అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి? – షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉథైమిన్

షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉథైమిన్
అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్
రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్
2012 – 1433

అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి ?
ఇది షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉథైమిన్ (రహిమహుల్లాహ్) యొక్క ‘షర్హ్ హదీథ్ జిబ్రయీల్’ అనే అరబీ పుస్తకంలోని ఒక భాగం.

విషయసూచిక

1. మానవ జీవితం వివిధ దశలలో ఉందా లేక అసలు దశలేమీ లేవా ? అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి ?
2.  సమాధి శిక్షలు మరియు దాని అనుగ్రహాలు : సమాధి శిక్షలు దేహానికా లేక ఆత్మకా ?
3.  పునరుత్థానం : మనిషి చనిపోయి ఉండవచ్చు, (అతని శరీరాన్ని) సింహం తినేసి ఉండవచ్చు. మరి అలాంటపుడు అతను తిరిగి ఎలా లేపబడతాడు ?
4. సూర్యుడు సృష్టికి అతి దగ్గరగా రావడం – అంతిమదినం నాడు సూర్యుడు, సృష్టికి ఒక మైలు దూరమంత దగ్గరికి రావడం ఎలా సాధ్యం ?
5. ప్రజల కర్మల పత్రం – ఈ లెక్క నుండి ఎవరైనా తప్పించుకోగలగుతారా ?
6. త్రాసు – త్రాసులో కర్మలు ఎలా తూచబడతాయి – అవి కర్తల లక్షణాలు మరియు పనుల రూపంలో ఉంటాయి కదా! – అక్కడ ఒకే త్రాసు ఉంటుందా లేక అనేక త్రాసులు ఉంటాయా ?
9. షఫా (విముక్తి, మోక్షం) – షఫా షరతులు
10.  పుల్ సిరాత్ (వంతెన)
11. స్వర్గం లేక నరకంలోనికి ప్రవేశం – స్వర్గం మరియు నరకం ఇపుడు ఉనికిలో ఉన్నాయా? – స్వర్గం మరియు నరకం శాశ్వతమా ?

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం

ఇది అంతిమ దినమని ఎందుకు పిలవబడిందంటే, దీని తర్వాత ఇక మరే దినమూ ఉండదు.

మానవ జీవితం వివిధ దశలలో ఉందా లేక అసలు దశలేమీ లేవా ?

ఖాదియానియత్ (Khadiyaniat) [పుస్తకం]

డా. సయీద్ అహ్మద్ ఉమ్రీ మదనీ గారు ఈ పుస్తకంలో పరస్పరం విభేదిస్తున్న అసత్య పలుకులతో, ప్రజలను అయోమయంలో పడవేసి, తప్పుడు దారి పట్టిస్తున్న ఖాదియానియత్ గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా క్షుణ్ణంగా చర్చించారు. సత్యం తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు తప్పకుండా చదవ వలసిన మంచి రిసెర్చ్ పుస్తకమిది.

[ఇక్కడ చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
PDF – mobile friendly ( మొబైల్ ఫ్రెండ్లీ పీడీఎఫ్) – 98 పేజీలు

ఖాదియానీల వాస్తవికత – డాక్టర్ సయీద్ అహ్మద్ ఉమరీ మదనీ హఫిజహుల్లాహ్
https://youtu.be/XwpnAVo0Oew [65 నిముషాలు]

విషయ సూచిక

  1. ముందు మాట [PDF] [6p]
  2. మొదటి అధ్యాయం:సంవాదనలు [PDF] [15p]
  3. రెండవ అధ్యాయం: ఖాదియాని స్వరూప స్వభావాలు [PDF] [30p]
  4. ఖాదియానీ విశ్వాసాలు [PDF] [8p]
  5. పాద సూచికలు [PDF] [6p]
  6. ఖాదియాని ఇస్లాంమత వర్గం కాదు, అదో కల్పిత మతం – రుజువులు [PDF] [25p]

అధ్యాయాలు

మొదటి అధ్యాయం:సంవాదనలు [PDF]

  1. ఒక ఖాదియాని ఇమామ్‌తో సౌమ్యంగా సంభాషణ
  2. ఒక ఖాదియానీ ప్రెసిడెంట్‌ అమాయకపు సంభాషణ
  3. పశ్చిమ గోదావరిలో ఖాదియానీల కేంద్రం
  4. ఖాదియానియత్‌ ఇస్లాం కాదని, దానికి ఇస్లాంతో ఎలాంటి సంబంధం లేదని నిరూపించే రెండు గట్టి ఆధారాలు
  5. ఖాదియానీలతో నిర్మొహమాటంగా సంవాదం

రెండవ అధ్యాయం: ఖాదియాని స్వరూప స్వభావాలు [PDF]

  1. అసలు ఖాదియానియత్‌ అంటే ఏమిటి?
  2. ఖాదియానీ మతంలో వర్గాలు
  3. ఖాదియాని మతస్థాపకుని జననం, అతని వంశం
  4. మిర్జా  వంశం బ్రిటీషు సైనిక శిబిరంలా పనిచేసింది
  5. బాల్యం, విద్యాభ్యాసం
  6. మిర్జా  గులాం అహ్మద్‌ ఖాదియాని ఉద్యోగం
  7. యవ్వనంలో ఆయన వ్యాపకాలు
  8. ‘బరాహీనె అహ్మదియా’ రచన, అబద్ధ ప్రకటనలకు ఆరంభం
  9. దశలవారీగా మిర్జా విచిత్ర ప్రకటనల పర్వం
  10. మిర్జా  రచనలు
  11. హేయమైన మరణం
  12. ఖాదియానీల ఉనికిలో వాస్తవ కారణాలు
  13. అబద్ధపు దైవదౌత్యం కోసం విక్టోరియా ప్రభుత్వ ప్రణాళిక
  14. పాశ్చాత్యవాదులు మరియు గులామ్‌ అహ్మద్‌ ఖాదియానీ దైవదౌత్యం
  15. హిస్టీరియా వ్యాధి, అబద్ధపు దైవదౌత్య సోపానం
  16. గులామ్‌ అహ్మద్‌ ఖాదియానీని అసత్య ప్రవక్తగా రూపొందించడంలో ప్రముఖ మేధావుల పాత్ర
  17. ఖాదియానీ వర్గంలోని కొందరు ప్రముఖులు
    • ఖాదియానియ్యత్‌ తొలి ఖలీఫా నూరుద్దీన్‌
    • లాహోరు వర్గ స్థాపకుడు ముహమ్మద్‌ అలీ లాహోరీ
    • ముహమ్మద్‌ అలీ లాహోరీ మరియు ఇతరుల రచనలు

ఖాదియానీ విశ్వాసాలు [PDF]

  1. గులాం అహ్‌మద్‌ గురించి ఖాదియానీల విశ్వాసాలు, పుస్తకాలు
  2. అల్లాహ్‌ గురించి ఖాదియానీల విశ్వాసం
  3. ఈసా బిన్‌ మర్యమ్‌ (అలైహిస్సలామ్‌) గురించి వారి విశ్వాసం
  4. దైవదౌత్యం & దైవదౌత్య సమాప్తం గురించి ఖాదియానీల వైఖరి
  5. ఖుర్‌ఆన్‌ మరియు దైవవాణి గురించి వారి విశ్వాసం
  6. ఖాదియాన్‌ నగరం గురించి వారి విశ్వాసం
  7. ఖాదియానియత్‌ ఒక నూతన మతం మరియు ప్రత్యేక షరీఅత్‌

పాద సూచికలు [PDF]

ఖాదియాని ఇస్లాంమత వర్గం కాదు, అదో కల్పిత మతం – రుజువులు [PDF]

  1. తాను దైవప్రవక్తనని మిర్జా వాదన
  2. దైవవాణి తనపై అవతరిస్తుందని మిర్జా ఉద్దాటన
  3. “దైవదౌత్య పరిసమాప్తి (ఖత్మె నుబువ్వత్‌) ఒక తప్పుడు విశ్వాసం, ఇస్లాం ఒక పైశాచిక మతం” అంటూ వ్యర్థ ప్రేలాపనలు
  4. మిర్జాను తిరస్కరించినవారు నరకవాసులవుతారని హెచ్చరిక
  5. తన దగ్గరకు జిబ్రయీల్‌ దూత వచ్చారని మిర్జా డాంబికాలు
  6. తనపై వర్షం లాగా వహీ అవతరించిందని మిర్జా ఉద్దాటన
  7. తనను విశ్వసించనివారు అక్రమ సంతానంగా పుట్టినవారని నోరుపారేసుకోవటం
  8. ఖుర్‌ఆన్‌ ఆకాశంపైకి ఎత్తుకోబడిందని, ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వా సల్లం) మళ్లీ ఈ లోకంలోకి పంపబడతారని మిర్జా చేసిన అర్థరహిత వాదనలు
  9. “మగవారు పందులు, స్రీలు ఆడకుక్కలు” అంటూ మిర్జా పలికిన అతి హీనమైన మాటలు
  10. ఖాదియాన్‌ పేరు ఖుర్‌ఆన్‌లో ఉందని వితండవాదం
  11. మస్జిదె అఖ్సా  అంటే మస్జిదె ఖాదియాన్‌ … వింత వాదన
  12. ఖాదియాన్‌ డెమాస్కస్‌ను పోలివుందని అర్దరహిత వ్యాఖ్యలు
  13. అల్లాహ్‌ సంతకం చేశాడని బొంకటం
  14. అల్లాహ్‌ పురుషుడు, తాను స్త్రీ అంటూ మిర్జా వ్యర్థ ప్రసంగం
  15. తాను గర్భం దాల్చానని మిర్జా గాలిమాటలు
  16. తాను దేవుణ్ణి అని బొంకటం
  17. ఈసా (అలైహిస్సలామ్‌) పరుల్ని దూషించేవారని, అబద్ధం చెప్పేవారని నిందలు
  18. ఈసా (అలైహిస్సలామ్‌) గ్రంథచౌర్యం చేసి ఇంజీలు రాశారని అపవాదు
  19. ఈసా (అలైహిస్సలామ్‌) వద్ద మహిమలు ఏవీ ఉండేవి కావని దుష్ప్రచారం
  20. ఈసా (అలైహిస్సలామ్‌) మద్యం సేవించేవారని నీలాపనింద
  21. తాను ఈసా (అలైహిస్సలామ్‌), హుస్సేన్‌ (రది అల్లాహు అన్హు)లను మించిన వాణ్ణని మిర్జా  గొప్పలు
  22. మర్యమ్‌(అలైహస్సలామ్‌)పై నీలాపనింద
  23. హజ్రత్‌ అబూహురైరా (రది అల్లాహు అన్హు)ను కించపరచటం
  24. హజ్రత్‌ ఫాతిమా (రది అల్లాహు అన్హా) పట్ల అవమానకర ధోరణి

– ఖాదియాని వహీ (కితాబె ముబీన్‌)లోని కొన్ని నమూనాలు

– ఆంగ్లంలో వహీ

[పుస్తకం టెక్స్ట్]

అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో… 

ముందు మాట 

الحمد لله نحمده ونستعينه، ونستغفره، ونعوذ بالله من شرور أنفسنا، ومن سيئات أعمالنا، من يهده الله فلا مضل له، ومن يضلل فلا هادي له، ونشهد أن لا إله  إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله وبعد: 

అల్హమ్దులిల్లాహి నహ్మదుహూ వనస్తయీనుహు వనస్తగ్  ఫిరుహూ, వనవూజు బిల్లాహి మిన్ షురూరి అనుఫుసినా వమిన్ సయ్యిఆతి ఆమాలినా, మన్ యహ్ ది హిల్లాహు ఫలా ముజిల్ల లహూ, వమైఁ యుజి లిల్ ఫలా హాదియ లహూ వనష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ, వనష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ వబాద్. 

