హిజ్రీ క్యాలెండర్ ఆవశ్యకత | Importance of Hijri Calendar [వీడియో]

హిజ్రీ క్యాలెండర్ ఆవశ్యకత | Importance of Hijri Calendar [వీడియో]
https://youtu.be/yooNUIwiSMs [21 min]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రస్తుతం మనం క్రొత్త హిజ్రీ సంవత్సరం లోకి ప్రవేశించాము (హిజ్రీ 1444). ముహర్రం మాసం హిజ్రీ క్యాలెండరు లోని మొదటి నెల. హిజ్రత్ అంటే వలస పోవడం. మక్కా నుండి మదీనా కు హిజ్రత్ చేయడం పురస్కరించుకొని ఈ హిజ్రీ క్యాలెండరు తయారు అయింది

ఈ వీడియో లో :

  1. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి కాలంలో ఏ విధం అయిన క్యాలెండరు వాడేవారు.
  2. హిజ్రీ కేలండర్ ఎప్పుడు మొదలైంది, ఏ ఖలీఫా కాలంలో హిజ్రీ క్యాలండర్ నిర్ణయించారు.
  3. మక్కా నుండి మదీనా కు హిజ్రత్ చేయడం పురస్కరించుకొని ఈ హిజ్రీ క్యాలెండరు ఎందుకు తయారు అయింది?
  4. హిజ్రీ క్యాలెండరు విశిష్టత
  5. షరియత్ లో హిజ్రీ కేలండర్ ఆవశ్యకత
  6. ఇంకా ఎన్నో మంచి విషయాలు షేఖ్ గారు వివరించారు

తప్పకుండ వినండి, మీ బంధు మిత్రులకు షేర్ చెయ్యండి, ఇన్ షా అల్లాహ్

ముహర్రం & ఆషూరా (ముహర్రం 10 వ తేదీ) మెయిన్ పేజీ
https://teluguislam.net/2020/08/20/muharram/

సూరహ్ బయ్యినహ్ ఘనత – షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ [వీడియో]

సూరహ్ బయ్యినహ్ ఘనత – షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ [వీడియో]
https://youtu.be/qxwqKWAlKgc [12 నిముషాలు]

98. సూరా అల్ బయ్యినహ్

98:1 لَمْ يَكُنِ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ مُنفَكِّينَ حَتَّىٰ تَأْتِيَهُمُ الْبَيِّنَةُ
గ్రంథవహులకు చెందిన తిరస్కారులు, బహుదైవారాధకులు తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం రానంతవరకూ (తమ తిరస్కార వైఖరిని) మానుకోనివారుగా ఉండేవారు. (ఇంతకీ ఆ నిదర్శనం ఏమిటంటే…)

98:2 رَسُولٌ مِّنَ اللَّهِ يَتْلُو صُحُفًا مُّطَهَّرَةً
పరిశుద్ధమైన గ్రంథ పత్రములను చదివి వినిపించే దైవప్రవక్త తమ వద్దకు రావాలి.

98:3 فِيهَا كُتُبٌ قَيِّمَةٌ
మరి వాటిలో (ఆ గ్రంథ పత్రాలలో) స్థిరమైన, సవ్యమైన ఆదేశాలు ఉండాలి.

98:4 وَمَا تَفَرَّقَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ إِلَّا مِن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَةُ
మరి (ఈ) గ్రంథవహులు తీరా తమ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చేసిన తరువాతే (విభేదించుకొని) చీలిపోయారు.

98:5 وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ وَيُقِيمُوا الصَّلَاةَ وَيُؤْتُوا الزَّكَاةَ ۚ وَذَٰلِكَ دِينُ الْقَيِّمَةِ
వారు అల్లాహ్ నే ఆరాధించాలని ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలనీ, ఏకాగ్రచిత్తులై – నమాజును నెలకొల్పాలనీ, జకాత్ ను ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి ఆదేశించబడింది. ఇదే స్థిరమైన సవ్యమైన ధర్మం.

98:6 إِنَّ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ فِي نَارِ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۚ أُولَٰئِكَ هُمْ شَرُّ الْبَرِيَّةِ
గ్రంథవహులలో తిరస్కారవైఖరికి పాల్పడినవారు, బహుదైవారాధకులు తప్పకుండా నరకాగ్నికి ఆహుతి అవుతారు. వారందులో కలకాలం ఉంటారు. వారు సృష్టితాలలో అందరికంటే చెడ్డవారు.

98:7 إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ هُمْ خَيْرُ الْبَرِيَّةِ
అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు; నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు.

98:8 جَزَاؤُهُمْ عِندَ رَبِّهِمْ جَنَّاتُ عَدْنٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ ذَٰلِكَ لِمَنْ خَشِيَ رَبَّهُ
వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర శాశ్వతమైన స్వర్గ వనాలున్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతోషపడ్డారు. ఈ అనుగ్రహ భాగ్యం తన ప్రభువుకు భయపడే వానికి మాత్రమే.

అల్లాహ్ యొక్క హద్దులను మితిమీరకండి [వీడియో]

అల్లాహ్ యొక్క హద్దులను మితిమీరకండి [వీడియో]
వక్త: షరీఫ్, వైజాగ్ (హఫిజహుల్లాహ్), మదీనా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్
https://youtu.be/VKKIMPEnFmM [46 నిముషాలు]

షేఖ్ షరీఫ్, మదీనా గ్రాడ్యుయేట్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0AKZXyDn6KYNFu5ok4ZFtb

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

ప్రవక్త ﷺ మనవళ్లు – హసన్, హుసైన్ (రదియల్లాహు అన్హుమా) విశిష్టతలు [వీడియో]

ప్రవక్త ﷺ మనవళ్లు – హసన్, హుసైన్ (రదియల్లాహు అన్హుమా) విశిష్టతలు | ముహమ్మద్ సలీం జామి’ఈ
https://youtu.be/9hw5NIyuQzc [33 నిముషాలు]

ముహర్రం నెలలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? ఈ నెలతో హుస్సైన్ (రజియల్లాహు అన్హు) కు సంబంధం ఏమిటి? – ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) [వీడియో] [60నిముషాలు]
https://teluguislam.net/2020/08/25/muharram-ashura-sunnah-and-bidah/

హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) హంతకులెవరు? [వీడియో][50:41 నిముషాలు]
ఫజీలతుష్షేఖ్ సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)
https://teluguislam.net/2020/08/26/who-killed-al-husayn/

ముహర్రం మాసం & సహాబాల ఔన్నత్యం [వీడియో] [55 నిముషాలు]
https://teluguislam.net/2020/08/31/muharram-and-greatness-of-sahaba/
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ముహర్రం పండుగ ఎలా జరుపుకోవాలి? [వీడియో]
https://teluguislam.net/2020/08/20/can-we-celebrate-muharram-festival/
మనం ముహర్రం పండుగ జరుపుకోవచ్చా? జరుపుకో కూడదు అంటే ఏంటి సాక్ష్యం (దలీల్)? జరుపుకొనేది ఉండి వుంటే ఎలా జరుపుకోవాలి? – వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అల్లాహ్ శుభ నామమైన “రబ్బ్” యొక్క వివరణ [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ శుభ నామమైన “రబ్బ్” యొక్క వివరణ [వీడియో]
https://youtu.be/NTehdBRdCxg [28 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో అల్లాహ్ యొక్క శుభనామమైన “అర్-రబ్” (ప్రభువు) యొక్క లోతైన అర్థాలు మరియు భావనలు వివరించబడ్డాయి. “రబ్” అనే పదం సృష్టించడం, పోషించడం, నిర్వహించడం, నాయకత్వం వహించడం వంటి అనేక విస్తృతమైన అర్థాలను కలిగి ఉంటుందని వక్త తెలియజేశారు. ఈ పదం ఒంటరిగా ప్రయోగించబడినప్పుడు కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకం అని, ఇతరులకు వాడాలంటే మరొక పదాన్ని జతచేయాలని అరబిక్ వ్యాకరణ నియమాన్ని ఉదహరించారు. అల్లాహ్ యొక్క రుబూబియత్ (ప్రభుత్వం) రెండు రకాలుగా ఉంటుందని వివరించారు: ఒకటి సాధారణ రుబూబియత్, ఇది సృష్టిలోని అందరి కోసం (విశ్వాసులు, అవిశ్వాసులతో సహా); రెండవది ప్రత్యేక రుబూబియత్, ఇది కేవలం విశ్వాసులకు, ప్రవక్తలకు మాత్రమే ప్రత్యేకం, దీని ద్వారా అల్లాహ్ వారికి విశ్వాస భాగ్యం, మార్గదర్శకత్వం మరియు ప్రత్యేక సహాయాన్ని అందిస్తాడు. ప్రవక్తలందరూ తమ ప్రార్థనలలో (దుఆ) “రబ్బనా” (ఓ మా ప్రభూ) అని అల్లాహ్ ను ఎలా వేడుకున్నారో ఖుర్ఆన్ ఆయతుల ద్వారా ఉదహరించారు. చివరగా, అల్లాహ్ ను ఏకైక రబ్ గా అంగీకరించడం తౌహీద్ యొక్క మూలమని, ఆయనతో పాటు ఇతరులను సంతానం, స్వస్థత లేదా ఇతర అవసరాల కోసం ఆరాధించడం షిర్క్ అనే ఘోరమైన పాపమని హెచ్చరించారు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబీయినా ముహమ్మద్ వఆలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్. అమ్మా బాద్.

أَعُوذُ بِاللَّهِ السَّمِيعِ الْعَلِيمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అఊజు బిల్లాహిస్ సమీయిల్ అలీమి మినష్ షైతానిర్ రజీమ్)
వినువాడు, సర్వజ్ఞాని అయిన అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను, శపించబడిన షైతాను నుండి.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(అల్ హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
సర్వస్తోత్రాలు, పొగడ్తలన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే.

అల్లాహ్ యొక్క శుభనామం రబ్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. అయితే, ప్రియ విద్యార్థులారా, వీక్షకులారా! రబ్ అన్న అల్లాహ్ యొక్క ఈ శుభనామం, ఉత్తమ పేరు, దీని యొక్క భావాన్ని, అర్థాన్ని గనక మనం చూస్తే, ఇందులో ఎన్నో అర్థాలు, ఎన్నో భావాలు వస్తాయి. అయితే, ఆ భావాలు తెలిపేకి ముందు అరబీ గ్రామర్ ప్రకారంగా ఒక మాట మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటంటే, రబ్ మరియు సర్వసామాన్యంగా అరబీలో అర్-రబ్ అన్న ఈ పదం కేవలం విడిగా రబ్ లేదా అర్-రబ్, అల్లాహ్ కు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అల్లాహ్ ను కాకుండా వేరే ఎవరి గురించైనా ఈ పదం ఉపయోగించాలంటే, తప్పకుండా దానితో పాటు మరొక పదాన్ని కలపడం తప్పనిసరి. ఈ యొక్క నియమం ఏదైతే మీరు తెలుసుకున్నారో, ఇప్పుడు ఇది మంచిగా మీకు అర్థం కావాలంటే రండి, రబ్ యొక్క అర్థాన్ని తెలుసుకుంటే మనకు ఈ విషయం తెలుస్తుంది.

రబ్ యొక్క అర్థంలో పుట్టించడం, పోషించడం, జీవన్మరణాలు ప్రసాదించడం మరియు నిర్వహించడం, నడిపించడం ఇవన్నీ భావాలతో పాటు, ఏదైనా విషయాన్ని చక్కబరచడం, దానిని రక్షించుకుంటూ ఉండడం, చూడడం, ఇంకా నాయకుడు, ఉన్నత హోదా అంతస్తులు కలిగి ఉన్నవాడు, ఎవరి ఆదేశం మాత్రమే చెల్లుతుందో ప్రజలు అనుసరిస్తారో, ఎవరి పెత్తనం నడుస్తుందో ఇలాంటి భావాలన్నీ కూడా ఇందులో ఉపయోగపడతాయి, ఈ భావాలన్నీ కూడా ఈ పదానికి వస్తాయి.

ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ‘అల్-బదాయిఉల్ ఫవాయిద్’ లో తెలిపారు,

إِنَّ هَذَا الِاسْمَ إِذَا أُفْرِدَ تَنَاوَلَ فِي دَلَالَاتِهِ سَائِرَ أَسْمَاءِ اللَّهِ الْحُسْنَى وَصِفَاتِهِ الْعُلْيَا
(ఇన్న హాజల్ ఇస్మ ఇజా ఉఫ్రిద తనావల ఫీ దిలాలాతిహి సాయిర అస్మాఇల్లాహిల్ హుస్నా వ సిఫాతిహిల్ ఉల్యా)
“నిశ్చయంగా ఈ పేరు (అర్-రబ్) ఒంటరిగా ప్రయోగించబడినప్పుడు, దాని సూచనలలో అల్లాహ్ యొక్క ఇతర ఉత్కృష్టమైన నామాలు మరియు ఉన్నత గుణాలన్నీ చేరిపోతాయి.”

ఈ మాటను షేఖ్ అబ్దుర్రజాక్ అల్-బదర్ హఫిజహుల్లాహ్ ప్రస్తావించి, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ యొక్క మాట ఇలా చెప్పారు:

إِنَّ الرَّبَّ هُوَ الْقَادِرُ الْخَالِقُ الْبَارِئُ الْمُصَوِّرُ الْحَيُّ الْقَيُّومُ الْعَلِيمُ السَّمِيعُ الْبَصِيرُ الْمُحْسِنُ الْمُنْعِمُ الْجَوَادُ، الْمُعْطِي الْمَانِعُ الضَّارُّ النَّافِعُ الْمُقَدِّمُ الْمُؤَخِّرُ
(ఇన్నర్-రబ్బ హువల్ ఖాదిరుల్ ఖాలిఖుల్ బారివుల్ ముసవ్విరుల్ హయ్యుల్ ఖయ్యుముల్ అలీముస్ సమీయుల్ బసీరుల్ ముహ్సినుల్ మున్ఇముల్ జవాద్, అల్ ముఅతీ అల్ మానిఉ అద్దార్రు అన్నాఫిఉ అల్ ముఖద్దిము అల్ ముఅఖ్ఖిర్)

రబ్ అన్న యొక్క ఈ పదం అల్లాహ్ గురించి ఉపయోగించినప్పుడు, అల్లాహ్ యొక్క ఇంకా వేరే ఎన్నో పేర్లలో ఉన్నటువంటి భావం ఇందులో వచ్చేస్తుంది. అయితే, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ కంటే కూడా చాలా ముందు ఇమామ్ తబరీ రహిమహుల్లాహ్, తఫ్సీర్ యొక్క పుస్తకాలలో ప్రామాణికమైన పరంపరలతో పేర్కొనబడిన మొట్టమొదటి తఫ్సీర్ అని దీనికి పేరు వచ్చింది, తఫ్సీరె తబరీ, అందులో ఇమామ్ ఇబ్ను జరీర్ రహిమహుల్లాహ్ చెప్పారు:

الرَّبُّ فِي كَلَامِ الْعَرَبِ مُتَصَرِّفٌ عَلَى مَعَانٍ، فَالسَّيِّدُ الْمُطَاعُ فِيهِمْ يُدْعَى رَبًّا
(అర్-రబ్బు ఫీ కలామిల్ అరబ్ ముతసర్రిఫున్ అలా మఆన్, ఫస్-సయ్యిదుల్ ముతాఉ ఫీహిమ్ యుద్ఆ రబ్బన్)
“అరబ్బుల భాషలో ‘రబ్’ అనే పదం అనేక అర్థాలలో వస్తుంది. వారిలో విధేయత చూపబడే నాయకుడిని ‘రబ్’ అని పిలుస్తారు.”

