శుభములు గలవాడవు.
లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅతైత వలా ముఅతియ లిమా మనఅత వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్ కల్ జద్ద్. (బుఖారీ 844, ముస్లం 593).
అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన అద్వితీయుడు. ఆయనకు భాగస్వామి ఎవడూ లేడు. ఆయనకే అధికారము చెల్లును. ఆయనకే సర్వ స్తోత్రములు గలవు. ఆయనే సర్వశక్తుడు. ఓ అల్లాహ్ నీవు నొసంగిన వరాలను ఎవడు అడ్డగింపజాలడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వజాలడు. ధనికుడు తన ధనముతో నీ శిక్షల నుండి తప్పించుకు- పోజాలడు.
అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన అద్వితీయుడు. ఆయనకు భాగస్వామి ఎవడూ లేడు. ఆయనకే అధికారము చెల్లును. ఆయనకే సర్వ స్తోత్రములు గలవు. ఆయనే సర్వశక్తుడు. పాపాములను వదులుకొనుట మరియు పుణ్యాలు చేయుట అల్లాహ్ దయవలననే కలుగును. అల్లాహ్ దప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన్నే మేము ఆరాధించుచున్నాము. ఆయనే సర్వ అనుగ్రహాలు దయ చేయువాడు. ఆయనకే ఘనత, మంచి స్తోత్రములు గలవు. అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. చిత్తశుద్ధితో మేము ఆయన్నే ఆరాధించుచున్నాము. ఈ విషయము సత్య తిరస్కారులకు నచ్చకున్నా సరే. (ముస్లిం 591, 593, 594, బుఖారి 844).
తరువాత సుబ్ హానల్లాహ్ 33, అల్ హందులిల్లాహ్ 33, అల్లాహు అక్బర్ 33 సార్లు చదివి, లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ తో 100 పూర్తి చేయాలి. (ముస్లిం 597).
జమాతుతో ఒకటి లేదా ఎక్కువ రకాతులు తప్పిపోయిన వ్యక్తిని మస్బాఖ్ అంటారు.
ఇమాం రెండవ సలాం త్రిప్పిన తర్వాత ఈ వ్యక్తి సలాం త్రిప్పకుండా తప్పిపోయిన రకాతులు వెరవేర్చాలి.
అతను ఇమాంతో ఏ రకాతులో కలిసాడో అదే అతనిది మొదటి రకాతు.
ఇమాంను రుకూ స్థితిలో పొందినవాని ఆ రకాతు అయినట్లే. ఇమాంను రుకూలో పొందకుంటే ఆ రకాత్ తప్పిపోయినట్లే లెక్క.
జమాతు నిలబడిన తర్వాత వచ్చేవారు జమాతును ఏ స్థితిలో చూసినా అదే స్థితిలో కలవాలి. వారు రుకూ, లేదా సజ్దా ఇంకే స్థితిలో ఉన్నా సరే. వారు మరో రకాతు కొరకు నిలబడే వరకు నిరీక్షించవద్దు.
నిలబడి తక్బీరె తహ్రీమ అల్లాహు అక్బర్ అనాలి. రోగి లాంటి ఏదైనా ఆటంకం ఉన్నవారు కూర్చుండి అల్లాహు అక్బర్ అంటే ఏమీ తప్పు లేదు.
నమాజును భంగపరుచు కార్యాలు:
1- తెలిసి, కావాలని మాట్లడడం, అది కొంచమైనా సరే.
2- పూర్తి శరీరముతో ఖిబ్లా దిశ నుండి పక్కకు మరలడం.
3- వుజూను భంగపరిచే కారణాల్లో ఏ ఒకటైనా సంభవించడం.
4- అనవసరంగా ఎడతెగకుండా ఎక్కువ చలనము చేయడం.
5- కొంచం నవ్వినా నమాజు వ్యర్థమవుతుంది.
6- తెలిసి కూడా ఎక్కువ రుకూ, సజ్దాలు, ఖియాం, జుల్సాలు చేయడం.
7- తెలిసి కూడా (రుకూ, సజ్దా వగైరా) ఇమాంకు ముందు చేయడం.
నమాజులు చేయరాని వేళలు:
కొన్ని సమయాల్లో నమాజు చేయుట యోగ్యం లేదు. అవి:
1- ఫజ్ర్ నమాజు తర్వాత నుండి సూర్యోదయం తర్వాత సూర్యుడు బారెడంత పైకి వచ్చే వరకు.
2- మిట్ట మధ్యానం, సూర్యుడు నడి ఆకాశంలో, తలకు సమానంగా ఉన్నప్పుడు. అది పశ్చిమాన వాలే వరకు.
3- అస్ర్ నమాజు తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు.
కాని ఈ సందర్భాల్లో కొన్ని నమాజులు చేయవచ్చు. ఉదాః తహియ్యతుల్ మస్జిద్ (మస్జిదులో ప్రవేశించిన వెంటనే చేయు నమాజ్). జనాజా నమాజ్. సూర్య గ్రహణ నమాజ్. తవాఫ్ సున్నతులు. తహియ్యతుల్ వుజూ లాంటివి.
అలాగే తప్పిపోయిన నమాజులు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసు ఆధారంగా:
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
دروس الصلاة -2- صفة الصلاة
నమాజ్ పాఠాలు: 2 వ పాఠం: నమాజు విధానం
వ్యవధి: 15 నిముషాలు
11:21 నిమిషాలు నమాజు విధానం తెలుపడం జరిగింది. తర్వాత 3:36 నిమిషాలు నమాజు చేసి చూపించడం జరిగింది. శ్రద్ధగా విని, చూసి నమాజు విధానం నేర్చుకోండి ఎక్కడ ఏ దుఆ చదవాలో కూడా నేర్చుకోండి
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
నమాజ్ చేస్తున్నప్పుడు నియ్యత్ తప్పనిసరి, అలాగే ప్రతి ఆరాధనలో కూడా. అయితే నియ్యత్ మనుస్సులో చేయాలి. నోటితో కాదు.
1- పూర్తి శరీరము మరియు పూర్తి శ్రద్ధాభక్తులతో ఖిబ్లా దిశలో నిలబడాలి. చూపులు, శరీరము అటూ ఇటూ ఉండకూడదు. (చూపులు సజ్దా చేసే చోట కేంద్రికరించాలి).
2- ‘తక్బీరె తహ్రీమ’ అల్లాహు అక్బర్ అంటూ రెండు చేతులు భుజాల వరకు లేదా చెవుల వరకు ఎత్తాలి.
3- కుడి అర చెయ్యిని ఎడమ అర చెయ్యిపై పెట్టి ఛాతిపై కట్టుకోవాలి.
4- దుఆయె ఇస్తిఫ్ తాహ్ చదవాలి:
అల్ హందులిల్లాహి హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్. (ముస్లిం 600).
(ఓ అల్లాహ్ నీవు పరమ పవిత్రునివి, నీకే సర్వ స్తోత్రములు, నీ నామము శుభం గలది. నీ మహిమ చాలా ఘనమయినది. నీవు తప్ప సత్య ఆరాధ్యుడెవడూ లేడు.)
ఇవి రెండే గాకుండా ఇతర దుఆలు కూడా చదవవచ్చును. ఎల్లప్పుడూ ఒకే దుఆ కాకుండా వేరు వేరు సమయాల్లో వేరు వేరు దుఆలు చదవడం ఉత్తమం. ఇలా నమాజులో నమ్రత, శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది.
(అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో * ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు, * అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు. * ప్రతిఫల దినానికి (అంటే ప్రళయ దినానికి) యజమాని. * మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము. * మాకు రుజుమార్గం (సన్మార్గం) చూపించు. * నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోనుకాని వారి మార్గం).
7- కంఠస్తం చేసి ఉన్న ఖుర్ఆనులోని ఏదైనా సూరా లేదా కొన్ని ఆయతులు పఠించాలి.
8- చేతులు భుజాల వరకు ఎత్తి, అల్లాహు అక్బర్ అంటూ రుకూ చేయాలి. రుకూలో అరచేతులతో మోకాళ్ళను పట్టుకోవాలి. వ్రేళ్ళు దగ్గరదగ్గరగా కాకుండా విడిగా ఉండాలి. సుబ్ హాన రబ్బియల్ అజీం మూడు సార్లు చదువుట సున్నత్. అంతకంటే ఎక్కువ చదవవచ్చు. ఒక్కసారి చదివినా సరిపోవును.
9- ఒంటరి నమాజు చేయు వ్యక్తి మరియు ఇమాం రుకూ నుండి తల లేపుతూ సమిఅల్లాహు లిమన్ హమిద అంటూ భుజాల వరకు చేతులెత్తాలి. నిలబడిన తర్వాత ముఖ్తదీ, ఒంటరి వ్యక్తి సమిఅల్లాహు లిమన్ హమిదహ్ కు బదులుగా రబ్బనా వలకల్ హమ్ ద్ అనాలి.
10- రుకూ తర్వాత నిలబడి ఉన్నప్పుడు ఈ దుఆ కూడా చదవవచ్చును:
అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్ దు మిల్ఉస్ సమావాతి వ మిల్ఉల్ అర్జి వ మిల్ఉ మాషిఅత మిన్ షైఇమ్ బఅదు.
(ఓ అల్లాహ్, మా ప్రభువా! నీకే ఆకాశముల నిండుగాను, భూమి నిండుగాను, అవి గాకా నీవు కోరిన వస్తువుల నిండుగాను స్తుతి గలదు. (ముస్లిం 476).)
11- అల్లాహు అక్బర్ అంటూ మొదటి సజ్దాలో వెళ్ళాలి. ఏడు అంగములపై సజ్దా చేయాలిః (1) నొసటి, ముక్కు. (2,3) రెండు అరచేతులు. (4,5) రెండు మోకాళ్ళు. (6,7) రెండు పాదముల వ్రేళ్ళు. చేతులను పక్కల నుండి దూరముంచాలి. కాళ్ళ వ్రేళ్ళను ఖిబ్లా దిశలో ఉంచి, సజ్దాలో సుబ్ హాన రబ్బియల్ అఅలా మూడు సార్లు పలుకుట సున్నత్. ఎక్కువ పలుకుట మంచిదే. ఒక్క సారి చదివినా సరిపోతుంది. ఈ స్థితిలో ఎక్కువ దుఆ చేయాలి. ఎందుకనగా ఇది దుఆ అంగీకార స్థితుల్లో ఒకటి.
12- అల్లాహు అక్బర్ అంటూ సజ్దా నుండి తలెత్తి ఎడమ పాదముపై కూర్చోవాలి. కుడి కాలు పాదమును నిలబెట్టాలి. కుడి చెయ్యి కుడి మోకాలుకు దగ్గరగా తోడపై, ఎడమ చెయ్యి ఎడమ మోకాలుకు దగ్గరగా తోడపై పెట్టాలి. చేతి వ్రేళ్ళను విడిగా పరచి ఉంచాలి. రబ్బిగ్ ఫిర్లీ రబ్బిగ్ ఫిర్లీ అని చదవాలి.
13- రెండవ సజ్దా మొదటి సజ్దా మాదిరిగా చేసి, సజ్దాలో అదే దుఆ చదవాలి.
14- అల్లాహు అక్బర్ అంటూ రెండవ సజ్దా నుండి లేస్తూ నిటారుగా నిలబడాలి.
15- రెండవ రకాత్ మొదటి రకాత్ మాదిరిగా చేయాలి. అందులో చదివిన దుఆలే ఇందులో చదవాలి. దుఆయె ఇస్తిఫ్ తాహ్ మరియు అఊజు బిల్లాహి…. తప్ప. ఈ రెండవ రకాత్ లోని రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అంటూ లేచి రెండు సజ్దాల మధ్యలో కూర్చున్న విధంగా కూర్చోని, కుడి చెయి వ్రేళ్ళను ముడుచుకొని నడిమి వ్రేళిని బొటన వ్రేళి మధ్యలో పెట్టి, చూపుడు వ్రేళితో సైగా చేస్తూ, కదలిస్తూ తషహ్హుద్ చదవాలి:
(నా వాక్కు, దేహా, ధన సంబంధమైన ఆరాధనలన్నియూ అల్లాహ్ కొరకే ఉన్నవి. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆయన శుభాలు కురువుగాకా. అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవరడూ లేడని సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు, ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను).
ఇక్కడి వరకు చదివిన తరువాత, చేతులు భుజాల వరకు ఎత్తుతూ అల్లాహు అక్బర్ అంటూ నిలబడాలి, ఒక వేళ మగ్రిబ్ లాంటి మూడు రకాతుల నమాజు లేదా జొహ్ర్, అస్ర్ మరియు ఇషా లాంటి నాలుగు రకాతుల నమాజు చేస్తుంటే, రెండవ రకాతు మాదిరిగా మిగిత నమాజు పూర్తి చేయాలి. అయితే ఖియామ్ (నిలబడి ఉన్న స్థితి)లో కేవలం సూరె ఫాతిహ చదువుతే సరిపోతుంది.
చివరి రకాతు రెండవ సజ్దా నుండి లేచి కూర్చోని తషహ్హుద్, దరూద్ ఇబ్రాహీమ్ మరియు ప్రవక్త నేర్పిన తనికిష్టమైన దుఆలు అధికంగా చదవడం మంచిది. (ఇది కూడా దుఆ అంగీకార సందర్భాల్లో ఒకటి). క్రింద దరూద్ మరియు ఒక దుఆ ఇవ్వబడుతుంది.
(ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీంను, వారి కుటుంబీకులను కరుణించినట్లు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు వారి కుటుంబీకులను కరుణించు. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి, ఘనుడివి. ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేసినట్లు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), వారి కుటుంబీకులకు శుభాలు దయ చేయుము. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి, ఘనుడివి. ఓ అల్లాహ్ నేను సమాధి శిక్షల నుండి, నరక యాతన నుండి, జీవన్మరణ పరీక్షల నుండి మరియు దజ్జాల్ మాయ నుండి రక్షణకై నీ శరణు కోరుతున్నాను).
16- అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అంటూ కుడి వైపున మెడ త్రిప్పాలి. అలాగే అంటూ ఎడమ వైపున మెడ త్రిప్పాలి.
17- జొహ్ర్, అస్ర్, మగ్రిబ్, ఇషా నమాజుల్లోని చివరి తషహ్హుద్ లో కూర్చుండే పద్ధతి ఇలా ఉండాలి. కుడి పాదాన్ని నిలబెట్టి ఎడమ పాదాన్ని కుడి కాలి పిక్క క్రింది నుంచి బైటికి తీయాలి. ఎడమ పిరుదును భూమిపై ఆనించాలి. కుడి చెయ్యి కుడి తోడపై, ఎడమ చెయ్యి ఎడమ తోడపై మోకాలుకు దగ్గరగా పెట్టాలి.
వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అబూ బక్రా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో ఉండగా సూర్యగ్రహణం అయ్యింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ దుప్పటిని ఈడ్చుకుంటూ మస్జిద్ లోకి ప్రవేశించారు. మేము కూడా ప్రవేశించాము. అప్పుడు రెండు రకాతుల నమాజ్ చేయించారు. ఆ సమయానికి సూర్యుడు గ్రహణం విడిచాడు. ఆ తరువాత (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగిస్తూ ఇలా) చెప్పారు: “ఏ ఒకరి చావు కారణంగా సూర్య చంద్ర గ్రహణాలు సంభవించవు. మీరొక వేళ సూర్యచంద్ర గ్రహణాలు చూస్తే అది విడే వరకు నమాజ్ చదవండి. అల్లాహ్ ను వేడుకోండి”. (బుఖారి 1040).
ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో సూర్య గ్రహణం సంభవిస్తే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు నమాజ్ చేయించారు. నమాజులో చాలా దీర్ఘంగా ఖియాం చేసారు (నిలబడ్డారు). రుకూ కూడా సుదీర్ఘంగా చేసారు. మళ్ళీ ఎక్కువ సేపు ఖియాం చేశారు. అయితే మొదటిసారి కన్నా ఈ సారి కొంచెం తక్కువ సేపు ఖియాం చేశారు. అలాగే తిరిగి రుకూ చేశారు. అయితే మొదటి రకూ కన్నా కొంచెం తక్కువ సేపు చేశారు. ఆ తరువాత సుదీర్ఘంగా సజ్దా చేశారు. ఆదే విధంగా ఆయన రెండవ రకాతులో కూడా చేశారు. (ఇలా నమాజ్ పూర్తి చేసి) ప్రజల వైపు తిరిగారు. ఆ సమయానికి సూర్యుడు గ్రహణం పూర్తిగా వీడాడు. ఆ తరువాత ఖుత్బా ఇచ్చారు. అందులో ఆయన అల్లాహ్ స్తోత్రం తరువాత ఇలా అన్నారు: “సూర్యచంద్రులు, రెండూ అల్లాహ్ (ఔన్నత్యానికి) నిదర్శనాలు. ఎవరో చనిపోవడం వల్లనో, లేక పుట్టడం వల్లనో సూర్యచంద్ర గ్రహణాలు సంభవించవు. సూర్యగ్రహణం గాని, చంద్ర గ్రహణం గాని సంభవిస్తే మీరు అల్లాహ్ ను ప్రార్థించండి. అల్లాహ్ మహిమ, ఔన్నత్యాలను కీర్తించండి. నమాజు చదవండి. దానధర్మాలు చేయండి”. ముహమ్మద్ అనుచరుల్లారా! అల్లాహ్ సాక్షిగా! అల్లాహ్ దాసుడు లేక దాసి ఎవరైనా వ్యభిచారానికి పాల్పడటం జరిగితే, వారి సిగ్గుమాలిన పని పట్ల అందరికన్నా ఎక్కువ పౌరుషం అల్లాహ్ కే వస్తుంది. ముహమ్మద్ అనుచరుల్లారా! అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. నేను ఎరిగిన విషయాలు మీరు గనక ఎరిగి ఉంటే మీరు తప్పకుండా తక్కువగా నవ్వుతారు. ఎక్కువగా ఏడుస్తారు”. (బుఖారి 1044, ముస్లిం 901).
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒకసారి సూర్యగ్రహణం పట్టితే “అస్సలాతు జామిఅ” అని ప్రజలను పిలవడం జరిగింది. (బుఖారి 1045, ముస్లిం 2942).
విశేషాలు:
1- సూర్యచంద్ర గ్రహణాలు సంభవిస్తే “అస్సలాతు జామిఅ” అని పిలుపు ఇవ్వాలి.
2- అందరూ కలసి, జమాఅతుతో దీర్ఘమైన నమాజ్ చేయాలి.
3- ప్రతి రకాతులో రెండు ఖియాంలు మరియు రెండు రుకూలు చేయాలి.
4- నమాజ్ తరువాత ఇమాం ప్రసంగించాలి, బోధచేయాలి.
5- సత్కార్యాలు చేయమని ప్రజలను ప్రోత్సహించాలి.
6- దుష్కార్యాల నుండి దూరముండడని హెచ్చరించాలి
7- అల్లాహ్ యొక్క జిక్ర్, స్మరణలు అధికంగా చేయమనాలి.
8- దానధర్మాలు అధికంగా చేయండని చెప్పాలి.
9- నవ్వులాట, వినోదంలో కాకుండా పరలోక చింతలో సమయం గడపాలి.
10- అధికంగా పాపాల మన్నింపుకై క్షమాభిక్ష కోరాలి (ఇస్తిగ్ఫార్ చేయాలి).
‘దిన చర్యల పాఠాలు‘ అనే పుస్తకం లోని వ్యాసం ఇది.
కూర్పు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్). ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
శుద్ధి & నమాజు అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ ఇక్కడ చదవండి & డౌన్లోడ్ చేసుకోండి [PDF][49 పేజీలు]
‘నజాసత్’ అంటేమిటి? దేనితోనయితే ఒక ముస్లిం దూరంగా ఉండి, అది ఏ చోటనైనా అంటినచో కడుగుట విధిగా ఉందో దానినే ‘నజాసత్’ (అశుధ్ధత) అంటారు. రక్తం లాంటి కనబడే మలినమేదైనా శరీరానికి లేదా బట్టలకు అంటినచో దానిని కడుగుట తప్పనిసరి. కడిగిన తర్వాత దాని మర్క కనబడితే, అది తొలగడం కూడా కష్టంగా ఉంటే పాపం లేదు. ఒక వేళ మలినం కానరానిదై ఉంటే దాన్ని ఒక్కసారి కడిగినా సరిపోతుంది.
ఇక నేలపై ఏదైనా మలినం పడిపోతే అక్కడ నీళ్ళు పారబోస్తే అది శుభ్రమవుతుంది. మలినం పలుచగా పారునటువంటిదైతే అది ఎండిపోయిన- చో నేల పరిశుభ్రమవుతుంది. ఒక వేళ పారనిదిగా ఉంటే దాన్ని తీసిపడేసిన తరువాతనే అది శుభ్రమవుతుంది.
పరిశుభ్రత కొరకు మరియు అశుద్ధతను దూరము చేయుటకు నీళ్ళు ఉపయోగించబడ- తాయి. అవి వర్షపు మరియు సముద్రపు నీళ్ళు లాంటివి వగైరా. అలాగే ఎవరైనా ఉపయోగించిన తరువాత మిగిలిన నీళ్ళు ఉపయోగించవచ్చును. ఇంకా శుభ్రమైన ఏదైనా వస్తువు నీళ్ళలో కలిసి అందులో ఏలాంటి మార్పు రాకుండా దాని అసలు రూపములో ఉండిపోతే అవి కూడా ఉపయోగించవచ్చును. కాని ఏదైనా అపరిశుభ్ర- మైన వస్తువు అందులో కలుషితమై దాని అసలు రూపములో లేనిచో అవి ఉపయోగించకూడదు. అపరిశుభ్రమైన వస్తువు ఏదైనా కలుషితమై నీళ్ళ రంగు, రుచి, వాసనలో మార్పు వస్తే అవి ఉపయోగించరాదు. మార్పు రాని యెడల అవి ఉపయోగించవచ్చును.
అలాగే మనుషులు త్రాగిన తర్వాత మిగిలిన నీళ్ళు శుభ్రత పొందుటకు, వజూ చేయుటకు ఉపయోగించవచ్చును. కాని కుక్క లేక పంది ఎంగిలి చేసిన నీళ్ళు వాడరాదు. అవి అశుద్ధం.
‘నజాసత్’ రకాలు
(1,2) మలమూత్రం.
(3) ‘వదీ’: అది తెల్లటి చిక్కని ద్రవ పదార్థం. అది మూత్రము తరువాత వెలువడుతుంది.
(4) ‘మజి’: అది తెల్లటి జిగటగల పదార్థం. అది భార్యభర్తల సరసాలాడడముతో, లేదా మనిషి కామాలోచనలో పడినప్పుడు వెల్తుంది.
*’మనీ’ (ఇంద్రియం, వీర్యం) శుభ్రమైనదే. అయినా అది పచ్చిగా ఉన్నప్పుడు కడుగుట, ఎండిపోయినప్పుడు నలుచుట అభిలషణీయం.
(5) తినుట యోగ్యం కాని జంతువుల మలమూత్రం అపరిశుభ్రం. తినుట యోగ్యమైన జంతువుల మలమూత్రం అపరిశుభ్రం కాదు.
పైన చెప్పబడిన మలినాలు శరీరానికి, లేదా దుస్తులకు అంటినచో వాటిని తీసేసి కడగాలి. అయితే కేవలం ‘మజి’ విషయంలో ఓ రాయితీ ఏమిటంటే: అది అంటిన చోట కడగకుండా నీళ్ళు చల్లినా సరిపోవును. *’మనీ’ కామంతో వెళ్ళినచో స్నానం చేయుట విధియగును.
(6) బహిష్టు మరియు బాలింత రక్తస్రావం.
‘నజాసత్’ ఆదేశాలు
1- మనిషికి ఏదో ఒక పదార్థం అంటింది, కాని అది నజాసతేనా కాదా అనే నిర్థారణ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, దాని గురించి పరిశోధన చేసే అక్కర లేదు. అలాగే దాన్ని కడిగే అవసరం కూడా లేదు.
2- ఒక మనిషి నమాజ్ చేసిన తరువాత శరీరం లేదా తన దుస్తుల్లో నజాసత్ చూశాడు. దాని గురించి నమాజ్ కు ముందు తెలియదు, లేదా తెలిసు కాని మరచిపోయాడు. అలాంటప్పుడు అతని నమాజ్ అయినట్లే.
3- దుస్తుల్లో నజాసత్ పడిన స్థలం తెలియ కుంటే, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏ స్థలం అన్న అధిక అనుమానం కలుగునో దాన్నే కడగాలి. ఎందుకనగా మలినాన్ని దాని రంగు, రుచి లేదా వాసనతో పసిగట్టవచ్చును.
మలమూత్ర విసర్జన
మలమూత్ర విసర్జన పద్దతులు ఇలా ఉన్నాయి:
1- మరుగుదొడ్డిలో ఎడమ కాలుతో ప్రవేశిస్తూ, ప్రవేశముకు ముందే చదవాలి: బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ ఖుబుసి వల్ ఖబాఇసి
بسم الله اَللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْـخُبُثِ وَالْـخَبَائِثِ
(అల్లాహ్ పేరుతో, ఓ అల్లాహ్ నేను దుష్ట జిన్నాతు స్త్రీ పురుషుల నుండి నీ శరణు జొచ్చుచున్నాను). (బుఖారి 142, ముస్లిం 375).
మరుగుదొడ్డి నుండి కుడి కాలు ముందు వేస్తూ బయటకు వచ్చి చదవాలిః గుఫ్రానకغُفْرَانَكَ
నీ మన్నింపుకై అర్థిస్తున్నాను. (తిర్మిజి 7).
2- అల్లాహ్ పేరుగల ఏ వస్తువూ మరుగుదొడ్డిలోకి తీసుకెళ్ళకూడదు. కాని దాన్ని తీసి పెట్టడంలో ఏదైనా నష్టం ఉంటే వెంట తీసుకెళ్ళవచ్చును.
3- ఎడారి ప్రదేశంలో కాలకృత్యాలు తీర్చుకునే- టప్పుడు ఖిబ్లా వైపున ముఖము, వీపు గానీ పెట్టి కూర్చోకూడదు. నాలుగు గోడల మధ్య కూడా మంచిది కాదు కాని అభ్యంతరము లేదు.
4- సతర్ పరిధిలోకి వచ్చే శరీర భాగాన్ని ప్రజల
చూపులకు మరుగు పరచాలి. ఇందులో ఏ కొంచ మైనా అశ్రద్ధ వహించకూడదు. పురుషుల సతర్ నాభి నుండి మోకాళ్ళ వరకు. స్త్రీ యొక్క పూర్తి శరీరం, నమాజులో కేవలం ముఖము తప్ప. స్త్రీ నమాజులో ఉన్నప్పుడు పరపురుషులు ఎదురౌతే ముఖముపై ముసుగు వేసుకోవాలి.
5- శరీరం లేక దుస్తులపై మలమూత్ర తుంపరులు పడకుండా జాగ్రత్త వహించాలి.
6- మలమూత్ర విసర్జన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. నీళ్ళు లేనప్పుడు నజాసత్ మర్కలను దూరము చేయుటకు రాళ్ళు, కాగితము లాంటివి ఉపయోగించవచ్చును. పరిశుభ్రత కొరకు ఎడమ చెయ్యి మాత్రమే ఉపయోగించాలి.