ముస్లిం సమాజంలోని ప్రతి వ్యక్తి దైవదౌత్యం సమాప్తం అయిందని విశ్వసిస్తాడు. ముహమ్మద్ ప్రవక్త ﷺ ను దైవప్రవక్త అని మరియు చివరి ప్రవక్త అని సంపూర్ణంగా విశ్వసిస్తేనే ఒక వ్యక్తి పూర్తి విశ్వాసి అవుతాడు. ఎందుకంటే అల్లాహ్ ఆయన ﷺ ద్వారానే దైవదౌత్య పరంపరను ముగించాడు. ఆయనే చిట్టచివరి ప్రవక్త. ఆయన తరువాత ఏ ప్రవక్తా రాడు. అల్లాహ్ ఇలా సెల విస్తున్నాడు: 

مَّا كَانَ مُحَمَّدٌ أَبَا أَحَدٍ مِّن رِّجَالِكُمْ وَلَٰكِن رَّسُولَ اللَّهِ وَخَاتَمَ النَّبِيِّينَ ۗ وَكَانَ اللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمًا
ముహమ్మద్ ﷺ మీ మగవారిలో ఎవరికీ తండ్రికాడు. అయితే ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు. ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసే (చివరి) వాడు”. (అహ్ జాబ్ 33 : 40) 

لو كان بعدى نبيا لكان عمر بن الخطاب 
ప్రవక్త ﷺ స్వయంగా ఇలా ప్రవచించారు: “నా తరువాత ఎవరయినా ప్రవక్త అయితే ఉమర్ (రదియల్లాహు అన్హు) అవుతారు”. (ముస్తద్రక్ అల్ హాకిమ్ : 3 – 29) 

ఆయన ﷺ విశ్వం మొత్తానికి ప్రవక్తగా చేసి పంపబడ్డారు. ప్రళయం వరకు ఆయనే ప్రవక్త. ఆయన తరువాత మరే ప్రవక్తా రావడానికి ఏ విధంగానూ అవకాశం లేదు. ఎందుకంటే సాధారణంగా ప్రవక్తల రాక మూడు కారణాలతో కూడుకుని ఉంటుంది. అవన్నీ ఆయన ﷺ తోనే నెరవేరాయి. 

1) ప్రవక్త ﷺ రాక ముందు వచ్చిన ప్రవక్తలందరూ ఓ నిర్ణీత ప్రాంతానికో, తెగ కోసమో వచ్చారు. వేరే ప్రాంతాల కోసం వేరే ప్రవక్త అవసరం ఉండేది. కాని ముహమ్మద్ ﷺ దైవదౌత్యం, ధర్మం విశ్వ లోకాల కోసం చేయబడింది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

وَمَا أَرْسَلْنَاكَ إِلَّا رَحْمَةً لِّلْعَالَمِينَ
“(ఓ ముహమ్మద్‌!) మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపాము” (అంబియా 21 : 107) 

మరో చోట ఇలా సెలవీయబడింది: 

وَمَا أَرْسَلْنَاكَ إِلَّا كَافَّةً لِّلنَّاسِ بَشِيرًا وَنَذِيرًا
“ఓ ప్రవక్తా, ముహమ్మద్! మేము నిన్ను ప్రజల కోసం శుభవార్తాహరునిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము.” (సబా 34 : 28) 

2) ముహమ్మద్ ﷺ రాక పూర్వం కొన్ని ధర్మాలు అసంపూర్ణంగా ఉండేవి. వాటిని సంపూర్ణం గావించడానికి ప్రవక్తలు వచ్చేవారు. కాని ప్రవక్త ﷺ ధర్మం సంపూర్ణం చేయబడింది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: 

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا
ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను”. (మాయిద 5 :3) 

3) ముహమ్మద్ ﷺ రాకపూర్వం ఏ ధర్మం వచ్చినా అది మార్పులకు గుర య్యేది. దానిని సరి చేయడానికి ప్రవక్తను పంపడం జరిగేది. కాని చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ ﷺ తీసుకొచ్చిన ధర్మ పరిరక్షణ బాధ్యతను అల్లాహ్ స్వయంగా తీసుకుంటూ ఇలా అన్నాడు: 

إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ
మేమే ఈ ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము”. (అల్ హిజ్ర్15:9) 

పైన పేర్కొన్న మూడు కారణాలను పరిశీలిస్తే దైవదౌత్య పరంపర కొనసాగే కారణాలేవీ ఇక మిగిలి లేవని అర్థం అవుతుంది. కనుక అల్లాహ్ మరో ప్రవక్తను పంపే అవకాశం లేనే లేదు. 

కాని ప్రవక్త ﷺ చెప్పిన భవిష్యవాణి ప్రకారం అబద్ధపు దైవదౌత్య ప్రకటన కర్తలు పుట్టుకొస్తారు. వారు తమను ప్రవక్తలుగా ప్రకటించుకుని తమ పరలోక జీవితాన్ని నాశనం చేసుకుంటారు. మహాప్రవక్త ﷺ ఇలా ప్రబోధించారు: 

لا تقوم الساعة حتى يبعث دجالون كذابون قريبا من ثلاثين كلهم  يزعم أنه رسول الله  
ప్రళయానికి పూర్వం చివరి కాలంలో సుమారు ముప్పై మంది అబద్ధపు దజ్జాల్ లు పుడతారు. వారు తమను దైవప్రవక్తలమని ప్రకటించుకుంటారు”. (సహీహ్ బుఖారీ) 

దైవదౌత్య చివరి కాలంలో ముసైలమ కజ్జాబ్, అస్వద్ అనసీ లాంటి వారు అబద్ధపు దైవదౌత్య ప్రకటనలు చేసి దుర్మరణం పాలయ్యారు. 

అలాంటి వారిలోని వాడే మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని. అతను భారత్-పాక్ విభజనకు ముందు సామ్రాజ్య శక్తుల నీడలో పాశ్చాత్తవాద గర్భం నుండి పుట్టుకొచ్చినవాడు. ఇస్లాంకు భిన్నంగా ఇతడు ఖాదినియాత్ పేరుతో వేరే కుంపటి పెట్టుకోవటానికి ప్రయత్నించాడు. ప్రవక్త ﷺ కు పోటీగా తనను ప్రవక్తగా ప్రకటించుకున్నాడు. ముహమ్మద్ ﷺ ధర్మానికి పోటీగా ముస్లిం సమాజ పరిసరాల్లో ఖాదియానియత్ పేరుతో ఒక మహావృక్షాన్ని పాతాడు. దాన్ని కూకటి వేళ్లతో పెకిలించడం కష్టతరమైపోతుంది. ఎందుకంటే ఆ మత ప్రచారకులు, గ్రామాలలో అమాయక ముస్లిములను వారి ధర్మం నుంచి దూరం చేసి తమ మతావలంబీకులను చేయడంలో తలమునకలై ఉన్నారు. మస్జిద్ లేని చోట మస్జిద్ పేరుతో తమ ఆరాధనాలయాలను నిర్మిస్తున్నారు. ఇమామ్ లు లేని చోట తమ వారిని పెట్టుకుంటున్నారు. ఇమామత్, ఖుత్బాత్ ల పేర వారు తమ మతాన్ని ప్రచారం చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. దీన్ని భారత దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ చూడొచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీరంలోని సుదూర ప్రాంతాలు ఒకింత ఎక్కువగానే దీనికి ప్రభావితమై ఉన్నాయి. 

భారత దేశం ప్రజాస్వామిక దేశం. ఇక్కడి పౌరులకు మత స్వేచ్ఛ ఉంది. వారు తమకు ఇష్టం వచ్చిన మతాన్ని అవలంబించచ్చు. ఇష్టంలేని మతాన్ని విడనాడవచ్చు. అదే విధంగా ఖాదియానీలకు తమ మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు వారికుంది. కాని విచారకర విషయం ఏమిటంటే వాళ్లు ప్రజలను మోసం చేసి ఇస్లాం ధర్మం పేరుతో తమ అసత్య విశ్వాసాలను ప్రచారం చేస్తున్నారు. 

అసలు ఖాదియానీ విశ్వాసాలు అతి బలహీనమైనవి. తమ దేవుడు మర్చి పోతాడని, పొరబాటు పడతాడని, నిద్రపోతాడని, సంభోగిస్తాడని ఇలా చిత్రవిచిత్ర విశ్వాసాలు కలిగినవారు ఖాదియానీలు. వారి ప్రవక్త గులాం అహ్మద్ ఖాదియాని. అల్లాహ్ గురించి అబద్ధాలు చెప్పటమే అతని ప్రవృత్తిలాగా అనిపిస్తుంది. ‘కితాబె ముబీన్’ పేరుతో అతనికి ఒక ప్రత్యేక పుస్తకం కూడా ఉంది. ఆ పుస్తకాన్ని అవతరింపజేసిన దైవదూత ఎవరనుకు న్నారు? గడ్డం గీసుకుని సూటుబూటులో ఉండే ఓ ఆంగ్లేయ యువకుడు. వారి పుణ్య క్షేత్రం ఖాదియాన్. అక్కడ వారి స్వర్గ శ్మశానవాటిక ఉంది. ఆ శ్మశాన వాటికలో ఖననమైనవారు కర్మల లెక్క, విచారణ ఏమీ లేకుండా నేరుగా స్వర్గానికి వెళతాడని ఖాదియానీల నమ్మకం. ఖచ్చితంగా ఆ స్వర్గం కూడా ఎలాంటి స్థలం అయి ఉంటుందంటే అందులోకి వెళ్ళినవాడు తిన్నగా నరకంలోకి పోయి పడతాడు. 