అరబీ భాషలో, అరబ్బుల మాటల్లో అర్-రబ్ అన్న పదం ఏ నాయకుడినైతే అనుసరించడం జరుగుతుందో, అలాంటి వాటిని మరియు ఏ మనిషి అయితే అన్ని విషయాలను, వ్యవహారాలను చక్కబరిచి వాటిని సరిదిద్ది, వాటి బాగోగులు చూసుకుంటాడో, అలాంటి వాడిని మరియు ఏదైనా విషయానికి అధికారి అయిన అలాంటి వారికి కూడా అర్-రబ్ అన్న పదం ఉపయోగపడుతుంది.

ఈ విధంగా, ఇంటి యొక్క యజమాని అని మనం అంటాము తెలుగులో. దీని గురించి అరబీలో రబ్బుద్-దార్. కేవలం రబ్ కాదు. దార్ అంటే ఇల్లు. ఇంటి యొక్క యజమాని – రబ్బుద్-దార్. ఈ పని యొక్క బాధ్యుడురబ్బుల్-అమల్. ఇప్పటికీ కువైట్ మరియు మరికొన్ని దేశాలలో స్పాన్సర్ ఎవరైతే ఉంటారో, సౌదీలో ‘కఫీల్‘ అని ఏదైతే అనడం జరుగుతుందో, అలా కువైట్‌లో ‘రబ్బుల్ అమల్’ అని అక్కడ పిలవడం, చెప్పడం జరుగుతుంది.

ఈ భావాన్ని మీరు తెలుసుకున్నారంటే, ఇక మనం అల్లాహ్ యొక్క పేరు చెప్పుకుంటున్నాము గనక, అల్లాహ్ యొక్క పేరు ఒకటి రబ్ ఉంది అని, తౌహీద్ కు సంబంధించిన మూడు ముఖ్యమైన భాగాలు – తౌహీదె రుబూబియత్, తౌహీదె అస్మా వ సిఫాత్, తౌహీదె ఉలూహియత్ – వీటిలో ఒకటి రుబూబియత్. అంటే ఈ మొత్తం విశ్వంలో సృష్టించడం, పోషించడం, నిర్వహించడంలో ఏకైకుడు, ఎలాంటి భాగస్వామి లేనివాడు అల్లాహ్ అని మనం విశ్వసించాలి, మనం నమ్మాలి.

అయితే, ఈ మొత్తం సృష్టిని సృష్టించడంలో అల్లాహ్ కు ఎవరూ కూడా భాగస్వామి లేరు. ఖుర్ఆన్ లో మనం శ్రద్ధగా చదివామంటే, ఈ విషయం చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఉదాహరణకు, అల్లాహ్ త’ఆలా ఖుర్ఆన్ లో కొన్ని సందర్భాలలో అల్లాహ్ మాత్రమే మన యొక్క రబ్ అని తెలియజేస్తూ, ఆయనే ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించిన వాడు అని స్పష్టంగా తెలిపాడు. సూరతుల్ అన్ఆమ్, సూరహ్ నంబర్ ఆరు, ఆయత్ నంబర్ 102 చూడండి:

ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ خَالِقُ كُلِّ شَيْءٍ فَاعْبُدُوهُ
(జాలికుముల్లాహు రబ్బుకుమ్, లా ఇలాహ ఇల్లా హువ, ఖాలిఖు కుల్లి షైఇన్ ఫఅబుదూహ్)
ఆయనే అల్లాహ్‌. మీ ప్రభువు. ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధ్యులు కారు. సమస్త వస్తువులను సృష్టించినవాడు ఆయనే. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. (6:102)

ఈ ఆయతును మీరు రాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన ఒక్క మాటకే కాదు ఇది దలీల్, ఈ ఆయత్ యొక్క భాగం ఏదైతే నేను చదివానో ఇప్పుడు, తెలుగు అనువాదం చెప్పానో, ఇందులో మరి ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. ఇంకా ముందుకు కూడా నేను దీనిని ప్రస్తావిస్తాను. సూరె అన్ఆమ్ సూరహ్ నంబర్ ఆరు, ఆయత్ నంబర్ 102.

అల్లాహ్ త’ఆలాయే విశ్వంలో ఉన్నటువంటి ప్రతి దాని యొక్క మేలు, సంక్షేమాలు, వారందరి యొక్క బాగోగులు చూసుకుంటూ వారికి కావలసినటువంటి ప్రతి వారికి అవసరం తీర్చువాడు అల్లాహ్ మాత్రమే అన్నటువంటి భావం ఈ అర్-రబ్ అనే పదంలో ఉంది.

రబ్ లో రబ్బా యురబ్బీ తర్బియతన్. తర్బియత్పోషించడం అన్న పదం, అన్న భావం ఏదైతే ఉందో, ఇందులో రెండు రకాలు అన్న విషయం స్పష్టంగా తెలుసుకోండి.

అల్లాహ్ త’ఆలా రబ్, ప్రతి ఒక్కరి రుబూబియత్, ప్రతి ఒక్కరి తర్బియత్ వారి వారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో దాని పరంగా వారిని పోషించే బాధ్యత అల్లాహ్ ఏదైతే తీసుకున్నాడో, అల్లాహ్ మాత్రమే చేయగలుగుతున్నాడో, దీని యొక్క ఈ రబ్ యొక్క భావంలో రెండు రకాలు ఉన్నాయి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

ఒకటి, పాపాత్ముడైనా, పుణ్యాత్ముడైనా, విశ్వాసుడైనా, అవిశ్వాసుడైనా, సన్మార్గంపై ఉన్నవాడైనా, మార్గభ్రష్టంలో ఉన్నవాడైనా, ప్రతి ఒక్కరి సృష్టి, ఉపాధి, వారి యొక్క నిర్వహణ, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరిని పైకి లేపాలి, ఎవరిని అధోగతికి పాలు చేయాలి, ఇదంతా కూడా అల్లాహ్ త’ఆలా చేస్తూ ఉంటాడు. ఇక ఇందులో అల్లాహ్ కు ఎవరూ కూడా భాగస్వామి లేరు. ఇది ఒక సామాన్యమైన భావం.

కానీ అల్లాహ్ త’ఆలా తన యొక్క ప్రవక్తలకు, తన ప్రత్యేకమైన పుణ్యాత్ములైన దాసులకు, సద్వర్తనులకు, విశ్వాస భాగ్యం, ప్రవక్త పదవి లాంటి గొప్ప మహా భాగ్యం, అల్లాహ్ యొక్క ఆరాధన సరైన రీతిలో చేసే అటువంటి భాగ్యం, మరియు వారు పాపాలను వదిలి పుణ్యాల వైపునకు రావడం, పాపం పొరపాటు జరిగిన వెంటనే తౌబా చేసే భాగ్యం కలుగజేయడం, ఇదంతా కూడా అల్లాహ్ యొక్క ప్రత్యేక రుబూబియత్. ఇది ప్రసాదించేవాడు కూడా అల్లాహ్ త’ఆలాయే. కానీ ఇలాంటివి ప్రత్యేక రుబూబియత్ లోని విషయాలు ఎవరికైనా లభించాలంటే, వారు అల్లాహ్ వైపునకు మరలడం కూడా తప్పనిసరి.

గమనించండి ఇక్కడ ఒక విషయం, అల్లాహ్ త’ఆలాయే నన్ను పుట్టించాడు, ఆయనే నన్ను పోషిస్తూ ఉన్నాడు. ఇహలోకంలో నేను రాకముందు తల్లి గర్భంలో నన్ను ఎలా పోషిస్తూ వచ్చాడు, పుట్టిన వెంటనే, మనం గమనించాలి ఇక్కడ. మనం మనుషులం గాని, పక్షులు గాని, జంతువులు, పశువులు గాని అల్లాహ్ యొక్క రుబూబియత్ విషయాన్ని గమనించేది ఇక్కడ చాలా గొప్ప ఒక నిదర్శనం మనకు ఉన్నది. గుడ్డులో ఉన్నా గాని పక్షులు, లేక పశువులు, జంతువులు, మనుషులు తల్లి గర్భంలో ఉన్నప్పుడు గాని, అక్కడ వారి యొక్క మొత్తం జన్మ యొక్క ప్రక్రియ ఎలా కొనసాగిస్తున్నాడు, అల్లాహ్ తప్ప వేరే ఎవరికైనా ఇలాంటి శక్తి ఉందా?

పుట్టిన వెంటనే, గుడ్డులో పూర్తి పక్షి తయారవుతుంది. బయటికి రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ అది వస్తుంది. మరియు వచ్చిన వెంటనే దానికి కావలసిన ఆహారం కళ్ళు తెరవకముందు ఎలా తల్లి దానికి ఇవ్వాలి అన్నటువంటి భాగ్యం, జ్ఞానం, అల్లాహ్ త’ఆలా ఆ పక్షికి ఎలా కలుగజేస్తాడో గమనించండి. ఇక మనిషి, జంతువుల విషయానికి వస్తే, పుట్టిన వెంటనే తన యొక్క ఆహారం ఎక్కడ ఉన్నదో అటు జంతువు గాని, అటు మనిషి గాని తన తల్లి స్థనాల్లో అన్న విషయాన్ని ఎలా గమనిస్తాడో చూడండి. ఈ భాగ్యం ఎవరు కలుగజేస్తున్నారు? ‘రబ్’ అన్నటువంటి పదం మనం చదివినప్పుడు, ఈ విషయాలు చూస్తున్నప్పుడు, అల్లాహ్ పై మన యొక్క విశ్వాసం అనేది చాలా బలంగా ఉండాలి. అయితే మనం పుట్టిన తర్వాత క్రమంగా మనలో ఎలాంటి శక్తి పెరుగుతుందో, మనలో బుద్ధిజ్ఞానాలు ఎలా పెరుగుతాయో, ఈ విషయంలో కూడా అల్లాహ్ రబ్ అయి మనల్ని ఎలా పెంచుతున్నాడో, ఇందులో మన కొరకు గొప్ప నిదర్శనాలు ఉన్నాయి.

ఇంతటి గొప్ప రబ్ అయిన అల్లాహ్, మనల్ని ఏ ఆదేశం ఇవ్వకుండా, మనల్ని పుట్టించి, మనకు ఏ ఉద్దేశం లేకుండా చేస్తాడా? చేయడు. అందుకొరకే అల్లాహ్ ఏమంటున్నాడు:

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ
(అఫహసిబ్తుమ్ అన్నమా ఖలఖ్నాకుమ్ అబసవ్ వఅన్నకుమ్ ఇలైనా లా తుర్ జఊన్)
“మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా?”(23:115)

అలా కాదు. ఒక ఉద్దేశపరంగా మిమ్మల్ని పుట్టించాము. అదేంటి? ఆ అల్లాహ్ యొక్క ఆరాధన మనం చేయడం. అందుకొరకే, ఖుర్ఆన్ లో అనేక సందర్భాలలో అల్లాహ్ తన రుబూబియత్ కు సంబంధించిన నిదర్శనాలు చూపించి, వెంటనే ఉలూహియత్ వైపునకు అల్లాహ్ త’ఆలా ఆహ్వానిస్తాడు. ఉదాహరణకు, ఇప్పుడు నేను చదివినటువంటి ఆయతే చూడండి. సూరత్ అన్ఆమ్, సూరహ్ నంబర్ ఆరు, ఆయత్ నంబర్ 102, ‘జాలికుముల్లాహు రబ్బుకుమ్’ – ఆయనే మీ ప్రభువు. అల్లాహ్ మీ ప్రభువు. ‘లా ఇలాహ ఇల్లా హువ’ – ఆయన తప్ప ఎవరు కూడా మీకు ఆరాధ్యనీయుడు కాడు. ఆయనే మిమ్మల్ని పుట్టించాడు గనక, ప్రతి వస్తువుని పుట్టించాడు గనక, మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించండి.

ఇదే విధేయత, ఆరాధనా భావంతో మనం అల్లాహ్ ను వేడుకోవాలని మనకు నేర్పడం జరిగింది. మరియు మనం గనక ప్రత్యేకంగా సూరతుల్ అంబియాలో మరియు వేరే ఇతర సూరాలలో చూస్తే ప్రవక్తలు అందరూ అల్లాహ్ తో ప్రత్యేక వేడుకోలు, దుఆ, అర్ధింపు లాంటి విషయాలు ఎలా అల్లాహ్ తో అడిగేవారు? ‘రబ్బనా’.

రబ్బీ అంటే ఇది ఏకవచనం – ఓ నా ప్రభువా. రబ్బనా – ఓ మా ప్రభువా.

అయితే, ఆదం అలైహిస్సలాం కూడా ఎలా దుఆ చేశారు?

رَبَّنَا ظَلَمْنَا أَنْفُسَنَا
(రబ్బనా జలమ్నా అన్ఫుసనా)
“ఓ మా ప్రభూ! మేము మా ఆత్మలకు అన్యాయం చేసుకున్నాము”

అలాగే ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, హూద్ అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం, యాఖూబ్ అలైహిస్సలాం, ఇంకా ఎందరో ప్రవక్తల దుఆలు ఖుర్ఆన్ లో ఉన్నాయి కదా. ఇతరులతో దుఆ చేయడం ఎంత ఘోరం అన్నటువంటి ఒక వీడియో మాది ఉంది, మీరు చూడండి. ప్రవక్తలందరి దుఆలు ‘రబ్బనా’ తో స్టార్ట్ అవుతాయి. ఎందుకు? అల్లాహ్ యే మనల్ని అన్ని రకాలుగా పోషించి, పెంచి, మన యొక్క అవసరాలు తీర్చి మనల్ని చూసుకుంటూ, మన యొక్క బాగోగులు చూసుకుంటూ ఉండేవాడు. అందుకొరకు ‘రబ్బనా’. అల్లాహ్ యొక్క నామం ఎంత గొప్పదో అది ఇంతకుముందే మనం తెలుసుకున్నాము. కానీ దుఆలో వచ్చేసరికి, ‘రబ్బీ అవ్జిఅనీ అన్ అష్కుర నిఅమతకల్ లతీ’..సులైమాన్ అలైహిస్సలాం వారి యొక్క దుఆ కూడా. ఈ విధంగా అనేక సందర్భాలలో ‘రబ్బీ’ మరియు ‘రబ్బనా’ అన్నటువంటి పదాలతో దుఆ చేయడం మనకు నేర్పడం జరిగింది.