వుజూ
వుజూ లేని నమాజ్ అంగీకరింపబడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారని, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరు వుజూ చేసినప్పుడు పూర్తి శ్రద్ధతో మంచి విధంగా చేస్తారో అతని శరీరం నుండి అతని పాపాలన్నీ రాలిపోతాయి. చివరికి గోళ్ళ నుండి కూడా వెళ్ళిపోతాయి”.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అల్లాహ్ ఆదేశించిన విధంగా సంపూర్ణంగా వుజూ చేసేవారు, వారి ఫర్జ్ నమాజులు వాటి మధ్య జరిగే పాపాల ప్రక్షా- ళనకు కారణభూతమవుతాయి”.(ముస్లిం 231).
వుజూ విధానం
*వుజూలోఒకఅవయవం తర్వాత మరో అవయవం క్రమ ప్రకారంగా మరియు వెంటవెంటనే కడుగుట తప్పనిసరి([1]).
1- వుజూ నియ్యత్ (సంకల్పం) నోటితో పలుకకుండా మనుసులోనే చేయాలి. ఒక పని చేయుటకు మనుసులో నిర్ణయించుకోవడమే ‘నియ్యత్’. మళ్ళీ బిస్మిల్లాహ్ అనాలి. (పేజి 13లో వుజూ చిత్రాలు చూడండి).
2- రెండు అరచేతులను మణికట్ల వరకు మూడు సార్లు కడగాలి. చిత్రం2.
3- మూడు సార్లు నోట్లో నీళ్ళు తీసుకొని పుక్కిలించి, ముక్కులో నీళ్ళు ఎక్కించి శుభ్రం చేయాలి. చిత్రాలు 3, 4.
4- మూడు సార్లు ముఖము కడగాలి. అడ్డంలో కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు. నిలువులో నొసటి పై భాగం నుండి గదువ క్రింది వరకు. చి.5
5- రెండు చేతులు మూడేసి సార్లు కడగాలి. వ్రేలు మొదటి భాగము నుండి మోచేతుల వరకు. ముందు కుడి చెయ్యి, తరువాత ఎడమ చెయ్యి. చి.6
6- ఒక సారి తల ‘మసహ్’ చేయాలి. అంటే రెండు చేతులను తడి చేసి తల మొదటి (నుదుటి) భాగము నుండి వెనక మెడ వరకు తీసుకెళ్ళి మళ్ళీ వెనక నుండి మొదటి వరకు తలను స్పర్శిస్తూ తీసుకురావాలి. చూడండి చిత్రం 7 మరియు దాని తర్వాత చిత్రం.
7- ఒక సారి రెండు చెవుల ‘మసహ్’ చేయాలి. అంటే రెండు చూపుడు వ్రేళ్ళతో చెవి లోపలి భాగాన్ని, బొటన వ్రేళ్ళతో పై భాగాన్ని స్పర్శించాలి. చిత్రం 8.
8- రెండు కాళ్ళను వ్రేళ్ళ నుండి చీలమండల వరకు మూడేసి సార్లు కడగాలి. ముందు కుడి కాలు తరువాత ఎడమ కాలు. చిత్రం 9.
9- తర్వాత దుఆ చదవాలిః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా సంపూర్ణంగా వుజూ చేసుకొని ‘అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహ్’ చదువుతారో అతని కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి, ఎందులో నుండి ప్రవేశించ గోరినా అతని ఇష్టం”. (ముస్లిం 234).
(నేను సాక్ష్యమిస్తున్నాను; అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడని, ఆయన ఏకైకుడు భాగస్వామీ లేనివాడని మరియు సాక్ష్యమిస్తున్నాను; ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త).
మేజోళ్ళ పై ‘మసహ్’
ఇస్లాం ధర్మం యొక్క సులువైన, ఉత్తమ విషయం ఒకటిః మేజోళ్ళపై ‘మసహ్’ చేసే అనుమతివ్వడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ‘మసహ్’ చేసేవారని రుజువైనది:
ముగీర బిన్ షొఅబ చెప్పారుః ఒక రాత్రి నేను ప్రవక్తతో ఉండగా, ఆయన ఒక చోట మజిలీ చేసి (ఓ చాటున) కాలకృత్యాలు తీర్చుకొని వచ్చారు, అప్పుడు నా వద్ద ఉన్న చెంబుతో నీళ్ళు పోశాను ఆయన వుజూ చేశారు. చివరిలో తమ మేజోళ్ళపై ‘మసహ్’ చేశారు. (బుఖారి 203, ముస్లిం 274).
వాటి పై ‘మసహ్’ చేయుటకు నిబంధనలు ఏమిటంటే అవి వుజూ చేసిన తర్వాత తొడిగి యుండాలి. పై భాగాన ‘మసహ్’ చేయాలి, క్రింది భాగాన కాదు.
‘మసహ్’ గడువు: స్థానికులు ఒక పగలు ఒక రాత్రి, ప్రయాణికులు (ఏ ప్రయాణంలో నమాజ్ ఖస్ర్ చేయవచ్చునో ఆ ప్రయాణంలో) మూడు రేయింబవళ్ళు మేజోళ్ళపై ‘మసహ్’ చేయవచ్చును. (వుజూ చేసి తొడిగిన తరువాత వుజూ భంగమయిన క్షణం నుంచీ గడువు మొదలవుతుంది).
‘మసహ్’ భంగమయే కారణాలుః గడువు ముగిసిన మరుక్షణం నుంచే ‘మసహ్’ భంగమైపోతుంది. ‘మసహ్’ చేసిన తరువాత కనీసం ఒకసారైనా తీసినట్లయితే ‘మసహ్’ భంగమవుతుంది. లేదా మనిషి (స్వప్నస్ఖలనం లేదా భార్యభర్తల సంభోగం కారణంగా) అశుద్ధతకు లోనైతే ‘మసహ్’ భంగమవుతుంది. స్నానం చేయుటకై అవి తీయడం కూడా తప్పనిసరి.
వుజూను భంగపరిచే విషయాలు
1- మలమూత్రపు దారుల నుండి ఏదీ వెలువడినా సరే అందు వలన వుజూ భంగమవుతుంది. ఉదాః మలము, మూత్రము, అపానవాయువు (పిత్తు), ‘మనీ’, ‘మజీ’, ‘వదీ’ రక్తము. (‘మనీ’ వలన స్నానం చేయడం విధి అవుతుంది).
2- నిద్ర.
3- మర్మాంగ స్థలాన్ని ఏ అడ్డు లేకుండా ముట్టుకోవడం.
4- ఒంటె మాంసం తినడం.
5- స్పృహ తప్పుట వల్ల కూడా వుజూ భంగమవుతుంది.
గుస్ల్ (స్నానం)
శుద్ధి పొందే ఉద్దేశం (నియ్యత్)తో పూర్తి శరీరంపై నీళ్ళు పోసుకొనుటనే గుస్ల్ అంటారు. పూర్తి శరీరం కడగడం, అందులో పుక్కిలించడం మరియు ముక్కులో నీళ్ళు ఎక్కించడం కూడా తప్పనిసరి. అప్పుడే గుస్ల్ అగును. (ప్రవక్త గుస్ల్ పద్థతి ఇదిః ముందు మర్మాంగ భాగాన్ని శుభ్ర- పరుచుకోవాలి. పిదప నమాజుకు చేయునటు- వంటి వుజూ చేయాలి. అరచేతిలో నీళ్ళు తీసుకొని తల మీద పోసి రుద్దాలి. ఇలా మూడు సార్లు చేయాలి. మళ్ళీ పూర్తి శరీరము పై నీళ్ళు పోసుకొని స్నానం చేయాలి).
ఐదు సందర్భాల్లో గుస్ల్ చేయడం విధిగా ఉంది
1- స్త్రీలకు గానీ పురుషులకు గానీ నిద్రలో ఉన్నా లేక మేల్కొని ఉన్నా కామము (షహ్వత్)తో ‘మనీ’ ఉబికిపడితే గుస్ల్ విధి అవుతుంది. కామము లేకుండా ఏదైనా వ్యాది, లేదా విపరీతమైన చలి కారణంగా వెలువడితే గుస్ల్ విధి కాదు. అలాగే స్ఖలనమైనట్లు కలగని ‘మనీ’ లేదా దాని మర్కలేమీ చూడకుంటే గుస్ల్ విధి కాదు. ఎప్పుడు ‘మనీ’ లేక దాని మర్కలు కనబడునో అప్పుడే గుస్ల్ విధి అవుతుంది. స్ఖలమైనట్లు అతనికి గుర్తు లేకున్నా పరవాలేదు.
2- మర్మాంగాల కలయిక. అంటే భర్త మర్మాంగం భార్య మర్మాంగంలో ప్రవేశించినప్పుడు వీర్యం పడకపోయినా స్నానం చేయుట విధియగును.
3- రుతు స్రావం, ప్రసవ స్రావం ముగిసిన తరువాత గుస్ల్ విధియగును.
4- శవానికి గుస్ల్ చేయించడం విధిగా ఉంది.
5- అవిశ్వాసుడు ఇస్లాం స్వీకరించినపుడు.
‘జునుబీ’ పై నిషిద్ధ విషయాలు
(స్వప్నస్ఖలనం వల్ల, లేదా భార్యభర్తల సంభోగం కారణంగా అశుద్ధతకు లోనయిన వ్యక్తిని ‘జునుబీ’ అంటారు).
1- నమాజ్.
2- తవాఫ్.
3- దివ్య ఖుర్ఆనును ముట్టుకోవడం, మెల్లగ, శబ్దముగా, చూసీ, చూడక ఏ స్థితిలోగాని చదవడం నిషిధ్ధం.
4- మస్జిదులో నిలవడం. కాని మస్జిదులో నుండి దాటి పోవడంలో తప్పేమీ లేదు. మస్జిదులో నిలువవలసినప్పుడు వుజూ చేసుకున్నా (మలినం కొంత వరకు తగ్గును, కనుక అది) సరిపోవును.
తయమ్ముమ్
క్రింద తెలుపబడే కారణాలు సంభవించి నప్పుడు ప్రయాణికులు, స్థానికులు ఎవరైనా సరే వుజూ మరియు గుస్ల్ కు బదులుగా తయమ్ముమ్ చేయవచ్చును.
1- అతికష్టంగా వెతికినప్పటికీ నీళ్ళు దొరకనప్పు డు, లేదా ఉండికూడా వుజూకు సరిపడనప్పుడు తయమ్ముమ్ చేయవచ్చును. కొంత దూరములో నీళ్ళు ఉన్నా అక్కడికి వెళ్ళి తీసుకోవడంలో అతనికి ధన, ప్రాణ నష్టమున్నప్పుడు కూడా తయమ్ముమ్ చేయవచ్చును.
2- వుజూ అవయవాల్లో ఏ ఒకదానికైనా గాయమయితే దాన్ని కడిగే ప్రయత్నం చేయాలి. కడగడం వల్ల నష్టం ఉంటే మసహ్ చేయాలి, అంటే చేయి తడి చేసి దాని మీద తుడువాలి. మసహ్ వల్ల కూడా హాని కలిగే భయం ఉంటే తయమ్ముమ్ చేయవచ్చును.
3- నీళ్ళు లేదా వాతవరణం మరీ చల్లగా ఉండి నీళ్ళ ఉపయోగం హానికరంగా ఉంటే తయమ్ముమ్ చేయవచ్చును.
4- నీళ్ళు కేవలం త్రాగడానికి మాత్రమే ఉన్నప్పుడు కూడా తయమ్ముమ్ చేయవచ్చును.
తయమ్ముమ్ విధానం
మనుసులో నియ్యత్ /సంకల్పం చేసుకొని రెండు అరచేతులు ఒక సారి భూమిపై తట్టి ముఖముపై మళ్ళీ మణికట్ల వరకు రెండు చేతులపై మసహ్ చేయాలి. (కొందరు వుజూ చేసినట్లుగా మోచేతుల వరకు, కాళ్ళు సయితం మసహ్ చేస్తారు ఇది ప్రవక్త పద్దతి ఎంతమాత్రం కాదు). వుజూను భంగపరిచే విషయాలే తయ మ్ముమ్ ను భంగపరుస్తాయి. నమాజుకు ముందు లేదా నమాజ్ మధ్యలో నీళ్ళు లభిస్తే తయమ్ముం భంగమవుతుంది. నమాజ్ పూర్తి చేసుకున్న తరువాత నీళ్ళు లభిస్తే ఆ నమాజ్ అయినట్లే. తిరిగి మళ్ళీ చేయవలసిన అవసరం లేదు.
బహిష్టు, బాలింత స్త్రీలు
స్త్రీలు తమ ఋతుస్రావము మరియు బాలింత గడువులో ఉన్నప్పుడు నమాజ్, ఉపవాసాలు పాటించకూడదు. హజ్రత్ ఆయిషా రజియల్లా- హు అన్హా ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః
“నీవు ఋతువు గడువు దినాల్లో నమాజ్ చేయడం మానేయి. ఋతు స్రావం ముగిసాక నీ వొంటి మీది రక్తాన్ని కడిగి (తలంటు స్నానం చేసి) నమాజ్ చేస్తూ ఉండు”. (బుఖారి 331, ముస్లిం 333).
తప్పి పోయిన నమాజులు తిరిగి చేయకూ- డదు. కాని తప్పి పోయిన ఉపవాసాలు మాత్రం పూర్తి చేయాలి. అలాగే వీరు కాబా ప్రదక్షిణం (తవాఫ్) కూడా చేయకూడదు. ఈ గడువులో భర్త తన భార్యతో సంభోగించడం కూడా నిషిధ్ధం. అయితే రమించడం తప్ప పరస్పరం ఏ రకమైన ఆనందం పొందినా తప్పు లేదు. ఈ స్థితిలో స్త్రీ ఖుర్ఆనును తాక వద్దు.
