మేలుతో కూడుకున్న ప్రతి మంచి పనీ పుణ్యకార్యమే (సదఖాయే) | బులూగుల్ మరాం | హదీసు 1260 ‘సదఖా’ అంటే కేవలం ధనపరమైన దానమే కాదు, పరోపకారంతో కూడుకున్న ప్రతి మంచి పని సదఖాయే. https://youtu.be/CiwhfXpxP9Q [4 min] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు:
“మేలుతో కూడుకున్న ప్రతి మంచి పనీ పుణ్యకార్యమే (సదఖాయే)”(బుఖారీ)
సారాంశం:
‘సదఖా’ అంటే కేవలం ధనపరమైన దానమే కాదనీ, పరోపకారంతో కూడుకున్న ప్రతి మంచి పని సదఖాయేననీ ఈ హదీసు ద్వారా రూఢీ అవుతోంది.
తిర్మిజీ, ఇబ్నె హిబ్బాన్ లలో అబూదావూద్ చే ఉల్లేఖించబడిన హదీసు ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారు:
“నీ సోదరుని సమక్షంలో చిరునవ్వును చిందించటం కూడా పుణ్య కార్యమే. ఒక మంచి పని వైపునకు అతనికి మార్గదర్శకత్వం చేయటం, అధర్మమైన ఒక పని నుండి అతణ్ణి ఆపటం కూడా పుణ్యకార్యమే. దారితప్పిన వాడికి దారి చూపించటం కూడా పుణ్యకార్యమే. ఆఖరికి; బాటసారుల బాధను తొలగించే సంకల్పంతో మార్గంలోని ఎముకలను, ముళ్ళను తొలగించటం కూడా పుణ్యకార్యమే. తన బొక్కెనతో తన సోదరుని బొక్కెనలో కొద్ది నీరు పోసినా, అదీ పుణ్యకార్యమే అవుతుంది.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: “ప్రజలలో కొంత మంది అల్లాహ్కు అతి దగ్గరవారై ఉన్నారు .” అని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు. యా రసూలుల్లాహ్ ! వారెవరూ? అని కొందరు అడిగారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం): “వారు అహ్లుల్ ఖుర్ఆన్ (ఖుర్ఆన్ (గంథాన్ని పారాయణం చేసేవారు, దానిని నేర్పేవారు, నేర్చుకునేవారు) మరియు వారే అల్లాహ్కు అతి దగ్గరవారై ఉంటారు, వారు ఆయనకు ప్రత్యేకులు” అని అన్నారు. [నసాయి, ఇబ్ను మాజా, హాకిమ్: సహీహ్ అత్తర్గీబ్ వత్తర్హీబ్: 1432]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మీ పొరుగువారి హక్కులను కనిపెడుతూ ఉండండి | బులూగుల్ మరాం | హదీసు 1262 https://youtu.be/4Wat6gesVDA [4 min] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
1262. ఈయనగారే చేసిన మరొక కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్భోధించారు:
“మీరు చారులాంటిది వండినపుడు అందులో కాస్త నీరు ఎక్కువగా పోయండి. మీ పొరుగువారిని కనిపెడుతూ ఉండండి”(ఈ రెండు హదీసులనూ ‘ముస్లిం’ పొందుపరచారు)
సొరాంశం:
ఈ హదీసులో ఇరుగు పొరుగు వారి హక్కును నొక్కి చెప్పటం జరిగింది. కూర వండేటప్పుడు, మాంసాహారం తయారు చేసేటప్పుడు రోస్ట్, ఇగురు వంటివి చేసేబదులు షేర్వా, సూప్ లాంటివి తయారు చేసుకోవాలనీ, అయితే పొరుగింటి వారిని మాత్రం విస్మరించరాదని దీని భావం. అందునా ఇరుగు పొరుగువారు పేదవారైనపుడు వారికి కానుకగా పంపటం తప్పనిసరి. ఒకవేళ పొరుగింటివారు ధనవంతులై ఉంటే అప్పుడప్పుడూ సత్సంబంధాల కోసమైనా సరే పంపుతూ ఉండాలి.
వేరొక హదీసులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :
“దైవదూత జిబ్రయీల్ నా వద్దకు వచ్చినప్పుడల్లా పొరుగువారి హక్కును గురించి గట్టిగా నొక్కి చెబుతుండేవారు. ఆయన నొక్కి వక్కాణిస్తున్న తీరునుబట్టి బహుశా పొరుగువారిని (ఆస్తిలో) వారసులుగా ప్రకటించటం జరుగుతుందా! అని నాకు ఒకింత సందేహం కలిగేది“
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[13] ప్రవక్త ﷺ వారి శత సాంప్రదాయాలు (హదీసులు 44 – 47) : ప్రయాణపు నియమాలు https://youtu.be/V1AsvkTzA30 [24 min] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ప్రయాణపు నియమాలు:
44- ప్రయాణంలో నాయకుని ఎన్నిక:
ప్రవక్త ﷺ ఉపదేశించారని అబూ సఈద్ (రజియల్లాహు అన్హు) మరియు అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “ఎవరైనా ముగ్గురు మనుషులు కలసి ప్రయాణానికి వెళ్తే వారు తమలో ఒకరిని నాయకునిగా ఎన్నుకోవాలి”. (అబూదావూద్ 2608).
45- ఎత్తు ఎక్కుతూ అల్లాహు అక్బర్, పల్లంలో దిగుతూ సుబ్ హానల్లాహ్ పలకడం:
“మేము ఎత్తు ప్రదేశంలో ఎక్కెటప్పుడు అల్లాహు అక్బర్ అని, ఎత్తు నుండి దిగేటప్పుడు సుబ్ హానల్లాహ్ అని అనేవారమని జాబిర్ (రజియల్లాహు అన్హు) తెలిపారు”. (బుఖారీ 2994).
46- మజిలీ వచ్చినప్పుడు చదవవలసిన దుఆ:
ప్రవక్త ﷺ చెప్పగా తాను విన్నానని ఖౌలా బిన్తె హకీం (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారుః “ఎవరైనా ప్రయాణం చేస్తూ ఏదైనా ప్రాంతంలో మజిలీ చేసినప్పుడు ఈ దుఆ చదివితే వారు అక్కడి నుండి బయలుదేరే వరకూ వారికి ఏ హానీ కలగదుః అఊజు బికలిమాతిల్లా హిత్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్. (నేను అయన సృష్టి కీడు నుండి అల్లాహ్ యొక్క సంపూర్ణ వచనాల శరణు కోరుతున్నాను). (ముస్లిం 2708).
47- ప్రయాణం నుండి వచ్చీరాగానే మస్జిద్ కు వెళ్ళడం:
కఅబ్ బిన్ మాలిక్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ﷺ ప్రయాణం నుండి తిరిగి రాగానే ముందు మస్జిద్ కు వెళ్ళి రెండు రకాతుల నమాజు చేసేవారు. ((బుఖారీ 443. ముస్లిం 716).).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1- మయ్యిత్ ఎవరికైనా వసియ్యత్ చేసి ఉంటే, అతనికి స్నానం చేయించే విధానం తెలిసి ఉంటే అతనే స్నానం చేయించాలి. అబూ బక్ర్ (రజియల్లాహు అన్హు) తన భార్యకు, అనస్ (రజియల్లాహు అన్హు) ముహమ్మద్ బిన్ సీరీన్ కు వసియ్యత్ చేసి ఉండిరి. (తబఖాత్ ఇబ్ను సఅద్)
2- స్నానం చేయించే వ్యక్తి ఎంత దగ్గరివారయితే అంతే మంచిది. అయితే స్నానం చేయించే విధానం తెలిసి ఉండడం తప్పనిసరి
3- భర్త భార్యకు, భార్య భర్తకు స్నానం చేయించవచ్చును. ఒక సందర్భంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయిషా (రజియల్లాహు అన్హా)తో చెప్పారు: “నీవు నాకంటే ముందు చనిపోతే నేనే నీకు స్నానం చేయించుదును, కఫన్ ధరింపజేయుదును” (ఇబ్ను మాజ 1465, షేఖ్ అల్బానీ: హసన్).
హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ (రజియల్లాహు అన్హు) వసియ్యత్ చేశారు: ఆయనకు ఆయన భార్య అస్మా బిన్త్ ఉమైస్ (రజియల్లాహు అన్హా) స్నానం చేయించాలని. (ముసన్నఫ్ అబ్దుర్ రజ్జాఖ్ 6117).
4- పురుషులు మగవారికి, మగపిల్లలకు స్నానం చేయించాలి, స్త్రీలు స్త్రీలకు, ఆడపిల్లలకు స్నానం చేయించాలి.
5- స్నానం చేయించే వ్యక్తి రెండు షరతులను పాటిస్తే గొప్ప పుణ్యం పొందుతాడు:
“40 సార్లు క్షమించబడతాడు”. (సహీ తర్గీబ్ 3492).
అల్లాహ్ ప్రసన్నత మాత్రమే కోరాలి. (ఇది తప్పనిసరి).
ఏదైనా దోషం చూస్తే ఎవరికీ చెప్పకుండా కప్పిఉంచాలి. (ఇది విధిగా ఉంది).
శవానికి స్నానం చేయించే విధానం
1- ప్రజల దృష్టి పడని చోట స్నానం చేయించాలి.
2- నాభి నుండి మోకాళ్ళ వరకు ఏదైనా వస్త్రం కప్పి, అతని శరీరంపై ఉన్న కుట్టిన బట్టలు తీయాలి. (అబూ దావూద్ 3141లో ప్రవక్త దుస్తులు తీసే విషయంలో సహాబాల చర్చ).
3- శవాన్ని ఏదైనా కొంచెం ఎత్తైన ప్రదేశంలో పెట్టాలి.
తల మరియు వీపు క్రింద చేయి వేసి చిత్రంలో చూస్తున్నట్లు కొంచెం పైకి ఎత్తి కడుపులో ఏదైనా ఆగి ఉన్నది పోయే విధంగా తిన్నగా ఒత్తాలి.
4- స్నానం చేయిస్తున్న నియ్యత్ మనస్సులో చేసుకోవాలి.
6- నమాజు కొరకు చేసే విధంగా వుజూ చేయించాలి. ఆ తర్వాత కుడి వైపు నుండి స్నానం చేయించడం మొదలెట్టాలి.
(బుఖారీ 167, ముస్లిం 939). «ابْدَأْنَ بِمَيَامِنِهَا وَمَوَاضِعِ الوُضُوءِ مِنْهَا»
وفي الفتح: الحكمة في الأمر بالوضوء تجديد أثر سمة المؤمنين في ظهور أثر الغرة والتحجيل.
7- తల పై నుండి ఆ తర్వాత కుడి వైపున, ఎడమ వైపున రేగాకు కలిపిన నీళ్ళతో మంచిగా స్నానం చేయించాలి.
8- మూడు సార్లు, అవసరమైతే ఎక్కువ సార్లు పర్లేదు, కాని బేసి సంఖ్యలో ఉండే విధంగా గమనించాలి. (నిసాయి 1865).
9- చివరిలో కర్పూరం కలిపిన నీళ్ళతో స్నానం చేయించాలి. అది లేనిచో ఏ సువాసన అయినా ఉపయోగించవచ్చును.
10- స్త్రీల వెంట్రుకలను మూడు భాగాలుగా చేసి జడవేయాలి. (నిసాయి 1865).