సోదర మహాశయులారా! అల్లాహ్ త’ఆలా రబ్ అయి ఉన్నాడు గనక, మనము అల్లాహ్ యొక్క రబ్ అన్న ఈ పదాన్ని ఎక్కడెక్కడ చదివినా గొప్ప విషయం మనం గమనించాల్సింది ఏమిటంటే, ఈ లోకంలో ఎంతోమంది తమకు తాము రబ్ అన్నటువంటి ఆరోపణ, దావా చేశారు.

ఉదాహరణకు, ఇబ్రాహీం అలైహిస్సలాం కాలంలో నమ్రూద్, మూసా అలైహిస్సలాం కాలంలో ఫిరౌన్. ఇక్కడ వారి యొక్క నమ్మకం ఏంటి? మేము రాజులము గనక, అందరూ ప్రజలు గనక, మా ఇష్టప్రకారమే మీరు జీవితం గడపాలి, మా ఆదేశాలను అనుసరించాలి. అల్లాహ్ ను నమ్మేవారు, వారు కూడా. “అల్లాహ్ కాకుండా మేము పుట్టించాము ఈ భూమ్యాకాశాలను, మేము మిమ్మల్ని పుట్టించాము” ఇలాంటి దావా లేకుండింది వారిది. సయ్యద్-ముతా అన్నటువంటి భావనతో, అంటే మాది పెత్తనం, మా మాటే చెల్లాలి, నడవాలి.

అయితే ఈరోజుల్లో కూడా ఎవరికైనా ఏదైనా అధికారం దొరికినదంటే, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు ఉన్నాడు, అసలైన రబ్ అతను, అసలైన విధేయత అతనిది, మనం ఆరాధించవలసినది అల్లాహ్ ను అన్న విషయాన్ని మరచిపోయి, అల్లాహ్ యొక్క మాటకు వ్యతిరేకమైన, నేను నాయకుడిని నా మాట మీరు వినాలి అన్నటువంటి గర్వానికి ఏదైతే గురి అవుతారో, వారు కూడా భయపడాలి ఫిరౌన్ లాంటి గతి వారిది అవుతుంది అని. అందుకొరకే ఎల్లవేళల్లో అల్లాహు త’ఆలా తో భయపడి, అల్లాహ్ ను రబ్ అని ఏదైతే మనం నమ్ముతున్నామో,

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ
(యా అయ్యుహన్నాసు ఉబుదూ రబ్బకుమ్)
ఓ ప్రజలారా! మీ ప్రభువైన, మీ యొక్క రబ్ అయిన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. (2:21)

إِنَّ اللَّهَ رَبِّي وَرَبُّكُمْ فَاعْبُدُوهُ ۚ هَٰذَا صِرَاطٌ مُسْتَقِيمٌ
(ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బుకుమ్ ఫఅబుదూహ్, హాదా సిరాతుమ్ ముస్తఖీమ్)
నా ప్రభువు, నా యొక్క రబ్, మీ యొక్క రబ్ అల్లాహ్ మాత్రమే గనక ఆయన్నే ఆరాధించండి. ఇదియే సన్మార్గం.  (3:51)

ఇక ఈ సన్మార్గం నుండి ఎవరైనా దూరమైపోతే వారు చాలా చాలా ప్రమాదంలో పడిపోతారు. ఎల్లప్పుడూ అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఉండండి.

رَبِّ اغْفِرْ لِي وَلِأَخِي
(రబ్బిగ్ఫిర్లీ వలి అఖీ)
ఓ అల్లాహ్ నన్ను క్షమించు, నా సోదరుని, సోదరులను క్షమించు.(7:151)

رَبِّ اغْفِرْ لِي وَلِوَالِدَيَّ
(రబ్బిగ్ఫిర్లీ వలి వాలిదయ్య)
“ఓ నా ప్రభూ! నన్నూ, నా తల్లిదండ్రులను క్షమించు.” (71:28)

ఈ విధంగా, ఈ రెండు పదాలు ఇప్పుడు నేను చదివానో ఖుర్ఆన్ లో వచ్చినవే. మూసా అలైహిస్సలాం వారి యొక్క దుఆ, నూహ్ అలైహిస్సలాం యొక్క దుఆ ఈ విధంగా.

అలాగే అల్లాహ్ ను రబ్ అని మనం నమ్మే ఈ పదంలో, ఇందులో మనం చాలా బలమైన ఒక గట్టి విశ్వాసం ఏం ఉండాలంటే, ఈ లోకంలో మనం రబ్ అయిన అల్లాహ్ యొక్క విశ్వాసంపై బలంగా ఉన్నప్పుడు, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఆపదలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఎంతటి దౌర్జన్యపరుల నుండి మనపై ఎలాంటి హింసా దౌర్జన్యాలు చేయబడినా, ఈ పరీక్షా కాలమైనటువంటి ఒక చిన్న జీవితంలో కొన్ని పరీక్షలు మాత్రమే. వాటిని దూరం చేసేవాడు అల్లాహ్ మాత్రమే. ఈ విషయం మనకు మూసా అలైహిస్సలాం, ఫిరౌన్, ఆ తర్వాత మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీల్ యొక్క సంఘటనలో, అలాగే సూరతుల్ ముఅమిన్ లో, సూరతుల్ ముఅమిన్ లో అల్లాహ్ త’ఆలా ఫిరౌన్ వంశానికి సంబంధించిన ఒక విశ్వాసుని సంఘటన ఏదైతే తెలిపాడో, అందులో కూడా ఈ గొప్ప గుణపాఠం ఉంది.

ఎప్పుడైతే ఫిరౌన్ చెప్పాడో, “నన్ను వదలండి నేను మూసాను హత్య చేస్తాను,” అప్పుడు ఆ విశ్వాసుడు వెంటనే నిలబడి ఏమన్నాడు?

وَقَالَ رَجُلٌ مُؤْمِنٌ مِنْ آلِ فِرْعَوْنَ يَكْتُمُ إِيمَانَهُ أَتَقْتُلُونَ رَجُلًا أَنْ يَقُولَ رَبِّيَ اللَّهُ
(వ ఖాల రజులున్ ముఅమినున్ మిన్ ఆలి ఫిరౌన యక్తుము ఈమానహు అతఖ్ తులూన రజులన్ అన్ యఖూల రబ్బియల్లాహ్)
(అప్పటివరకూ) తన విశ్వాసాన్ని గోప్యంగా ఉంచిన, ఫిరౌన్‌ వంశానికి చెందిన విశ్వాసి అయిన ఒక పురుషుడు ఇలా అన్నాడు: “ఏమిటీ, ‘అల్లాహ్‌ నా ప్రభువు’ అని అన్నంత మాత్రానికే ఒక వ్యక్తిని మీరు చంపేస్తారా? (40:28)

నా ప్రభువు, నా యొక్క రబ్ అల్లాహ్ మాత్రమే అని చెప్పే ఇలాంటి వ్యక్తిని మీరు చంపుతారా? ఇంకా అతని పూర్తి సంఘటన మీరు చదవండి, సూరత్ అల్-ముఅమిన్, దీని యొక్క రెండవ పేరు గాఫిర్, సూరహ్ నంబర్ 40, ఆయత్ నంబర్ 28 నుండి ఈ సంఘటన మొదలవుతుంది.

అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ యొక్క గొప్ప నామముల, మంచి పేర్ల ఏ వివరాలు తెలుసుకుంటున్నామో, దాని పరంగా మన విశ్వాసం ఉండి, అన్ని రకాల షిర్కులకు, మూఢనమ్మకాలకు అల్లాహ్ మనల్ని దూరం ఉంచుగాక. ఆమీన్.

వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

అల్లాహ్ (త’ఆలా): https://teluguislam.net/allah/

అల్లాహ్ శుభ నామాల వివరణ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0tSV7A9HKJzSeM0aIAiYcb

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

మహా ప్రవక్త ముహమ్మద్ ﷺ ఉన్నత వ్యక్తిత్వాన్ని అగౌరవ పరుస్తున్న నేటి పరిస్థితులలో ముస్లింగా మన బాధ్యత [వీడియో]

మహా ప్రవక్త ముహమ్మద్ ﷺ ఉన్నత వ్యక్తిత్వాన్ని అగౌరవ పరుస్తున్న నేటి పరిస్థితులలో ముస్లింగా మన బాధ్యత [వీడియో]
https://youtu.be/2ZKt_5BKDM0 [53 నిముషాలు]
వక్త: షరీఫ్ మదని , వైజాగ్ (హఫిజహుల్లాహ్)
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినాల్సిన వీడియో , మీ బంధు మిత్రులకు షేర్ చెయ్యడం మర్చిపోవద్దు సుమా!

మహా ప్రవక్త ﷺ జీవిత చరిత్ర – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3A9nJQ26qTrl-iuvWeXrbO

సీరత్ పాఠాలు 12: ప్రవక్త ﷺ గురించి ముస్లిమేతరులు ఎవరేమన్నారు? [వీడియో]
https://teluguislam.net/2020/08/15/seerah-lessons-12/

అల్లాహ్‌ సంతానం కలిగి ఉన్నాడని పలికేవారికి హెచ్చరిక [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్‌ సంతానం కలిగి ఉన్నాడని పలికేవారిని హెచ్చరించటానికి (ఈ ఖురాన్ గ్రంథం అవతరింపజెయ్యబడింది)
https://youtu.be/IjbFjYK0z3c [10 నిముషాలు]

18:4 وَيُنذِرَ الَّذِينَ قَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا
అల్లాహ్‌ సంతానం కలిగి ఉన్నాడని పలికేవారిని హెచ్చరించటానికి (ఈ గ్రంథం అవతరింపజెయ్యబడింది).

18:5 مَّا لَهُم بِهِ مِنْ عِلْمٍ وَلَا لِآبَائِهِمْ ۚ كَبُرَتْ كَلِمَةً تَخْرُجُ مِنْ أَفْوَاهِهِمْ ۚ إِن يَقُولُونَ إِلَّا كَذِبًا
యదార్థానికి వారికిగానీ, వారి తాత ముత్తాతలకుగానీ ఈ విషయం ఏమీ తెలియదు. వారి నోట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు చెప్పేదంతా పచ్చి అబద్ధమే.

ఈ ప్రసంగంలో, అల్లాహ్‌కు సంతానం ఉందని చెప్పేవారిని హెచ్చరించమని ఆదేశించే ఖురాన్ (సూరహ్ అల్-కహఫ్, ఆయత్ 4-5) ఆయతులపై వివరణ ఇవ్వబడింది. ఇది ఎటువంటి జ్ఞానం లేదా ఆధారం లేని తీవ్రమైన పాపమని, కేవలం అజ్ఞానంతో పలికే మాట అని వక్త నొక్కిచెప్పారు. యూదులు, క్రైస్తవులు, మక్కా ముష్రికులు గతంలో ఇలాంటి వాదనలు చేశారని ఉదహరించారు. దీనికి విరుద్ధంగా, అల్లాహ్‌కు తల్లిదండ్రులు, భార్య లేదా సంతానం లేరని, ఆయన ఏకైకుడని సూరహ్ అల్-ఇఖ్లాస్ స్పష్టం చేస్తుందని తెలిపారు. ఈ సత్యాన్ని ఇతరులకు తెలియజేయడం (దావత్) ప్రతీ ముస్లిం బాధ్యత అని, దీనికోసం కనీసం సూరహ్ అల్-ఇఖ్లాస్ మరియు ఆయతుల్ కుర్సీ యొక్క భావాన్ని తెలుసుకుని చెప్పినా సరిపోతుందని అన్నారు. అయితే, ఇతరుల వాదన ఎంత మూర్ఖంగా ఉన్నప్పటికీ, వారితో మృదువుగా, గౌరవప్రదంగా సంభాషిస్తూ దావత్ ఇవ్వాలని, ఈ పద్ధతులను తెలుసుకోవడం తప్పనిసరి అని బోధించారు.

وَيُنذِرَ الَّذِينَ قَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا
వయున్దిరల్లదీన ఖాలుత్తఖదల్లాహు వలదా
ఈ ఖురాన్ ద్వారా (యున్దిర్) హెచ్చరించాలి.

ఎవరికి హెచ్చరించాలి?

الَّذِينَ قَالُوا
అల్లదీన ఖాలూ
ఎవరైతే అన్నారో, చెప్పారో

اتَّخَذَ اللَّهُ وَلَدًا
ఇత్తఖదల్లాహు వలదా
నవూజుబిల్లాహ్. అల్లాహ్ తన కొరకు సంతానం చేసుకున్నాడు అని ఎవరైతే అంటున్నారో, అలాంటి వారిని కూడా మీరు ఈ ఖురాన్ ద్వారా హెచ్చరించాలి.

ఇక మీరు ఈ ఆయతును గమనించండి. మనం ఈ బాధ్యతలు నెరవేరుస్తున్నామా?

అల్లాహ్ ఏమంటున్నాడు? ఎవరైతే అల్లాహ్‌కు సంతానం ఉంది అని అంటున్నారో, ఈ ఖురాన్ ద్వారా మీరు వారిని హెచ్చరించండి – “మీకు జ్ఞానం లేని మాటలు అల్లాహ్ విషయంలో ఎందుకు మాట్లాడుతున్నారు? అల్లాహ్ ఎవరినీ కూడా తనకు సంతానంగా చేసుకోలేదు. అల్లాహ్ ఎవరినీ కూడా తనకు భార్యగా చేసుకోలేదు”

యూదులు ఉజైర్ అలైహిస్సలాంని అల్లాహ్ యొక్క కుమారుడు అని అన్నారు. క్రైస్తవులు ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తును అల్లాహ్ యొక్క కుమారుడు అని అన్నారు. మక్కా యొక్క ముష్రికులు దైవదూతలను అల్లాహ్ యొక్క కుమార్తెలు అని అనేవారు. మరియు ఈ రోజుల్లో మన భారతదేశంలో ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాము. పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, మహేశ్వరుడు అన్నటువంటి పదాలు ఆ ఏకైక సృష్టికర్త గురించే మేము అంటున్నాము అని అంటారు. కానీ మళ్ళీ ఆ సృష్టికర్తకు సంతానాలు ఉంటాయి. ఆ సృష్టికర్తకు ఎందరో భార్యలు ఉంటారు. అంతేకాదు, వాళ్ళ యొక్క దేవుళ్ళ సంగతి ఎలా అంటే, పెద్ద దేవుడు కొన్ని సందర్భాల్లో చిన్న దేవుళ్ళపై కోపగించి వారిపై శాపం కూడా కురిపిస్తాడు మరియు శాపం పడిన వారిని కరుణించి వరాలు కూడా కురిపిస్తాడు. ఈ విధంగా ఎన్నో విచిత్ర సంఘటనలు మనం వింటూ చూస్తూ ఉన్నాము.