రక్త స్రావం ఆగిన తరవాత స్నానం చేయడం విధిగా ఉంది([2]). స్నానం తర్వాత వారి గడువులో నిశిద్ధంగా ఉన్నవన్నీ ధర్మ సమ్మతం అవుతాయి.
నమాజ్ సమయం ప్రవేశించిన తరువాత, ఆ నమాజ్ చేయక ముందే ఏ స్త్రీకైనా ఋతు స్రావం మొదలవుతే, లేదా ప్రసవిస్తే ఆమె పరిశుద్ధురా- లయిన తరువాత ఆ నమాజును తిరిగి చేయాలి. (ఉదాః జొహ్ర్ నమాజ్ వేళ ఆరంభమయింది పగలు పన్నెండు గంటల నలబై నిమిషాలకు, ఒక స్త్రీ ఒకటింటి వరకు కూడా జొహ్ర్ నమాజ్ చేసుకోలేక పోయింది. అప్పుడే ఋతు స్రావం మొదలయింది, లేదా ప్రసవించింది. అలాంట- ప్పుడు ఆ స్త్రీ పరిశుద్ధురాలయిన తరువాత జొహ్ర్ నమాజ్ చేయాలి). ఒక రకాతు మాత్రమే చేయునంత సమయం ఉన్నప్పుడు పరిశుద్ధుమైన స్త్రీ గుస్ల్ చేసిన తరువాత ఆ నమాజ్ చేసుకోవాలి. ఒక వేళ అది అస్ర్ లేదా ఇషా నమాజ్ అయితే అస్ర్ తో పాటు జొహ్ర్, మగ్రిబ్ తో పాటు ఇషా కూడా చేయుట అభిలషణీయం. ఉదాః సూర్యాస్తమయానికి ఒక రకాత్ చేయునంత ముందు పరిశుద్ధమైతే అస్ర్ నమాజ్ మాత్రం తప్పక చేయాలి. అయితే జొహ్ర్ కూడా ఖజా చేస్తే మంచిది. అర్థ రాత్రికి కొంచెం ముందు పరిశుద్ధురాలయితే ఇషా మాత్రం చేయవలసిందే, అయితే మగ్రిబ్ కూడా చేయడం మంచిది.
నమాజ్ ఆదేశాలు
నమాజ్ ఇస్లాం మూల స్థంబాలలో రెండవది. అది ప్రతీ ప్రాజ్ఞ, ఈడేరిన స్త్రీ పురుషునిపై విధిగా ఉంది. నమాజ్ విధిని తిరస్కరించే వాడు కాఫిర్ (సత్యతిరస్కారి) అవుతాడని ఏకాభిప్రాయం ఉంది. ఇక బద్ధకం, నిర్లక్ష్యంతో మొత్తానికే నమాజ్ చేయనివాడు కూడా కాఫిర్ అవుతాడని అధిక సంఖ్యలో ప్రవక్త సహచరులు ఏకీభవిం- చారు. ప్రళయదినాన మానవునితో తొలి లెక్క నమాజ్ గురించే జరుగును. నమాజుకు సంబంధించిన ఖుర్ఆన్ ఆదేశం చదవండిః
“ఇస్లాం పునాది ఐదు విషయాలపై ఉందిః 1- అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరొకడు లేడు, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట. 2- నమాజు స్థాపించుట. 3- జకాత్ (విధిదానం) చెల్లించుట. 4- హజ్ చేయుట. 5- రమజాను ఉపవాసాలు పాటించుట”. (బుఖారి 8, ముస్లిం 16).
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నానుః “ఒక మనిషి మరియు షిర్క్, కుఫ్ర్ (బహుదైవారాధన, సత్యతిరస్కారం) మధ్య ఉన్న వ్యత్యాసం నమాజును విడనాడడం”. (ముస్లిం 82).
నమాజ్ పాటించడంలో చాలా గొప్ప ఘనతలున్నాయి, వాటిలో కొన్ని:
عَنْ أَبِي هُرَيْرَةَ t قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (مَنْ تَطَهَّرَ فِي بَيْتِهِ ثُمَّ مَشَى إِلَى بَيْتٍ مِنْ بُيُوتِ الله لِيَقْضِيَ فَرِيضَةً مِنْ فَرَائِضِ الله كَانَتْ خَطْوَتَاهُ إِحْدَاهُمَا تَحُطُّ خَطِيئَةً وَالْأُخْرَى تَرْفَعُ دَرَجَةً).
ప్రవక్త e ఉపదేశించారని, అబూ హురైర t ఉల్లేఖించారుః “ఎవరైనా తన ఇంట్లో వుజూ చేసుకొని, అల్లాహ్ యొక్క విధుల్లో ఒక విధి నిర్వహించుటకు అల్లాహ్ గృహాల్లోని ఒక గృహం (మస్జిద్)లో ప్రవేశిస్తే, అతను వేసే అడుగుల్లో ఒక దానికి బదులుగా ఒక పుణ్యం లభిస్తే, మరో దానికి బదులుగా ఒక స్థానం పెరుగుతుంది”. (ముస్లిం 666).
అబూహురైర t ఉల్లేఖనం ప్రకారం: మహానీయ ప్రవక్త e ఇలా అడిగారుః “పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో అలాంటి విషయాలు మీకు తెలుపనా?” దానికి సహచ- రులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి‘ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారుః “ వాతవరణం, పరిస్థితులూ అనుకూలంగా లేనప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం. మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం. ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం, ఇది రిబాత్ తో సమానం([3])“. (ముస్లిం 251).
ప్రవక్త e ఉపదేశించారని అబూ హురైర t ఉల్లేఖించారుః “ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నమాజ్ చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం అల్లాహ్ స్వర్గంలో విందు ఏర్పాటు చేస్తాడు”. (బుఖారి 662. ముస్లిం 669).
నమాజుకు సంబంధించిన ముఖ్య విషయాలు
1- సామూహికంగా నమాజ్ చేయడం పురుషుల పై విధిగా ఉంది, ఈ హదీసు ఆధారంగా:
“నమాజ్ చేయించడానికి ఒకరిని ఆదేశించి, సామూహిక నమాజులో పాల్గొనని వారి వైపుకు తిరిగి వారు ఇండ్లల్లో ఉండగా వారి గృహాలను తగలబెడదామని ఎన్నో సార్లు అనుకున్నాను”.
(బుఖారి 2420, ముస్లిం 651).
2- శాంతి, నిదానంగా త్వరగా మస్జిదుకు రావడం చాలా మంచిది.
3- మస్జిదులో ప్రవేశిస్తూ కుడి కాలు ముందు వేసి అల్లా హుమ్మఫ్ తహ్లీ అబ్వాబ రహ్మతిక చదవండి. (ముస్లిం 713).
اللهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ
(ఓ అల్లాహ్ నా కొరకు నీ కరుణ ద్వారాలు తెరువు).
4- కూర్చునే ముందు రెండు రకాతులు తహియ్యతుల్ మస్జిద్ చేసుకోవడం సున్నత్.
عَنْ أَبِي قَتَادَةَ السَّلَمِيِّ t أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (إِذَا دَخَلَ أَحَدُكُمْ الْمَسْجِدَ فَلْيَرْكَعْ رَكْعَتَيْنِ قَبْلَ أَنْ يَجْلِسَ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారని, అబూ ఖతాద రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా మస్జిదులో ప్రవేశిస్తే కూర్చునే ముందు రెండు రకాతుల నమాజ్ చేసుకోవాలి”. (బుఖారి 444, ముస్లిం 714).
5- నమాజులో సతర్ (శరీరంలో కప్పి ఉంచే భాగం) తప్పనిసరి. పురుషుల సతర్ నాభి నుండి మోకాళ్ళ వరకు, స్త్రీల పూర్తి శరీరమే సతర్, నమాజులో కేవలం ముఖము తప్ప.
6- కాబా వైపునకు అభిముఖమై ఉండుట తప్పనిసరి. నమాజ్ అంగీకారానికి ఇది ఒక షరతు. ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప. ఉదాః వ్యాది లేదా మరేదైనా కారణం.
7- ప్రతీ నమాజ్ దాని సమయములో చేయాలి. సమయానికి ముందు చేయుట సమ్మతం కాదు. సమయం దాటి చేయడం నిషిద్ధం.
8- నమాజుకై శీఘ్రముగా సమయంలో రావడం, తొలి పంక్తిలో చేరుకోవడం, నమాజ్ కొరకు వేచించడం, ఇవన్నియూ చాలా గొప్ప ఘనతగల కార్యాలు.
ప్రవక్త e బోధించారని, అబూ హురైర t ఉల్లేఖించారుః “అజాన్ పలకడం మరియు మొదటి పంక్తిలో చేరడం ఎంత పుణ్యకార్యమో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు చీటి (ఖుర్అ) పద్దతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, వారు తప్పకుండా పరస్పరం చీటి వేసుకొందురు. అలాగే వేళ కాగానే తొలి సమయంలో నమాజుకు రావడంలో ఎంత పుణ్యముందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటిపడుదురు. …..”. (బుఖారి 615, ముస్లిం 437).
عَنْ أَبِي هُرَيْرَةَ t أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (لَا يَزَالُ أَحَدُكُمْ فِي صَلَاةٍ مَا دَامَتْ الصَّلَاةُ تَحْبِسُهُ).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారని, అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నమాజ్ కొరకు వేచిస్తూ ఉన్న వ్యక్తికి నమాజ్ చేస్తున్నంత పుణ్యం లభిస్తుంది”. (బుఖారి 659, ముస్లిం 649).
నమాజ్ సమయాలు
* జొహ్ర్ నమాజ్ నమయం: తల నుండి పొద్దు వాలినప్పటి నుండి ప్రతీ వస్తువు నీడ దానంత అయ్యే వరకు.
* అస్ర్ నమాజ్ సమయం: ప్రతీ వస్తువు నీడ దానంత అయినప్పటి నుండి సూర్యాస్తమయం వరకు.
* మగ్రిబ్ నమాజ్ సమయం: సూర్యాస్తమయం నుండి ఎర్రని కాంతులు కనుమరుగయ్యే వరకు.
* ఇషా నమాజ్ సమయం: ఎర్రని కాంతులు మరుగైన మరుక్షణం నుండీ అర్థ రాత్రి వరకు.
* ఫజ్ర్ నమాజ్ సమయం: ఉషోదయము నుండి సూర్యోదయము వరకు.
నమాజ్ చేయరాని స్థలాలు
1- ఖననవాటికః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః
“గొరీలు ఎదురుగా ఉండగా నమాజ్ చేయడం గానీ, వాటిపై కూర్చోవటం గానీ చేయకండి”. (ముస్లిం 972).
3- ఒంటెశాల అంటే ఒంటెలు కట్టే చోటు. అలాగే అశుద్ధ స్థలాల్లో నమాజ్ చేయరాదు.
నమాజ్ విధానం
నమాజ్ చేసేటప్పుడు నియ్యత్ (సంకల్పం) తప్పనిసరిగా చేయాలి. అలాగే ఇతర ఆరాధనల్లో కూడా చేయాలి. అయితే నియ్యత్ మనుస్సులో చేయాలి. నోటితో కాదు. పేజి 43లో నమాజ్ చిత్రాలు చూడండి.
ఇక నమాజ్ పద్ధతి ఇలా వుందిః
1- పూర్తి శరీరము మరియు పూర్తి శ్రద్ధాభక్తుల తో ఖిబ్లా దిశలో నిలబడాలి. చూపులు, శరీరము అటూ ఇటూ ఉండకూడదు. (చూపులు సజ్దా చేసే చోట కేంద్రికరించాలి).
2- ‘తక్బీరె తహ్రీమ’ అల్లాహు అక్బర్ అంటూ
రెండు చేతులు భుజాల వరకు లేదా చెవుల వరకు ఎత్తాలి. చూడండి చిత్రం1
3- కుడి అర చెయ్యిని ఎడమ చెయ్యిపై పెట్టి ఛాతిపై కట్టుకోవాలి. చిత్రం2
4- దుఆయె ఇస్తిఫ్ తాహ్ చదవాలిః
అల్ హందులిల్లాహి హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్. (ముస్లిం 600).
ఓ అల్లాహ్ నీవు పరమ పవిత్రునివి, నీకే సర్వ స్తోత్రములు, నీ నామము శుభం గలది. నీ మహిమ చాలా ఘనమయినది. నీవు తప్ప ఆరాధ్యుడెవడు లేడు.
ఇవి రెండే గాకుండా ఇతర దుఆలు కూడా చదవవచ్చును. ఎల్లప్పుడూ ఒకే దుఆ కాకుండా వేరు వేరు సమయాల్లో వేరు వేరు దుఆలు చదవడం ఉత్తమం. ఇలా నమాజులో నమ్రత, శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది.
అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో * ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు, * అపార కరుణా మయుడు, పరమ కృపాశీలుడు. * ప్రతిఫల దినానికి (అంటే ప్రళయ దినానికి) యజమాని. * మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము. * మాకు రుజుమార్గం (సన్మార్గం) చూపించు. * నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోనుకాని వారి మార్గం.
7- కంఠస్తం చేసి ఉన్న ఖుర్ఆనులోని ఏదైనా సూరా లేదా కొన్ని ఆయతులు పఠించాలి.