11- మృతునికి స్నానం చేయించిన వ్యక్తి స్నానం చేయడం తప్పనిసరి కాదు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
74: అల్లాహ్ నియమించిన హద్దులను (శిక్షలను) రద్దు చేయమని వాదించుట ~ ఒక ముస్లిం లో లేని లోపము కల్పించుట ~బిదాత్ స్థాపించుటకు పోరాడుట(అబూ దావూద్ : 3597)
75: బిదాత్ ని ప్రారంభించుట, అపమార్గం వైపు సందేశం ఇచ్చుట (సహీ ముస్లిం: 1017,2674)
76: బంధుత్వాన్ని త్రెంచుట- 4:1(సహీహ్ ముస్లిం 2556)
77: తోటి ముస్లింతో కొట్లాడుట – (బుఖారీ :48)
—
4:31 – పెద్ద పాపాలకు దూరంగా ఉంటే చిన్న పాపాలు క్షమిస్తాను
53:32 – పెద్ద పాపాలకు దూరంగా ఉండాలి
42:37 – భాగ్యవంతులు పెద్ద పాపాలకు దూరంగా ఉంటారు
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర వక్త: సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/c8YBKq1fepo [30 నిముషాలు]
ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్ప సహాబీ అయిన అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్రను క్లుప్తంగా వివరించబడింది. ఇస్లాం స్వీకరించక ముందు ఆయన పేరు, స్వీకరించిన తర్వాత ప్రవక్త వారు పెట్టిన పేరు, మరియు ఆయనకు “అబూ హురైరా” (పిల్లికి తండ్రి) అనే బిరుదు ఎలా వచ్చిందో వివరించబడింది. ఆయన యెమన్ దేశంలోని దౌస్ తెగలో జన్మించి, తండ్రిని కోల్పోయి తల్లి వద్ద పెరిగిన తీరు, మరియు తుఫైల్ బిన్ అమర్ దౌసీ (రదియల్లాహు అన్హు) ద్వారా ఇస్లాం స్వీకరించిన వృత్తాంతం చెప్పబడింది. మదీనాలో ఆయన అనుభవించిన తీవ్ర పేదరికం, అహ్ల్ అస్-సుఫ్ఫాలో ఒకరిగా జీవించిన విధానం, మరియు ప్రవక్త వారి దుఆ ఫలితంగా ఆయన తల్లి ఇస్లాం స్వీకరించిన అద్భుత సంఘటనను కళ్ళకు కట్టినట్టు వివరించారు. ప్రవక్త వారి తర్వాత, వివిధ ఖలీఫాల కాలంలో ఆయన పాత్ర, బహ్రెయిన్ గవర్నర్గా ఆయన సేవలు, మరియు ఆయన మరణ సమయంలో పరలోకం గురించి ఆయనకున్న భయభక్తులను ఈ ప్రసంగం తెలియజేస్తుంది. అత్యధికంగా 5,374 హదీసులను ఉల్లేఖించిన సహాబీగా ఆయన స్థానం, మరియు ఆయన అద్భుతమైన జ్ఞాపకశక్తిని కూడా ఈ ప్రసంగంలో ప్రస్తావించారు.
اَلْحَمْدُ لِلّٰهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللّٰهِ [అల్-హమ్దు లిల్లాహ్, వస్సలాతు వస్సలాము ‘అలా రసూలిల్లాహ్] సకల స్తోత్రములు, పొగడ్తలు అల్లాహ్ కే శోభస్తాయి. మరియు అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు ఆయన ప్రవక్తపై వర్షించుగాక.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ [అస్సలాము ‘అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు] మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
ఈనాటి ప్రసంగంలో మనం ఒక గొప్ప సహాబీ గురించి తెలుసుకోబోతున్నాము. ఆయన గొప్పతనం ఏమిటంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన కోసము, ఆయన తల్లి కోసము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ప్రత్యేకంగా దుఆ చేసి ఉన్నారు. హదీసు గ్రంథము చిన్నది అయినా సరే, పెద్దది అయినా సరే, ఆయన పేరు తప్పనిసరిగా అందులో ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించబడి ఉంటుంది. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద నుండి 5,374 హదీసులు, ఉల్లేఖనాలు ఉమ్మత్ అనుచర సమాజం వరకు చేరవేర్చి ఉన్నారు. ఇలాంటి విశిష్టతలు కలిగిన ఆ సహాబీ ఎవరనుకుంటున్నారా? ఆయనే అబూ హురైరా రజియల్లాహు త’ఆలా అన్హు వారు. రండి, ఇన్ షా అల్లాహ్, ఈ ప్రసంగంలో మనం అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్ర క్లుప్తంగా, ఇన్ షా అల్లాహ్, తెలుసుకుందాం.
పేరు & కున్నియత్
ఆయన ఇస్లాం స్వీకరించక ముందు ఆయనకు అబ్దుష్ షమ్స్ అని పేరు ఉండేది. ఇస్లాం స్వీకరించిన తర్వాత, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ పేరు సరికాదు అని మార్చి అబ్దుర్రహ్మాన్ అని పేరు పెట్టారు. అయితే, అబూ హురైరా అని ఆయనకు కున్నియత్, నామాంతరము ఉండేది. అబూ హురైరా అంటే దాని అర్థం ఏమిటి? చిన్న పిల్లికి తండ్రి అని అర్థం. ఆ పేరు ఆయనకు ఎందుకు పెట్టబడింది అంటే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, ఆయన ఒక పిల్లిని పోషిస్తూ ఉండేవారు. ఆ పిల్లి ఆయన మీద అభిమానంతో ఎల్లప్పుడూ ఆయన వెంట వెంట తిరుగుతూ ఉండేది, ఆయన ఒడిలో కూర్చుంటూ ఉండేది. అది చూసిన ప్రజలు ఆయనకు అబూ హురైరా, చిన్న పిల్లికి తండ్రి అని నామాంతరము, కున్నియత్ పెట్టేశారు అని అంటూ ఉన్నారు.
జననం మరియు బాల్యం
ఇక అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఎక్కడ జన్మించారు అని మనం చూచినట్లయితే, యెమన్ దేశంలోని దౌస్ తెగలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు జన్మించారు. ఆయన జన్మించిన కొద్ది రోజులకే వారి తండ్రి మరణించారు. ఆయన అనాథగా తల్లి వద్ద పెరిగారు. తల్లి పేరు ఉమైమ. ఆమె అబూ హురైరా వారిని ఎంతో ప్రేమ, అనురాగాలతో పోషించారు.
ఇక అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఎలా ఇస్లాం స్వీకరించారన్న విషయాన్ని మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో భాగంగా తుఫైల్ బిన్ అమర్ దౌసీ రజియల్లాహు అన్హు వారి ఇస్లాం స్వీకరణ మనము విని ఉన్నాం. తుఫైల్ బిన్ అమర్, ఈయన కూడా యెమన్ దేశస్థులు, దౌస్ తెగకు చెందినవారు, గొప్ప కవి కూడా. మక్కాకు ఒకసారి వచ్చారు. మక్కా వాసులు ఆయనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడకండి, ఆయన మాటలు వినకండి అని హెచ్చరించారు. ఆయన ప్రారంభంలో ప్రవక్త వారి మాటలు వినకూడదు అనుకున్నారు. తర్వాత లోలోపల ఆలోచించి, “నేను కవిని, మంచి చెడులో వ్యత్యాసాన్ని గ్రహించగలిగే వాడిని, మరి అలాంటప్పుడు ముహమ్మద్ మాటలు వినటానికి నేను ఎందుకు భయపడాలి” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు విన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వతహాగా ఆయన తరపు నుంచి ఏమీ మాట్లాడేవారు కాదు కదా! దైవ వాక్యాలు ప్రజలకు బోధించేవారు కదా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తుఫైల్ బిన్ అమర్ వారికి దైవ వాక్యాలు వినిపించినప్పుడు, ఆయన దైవ వాక్యాలను అర్థం చేసుకొని వెంటనే ఇస్లాం స్వీకరించేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు, “మీ తెగ వారికి కూడా వెళ్లి మీరు ఇస్లాం గురించి బోధించండి” అని ఆదేశించినప్పుడు, ఆయన దౌస్ తెగకు తిరిగి వెళ్లి ఇస్లాం వైపుకి ఆహ్వానించారు. ప్రారంభంలో తెగ వారు ఎవరూ కూడా ఆయన మాటను పట్టించుకోలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు మళ్లీ వెళ్లి ప్రయత్నము చేయమని ఆదేశించినప్పుడు, మళ్లీ వెళ్లి ఆయన ప్రయత్నము చేయగా 80 కుటుంబాలు అల్-హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరించాయి. అలా ఇస్లాం స్వీకరించిన వారిలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు.
మదీనా వలస మరియు ఖైబర్ యుద్ధం
మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో విన్నాం అండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణము చేసి వెళ్లిపోయారు. మదీనాకు వలస ప్రయాణం చేసి వెళ్లిపోయిన ఆరవ లేదా ఏడవ సంవత్సరంలో తుఫైల్ బిన్ అమర్ వారు 80 కుటుంబాలను తీసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి హాజరయ్యారు. మదీనాకు వచ్చి చూస్తే, అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేరు. ఆ సమయానికి ఆయన సైన్యముతో పాటు ఖైబర్ ప్రదేశానికి వెళ్లి ఉన్నారు, అక్కడ యూదులతో యుద్ధం సంభవిస్తూ ఉంది. దౌస్ తెగకు చెందిన తుఫైల్ బిన్ అమర్ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు, మిగతా ప్రజలు కొంతమంది మదీనా నుండి చక్కగా ఖైబర్కు వెళ్లిపోయారు. ఆ ప్రకారంగా, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మొదటిసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఎక్కడ కలిశారు అంటే ఖైబర్ ప్రదేశంలో కలిశారు. ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేసి, అల్-హమ్దులిల్లాహ్ ఆ తర్వాత ఆయన కూడా, దౌస్ తెగ ప్రజలు కూడా యుద్ధంలో పాల్గొని విజేతలుగా మదీనాకు తిరిగి వచ్చేశారు.
మదీనాలో జీవనం మరియు పేదరికం
మదీనాకు వచ్చేసిన తర్వాత ఏమి జరిగిందంటే, దౌస్ తెగకు చెందిన చాలా మంది ప్రజలు వేరే వేరే ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. కానీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మూడు విషయాల కారణంగా మదీనాలోనే స్థిరపడిపోయారు. మొదటి విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పదే పదే చూడాలనే కోరిక. రెండవ విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేయాలనే కోరిక. మూడవ విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఇస్లాం శిక్షణ మరియు ధార్మిక శిక్షణ పొందాలనే కోరిక. ఈ మూడు విషయాల కారణంగా అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మదీనాలోనే స్థిరపడిపోయారు. అయితే, గమనించాల్సిన విషయం ఏమిటంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు యెమన్ నుండి మదీనాకు వస్తున్నప్పుడు తల్లిని కూడా వెంట తీసుకొని వచ్చారు. తల్లి ఇస్లాం స్వీకరించలేదు, అయినా గానీ ఆవిడను వెంటబెట్టుకొని మదీనాకు వచ్చేసి ఉన్నారు.
ఇక్కడ మదీనాలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వేరే ఏ వృత్తిని కూడా ఆయన ఎంచుకోకుండా, కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద నుండి ఎక్కువగా మాటలు, ఉల్లేఖనాలు, హదీసులు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ పని కోసం ఆయన పూర్తిగా అంకితమైపోయారు. మస్జిద్-ఎ-నబవీలో ఉండిపోతూ ఉండేవారు. ఆయన లాగే మరికొంత మంది సహాబాలు కూడా ఉండేవారు. వారందరినీ కూడా అస్హాబుస్ సుఫ్ఫా అనేవారు. అజియాఫుల్ ఇస్లాం అని, అజియాఫుల్లాహ్ అని, ఖుర్రా అని వారిని పిలిచేవారు. వారందరూ కూడా నిరుపేదలే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారందరి కోసము ఒక ప్రదేశాన్ని కేటాయించి నీడ సౌకర్యము కూడా కల్పించారు. వారందరూ కూడా ఆ ప్రదేశంలో సేద తీరేవారు.