నిజంగా, వాస్తవంగా మనందరి సృష్టికర్త ఎవరు అంటే, అతనికి తల్లి లేదు, తండ్రి లేడు, సంతాన భార్య లేదు, సంతానమూ లేరు, అతనికి ఏ కుటుంబము, పరివారము అని లేరు.

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ ﴿١﴾ اللَّهُ الصَّمَدُ ﴿٢﴾ لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ ﴿٣﴾ وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ ﴿٤﴾
ఖుల్ హువల్లాహు అహద్, అల్లాహుస్-సమద్, లమ్ యలిద్ వలమ్ యూలద్, వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్

(ఓ ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం!) వారికి ఇలా చెప్పు: అల్లాహ్ (నిజమైన ఆరాధ్యుడు)ఒక్కడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు.(ఏ అక్కరా లేనివాడు). ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు (పోల్చదగిన వాడు) ఎవడూ లేడు. (సూరా అల్ ఇఖ్లాస్)

మనందరికీ ఈ సూరా గుర్తుంటుంది కదా. దీని యొక్క అనువాదం తెలుసుకొని ప్రేమగా ఒక్కసారైనా గానీ మనం మన చుట్టుపక్క ఉన్నటువంటి బహుదైవారాధకులకు, అవిశ్వాసులకు, సత్య తిరస్కారులకు, అల్లాహ్‌తో పాటు వేరే వారిని పూజించే వారికి ఈ సూరత్ యొక్క అనువాదం మనం వినిపించాలి.

ఈ రోజుల్లో చాలా మంది అడుగుతూ ఉంటారు. మేము మేము అవిశ్వాసులకు దావత్ ఇవ్వాలి అని అనుకుంటాము, కానీ మాకు ఎక్కువ జ్ఞానం ఏమీ లేదు. ఎలా వారికి దావత్ ఇవ్వాలి? చూడండి, దావత్ యొక్క విషయం కొన్ని సందర్భాలలో, కొన్ని సందర్భాలలో ఇది లోతైన జ్ఞానం, చాలా పటిష్టమైన ఆధారాలతో కూడిన జ్ఞానం కూడా అవసరం ఉంటుంది. మరెన్నో సందర్భాలలో కేవలం ఖుల్ హువల్లాహు అహద్ ఈ మొత్తం సూరా మరియు ఆయతుల్ కుర్సీ, ఆయతుల్ కుర్సీ మీకు గుర్తు ఉంది అంటే దాని అనువాదం చూసుకోండి. ఆయతల్ కుర్సీలో 10 విషయాలు అల్లాహ్ ఏకత్వం గురించి తెలుపబడ్డాయి. మీరు దాని యొక్క అనువాదం కనీసం తెలియజేశారు అంటే ఎంతో ఒక గొప్ప సత్యాన్ని, మీరు సత్కార్యాల్లో చాలా ఉన్నత శిఖరానికి చెందిన ఒక సత్కార్యం గురించి ప్రజలకు బోధించిన వారు అవుతారు.

అయితే ఈ లోకంలో చూడటానికి పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నవారు, ఎంతో తమకు తాము మేధావులు అనుకునేవారు నిజ సృష్టికర్త అయిన అల్లాహ్‌కు సంతానం ఉంది అని అంటున్నారంటే, ఆ తర్వాత ఆయతు నంబర్ ఐదు చదవండి.

నవూజుబిల్లాహ్, అస్తగ్‌ఫిరుల్లాహ్. అల్లాహ్‌కు సంతానం ఉంది అని ఎవరైతే అంటున్నారో, ఈ మాట చెప్పడానికి వారి నోరు ఎలా విప్పారు?ఎందుకంటే:

مَّا لَهُم بِهِ مِنْ عِلْمٍ
మా లహుమ్ బిహీ మిన్ ఇల్మ్
వారికి దీని గురించి ఎలాంటి జ్ఞానం లేదు

وَلَا لِآبَائِهِمْ ۚ
వలా లిఆబాఇహిమ్
ఇలాంటి మాట పలికిన వారి తాత ముత్తాతలకు కూడా ఈ జ్ఞానం నిజ జ్ఞానం లేదు.

ఈ మాట ఎంత భయంకరమైనదో తెలుసా? ఎంత ఘోరమైనదో తెలుసా?

كَبُرَتْ كَلِمَةً تَخْرُجُ مِنْ أَفْوَاهِهِمْ
కబురత్ కలిమతన్ తఖ్రుజు మిన్ అఫ్వాహిహిమ్
వారి నోట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది.

ఖురాన్‌లో వేరే కొన్ని సందర్భాలలో అల్లాహ్ తఆలా ఏం చెప్పాడు?

تَكَادُ السَّمَاوَاتُ يَتَفَطَّرْنَ
తకాదుస్-సమావాతు యతఫత్తర్న
అల్లాహ్‌కు సంతానం ఉన్నది అని వారు పలికే మాట ఎంత చెండాలమైనది, ఎంత తప్పు మాట, ఎంత దారుణమైనది అంటే భూమ్యాకాశాలు బ్రద్దలైపోతాయి.

ఎందుకంటే ఈ మానవుడు మరియు జిన్నాతులలో షైతానులు తప్ప సర్వ సృష్టి అల్లాహ్ ఏకత్వాన్ని నమ్ముతుంది.

وَلَهُ أَسْلَمَ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَإِلَيْهِ يُرْجَعُونَ
వలహూ అస్లమ మన్ ఫిస్సమావాతి వల్ అర్ద్, తౌఅన్ వ కర్హా, వ ఇలైహి యుర్జాఊన్
ఆకాశాల్లో, భూమిలో ఉన్న సమస్తము కూడా అల్లాహ్‌కు మాత్రమే వారు ఇస్లాం ముస్లింలుగా ఉన్నారు.

అస్లమ అంటే వారు విధేయులై ఉన్నారు. శిరసావహించి ఉన్నారు. అల్లాహ్ ఏకత్వాన్ని నమ్మి ఉన్నారు. అల్లాహ్ యొక్క ఏకత్వంలో వారు ఏమాత్రం భాగస్వామి కలగజేయరు. కానీ సర్వ సృష్టిలో అతి ఉత్తముడైన ఈ మానవుడే అల్లాహ్ పట్ల ఎంతటి అబద్ధపు మాట పలుకుతున్నాడో అల్లాహ్ స్వయంగా చెప్పాడు:

إِن يَقُولُونَ إِلَّا كَذِبًا
ఇన్ యఖూలూన ఇల్లా కదిబా
వారు చెప్పేదంతా పచ్చి అబద్ధమే.

అయితే ఇక్కడ ఒక సత్యం మీరు తెలుసుకోండి. ఖురాన్ చదువుతూ ఉంటాము కానీ మనం అర్థం చేసుకో చేసుకుంటూ ఉండము. అందుకొరకే ఎన్నో విషయాలు పై నుండే మనకు దాటిపోతూ ఉంటాయి.

ఎవరైతే షిర్క్ చేస్తున్నారో, ఎవరైతే అల్లాహ్‌కు సంతానం ఉంది అని అంటున్నారో, ఎవరైతే అల్లాహ్‌తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తున్నారో స్వయం వారి వద్ద ఈ షిర్క్ గురించి ఎలాంటి ఆధారం లేదు. వారు చెబుతున్న ఈ మాట ఎలాంటి సత్యంతో కూడినది కాదు. అల్లాహ్‌కు వేరే భాగస్వాములు ఉన్నారు, సంతానం ఉంది అని అనడం ఇది అజ్ఞానంతో, మూర్ఖత్వంతో కూడిన మాట.

అందుకొరకే ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హా బ్ రహిమహుల్లాహ్ యొక్క మనమడు కితాబు తౌహీద్ యొక్క వ్యాఖ్యానం ఏదైతే రాశారో అందులో ఒక మాట ఇది కూడా చెబుతున్నారు ఆరంభంలోనే. – “ఎవరు ఎంత పెద్ద ప్రపంచపు చదువులు చదివినా, అల్లాహ్‌తో పాటు ఇతరులను సాటి కలుపుతున్నాడంటే అతడు అసలైన జ్ఞానానికి దూరం, అజ్ఞానంలో, మూర్ఖత్వంలో పడి ఉన్నాడు.”

కానీ ఇక్కడ వారి ఆ మాట మూర్ఖత్వంతో కూడినది. కానీ వారికి దావత్ ఇచ్చే విషయంలో, సందర్భంలో మనం ప్రతి ఒక్కరితో వారి యొక్క తగిన స్థానానిని, వారి యొక్క ఏ హోదా అంతస్తు ఉందో ఈ లోకంలో వారిని గౌరవిస్తూ, గౌరవిస్తూ అంటే వారితో ఎలా సంభాషించాలి, ఎలా మాట్లాడాలి, దావత్ ఇచ్చే విషయంలో ఎలా మనం వారిని మృదు వైఖరితో, తీపి మాటతో మాట్లాడాలి ఆ విషయాలు కూడా మనం తెలుసుకొని ఉండడం తప్పనిసరి.

సూరతుల్ కహఫ్ తఫ్సీర్ (వ్యాఖ్యానం)- యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1Ham7KTDLUrhABquy8NoCa

అల్లాహ్ మరియు ప్రవక్త ﷺ పై సహాబాల విశ్వాసం & ప్రేమ [వీడియో]

అల్లాహ్ మరియు ప్రవక్త ﷺ పై సహాబాల విశ్వాసం & ప్రేమ – షరీఫ్ మదని , వైజాగ్ (హఫిజహుల్లాహ్)
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినాల్సిన వీడియో , మీ బంధు మిత్రులకు షేర్ చెయ్యడం మర్చిపోవద్దు సుమా!
https://youtu.be/13vdx6De8ow [52 min]

MP3 ఆడియో:

సత్కార్యాలను ఎలా కాపాడుకోవాలి? [వీడియో]

సత్కార్యాలను ఎలా కాపాడుకోవాలి? – షరీఫ్ మదనీ , వైజాగ్ (హఫిజహుల్లాహ్)
ప్రతి ఒక్కరూ తప్పక వినండి, మీ సత్కార్యాలను రక్షించుకోండి. మీ బంధు మిత్రులకు షేర్ చెయ్యడం మర్చిపోవద్దు
https://youtu.be/i8zn5oKK1Ow [55 నిముషాలు]

షేఖ్ షరీఫ్, మదీనా గ్రాడ్యుయేట్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0AKZXyDn6KYNFu5ok4ZFtb

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి:
https://telugusialm.net/?p=4259

సహీ జిక్ర్, దుఆలు తెలుగులో – Authentic Islamic Dhikr & Dua in Telugu:
https://telugudua.net/

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

మహాప్రవక్త ﷺ జీవిత చరిత్ర – తబూక్ పోరాటం: రోమ్ అగ్రరాజ్యాన్ని నిలువరించిన ముస్లింలు [వీడియో ]

[20] మహాప్రవక్త ﷺ జీవిత చరిత్ర – తబూక్ పోరాటం: రోమ్ అగ్రరాజ్యాన్ని నిలువరించిన ముస్లింలు
https://youtu.be/xC-ulwWQX-o [52 నిముషాలు]

తప్పకుండా వినే ప్రయత్నం చేయండి, చాల మంచి వీడియో, ప్రవక్త గారి (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత చరిత్ర అర్ధం చేసుకోవడం మనందరి విధి.

తబూక్ పోరాటం PDF డౌన్లోడ్ చేస్కోండి: (20 పేజీలు)
https://teluguislam.net/wp-content/uploads/2022/06/ghazwa-tabook.pdf

మహాప్రవక్త ﷺ జీవిత చరిత్ర – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3A9nJQ26qTrl-iuvWeXrbO

గజ్వయె తబూక్ (తబూక్ పోరాటం) 

మక్కా విజయం, సత్యాసత్యాల నడుమ జరిగిన ఓ నిర్ణయాత్మకమైన యుద్ధమే అనాలి. ఆ విజయానంతరం అరబ్బుల్లో, మహనీయ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క దైవ దౌత్యం గురించి ఎలాంటి సందేహానికి ఆస్కారం లేకుండా పోయింది. ఈ కారణంగానే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దైవధర్మం అయిన ఇస్లామ్ లో ప్రజలు తండోపతండాలుగా వచ్చి చేరడం ఆరంభమైంది. ప్రతినిధి వర్గాల రాకకు సంబంధించిన అధ్యాయంలో మేము ఇస్తున్న వివరాల ఆధారంగా ఈ విషయాన్ని వారు అంచనా వేసుకోవచ్చు. అలాగే, హజాతుల్ విదా సందర్భంలో హాజరైన ప్రజా సమూహాన్ని బట్టి కూడా దీన్ని మనం గుర్తించవచ్చు – మొత్తానికి, అరేబియాలో అంతర్గతంగా ప్రబలుతున్న తిరుగుబాట్లు, అడ్డంకులన్నీ ఇప్పుడు దాదాపుగా సమసిపోయి నట్లయింది. ముస్లిములు, దైవధర్మ సంవిధానాన్ని, ఇస్లామ్ షరీఅతను ఎల్లెడలా వ్యాపింపజేయడానికి, ఇస్లామ్ ధర్మప్రచారం కోసం ఏకాగ్రతను సంతరించుకొని ముందుకు పురోగమించడానికి అవకాశం లభించినట్లయింది. 