8- చేతులు భుజాల వరకు ఎత్తి, అల్లాహు అక్బర్ అంటూ రుకూ చేయాలి. రుకూలో అరచేతుల తో మోకాళ్ళను పట్టుకోవాలి. వ్రేళ్ళు దగ్గరదగ్గరగా కాకుండా విడిగా ఉండాలి. సుబ్ హాన రబ్బియల్ అజీం మూడు సార్లు చదువుట సున్నత్. అంతకంటే ఎక్కువ చదవవచ్చు. ఒక్క సారి చదివినా సరిపోవును. చూడండి చిత్రం3
9- ఒంటరి నమాజ్ చేయు వ్యక్తి మరి ఇమాం రుకూ నుండి తల లేపుతూ సమిఅల్లాహు లిమన్ హమిద అంటూ భుజాల వరకు చేతులెత్తాలి. ముఖ్తదీ సమిఅల్లాహు లిమన్ హమిదహ్ కు బదులుగా రబ్బనా వలకల్ హమ్ ద్ అనాలి. ఈ స్థితిలో కుడి చెయి ఎడమ చెయిపై పెట్టి ఛాతిపై కట్టుకోవాలి.
10- రుకూ తర్వాత నిలబడి ఉన్నప్పుడు ఈ దుఆ కూడా చదవవచ్చునుః అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్దు మిల్ఉస్ సమావాతి వ మిల్ఉల్ అర్జి వ మిల్ఉ మాషిఅత మిన్ షైఇమ్ బఅదు.
ఓ అల్లాహ్, మా ప్రభువా! నీకే ఆకాశముల నిండుగాను, భూమి నిండుగాను, అవి గాకా నీవు కోరిన వస్తువుల నిండుగాను స్తుతి గలదు. (ముస్లిం 476).
11- అల్లాహు అక్బర్ అంటూ మొదటి సజ్దాలో వెళ్ళాలి. ఏడు అంగములపై సజ్దా చేయాలిః (1) నొసటి, ముక్కు. (2,3) రెండు అరచేతులు. (4,5) రెండు మోకాళ్ళు. (6,7) రెండు పాదముల వ్రేళ్ళు. చేతులను పక్కల నుండి దూరముంచాలి. కాళ్ళ వ్రేళ్ళను ఖిబ్లా దిశలో ఉంచి, సజ్దాలో సుబ్ హాన రబ్బియల్ అఅలా మూడు సార్లు పలుకుట సున్నత్. ఎక్కువ పలు- కుట మంచిదే. ఒక్క సారి చదివినా సరిపోతుంది. ఈ స్థితిలో ఎక్కువ దుఆ చేయాలి. ఎందుకనగా ఇది దుఆ అంగీకార స్థితుల్లో ఒకటి. చిత్రం4
12- అల్లాహు అక్బర్ అంటూ సజ్దా నుండి తలెత్తి ఎడమ పాదముపై కూర్చోవాలి. కుడి కాలు పాదమును నిలబెట్టాలి. కుడి చెయ్యి కుడి మోకాలుకు దగ్గరగా తోడపై, ఎడమ చెయ్యి ఎడమ మోకాలుకు దగ్గరగా తోడపై పెట్టాలి. చేతి వ్రేళ్ళను విడిగా పరచి ఉంచాలి. రబ్బిగ్ ఫిర్లీ రబ్బిగ్ ఫిర్లీఅని చదవాలి. చిత్రం5,6,7
13- రెండవ సజ్దా మొదటి సజ్దా మాదిరిగా చేసి, సజ్దాలో అదే దుఆ చదవాలి.
14- అల్లాహు అక్బర్ అంటూ రెండవ సజ్దా నుండి లేస్తూ నిటారుగా నిలబడాలి.
15- రెండవ రకాత్ మొదటి రకాత్ మాదిరిగా చేయాలి. అందులో చదివిన దుఆలే ఇందులో చదవాలి. దుఆయె ఇస్తిఫ్ తాహ్ మరియు అఊజు బిల్లాహి…. తప్ప. ఈ రెండవ రకాత్ లోని రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అంటూ లేచి రెండు సజ్దాల మధ్యలో కూర్చున్న విధంగా కూర్చోని, కుడి చెయి వ్రేళ్ళను ముడుచుకొని నడిమి వ్రేళిని బొటన వ్రేళి మధ్యలో పెట్టి, చూపుడు వ్రేళితో సైగా చేస్తూ, కదలిస్తూ తషహ్హుద్ చదవాలిః
నా వాక్కు, దేహా, ధన సంబంధమైన ఆరాధన లన్నియూ అల్లాహ్ కొరకే ఉన్నవి. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆయన శుభాలు కురువుగాకా. అల్లాహ్ తప్ప వేరు ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు, సందేశహరుడని సాక్ష్యమిస్తున్నాను.
ఇక్కడి వరకు చదివిన తరువాత, చేతులు భుజాల వరకు ఎత్తుతూ అల్లాహు అక్బర్ అంటూ నిలబడాలి, ఒక వేళ మగ్రిబ్ లాంటి మూడు రకాతుల నమాజ్ లేదా జొహ్ర్, అస్ర్ మరియు ఇషా లాంటి నాలుగు రకాతుల నమాజ్ చేస్తుంటే, రెండవ రకాతు మాదిరిగా మిగిత నమాజ్ పూర్తి చేయాలి. అయితే ఖియామ్ (నిలబడి ఉన్న స్థితి)లో కేవలం సూరె ఫాతిహ చదువుతే సరిపోతుంది. చివరి రకాతు రెండవ సజ్దా నుండి లేచి కూర్చోని తషహ్హుద్, దరూద్ ఇబ్రాహీమ్ మరియు ప్రవక్త నేర్పిన తనికిష్టమైన దుఆలు అధికంగా చదవడం మంచిది. (ఇది కూడా దుఆ అంగీకార సందర్భాల్లో ఒకటి). క్రింద దరూద్ మరియు ఒక దుఆ ఇవ్వబడుతుంది.
ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీంను, వారి కుటుంబీకులను కరుణించినట్లు ముహమ్మద్ మరియు వారి కుటుంబీకులను కరుణించు. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి. ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేసినట్లు ముహమ్మద్, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేయుము. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి. ఓ అల్లాహ్ నేను సమాధి శిక్షల నుండి, నరక యాతన నుండి, జీవన్మరణ పరీక్షల నుండి మరియు దజ్జాల్ మాయ నుండి రక్షణకై నీ శరణు కోరుతున్నాను
16- అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అంటూ కుడి వైపున మెడ త్రిప్పాలి. అలాగే అంటూ ఎడమ వైపున మెడ త్రిప్పాలి. చూడండి చిత్రం8,9
17- జొహ్ర్, అస్ర్, మగ్రిబ్, ఇషా నమాజుల్లోని చివరి తషహ్హుద్ లో కూర్చుండే పద్ధతి ఇలా ఉండాలి. కుడి పాదాన్ని నిలబెట్టి ఎడమ పాదాన్ని కుడి కాలి పిక్క క్రింది నుంచి బైటికి తీయాలి. ఎడమ పిరుదును భూమిపై ఆనించాలి. కుడి చెయ్యి కుడి తోడపై, ఎడమ చెయ్యి ఎడమ తోడపై మోకాలుకు దగ్గరగా పెట్టాలి. చూడండి చిత్రం10
أَسْتَغْفِرُ الله (3). اَللهُمَّ أَنْتَ السَّلامُ ومِنْكَ السَّلامُ تَبَارَكْتَ يَا ذَا الجَلالِ وَ الإكْرَام. لا إله إلا الله وَحْدَهُ لا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيءٍ قَدِير. اَللهُمَّ لا مَانِعَ لِمَا أعْطَيْتَ وَلا مُعْطِيَ لِمَا مَنَعْتَ وَلا يَنْفَعُ ذَا الجَدِّ مِنْكَ الْجَدُّ. لا حَوْلَ وَلا قُوَّةَ إِلاَّ بِاللهِ، لاَ إِلهَ إِلاَّ اللهُ وَلاَ نَعْبُدُ إِلاَّ إِيَّاهُ، لَهُ النِّعْمَةُ وَلَهُ الْفَضْلُ وَلَهُ الثَّنـاءُ الْحَسـَن، لاَ إلَهَ إِلاَّ اللهُ مُخْلِصِينَ لَه الدِّينَ وَلَوكَرِهَ الكَافرون.
అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుచున్నాను (3). ఓ అల్లాహ్ నీవు ఏలాంటి లోపాలు లేనివాడవు. నీవే రక్షణ నొసంగువాడవు. ఓ ఘనుడవు, పరమదాతయువు నీవు శుభములు గలవాడవు. అల్లాహ్ దప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన అద్వితీయుడు. ఆయనకు సాటి మరొకడు లేడు. ఆయనకే అధికారము చెల్లును. ఆయనకే సర్వ స్తోత్రములు గలవు. ఆయనే సర్వ శక్తుడు. ఓ అల్లాహ్ నీవు నొసంగిన వరాలను ఎవడు అడ్డగింపజాలడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వజాలడు. ధనికుడు తన ధనముతో నీ శిక్షల నుండి తప్పించుకు- పోజాలడు. పాపాములను వదులుకొనుట మరియు పుణ్యాలు చేయుట అల్లాహ్ దయవలననే కలుగును. అల్లాహ్ దప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన్నే మేము ఆరాధించుచున్నాము. ఆయనే సర్వ అనుగ్రహాలు దయ చేయువాడు. ఆయనకే ఘనత, మంచి స్తోత్రములు గలవు. అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యు డెవ్వడూ లేడు. చిత్తశుద్ధితో మేము ఆయన్నే ఆరాధించుచున్నాము. ఈ విషయము సత్య తిరస్కారులకు నచ్చకున్నా సరే. (ముస్లిం 591, 593, 594, బుఖారి 844).
తరువాత సుబ్హానల్లాహ్ 33, అల్ హందు లిల్లాహ్ 33, అల్లాహు అక్బర్ 33 సార్లు చదివి, లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్తో 100 పూర్తి చేయాలి. (ముస్లిం 597).
ఖుల్ హువల్లాహు అహద్(5), ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్(5), ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్([5]) సూరాలు ఫజ్ర్ మరియు మగ్రిబ్ తరువాత మూడేసి సార్లు మిగిత నమాజుల తరువాత ఒక్కొక్క సారి చదవాలి.
మస్బూఖ్:
ఎవరైనా జమాఅతుతో ఒకటి లేదా కొన్ని రకాతులు తప్పి పోతే (మస్బూఖ్) ఇమాం రెండవ సలాం తింపిన తర్వాత వాటిని పూర్తి చేసుకోవాలి. అతను ఇమాంతో ఏ రకాతులో కలిసాడో అదే అతని మొదటి రకాతు. ఇమాంను రుకూ స్థితిలో పొందినవాని ఆ రకాతు అయినట్లే. ఇమాంను రుకూలో పొందకుంటే ఆ రకాత్ తప్పిపోయి నట్లే లెక్క.
జమాఅతు నిలబడిన తర్వాత వచ్చేవారు జమాఅతును ఏ స్థితిలో చూసినా అదే స్థితిలో కలవాలి. వారు రుకూ, లేదా సజ్దా ఇంకే స్థితిలో ఉన్నా సరే. వారు మరో రకాతు కొరకు నిలబడే వరకు నిరీక్షించవద్దు. నిలబడి తక్బీరె తహ్రీమ అల్లాహు అక్బర్ అనాలి. రోగి లాంటి ఏదైనా ఆటంకం ఉన్నవారు కూర్చుండి అల్లాహు అక్బర్ అంటే ఏమీ తప్పు లేదు.
నమాజును భంగపరుచు కార్యాలు
1- తెలిసి, కావాలని మాట్లడడం, అది కొంచమైనా సరే.
2- పూర్తి శరీరముతో ఖిబ్లా దిశ నుండి పక్కకు మరలడం.
3- వుజూను భంగపరిచే కారణాల్లో ఏ ఒకటైనా సంభవించడం.
4- అనవసరంగా ఎడతెగకుండా ఎక్కువ చలనము చేయడం.
5- కొంచం నవ్వినా నమాజ్ వ్యర్థమవుతుంది.
6- తెలిసి కూడా ఎక్కువ రుకూ, సజ్దాలు, ఖియాం, జుల్సాలు చేయడం.
7- తెలిసి కూడా (రుకూ, సజ్దా వగైరా) ఇమాంకు ముందు చేయడం.
నమాజ్ యొక్క వాజిబులు
1- మొదటి తక్బీరె తహ్రీమ తప్ప మిగితావన్నీ.
2- రుకూలో కనీసం ఒక్కసారైనా సూబ్హాన రబ్బియల్ అజీం అనడం.
3- రుకూ నుండి లేస్తూ ఇమాం మరియు ఒంటరి నమాజి సమిఅల్లాహు లిమన్ హమిదహ్ అనడం.
4- రుకూ నుండి నిలబడి రబ్బనా వలకల్ హంద్ అనడం.
5- సజ్దాలో కనీసం ఒక్కసారైనా సుబ్హాన రబ్బియల్ అఅలా అనడం.
6- రెండు సజ్దాల మధ్యలో రబ్బిగ్ ఫిర్లీ అనడం.
7- మొదటి తషహ్హుద్ చదవడం.
8- మొదటి తషహ్హుద్ చదవడానికి కూర్చోవడం.
నమాజ్ యొక్క రుకున్ లు
1- ఫర్జ్ నమాజులో శక్తి ఉన్నప్పుడు నిలబడటం. నఫిల్ నమాజులో నిలబడటం ముఖ్యం లేదు. కాని కూర్చుండి నమాజ్ చేసేవానికి, నిలబడి చేసేవానికంటే సగం పుణ్యం తక్కువ.
2- తక్బీరె తహ్రీమ.
3- ప్రతి రకాతులో సూరె ఫాతిహ పఠించడం.
4- ప్రతీ రకాతులో రుకూ చేయడం.