ఇక, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మదీనాలో ఉంటున్నప్పుడు చాలా పేదరికము మరియు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. ఆయన స్వయంగా తెలియజేసిన విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాలలో రెండు రెండు రోజులు, మూడు మూడు రోజులు ఆయనకు తినటానికి ఏమీ దొరకని కారణంగా పూర్తిగా నీరసించిపోయి, ఒక్కొక్కసారి స్పృహ కోల్పోయి పడిపోతే, ప్రజలు ఆయన పడుకుంటూ ఉన్నాడేమోలే అనుకునేవారు. మరికొంత మంది అయితే, ఏమైంది ఈయనకు ఎక్కడంటే అక్కడ పడుకుంటున్నారు, పిచ్చి పట్టిందా అని కూడా కొంతమంది భావిస్తూ ఉండేవారు. కానీ వాస్తవానికి, ఆయన నీరసించిపోయి స్పృహ కోల్పోయి పడిపోయేవారు.
ఒకసారి ఆయన కడుపు మీద రాయి కట్టుకొని కూర్చొని ఉన్నారు. ఎవరైనా కనిపిస్తే వారితో మాట్లాడుదాము, వారు ఏమైనా తినటానికి ఇస్తారేమో అని ఆశిస్తూ ఉన్నారు. అంతలోనే అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అటువైపు వచ్చారు. ఆయనతో మాట్లాడారు, ఆయన కేవలం మాట్లాడి పలకరించి వెళ్లిపోయారు. తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు వారు వచ్చారు, ఆయనను పలకరించారు, ఆయన కూడా కేవలం పలకరించి మాట్లాడి ముందుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడితే, వెంటనే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ముఖ కవళికను గమనించి అర్థం చేసుకొని, “నాతో పాటు రండి” అని ఇంటికి తీసుకుని వెళ్లారు. ప్రవక్త వారి ఇంట్లో ఒక పాత్రలో కొన్ని పాలు ఉన్నాయి. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి ఆదేశిస్తూ, “మీ మిగతా మిత్రులు మస్జిద్ లో ఉన్నారు కదా, అస్హాబుస్ సుఫ్ఫా, వారందరినీ కూడా పిలుచుకొని రండి” అన్నారు. ఆయన మనసులో ఆశ్చర్యపోతూ ఉన్నారు, “ఏమిటండి, ఒక చిన్న పాత్రలో ఉన్న పాలు అంత మంది నా మిత్రులకు సరిపోతాయా?” అని లోలోపల ఆశ్చర్యపోతూ ఉన్నారు, కానీ ప్రవక్త వారి ఆజ్ఞ కదా, పాటించాలి కదా, కాబట్టి వెళ్లి వారందరినీ పిలుచుకొని వచ్చారు. వారందరూ ప్రవక్త వారి ఇంటికి వచ్చినప్పుడు ప్రవక్త వారు తమ స్వహస్తాలతో ఆ పాత్ర ఒక శిష్యునికి అందజేసి, అల్లాహ్ నామాన్ని తలుచుకొని తాగటం ప్రారంభించండి అన్నారు. ఒక శిష్యుడు తాగాడు, వేరే వారికి ఇచ్చాడు. ఆయన తాగాడు, వేరే వారికి ఇచ్చాడు. ఆ ప్రకారంగా అక్కడ ఉన్న వారందరూ కూడా తాగేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి కూడా ఇచ్చారు. ఆయన కూడా ఒకసారి తాగి ఇచ్చేస్తూ ఉంటే, “లేదు మరొకసారి తాగండి, మరొకసారి తాగండి” అని ఇంచుమించు ప్రవక్త వారు మూడు నాలుగు సార్లు ఆయనకు తాగమని చెప్పగా, ఆయన తాగేసి, “ఓ దైవ ప్రవక్త, నా కడుపు నిండిపోయిందండి, ఇక నేను తాగలేను” అని ఇచ్చేయగా, చివరిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ పాలు త్రాగారు. అల్లాహు అక్బర్! ఒక గిన్నెలో ఉన్న పాలు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అందులోనే ఎంత వృద్ధి, బరకత్ ఇచ్చాడంటే, అక్కడ ఉన్న వారందరూ కూడా అల్-హమ్దులిల్లాహ్ తనివి తీరా త్రాగగలిగారు.
అలాగే మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా గౌరవించేవారు, అభిమానించేవారు. ప్రవక్త వారికి సేవలు కూడా చేస్తూ ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు నీటి ఏర్పాటు చేసేవారు, వేరే వేరే పనులు కూడా ప్రవక్త వారి పనులు ఆయన చేసి పెడుతూ ఉండేవారు.
తల్లి ఇస్లాం స్వీకరణ
అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి కూడా మదీనాకు వచ్చి ఉన్నారు, ఆవిడ ఇస్లాం స్వీకరించలేదు అని మనం ఇంతవరకే విని ఉన్నాము కదండీ. తల్లిని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా గౌరవించేవారు, అభిమానించేవారు. ఎందుకంటే, పసితనంలోనే తండ్రి మరణించినా ఆవిడ బిడ్డను పోషించుకుంటూ ఉండిపోయారు గానీ మరొక వివాహము చేసుకోలేదు. కాబట్టి, బిడ్డ కోసం అంకితమైన తల్లి కోసము బిడ్డ, అనగా అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా చాలా అభిమానించేవారు, సేవలు చేసేవారు, గౌరవించేవారు. ఆవిడ కూడా ఇస్లాం స్వీకరించాలని పదేపదే వెళ్లి ఇస్లాం గురించి బోధిస్తూ ఉండేవారు.
ఒకసారి ఏమైందంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తల్లి వద్దకు వెళ్లి ఇస్లాం గురించి బోధిస్తూ ఉంటే ఆమె కోపగించుకున్నారు. కోపగించుకుని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి మీద మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక అనరాని మాట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద కూడా మాట్లాడేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి బాధ కలిగింది. ఏడ్చుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్త, ఇలా జరిగింది మా ఇంట్లో. మీరు అల్లాహ్ తో దుఆ చేయండి, నా తల్లికి ఇస్లాం భాగ్యము లభించాలని, అల్లాహ్ ఆమెకు ఇస్లాం స్వీకరించేలాగా చేయాలని అల్లాహ్ తో ప్రార్థన చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సందర్భంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి కోసము ప్రత్యేకంగా అల్లాహ్ తో దుఆ చేయగా, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తిరిగి మళ్లీ ఇంటికి వెళ్లారు. వెళ్లి చూస్తే, తలుపులు మూయబడి ఉన్నాయి, లోపల తల్లి స్నానం చేస్తున్న శబ్దం వస్తూ ఉంది. బిడ్డ వచ్చాడన్న విషయాన్ని గమనించిన తల్లి, “ఓ అబూ హురైరా, ఆగిపో నాయనా కొద్దిసేపు” అని ఆజ్ఞాపించగా, బయటే అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కొద్దిసేపు నిలబడిపోయారు. తర్వాత తల్లి స్నానం ముగించుకొని, బట్టలు ధరించుకొని, తలుపులు తెరిచి, ముందుగా ఆమె పలికిన మాట ఏమిటంటే:
أَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُوْلُ اللهِ [అష్-హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్-హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్] అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.
తల్లి సాక్ష్య వచనం పఠించి, కలిమా పఠించి, ఇస్లాం స్వీకరించారన్న విషయాన్ని చూసి, విని, మళ్లీ పట్టరాని సంతోషంలో ఆనంద భాష్పాలు కార్చుకుంటూ, ఏడ్చుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్త, నా తల్లి ఇస్లాం స్వీకరించేశారు” అని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, మళ్లీ దైవ ప్రవక్తతో వేడుకున్నారు, “ఓ దైవ ప్రవక్త, విశ్వాసులందరూ కూడా నన్ను, నా తల్లిని అభిమానించాలని మీరు అల్లాహ్ తో దుఆ చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొకసారి ఆయన కోసము, ఆయన తల్లి కోసము అల్లాహ్ తో దుఆ చేశారు. అల్-హమ్దులిల్లాహ్! నేటికీ కూడా విశ్వాసులందరూ వారు మదరసాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలు చదువుతూ ఉన్నా, లేదా వారు విద్యార్థులు కాకుండా సామాన్యమైన ప్రజలు ధార్మిక పండితుల నోట ప్రసంగాలలో గానీ, మస్జిదులలో గానీ ఎక్కడైనా గానీ ప్రవక్త వారి మాటలు, ఉల్లేఖనాలు, హదీసులు వింటూ ఉన్నారు అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క పేరు ప్రతి చోట ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించబడుతూనే ఉంటుంది. ఆ ప్రకారంగా, ప్రతి విశ్వాసి అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి అభిమానిగా ఆ రోజుల్లో కూడా ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఇన్ షా అల్లాహ్, అలాగే ఉంటూ ఉంటారు ముందు కూడా. అంటే, ప్రవక్త వారి యొక్క దుఆ ఫలితంగా విశ్వాసులందరూ కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు వారిని అభిమానిస్తూ ఉన్నారు మిత్రులారా, ఇది చెప్పాల్సిన విషయం.
అలాగే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తల్లి గురించి ఎంతగా శ్రద్ధ తీసుకుంటారో చూడండి. మరొక ఉదాహరణ చెబుతూ ఉన్నాను. ఒకసారి ఆకలి కారణంగా ఆయన మస్జిద్-ఎ-నబవీ లోకి ప్రవేశించారు. అక్కడ ఎవరైనా ఏమైనా ఇస్తారేమో అని ఆశతో వస్తే, ఎవరూ లేరు. కొంతమంది అక్కడ కూర్చొని ఉంటే వారి దగ్గరకు వెళ్లి, “ఈ సమయానికి మీరు ఇక్కడ ఉన్నారు ఏమిటి?” అని అడిగారు. వారందరూ ఏమన్నారంటే, “మీరు ఏ విధంగా అయితే ఈ సమయానికి ఆకలితో ఇక్కడికి ఏమైనా దొరుకుతుందని వచ్చారో, అలాగే మేము కూడా వచ్చాము” అన్నారు. తర్వాత వారందరూ కూడా కలిసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్దాము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్లారు. వెళ్లి, “ఓ దైవ ప్రవక్త, మాకు తినటానికి ఏమీ దొరకలేదు” అని ఆకలితో ఉన్నాము అని తెలియజేయగా, ప్రవక్త వారు ఖర్జూరపు పళ్ళు తెప్పించి ఒక్కొక్కరికి రెండు రెండు ఖర్జూరపు పండ్లు ఇస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్! సహాబాలు మరియు ప్రవక్త వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారో చూడండి. ఒక్కొక్కరికి రెండు రెండు ఖర్జూరపు పండ్లు వస్తూ ఉన్నాయి. ప్రవక్త వారు అంటున్నారు, “ఈ రెండు ఖర్జూరపు పండ్లు మీరు తినండి. అల్లాహ్ దయతో ఈ పూర్తి రోజుకు ఈ రెండు ఖర్జూరపు పండ్లు మీకు సరిపోతాయి.” అందరూ కూడా రెండు రెండు ఖర్జూరపు పండ్లు తీసుకొని తింటూ ఉన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మాత్రము ఒక ఖర్జూరపు పండు మాత్రమే తిని ఒకటి లోపల పెట్టుకుంటూ ఉంటే, ప్రవక్త వారు చూసి, “ఎందుకండి ఒకటి ఖర్జూరము పెట్టుకుంటూ ఉన్నారు?” అంటే, “నా తల్లి కోసము పెట్టుకుంటున్నాను, ఓ దైవ ప్రవక్త” అన్నారు. అల్లాహు అక్బర్! తల్లి గురించి ఎంత శ్రద్ధ తీసుకునేవారో చూడండి. “నా తల్లి కోసము ఆ ఖర్జూరము నేను పెట్టుకుంటూ ఉన్నాను, ఓ దైవ ప్రవక్త” అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “లేదండి, ఆ ఖర్జూరము మీరు తినేయండి. మీ తల్లి కోసము నేను ప్రత్యేకంగా అదనంగా రెండు ఖర్జూరపు పండ్లు ఇస్తాను” అని దైవ ప్రవక్త వారు రెండు అదనంగా ఖర్జూరపు పండ్లు ఇచ్చి మీ తల్లికి ఇవ్వండి అన్నారు. అల్లాహు అక్బర్! మొత్తానికి, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి ప్రారంభంలో ఇస్లాం స్వీకరించలేదు, తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దుఆ ఫలితంగా ఆవిడ ఇస్లాం స్వీకరించారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా తల్లి గురించి శ్రద్ధ తీసుకునేవారు, సేవలు చేసేవారు, బాగా అభిమానించేవారు కూడానూ.