కాని తమ ఈ అసత్యపు విశ్వాసాలను ప్రచారం చేయడానికి అమాయక ముస్లిములను మోసం చేయడం, తమ మతాన్ని ఇస్లాం అని చెప్పి, తమ ఆరాధనాలయాలను మస్జిద్ లని చెప్పి ముస్లిముల ధర్మాన్ని, విశ్వాసాన్ని విక్రయించడం ఎంతటి హేయమయిన చర్యలు అంటే వాటిని ఒక సాధారణ ముస్లిం కూడా సహించలేడు. మీ చేతుల్లో ఉన్న ఈ చిరుపుస్తకం ఉద్దేశం అదే! ఖాదియానీల అసలు రూపాన్ని ముస్లిం ప్రజానీకం ముందు బట్టయలు చేయడం! 

ఈ పుస్తకంలోని ప్రతి విషయం ఆధారాలతో నిరూపించబడింది. వారి పుస్తకాల్లోని కొన్ని నమూనాల ఛాయాగ్రహణాలు (ఫోటోలు) తీసుకొని వాటిని పుస్తకం చివర్లో ఆధారాలుగా పేర్కొనడం జరిగింది. తద్వారా పాఠకులకు ఆధారాలు తెలియాలని, దృఢ సంకల్పంతో ఉన్న విషయాన్ని తెలియ పరచాలని, అంతేగాకుండా ఖాదియానియత్ వాస్తవాన్ని తెలుసుకుని దాని అపాయకర వలలో చిక్కుకోకుండా తమను, ఇంకా మొత్తం ముస్లిం సమాజాన్ని రక్షించాలని. 

ఈ పుస్తకాన్ని మూడు భాగాలుగా విభజించడం జరిగింది. 

1) మొదటి భాగంలో సందేశ ప్రచార (దావత్) రంగంలో నేరుగా ఖాదియానీలతో జరిగిన చర్చలు, సంభాషణలు, వాదోపవాదాలు పాఠకుల సౌలభ్యం నిమిత్తం పొందుపరచబడ్డాయి. ఆ అనుభవాల ద్వారా ఖాదియానిల సిద్ధాంతాలను అర్థం చేసుకోవటం తేలికవుతుంది. ఆ మతంలోని డొల్లతనాన్ని నలుగురి ముందు బట్టబయలు చేసి ఇతరులను దాని నుంచి రక్షించటానికి వీలవుతుంది. 

2) రెండో భాగం ఈ పుస్తకంలోని కీలకాంశం. అది నా డాక్టరేట్ థీసెస్ లోని ఒక భాగం. దాన్ని నేను సౌదీ అరేబియాలోని జామి అతుల్ ఇమామ్ లో సమర్పించి వున్నాను. మర్కజ్ దారుల్ బిర్ లో విద్యనభ్యసించి తర్వాత అక్కడే అధ్యాపక సేవలందిస్తున్న నా శిష్యురాళ్ళు దాన్ని తెలుగులోకి అనువదించడం కోసం ఎంతో కృషి చేశారు. తేట తెలుగు భాషలోకి దానిని అనువదించారు. అల్లాహ్ దయవల్ల వారు చేసిన కృషి వల్లనే నేను ఈ పుస్తకాన్ని రూపొందించగలిగాను. వారు చేసిన కృషికిగాను అల్లాహ్ వారికి గొప్ప ప్రతిఫలం ప్రసాదించుగాక! 

3) మూడో భాగంలో స్వయంగా ఖాదియానీల పుస్తకాల నుండి తీసుకున్న ఫోటోలను ఆధారాల క్రింద పొందుపరచడం జరిగింది. ఈ పుస్తకంలోని ప్రతి విషయం ఆధారాలతో నిరూపించబడింది. అందుకోసమే ఆధారాలు కూడా పాఠకుల చేతుల్లో ఉంటే మంచిదని భావించాను. అవసరమైన ఆధారాలు నాకు కువైట్లో లభ్యమయ్యాయి. వాటిని ఇవ్వడంలో కువైట్లో ఉండే మౌలానా ఆరిఫ్ జావెద్ గారు నాకు ఎంతో సహకరించారు. అల్లాహ్ ఆయనకు మంచి ప్రతిఫలం ప్రసాదించుగాక!

ఈ పుస్తకం అన్ని హంగులతో చివరి రూపం దాల్చినందుకు మొదట నేను అల్లాహ్ కు కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ తరువాత నా మిత్రుడు మౌల్వీ ఎస్.ఎమ్. రసూల్ షర్ఫీ హఫిజహుల్లాహ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన ఈ పుస్తకానికి మెరుగులు దిద్ది అమూల్యమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రియతమ మౌల్వీ అబ్దుష్షుకూర్ ఉమరి సల్లమహు గారు ఈ పుస్తకానికి ప్రూఫ్ రీడింగ్ బాధ్యతలు చేపట్టారు. ఎంతో క్షుణ్ణంగా దీన్ని చదివి తగిన సూచనలు చేశారు. లక్ష్మీనారాయణ గారు ఈ పుస్తకాన్ని కంపోజ్ చేశారు. అబ్దుల్ వకీల్ గారు ప్రింటు చేయించే బాధ్యత తీసుకున్నారు. ఇంకా దీన్ని పాఠకుల ముందుకు తీసుకురావటానికి ఎవరెవరయితే నాకు రవ్వంతయినా సహాయం చేశారో వారందరికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారి కోసం అల్లాహ్ ను ప్రార్థిస్తున్నాను. అల్లాహ్ వారికి ఇహపర లోకాలలో మంచి ప్రతిఫలం ప్రసాదించుగాక! 

– డాక్టర్ సయీద్ అహ్మద్ ఉమరీ, మదనీ 

[1] మొదటి అధ్యాయం : సంవాదనలు 

ఒకప్పుడు ఖాదియాని ప్రచారకులు పంజాబ్ నుండి బయలుదేరి దక్షిణ భారతదేశంలోని ధార్మిక జ్ఞానం బొత్తిగా ఉండని, మన ధార్మిక పండితులు చేరుకోవటానికి వీలుండని ఏదో మారుమూల ప్రదేశాన్ని, పల్లె ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని అక్కడి అమాయక ప్రజలను తమ కల్లబొల్లి మాటలతో వలలో వేసుకునేవారు. అయినప్పటికి అల్లాహ్ దయవల్ల ఎప్పుడైనా, ఎవరైనా ఇస్లాం దాయి ఆ ప్రాంత ప్రజల గురించి తెలిసి వారికి ఇస్లాం ధర్మ సత్యతను బోధిస్తే, దాంతో ఊరి ప్రజలకు సత్యం బోధపడేది. అప్పుడు ఊరి ప్రజలే ఆ ఖాదియానీ ప్రచారకుణ్ణి తమ ప్రాంతం నుంచి పారదోలేవారు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు కాలం మారింది. నేడు మన పిల్లలు, మన ప్రాంతం వారు స్వయంగా ఖాదియాన్ పట్టణమునకు వెళ్ళి అక్కడ విద్యను అభ్యసించి, శిక్షణను పొంది తిరిగి వచ్చి తమ తమ ప్రాంతాల్లోని మస్జిద్ లను ఆక్రమించేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో వారిని అక్కడి నుండి తొలగించటం చాలా పెద్ద సమస్యగా మారిపోతోంది. 

[1.1] ఒక ఖాదియాని ఇమామ్ తో  సౌమ్యంగా సంభాషణ 

ఇటీవలే జరిగిన ఒక సంఘటన: ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతంలో మేము ఒక ధర్మప్రచార (దావత్) పర్యటనలో ఉన్నాము. ఏలూరు నగరం నుండి బయలుదేరి జంగారెడ్డి గూడెం వైపు వెళుతున్న మేము మార్గానికి ఎడమ వైపున ఒక సుందరమైన చిన్న మస్జిద్ ను చూశాము. ఆ మస్జిద్ పేరు మస్జిద్- ఎ-నూర్. మా సహచరుల ద్వారా తెలిసింది, అది ఖాదియానీల మస్జిద్ అని. ఇది విన్న మేము మా వాహనాన్ని ఆ మస్జిద్ వైపునకు మరలించాము. అక్కడి వారిని ప్రశ్నించగా ఆ మస్జిద్ ఇమామ్ ఖాదియాన్ పట్టణంలో విద్యను అభ్యసించి వచ్చాడని తెలిసింది. కాసేపటికి సూటుబూటు వేసుకుని, తలమీద టోపీ ఏమీ లేకుండా చింపిరి గడ్డంతోవున్న 20 లేక 22 సంవత్సరాల ఒక కుర్రాడు వచ్చి తనను తాను పరిచయం చేసుకుంటూ ఇలా అన్నాడు: “నేను ఖాదియాన్ పట్టణంలో 7 సంవత్సరాల కోర్సు పూర్తి చేసి ఇప్పుడు (ఇక్కడ) ఈ మస్జిద్ ఇమామ్ గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను.” 

కుర్ర ఇమాము మాటలు విని నేను, “అలాగైతే మీరు ఇస్లాం గురించి చాలా విషయాలు తెలుసుకుని వుంటారు. నేను మీ నుండి ఇస్లాం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ విషయాలలో మీరు నాకు సహకరిస్తారా?” అని అడిగాను. అందుకు అతను చాలా సంతోషపడిపోయి ముందుకు వచ్చాడు. అప్పుడు మీ ఈ రచయితకు – ఆ ఖాదియానీకు మధ్య క్రింది విధంగా సంభాషణ మొదలైంది. 

మీ రచయిత: “ 7 సంవత్సరాల కోర్సులో మీకు అల్లాహ్ గురించి చాలా గొప్పగా చెప్పి వుంటారు. మరి మీరు చెప్పగలరా అల్లాహ్ ఎక్కడ వున్నాడో?” 