5- రుకూ నుండి లేచి నిటారుగా నిలబడటం.
6- ప్రతీ రకాతులో రెండు సార్లు ఏడు అంగములపై సజ్దా చేయడం.
7- రెండు సజ్దాల మధ్య కూర్చోవడం.
8- నమాజులోని రుకూ, సజ్దా మొదలైన అంశాలన్నిటినీ నింపాదిగా, శాంతిగా నెరవేర్చడం.
9- చివరి తషహ్హుద్.
10- దాని కొరకు కోర్చోవడం.
11- దరూదె షరీఫ్ (అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మది…..)
12- సలాం తింపడం.
13- ప్రతి రుకున్ నెరవేర్చడంలో క్రమ పద్దతిని పాటించడం
నమాజులో మరచిపోవుట
ఎవరైనా నమాజులో మరచిపోతే, అంటే; నమాజులో ఏదైనా అదనపు కార్యం లేదా ఏదైనా కొరత జరుగుతే, లేదా అలాంటి అనుమానం ఏదైనా కలుగుతే రెండు సజ్దాలు చేయాలి. వీటిని సహు సజ్దా అంటారు.
మరచిపోయి నమాజులో ఏదైనా హెచ్చింపు జరిగినప్పుడు, అంటే; ఖియాం, లేదా రుకూ, లేదా సజ్దా లాంటిదేదైనా అదనంగా చేసినప్పుడు సలాం త్రిప్పిన తరువాత రెండు సహ్ వ్ సజ్దాలు చేయాలి.
ఒకవేళ మరచిపోయి నమాజులో ఏదైనా కొరత జరిగినప్పుడు అంటే; నమాజులో చేయవలసిన ఏదైనా కార్యం చేయక, చదవ వలసినా ఏదైనా దుఆ, సూరా చదవక కొరత జరుగుట. ఒకవేళ అది ‘రుకున్’ అయితే, దాని రెండు స్థితులుః ఆ ‘రుకున్’ ఏ రకాతులో మరచిపోయాడో దాని తరువాత రకాతు ఆరంభానికి ముందు ఆ విషయం గుర్తుకు వస్తే, వెంటనే ఆ ‘రుకున్’ నెరవేరుస్తూ, ఆ రకాతులో దాని తరువాత ఉన్నవాటిని పూర్తి చేయాలి([6]). సలాం తిప్పేకి ముందు సజ్దా సహ్ వ్ చేయాలి. ఆ ‘రుకున్’ ఏ రకాతులో మరచిపోయాడో దాని తరువాత రకాతు ఆరంభానికి ముందు ఆ విషయం గుర్తుకు రాకుంటే ఆ రకాత్ కానట్లే లెక్క. ఇప్పుడు చేస్తున్న రకాతే దాని స్థానం తీసుకుంటుంది([7]).
మరచిపోయిన రుకున్ సలాం తరువాత కొద్ది క్షణాలకే గుర్తుకు వస్తే, పూర్తి ఒక రకాత్ చేసి, సలాంకు ముందు సజ్దా సహ్ వ్ చేయాలి. తొందరగా గుర్తుకు రాలేదు, లేదా వుజూ భంగమయితే తిరిగి పూర్తి నమాజ్ చేయాలి.
మొదటి తషహ్హుద్ లాంటి వాజిబ్ మరచిపోయినప్పుడు సలాంకు ముందు సజ్దా సహ్ వ్ చేస్తే సరిపోతుంది.
ఇక అనుమాన స్థితికి గురైనప్పుడు; ఈ అనుమానం రకాతుల సంఖ్యలో ఉంటే, ఉదాః రెండు రకాతులు చదివానా లేదా మూడా? అని సందేహం కల్గితే, తక్కువ సంఖ్యపై నమ్మకం ఉంచుకొని, మిగిత రకాతులు పూర్తి చేసుకోవాలి. సలాంకు ముందు సజ్దా సహ్ వ్ చేయాలి. ఒకవేళ రుకున్ విషయంలో సందేహం కలుగుతే, దాన్ని చేయలేని కింద లెక్క కట్టి, దాన్ని నెరవేర్చాలి. దాని తరువాత రకాతులు చేసుకోవాలి. సజ్దా సహ్ వ్ చేయాలి.
సున్నతె ముఅక్కద
స్థానికులైన ప్రతి ముస్లిం స్త్రీ పురుషులు పన్నెండు రకాతులు పాటించడం ఎంతో పుణ్యకార్యం. అవి జొహ్ర్ కు ముందు 4, దాని తరువాత 2, మగ్రిబ్ తరువాత 2, ఇషా తరువాత 2, ఫజ్ర్ కు ముందు 2 రకాతులు. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సున్నతులు పాటించేవారు. ఇంకా ఆయన ఇలా శుభవార్త ఇచ్చారని ఉమ్మె హబీబ రజియల్లాహు అన్హా తెలిపారు:
“ఏ ముస్లిం భక్తుడు రాత్రి పగల్లో ఫర్జ్ కాకుండా పన్నెండు రకాతుల అదనపు (నఫిల్) నమాజ్ చేస్తూ ఉంటాడో అతనికి వాటికి బదులుగా అల్లాహ్ ఒక గృహము స్వర్గంలో నిర్మిస్తాడు, లేదా ఒక గృహం స్వర్గంలో నిర్మించచబడును”. (ముస్లిం 728).
సున్నతె ముఅక్కద మరియు సాధరణంగా నఫిల్ నమాజ్ లన్నియూ ఇంట్లో చేయడం చాలా ఉత్తమం. ప్రవక్త ﷺ ప్రబోధించారని, జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
“మీలోనెవరైనా మస్జిదులో (ఫర్జ్) నమాజ్ నెరవేర్చుకున్నాక, తన ఇంటి కొరకు కూడా (సున్నతులు, నఫిల్లాంటి) నమాజుల యొక్క కొంత భాగాన్ని మిగిలించుకోవాలి. అల్లాహ్ అతని నమాజుకు బదులుగా అతని ఇంట్లో మేలే చేకూర్చుతాడు”. (ముస్లిం 778).
జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః
“మనిషి తనింట్లో చేసే నమాజ్ అతి ఉత్తమమైనది. కేవలం ఫర్జ్ నమాజ్ తప్ప”. (బుఖారి 6113).
విత్ర్ నమాజ్
అలాగే ముస్లిం విత్ర్ నమాజును పాటించుట ధర్మం. ఇది కూడా సున్నతె ముఅక్కద. దీని సమయం ఇషా తరువాత నుండి ఉషోదయం వరకు ఉంటుంది. అయితే రాత్రి చివరి గడియలో మేల్కొనగల వారికి ఆ సమయమే ఉత్తమం. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాల్లో ఒకటి. ప్రవక్త మహా నీయులు విత్ర్ మరియు ఫజ్ర్ కు ముందు గల రెండు రకాతుల సున్నతులు ఎప్పుడూ విడనాడ లేదు. ప్రయాణంలో ఉన్నా, లేదా స్థానికంగా ఉన్నా. విత్ర్ యొక్క కనిష్ట సంఖ్య ఒక్క రకాతు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రుల్లో 11 రకాతులు చేసేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనంలో ఉందిః
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి పూట 11 రకాతులు చేసేవారు, అందులో ఒక రకాతు విత్ర్ చేసేవారు. (ముస్లిం 736).
రాత్రి నమాజ్ రెండేసి రకాతులు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రాత్రి నమాజ గురించి ప్రశ్నించాడు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః
“రాత్రి వేళ నఫిల్ నమాజ్ రెండేసి రకాతుల చొప్పున చేయాలి. ఇక ఉషోదయం కావస్తోందని భావించినప్పుడు ఒక రకాతు చేయు. దీనివల్ల మొత్తం నమాజ్ విత్ర్ (బేసి సంఖ్య నమాజ్) అయిపోతుంది”. (బుఖారి 991, ముస్లిం 749).
అప్పుడప్పుడు విత్ర్ లో దుఆయె ఖునూత్ చేయడం మంచిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్ బిన్ అలీ రజియల్లాహు అన్హు గారికి విత్ర్ లో చదివే దుఆ నేర్పారు. కాని ఎల్లప్పుడు చేయకూడదు. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ విధానం గురించి ఉల్లేఖించిన సహచరులు ఖునూత్ గురించి చెప్పలేదు.
రాత్రి నమాజ్ చేయలేకపోయినవారు మరుసటి రోజు రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండు ఇష్టమున్నన్ని రకాతులు చేయుట మంచిది. ఎప్పుడైనా రాత్రి నమాజ్ తప్పి పోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే చేసేవారు.
ఫజ్ర్ సున్నతులు
ప్రవక్త ﷺ పాబందీగా పాటించే సున్న తుల్లో ఫజ్ర్ సున్నతులు కూడా, వాటిని ఆయన ప్రయాణంలో ఉన్న, స్థానికంగా ఉన్నా విడనాడకపోయేది. ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం:
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నఫిల్ నమాజుల్లో ఫజ్ర్ సున్న తులను చేసేటంత ఎక్కువ పాబందీగా మరో నఫిల్ చేసేవారు కారు”. (బుఖారి 1163, ముస్లిం 724). వాటి ఘనత, ప్రాముఖ్యతలో ప్రవక్త ﷺ ఇలా చెప్పేవారుః لَـهُمَا أَحَبُّ إِلَيَّ مِنْ الدُّنْيَا جَمِيعًا.
“ఆ రెండు రకాతులు నాకు ప్రపంచం మరియు, అందులో ఉన్న వాటికన్నా చాలా ప్రియమైనవి”. (ముస్లిం 725).
మొదటి రకాతులో (సూర ఫాతిహా తర్వాత) సూర కాఫిరూన్ మరియు రెండవ రకాతులో (సూర ఫాతిహ తర్వాత) సూర ఇఖ్లాస్ చదువుట ధర్మం. ఒక్కోసారి మొదటి రకాతులో “ఖూలూ ఆమన్నా బిల్లాహి వమా ఉంజిల ఇలైనా….” (అల్ బఖర 2: 136) ఆయతులు మరియు రెండవ రకాతులో “ఖుల్ యా అహ్లల్ కితాబి తఆలౌ ఇలా కలిమతిన్ సవాఇమ్ బైననా వ బైనకుమ్….” (ఆలె ఇమ్రాన్ 3: 64) ఆయతులు పఠించుట మంచిది.
ప్రవక్త అనుసరణలో వాటిని సంక్షిప్తంగా చేయాలి. ఫర్జ్ నమాజుకు ముందు వాటిని చేయలేకపోయిన వ్యక్తి నమాజ్ తర్వాత కూడా చేయవచ్చును. అయితే సూర్యోదయం తర్వాత సూర్యుడు బల్లెమంత పైకి వచ్చాక చేయడం మరీ ఉత్తమం. దీని సమయం పగటిలి పొద్దు వాలేకి ముందు వరకు ఉంటుంది.
చాష్త్ నమాజ్
దీనినే సలాతుల్ అవ్వాబీన్ అంటారు. ఇది సున్నతె ముఅక్కద. అనేక హదీసుల్లో దీని గురించి ప్రోత్సహించబడింది. అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీస్ ముస్లిం 820లో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః
“మానవ శరీరంలో ఎన్ని కీళ్ళున్నాయో వాటి లో ప్రతి దానికీ ఒక దానం (సదఖా) విధి అయి ఉంది. అయితే ప్రతి సుబ్ హానల్లాహ్ ఒక సదఖా, ప్రతి అల్ హందులిల్లాహ్ ఒక సదఖా, లాఇలాహ ఇల్లల్లాహ్ ఒక సదఖా, అల్లాహు అక్బర్ ఒక సదఖా, ఒక మంచిని బోధించడం ఒక సదఖా, ఒక చెడును నివారించడం ఒక సదఖా, వీటన్నిటికీ బదులుగా చాష్త్ సమయం లో 2 రకాతులు సరిపోతాయి”.
హజ్రత్ అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: నా ప్రాణ స్నేహితులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు మూడు విషయాలను గురించి హితబోధ చేశారు. నేను వాటిని చని పోయేంత వరకు వదిలి- పెట్టను. అవిః 1. ప్రతి (ఇస్లామీయ) నెలలో మూడు రోజుల ఉపవాసం పాటించటం. 2. చాష్త్ నమాజ్ చేయడం. 3. విత్ర్ నమాజ్ చేసి నిద్ర పోవడం. (బుఖారి 1178, ముస్లిం 721).
దీని ఉత్తమ సమయం పొద్దెక్కి, ఎండ తాపం పెరిగిన తర్వాత. పొద్దు వాలిన వెంటనే దీని సమయం సమాప్తమవుతుంది. కనిష్ట సంఖ్య రెండు రకాతులు. గరిష్ట సంఖ్యకు హద్దు లేదు.
సామూహిక నమాజ్
ఫర్జ్ నమాజ్ యొక్క జమాఅతు నిలబడిన తరువాత మస్జిదులో ప్రవేశించినవారు నఫిల్ లేక సున్నతులు చేయుట ధర్మ సమ్మతం కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః
ఇమాం ఖిరాత్ ను వినాలి. కాని సూరె ఫాతిహ మాత్రం తప్పక పఠించాలి. ఎందుకనగా సూరె ఫాతిహ పఠించని వ్యక్తి నమాజ్ కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:
“సూరె ఫాతిహ చదవనివారి నమాజ్ కాదు”. (బుఖారి 756, ముస్లిం 394)
పంక్తుల విషయం:
ముఖ్తదీ పంక్తిలో స్థలము పొందనిచో పంక్తుల వెనక ఒంటరిగా నమాజ్ చేయుట ఎట్టి పరిస్థితిలో కూడా యోగ్యం కాదు. అతనితో ఏ ఒకరైనా పంక్తిలో ఉండి నమాజ్ చేయుటకు ఒక వ్యక్తిని చూడాలి లేక ఒక వ్యక్తి
వచ్చే వరకు వేచి ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః لاَ صَلاَةَ لِفَردٍ خَلفَ الصَّف
“పంక్తుల వెనక ఒంటరిగా చేయు వ్యక్తి నమాజ్ కాదు”. (సహీ ఇబ్ను ఖుజైమ 3/30. సహీ ఇబ్ను హిబ్బాన్ 5/579 ).