ఆ తర్వాత మనం చూచినట్లయితే, హిజ్రీ శకం ఏడవ సంవత్సరం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్రా ఆచరించటానికి వెళ్ళినప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ప్రవక్త వారి వెంట వెళ్లి ఆ సంవత్సరము ఉమ్రా ఆచరించి వచ్చారు. ఆ తర్వాత, హిజ్రీ శకం ఎనిమిదవ సంవత్సరం వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బహ్రెయిన్ దేశానికి అలా బిన్ అల్-హదరమీ రజియల్లాహు అన్హు వారిని నాయకునిగా నియమించి పంపిస్తూ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని కూడా ఆయనకు తోడుగా, జతగా పంపించారు. “మీరు అబూ హురైరా వారిని వెంట తీసుకుని వెళ్ళండి, ఆయనను గౌరవించండి” అని అలా బిన్ అల్-హదరమీ వారికి ప్రవక్త వారు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. ఇద్దరూ కలిసి బహ్రెయిన్కు వెళ్లారు. అలా బిన్ అల్-హదరమీ వారు బహ్రెయిన్కు వెళ్ళిన తర్వాత ప్రవక్త వారి ఆదేశం ప్రకారం అబూ హురైరా రజియల్లాహు అన్హు వారితో, “ఏమండీ, మీకు నేను గౌరవిస్తున్నాను, మీరు ఏ బాధ్యత తీసుకుంటారో చెప్పండి” అన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆలోచించి, “నాకు అజాన్ పలికే బాధ్యత ఇవ్వండి” అన్నారు. అల్లాహు అక్బర్! అజాన్ పలికే బాధ్యత అది సాధారణమైనది కాదు. అది చాలా విశిష్టత కలిగిన బాధ్యత, ఎంతో గౌరవంతో కూడుకున్న బాధ్యత కాబట్టి, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ బాధ్యత ఇవ్వండి అన్నారు. నేడు చాలామంది అజాన్ పలికే బాధ్యతను చిన్నచూపుతో చూస్తూ ఉంటారు, అది సాధారణమైన విషయంగా భావిస్తూ ఉంటారు. లేదండి, చాలా విశిష్టతలతో కూడిన విషయము అది. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ బాధ్యత తీసుకున్నారు.
కొద్ది నెలలకే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరే అబాన్ బిన్ సయీద్ అనే ఒక సహాబీని అక్కడికి అనగా బహ్రెయిన్కు నాయకునిగా నియమించి పంపించేయగా, అలా బిన్ అల్-హదరమీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఇద్దరూ తిరిగి మళ్లీ మదీనాకు వచ్చేశారు. ఒక సంవత్సరం గడిచింది. హిజ్రీ శకం తొమ్మిదవ సంవత్సరము వచ్చింది. ఆ సంవత్సరము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్ రజియల్లాహు అన్హు వారిని నాయకునిగా నియమించి, ఆయన సారథ్యంలో ఇంచుమించు 300 మంది సహాబాలను హజ్ ఆచరించడానికి పంపించారు. వారిలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు. అంటే, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి సారథ్యంలో హజ్ ఆచరించబడినప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా వెళ్లి హజ్ ఆచరించుకొని వచ్చేశారు. ఆ సంవత్సరం ప్రవక్త వారు మాత్రము హజ్కి వెళ్ళలేదండి. ఆ తర్వాత వచ్చే సంవత్సరం, అనగా హిజ్రీ శకం పదవ సంవత్సరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా మంది సహాబాలను వెంటబెట్టుకొని వెళ్లి హజ్ ఆచరించారు. ఆ హజ్ని హజ్జతుల్ వదా అని అంటూ ఉంటారు. ఆ హజ్లో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట వెళ్లి హజ్ ఆచరించుకొని వచ్చారు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనంతర జీవితం
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో, ఆయన పరిపాలన యుగంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా యుద్ధాలలో పాల్గొన్నారు, ముఖ్యంగా ముర్తద్దీన్లతో జరిగిన యుద్ధాలలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రత్యేకంగా పాల్గొన్నారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారి మరణానంతరం, ఉమర్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఏం చేశారంటే, బహ్రెయిన్ ప్రదేశానికి ప్రవక్త వారి లాగే అలా బిన్ అల్-హదరమీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు, వీరిద్దరినీ నాయకులుగా నియమించి పంపించేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ సందర్భంలో బహ్రెయిన్లో ఇంచుమించు ఒక సంవత్సరం నాయకునిగా పరిపాలన కొనసాగించారు. ఆ ఒక సంవత్సరంలో ప్రభుత్వ తనఖా కూడా పొందారు, అటుగా ఆయన స్వయంగా కూడా వ్యాపారము చేశారు. ఆ ప్రకారంగా, ఆ ఒక సంవత్సరంలో ఆయన పెద్ద మొత్తంలో అల్-హమ్దులిల్లాహ్ డబ్బు సంపాదించుకోగలిగారు.
ఒక సంవత్సరం తర్వాత, ఉమర్ రజియల్లాహు అన్హు వారు వేరే సహాబీని అక్కడికి నాయకునిగా నియమించి పంపించేయగా, అలా బిన్ అల్-హదరమీ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వీరిద్దరూ మళ్లీ మదీనాకు తిరిగి వచ్చేశారు. అయితే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఈసారి మదీనాలో వచ్చినప్పుడు ఆయన వద్ద చాలా డబ్బు సొమ్ము ఉంది. ఇప్పుడు ఆయన మునుపటి లాగా నిరుపేద, ఆకలి దప్పుకలతో గడిపేవారు కాదు. చాలా డబ్బు అల్-హమ్దులిల్లాహ్ ఆయన సంపాదించుకోగలిగి ఉన్నారు. అయితే ఆయన ఏం చేశారో తెలుసా? మదీనాకు వచ్చిన తర్వాత ఆ డబ్బు మొత్తము బైతుల్ మాల్ కోసం అంకితం చేసేశారు. బైతుల్ మాల్ అంటే ప్రభుత్వం తరపున వితంతువులకు, అనాథలకు, మరియు నిరుపేదలకు ఆ సహాయము అందించేవారు. ఆ సహాయ నిధి కోసము ఈయన ఆయన వద్ద ఉన్న సంపద, డబ్బు మొత్తము అంకితం చేసేశారు, విరాళంగా ఇచ్చేశారు. అల్లాహు అక్బర్!
ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో, అంటే ఉమర్ రజియల్లాహు అన్హు వారి మరణానంతరం, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి పరిపాలన యుగంలో, సల్మాన్ బిన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారితో పాటు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా యుద్ధాలలో పాల్గొన్నారు. ముఖ్యంగా, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో ఆయన తూర్ పర్వతం ఉంది కదండీ, వాది-ఎ-సైనా, సైనా అనే ఒక లోయ ఉంది. ఆ మైదానములో ఒక పర్వతం ఉంది, కోహె తూర్. అక్కడ మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ఎలాంటి మధ్యవర్తి లేకుండా మాట్లాడారు కదండీ. ఆ పర్వతం వరకు ఆయన ప్రయాణము కొనసాగించారు అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే, ఆ ప్రయాణంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే, కాబ్ అహ్బార్ రజియల్లాహు అన్హు వారు, వాస్తవానికి ఆయన ఒక యూదుడు, తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించారు. ఆయనకు వేరే గ్రంథాల జ్ఞానము ఉంది. ఆయనతో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం వినిపించారు. ఏమని వినిపించారంటే, “జుమా రోజు చాలా విశిష్టత కలిగినది. జుమా రోజున అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదం అలైహిస్సలాం వారిని పుట్టించాడు. జుమా రోజున ఆయనకు స్వర్గంలో ప్రవేశింపజేశాడు. జుమా రోజునే ఆయన స్వర్గం నుంచి బయటికి వచ్చేశారు.” ఆ విధంగా చెబుతూ చెబుతూ చివర్లో, “జుమా రోజులో ఒక ఘడియ ఉంది. ఆ ఘడియలో భక్తుడు చేసే దుఆ తప్పనిసరిగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆమోదిస్తాడు” అని తెలియజేయగా, కాబ్ అహ్బార్, ఆయన ఏమంటున్నారంటే, “ఆ ఘడియ సంవత్సరంలో ఒకసారి వస్తుంది కదా” అన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అన్నారు, “లేదండి, దైవ ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారము ప్రతి శుక్రవారము ఆ ఘడియ ఉంటుంది” అన్నారు. ఆయన ఆశ్చర్యపోయి వారి గ్రంథము, అంటే వేరే మత గ్రంథాలు ఉన్నాయి కదండీ, ఆయన ఇస్లాం స్వీకరించక ముందు యూదుడు కదండీ, ఆ మతానికి చెందిన గ్రంథము చదివి ఆయన, “ప్రవక్త వారు చెప్పిన మాట నిజము” అని అప్పుడు ఆయన ధ్రువీకరించారు కూడా.
చివరి రోజులు మరియు మరణం
సరే, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క వీర మరణం సంభవించినప్పుడు అలీ రజియల్లాహు అన్హు వారు ముస్లింల నాయకులయ్యారు. ఆయన పరిపాలన యుగంలో ముస్లింల రెండు పెద్ద సమూహాల మధ్య పెద్ద యుద్ధము జరిగింది. ఆ యుద్ధ సమయంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వారిద్దరి మధ్య సంధి కుదిర్చటానికి చాలా ప్రయత్నము చేశారు. చివరికి ఆయన ఫలితం దొరకని కారణంగా యుద్ధంలో పాల్గొనకుండా ఆయన ఒంటరితనాన్ని ఎన్నుకున్నారు. ప్రత్యేకంగా దైవ ఆరాధన కోసం ఆయన అంకితమైపోయారు అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు.
సరే, ఏది ఏమైనప్పటికినీ, అలీ రజియల్లాహు అన్హు వారి తర్వాత, హిజ్రీ శకం 59వ సంవత్సరం, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వ్యాధికి గురయ్యారు. ఆ వ్యాధి రాను రాను ముదురుతూనే పోయింది. మరణ సమయం సమీపించింది. అప్పుడు ఆయన పరలోకాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉన్నారు. ప్రజలు ఆయనతో అడిగారు, “ఏమండీ, ఎందుకు ఏడుస్తున్నారు?” అంటే, అప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తెలియజేశారు, “నేను ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిపోతున్నానని బాధలో నేను ఏడవట్లేదు. పరలోకాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉన్నాను. ప్రయాణము ముందు ముందు చాలా పెద్దది, నా దగ్గర ఏమో సామాను చాలా తక్కువగా ఉంది. నేను స్వర్గానికి చేరుకుంటానా, నరకానికి చేరుకుంటానా నాకు అర్థం కావట్లేదు. స్వర్గం నా గమ్యస్థానం అవుతుందా, నరకం నా గమ్యస్థానం అవుతుందా తెలియదు కాబట్టి, అది తలుచుకొని నేను ఏడుస్తూ ఉన్నాను” అన్నారు.