ఖాదియాని (తొందరపడుతూ): “అల్లాహ్ ప్రతి చోటా ఉంటాడు.” 

మీ రచయిత: “ప్రతిచోట…. అంటే మీ కాలి పాదానికి – మీరు తొడుక్కున్న బూటుకి మధ్యలో కొంత ఖాళీ చోటు ఉంది కదా! అందులో కూడానా?”

ఖాదియాని: “అయ్యయ్యో అలా ఎలా అవుతుందండి. అల్లాహ్ కాలి క్రింద ఎలా ఉంటాడు?” 

మీ రచయిత: “మీరే కదా అన్నారు ‘ప్రతి చోటా’ అని. మరి కాలి క్రింద చోటులేదా? అది చోటు కాదా?” 

ఖాదియాని: “మీరు అసలు అల్లాహ్ ను అంత సులువుగా గుర్తించలేరు. అల్లాహ్ ను గుర్తించటం చాలా కష్టం.” 
మీ రచయిత: “అలా అయితే మీరే చెప్పండి అల్లాహ్ ను ఎలా గుర్తించాలో?” 

ఖాదియాని: “ఇప్పుడు చూడండి. పాలున్నాయి. మేము పాలతో పెరుగు చేస్తాము పెరుగుతో మజ్జిగ చేస్తాము, మజ్జిగతో వెన్న తీస్తాము, ఆ వెన్నను కరిగించి నెయ్యి చేస్తాము. అలాగే అల్లాహ్ ను కూడా గుర్తించాలి.” 

మీ రచయిత: “అలా అయితే మీరు చెబుతున్న దేవుణ్ణి గుర్తించటం. చాలా కష్టమేనండి బాబూ! కాని మా నిజఆరాధ్య దైవం అల్లాహ్. ఆయనను గుర్తించటం అస్సలు కష్టం కాదు తెలుసా?” 

ఖాదియాని: “అవునా. సరే మీరే చెప్పండి. అల్లాహ్ ఎక్కడ వున్నాడో? 

మీ రచయిత:“దివ్యఖుర్ఆన్ ఇలా ఉంది: 

الرحمن على العرش استوی (سوره طه (۵) 
కరుణామయుడైన అల్లాహ్ ఏడు ఆకాశాలపై మహోన్నతమైన అర్ష్ (సింహాసనం) మీద ఆసీనుడై వున్నాడు. (సూరా తాహా:5) 

ప్రియ ప్రవక్త ﷺ ఒకసారి ఒక బానిసరాలి విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఇదే ప్రశ్న అడిగారు. అప్పుడు ఆమె “అల్లాహ్ ఏడు ఆకాశాల పై మహోన్నతమైన అర్ష్ (సింహాసనం) మీద ఆసీనుడై వున్నాడు” అని కరెక్టు సమాధానం ఇచ్చింది. (సుననె అబూదావూద్, 1:305) ఇంత సులువైన విషయం మీ కోర్సులో నేర్పబడలేదా?” 

ఖాదియాని: “మీ వల్ల మాకు మంచి విషయాలు తెలిశాయి. తమరికి ధన్య వాదాలు.” 

మీ రచయిత: “మీ మహా గురువు మీర్జా గులామ్ అహ్మద్ ఖాదియాని గురించి మీ మత విశ్వాసం ఏమిటి?” 

ఖాదియాని: “ఆయన మహ్దీ (అలైహిస్సలామ్)!” 

మీ రచయిత: “మహ్దీ గారి గురించి మేము హదీసుల్లో చదివిన దానిని బట్టి ఆ మహాత్ముని కాలంలోనే దజ్జాల్ వస్తాడు. ఈసా ప్రవక్త ఆకాశం నుండి భూమిపైకి దింపబడతారు.” 

ఖాదియాని: “అరె! దజ్జాల్ ఎందుకు రాలేదు? వచ్చేశాడు కదా! అదే అమెరికా, దజ్జాల్ వచ్చేశాడు కదా! అదేనండి అమెరికా రూపంలో! 

మీ రచయిత: “మహ్ దీ కాలంలోనే ఈసా ప్రవక్త ఆకాశం నుండి దిగి దజ్జాల్ ను సంహరిస్తారని కూడా హదీసుల్లో మేము చదివాము. మీరు చెబుతున్నది చాలా విడ్డూరంగా ఉంది. మీ మహ్దీ గారు లోకాన్ని విడిచి కాల గర్భంలో కలిసి పోయారు. మీరు అనుకుంటున్న దజ్జాలు మాత్రం భూమిని దర్జాగా ఏలు తున్నాడు. ఇక మీ ఈసా (యేసు) విషయానికొస్తే ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు.. 

ఖాదియాని: “(తడబడిపోతూ అన్నాడు): ఇదిగో చూడండి. మేము అర్థం చేసుకున్న ఇస్లాం వేరు. మీరు చెబుతున్న ఇస్లాం వేరు. అందుకని, మేము అర్థం చేసుకున్న ఇస్లాంపైనే మేము మరణించే వరకు వుంటాము. మీ ఇస్లాం మీకు మా ఇస్లాం మాకు.” 

మీ రచయిత: అలాగైతే మన ఈ సంభాషణను బట్టి మీ మతం వేరని, మా మతం వేరని, మా అల్లాహ్ వేరని, మీ ఆరాధ్య దైవం వేరని, మీ మహ్దీ వేరని, మా ప్రవక్తలు వేరని, మీరు ఖాదియాని మతస్తు లని, మా ధర్మం ఇస్లాం అని స్పష్టంగా అర్థమవుతోంది. కనుక మేము మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాము. మిమ్మల్ని మీరు ఇతరుల ముందు ముస్లింలుగా పరిచయం చేసుకొని ప్రజలకు మోసం చేయకండి. 

ఖాదియాని: మా వరకు మేముంటామండి. మీరు వేరే ఎక్కడికైనా వెళ్ళి మీ పని చూసుకోండి. మీ హితబోధ మాకు అక్కరలేదు. 

[1.2] ఒక ఖాదియానీ ప్రెసిడెంట్ అమాయకపు సంభాషణ 

పై సంభాషణ తర్వాత మేము మా ప్రయాణం కొనసాగించాము. రావికం పాడు అనే ఒక గ్రామంలో ఖాదియానీలు ఉండే ఇంకో మస్జిద్ ను చూశాము. అక్కడివారిని అడిగితే తెలిసింది ఏమిటంటే, ఆ మస్జిద్ ప్రెసిడెంట్ ఖాదియాన్ వెళ్ళి హజ్ చేసివచ్చాడు.

మస్జిద్ తెరిచే ఉంది. ప్రెసిడెంటుగారు మస్జిద్ లో నే ఉన్నారు. ఆయన్ను కలిసి, “మీరు ఇస్లాం ధర్మం వదిలి ఖాదియాని మతాన్ని ఎందుకు అవలంబించారు?” అని అడిగాము. ఆయన కాసేపు మాతో వాదులాడాడు. చివరికి ఇలా మాకు అసలు తేడా ఏముందండీ! ఇదిగో… ఇది మా నమాజ్ కు సంబంధించిన పుస్తకం అన్నాడు: “మీకు, ఇందులో ఏమైనా తప్పులుంటే చూపించండి?” 

నిజంగా ఆ పుస్తకాన్ని చూసినప్పుడు చాలా వరకు అందులో సున్నత్ ప్రకారమే నమాజ్ పద్ధతి వివరించబడి ఉంది. పెద్దగా అభ్యంతరకర విషయాలు ఏవీ అందులో లేవు. అప్పుడు నేనన్నాను, “సరేగాని చిట్టచివరి ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం తర్వాత కూడా ఒక ప్రవక్త వచ్చాడని ఖాదియానీలు చెబుతారు – మీ విశ్వాసం కూడా అదేనా?” 

ఆ ప్రెసిడెంటు ఎంతో అమాయకంగా జవాబు ఇచ్చాడు. “అయ్యా! ఒక క్రొత్త ప్రవక్త వచ్చినంత మాత్రాన ఏం మునిగిపోతుంది, మంచే జరుగుతుంది కదా! సమాజాన్ని మరింతగా సంస్కరించటానికి వీలవుతుంది. ఇంకో ప్రవక్త వస్తే మీకు ఈర్ష్య ఎందుకండయ్యా?” 

మీ రచయిత: “అల్లాహ్ క్షమించాలి (అస్తగ్ ఫిరు ల్లాహ్)! ప్రజలు ఇంత అజ్ఞానంలో ఉన్నా మనం పట్టించుకోవటం లేదంటే… ఈ పరిస్థితి చాలా బాధాకరం.” 

మేము వారికి సత్యం బోధించే ప్రయత్నం చేశాము. కాని వారు వినలేదు. మా ప్రయాణం ముందుకుసాగింది. “ఈ ప్రజలకు ఎలా బోధించాలి? లోకంలో దైవప్రవక్తల పరంపర ముగిసింది అని వారికి తెలియజేసేది ఎలా? వారిని ఈ ఖాదియాని భ్రష్టత్వం నుండి బయటకు తీసేదెలా?” అని నేను ఆలోచిస్తూ ఉండిపోయాను. 

అమాయకులైన ఈ ప్రజలు ఖాదియానియత్ సత్యమైన మతం అని నమ్మటానికి గల కారణాలు కూడా చాలా విచిత్రమైనవి. చాలా వరకు ప్రజలు ఈ మతాన్ని స్వీకరించడానికి కారణం: (1) ఖాదియానీలు వీరికోసం మస్జిద్ లు కట్టించి ఇస్తారు, (2) ఒకవేళ ఏదైనా మస్జిదులో ఇమాము లేకపోతే ఆ ఏర్పాటు కూడా వారే చేస్తారు. (3) వారి పిల్లలకు ఉర్దూ వ్రాయటం, చదవటం మరియు (4) ఖుర్ఆన్ పారాయణం నేర్పిస్తారు. 

క్లుప్తంగా చెప్పుకోవాలంటే, నిజధర్మమైన ఇస్లాం మతం పేరు చెప్పి ఖాదియానీలు తమ సిద్ధాంతాలను ప్రజలకు నేర్పుతున్నారు. సామాన్య ప్రజలు వారు చేస్తున్నది ఇస్లాం మత బోధనే అనుకుని మోసపోతున్నారు. ఆ విధంగా ఇస్లాం వ్యతిరేక ఖాదియానీ విశ్వాసాలు ఆ అమాయక ప్రజల్లో బలంగా నాటుకుంటున్నాయి. “వారు మాకోసం మస్జిద్ కట్టించి ఇచ్చారు. ఒక ఇమామును కూడా ఏర్పాటు చేశారు. మాకు ఇంకా ఏం కావాలి?” అని అనుకుంటున్నారు. 