వేచి ఉన్నప్పటికీ ఏ ఒక్కరినీ పొందనిచో వీలుంటే ఇమాం కుడి వైపున నిలబడాలి. లేదా ఇమాం సలాం తిప్పే వరకు వేచించాలి. అప్పటి వరకూ ఎవరు రాని యడల ఇమాం సలాం తింపిన తరువాత ఒంటరిగా నమాజ్ చేసుకోవాలి. (కాని షేఖ్ ఇబ్ను ఉసైమీన్ ఫత్వా చాలా బాగుంది: ముందు పంక్తిలో ఏ కొంచం స్థలం దొరికే అవకాశం లేకుంటే అతను ఒంటరిగా నిలబడాలి. ఈ సందర్భంలో హదీసు వ్యతిరేకం అనబడదు, గత్యంతరం లేని పరిస్థితి అనబడుతుంది).
మొదటి పంక్తిలో ఉండి నమాజ్ చేయుట పుణ్యకార్యం. దాని కాంక్ష ఎక్కువగా ఉండాలి. ఎందుకనగా పురుషుల కొరకు మేలయిన పంక్తి మొదటిది. అదే విధంగా ఇమాంకు కుడి ప్రక్కన ఉండుటకు ప్రయత్నించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః
“మీరు మీ పంక్తులను సరి చేసుకోండి. పంక్తులను సరిచేసుకొనుట నమాజ్ పరిపూర్ణతలో ఒక భాగం”. (ముస్లిం 433).
ఖస్ర్:
ఖస్ర్ అనగా నాలుగు రకాతుల నమాజ్ రెండు రకాతులు చేయుట. ప్రతి రకాతులో సూరె ఫాతిహ చదవాలి. దానితో పాటు మరో సూర లేదా ఖుర్ఆనులోని సులభంగా జ్ఞాపకమున్న కొన్ని ఆయతులు చదవాలి. మగ్రిబ్ మరియు ఫజ్ర్ మాత్రం ఖస్ర్ చేయరాదు.
ప్రయాణంలో ఉన్న వారు నమాజ్ ఖస్ర్ చేయుటయే ధర్మం. అంతే కాదు; ప్రయాణికుడు నమాజును ఖస్ర్ చేయుటయే ఉత్తమం. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణం చేసినప్పుడల్లా ఖస్ర్ చేశారు. 80 కిలోమీటర్లకు పైగా ఎవరైనా ప్రయాణము చేస్తే దానినే ప్రయాణమనబడును. అల్లాహ్ అవిధేయతకు గాకుండా విధేయత కొరకు ప్రయాణం చేసినప్పుడు ఖస్ర్ చేయుట ధర్మం.
స్వనగర గృహాలను దాటిన తరువాత ఖస్ర్ ప్రారంభించి, తమ నగరానికి తిరిగి వచ్చేంత వరకు ఖస్ర్ చేయవచ్చును. ఇలా ప్రయాణం ఎన్ని రోజులయినా సరే. కాని ఒక వేళ ప్రయాణం చేసిన ఊరిలో నాలుగు లేక అంతకంటే ఎక్కువ రోజులు నిలవాలని ముందే నిశ్చయించుకుంటే ఖస్ర్ చేయకూడదు. పూర్తి నమాజ్ చేయాలి.
ప్రయాణంలో సున్నత్, నఫిల్ నమాజులు చేయనవసరం లేదు. కాని ఫజ్ర్ సున్నత్ లు మరియు విత్ర్ తప్పకుండా చేయాలి. వాటిని విడనాడకూడదు.
జమ్అ:
జొహ్ర్ మరియు అస్ర్ నమాజులు రెండిట్లో ఏదైనా ఒక సమయంలో, అలాగే మగ్రిబ్ మరియు ఇషా నమాజులు రెండిట్లో ఏదైనా ఒక సమయంలో చేయుటనే జమఅ అంటారు. అయితే జొహ్ర్, అస్ర్ జొహ్ర్ సమయంలో మరియు మగ్రిబ్, ఇషా మగ్రిబ్ సమయంలో చేస్తే జమఅతఖ్ దీమ్ అంటారు. ఒకవేళ జొహ్ర్, అస్ర్ అస్ర్ సమయంలో మరియు మగ్రిబ్, ఇషా ఇషా సమయంలో చేస్తే జమఅ తాఖీర్ అంటారు. ప్రయాణికుడు జమఅతఖ్ దీమ్ లేక జమఅతాఖీర్ చేయుట ధర్మమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తబూక్ నగరానికి ప్రయాణించినప్పుడు ఇలా చేశారని రుజువయినది. (బుఖారి, ముస్లిం).
ప్రయాణికుడు ఖస్ర్ చేయవచ్చనే విషయం పైన చదివారు, అయితే ఖస్ర్ తో పాటు జమఅ కూడా చేయవచ్చును. జమఅ తఖ్ దీమ్ చేయాలనుకున్నప్పుడు ఇఖామత్ చెప్పి జొహ్ర్ సమయంలో జొహ్ర్ యొక్క రెండు రకాతులు చేసి సలాం తింపిన తరువాత మళ్ళీ ఇఖామత్ చెప్పి అస్ర్ యొక్క రెండు రకాతులు చేయాలి. మగ్రిబ్ సమయంలో ఇఖామత్ చెప్పి మగ్రిబ్ యొక్క మూడు రకాతులు చేసి సలాం తింపిన తరువాత మళ్ళీ ఇఖామత్ చెప్పి ఇషా యొక్క రెండు రకాతులు చేయాలి.
అదే విధంగా స్థానికులు కూడా జమఅచేయవచ్చును. కాని ఖస్ర్ చేయరాదు. జమఅ చేయు సందర్భాలుః వర్షం కురిసినప్పుడు, లేదా చలి ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా తూఫాను గాలి ఉండి నమాజీలకు మస్జిద్ వెళ్ళడం కష్టంగా ఉన్నప్పుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి వర్షం కురిసిన రాత్రి మగ్రిబ్ మరియు ఇషా నమాజులు కలిపి చేశారు.
అదే విధంగా వ్యాదిగ్రస్తుడు ప్రతి నమాజ్ దాని సమయాన పాటించుట కష్టంగా ఉన్నప్పుడు రెండు నమాజులు కలిపి చేయవచ్చును.
వ్యాదిగ్రస్తుని నమాజ్:
నిలబడి నమాజ్ చేసే శక్తి రోగిలో లేనప్పుడు దేనికయినా ఆనుకొని నమాజ్ చేయాలి. ఈ శక్తి లేనప్పుడు కూర్చుండి చేయాలి. ఈ శక్తి కూడా లేనప్పుడు ప్రక్కన పడుకొని చేయాలి. ఈ శక్తి కూడా లేనప్పుడు వెల్లకిల పడుకొని పాదములను ఖిబ్లా వైపున ఉంచి నమాజ్ చేయాలి. సజ్దాలో రుకూ కంటే కొంచము ఎక్కువ తలను వంచాలి. రుకూ, సజ్దా చేయు శక్తి లేనప్పుడు తలతో సైగ చేయాలి. ఏ పరిస్థితిలోనయినా నమాజ్ విడనాడకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః
{విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజుకై పిలిచినప్పుడు, అల్లాహ్ సంస్మరణ వైపునకు పరుగెత్తండి; క్రయవిక్రయాలను వదలండి. మీరు గ్రహించగలిగితే, ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది}. (62: జుముఅహ్: 9).
జుమా ప్రత్యేకతలు:
స్నానం చేయుట, శుభ్రమైన మంచి దుస్తులు ధరించుట, దుర్వాసన నుండి అతి దూరంగా ఉండుట ఈ నాటి పత్యేక ధర్మాలు.
జుమా ప్రత్యేకతల్లోః జుమా నమాజ్ కొరకు మస్జిద్ కు శీఘ్రముగా వెళ్ళి, ఇమాం వచ్చే వరకు నఫిల్ నమాజులు, ఖుర్ఆన్ పారాయణం, అల్లాహ్ స్మరణాల్లో గడుపుట. ఇమాం ఖుత్బ (జుమా ప్రసంగం) ఇస్తున్నప్పుడు ఏ పని చేయకుండా, నిశబ్దంగా ఉండి ఖుత్బ వినుట. నిశబ్దంగా ఉండనివారు వృధా పని చేసిన వారవుతారు. వృధా పని చేసిన వారికి జుమా ఫలితం లభించదు. ఖుత్బ సందర్భంలో మాట్లాడ్డం నిషిద్ధం.
జుమా ప్రత్యేకతల్లోః ఈ రోజు సూరె కహఫ్ పారాయణం పుణ్యకార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః
“ఎవరు సూరె కహఫ్ పఠిస్తారో వారికి తనున్న ప్రాంతం నుండి మక్కా వరకు మరియు ప్రళయం నాటికీ కాంతియే కాంతి ఉండును. ఎవరు దాని చివరి పది ఆయతులు పఠిస్తారో వారికి దజ్జాల్ వచ్చినప్పటికీ ఏమి నష్టం జరగదు”.(అల్ ముఅజముల్ ఔసత్: తబ్రానీ 2/123).
ఇమాం ఖుత్బ ఇస్తుండగా మస్జిదులో ప్రవేశించువారు రెండు రకాతులు తహియ్యతుల్ మస్జిద్ సంగ్రహంగా చేసుకోవాలి. అప్పటి వరకు కూర్చోకూడదు.
“మీలో ఎవరైనా మస్జిదులో ప్రవేశించినప్పుడు ఇమాం ఖుత్బా ఇస్తున్నచో రెండు రకాతులు సంగ్రహముగా చేసుకోవాలి” అని ప్రవక్త ఖుత్బ ఇస్తూ చెప్పారు.(ముస్లిం 875).
ఎవరికీ సలాం చేయకుండా నిదానంగా కూర్చోని ఖుత్బ వినాలి. ఖుత్బ తనకు తెలిసిన భాషలో కానప్పటికీ మౌనంగా ఉండాలి. ప్రక్కలో కూర్చున్న వారితో ముసాఫహ (కరచాలణం) చేయకూడదు.
ఇమాంతో జూమా నమాజ్ యొక్క ఒక రకాతు పొందినవారు జుమాను పొందినట్లే. అబూ హురైర ఉల్లేఖించిన హదీసులో ఇలా వచ్చిందిః “జుమా యొక్క ఒక రకాతును పొందినతను జుమాను పొందినాడు”. (బైహఖి). ఒక రకాతు కంటే తక్కువ పొందినతను అనగా ఇమాంతో రెండవ రకాతులోని రుకూ పొందనివాని జుమా కానట్లే. అతను జొహ్ర్ నమాజ్ నియ్యతుతో ఇమాం వెనక నమాజులో పాల్గొని ఇమాం సలాం తింపిన తరువాత జొహ్ర్ నమాజ్ పూర్తి చేసుకోవాలి.
పండుగ నమాజ్
పొద్దు పొడిసి సూర్యుడు బల్లెమంత (బారెడంత) పొడుగులో పైకి వచ్చిన తరువాత పండుగ నమాజ్ సమయం ప్రారంభం అవుతుంది. ఈదుల్ అజ్ హా (బక్రీద్ పండుగ) కొంచము ముందుగా మరియు ఈదుల్ ఫిత్ర్ (రమజాను పండుగ) కొంచము ఆలస్యంగా చేయుట మంచిది. ఈదుల్ ఫిత్ర్ కు వెళ్ళే ముందు ఖర్జూరపు పండ్లు తిని వెళ్ళుట, ఈదుల్ అజ్ హాకు వెళ్ళే ముందు ఏమీ తినకుండా వెళ్ళుట ధర్మం. బురైద రజియల్లాహు అన్హు కథనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ కొంచమైనా భుజించని వరకు ఈదుల్ ఫిత్ర్ కు వెళ్ళకపోయేవారు. ఈదుల్ అజ్ హా చేసుకునెంత వరకు ఏమీ తినక పోయేవారు”. (అహ్మద్). పండుగ రోజు మంచి దుస్తులు ధరించుట అభిలషణీయం.
పండుగ నమాజ్ రెండు రకాతులు. ఇవి ఖుత్బకు ముందు చేయాలి. అందులో ఇమాం బిగ్గరగా ఖుర్ఆను పఠించాలి. పండుగ నమాజుకు అజాను, ఇఖామతు ఏదీ లేదు. ముందు తక్బీరె తహ్రీమ చెప్పి సనా చదవాలి. తరువాత ఏడు సార్లు అల్లాహు అక్బర్ అనాలి. ప్రతీ సారి చేతులు భుజాల వరకు ఎత్తాలి. తరువాత అఊజు బిల్లాహి మినష్షైతా నిర్రజీం, బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం మరియు సూరె ఫాతిహ, దాని తరువాత ఏదైన సూర చదవాలి. మొదటి రకాతు యొక్క రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అంటూ నిలబడిన తరువాత ఐదు సార్లు అల్లాహు అక్బర్ అనాలి. ప్రతీ సారి చేతులు భుజాల వరకు ఎత్తాలి. సూరె ఫాతిహ మరో సూర చదివి రెండవ రకాతు పూర్తి చేయాలి. (మొదటి రకాతులో సూరె ఖాఫ్ లేదా సూరె అఅలా రెండవ రకాతులో సూరె ఖమర్ లేదా సూరె గాషియ చదవడం సున్నత్. (ముస్లిం 878, 891). (మొదటి రకాతులో ఏడు, రెండవ రకాతులో ఐదు తక్బీరుల విషయం అబూదావూదు 1149లో ఉంది).