అల్లాహు అక్బర్! జీవితాంతం ప్రవక్తకు మరియు సహాబాలకు మరియు ఇస్లాంకు అంకితమైపోయిన అలాంటి సహాబీ పరలోకాన్ని తలుచుకొని, “నా వద్ద సొమ్ము తక్కువ ఉంది,” అంటే పుణ్యాలు తక్కువ ఉన్నాయి, ప్రయాణం చాలా పెద్దదిగా ఉంది, “స్వర్గానికి వెళ్తానో నరకానికి వెళ్తానో తెలియదు” అని ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారంటే, ఆయనలో ఎంత దైవభీతి ఉండేదో ఆలోచించండి. అలాగే, మనము ఎలాంటి ఎక్కువ పుణ్యాలు చేయకపోయినా పరలోకాన్ని తలుచుకొని ఏడవట్లేదు అంటే, ఎలాంటి భ్రమలో మనము జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించండి మిత్రులారా.
సరే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క మరణ సమయము సమీపించింది. ఆయన మదీనాలో ఉంటూ ఉన్నారు. మదీనా యొక్క నాయకుడు ఆ రోజుల్లో మర్వాన్ ఇబ్నుల్ హకం అనే ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన పరామర్శించడానికి వచ్చారు. వచ్చి, “అల్లాహ్ మీకు స్వస్థత ప్రసాదించుగాక” అని ప్రార్థిస్తూ ఉంటే, అప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అల్లాహ్ తో ప్రార్థించారు, “ఓ అల్లాహ్, నేను నీతో కలవటానికి ఇష్టపడుతూ ఉన్నాను, నువ్వు కూడా నన్ను నీ వద్దకు రావటానికి ఇష్టపడు” అని ప్రార్థించారు. అల్లాహు అక్బర్! ఆ తర్వాత, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క మరణము సంభవించింది.
అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మరణించిన తర్వాత వలీద్ బిన్ ఉత్బా బిన్ అబీ సుఫియాన్ రహిమహుల్లాహ్ వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క జనాజా నమాజు ఆచరించారు. తర్వాత అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి దేహాన్ని అల్-బఖీ, జన్నతుల్ బఖీ అంటుంటారు కదండీ, అల్-బఖీ అల్-గర్కద్, అందులో ఆయనకు ఖనన సంస్కారాలు చేయడం జరిగింది. 59వ హిజ్రీలో ఆయన మరణించారు. అప్పటికి ఆయన వయస్సు ఇంచుమించు 80 సంవత్సరాలకు కొద్దిగా తక్కువ లేదంటే కొద్దిగా ఎక్కువ అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన తర్వాత రోజుల్లో వివాహం చేసుకున్న కారణంగా ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. ఆ కుమార్తె యొక్క వివాహము గొప్ప తాబయీ, సయీద్ బిన్ ముసయ్యిబ్ రహిమహుల్లాహ్ వారితో జరిగింది అని కూడా చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు.
జ్ఞాపకశక్తి మరియు హదీసుల ఉల్లేఖన
అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి 5,374 హదీసులు ఉమ్మత్ అనుచర సమాజం వరకు చేరవేర్చి ఉన్నారు. సహాబీలందరిలో ఎక్కువగా హదీసులు ఉల్లేఖించిన వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అని కూడా చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు.
అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి హదీసుల్ని జీవితాంతం చాలా చక్కగా కంఠస్థం చేసుకొని భద్రంగా గుర్తుంచుకొని ఉన్నారు అని చెప్పటానికి ఒక ఉదాహరణ వినిపిస్తూ ఉన్నాను, చూడండి. ఆయన జీవించి ఉన్నప్పుడు మదీనా నాయకుడు మర్వాన్ ఇబ్నుల్ హకం అని ఇంతవరకు మనం విన్నాము కదా. ఆ మర్వాన్ అనే అతను ఏం చేశాడంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని పిలిపించి ఆ విషయానికి సంబంధించిన ఒక హదీసు వినిపించండి, ఈ విషయానికి సంబంధించిన ఒక హదీసు వినిపించండి అని కొన్ని హదీసులు అడిగారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ హదీసులన్నీ కూడా వినిపించారు. ఈయన ఏం చేశారంటే, ముందే ఒక వ్యక్తిని ఆదేశించి, ఆయన వినిపిస్తున్న హదీసులన్నీ కూడా ఒక పత్రంలో వ్రాసి ఉంచుకోండి అని ఆదేశించగా, తెర వెనుక ఒక వ్యక్తి ఆ హదీసులన్నీ కూడా ఒక పత్రంలో వ్రాసి ఉంచుకున్నాడు. ఒక సంవత్సరం తర్వాత, మళ్ళీ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని ఆ మర్వాన్ అనే వ్యక్తి పిలిపించి మళ్ళీ ఆ హదీసులు ఫలానా ఫలానా హదీసులు వినిపించండి అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు గత సంవత్సరం ఏ విధంగా వినిపించారో అదే విధంగా చక్కగా ఎలాంటి తప్పు దొర్లకుండా వినిపించేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వెళ్లిపోయిన తర్వాత తెర వెనుక కూర్చుని ఉన్న ఆ పత్రాన్ని గమనిస్తున్న వ్యక్తితో అడిగారు, “అబూ హురైరా కరెక్ట్ గానే వినిపించారా? ఏమైనా హెచ్చుతగ్గులు జరిగాయా?” అంటే, ఆ వ్యక్తి కూడా, “ఉన్నది ఉన్నట్టే ఆయన మొత్తం చెప్పారు, ఎలాంటి హెచ్చుతగ్గులు జరగలేదు” అని ఆ వ్యక్తి కూడా సాక్ష్యం ఇచ్చాడు. అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు జీవితాంతం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్ని చక్కగా గుర్తుంచుకొని వేరే వారి వరకు చేరవేశారు అని మనకు ఈ సంఘటన తెలుపుతుంది.
ఆ ప్రకారంగా, నేను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉల్లేఖనాలు చదివి, నేర్చుకొని, ఇతరుల వద్దకు చేర్చే భాగ్యం ప్రసాదించుగాక. ఇది అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్ర. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ అన్న, విన్న విషయాల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.
وَجَزَاكُمُ اللهُ خَيْرًا [వ జజాకుముల్లాహు ఖైరన్] మరియు అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చుగాక.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ [అస్సలాము ‘అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు] మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఏ సత్కార్యాన్నీ అల్పంగా, అతి సామాన్యంగా తలపోయకండి | బులూగుల్ మరాం | హదీసు 1261 వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://www.youtube.com/watch?v=aP57ahtc42U [4 mins]
1261.హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు:
“ఏ సత్కార్యాన్నీ అల్పంగా, అతి సామాన్యంగా తలపోయకండి – ఆఖరికి తమ సోదరుణ్ణి నగుమోముతో పలకరించటాన్నయినా సరే.“
సారాంశం:
ఏమీ చేయలేకపోయినా కనీసం ఒక మంచి మాట మాట్లాడటం, ఎదుటివారిని ఆకట్టుకునే రీతిలో నవ్వుతూ పలకరించటం కూడా సత్కార్యం క్రిందికే వస్తుందని ఈ హదీసు చెబుతోంది. ఏ విషయాలనయితే మనం అతి స్వల్పమైనవిగా ఊహించుకుని ఉపేక్షిస్తామో అవే ఒక్కోసారి మనల్ని ప్రజల నుండి దూరం చేస్తాయి. పిసినారిగా, గర్విష్టిగా మనల్ని నిలబెడ తాయి. అందుకే మనం తోటి సోదరుల్ని పలకరించినా, తోటివారు మనల్ని పలకరించినా పరధ్యానంతో మాట్లాడరాదు. మాట్లాడేటప్పుడు ముఖంపై అసహనం, ఆగ్రహం వ్యక్తమవకూడదు. భృకుటి ముడిపడకూడదు. నుదురు చిట్టించరాదు. కసురుకోవటం, చీకాకు పడటం వంటివి చేయకూడదు. విముఖత అసలే పనికిరాదు. మన ముఖ కవళికల ద్వారా, హావ భావాల ద్వారా వీలయినంత వరకు సంతోషాన్ని, తృప్తినీ అభివ్యక్తం చేయాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఉద్బోధిస్తుండగా తాను విన్నానని అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) తెలియజేసారు: “అల్లాహ్ జ్ఞానాన్ని ప్రజల హృదయాల నుండి లాక్కోని పైకి లేపుకోడు. కాని ఉలమాల (పండితుల) మరణం ద్వారా జ్ఞానాన్ని లేపుకుంటాడు ఆ విధంగా ఒక్క జ్ఞాని కూడా మిగలకుండా చేస్తాడు. ఆ తర్వాత ప్రజలు ఆజ్ఞానులను తమ నాయకులుగా (గురువులుగా) చేసుకుంటారు. వారిని ఏదైయిన ప్రశ్న అడిగితే వారు తమ అజ్ఞానంతోనే తీర్పులు ఇస్తారు. ఫలితంగా స్వయంగా తాము మార్గభ్రష్ఠులు అవుతారు. ఇతరులను కూడా మార్గభ్రష్టత్వానికి గురిచేస్తారు.” (బుఖారీ, ముస్లిం)
పై హదీసు ద్వారా మనం చాలా విషయాలను అర్ధం చేసుకోవలసి ఉంది:
1.జ్ఞానం అనేది పుస్తకాలలో, సి.డి. లలో, ఇంటర్నెట్ లో ఉందా? లేదా ఉలమాల హృదయాలలోన?
2.ఒకవేళ పుస్తకాలలో మరియు సి.డి.లలో అయితే అల్లాహ్ వాటిని లేపుకొనే అ జ్ఞానాన్ని అంతం చేసేవాడు, ఉలమాలకు మృత్యువు ప్రసాదించి కాదు
3.మనం ఎవరిని మార్గదర్శకులుగా చేసుకోవాలి? జ్ఞానమున్న పండితులనా? లేక మిడి మిడి జ్ఞానం కలవారినా?
సోదర సోదరీమణులారా! ఈనాడు మన చుట్టూ ఎంతో మంది ఇస్లాం జ్ఞానాన్ని బోధించే ఉలమాలు ఉన్నప్పటికిని మనం మన గురువులు, మార్గదర్శకులు నాయకులుగా అజ్ఞానులను చేస్తుకుంటున్నాము. కేవలం పై పై తళుకులు చూసి జ్ఞానికి అజ్ఞానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేక పోతున్నాము. తద్వారా మన పరలోక జీవితం సంకటంలో పడిపోతుంది. మనం ఉలమాలకు (పండితులకు) ఇవ్వవలసిన గౌరవాన్ని వారికి ఇవ్వడం లేదు. దానికి బదులుగా మన తలలపై అజ్ఞానులు స్వారీ చేస్తున్నారు. ధార్మిక పండితులు ధర్మ జ్ఞానం కోసం ఇల్లు, వాకిలి వదిలిపెట్టి ఎన్నో త్యాగాలు చేసి పరదేశాలకు సైతం ప్రయాణాలు చేసి ధర్మ జ్ఞానార్జన చేశారు. అటువంటి వారిని వదలి ఇతరత్రులను మన మార్గదర్శకులుగా చేసుకోవడం ఎంత మూర్ఖత్వమో ఆలోచించండి. ప్రపంచంలో ఎప్పుడెప్పుడైతే అజ్ఞానులు నాయకులుగా, మార్గదర్శకులుగా అయ్యారో ఆ సమాజంలో మన ఊహకందని కొత్త కొత్త సమస్యలు, ఉపద్రవాలు బయలుదేరుతాయి. ఇంకా అలాగే ఆ జాతి సమూలంగా నాశనం అవుతుంది.