తబూక్ పోరాటం సంభవించడానికి గల కారణం 

అయితే ఇప్పుడు, ఎలాంటి కారణం లేకుండానే ముస్లిములతో తలపడడానికి ఓ శక్తి మదీనా వైపునకు దృష్టిని పెట్టింది. దీనికి సంబంధించిన వారు అప్పుడప్పుడు ముస్లిములను కవ్విస్తూ ఉన్నారు. ఈ శక్తి రోమను సామ్రాజ్యానికి సంబంధించినది. అది ఆ కాలంలో ప్రపంచంలోకెల్లా ఓ పెద్ద సూపర్ పవర్ గా అలరారే సామ్రాజ్యం . వెనుకటి పుటల్లో ఈ కవ్వింపు, షుజ్ల్ బిన్ అమ్రూ గస్సానీ చేతిలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి దూత హజ్రత్ హారిస్ బిన్ ఉమైర్ అజీ (రదియల్లాహు అన్హు) హత్యగావించబడడంతో ఆరంభమైంది. హజ్రత్ హారిస్ బిన్ ఉమైర్ బస్రా గవర్నరు వద్దకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సందేశాన్ని తీసుకు వెళ్ళిన వ్యక్తి. అదే కాకుండా, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ తరువాత హజ్రత్ జైద్ బిన్ హారిసా నేతృత్వంలో ఓ సైనిక పటాలాన్ని పంపించడం, అది రోమను సామ్రాజ్యంలో ‘మూతా’లో భీకరంగా యుద్ధం చేయడం, అయితే ఈ సైనిక పటాలం ఆ తలబిరుసుతనం గల రోమనులను అణచలేకపోవడం కూడా మనం వెనుకటి పుటల్లో చదువుకున్నదే. అయితే, ముస్లిముల ఈ సైన్యం అప్పటి సూపర్ పవర్ అయిన రోమనులతో ఢీకొనడం, అరేబియా పౌరులపై మంచి ప్రభావాన్నే వేసింది. | 

రోమ్ చక్రవర్తి కైజరు, ఈ ప్రభావం విషయంలో, దాని ఫలితంగా అరబ్బు తెగల్లో రోమనుల నుండి స్వాతంత్ర్యం పొందే భావన జాగృతం అయ్యే విషయంలో, ముస్లిముల ఎడల అరబ్బుల్లో ఏర్పడే సానుభూతి విష 

యంలో ఎలా ఉపేక్షించగలడు? అవి అతణ్ణి కలచివేస్తున్న ప్రమాద సూచికలే మరి. ఆ ప్రమాదం ఒక్కో అడుగు అతని సరిహద్దుల వైపునకు కదిలివస్తోంది. అరేబియాతో కలిసిన సిరియా సరిహద్దుకు ఓ సవాలుగా నిలిచింది. కాబట్టి కైజరు, ముస్లిముల ఈ మహోన్నతమైన శక్తి, అజేయమైన ఈ ప్రమాదం ముంచుకు రాకపూర్వమే, రోము సామ్రాజ్యానికి ఆనుకొని ఉన్న అరబ్బు ప్రాంతాల్లో సంక్షోభం, తిరుగుబాట్లు చెలరేగక మునుపే దాన్ని అణచివేయా లనే దృఢసంకల్పానికి వచ్చాడు.

ఈ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకునే, మూతా యుద్ధం జరిగి ఇంకా ఒక్క సంవత్సరం కూడా తిరిగిరాలేదు, 

రోము చక్రవర్తి రోమను ప్రజల్ని, తన ఆధీనంలో ఉన్న అరబ్బుల్ని, అంటే ఆలెగస్సాన్ తెగ వగైరాలతో కూడిన ఓ పెద్ద సైన్యాన్ని సమీకరించి, ఓ భయంకరమైన, నిర్ణయాత్మకమైన యుద్ధం కోసం సన్నాహాలు మొదలెట్టాడు. 

రోమనులు మరియు గస్సాన్ల యుద్ధ సన్నాహాల వార్తలు 

రోమను సామ్రాజ్యం ముస్లిములపై దండెత్తడానికి సన్నాహాలు ప్రారంభించిందన్న వార్తలు ఎడతెగకుండా మదీనాకు చేరుతూనే ఉన్నాయి. ఈ కారణంగా ముస్లిములు అప్రమత్తులైపోయారు. ఏ చిన్న అనుమానం వచ్చినా రోమనులు తమపైకి వచ్చిపడ్డారనే భావనకు లోనైపోతున్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే ఓ సంఘటనను కూడా ఇక్కడ ఉటంకించక తప్పదు. అదే సంవత్సరం, అంటే హిజీ శకం 9లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ భార్యామణులతో అలిగి ఒక నెల్లాళ్ళు ‘ఈలా“చేసి వారికి దూరంగా ఉన్నారు. సహచరులకు ఈ విషయం తెలిసిరాలేదు. వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి తలాక్ ఇచ్చారనే అనుకొని బాధపడిపోయారు. 

[ఈలా అంటే స్త్రీ వద్దకు వెళ్ళనని ఒట్టేసుకోవడం. ఈ ఒట్టు నాల్గు నెలలు లేదా అంతకంటే తక్కువ గడువు కోసం వేసుకుంటే ధర్మశాస్త్రం ప్రకారం ఫరవాలేదు. ఇదే గనక నాల్గు నెలలు దాటితే షరీఅత్ న్యాయస్థానం ఆ విషయంలో జోక్యం కలుగజేసుకుని భర్త, భార్యను భార్యగానైనా ఉంచుకోవాలి లేదా ఆమెకు తలాక్ అయినా ఇవ్వాలి అని ఆదేశిస్తుంది. కొందరు సహాబాల అభిప్రాయం ప్రకారం, నాల్గు నెలల గడువు తీరిపోగానే ఆ స్త్రీకి తలాక్ వర్తిస్తుంది.]

హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ సంఘటన గురించి ఇలా వివరిస్తున్నారు: 

“నాకు అన్సారీ మిత్రుడొకడుండేవాడు. నేను (దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సన్నిధిలో) లేనప్పుడు అతను అక్కడ జరిగిన విషయాలు వచ్చి చెప్పేవాడు. నేను కూడా అతని గైర్హాజరులో వెళ్ళి జరిగిన విషయాలు అతనికి చెబుతూ ఉండేవాణ్ణి. ఈ ఇద్దరు మిత్రులు మదీనాలోనే ఉంటూ ఉండేవారు. ఇరుగుపొరుగున ఉంటూ వంతుల వారీగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సన్నిధికి వెళ్ళి వస్తూ ఉండేవారు – ఆ కాలంలోనే మాకు గస్సాన్ రాజు వల్ల ప్రమాదం ఏర్పడుతుందనే శంక ఉంటూ ఉండేది. అతను మా పై దాడి చేయనున్నాడని వస్తున్న వార్తల వల్ల మేము అప్రమత్తులమై ఉండేవారం. ఓ రోజు హఠాత్తుగా నా ఆ అన్సారీ మిత్రుడు నా తలుపును తెగబాదుతూ తలుపు తెరవమని అరవనారంభించాడు. అది విన్న నేను, “ఏమిటీ? గస్సానీలు వచ్చిపడ్డారా?” 

అని అడిగాను. 

“కాదు, అంతకంటే పెద్ద ఘోరమే జరిగిపోయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ భార్యామణుల నుండి వేరైపోయారు” అన్నాడు నా మిత్రుడు. [సహీహ్ బుఖారీ-2/730 ]

మరో ఉల్లేఖనంలో హజ్రత్ ఉమర్(రదియల్లాహు అన్హు) ఇలా అన్నట్లు ఉంది: 

“మా పై దండెత్తడానికి ఆలెగస్సాన్ తమ గుర్రాలకు నాడాలు వేస్తున్నా రనే పుకార్లు బాగా వ్యాపించిన రోజులవి. ఓ రోజు నా మిత్రుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సన్నిధికి వెళ్ళి ఇషా నమాజు సమయానికి తిరిగివచ్చాడు. నా ఇంటి తలుపును పెద్దగా తడుతూ, “ఆయన నిద్రపోయారా?” అని అరుస్తున్నాడు. 

నేను బెదిరిపోతూ బయటకు వచ్చేశాను.

“ఓ పెద్ద ప్రమాదం జరిగిపోయింది” అన్నాడతను. 

“ఏమిటి? గస్సానులు వచ్చేశారా?” అని అడిగాన్నేను. 

“లేదు. అంతకంటే పెద్ద ప్రమాదమే ముంచుకువచ్చింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ భార్యలకు తలాక్ ఇచ్చేశారు.” [సహీహ్ బుఖారీ-1/334]

ఈ పరిస్థితినిబట్టి రోమనుల వల్ల ముస్లిములలో ఏర్పడిన వ్యాకులత ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు. ఇదే కాకుండా, మునాఫిక్లులు (కపట ముస్లిములు) వ్యాపింపజేస్తున్న పుకార్లు వారిని మరింత చీకాకుపర్చనారం భించాయి. ఈ మునాఫిలకు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతి రంగంలోనూ నెగ్గుకు వస్తున్నారని, ఈ భూమ్మీదనున్న ఏ శక్తికీ వెరవడం లేదని, ఏ అడ్డంకులైతే ఆయన దారికి అడ్డువస్తున్నాయో అవన్నీ ఇట్టే తొలగిపోతున్నాయన్న విషయం తెలిసినప్పటికీ వారు తమ మనస్సుల్లో దాచుకున్నది, ఎదురు చూస్తున్నది తప్పకుండా నెరవేరే తరుణం ఎంతో దూరంగా లేదని తలచి ముస్లిములకు వ్యతిరేకంగా కుట్రలు పన్ననారంభించారు. వారు తాము భావిస్తున్నట్లుగానే ఓ మస్జిదను (ఆ మస్జిద్, మస్జిదె జిరా గా ఆ తరువాత ఖ్యాతిగాంచింది) కట్టుకొని ఆ మస్జిద్ లో కుట్రలు, కుతంత్రాలకు పథకాలు వేయనారంభిం చారు. దైవం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ల ఎడల తిరస్కార భావ పునాదులపై నిర్మించ బడిన మస్జి లోనికి వచ్చి నమాజు చేయించమని కూడా ఈ మునాఫిస్టు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం)ను కోరి ఉన్నారు. అలా కోరడానికి కారణం, ముస్లిములను మభ్య పెట్టి వారికి తాము పన్నుతున్న కుతంత్రాలు తెలియకుండా ఉండాలని, ఆ మస్జిద్ లోకి వచ్చి పోయే వారిపై ముస్లిములు నిఘా ఉంచకుండా ఉండడానికే. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యుద్ధ సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నందు వలన ఆ మస్జిద్ లో నమాజు చేయించే కార్యక్రమాన్ని యుద్ధం నుండి తిరిగి వచ్చే వరకు వాయిదా వేశారు. ఇలా మునాఫిక్లులు తమ లక్ష్యసాధనలో కృతకృత్యులు కాలేకపోయారు. అల్లాహ్ వారి ఈ ఎత్తుగడను యుద్ధం నుండి తిరిగివచ్చే లోపలే బట్టబయలు చేశాడు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యుద్ధం నుండి తిరిగివచ్చిన తరువాత ఆ మస్జిద్ లో నమాజు చేసే బదులు దాన్ని నేలమట్టం చేయించారు. 

రోమనులు, గస్సానుల యుద్ధ సన్నాహాలకు చెందిన ప్రత్యేక వార్తలు 

ముస్లిములు యుద్ధ వార్తలను వింటూ చీకాకులో ఉన్న కాలంలోనే మదీనాకు సిరియా దేశం నుండి నూనె సరఫరా చేసే ‘బన్తీల’ (*)  ద్వారా హఠాత్తుగా హెరిక్స్ నలభై వేల మంది సైనికులతో కూడిన ఓ పెద్ద సైన్యాన్ని తయారు చేసి పేరుమోసిన ఓ కమాండరు నేతృత్వంలో యుద్ధానికి పంపిస్తు న్నాడని, ఆ సైన్యం జెండా క్రిందికి క్రైస్తవ తెగలైన లబ్న్ మరియు జిజాములు కూడా వచ్చి చేరాయని, ఆ సైన్యం ముందస్తు దళం ఒకటి ‘బల్కా’ వరకు వచ్చేసిందనే పిడుగులాంటి వార్త వినిపించారు. ఇలా అది ఓ పెద్ద ప్రమాద రూపంలో ముస్లిముల ముందుకు వచ్చిన ప్రత్యేక యుద్ధ సంబంధమైన 

(*) సాబిత్ బిన్ ఇస్మాయీల్ (అలైహిస్సలాం) సంతతికి చెందినవారు. ఒకప్పుడు ఉత్తర హిజాలో మంచి పలుకుబడిగల ధనవంతులు. పతనావస్థకు చేరి క్రమక్రమంగా మామూలు రైతులుగా, వ్యాపారులుగా మారిపోయినవారు వీరు

మరింత జటిలంగా మారిన పరిస్థితులు 

ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతుంటే, వాటికితోడు మరిన్ని విపత్తులు వచ్చిపడ్డాయి. విపరీతమైన ఎండ వేడిమికి తోడు ప్రజలు కరవు వల్ల బాధపడు తున్నారు. వెళ్ళడానికి వాహనాలు కూడా తక్కువే. మదీనాలో పండే పండు పంటకొచ్చాయి. కాబట్టి ప్రజలు మదీనాను వదలక నీడపట్టున ఉండి పంటను దక్కించుకుందామనే ధోరణిలో ఉన్నారు. వెంటనే బయలుదేరడానికి సిద్ధపడడం లేదు. అదేకాకుండా దూరప్రాంతానికి వెళ్ళడం, మార్గంలో ఏర్పడే అవరోధాలు ఓ ప్రక్క పీడించనారంభించాయి వారిని. 

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహనీయుని ఖచ్చితమైన నిర్ణయం

అయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరిస్థితులను, జరుగబోయే మార్పుల్ని క్షుణ్ణంగా గమనిస్తూనే ఉన్నారు. ఈ నిర్ణయాత్మకమైన ఘడియలో గనక ముస్లిములు రోమనులతో యుద్ధం చేయడానికి బద్దకించి ముస్లిముల ప్రాంతాల్లోనికి చొరబడే వీలు కలిగిస్తే, వారు మదీనా పై దండెత్తి వస్తే గనకా, ఇస్లామీయ సందేశం పై చెడు ప్రభావాలు పడతాయి. ముస్లిమ్ సైన్యానికి ఇప్పటి వరకు వచ్చిన కీర్తికాస్తా మంటగలిసిపోతుంది. ‘హునైన్’ యుద్ధంలో చావుదెబ్బ తిని తుది శ్వాస వదులుతున్న అజ్ఞానం తిరిగి బ్రతికి బట్టకడుతుంది. సమయం కోసం కాచుకొని అబూ ఆమిర్ ఫాసిక్ ద్వారా రోమను చక్రవర్తితో సంబంధాలు ఏర్పర్చుకున్న మునాఫిన్లు, రోమనులతో తలపడబోతున్న ముస్లిములకు వెన్నుపోటు పొడవడానికి కాచుకొని కూర్చున్నారు. ఇలా ఇప్పటి వరకు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయన అనుచరగణం ఇస్లామ్ వ్యాప్తికి చేసిన కృషి అంతా బూడిదలో బోసిన పన్నీరులా వృధా అయిపోగలదు. ఎడతెగని రక్తపాత సహిత యుద్ధాలు, సైనిక చర్యల ద్వారా సంపాదించిన విజయాలు కాస్తా అపజయాలుగా మారిపోయే ఆస్కారం ఉంది. 

ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ ఫలితాలను పూర్తిగా బేరీజు వేసుకుం టూనే ఉన్నారు. అందుకని, ఓ వైపు విషమ పరిస్థితులు, మరో వైపు దారిద్ర్యం పీడిస్తున్నప్పటికీ, రోమనులను దారుల్ ఇస్లామ్ (మదీనా) వైపునకు పురోగ మించే వెసులుబాటును కల్పించే బదులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తామే స్వయాన వారి ప్రాంతాల్లోనికి చొరబడి వారికి వ్యతిరేకంగా ఓ నిర్ణయాత్మకమైన యుద్ధం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. 

రోమనులతో యుద్ధానికి సన్నాహాలు 

ఈ వ్యవహారాన్ని గురించి బాగా సమీక్షించిన తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహనీయులు సహాబా (రదియల్లాహు అన్హుమ్)లకు, యుద్ధం గురించిన సన్నాహాలు ప్రారంభిం చమని ప్రకటించారు. అరబ్బు తెగలు, మక్కా ప్రజల్ని కూడా యుద్ధం కోసం బయలుదేరండనే సందేశం పంపించారు. ఏ గజ్వాకైనా వెళ్ళేటప్పుడు దైవప్రవక్త 

(సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజల దృష్టిని మరో వైపునకు మళ్ళించడం రివాజు. కాని పరిస్థితి జటిలత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), “మనం రోమనులతో యుద్ధానికి వెడుతున్నాం” అని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ‘జిహాద్’ గురించి ప్రజల్ని ప్రేరేపించారు. దివ్యఖుర్ఆన్లోని ‘తౌబా’ సూరాలోని ఓ భాగం ఈ సందర్భంలోనే అవతరించింది. దీనికితోడు, ఆయన దానధర్మాల ప్రాశస్త్యం గురించి చెబుతూ, అల్లాహ్ మార్గంలో ప్రియమైనది, మేలైనది అయిన దాన్ని వెచ్చించమని ప్రోత్సహించారు. 

యుద్ధ సన్నాహాలకు ముస్లిముల ఉరుకులు పరుగులు 

సహాబా (రదియల్లాహు అన్హుమ్)లు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ప్రకటన వినగానే, రోమనులతో యుద్ధం చేయడానికి సన్నాహాలను ముమ్మరం చేశారు. తెగలు, మిత్రపక్షాలు నలువైపుల నుండి మదీనాకు వచ్చిచేరనారంభించాయి. ఎవరి మనస్సుల్లోనైతే కపటం నాటుకుపోయిందో వారు తప్ప ప్రతి ముస్లిమ్ ఆ గజ్వాకు వెళ్ళడానికి వెనుకాడలేదు. అయితే ముస్లిములలోనే ముగ్గురు వ్యక్తులు మాత్రం ఎలాంటి కారణాలు లేకుండానే ఆ గజ్వాలో చేరకుండా ఆగిపోయారు. వారు కపట ముస్లిములు కారు, నిజమైన ముస్లిములే. ఆర్థికంగా వెనుకబడిన పేద ముస్లిములు సైతం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహనీయుల వద్దకు వచ్చి యుద్ధంలో పాల్గొనడానికి తమకు ఏదైనా వాహనాన్ని సమకూర్చమని ప్రాధేయపడనారం భించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన వద్ద ఏదీ లేదని, ఈ విషయంలో నేను నిస్సహాయుడనని చెప్పి పంపించడం జరుగుతూ ఉండేది. దివ్యఖుర్ఆన్ ఈ సందర్భాన్ని ఈ విధంగా అభివర్ణిస్తోంది. 

“నేను మీ కొరకు వాహనాలను ఏర్పాటు చేయలేను అని అన్నప్పుడే, గత్యంతరం లేక వారు మరలిపోయారు. వారి కళ్ళ నుండి అశ్రువులు ప్రవహించాయి. వారు తమ ఖర్చులతో పోరాటంలో పాల్గొనే శక్తి తమకు లేనందుకు చాలా బాధపడ్డారు.” (9 : 92) 

ఇలాగే ముస్లిములు దైవమార్గంలో ధనాన్ని వెచ్చించే విషయంలో ఒకరినొకరు మించిపోవాలనే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. హజ్రత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు), సిరియా దేశం వెళ్ళడానికిగాను వ్యాపార సామగ్రి మూటలు గల రెండు వందల ఒంటెలను, వాటితో సహా రెండు వందల ఓకియాల వెండి (దాదాపు ఇరవై తొమ్మిదిన్నర కిలోల వెండి) తయారు చేసి ఉన్నారు. ఆయన దీన్నంతటిని యుద్ధం కోసం దానంగా ఇచ్చేశారు. ఆ తరువాత అదనంగా ఓ వంద ఒంటెల్ని ప్రయాణ సామగ్రితో సహా సదఖా చేశారు. అది ఇచ్చిన తరువాత ఒక వెయ్యి దీనారాలు (దాదాపు అయిదున్నర కిలోల బంగారం) తెచ్చి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒడిలో పొసేశారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ దీనారాలను చేతితో ఇటు అటు కదిలిస్తూ ఈ రోజు ఉస్మాన్ ఏది చేసినా ఆయనకు నష్టాన్ని చేకూర్చదు ‘* అననారంభించారు. ( *జామిఆ తిర్మిజీ: మనాఖిబ్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్-2/2111 )

అదే కాకుండా హజ్రత్ ఉస్మాన్ మళ్ళీ మళ్ళీ సదఖా చేస్తూనే ఉన్నారు. అలా ఆయన సదఖా చేసిన ధనం గాక, ఒంటెల సంఖ్య తొమ్మిది వందలు, గుర్రాల సంఖ్య నూరు వరకు చేరిపోయింది. 

ఇటు అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) తన రెండొందల ఓకియాలు (అంటే ఇరవైతొమ్మిదిన్నర కిలోల వెండి) తీసుకొచ్చి సమర్పించారు. హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) తన దగ్గర ఉన్నదంతా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి తెచ్చి పడవేశారు. ఆయన భార్యాపిల్లల కోసం మిగిల్చి ఉంచింది కేవలం అల్లాహ్, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను మాత్రమే. ఆయన చేసిన సదఖా ధనం మొత్తం నాల్గు వేల దీర్ఘములు. ఆయనే ఈ సదఖా తెచ్చి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సమర్పించినవారిలో ప్రథముడు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తన వద్ద ఉన్న సొత్తులోని సగభాగం తీసుకొని వచ్చి ఇచ్చారు. హజ్రత్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కూడా పెద్ద మొత్తంలోనే ధనాన్ని తెచ్చి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సమర్పించుకున్నారు. వారే కాకుండా హజ్రత్ తలా (రదియల్లాహు అన్హు), సఅద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు), ముహమ్మద్ బిన్ ముస్లిమా (రదియల్లాహు అన్హు)లు కూడా తగినంత డబ్బును సదఖాగా ఇచ్చారు. హజ్రత్ ఆసిమ్ బిన్ అద్దీ (రదియల్లాహు అన్హు) తొంభై వస్క్ ల (అంటే పదమూడున్నర వేల కిలోలు లేదా పదమూడున్నర టన్నుల) ఖర్జూరాలు తీసుకువచ్చారు. తక్కిన సహాబాలు కూడా ఒకరి తరువాత ఒకరు తమకు తోచిన సదఖా తెచ్చి ఇచ్చారు. చివరికి శక్తి లేనివారు కూడా ఒకటో రెండో ముద్దు (ఖర్జూరాలు) సదఖాగా ఇచ్చారు. మహిళలు కూడా తమ కంఠహారాలు, వడ్డాణాలు, కాళ్ళ పట్టీలు, చెవుల రింగులు, ఉంగరాలు వగైరాలు వారి శక్తి మేరకు తెచ్చి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సమర్పించుకున్నారు. ప్రతివారూ పిసినారితనాన్ని ప్రదర్శించకుండా సదఖ ఇచ్చినవారే. కేవలం మునాఫిన్లు ఒక్కరే ఒకరిని మించి ఒకరు సదఖా చేయడం చూసి (వీరు ప్రదర్శనాబుద్ధితో చేస్తున్న సదఖా అని) తూలనాడనారంభించారు. తమ వద్ద ఇవ్వడానికి ఏమి లేని పేద ముస్లిములెవరైనా ఒకటి, రెండు ఖర్జూరాలను తీసుకొని వస్తే వారిని చూసి ఈ మునాఫిక్లు, ఓహో ఈ ఖర్జూరాలతో కైజరు సామ్రాజ్యాన్ని జయిస్తారు కాబోలు అని హేళన చేసేవారు. (9 : 97) 

తబూక్ కు బయలుదేరిన ఇస్లామీయ సైన్యం 

ఇస్లామీయ సైన్యం యుద్ధానికి పూర్తిగా సన్నద్ధమైన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ ముహమ్మద్ బిన్ ముస్లిమా (రదియల్లాహు అన్హు)ను, మరో ఉల్లేఖనంలో చెప్పబడి నట్లుగా సబా బిన్ అరఫ్తా (రదియల్లాహు అన్హు)ను మదీనాకు గవర్నరుగా నియమించారు. . హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు)ని తమ కుటుంబ సభ్యులకు సంరక్షకులుగా చేసి మదీనా లోనే ఉండమని చెప్పి ఆదేశించారు. కాని మునాఫిన్లు ఆయన్ను తూల నాడడం వలన ఆయన బయలుదేరి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు చేరారు. కాని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తిరిగి ఆయన్ను మదీనాకు పంపిస్తూ, “ఏమిటీ! నీకూ నాకూ ఉన్న అనుబంధం, హజ్రత్ మూసా (అలైహిస్సలాం)కు హజ్రత్ హారూన్ (అలైహిస్సలాం)తో ఉన్న అనుబంధం లాంటిది అనే విషయాన్ని గ్రహించలేదా? అయితే నా తరువాత మరో ప్రవక్త రాడు అనే విషయం తెలుసుకో” అని అన్నారు. 

ఎట్టకేలకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉత్తర దిశ వైపునకు బయలుదేరారు. (నిసాయీ గ్రంథంలోని ఉల్లేఖనం ప్రకారం అది గురువారం) గమ్యం తబూక్. సైన్యం పెద్దది. ముప్ఫై వేల మంది యోధులతో కూడిన సైన్యం అది. అంతకు పూర్వం ముస్లిములు అంత పెద్ద సైన్యాన్ని ఎప్పుడూ సమీకరించలేదు. అందుకని, ముస్లిములు దానికోసం తమ శాయశక్తులా ధనాన్ని సమకూర్చి నప్పటికీ సైన్యానికి కావలసిన హంగుల్ని సమకూర్చలేకపోయారు. అప్పటికీ వాహనాలు, తినుబండారాలు బాగా తక్కువగానే ఉన్నాయి. కాబట్టి పద్దెనిమిదేసి మంది సిపాయీలకు ఒక్కొక్క ఒంటె కేటాయించబడింది. వారు దాని పై వంతుల వారీగా స్వారీ చేస్తూ వెడుతున్నారు. అలాగే తినుబండారాల కొరత వల్ల అప్పుడప్పుడు చెట్ల ఆకుల్ని సైతం తినవలసి వచ్చింది. ఆ ఆకుల్ని తినడం వలన వారి పెదాలు వాచిపోయాయి. విధిలేక ఒంటెల కొరత ఉన్నప్పటికీ వాటిని జిబహ్ చేసి దాని ప్రేవుల్లో ఉన్న నీటిని త్రాగవలసి వచ్చింది. అందుకొరకే ఆ సైన్యం పేరు ‘జైషే ఉగ్రత్’ (అంటే కష్టాలు అనుభవించిన సైన్యం) అని పడిపోయింది. తబూక్ కు వెళ్ళేటప్పుడు ఈ సైన్యం ‘ హిజ్ర్ (అంటే సమూద్ జాతి నివసించిన ప్రదేశం) గుండా వెళ్ళవలసి వచ్చింది. సమూద్ జాతి ‘వాదియిల్ ఖురా’లో బండరాళ్ళను తొలిచి ఇండ్లను నిర్మించుకున్న జాతి. సహాబా (రదియల్లాహు అన్హుమ్)లు అక్కడి ఓ బావి నుండి నీటిని నింపుకున్నారు. కాని బయలుదేరే టప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో, “మీరు ఈ ప్రదేశంలోని నీరు త్రాగకండి, ఆ నీటితో నమాజు చేసుకోవడానికి వుజూ కూడా చెయ్యొద్దు. ఆ నీటితో ఏ పిండి అయితే కలిపి ముద్దగా చేశారో, దాన్ని పశువులకు పెట్టేయండి. ఆ పిండి తినకండి. మీరు సాలెహ్ (అలైహిస్సలాం)గారి ఒంటె నీళ్ళు త్రాగిన బావిలోని నీటినే ఉపయోగించండి” అని ఆదేశించారు. 

‘సహీ హీన్’ గ్రంథంలో ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు)గారి ఉల్లేఖనం ఒకటుంది. అందులో ఆయన ఇలా సెలవిస్తున్నారు: 

“మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘ హిజ్ర్ (లేదా సమూద్ జాతి నివాసం) గుండా వెడుతూ, ‘ఈ దుష్టులు నివసించిన ప్రదేశంలో ప్రవేశించకండి. వారి పై పడిన ఆపద మీ పైనా పడవచ్చు. అయితే వెళ్ళేటప్పుడు మాత్రం బాధతో మూలిగే హృదయాలు రోదిస్తూ నడిచినట్లు నడవండి’ అన్నారు. ఆ పిదప ఆయన తన తల పై వస్త్రం కప్పుకుని వేగంగా ప్రయాణిస్తూ ఆ లోయను దాటారు.” [సహీహ్ బుఖారీ- హిజ్ర్ లోయలో ప్రవేశించిన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనే అధ్యాయం-2/637]

మార్గమధ్యంలో సైన్యానికి నీరు కరవై విలవిలలాడిపోతోంది. ఈ విషయం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు విన్నవించుకున్నారు కొందరు. ప్రవక్త మహ నీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ను మొర పెట్టుకోగా అల్లాహ్ మేఘాలను పంపించాడు. అవి బాగా వర్షించగా జనం తనవితీరా దాహాన్ని తీర్చుకోవడమే కాకుండా అవసరానికి కావలసినంత నీటిని నింపుకోవడం జరిగింది. 