పండుగ నమాజుకు ముందూ, వెనకా సున్నుతుగానీ, నఫిల్ గానీ ఏమీ లేవు. ఇమాంతో ఒక రకాతు పొందనివారు ఇమాం సలాం తింపిన తరువాత పూర్తి చేసుకోవాలి. ఇమాం ఖుత్బ ఇస్తున్న సమయంలో వచ్చినవారు కూర్చుండి ఖుత్బ వినాలి. ఖుత్బ ముగిసిన తరువాత పైన తెలిపిన విధానంలోనే నమాజ్ చేసుకోవాలి. ఒకరుంటే ఒంటరిగానే చేసుకోవాలి. ఇద్దరు ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే జమాఅతుతో (సామూహికంగా) చేసుకోవాలి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారుః “ఎవరైతే జనాజలో హాజరై నమాజ్ చేసే వరకు ఉంటాడో అతనికి ఒక ఖీరాత్ పుణ్యం లభించును. మరెవరైతే ఖననం చేయబడే వరకు ఉంటాడో అతనికి రెండు ఖీరాతుల పుణ్యం లభించును”. రెండు ఖీరాతులంటే ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానంగా “రెండు పెద్ద కొండలు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. (బుఖారి 1325, ముస్లిం 945).
జనాజ నమాజ్ యొక్క నిబంధనలు:
నియ్యత్ (సంకల్పం). ఖిబ్లా దిశలో నిలబడుట. సత్ర్ (అచ్ఛాదన). వుజూ.
జనాజ నమాజ్ విధానం:
ఇమాం (నమాజ్ చేయించు వ్యక్తి) పురుషుని శవము యొక్క తలకు ఎదురుగా నిలబడాలి. స్త్రీ శవము యొక్క మధ్యలో నిలబడాలి. ఇతర నమాజీలు ఇమాం వెనక నిలబడాలి. అల్లాహు అక్బర్ అని అఊజు బిల్లా…. బిస్మిల్లా….. మరియు సూరె ఫాతిహ చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని తషహ్హుద్ లో చదివే దరూదె ఇబ్రాహీం (అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్…) చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని శవము కొరకు దుఆ చేయాలిః అల్లా హుమ్మగ్ ఫిర్ లిహయ్యినా వ మయ్యితినా వ షాహిదినా వ గాయిబినా వసగీరినా వకబీరినా వ జకరినా వ ఉన్ సానా, అల్లాహుమ్మ మన్ అహ్ యయ్ తహూ మిన్నా ఫ అహ్ యిహీ అలల్ ఇస్లామ్ వమన్ తవఫ్ఫైతహూ మిన్నా ఫతవఫ్ఫహూ అలల్ ఈమాన్, అల్లాహుమ్మ లా తహ్ రిమ్ నా అజ్రహూ వలా తుజిల్లనా బఅదహూ. మళ్ళీ అల్లాహు అక్బర్ అని కొన్ని సెకండ్లు నిలిచి సలాం తింపాలి.
భావం : ఓ అల్లాహ్ మాలో బ్రతికున్న వారిని, మరణించిన వారిని, హాజరుగా ఉన్నవారిని, దూరముగా ఉన్నవారిని, చిన్నలను, పెద్దలను, పురుషులను, స్త్రీలను క్షమింపుము. ఓ అల్లాహ్ మాలో ఎవరిని సజీవంగా ఉంచదలుచుకున్నావో వారిని ఇస్లాంపై స్థిరముగా ఉంచుము. మాలో ఎవరిని మరణింపజేయదలిచావో వారిని విశ్వాసముపై మరణింపజేయుము. ఓ అల్లాహ్ అతని చావుపై మేము వహించిన ఓపిక పుణ్యాలు మాకు లేకుండా చేయకుము. అతని చావు పిదప మమ్మల్ని ఉపద్రవం, సంక్షోభంలో పడవేయకుము.
ఎవరైనా గర్భిణీలకు పూర్తి నాలుగు నెలలు నిండిన తరువాత గర్భము పడిపోయి, చనిపోయినచో దాని యొక్క జనాజ నమాజ్ చదవాలి. నాలుగు నెలలు పూర్తి కాక ముందు గర్భము పడిపోయి, చనిపోయినచో నమాజ్ చేయకుండా దానము చేయాలి.
నమాజ్ చేయరాని వేళలు:
కొన్ని సమయాల్లో నమాజ్ చేయుట యోగ్యం లేదు. అవిః
1- ఫజ్ర్ నమాజ్ తర్వాత నుండి సూర్యోదయం తర్వాత సూర్యుడు బారెడంత పైకి వచ్చే వరకు.
2- మిట్ట మధ్యానం, సూర్యుడు నడి ఆకాశంలో, తలకు సమానంగా ఉన్నప్పుడు. అది పశ్చిమాన వాలే వరకు.
3- అస్ర్ నమాజ్ తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు.
కాని ఈ సందర్భాల్లో కొన్ని నమాజులు చేయవచ్చును. ఉదాః తహియ్యతుల్ మస్జిద్ (మస్జిదులో ప్రవేశించిన వెంటనే చేయు నమాజ్). జనాజా నమాజ్. సూర్య గ్రహ నమాజ్. తవాఫ్ సున్నతులు. తహియ్యతుల్ వుజూ లాంటివి.
అలాగే తప్పిపోయిన నమాజులు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసు ఆధారంగాః
“ఎవరైనా ఏదైనా నమాజ్ మరచిపోతే, లేదా దాని సమయంలో నిద్రపోతే గుర్తు వచ్చిన వెంటనే దాన్ని నెరవేర్చడమే దాని ప్రాయశ్చితం”. (ముస్లిం 684, బుఖారి 597).
وصلى الله وسلم على نبنيا محمد وعلى آله و صحبه أجمعين والحمد لله رب العالمين
[1]క్రమ ప్రకారంగావుజూ చేయాలి. అంటేః 1 నుండి 8 వరకు ఉన్న క్రమం ప్రకారం వీటిలో వెనకా ముందు చేయకూడదు.
వెంటవెంటనేచేయాలి. అంటేః పై క్రమం ప్రకారం, ఒక అవయవం కడిగాక, దాని తడి ఆరక ముందే వెంటనే దాని వెనక అవయవం కడగాలి. మరీ ఆలస్యం చేయవద్దు.
[2] కొందరు బాలింత స్త్రీలు 15, లేదా 20, 25 రోజుల్లో రక్త స్రావం నిలిచిపోయినా 40 రోజుల తరువాతే గుస్ల్ చేస్తారు. ఆ తరువాతే నమాజు ఆరంభిస్తారు. వారు ఇలా చేసేది చాలా ఘోరమైన తప్పు. ఎప్పుడు రక్త స్రావం నిలిచినదో అప్పుడే గుస్ల్ చేయాలి. నమాజు మొదలెట్టాలి.
[3] రిబాత్ అంటే సత్యాసత్యాల మధ్య పోరాటం సాగే రోజుల్లో రాత్రిళ్ళు పహరా కాయడం అన్న మాట. శాంతి కాలంలో నమాజ్ పట్ల మక్కువ, పోరాటపు రోజుల్లో ప్రాణాలొడ్డి పహరాకాయడంతో సమానమని అర్థం.
[6]) దీని ఉదాహరణః ఒక వ్యక్తి మొదటి రకాతులో ఖిరాత్ తర్వతా రుకూ మరచిపోయి రెండు సజ్దాలు కూడా చేశాడనుకుందాము. రుకూ నమాజు ‘రుకున్’లలో ఒకటి. ఇక అతడు రెండవ రకాతు కొరకు నిలబడ్డాడు కాని ఖిరాత్ ఆరంభానికి ముందే అతనికి మరచిపోయిన రుకూ విషయం గుర్తొచ్చింది. అప్పుడు అతను రుకూ చేయాలి, రెండు సజ్దాలు చేయాలి. మళ్ళీ రెండవ రకాతు కొరకు నిలబడి యథా ప్రకారంగా నమాజు పూర్తి చేయాలి.
[7]) దీని ఉదాహరణః ఒక వ్యక్తి మొదటి రకాతులో ఖిరాత్ తర్వతా రుకూ మరచిపోయి రెండు సజ్దాలు కూడా చేశాడనుకుందాము. రుకూ నమాజు ‘రుకున్’లలో ఒకటి. ఇక అతడు రెండవ రకాతు కొరకు నిలబడి, ఖిరాత్ ఆరంభించిన తర్వాత గుర్తుకు వస్తే అతని ఆ రకాతు, ఎందులో అతను రుకూ మరచిపోయాడో అది కానట్లే. అందుకు ఈ రెండవ రకాతు మొదటి రకాతు స్థానంలో ఉంటుంది.
[8]) జహరీ నమాజు అంటే శబ్దంగా ఖుర్ఆను పారాయణం జరిగే ఫజ్ర్, మగ్రిబ్, ఇషా నమాజులు.
[9]) ముఖ్తదీ అంటే సామూహిక నమాజులో ఇమాం వెనక నమాజు చేయువారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అజాన్ కు ముందు లేదా కనీసం అజాన్ అయిన వెంటనే నమాజు కోసం మస్జిద్ కు వెళ్ళే అలవాటు వేసుకోవడంలో ఎంత గొప్ప పుణ్యం ఉందో తెలుపుతుందీ మీకు ఈ వీడియో
నమాజుకు త్వరగా వెళ్ళుట (التبكير إلى الصلاة) https://www.youtube.com/watch?v=UAVJmKoyW7A[2 నిమిషాలు ] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మాబాద్.
నమాజులో ఎల్లప్పుడూ ముందడుగు వేయుట, నమాజు కొరకు శీఘ్రపడుట, తొందరపడుట, నమాజ్ చేయటానికై మస్జిద్ కు వెళ్లడంలో అందరికంటే ముందు ఉండే ప్రయత్నం చేయుట ఇది ఎంతో శుభకరమైన, ఎంతో గొప్ప పుణ్యం గల ఒక సత్కార్యం. ఈ రోజుల్లో చాలామంది ఈ సత్కార్యాన్ని ఎంతో మర్చిపోతున్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ వినండి. ప్రవక్త గారు చెప్పారు:
لَوْ يَعْلَمُ النَّاسُ مَا فِي النِّدَاءِ وَالصَّفِّ الْأَوَّلِ లవ్ యాలమున్నాసు మాఫిన్నిదాయి వస్సఫ్ఫిల్ అవ్వల్. ఒకవేళ ప్రజలకు అదాన్ ఇవ్వడంలో, మొదటి పంక్తిలో నిలబడడంలో ఎంత పుణ్యం ఉన్నదో తెలిసి ఉండేది ఉంటే,
ثُمَّ لَمْ يَجِدُوا إِلَّا أَنْ يَسْتَهِمُوا عَلَيْهِ لَاسْتَهَمُوا సుమ్మలమ్ యజిదూ ఇల్లా అయస్తహిమూ అలైహి లస్తహమూ. ఈ సదవకాశాన్ని పొందడానికి, అంటే అదాన్ ఇవ్వడానికి మరియు మొదటి పంక్తిలో నిలబడడానికి వారికి కురా వేసుకోవడం, చీటీ వేయడం లాంటి అవసరం పడినా వారు వేసుకొని ఆ అవకాశాన్ని పొందే ప్రయత్నం చేసేవారు.
అలాగే,
وَلَوْ يَعْلَمُونَ مَا فِي التَّهْجِيرِ لَاسْتَبَقُوا إِلَيْهِ వలవ్ యాలమూన మాఫిత్తహ్జీర్ లస్తబఖూ ఇలైహ్. ముందు ముందు వెళ్లడం, అందరికంటే ముందు ఉండే ప్రయత్నం చేయడంలో ఎంత పుణ్యం ఉన్నదో వారికి తెలిసి ఉండేది ఉంటే దానికి త్వరపడేవారు, తొందరగా వెళ్లేవారు.
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరొక హదీస్ కూడా వినండి. ఇప్పుడు విన్న హదీసులో ఘనత తెలిసింది. చాలా గొప్ప పుణ్యం ఉన్నది అని చెప్పారు. ఆ పుణ్యం ఎంతో అనేది వివరణ ఇవ్వడం లేదు. కానీ మరో హదీస్ చాలా భయంకరంగా ఉంది. ఎవరైతే వెనకనే ఉండిపోతా ఉంటారో వారి గురించి హెచ్చరిస్తూ చెప్పారు:
لَا يَزَالُ قَوْمٌ يَتَأَخَّرُونَ حَتَّى يُؤَخِّرَهُمُ اللَّهُ లా యజాలు కౌమున్ యతఅఖ్ఖరూన్ హత్తా యుఅఖ్ఖిరహుముల్లాహ్. కొందరు నమాజుల్లో మస్జిద్ కు వెళ్లడంలో మాటిమాటికీ వెనక ఉండే ప్రయత్నం చేస్తారు, చాలా దీర్ఘంగా వస్తూ ఉంటారు. చివరికి అల్లాహుతాలా వారిని వెనకనే ఉంచేస్తాడు. అన్ని రకాల శుభాలకు, అన్ని రకాల మేళ్లకు, అన్ని రకాల మంచితనాలకు వారు వెనకే ఉండిపోతారు.
అల్లాహుతాలా ప్రతీ సత్కార్యంలో మస్జిద్ కు వెళ్లడంలో ముందడుగు వేసే భాగ్యం ప్రసాదించుగాక. మరియు వెనక ఉండే వారిలో ఎవరైతే కలుస్తారో అలాంటి వారి నుండి అల్లాహ్ మనల్ని కాపాడుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.