ఈనాడు చాలామంది నెట్లో పుస్తకాలు డౌన్లోడ్ చేసి చదివేసి, యూ ట్యూబ్ లో ప్రసంగాలు విని తమవద్ద గొప్ప జ్ఞానం ఉందని తామే గొప్ప విద్వాంసులుగా భావిస్తున్నారు. సాధారణంగా పుస్తకాలు, టి.వి., సి.డి., నెట్ల ద్వారా విద్యాభ్యాసం చేసినవారు గర్వానికి గురి అవుతూ ఉంటారు. అదే గురువు వద్ద విద్యాభ్యాసం చేసిన వ్యక్తికి అణుకువ, సామాజిక మర్యాదలు వంటి సద్గుణాలు అలవడుతాయి
బహుదూరపు బాటసారులమైన మనకు ఈ ఉలమాలు ఆకాశంలో మిరిమిట్లు గొల్పుతూ దారి తప్పిన ప్రయాణికులకు మార్గం చూపే నక్షత్రాల లాంటి వారు. ఎడారిలో దప్పికగొన్న బాటసారులకు దాహాన్ని తీర్చు ఒయాసిస్ లాంటి వారు. వీరి చెలిమి, సాంగత్యము ఎన్నడూ నష్టం చేకూర్చదు.
మనము ఆరోగ్యము క్షీణిస్తే వైద్య సలహాల కొరకు వైద్యవృత్తిలో ఆరితేరిన వైద్యుణ్ణి సంప్రదిస్తాము. అలాగే ఇల్లు కట్టాలన్నా మంచి ఇంజనీరును వెతుకుతాము ఇలా ఐహిక జీవితానికి సంబంధించిన ప్రతి పనికి ప్రావీణ్యులను సంప్రదిస్తాము.
కానీ ఒక్క ధర్మ విషయములో సలహాలు మరియు సూచనలకు ఏ దారినపోయే దానయ్యనో అడుగుతాము. తెలిసీతెలియక అతనిచ్చే సలహాలను పాటించి మన ఇహ పరాలను నాశనం చేసుకుంటున్నాము. తెలియకపోతే కనీసం ధర్మపండితుల (ఉలమాలు) ను అడిగి తెలుసుకోవాలి అన్న ఇంకిత జ్ఞానం లేక స్వయంగా మార్గభ్రష్టులవుతూ ఇతరులను మార్గభ్రష్టత్వానికి గురిచేస్తున్నారు. అఖీదా, ఆరాధనలు, జకాత్, వ్యాపారలావాదేవీలు ఆస్తిపాస్తుల పంపకాలు ఇంకా ప్రతి విషయంలోను స్వయంగా మిడి మిడి జ్ఞానంతో వారికి వారే నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద ఉలమాలను ప్రక్కన పెట్టి పై పై తళుకులు బెళుకులను చూసి అల్ప జ్ఞానులను ప్రశ్నించి మోసపోతున్నారు.
ఉర్దూలో ఒక కవి ఇలా అంటున్నాడు. దాని భావం
తెలిసీ తెలియని వైద్యునితో ఆయుష్షుకు ముప్పు తెలిసీ తెలియని పండితునితో విశ్వాసానికే ముప్పు
అల్లాహ్ మనందరికి ప్రావీణ్యులైన పండితులను మన మార్గదర్శకులుగా చేసుకునే భాగ్యాన్ని కల్పించుగాక. అమీన్
ఈ పుస్తకం“ఇల్మేదీన్ కిన్ సే సీఖే”ను తెలుగు భాషలోనికి అనువాదం చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు ముందుగా అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పుస్తక రచయిత ఫజీలతు షేఖ్ సయ్యద్ హుసైన్ ఉమరీ మదనీ (హఫిజహుల్లాహ్) “ధర్మ జ్ఞానము మనం ఎవరి వద్ద నేర్చుకోవాలి?” అన్న విషయంపై ఖుర్ఆన్ సహీహ్ హదీసులు మరియు సలఫెసాలెహీనుల సూక్తుల ద్వారా ఎంతో చక్కగా వివరించారు. అల్లాహ్ వారికి ఇహ పరలోకాలలో తగిన ప్రతిఫలం ప్రసాదించుగాక. పుస్తకం చదివిన వెంటనే నేను షేఖ్ గారికి ఫోన్ చేసి ఈ పుస్తకాన్ని నేను తెలుగులో అనువదిస్తాను అని అన్నాను. అందుకు షేఖ్ మదనీ హఫిజహుల్లాహ్ ఎంతో సంతోషంతో నాకు ఆ భాధ్యతను అప్పగించారు. తప్పులు లేకుండా అనువాదం చేసే భాగ్యాన్ని ప్రసాదించమని అల్లాహ్ నుప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాను. ఈ పుస్తకం పున:పరిశీలన విషయంలో నాకు తోడ్పడిన డా॥ సయీద్ అహ్మద్ మదని (హఫిజహుల్లాహ్) గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను
بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين، والصلاة والسلام على رسوله الأمين، وعلى آله وصحبه أجمعين، أما بعد :
ధర్మజ్ఞానం ఎవరి వద్ద అభ్యసించాలి?
ఈ రోజులలో సహృదయంతో ఇస్లాం ధర్మాన్ని అవలంబిస్తూ ధర్మజ్ఞానాన్ని కూడా అభ్యసించాలి అని దృఢమైన సంకల్పం గల వ్యక్తులు ఉండటం చాలా అరుదు. అందులోను చాలామంది జ్ఞానార్జన కొరకు మాధ్యమమును ఎన్నుకొనుటలో తప్పులు చేస్తుంటారు. కొందరు ఫిలాసఫర్ ల వద్ద విద్యను అభ్యసిస్తుంటారు. ఒక పద్ధతి ప్రకారం సరైన జ్ఞానాన్ని వీరు అభ్యసించి ఉండరు. పోగా వీరి ఆలోచనా విధానాలు మరియు బోధనలు ఇస్లాంకు విరుద్ధంగా ఉంటాయి. మరికొందరైతే తమ భాషా ప్రావీణ్యత, మంచి పదజాలంతో కథలు వళ్లించి ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసే ప్రసంగీకుల వద్ద విద్యాభ్యాసన చేస్తూ ఉంటారు. వీరి వద్ద తమ పదజాలంతో ఎదుటి వారిని సంతృష్ట పరచుట తప్ప ఏమీ ఉండదు. ఈ ఆధునిక యుగంలో కొందరైతే తెలియకుండానే కొత్త కొత్త వ్యక్తుల, మార్గభ్రష్టత్వానికి గురిచేసే వెబ్ సైట్ల ద్వారా విద్యను అభ్యసిస్తారు. విద్యాభ్యాసన యదార్థానికి ఇది ధర్మభ్యాసన కనుక ఇందులో ఎంతో జాగ్రత్త వహించాలి.
ముహద్దిస్, ముఫస్సిర్, ఫఖీ మరియు ముజ్తహిద్, కలల గూడార్థములను వివరించగల గొప్ప తాబయీ ముహమ్మద్ బిన్ సీరీన్ బసరీ (రహమతుల్లాహి అలైహి) ఈ విధంగా అంటున్నారు.
(1) إِنَّ هَذَا الْعِلْمَ دِينَ فَانْظُرُوا عَمَّنْ تَأْخُذُونَ دِينَكُمْ “ఇన్న హాజల్ ఇల్మ దీనున్, ఫన్జురూ అమ్మన్ తాఖుజూన దీనకుమ్” “ నిశ్చయముగా ఈ జ్ఞానము అనేది నీ దీన్ (ధర్మం), నీవు నీ ధర్మాన్ని (ఇస్లాం) ఎవరి వద్ద అభ్యసిస్తున్నావో పరీక్షించుకో?”
కాబట్టి కేవలం జ్ఞానవంతుడిని అనే తోలు కప్పుకుని ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా లేక సోషల్ మీడియా మరియు సోషల్ నెట్వర్క్ ల ద్వారా, బ్రదర్, సిస్టర్ లుగా పరిచయం చేసినంత మాత్రాన, ఒక వ్యాసం లేక ఒక పుస్తకం వ్రాసినంతనో లేక అఖీదా మరియు మన్ హజ్ ను ప్రక్కన పెట్టి చరిత్ర పై గొప్ప ప్రసంగం చేసినంతనో లేక ఒక వ్యాసం వ్రాసినంత మాత్రానో లేక ఏదైనా అంశంపై ఒక పండితుని ప్రసంగం వినిన లేక ఏదో ఒక పుస్తకం చదివినంతనే లేక రకా రకా ఆంగ్ల భాషలో మాట్లాడినంతనో ఇంకా అవసరం లేకుండానే తన ప్రశంశ కొరకు ఫోటోలు ప్రింట్ చేపించుకున్నంత మాత్రాన అతను ఇస్లాం ధర్మపు ప్రతి అంశాన్ని వివరించగల పండితుడు లేక ప్రతి విషయంలో మనం అతని ద్వారా జ్ఞానాన్ని ఆర్జించగల యోగ్యత గల పండితుడు కాజాలడు.
ఈమామ్ ఇబ్నేరుష్ద్ ఈవిధంగా అంటున్నారు:
(2) كَانَ الْعِلْمُ فِي الصُّدُورِ فَصَارَ الْآنَ فِي الثِّيَابِ కాన అల్-ఇల్ము ఫీ అస్-సుదూరి, ఫసార అల్-ఆన ఫీ అత్-థియాబి “జ్ఞానం హృదయాలలో ఉండేది. ప్రస్తుతానికి దుస్తులలో ఉంది.” (ఒకప్పుడు జ్ఞానం హృదయాలలో పదిలంగా ఉండేది. కాని ప్రస్తుతం ప్రజలు స్క్రీన్ మీద కనిపించే మేకప్, దుస్తులకే ప్రాముఖ్యత ఇస్తున్నారు.)
ప్రస్తుతం ఇస్లామిక్ మదరసాల నుండి ఇప్పుడిప్పుడే చదువు పూర్తి చేసుకొస్తున్న కొంతమంది ఇంకా క్రొత్తగా పుట్టుకొస్తున్న దాయీలు, అఖీదా మరియు విశ్వాసాల గురించి అజ్ఞానంతో కూడిన ఎటువంటి ఆలోచనలు, కోణాలు ప్రజల ముందు ఉంచుతున్నారంటే ధర్మం సంపూర్ణం గావింపక ముందు వాటి గురించి ప్రవక్త వారు ప్రవచించ లేదు, సహబా (రజియల్లాహు అన్హుమ్) వారు మాట్లాడే ధైర్యం చెయ్యలేదు.
“ప్రతి విషయంలోను మీలో ఎవరో ఒకరు తప్పకుండా ఫత్వా ఇచ్చేస్తారు. ఒకవేళ ఇదే విషయం ఉమర్ (రజియల్లాహు అన్హు) వారి ముందు ప్రవేశపెడితే వారు దానిని పరిష్కరించుటకు బదర్ యుద్ధంలో పాల్గొన్న సహాబాలను సమావేశపరచేవారు.”