ఇక తబూక్ దాపుకు చేరుతారనగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సైన్యాన్ని ఉద్దేశించి, “ఇన్షా అల్లాహ్, మీరు రేపటికల్లా తబూక్ యొక్క నీటి చెలమను చేరుకో గలరు. అయితే చార్జ్ సమయానికి ముందు అక్కడకు వెళ్ళలేరు. కాబట్టి 

అక్కడికి వెళ్ళినవాడు ఏ ఒక్కడు కూడా నేను చేరనంత వరకు ఆ నీటిని ముట్టుకోవద్దు సుమా!” అని హెచ్చరించారు. హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, “మేము అక్కడికి చేరేలోపలే ఇద్దరు వ్యక్తులు ఆ చెలమ దగ్గరికి వెళ్ళడం గమనించాం. ఊట బావి(చెలమ) నుండి కొద్దికొద్దిగా నీరు ఊరుతోంది. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిద్దరిని ఉద్దేశించి, ‘మీరు ఈ నీటిని ముట్టుకున్నారా?’ అని అడగగా, ‘అవును’ అని బదులిచ్చారు వారు. ఆ ఇద్దరికి దైవాదేశం మేరకు ఏం చేప్పాలో చెప్పి, ఆ చెలమ నుండి తన ఒక అర చేతిని దొప్పగా చేసి వచ్చిన నీటిని బయటకు తీయనారంభించారు. అలా తీయగా వచ్చిన కొద్దిపాటి నీటితో తన ముఖాన్ని, చేతుల్ని కడిగి తిరిగి ఆ నీటిని ఆ చెలమలో పోసేశారు. ఆ తరువాత ఆ చెలమలో పుష్కలంగా నీరు ఊరనారంభించింది. సహాబా (రదియల్లాహు అన్హుమ్) తనవితీరా ఆ నీటిని త్రాగారు. ఆ తరువాత నన్నుద్దేశించి, ‘ఓ ముఆజ్! నీవే గనక బ్రతికి ఉంటే ఈ ప్రదేశాన్ని తోటలతో సస్యశ్యామలంగా అలరారుతున్నట్లు చూస్తావు’ అని చెప్పారు.” [ ముస్లిమ్- ముఆజ్ బిన్ జబల్ ఉల్లేఖనం-2/246]

మార్గం మధ్యలోనో లేదా తబూక్ కు చేరిన తరువాతనో- ఉల్లేఖనాల్లో కొంత భేదం ఉంది – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

“ఈ రాత్రి మి మీదికి పెద్ద ఇసుక తుఫాను ఒకటి వచ్చిపడబోతోంది. అందుకని ఏ ఒక్కడూ లేచి నిలబడకూడదు. ఒంటెగలవాడు దాన్ని త్రాటితో గట్టిగా కట్టేయాలి” అన్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చినట్లుగానే ఆ రాత్రి తీవ్రమైన గాలి దుమారం చెలరేగింది. వారిలో ఒక వ్యక్తి లేచి నిలబడగా ఆ గాలి దుమారం అతణ్ణి ఎగిరేసుకుపోయి రెండు కొండల నడుమ విసరేసింది. ” [ముస్లిమ్-ముఆజ్ బిన్ జబల్  ఉల్లేఖనం -2/246]

తబూక్ ప్రయాణంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జొహ్రీ మరియు అశ్ నమాజులు, మగ్రిబ్ మరియు ఇషా నమాజులు కలిపి చేసేవారు. ఒక్కొక్కసారి ఈ రెండు నమాజుల్ని జమా తస్లిమ్ గాను, జమా తాఖీ గానూ చేసేవారు. (‘జమా తస్లీమ్’ అంటే జొహ్రీ మరియు అస్త్ నమాజులు జొహ్ర నమాజు వేళ అయినప్పుడు, మగ్రిబ్, ఇషా నమాజులు మగ్రిబ్ వేళ అయినప్పుడు చేయడం. ఇక ‘ జమా తాకీర్’ అంటే, జొన్గా, అత్ నమాజులు అన్ నమాజు వేళలో, మగ్రిబ్, ఇషా నమాజులు ఇషా నమాజు వేళలో చేయడం) 

తబూక్ కు చేరిన ఇస్లామీయ సైన్యం 

ఇస్లామీయ సైన్యం తబూకకు చేరి గుడారాలను వేసుకొని, రోమనులతో తలబడడానికి సిద్ధమైపోయింది. ఈ సందర్భంలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సైన్యానుద్దేశించి, విశాలమైన భావాలు స్ఫురించేటట్లుగా ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఇహపరలోకాల సాఫల్యం గురించి ప్రోత్సహించారు. అల్లాహ్ శిక్ష ఎలాంటిదో చూపుతూ భయ పెట్టారు. యుద్ధానంతరం లభించబోయే వరాలు, బహుమానాలకు సంబంధించిన శుభవార్తనిచ్చారు. ఇలా సైన్యం యొక్క ధైర్యసాహసాలు పెరిగినట్లయింది. వారిలో ఇప్పటి వరకు, తినుబండా రాలు, ఇతర వస్తువుల లేమి గురించి బాధపడుతున్న లోపాలన్నీ తొలగి పోయాయి. మరో ప్రక్క రోమను సామ్రాజ్యానికి మద్దతుగా వచ్చిన తెగలు, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాక గురించి విని భయభీతులైపోయాయి. ముందుకొచ్చి ముస్లిమ్ సేనను ఢీకొనడానికి ధైర్యం చాలక, దేశంలోని వివిధ పట్టణాల వైపునకు పారిపోనారంభించాయి. వారి ఈ వైఖరి ప్రభావం, అరేబియా ద్వీపం లోనే కాకుండా, బయటి వారి పైనా పడింది. ముస్లిముల ఘనకీర్తికి మరింత బలం చేకూరినట్లయింది. ముస్లిములకు, యుద్ధం ద్వారా సాధించ లేని రాజకీయ ప్రయోజనాలు ఒనగూడాయి. ఆ ప్రయోజనాలేమిటో మనం ఇక్కడ సమీక్షిద్దాం. 

‘అయిలా’ పాలకుడు ‘యక్నా బిన్ రౌబా’ వెంటనే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో హాజరై జిజియా కట్టడానికి ఒప్పుకున్నాడు. సంధి ఒప్పందం చేసు కున్నాడు. ‘జర్ బా’ మరియు ‘అజ్ రూహ్’ పౌరులు కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు వచ్చి జిజియా కట్టడానికి సిద్ధపడ్డారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ఓ పత్రాన్ని రాయించి ఇచ్చారు. వారు దాన్ని సురక్షితంగా తమ వద్ద ఉంచు కోవడం జరిగింది. అలాగే ‘అయిలా’ లకునికి కూడా ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) పత్రాన్ని రాసి ఇచ్చారు. అది ఈ క్రింది విధంగా ఉంది.

“బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం. ఇది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తరఫున, యహినా బిన్ రౌబా మరియు అయిలా ప్రజలకు రాసి ఇచ్చిన శాంతి ఒప్పంద పత్రం. భూతలంపైనా, సముద్రం మీదనూ వారి పడవలు మరియు బిడారాల బాధ్యత అల్లాహ్ మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)దే. అలాగే ఈ బాధ్యత ‘యహినా’కు మిత్రులైన సిరియా వారి కోసం కూడాను. అయితే, వారి ఏ వ్యక్తి అయినా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అతని ధనం అతని ప్రాణాన్ని రక్షించలేదు. అతని సొత్తును తీసుకున్నవాడికి అది ధర్మసమ్మతమే అవుతుంది. వారు ఏ ఒయాసిస్సుకు వెళ్ళడాన్నిగాని, భూమి మరియు సముద్ర మార్గం పై నడవడాన్నిగాని అడ్డుకోవడం జరుగదు.”

ఇదే కాకుండా మహనీయ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు)కు నాల్గు వందల ఇరవై ఉ’రోహకుల పటాలాన్నిచ్చి దూమతుల్ జందల్ పాలకుడు ‘ఉకైదిర్’ వద్దకు పంపించారు. వెళ్ళేటప్పుడు ఆయనతో, “నీవు వెళ్ళేటప్పటికి అతడు జింక వేటలో ఉండగా జూస్తావు” అని కూడా చెప్పారు. హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) కోట అగుపడేటంత దూరం వెళ్ళి ఆగిపోయారు. అనుకోకుండా ఓ జింక ఎక్కడి నుండో వచ్చి కోట ద్వారాన్ని కొమ్ములతో చెలుగుతోంది. ఉకైదర్ దాన్ని వేటాడడానికి బయటకు వచ్చాడు. వెన్నెల రాత్రి కావడం వలన, హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు), ఆయనగారి అనుచరులు అతణ్ణి పట్టుకొని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి తెచ్చారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతణ్ణి క్షమించి, రెండు వేల ఒంటెలు, ఎనిమిది వందల బానిసలు, నాల్గు వందల కవచాలు, నాల్గు వందల బరిశెలు ఇచ్చే షరతు పై ఒప్పందం కుదుర్చుకుని వదలివేశారు. అతను ఇక నుండి జిజియా కూడా కడతా నని ఒప్పుకున్నాడు. ఇలా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యహినాకు తోడు దూమా, తబూక్, అయిలా మరియు తైమాలతో షరతులతో కూడిన ఒప్పందాలు చేసుకున్నట్లయింది. 

ఈ పరిస్థితులను గమనించి, ఇప్పటి వరకు రోమనుల చెప్పుచేతల్లో ఉన్న తెగలు, ఇక తమ పాత సంరక్షకులను నమ్ముకొని ఉండే కాలం చెల్లిపోయిందని తలచి ముస్లిములకు సహకరించనారంభించారు. ఈ విధంగా ముస్లిము సామ్రాజ్య సరిహద్దులు విస్తరించి నేరుగా రోమను సామ్రాజ్యంతో కలిసిపోయాయి. రోమనుల తొత్తులు చాలా మట్టుకు అంతమైపోయారు. 

మదీనాకు తిరుగు ప్రయాణం 

ఇస్లామీయ సేన ఎలాంటి యుద్ధం చేయకుండానే విజయకేతనం ఎగురవేస్తూ మదీనాకు తిరిగి వచ్చింది. అల్లాహ్, యుద్ధం విషయంలో మోమిన్ (విశ్వాసుల)కు అండగా నిలిచాడు. అయితే మార్గమధ్యంలో ఓ లోయ వద్ద పన్నెండుగురు మునాఫిక్ కు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను హతమార్చడానికి ప్రయత్నించారు. ఆయన అప్పుడు ఆ లోయగుండా వెళుతున్నారు. హజ్రత్ అమ్మార్(రదియల్లాహు అన్హు) ఒంటె ముకుత్రాడు పట్టుకొని ముందు నడుస్తున్నారు. హజ్రత్ హుజైఫా బిన్ యమాన్ (రదియల్లాహు అన్హు) ఒంటె వెనకాల నడుస్తూ దాన్ని తోలుతున్నారు. మిగిలిన సహాబాలందరూ దూరంగా, ఆ లోయ పల్లపు ప్రదేశం గుండా వస్తున్నారు. అందుకని మునాఫిలకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను హతమార్చే దుష్టావకాశం లభించిందనిపించింది. వారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వైపునకు రానారంభించారు. ఇటు ప్రవక్తగారి సహచరులిద్దరు మామూలుగా నడుస్తూనే ఉన్నారు. వెనుక నుండి ఎవరో వస్తున్నట్లు కాళ్ళ సవ్వడి వినబడింది. వీరంతా ముఖాలపై ముసుగులు కట్టుకొని దాడికి సిద్ధపడడం చూసి ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) హుజైఫా (రదియల్లాహు అన్హు)ను వారిని అడ్డగించడానికి పంపారు. ఆయన వారి వాహనాల ముఖాలపై తన బౌలుతో కొట్టనారంభించారు. అల్లాహ్, ఆయన వేసిన దెబ్బలకు భయపడి పోయేటట్లుగా చేయడం వలన వారు పారిపోయి తమ వారి వద్దకు చేరారు. ఆ తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పేర్లు చెబుతూ వారెందుకు వచ్చారో తెలియజేశారు. అందుకనే హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు)కు, ప్రవక్త ‘నమ్మిన బంటు’గా పేరుబడిపోయింది. ఈ సంఘటనకు సంబంధించే దివ్య ఖుర్ఆన్లో, “వారు చేయదలిచిన పనిని చేయలేకపోయారు” అనే వాక్యం అవతరించింది. 

ప్రయాణం పూర్తిచేసి మదీనా దాపుకు రాగానే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మదీనా గురుతులు కానరాగా ఆయన, “అదిగో ‘తాబా’, అది ఉహద్ కొండ, మనల్ని ప్రేమించేది మనం దాన్ని ప్రేమిస్తున్న కొండ అదిగో” అని సంబరపడుతూ అన్నారు. ఇటు మదీనాలో ఆయన రాక గురించిన వార్త అందగానే స్త్రీలు, పిల్లలు, అమ్మాయిలంతా బయటకు వచ్చి ఎంతో ఘనంగా ఆ సైన్యానికి స్వాగతం పలకుతూ ఈ పద్యపాదాలను చదవనారంభించారు° (దాని భావం ఇలా ఉంది): 

“సనీయతుల్ విదా దిగ్మండలం నుండి పొడిచిన పున్నమి చంద్రు డడిగో, మమ్మల్ని పిలిచేవాడు పిలుస్తున్నంత వరకు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవడం మన విధి.” 

[ఇది ఇబ్నె ఖయ్యిమ్ గారి సూక్తి. దీనిపై చర్చ ఇది వరకే వచ్చింది]

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తబూక్ కు రజబ్ నెలలో బయలుదేరారు. తిరిగి వచ్చేటప్పటికి రమజాన్ నెల నడుస్తోంది. ఈ ప్రయాణం మొత్తం యాభై రోజుల ప్రయాణం. ఇరవై రోజులు తబూక్ లో గడిపినవి, ముప్ఫై రోజులు అక్కడికి వెళ్ళిరావడానికి జరిగిన ప్రయాణ రోజులు. 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ జీవితకాలంలో స్వయంగా పాల్గొన్న గజ్వాల్లో ఈ గజ్వా చిట్టచివరి గజ్వా (పోరాటం). 