ఎంత దౌర్భాగ్యమో చూడండి! మన ముస్లిం సమాజం నిర్లక్ష్య నిద్ర నుంచి ఎప్పుడు మేల్కొంటుంది? ఈ అమాయక ప్రజలను ఖాదియానీ కుట్రల నుంచి మనం ఎప్పుడు రక్షిస్తాం? ధర్మప్రచార, సంక్షేమ కార్యక్రమాలు మనం ఇంకా ఎప్పుడు ఆరంభిస్తాం? 

ఈ విధంగా ఆలోచిస్తూ మా ప్రయాణ బృందం ముందుకు సాగింది. నిజంగా ఈ దావత్ పర్యటనలో ఎన్నో వాస్తవాలు మా ముందుకు వచ్చాయి. వాటిలో ఇది కూడా ఒకటి: ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా లోనే దాదాపు 12 ఖాదియానీల మస్జిద్ లు నిర్మించబడ్డాయి. వెయ్యికి పైగా అక్కడి ప్రజలు ఖాదియాన్ వెళ్ళి హజ్ చేసి వచ్చారు. 200 మంది పిల్లలు విద్య నేర్చుకోవటం కోసం ఖాదియాన్ వెళ్ళివున్నారు. కొందరు ఒక సంవత్సరం కోర్సులో, మరికొందరు రెండు సంవత్సరాల కోర్సులో, ఇంకొందరు మూడు సంవత్సరాల కోర్సులో, ఇంకా కొందరు ఏడు సంవత్సరాల కోర్సులో ఇలా ఆ పిల్లలు ఖాదియానీ విద్యాభ్యాసం చేస్తున్నారు. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఈ సైన్యం తమ గ్రామాల్లోకి అడుగుపెడితే అప్పుడు పరిస్థితి ఏమిటి? ప్రమాదాలైతే చాలానే పొంచి వున్నాయి. అయితే ఈ పరిస్థితిని మార్చటం అసాధ్యమని కూడా మేము నిరాశకూ లోనుకావటం లేదు. ఎందుకంటే, నిరాశ అవిశ్వాసంతో సమానం! 

[1.3] పశ్చిమ గోదావరిలో ఖాదియానీల కేంద్రం 

దేవరపల్లి గ్రామంలో ఖాదియానీల కేంద్రము ఉన్నదని ప్రయాణం మధ్యలో మాకు తెలిసింది. మేము గ్రహించింది ఏమిటంటే, బాహ్యప్రపంచానికి దూరంగా అక్కడ ఒక చిన్న పల్లెటూరు ఉంది. ఆ గ్రామంలో మస్జిదులాంటి ఒక చిన్న భవనము ఉంది. అందులో ఒక పెద్ద టీ.వి. ఉంది. ఆ భవనంపై ఒక పెద్ద డిష్ యాంటినా అమర్చబడి ఉన్నది. లండన్ నుండి నేరుగా ఇక్కడికి ఖాదియాని ప్రోగ్రాములు ప్రసారం చేయబడతాయి. ఖాదియానీ మత ప్రచార కులకు జీతాలు పంపిణీ అయ్యేది, ఖాదియాని క్రిములు సమాజంలోకి వ్యాపించేది ఈ కేంద్రం నుంచే. 

[1.4] ఖాదియానియత్ ఇస్లాం కాదని, దానికి ఇస్లాంతో ఎలాంటి సంబంధం లేదని నిరూపించే రెండు గట్టి ఆధారాలు 

ఖాదియానియత్ ఇస్లాం కాదు, అది ఇస్లాంకు విరుద్ధమైన మతం. ఈ విషయాన్ని నిరూపించే గట్టి ఆధారం మాకు ఆ గ్రామంలోనే లభించింది. గ్రామ ప్రజలలో ఇద్దరు వ్యక్తులు ఖాదియానియత్ మతాన్ని అవలంబించి తర్వాత కొన్నాళ్ళకు పశ్చాత్తాపంతో మళ్ళీ ముస్లిములయ్యారు. అసలు ఆ ఇద్దరు ఖాదియాని మతం ఎందుకు అవలంబించారు? మరలా ఏ విధంగా వారికి దాని నుండి విముక్తి లభించింది? అన్నది నేను తెలుసుకోదలచాను. 

ఈ ఇద్దరు అదృష్టవంతులలో ఒకరు ఆర్.యం.పి. డాక్టరు. మేము ఆయన ఇంటికి వెళ్ళి, ఆయనను కలిసి విచారించాము, “ఏవండీ! మీరు ముందు ఖాదియానిగా ఎందుకు మారారు? మారడానికి అసలు కారణం ఏమిటి? ఆ తర్వాత ఆ మతాన్ని ఎందుకు వదిలేసారు?” 

ఆర్.ఎం.పి. డాక్టరు గారు ఇలా చెప్పుకొచ్చారు: అయ్యా! మొదట్లో నాకు ఖాదియానియత్ పేరుతో ఒక ప్రత్యేక మతముందని కూడా తెలియదు. ముస్లిం ధార్మిక బృందాలు ఇక్కడకు వస్తుంటాయి. ఈ ఖాదియానియత్ కూడా అలాంటి ఒక బృందమే అనుకుని వాళ్ళతో నేను కలసి పోయాను. ఆ తర్వాత వాళ్లు నాకు ఇలా ప్రబోధించారు: “లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మద్ రసూలుల్లాహ్” (అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త) అని కలిమా పఠించినప్పుడు నీవు దృష్టిలో పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, ‘ముహమ్మద్’ అంటే మరెవరో కాదు, మహాగురువులు (ఆలా హజ్రత్), వాగ్దానం చేయబడిన మెస్సయ్య (మసీహె మౌవూద్), మహ్దీ గారే. ఎందు కంటే ఈ యుగంలో ఆ పేర్లతోనే ముహమ్మద్ ﷺ మళ్ళీ రెండవసారి అవతరించారు. అంటే ముహమ్మద్ ﷺ ఆలా హజ్రత్ గారి రూపంలో మళ్ళీ ఈ లోకంలో అవతరించారన్నమాట.” 

ఈ మాటలు చెప్పి డాక్టరు గారు మాకు ఒక చార్టు చూపించారు. ప్రతి ఖాదియాని ఇంట్లోనూ అది వేలాడబడి ఉంటుంది. ఆ చార్టులో మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియాని ఫోటో ఉంది. దాని క్రింద సూరతుల్ జుముఆ లోని ఒక ఆయతు “వ ఆఖరీన మిన్ హమ్ లమ్మా యల్ హఖూ  బిహిమ్” లిఖించబడి వుంది. తర్వాత వచ్చే తరాలవారి కోసం కూడా ముహమ్మద్ ﷺ ప్రవక్తగా పంపించబడ్డారు అని మాటకు అర్థం. అయితే మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ ఒక దైవప్రవక్త అని నిరూపించటం ఆ లేఖనం ఉద్దేశం. ఈ కాలంలో ముహమ్మద్ ﷺ ‘మహాగురువు’ (ఆలా హజ్రత్), మసీహె మౌవూద్, మహ్దీ గారైన మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ రూపంలో అవతరించారన్నది ఆ చార్ట్ అంతరార్థం. ఖాదియానియత్ అసత్య మతం అని చెప్పే సంఘటన ఇది. 

ఇక ఖాదియానియత్ అబద్ధపు మతం అని నిరూపించడానికి డాక్టరు గారు చూపెట్టిన రెండవ ఆధారం, వారి మహాగురువు (ఆలా హజ్రత్) గులామ్ అహ్మద్ ఖాదియాని హిందువుల కొరకు కృష్ణావతారం ఎత్తి వచ్చారన్న ఖాదియా నీల విశ్వాసం. అందువల్లనే విగ్రహాల పూజకు కూడా ఈ మతంలో అనుమతి ఉంది. 

ఈ మాట చెప్పి డాక్టరు గారు మాకు ఒక ఫోల్డర్ చూపించారు. మీర్జా గులామ్ అహ్మద్ ఖాదియాని వెలిబుచ్చిన ఆ ఇస్లాం విరుద్ధ అపనమ్మకం అందులో అత్యంత స్పష్టంగా రాయబడి ఉంది. 

[1.5] ఖాదియానీలతో నిర్మొహమాటంగా సంవాదం 

నేను వాదనలు జరిపేవాణ్ణి (మునాజిర్ని) కాను. స్వభావ రీత్యా కూడా అసలు నేను వాదనల్ని ఇష్టపడను. ఎందుకంటే మొదటి నుంచి ‘వాదన’ దావత్ విధానంలో లేదు. అల్లాహ్ దివ్యగ్రంథంలో మౌలికంగా దావత్ కు రెండే రెండు పద్ధతులు తెలుపుతున్నాడు. 

1) విజ్ఞతా వివేచనంతో సంభాషించటం 

2) మంచి హిత బోధ. 

అల్లాహ్ దివ్యఖుర్ఆన్ ఈ విధంగా అన్నాడు: 

ادْعُ إِلَىٰ سَبِيلِ رَبِّكَ بِالْحِكْمَةِ وَالْمَوْعِظَةِ الْحَسَنَةِ ۖ وَجَادِلْهُم بِالَّتِي هِيَ أَحْسَنُ


నీ ప్రభువు మార్గం వైపు జనులను వివేకంతోనూ, చక్కని ఉపదేశంతోనూ పిలువు. అత్యుత్తమ రీతిలో వారితో సంభాషణ జరుపు.” (ఖుర్ఆన్ 16:125) 

ఇంకో విషయం ఏమిటంటే, వాదనలో గెలుపొందినంత మాత్రాన వారు సత్యంపై ఉన్నట్లు కాదు. ఇమామ్ షాఫయీ (రహిమహుల్లాహ్) ఏమన్నారో తెలుసా? గెలిచిన ప్రతివాడు సత్యంపై ఉన్నట్లు కాదు. ఒక వ్యక్తి అసత్యంపై ఉండి కూడా తన వాక్చాతుర్యంతో సత్యవంతులపై గెలుపొందగలడు. 