ముఫ్తియె హిజాజ్, ఈమామె దారుల్ హిజ్రా ఈమామ్ మాలిక్ (రహమతుల్లాహి అలైహి)వారు అంటున్నారు “నేను ఒక విషయంలో సుమారు పది సంవత్సరాలకు పైగా యోచిస్తున్నాను. కాని ఆ విషయమై నాకు ఇప్పటికిని ఒక సదాభిప్రాయం ఏర్పడలేదు“.(8) “ఒక వేళ తప్పని సరిగా సమాధానం ఇవ్వవలసి వచ్చినపుడు, ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే ఖచ్చితంగా చెప్పలేను” అనేవారు” (9)
తఫ్సీర్, హదీస్, ఫిఖా, ఉసూలే ఫిఖా, లుగా (భాషాతత్వము) అదబ్ (సాహిత్యము) లకు ఈమాము అయిన ఈమాము షాఫయీ (రహమతుల్లాహి అలైహి) వారు ఇలా అంటున్నారు. “ ధర్మజ్ఞానాన్ని గూర్చి ఎటువంటి వారు చర్చించారంటే, కొన్ని విషయాలను వారు చర్చించకుండా మౌనం పాటించి ఉంటే వారి కొరకు అది బహు శ్రేయస్కరంగా ఉండేది. ఇన్నాల్లా వారు (తప్పుల నుండి) సురక్షితంగా ఉండేవారు (10)
“ఈమామ్ ఇబ్నే హజం (రహమతుల్లాహి అలైహి) వారు ఏమంటున్నారంటే “ విద్యకు, విద్యావంతులకు అత్యంత నష్టం కలిగించే దుస్థితి ఏమిటంటే అనర్హులు* జ్ఞానానికి మరియు పండితులకు (ఉలమాలు) సంబంధించిన విషయాలలో అనవసరంగా తలదూర్చడం. ఎందుకంటే వారు అజ్ఞానాన్ని జ్ఞానంగా మరియు అరాచకాన్ని సంస్కరణగా భావిస్తారు. (11)
షైఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహమతుల్లాహి అలైహి) వారు “ఇస్లాం ధర్మం విషయంలో అజ్ఞానంతో మాట్లాడడం, ఆ విధంగా మాట్లాడే వారికి సహాయం చెయ్యడం ఇంకా ఇస్లాం ధర్మానికి సంబంధం లేని విషయాలను ఇస్లాంలో చేర్చడం” ఎవ్వరికిని ధర్మసమ్మతం (హలాల్) కాదు అని అన్నారు. (12)
ఇంకా ఎవడైనా అజ్ఞానంతో ఉలమాలను విభేదిస్తూ మాట్లాడితే అతడ్ని ఆపాలి అప్పటికిని అతను మితిమీరి ప్రవర్తిస్తే అజ్ఞానులకు బుద్ధి చెప్పే రీతిలోనే అతనికి బుద్ధి చెప్పాల్సివస్తుంది. పండితునిగా చెలామణి అవుతున్నప్పటికిని ధర్మానికి విరుద్ధంగా మాట్లాడినందుకుగాను అతని మాటను నమ్మడం జరుగదు. (13) ఒకడు కావాలని ఉద్దేశ్య పూర్వకంగా అబద్ధం చెప్పకపోయినా అజ్ఞానంతో ధర్మం విషయంలో మాట్లాడితే అతడు అబద్దీకుడే (14)
కొందరైతే పేరు ప్రఖ్యాతుల కోసం ఉలమాల అసాధారణ ఫత్వాలు మరియు అరుదైన సూక్తులను ప్రజల ముందు ఒక క్రొత్త రీసెర్చ్ లాగా ప్రవేశపెడుతారు. కాని ఈమామ్ ఔజాయీ (రహమతుల్లాహి అలైహి) ఈ విధంగా అంటున్నారు.
(15) مَنْ أَخَذَ بِنَوَادِرِ الْعُلَمَاءِ خَرَجَ مِنَ الْإِسْلَامِ “ ఎవడైతే ఉలమాల అరుదైన సూక్తులను ఎన్నుకొనునో అతను ఇస్లాం నుండి వైదొలగిపోయాడు” (16)
సలఫెస్సాలేహీన్ బలంగా ఖండించిన ఈ విషయాలను గురించి న్యాయపరమైన యదార్థ విచారణ చేస్తే అజ్ఞానులు లేక అల్ప జ్ఞానులు నిజానికి తమను తాము మోసం చేసుకుంటూ, పూర్తి ముస్లిం సమాజాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో తెలిసిపోతుంది.
గమనిక: ఇస్లాంలో ధర్మజ్ఞానాన్ని ఆర్జించడానికి ప్రతి ఒక్కరు అర్హులే, కాని ఇక్కడ అనర్హులు అంటే ధర్మజ్ఞానాన్ని ఆర్జించవలసిన రీతిలో ఆర్జించకుండా మిడి మిడి జ్ఞానంతో ఉలమాలు చెయ్యవలసిన పనులు చెయ్యడం (ఫత్వాలు వగైరాలు ఇవ్వడం) అంటే డాక్టరు కాకుండానే కంపౌండర్లు ఆపరేషన్ చేసినట్లు (ప్రతి ఒక్కరూ తమ జ్ఞాన పరిధిని తెలుసుకొని ప్రవర్తించాలి. (అనువాదకుడు)
ఏ విధంగానైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారో (17) “سَيَأْتِي عَلَى النَّاسِ سَنَوَاتٌ خَدَّاعَاتٌ … وَيَنْطِقُ فِيهَا الرُّوَيْبِضَةُ ” قِيلَ: وَمَا الرُّوَيْبِضَةُ؟ قَالَ: “الرَّجُلُ التَّافِهُ فِي أَمْرِ الْعَامَّةِ”
“ అతి త్వరలో ప్రజలపై ఎటువంటి సంవత్సరాలు వస్తాయంటే అందులో కపటం మరియు మోసం చాలా ఎక్కువగా ఉంటుంది… ఆ రోజులలో రువైబిజా (అజ్ఞానులు, అయోగ్యులు)(18, 19) మాట్లాడెదరు (ప్రవక్త వారితో) రువైబిజా ఏమిటి? అని ప్రశ్నించడం జరిగింది. అందుకు ప్రవక్త వారు” అల్పుడు, అజ్ఞాని అయిన వ్యక్తి ప్రజల విషయాలలో మాట్లాడతాడు. కొన్ని కథనాలలో అల్పుడు, అజ్ఞాని అని కాకుండా పరమ కపటి మరియు తెలివితక్కువ వాడు అన్న పదాలు ఉన్నాయి. కనుక ధర్మ జ్ఞానాన్ని ఎటువంటి పండితుడి వద్ద అభ్యసించాలంటే అతను ధర్మాన్ని అభ్యసించుటలో ఇతరులకు నేర్పే విషయంలో అల్లాహ్ కు భయపడేతత్వం కలిగిఉండాలి. (20) తెలియని విషయాలలో మౌనం వహించేవాడై ఉండాలి (21) ఇంకా అతని జ్ఞానం కేవలం పుస్తకం లేక ఇంటర్నెట్ ద్వారా ఆర్జించినది కాకుండా విశ్వసనీయమైన గురువు ద్వారా ఆర్జించినదై ఉండాలి.
గ్రంథం యొక్క వెలుగులో మరియు గురువుగారి పర్యవేక్షణలో జ్ఞానాన్ని ఆర్జించుటకు గల ప్రధానమైన కారణము ఏమిటంటే, గ్రంథాలన్నింటిలో కెల్లా వివరణాత్మకమైన గ్రంథము ఖుర్ఆన్ గ్రంథము(22) అయినప్పటికిని దానిని బోధించుటకు అల్లాహ్ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం వారిని పంపించెను (23) తద్వారా బోధన మరియు తబ్లీగ్ (ప్రచారము, విద్యావ్యాప్తి) చేసేటప్పుడు ఎలాంటి మార్గభ్రష్టత్వము, క్రమరాహిత్యము మరియు అసమానతలు చోటుచేసుకోరాదని, ఆవిధంగా చూసిన ఖుర్ఆన్ యొక్క ఉపమానాలను ప్రజలకన్నా మిన్నగా ధర్మజ్ఞానమున్న పండితులే బాగుగా ఎరుగుదురు. (24) ఇంకా విషయాన్ని తెలుసుకొనుటకు పదాల యొక్క మూలాల వరకు వెళ్తారు (25) అటువంటప్పుడు సత్యాన్ని ప్రేమించే వారుగా నిజమైన పండితుల వద్దనే జ్ఞానాన్ని ఆర్జించాలి. (26) లేకపోతే సత్ జ్ఞానము అంతరించిపోతుంది. దీనిని గురించే ఈమామ్ షాఫయీ (రహమతుల్లాహి అలైహి) ఇలా అంటున్నారు.
“ ఎవడైతే కేవలం పుస్తకపు పేజీలతో ధర్మజ్ఞానాన్ని ఆర్జించునో అతను ఆజ్ఞలను కాలరాసినట్లే” (27)
మిసర్ (ఈజిప్ట్) దేశస్థుడు 9వ హిజ్రీకి చెందిన ముహద్దిస్, ఫఖీ, తత్వవేత్త మరియు సాహిత్యకర్త అహ్మద్ అష్ – షుమాన్నీ (రహమతుల్లాహి అలైహి) వారు ఇలా అంటున్నారు.
“ ఎవరైతే నేరుగా గురువు ద్వారా జ్ఞానాన్ని ఆర్జించునో అతను తన జ్ఞానంలో కల్తీలు మరియు తప్పుల నుండి సురక్షితంగా ఉంటాడు. మరి ఎవడైతే గురువు లేకుండా కేవలం పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని ఆర్జించునో అటువంటి జ్ఞానం ఉలమాల వద్ద లేని దానితో సమానం.
గమనించవలసిన విషయం ఏమిటంటే జ్ఞానాన్ని నిజమైన జ్ఞానవంతులు అందులోను నిష్ఠార్థులు మరియు గొప్ప పండితుల వద్ద ఆర్జించే విషయమై విశ్వసనీయ అఖీదా పుస్తకాలలో పేర్కొనడం జరిగింది. మరి దాని వైపే ఖులఫాయె రాషిదీన్ లలో అమీరుల్ ముమినీన్ ఉమర్ రజియల్లాహు అన్ హు వారు ప్రోత్సహించారు.