ముకల్లిఫీన్ (యుద్ధంలో పాల్గొనకుండా వెనుక ఉండిపోయినవారు) 

ఈ పోరాటం, దాని ప్రత్యేక పరిస్థితులననుసరించి, అల్లాహ్ తరఫున ఓ గట్టి పరీక్ష కూడాను. ఈ పోరాటం ద్వారా, విశ్వాసులెవరో, విశ్వాసులు కానివారెవరో తేలిపోయింది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా ఇలాంటి వారిని ఏరి చూయించడం అల్లాహ్  సంప్రదాయం. దివ్యఖుర్ఆన్ ఈ విషయాన్ని ఇలా సెలవిస్తోంది: 

“మీరు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో అల్లాహ్ విశ్వాసులను ఏ మాత్రం ఉండనివ్వడు. ఆయన పవిత్రులను, అపవిత్రుల నుంచి తప్పకుండా వేరుచేస్తాడు.” (3:179) 

కాబట్టి ఈ పోరాటంలో విశ్వాసులు, సత్యవంతులందరూ పాల్గొన్నవారే. ఆ యుద్ధంలో పాల్గొనకపోవడమంటే, అది నిఫా కు (కాపట్యానికి) గుర్తు. ఎవరైనా యుద్ధంలో పాల్గొనకుండా ఎందుకు ఉండిపోవలసి వచ్చిందో ఆ విషయాన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు విన్నవించుకునేవారు సహాబా (రదియల్లాహు అన్హుమ్). ఆయన దానికి జవాబుగా, “వదిలేయండి! అతని మనస్సులో శ్రేయం పొందాలనే కోరికే ఉంటే, అల్లాహ్ త్వరలోనే అతణ్ణి నా వద్దకు పంపించేస్తాడు. అలా కాకపోతే అతని నుండి అల్లాహ్ మిమ్మల్ని రక్షించినట్లే” అని అంటూ ఉండే వారు. ఎలాగైతేనేమి,యుద్ధసామగ్రి, వాహనాలులేక యుద్ధంలో పాల్గొనలేక పోయిన వారు కొందరైతే, మునాఫిక్ కు మరికొందరు. ఈ మునాఫిస్టు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విశ్వసించామని దొంగ నటన చేసినవారు. ప్రస్తుతం వారే దొంగసాకులు చెప్పి ఈ గజ్వాలో పాల్గొనకుండా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుమతిని పొంది వెనుక ఉండిపోయినవారు. మరికొందరైతే ఎలాంటి అనుమతి లేకుండానే ఇండ్లలో కూర్చుండిపోయారు. అయితే పోరాటంలో పాల్గొనకుండా మిగిలిపోయిన ముగ్గురు మాత్రం నిజమైన ముస్లిములు, గట్టి విశ్వాసం గలవారే. వారు ఎలాంటి కారణం లేకుండానే యుద్ధంలో పాల్గొనలేదు. వారిని అల్లాహ్ పరీక్షకు గురిచేసిన తరువాత వారి పశ్చాత్తాపాన్ని మన్నించడం జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి: 

తిరుగు ప్రయాణం చేసి మదీనాకు చేరిన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎప్పటిలాగే మస్జిదె నబవీ కి వెళ్ళారు. అక్కడ రెండు రకాతుల నమాజు చేశారు. ప్రజలు చుట్టుముట్టగా అక్కడనే కూర్చుండిపోయారు. ఇటు మునాఫిక్లులు – వారు ఎనభై మందికంటే ఎక్కువే.”(*) ఒకరి తరువాత ఒకరు వచ్చి ఏదో సాకులు చెప్పనారంభించారు. అల్లాహ్  పై ప్రమాణాలు చేస్తూ తాము రాలేకపోయిన విషయాన్ని వివరిస్తున్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు పైకి చెప్పే దాన్ని స్వీకరించి వారితో బైక్ కూడా చేస్తూ వారి మన్నింపు కోసం దైవాన్ని ప్రార్థిస్తున్నారు. వారి మనస్సులోని విషయాన్ని దైవానికే వదలివేశారు

(*) వాకిదీ కథనం ప్రకారం, ఈ సంఖ్య అన్సారులలోని మునాఫిక్ లది. వారే కాకుండా బనీ గిఫ్ఫార్ వగైరా బద్దూ తెగల వారి సంఖ్య ఎనభై ఇద్దరు. అబ్దుల్లాహ్ బిన్ ఉబై, అతని సహచరులు వారికి అదనం. వారు కూడా చాలా మందే ఉన్నారు. (చూడండి, ఫహుల్ బారి-8/119) 

ఇక మిగిలిన వారు ముగ్గురు మోమిన్లు, సత్యసంధులు – అంటే హజ్రత్ కఅబ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు), మురారా బిన్ రబీ (రదియల్లాహు అన్హు), హిలాల్ బిన్ ఉమయ్యా (రదియల్లాహు అన్హు)లు- వారు నిజాన్నే అనుసరిస్తూ, “మేము ఎలాంటి కారణం లేకుండానే పోరాటంలో పాల్గొనలేదు” అని ఉన్న విషయం మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు విన్నవించుకున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ఈ ముగ్గురు వ్యక్తులతో ఎలాంటి సంభాషణ చేయవద్దని సహాబా (రదియల్లాహు అన్హుమ్)ను ఆదేశించారు. కాబట్టి ఈ ముగ్గురికి వ్యతిరేకంగా తీవ్రమైన బాయికాట్ (సామాజిక వెలి) ప్రారంభం అయింది. ప్రజలంతా ఒక్కసారే మారిపోయారు. జీవితం భయంకరంగా మారిపోయింది. ఇంత పెద్ద వైశాల్యం గల భూమి ఒక్కసారే ఇరుకైనట్లనిపించింది వారికి, అదేకాదు ప్రాణాలు కూడా పోయేటంత గడ్డు పరిస్థితి ఏర్పడింది. అలా నలభై రోజులు గడిచిన తరువాత భార్యల వద్దకుపోవడం కూడా మానుకొమ్మనే ఆదేశం వెలువడింది. బాయికాట్ కు సంబంధించిన యాభై రోజులు పూర్తి అయిన తరువాత అల్లాహ్ వారి తౌబా స్వీకరించబడినట్లు శుభవార్త అందించాడు. దివ్యఖుర్ఆన్ లోని ఈ శుభవార్త వాక్యాలు ఇలా ఉన్నాయి. 

“ఇంకా వ్యవహారం వాయిదా వేయబడిన ఆ ముగ్గురిని కూడా ఆయన క్షమించాడు. ఇంత పెద్ద వైశాల్యం కలిగి ఉండి కూడా, భూమి వారికి ఇరుకై పోయింది. వారి ప్రాణాలు కూడా వారికి భారమైపోయాయి. అల్లాహ్ నుండి తమను కాపాడుకోవడానికి స్వయంగా అల్లాహ్ కారుణ్యం తప్ప వేరే ఆశ్రయం ఏదీ లేదని వారు తెలుసుకున్నారు. అప్పుడు అల్లాహ్ కనికరంతో వారి వైపునకు మరలాడు, వారు ఆయన వైపునకు మరలి వచ్చేటందుకు. నిశ్చయంగా ఆయన చాలా క్షమించేవాడు, కరుణించే వాడూను.” (9 : 118) 

ఈ తీర్పు వెలువడగానే ముస్లిములందరూ సాధారణంగానూ, ఆ ముగ్గురు సహాబాలు (6) ప్రత్యేకంగాను సంబరపడిపోయారు. ప్రజలు పరుగున వచ్చి వారికి ఈ శుభవార్తను అందించనారంభించారు. వారి ముఖాలు ఆనందాతిశయంతో విప్పారిపోయాయి. ప్రజలు వారికి కానుకలు అర్పించనారంభించారు. నిజం చెప్పాలంటే ఆ రోజు వారికి ఎంతో విలువైన రోజు. 

అలాగే మరెవరైతే చేతకాక వివశులై ఆ సంగ్రామంలో పాల్గొనలేక పోయారో వారిని గురించి అల్లాహ్ ఈ క్రింది ఆయత్ లను అవతరింపజేశాడు. 

“వృద్ధులు, వ్యాధిగ్రస్తులూ, పోరాటంలో పాల్గొనడానికి దారి భత్యాలు లేని వారూ ఒకవేళ వెనుక ఉండిపోతే ఏ దోషమూ లేదు. వారు చిత్తశుద్ధితో అల్లాహూ, ఆయన ప్రవక్తకూ విశ్వాసపాత్రులుగా ఉన్నంతవరకు. అటువంటి సజ్జనుల పట్ల ఆక్షేపణకు ఏ ఆస్కారమూ లేదు. అల్లాహ్ మన్నించేవాడూ, కరుణించేవాడూను.” (9 : 91,92) 

మదీనాకు దాపుగా వచ్చినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి విషయంలోనే, “మదీనాలో కొందరున్నారు. వారు మీరు ఏయే ప్రదేశాల నుండి ప్రయాణం చేశారో, ఏ లోయల్ని దాటారో అప్పుడు మీ వెంటే ఉన్నారు, వారిని కొన్ని అనివార్య కారణాలు మీ వెంట రాకుండా చేశాయి” అని అనగా, “ఓ దైవప్రవక్తా! వారు మదీనాలో ఉంటూనే మన వెంట ఉన్నారా?” అని అడిగారు అనుచరులు. “అవును, మదీనాలో ఉండి కూడా వారు మీ వెంటే ఉన్నారు” అని సమాధానమిచ్చారు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). 

ఈ పోరాట ప్రభావం 

ఈ సంగ్రామం అరేబియా ద్వీపంపై, ముస్లిముల ప్రభావం విస్తరింప జేయడానికి, బలం చేకూర్చడానికి ఎంతో దోహదపడింది. ఇక అరేబియా ద్వీపంలో ఇస్లామ్ శక్తి తప్ప మరే శక్తి జీవించి ఉండజాలదు అనే విషయం ప్రజల మనస్సుల్లో నాటుకుపోయింది. ముస్లిములకు వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు పన్నుతూ అదను కోసం ఎదురుచూస్తున్న మునాఫిక్ ఆశలు కూడా అడియాసలైపోయాయి. వీరు రోమను సామ్రాజ్యంపై పెట్టుకున్న 

ఆశలు ఈ సంగ్రామంతో అడుగంటిపోయాయి. అందుకని వారి ధైర్యం కాస్తా సన్నగిల్లి, యదార్థం ముందు మోకరిల్లడం తప్ప మరే మార్గం వారికి లభించలేదు. 

ఇలాంటి పరిస్థితి ఏర్పడిన తరువాత ఇక ముస్లిములు, మునాఫిక్స్ ఎడల మృదువైఖరిని అవలంబించే అవసరమే లేకుండాపోయింది. అల్లాహ్ వారి ఎడల కఠిన వైఖరిని అవలంబించమని ఆదేశం ఇస్తూ, చివరకు వారు ఇచ్చే దానధర్మాలను కూడా స్వీకరించడంగాని, వారి జనాజా నమాజు చేయడం గాని, వారి మన్నింపు కోసం ప్రార్థించడంగాని చేయవద్దని ఆదేశించడం జరిగింది. అలాగే వారి సమాధుల వద్దకు కూడా వెళ్ళవద్దని, మస్జిద్ పేరు మిద వారేదైతే కుట్రల గూడు కట్టుకున్నారో దాన్ని పడవేయమని ఆదేశిం చాడు. వాటి గురించి అవతరింపజేసిన ఆయలు వారిని పూర్తిగా బట్టబయలు చేసివేశాయి. ఇక వారిని గుర్తించడంలో ఎలాంటి పొరపాటు లేకుండా పోయింది. అంటే, ఈ ఖుర్ఆన్ ఆదేశాలు, మదీనా ప్రజలు తెలుసుకునేటట్లు వారి బండారం బయట పెట్టాయన్నమాట.” *

* ఈ గజ్వా (సంగ్రామం) గురించిన వివరాలు ఈ క్రింది ఆధారాల నుండి గ్రహించ బడ్డాయి. ఇబ్నె హషామ్-2/515 – 517, జాదుల్ ముఆద్-3/2 – 13; సహీ బుఖారి -2/633 – 637, 1/252, 414 వగైరా; సహీహ్ ముస్లిమ్ షరా నూవీ-2/246; ఫత్ హుల్ బారి-8/110 – 126, ముక్తసరుస్సీరత్- షేక్ అబ్దుల్లాహ్, పుట. 291 – 407) 

ఈ సంగ్రామానికి సంబంధించి అవతరించిన ఖుర్ఆన్ ఆదేశాలు 

ఈ గజ్వాకు సంబంధించి తౌబా సూరా (కౌ అధ్యాయం)లో అనేక ఆయలు అవతరించాయి. కొన్ని గజ్వాకు బయలుదేరక పూర్వం అవతరిస్తే, మరికొన్ని బయలుదేరి వెళ్ళిన తరువాత ప్రయాణ సందర్భంగాను, మరికొన్ని మదీనాకు తిరిగి వచ్చిన తరువాతనూ అవతరించాయి. ఈ ఆయత్ లలో చిత్తశుద్ధిగల విశ్వాసుల ఔన్నత్యం ఎలాంటిదో చెప్పడం జరిగింది. అదే కాకుండా, ఈ ఆయత్ లలో, గజ్వాలో పాల్గొన్నవారు, గజ్వాలో పాల్గొనలేక పోయిన విశ్వాసులు, సత్యసంధుల తౌబా (పశ్చాత్తాపం) స్వీకరించబడిన విషయమూ వగైరాలు ఉన్నాయి.

ఆ సంవత్సరపు కొన్ని ప్రముఖ సంఘటనలు 

ఆ సంవత్సరం (అంటే హిజీ శకం 9)లో చారిత్రాత్మకమైన సంఘట నలు అనేకం చోటు చేసుకున్నాయి. 

1. తబూక్ నుండి తిరిగివచ్చిన తరువాత, ఉవైమిర్ అజ్ఞానీ మరియు ఆయన భార్య నడుమ ‘లిఆన్’ (రంకు విషయమై ఏర్పడిన జగడం) జరిగింది. 

2. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో తాను వ్యభిచరించినట్లు చెప్పిన స్త్రీకి ‘రజ్మ్’ (రాళ్ళతో కొట్టి చంపే శిక్ష) వేయబడింది. ఆ స్త్రీ పురుడు పోసుకొని, పిల్లవాడు పాలు త్రాగడం మానినప్పుడు గాని ఆమెను రజ్జ్ చేయడం జరగలేదు. 

3. అబిసీనియా చక్రవర్తి ‘అస్మహా నజాషీ’ మరణించగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన ‘గాయిబానా’ (పరోక్ష) నమాజె జనాజా చేశారు. 

4. ఆ సంవత్సరమే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి పుత్రిక ఉమ్మె కుల్సూమ్ (రదియల్లాహు అన్హా) చనిపోయారు. ఆమె మరణం మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను శోకసముద్రంలో ముంచివేసింది. తన అల్లుడు హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)తో ఆయన(సల్లల్లాహు అలైహి వసల్లం), “ఒకవేళ నాకు మూడవ కుమార్తె ఉండి ఉంటే ఆమె వివాహం కూడా నీతో చేసేవాన్నే” అన్నారు. 

5. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తబూక్ నుండి తిరిగివచ్చిన తరువాత మునాఫిక్స్ సర్దారు అబ్దుల్లా బిన్ ఉబై చనిపోయాడు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని మన్నింపు కోసం దుఆ చేశారు. హజ్రత్ ఉమర్(రదియల్లాహు అన్హు) ఆయన్ను వారిస్తున్నప్పటికీ అతని నమాజె జనాజా చేశారు. ఆ తరువాత దివ్యఖుర్ఆన్లో, హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ను బలపరుస్తూ, మునాఫిక్స్ నమాజె జనాజా చేయకూడదనే ఆదేశం అవతరించింది.