కాని ఒక ఖాదియాని ప్రచారకుని తుంటరితనం మూలంగా నేను సంవా దానికి సిద్ధం కావలసి వచ్చింది. గుంటూరు జిల్లాలో నగరానికి కొద్ది దూరంలో “ఎల్దేవరపాడు” అనే గ్రామం ఉంది. అక్కడ అహ్లె హదీసు మస్జిద్ ఒకటి నిర్మించబడింది. మన సమాజ నిర్లక్ష్యం కారణంగా ఒక ఖాదియాని ప్రచారకుడు రమజాన్ నెలలో అందులో తరావీహ్ నమాజ్ చేయించాడు. ఆ తర్వాత తన మదర్సా ఒకటి తెరిచి క్రమంగా మస్జిదును ఆక్రమించుకున్నాడు. అతని బోధనల ద్వారా అతను ఖాదియానీ అన్న సంగతి తెలిసొచ్చింది. అప్పుడు మన సత్య ప్రచారకుల (దాయీల) బృందం ఒకటి అక్కడికి చేరుకుంది. కాని వారు అతన్ని అక్కడ నుండి పంపివేయటానికి తీవ్రంగా ప్రయత్నించారు. కాని సఫలం కాలేకపోయారు. ఇంకో సమూహం కూడా అలాగే ప్రయత్నించింది. కాని ఆ  ఖాదియాని నానా హంగామా చేశాడు. నేను కూడా మీలాగా ముస్లిమునే? నన్ను మస్జిద్ నుండి ఎందుకు తొలగించాలనుకుంటున్నారు? అనటం మొదలు పెట్టాడు. “నువ్వు ముస్లింవి కావు. ఖాదియానీవి” అన్నారు మన దాయీలు. అప్పుడు ఆ ఖాదియాని ఛాలెంజ్ చేస్తూ, “మీరు నన్ను ముస్లిం కానని నిరూపించండి. ఇక్కడ నుండి వెళ్ళిపోతాను” అన్నాడు. 

విషయం ఇంత దాకా వచ్చిన తర్వాత మన దాయీలు నాకు కబురు పెట్టారు. చాలా దూరం ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాను. అక్కడ వివాద వాతావరణం నెలకొని ఉంది. తరతమ భేదం లేకుండా గ్రామ ప్రజలందరు పోగయ్యారు. పోలీసు బందోబస్తు కూడా ఉంది. ఖాదియానీల తరఫున వాదించటానికి వారి అతిపెద్ద నాయకుడు, ఆ ప్రాంతపు ప్రెసిడెంటు సలీం ‘ అనే వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు. 

వాదనా విధానం నిర్ణయించబడింది. ఇరువైపుల నుంచి వాదించేవారు ఖరారు చేయబడ్డారు. ముస్లింల తరఫున వాదించటానికి డా. సయీద్ అహ్మద్ ఉమరీ, మదనీ అనగా మీ ఈ రచయిత ముందుకు వచ్చాడు. ఖాదియానీల తరఫున వాదించే అతను సలీం. ఈ వాదన అంతా తెలుగు భాషలోనే నడుస్తుందని చెప్పుకోవటం జరిగింది. వాదనను సౌమ్యమైన సంభాషణగా మార్చేందుకు నేను శతవిధాలా ప్రయత్నించాను. కాని ప్రత్యర్థి అసలు మా మాట వింటే కదా! దైవప్రవక్త యేసు ﷺ ఆకాశానికి ఎత్తుకోబడ్డారా? లేక సహజ మరణానికి గురయ్యారా? అని తన తరపున కొత్త వాదన లేవనెత్తాడు. 

ఈ విషయంలో ఖాదియానీల విశ్వాసం ఏమిటంటే, మెస్సయ్య (యేసు అలైహిస్సలామ్) సహజ మరణానికి గురయ్యారు. అయితే ఆయన ఇస్రాయీల్ జాతి మెస్సయ్య. ఇక మర్యమ్ కుమారుడైన మెస్సయ్య మరెవరో కాదు, స్వయానా వారి ప్రవక్త అయిన మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీయే. ప్రవక్త యేసు (అలైహిస్సలాం) ను ఆకాశానికి ఎత్తుకున్న విషయంపై కొందరు ముస్లిం పండితులకు కూడా నమ్మకం లేకపోవటం దురదృష్టకరం. మర్యమ్ కుమారుడైన యేసు సహజ మరణానికి గురయ్యారని వారంటారు. ఉదాహరణకు ఇమామ్ రాజీ తన “తఫ్సీరె కబీర్”లో ఈసాను ఆకాశానికి ఎత్తుకోబడిన విషయాన్ని తిరస్కరించారు. వాస్తవం ఏమిటంటే, ఆయనకు అసలు “అల్లాహ్ పైన ఆకాశాలపై ఉన్నాడు” అన్న ఇస్లామీయ నమ్మకంతోనే విభేదం ఉంది. ఒకవేళ ఈసా (అలైహిస్సలాం)ను అల్లాహ్ ఆకాశాల పైకి ఎత్తుకున్నాడు అనే విషయాన్ని నమ్మితే, అప్పుడు ఆయన అల్లాహ్ ఏడు ఆకాశాలపై ఉంటాడని నమ్మవలసి వస్తుంది. అది తాను కల్పించుకున్న సిద్ధాంతానికి విరుద్ధంగా పోతోంది. కాబట్టి ఆయన యేసు (అలైహిస్సలామ్)ను ఆకాశానికి ఎత్తుకోబడినట్లు ఖుర్ఆన్ చెబుతున్న వాస్తవాన్ని తిరస్కరించేశారు. 

యేసు (అలైహిస్సలామ్) ను అల్లాహ్ పైకి లేపుకున్నాడనే మాటని సర్ సయ్యద్ ఖాన్ కూడా తిరస్కరించారు. ఎందుకంటే సర్ సయ్యద్ ఖాన్ మొదటి నుంచి మహత్యాలను, అద్భుతాలను (మోజిజాత్ లను) నమ్మేవారు కాదు. అదే విధంగా గులామ్ అహ్మద్ ఖాదియాని కూడా అల్లాహ్ యేసును పైకి లేపుకున్నా డనే విషయాన్ని తిరస్కరించాడు. ఎందుకంటే ఆ “మసీహ్ మౌవూద్” తానే అవ్వాలని ఆయనకు ఆశ ఉండేది. ఈ విషయాలన్నీ నాకు తెలుసు. అయినా నేను ఈ విషయంపై మాట్లాడటానికి పూర్తిగా నిరాకరించాను. “ఖాదియానీలు ముస్లింలు కారు” అన్న విషయం గురించి మాట్లాడటానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. కనుక మన సంభాషణ దీనిపైనే జరగాలని నేను ఖచ్చితంగా చెప్పేశాను. అక్కడ ఎక్కువ మందికి నా అభిప్రాయం నచ్చింది. “ఖాదియానీలు ముస్లింలు కారు” అన్న విషయం గురించే మాట్లాడాలని గట్టిగా చెప్పటంతో ప్రత్యర్ధులు ఒప్పుకోక తప్పలేదు. అప్పుడు మా ఇద్దరి మధ్య జరిగిన వాదన తీరు ఇది: 

మీ రచయిత: సలీమ్ భాయ్! మనం స్నేహపూర్వకంగా మాట్లాడుకుందాం. 

మీరు ముస్లిమా కాదా అన్న విషయం మాత్రమే మేము తెలుసుకో వాలనుకుంటున్నాము. కనుక విరుచుకుపడి మాట్లాడుకోవలసిన అగత్యం మనకు లేదు. దైవప్రవక్త ముహమ్మద్ ﷺ తన దగ్గరకు వచ్చే వ్యక్తి ముస్లిమా కాదా అని నిర్థారించుకోవటానికి రెండే రెండు ప్రశ్నలు వేసేవారు. అవే రెండు చిన్న చిన్న ప్రశ్నలు నేను మిమ్మల్ని అడుగుతాను. ఒకవేళ మీరు సమాధానం ఇస్తే మీరు మా ముస్లిం సోదరులవుతారు. జవాబు ఇవ్వలేకపోతే మీ మతం ఇస్లాం కాదు, మీరందరు ఈ మస్జిద్ని వదిలేయాలి

ఖాదియాని: ఈసా (అలైహిస్సలాం)ను అల్లాహ్ ఆకాశంపైకి లేపుకున్న విషయం గురించి మాట్లాడుకుంటే మంచిది. 

మీ రచయిత: చూడు తమ్ముడూ! ఖాదియానీలు ముస్లింలు కారు అని నిరూపించటానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. కనుక ఆ విషయంపైనే మనం మాట్లాడుకుందాం. 

ఖాదియాని: సరే, మీ మొదటి ప్రశ్న అడగండి. 

మీ రచయిత అడిగిన మొదటి ప్రశ్న: “అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు?” 

ఖాదియాని: అల్లాహ్ ఎక్కడ ఉన్నాడని అడుగుతారేంటి? అల్లాహ్ అంటే ఏదైనా కనపడే వస్తువా? “అల్లాహ్ భూమ్యాకాశాల జ్యోతి” (నూరుస్సమావాతి వల్ అర్ద్). అలాంటప్పుడు అల్లాహ్ ఫలానా చోట ఉన్నాడని ఎలా చెప్పగలను? 

మీ రచయిత: ఇది ఇస్లాంలో మొట్టమొదటి పాఠం. దైవప్రవక్త ﷺ  కాలంలో ఆయన దగ్గరకు ఒక బానిసరాలిని తీసుకురావటం జరిగింది. ఆమె ముస్లిమా? కాదా? అని నిర్ధారించుకోవటానికి దైవప్రవక్త ﷺ ఆమెకు ఇదే ప్రశ్న వేశారు. ఆ బానిసరాలు వెంటనే సమాధానం ఇచ్చింది. అలాగే మీరు కూడా ముస్లిం అయితే ఇస్లాంలోని ఈ మొదటి పాఠం మీకు గుర్తుండేది. కాని మీరు ముస్లిం కాదు. అందుకే చెప్పలేకపోయారు. 

ఖాదియాని: అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నకు సమాధానం ఎవరూ చెప్పరు, చెప్పలేరు కూడా. 