“ తస్మాత్ ! ప్రజలు తమ పెద్దల వద్ద జ్ఞానం ఆర్జించినంతకాలం ఇంకా జ్ఞానార్జన కొరకు చిన్నవారు పెద్ద వారి ముందు నించున్నంతసేపు సురక్షితంగా ఉంటారు. అలాకాక ఎప్పుడైతే చిన్నవాళ్ళు పెద్దవారికి బదులుగా నిలబడతారో నిశ్చయంగా వాళ్ళు నాశనం అవుతారు”
గమనించవలసిన విషయం ఏమిటంటే, పెద్ద పెద్ద ఉలమాల వద్ద జ్ఞానాన్ని ఆర్జించమని ప్రోత్సహిస్తూ ప్రధాన అఖీదా పుస్తకాలలో ప్రస్తావించుటకు గల కారణం ఏమిటంటే ఎప్పుడైతే ఒక క్రమ పద్ధతి అంటూ లేకుండా మిడి మిడి జ్ఞానమున్న వారివద్ద, అవిశ్వసనీయ మరియు అవాస్తవ వ్యక్తుల వద్ద జ్ఞానాన్ని ఆర్జిస్తామో అక్కడ అఖీదా మరియు మన్ హాజ్ లలో లోపం ఏర్పడుతుందనే భీతి అంటిపెట్టుకొని ఉంటుంది. షైఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహమతుల్లాహి అలైహి) ఇలా అంటున్నారు : “ కొందరు ఏమన్నారంటే, ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని నాశనం చేసేవాళ్ళు మిడి మిడి జ్ఞానమున్న ప్రసంగీకుడు, తెలిసీ తెలియని ఫఖీ, అర్థవైద్యుడు ఇంకా సగం తెలిసిన వ్యాకరణవేత్త, (అది ఎలాగంటే) మిడిమిడి జ్ఞానమున్న ప్రసంగీకుడు ధర్మాన్ని నాశనం చేస్తే, తెలిసీ తెలియని ఫఖీ పట్టణాలలో ఉపద్రవాలు సృష్టిస్తాడు, అర్థవైద్యుడు ప్రాణానికి ముప్పుగా మారుతాడు అలాగే సగం తెలిసిన వ్యాకరణవేత్త భాషను సర్వనాశనం చేస్తాడు (30)
జ్ఞానాన్ని ఆర్జించేందుకు కేవలం పుస్తకాల పైనే ఆధారపడకుండా ప్రావీణ్యుడైన గురువును ఎంపిక చేసుకొని అతని యెడల అణుకువతో మెలగవలెను. అదేవిధంగా అతని విశిష్టత, శ్రద్ధ మరియు ప్రావీణ్యతను దృష్టిలో ఉంచుకొని గురువును ఎన్నుకోవాలి. ఇదే విషయాన్ని ఈమామ్ షౌకాని (రహమతుల్లాహి అలైహి) వారు అంటున్నారు : “ నిపుణత గల వ్యక్తి వద్ద సాధన చెయ్యనంత వరకూ మానవుడు ఆ వృత్తికి న్యాయం చేయలేడు. ఉదాహరణకు హదీసు జ్ఞానార్జకుడైన ఒక వ్యక్తి ముహద్దసీనుల (హదీసు శాస్త్రంలో ప్రావీణ్యులు) వద్ద హదీసు జ్ఞానాన్నైతే నేర్చుకున్నాడు కాని హదీసు పదాలను అర్థం చేసుకునేందుకు వారి వద్దనే భాషా పరిజ్ఞానాన్ని అభ్యసించదలిస్తే భాషాభ్యాసన విషయంలో అతను తప్పుచేస్తున్నట్లే.. ఒకవేళ అతను అనర్హుల వద్ద జ్ఞానార్జన చేసి అనర్హుడై ఉండి ఉలమాల సూక్తులకు విలువనిచ్చిన గ్రుడ్డి పశువు మాదిరిగా మార్గభ్రష్టుడు అవుతాడు. జ్ఞానాన్ని భ్రష్టుపట్టిస్తాడు. ఇంకా అతిశయోక్తి కలిగించే మాటలు, అభిప్రాయాలను వెళ్ళబుచ్చుతాడు (31)
ఆలా కాక ఒక విషయంలో నిలకడగా ముందుకు వెళ్తూ ఫత్వాలు గుప్పించకుండా ఒక పద్ధతి ప్రకారం ఉలమాల పర్యవేక్షణలో, జ్ఞానం వెలుగులో నిజాయితీగా దావత్, ఇస్లాహ్ (సంస్కరణ) చేస్తూ స్వయంగా ఆచరిస్తున్నట్లైతే ఎటువంటి అభ్యంతరం లేదు ఇంకా అది ప్రశంసింపదగిన విషయము (32)
ఉలేమాలను గౌరవించుట
“ప్రతి ముస్లిం యొక్క శ్రేష్ఠత కాబతుల్లా:ను మించినది“.(33) అతని ధన, ప్రాణ మరియు గౌరవ మర్యాదల సంరక్షణ విధిగానున్నది. అందులోను ముఖ్యముగా ఉలేమాలను గౌరవించడం అనేది తూచ తప్పక పాటించవలసిన విషయం. ఏ విద్యార్థియైన లేక జ్ఞానమున్న పండితుడైనా ఒకవేళ అతను ఉలమాలను గౌరవించకపోతే అతని ప్రస్తావన పండితులలో కాదుకదా సామాన్య ముస్లిం ప్రజానీకంలో కూడా ఉండదు. ఎందుకంటే రసూలుల్లు సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అంటున్నారు.
“మా పెద్దలను గౌరవించని, మా చిన్నారులను కరుణించని మరియు మా ఆలిమ్ యొక్క హక్కును ఎరుగని వ్యక్తికి నా ఉమ్మత్ (అనుచర సమాజం) తో ఎటువంటి సంబంధం లేదు” (35)
ఆలిమ్ యొక్క హక్కును (తెలుసుకోవడం, నెరవేర్చడం) అంటే (అతని వ్యక్తిత్వపు హక్కుకాదు) అతని జ్ఞానపు హక్కును తెలుసుకోవడం. కాబట్టి మానవుడు, అల్లాహ్ తఆలా ఆలిమ్ కు ప్రసాదించిన ఉన్నత స్థానాన్ని గుర్తించాలి (ఇంకా) ఆ ఉన్నత స్థానం అనేది జ్ఞానం కారణంగా ప్రసాదించడం జరిగింది. (36)
ఎందుకంటే ఉలమాలను గౌరవించుట ఇంకా వారి హక్కులను పర్యవేక్షించుటలో మానవునికి మార్గదర్శకత్వము లభిస్తుంది. లేకపోతే అతను అవమానానికి, నష్టానికి గురికావలసి వస్తుంది. ఇంకా అతను పాపాత్ముడు అవుతాడు (37)
ఉలమాలు, యదార్థానికి వారు ప్రవక్తల వారసులు. (38) మరి ఏవిధంగానైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో బిగ్గరగా మాట్లాడడం నిషిద్ధమే. (39) అదేవిధంగా ఉలమాలతో కూడా బిగ్గరగా మాట్లాడరాదు. ఎందుకంటే ఏవిధంగానైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హేళన చేసే వారి కొరకు అల్లాహ్ తఆలా చాలునో (40) ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పరిహసించిన ఉత్ బా, షైబా, వలీద్, ఉమయ్య ఇంకా ఉక్ బాబిన్ అబీముయిత ను బద్ర్ యుద్ధంలో నాశనం చేసెను. (41) ఎవరైతే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని పరిహసించిన అబ్దుల్లా బిన్ ఖమిఅ లాంటి వాణ్ణి ఒక అడవి గొర్రెతో ముక్కలు ముక్కలుగా చేయించాడో (42) ఎవరైతే ఉత్ బా బిన్ అబిలహబ్ లాంటి ప్రవక్త పరిహాసకుడ్ని పులితో చంపించెనో (43) అదే అల్లాహ్ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వారసులు అయిన ఉలమాలను పరిహసించే వారి కొరకునూ చాలును.
బుఖారా రాజ్యాధికారి అయిన ఖాలిద్ బిన్ అహ్మద్ అజ్-జుబలీ అనే వ్యక్తి ఈమామ్ బుఖారీ రహమతుల్లాహి అలైహి వారి విషయంలో మితిమీరి ప్రవర్తించి వారిని నానా విధాలుగా బాధించినప్పుడు ఈమామ్ బుఖారీ రహమతుల్లాహి అలైహి వారు అతనిని గూర్చి బద్-దుఆ చేసెను. దాని పర్యవసానంగా అల్లాహ్ తఆలా అతని రాజ్యాధికారాన్ని లాగేశాడు, అతనిని నీచ స్థితికి దిగజార్చెను, తుదిశ్వాస విడిచేవరకూ కూడా అతను జైలు గోడల మధ్య ఖైదీగా మగ్గుతూనే ఉన్నాడు. (44)
حوالہ جات (References)
صحيح مسلم المقدمة باب في أن الإسناد من الدين …
سورة نمل / ٦٤
خلاصة الأثر في أعيان القرن الحادي عشر لمحمد أمين المحبي، حرف الهمزة والألف /ج 1/ ص 275
سورة يونس / ٥٩
سورة ال عمران / ٩٤
سورة نساء / ٥٠
تاريخ دمشق لابن عساكر، ذكر من اسمه عثمان بن عاصم … بعض كبار ہیں اور یمین کے بارے میں حسین ہے جو غلط ہے اور صحیح ابو الحصين ہے۔
شرح اصول اعتقاد اهل السنة و الجماعة للالكائي، باب سياق ذكر من رسم … جماع ابواب ذكر ما روي عن النبي …
جامع بيان العلم و فضله لابن عبد البر، باب كراهية القول في دين الله بغير علم
الرسالة للامام الشافعي، باب تجنب اهل الكلام
الأخلاق و السير في مداواة النفوس لابن حزم، ذم الجهل …
مجموع الفتاوى لابن تيمية، كتاب الصلاة، باب شروط الصلاة / ج 22 / ص 230
الرد على البكري لابن تيمية، علم السلوك، من تكلم في الدين … / ج 1 / ص 444
السنن الكبرى للبيهقي، كتاب الشهادات، باب ما يجوز شهادة اهل الأهواء …
اوزاعي كے روایت ہے اس کے لیے دیکھئے: تذکرة الحفاظ
سنن ابن ماجه، كتاب الفتن، باب العزلة، على بن ابی بکر کی الزوائد میں اسنادہ صحیح …
وريک روایت میں ہے کہ اس کے شر سے بچ کر رہو۔ دیکھئے: شعب الإيمان للبيهقي، باب نشر العلم، فصل قال وينبغي …
إكمال المعلم بفوائد صحيح مسلم للقاضي عياض، كتاب الفتن، باب ذهاب الإيمان آخر الزمان …
كفاية الحاجة في شرح سنن ابن ماجه للسندي، على سنن ابن ماجه…
سورة فاطر/٢٨
سورة بني إسرائيل/ ٣٦
سورة يوسف/١
سورة البقرة/١٢٩، سورة آل عمران/ ١٦٤، وسورة الجمعة/ ٢
سورة عنكبوت/ ٤٣
سورة النساء/ ٨٣
سورة النحل/ ٤٣، سورة الأنبياء/ ٧
تذكرة السامع و المتكلم في أدب العالم و المتعلم لابن جماعة، الباب الثاني في أدب المتعلم…
الضوء اللامع لأهل القرن التاسع للسخاوي، ثلث ذكر من اسمه محمد… حرف الميم، / ج 9 / ص 118
شرح أصول اعتقاد أهل السنة و الجماعة للالكائي، باب سياق ذكر من رسم … سياق ما روي عن النبي … في الحث … اور اس کے آخری قول الصغير الكبير للطبراني، باب العين، عطاء بن مسعود … قیل … میں ابن مسعودؓ سے بھی مروی ہے۔
مجموع الفتاوى لابن تيمية، علم السلوك، فصل في الأمراض والشفاء … /ج 10 / ص 118
أدب الطلب و منتهى الأرب للشوكاني، ص 118
صحيح مسلم، كتاب الإيمان، باب الدليل على دخول …، ” انزل حيث ينزلك” …
جامع الترمذي، أبواب البر والصلة، باب ما جاء في شفقة المسلم … اور فصل من أهان قریشا، ابو دانی صامت سے بھی…
المسند للشاشي، مسند عبادة بن الصامت، / ج 3 / ص 273، ليكن اس میں لیس منا ہے اور مسند احمد میں اس کی جگہ لیس من امتی ہے اور طبرانی کبیر (حدیث: ۷۲۳۵) میں بھی ہے۔
البحر الزخار بمسند البزار، / ج 7 / ص 179، حدیث: 2740، مسند احمد: 26523
فيض القدير شرح الجامع الصغير للمناوي، حرف اللام / ج 5 / ص 386 / ح 7659
السير، سرش الجامع الصغير للمناوي، حرف اللام / ج 3 / ص 331
سنن أبي داود، أول كتاب العلم، باب الحث على طلب العلم… بروایت ابوالدرداء جامع ترمذی …
سورة الحجرات / 2
سورة الحجر / 95
صحيح البخاري، كتاب الوضوء، باب إذا ألقي على ظهر المصلي … بروایت ابن مسعود
مسند الشاميين للطبراني، ما انتهى إلينا من مسند ثور بن يزيد، عن مكحول…
موسوعة الدفاع عن رسول الله، لعلى بن نايف الشحود، المجلد الباب التاسع المستهزئون وردود أفعالهم، عاقبة عتبة بن أبي لهب والأسود …
البداية والنهاية لابن كثير، ذكر سنة ست وخمسين ومائتين، من توفي فيها من الأعيان/ ج 11/ ص 535
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.