మీ రచయిత: మీరు అలా అనకండి, ఇక్కడ నా పక్కన ఈ మధ్యనే ఇస్లాం స్వీకరించిన అబ్దుల్లాహ్ అనే యువకుడు ఉన్నాడు. ఇతను ఇస్లాం స్వీకరించి 3 నెలలు కూడా పూర్తి కాలేదు. అయినా అల్లాహ్ ఎక్కడున్నాడో అబ్దుల్లాహ్ చెప్పగలడు. అబ్దుల్లాహ్! అల్లాహ్ ఎక్కడున్నాడో చెప్పగలవా? (అని అబ్దుల్లాహ్ ను అడగటం జరిగింది). వెంటనే అబ్దుల్లాహ్ లేచి తన మాతృభాష తెలుగులోనే సమాధానం ఇచ్చాడు, “అల్లాహ్ ఏడు ఆకాశాలపైన మహోన్నత అర్ష్ పై ఉన్నాడు”. 

ప్రత్యర్థి మొదటి ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక పోయినట్లు పాయింటు రాసుకోమని మధ్యవర్తిని ఉద్దేశించి చెప్పటం జరిగింది. 

ఇక రెండో ప్రశ్న:-

మీ రచయిత: నా రెండో ప్రశ్న దైవదౌత్యానికి సంబంధించినది. అయ్యా! మీరు దైవదౌత్యం (నబువ్వత్, రిసాలత్) గురించి వివరించండి. అలాగే మీ మీర్జా గులామ్ అహ్మద్ ఖాదియాని ఎలాంటి ప్రవక్త అన్నది కూడా చెప్పండి. 

ఖాదియాని: దైవదౌత్యం (రిసాలత్, నబువ్వత్) వివరణ ఏమిటో నాకు తెలియదు. కాని మీర్జా గులామ్ అహ్మద్ ఖాదియాని మసీహే మౌవూద్ (తిరిగి వస్తారని చెప్పబడిన యేసు ప్రవక్త), ఇంకా ఆయన మహ్ దియే మాహూద్ (వాగ్దానం చేయబడిన మహ్దీ). ఆయన దైవసందేశహరులు (రసూల్), దైవ ప్రవక్త (నబీ) అయితే కారు. 

మీ రచయిత: మీర్జా గులామ్ అహ్మద్ ఖాదియాని తాను దైవప్రవక్తనని ప్రకటిం చుకున్నారు. అంతేకాదు, తాను వ్రాసిన పుస్తకంలో ఆయన తాను ఒక దైవసందేశహరుణ్ణి, దైవప్రవక్తను మాత్రమే కాదు, హిందువుల కోసం తాను శ్రీకృష్ణ అవతారాన్ని అని కూడా చెప్పుకున్నారు. ఈ విషయాన్ని నేను నిరూపించినా కూడా మీరు ఆయన్ని నమ్ముతారా? 

ఖాదియాని: గురువర్యులు మిర్జా మహ్దీమాత్రమే. అంతకు మించి ఆయన మరేమీ కారు. 

మీ రచయిత: ఆ సమయంలో నేను ఒక వ్రాత పత్రము అతని ముందుంచాను. నేను ఒక విజ్ఞాన పర్యటనలో వున్నప్పుడు లండన్లోని బ్రిటిష్ లైబ్రరీ నుండి దాని నకలును సంపాదించాను. అది స్వయానా మీర్జా గులామ్ అహ్మద్ ఖాదియాని తన ప్రెస్ లో ముద్రింప జేసింది. ఆ పత్రం చదివి వినిపించబడింది. తెలుగు భాషలో దాని అర్థం కూడా వివరించటం జరిగింది. అది విన్న తర్వాత ఖాదియానీ ముఖకవళికలు ఒక్కసారిగా మారిపోయాయి. 

ఆ పత్రిక సారాంశం ఏమిటంటే, మీర్జా గులామ్ అహ్మద్ ఖాదియాని తాను ముస్లిముల కొరకు ముహమ్మద్ యొక్క మరో అవతారమనీ, క్రైస్తవుల కొరకు మర్యమ్ కుమారుడు ఈసా (యేసు అలైహిస్సలామ్) అవతారమని, ఇక హిందువుల కొరకు తాను కృష్ణుడి అవతారంగా పంపించబడిన వాడినని బహిరంగంగా ప్రకటించుకున్నాడు. 

వ్యవహారం కృష్ణుడి అవతారం వరకు వెళ్ళింది కనుక నేను అక్కడున్న వారిని ఉద్దేశించి, “కృష్ణుడు ఎవరండీ?!” అని అడిగాను. అక్కడున్న వారంతా ముక్తకంఠంతో, “కృష్ణుడు హిందువుల దేవుడు” అని సమాధానం ఇచ్చారు. “మరి తనను తాను కృష్ణుడిని అని చెప్పుకునేవాడు ఏ మతానికి చెందిన వాడవుతాడు?” అని నేను అడిగాను. “హిందువు అవుతాడ”ని అందరూ అన్నారు. 

“ఇటువంటి ప్రకటన చేసిన వ్యక్తిని ‘ఒక దైవప్రవక్త’ అని లేక ‘మహ్దీ’ అని పొగిడేవారు ముస్లింలు అవగలరా?” 

“వారు ముస్లింలు కాలేరు” – ప్రజల సమాధానం. 

“ఇతను ఇస్లాం వ్యతిరేకి. ఇతన్ని మస్జిద్ నుండి గెంటేయండి” అంటూ కొందరు ఆవేశపూరితంగా మాట్లాడుతున్నారు. 

అప్పుడు నేనన్నాను, “అయ్యా! సలీమ్ గారిని మస్జిద్ నుండి పంపించ వలసిన అవసరం లేదు, ఆయన కలిమా చదువుకుంటే ఆయన కూడా మన ముస్లిం సోదరుడే. మనతోపాటు మస్జిద్ లో  ఆయన కూడా నమాజు చెయ్యవచ్చు.” 

కాని సలీమ్ కలిమా చదవటానికి ఒప్పుకోలేదు. తానూ ముస్లింనేనని వాదించసాగాడు. రుజువు క్రింద తనకు గుర్తున్న దుఆలు, జిక్ర్ లు అన్నీ పదేపదే వల్లించసాగాడు. నేను అతనితో అన్నాను, “మీరు వల్లిస్తున్న ఈ దుఆలన్నీ ఇంతకుముందు మీరు ముస్లింగా వున్నప్పుడు నేర్చుకున్నవి. కాని ఆ తర్వాత మీరు ఖాదియాని కావడం వలన ఇస్లాం ధర్మం నుండి మరలిపోయారు. ఇప్పుడు కలిమా పఠించి మీరు మళ్ళీ ముస్లిం అయిపోండి.” 

“నా ధర్మం నాది. మీ ధర్మం మీది. ఈ మస్జిద్ మీది. మీ మస్జిద్ ను మీరే చూసుకోండి” అని చెప్పి మొత్తం ఆరుగురు ఖాదియానీలు మస్జిద్ నుండి బయటికి వెళ్ళిపోయారు. ఖాదియాని ఇమామ్ ఇంట్లో వెళ్ళి కూర్చున్నారు. ఆ తర్వాత ఊరు వాళ్ళు చెప్పడం వలన పోలీస్ ను పిలిపించి ఆ గ్రామం నుంచి పంపించివేశాము. ఈ విధంగా ఖాదియానీ కుట్రల నుంచి మస్జిద్ రక్షించబడింది. గ్రామ ప్రజలు ఖాదియానీల అపాయము నుండి బయటపడ్డారు. (అల్ హందు లిల్లాహ్) 

రెండవ అధ్యాయం: ఖాదియాని స్వరూప స్వభావాలు 

అసలు ఖాదియానియత్ అంటే ఏమిటి? 

ఖాదియానీ అనే పదం పంజాబ్ రాష్ట్రంలోని ఖాదియాన్ అనే పట్టణాన్ని సూచిస్తుంది. ఖాదియానీ మతం అక్కడే పుట్టింది. ఈ ప్రాంతం ప్రస్తుత భారత దేశంలోనే ఉంది. ఈ ఖాదియాన్ గడ్డ పైనే ఖాదియాని మతస్థాపకుడైన మీర్జా గులామ్ అహ్మద్ ఖాదియాని క్రీ.శ. 1839లో జన్మించాడు. 1900లో బ్రిటిషు సామ్రాజ్య శక్తులు ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం భారత ఉపఖండంలో దీని తాలూకు బీజాలు నాటారు. ముస్లింలను వారి ధర్మం నుంచి దూరం చేయటం, ముఖ్యంగా ముస్లింల హృదయాల నుంచి విశ్వాసాన్ని, ముహమ్మద్ ప్రవక్త ﷺ పట్ల అనుసరణా పిపాసను తొలగించి ముస్లింలు ఆంగ్లేయ సామ్రాజ్య శక్తులకు ఎదురు తిరగకుండా చేసుకోవటం దీని ప్రధాన ఉద్దేశం. ఆంగ్లంలో “రిలిజియస్” (Religious) అనే ఒక మాసపత్రికను వారు ప్రారంభించారు. అది వారి లక్ష్యాలు, సంకల్పాలకు దర్పణం పట్టేది. నేటికి కూడా ఆ పత్రిక వెలువడుతోంది. గులాం అహ్మద్ పేరు మీద ఈ మతాన్ని ‘అహ్మదియా మతం’ అని కూడా పిలుస్తారు. అలాగే మిర్జా గులాం పేరుతో దీనిని “మీర్జాయీ మతం’గా కూడా పిలుస్తారు.’ [1]

ఖాదియానీ మతంలో వర్గాలు 

ఈ మతం రెండు వర్గాలుగా విడిపోయి వుంది. మొదటి వర్గం అహ్మదియా అని పిలువబడుతుంది. దాని నాయకుడు నూరుద్దీన్. వీరి స్థావరము పాకిస్తాన్లోని “రబ్వహ్” అనే ప్రాంతం. ఈ వర్గీయులు మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానిని అల్లాహ్ ప్రవక్త అని, ప్రళయానికి పూర్వం రాబోయే యేసు (మసీహె మౌఊద్) అని, ముస్లిం సమాజం ఎదురు చూస్తున్న మహ్దీ (మహ్దియే ముంతజిర్ ) అని, ఇంకా అల్లాహ్ పంపిన ప్రవక్తలందరిలోకెల్లా మిర్జా గులాం అహ్మద్ శ్రేష్టుడని విశ్వసిస్తారు. మీర్జాపై విశ్వాసముంచినవారు స్వర్గవాసులవు తారని, మిర్జాను విశ్వసించనివారు నరకానికి వెళతారని వీరి నమ్మకం. 

నూరుద్దీన్ తోపాటు మహమూద్ అహ్మద్ బిన్ గులాం అహ్మద్, ముహమ్మద్ సాదిక్ (ఖాదియాని ముఫ్తి) మొదలగువారు కూడా ఈ వర్గంలో ప్రముఖులు. వాస్తవంలో గులాం అహ్మద్ తన చేతులారా స్థాపించిన మతం ఇదే. మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ బోధనలకు ఇది పరిపూర్ణ ప్రాతినిధ్యం వహిస్తుంది. అతని విశ్వాసాలను వాస్తవరీతిలో అంటిపెట్టుకొని వుంది. 

ఇక రెండవ వర్గం “అహ్మదియా లాహోరియా’గా పిలువబడుతుంది. ఈ వర్గానికి నాయకుడు ముహమ్మద్ అలీ లాహోరీ. పాకిస్తాన్ లోని ప్రముఖ పట్టణం లాహోర్ ఈ వర్గానికి కేంద్రప్రాంతం. వీరి విశ్వాసాల ప్రకారం మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని దైవప్రవక్త కాదు, దైవసందేశహరుడు కూడా కాదు, ఆయన ఒక సామాజిక సంస్కర్త, సమాజ పునరుద్ధారకుడు, ఆయన్ని తిరస్కరిం చటం పాపం, ధర్మం పట్ల తీవ్ర అవిధేయత క్రిందికి వస్తుంది. అయితే ఈ వర్గం వారి విశ్వాసాలు స్వయానా మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని చెప్పిన మాటలతో, ఆయన బోధనలతో ఏమాత్రం పొసగటం లేదు. ఖాదియానీ బోధనలు – ఈ వర్గంవారి విశ్వాసాలు పరస్పర విరుద్ధంగా వున్నాయి. ఈ విషయా లన్నిటి గురించి రాబోయే పేజీల్లో వివరంగా చర్చించుకుందాం. ఈ వర్గపు పెద్దల్లో ఖాజా కమాలుద్దీన్, ముహమ్మద్ అహ్సన్ అమ్రూహీ చాలా ప్రముఖులు. [2]

ఖాదియాని మతస్థాపకుని జననం, అతని వంశం 

గులాం అహ్మద్ బిన్ గులాం ముర్తజా బిన్ అతా ముహమ్మద్ ఖాదియాని జననం క్రీ.శ. 1839లో, మరొక కథనం ప్రకారం 1840లో [3] పంజాబ్ రాష్ట్రంలోని ఖాదియాన్ పట్టణంలో జరిగింది. వీళ్ళ కుటుంబం మొగల్ వంశంలోని “బర్ లాస్” అనే శాఖకు చెందినది. మిర్జా జీవిత చరిత్ర రాసిన వారందరూ అతను పూర్వీకుల గురించి ఈ వివరాలే నమోదు చేశారు. అయితే పర్షియన్ల గురించి హదీసుల్లో గొప్పగా చెప్పబడటం గురించి తెలుసుకున్న అతను తన పూర్వీకులు పర్షియన్లు అని, ఆ మేరకు తన వద్దకు దైవసందేశం (వహీ) అవతరించిందని చెప్పుకున్నాడు [5]. తర్వాత తన వంశీయులు చైనీయులని చెప్పటం ప్రారంభించాడు [6]. ఒకసారి అతను తాను దైవప్రవక్త ﷺ కుమార్తె అయిన ఫాతిమా (రదియల్లాహు అన్హా) వంశంలో పుట్టినవాణ్ణని ప్రకటించుకున్నట్లు కూడా దాఖ లాలు ఉన్నాయి. చివరగా తాను దైవప్రవక్త ఇసహాఖ్ సంతతిలో పుట్టినవాణ్ణని కూడా అతను చెప్పాడు. [7]

మిర్జా వంశం బ్రిటీషు సైనిక శిబిరంలా పని చేసింది

తన వంశధార, తన పూర్వీకుల గురించి గులాం అహ్మద్ ఖాదియానికి ఇంత సందిగ్ధత, ఇన్ని అనుమానాలు ఉన్నప్పటికినీ తన కుటుంబం బ్రిటీషు సామ్రాజ్య శక్తులకు తొత్తులుగా వ్యవహరించింది అన్న విషయంపై మాత్రం ఆయనకు సంపూర్ణ నమ్మకం ఉండేది. పైగా దీనిపై ఆయన చాలా సంబరపడి పోయేవాడు. దానిని అత్యంత గౌరవప్రదంగా భావించేవాడాయన. ఆయన ఒక చోట ఇలా రాశాడు: ‘ఇండియాలో ఆంగ్లేయ ప్రభుత్వం పట్ల శ్రేయోభావంతో, చిత్తశుద్ధితో మెలిగిన కుటుంబాలన్నిటిలోకి మా కుటుంబం తమ పట్ల అత్యంత విశ్వాసంతో ఉందని బ్రిటీషు ప్రభుత్వం అంగీకరిస్తుంది. మా నాన్న, మా వంశం వాళ్ళందరూ మొదటి నుంచి బ్రిటీషు ప్రభుత్వం పట్ల విశ్వాసంతో ఉండేవారు, బ్రిటీషు ప్రభుత్వాన్ని వేన్నోళ్ళా పొగిడేవారు. ఎన్నో చారిత్రక సంఘటనల ద్వారా ఈ విషయం రుజువు అవుతోంది. ఇది నా భ్రమ కాదు, పెద్ద పెద్ద ఆంగ్లేయ అధికారులు సైతం ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. [8]

మిర్జాకు ఊహ తెలిసినప్పటి నుంచి అతని తండ్రి సైన్యాన్ని తయారు చేసి బ్రిటీషువారికి సైనిక శక్తిని సమకూరుస్తున్నాడు. అతని సోదరుడు గులాం ఖాదిర్ కూడా బ్రిటీషు సేవలో రేయింబవళ్ళు తరించిపోతున్నాడు. కొంత వయసు వచ్చిన తర్వాత తనకు సామాజిక స్పృహ కలుగుతున్నప్పుడు తన వంశం వాళ్ళందరూ కలిసి ఆంగ్లేయ సైనికాధికారుల కోసం ఒక మంచి సైనిక శిబిరం లాగా ఉపయోగపడుతున్నట్లు మిర్జా కళ్లారా చూశాడు. ఇస్లామీయ పునరుద్ధరణను అణగదొక్కటానికి, లోకంలో ముస్లింల ఉనికే లేకుండా చేయటానికి ముస్లిం విరోధ శక్తులు మిర్జా ఇంటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తూ ఉండేవారు. ప్రత్యేక వనరులు, సాధనాల ద్వారా స్కీములు తయారు చేయబడి యావత్ దేశంలో అమలుపరచబడేవి. బ్రిటీషువారికి తన కుటుంబం ఈ విధమైన సేవలు అందించటాన్ని మిర్జా గులాం అహ్మద్ “అదృష్టం”గా వర్ణించుకున్నాడు. పైగా పదే పదే తన గ్రంథాల్లో ఈ విషయాన్ని గురించి చాలా గొప్పగా ప్రస్తావించు కున్నాడు.[9] ఒక గ్రంథంలో ఆయన రాస్తాడు, “ఆంగ్లేయ ప్రభుత్వం సుదీర్ఘ కాలం పాటు వర్ధిల్లటం కోసం, దాని చిరకాల ఉనికి కోసం మేము మా ప్రాణా లను త్యాగం చేయటానికి కూడా ఎన్నటికి వెనుకాడము. [10]

బాల్యం, విద్యాభ్యాసం 

మిర్జా ప్రాథమిక విద్యాభ్యాసం ఆయన ఇంట్లోనే జరిగింది. ఫజల్ ఇలాహీ, ఫజల్ అహ్మద్, గులాం అలీ షాహ్ మొదలగువారు ఆయన గురువులని చెబుతారు. అరబీ వ్యాకరణంలోని నహ్వ్, సర్ఫ్, తర్కం, ప్రాథమిక స్థాయి ధార్మిక, సాహిత్య జ్ఞానం ఆయన అభ్యసించాడు. తన విద్యా అర్హతల గురించి ఆయన ఒకచోట ఇలా చెప్పుకున్నాడు: “నేను కొంచెం పెరిగి ప్రాజ్ఞ దశకు చేరుకున్న తర్వాత కొద్దిపాటి పర్షియన్ భాష నేర్చుకున్నాను. అరబీ నహ్వ్, సర్ఫ్ వ్యాకరణాలు, మరికొన్ని విద్యలు అభ్యసించాను. వైద్య విద్యలో కూడా నా ప్రవేశం అంతంత మాత్రమే. అసలు మా నాన్నగారు జోతిష్య శాస్త్రంలో మహా నిష్ణాతులు. కనుక ఆ శాస్త్రానికి సంబంధించిన కొన్ని పుస్తకాలు ఆయన నాకు చదివించారు. అంతేకాదు, ఆ శాస్త్రంలో పాండిత్యం సంపాదించుకోమని కూడా ఆయన నన్ను ప్రోత్సహిస్తుండేవారు. అయితే ఇన్ని విద్యలు నేర్చుకున్నప్పటికీ హదీసు విద్యలో గాని, ఉసూల్ (ఇస్లామీయ మూల సూత్రాల్లో) గాని, ఫిఖ్హ్  (ధర్మావగాహన) విద్యలో గాని నా జ్ఞానం సున్న. [11]

ఆంగ్ల భాషపై కూడా కొన్ని పుస్తకాలు తన తండ్రి అభ్యసించారని మిర్జా తనయుడు షబ్బీర్ అహ్మద్ ఖాదియానీ చెప్పాడు. “మా నాన్న సియాల్కోట్ లో వున్నప్పుడు ప్రభుత్వ అధికారుల కోసం రాత్రిపూట అక్కడ ఒక బడి ప్రారంభమయింది. నాన్నగారు ఆ పాఠశాలకు చదవటానికి వెళ్తుండేవారు. ఆంగ్లంలో ఒకటి, రెండు పుస్తకాలు ఆయన అక్కడ చదివారు. [12]

మిర్జా విద్యా అర్హతలు ఇంతమటుకే. ఖుర్ఆన్, వ్యాఖ్యానం (తఫ్సీర్), హదీసులు, హదీసు పరిజ్ఞానం (ఉలూముల్ హదీస్), ధర్మావగాహనం (ఫిఖ్ ), ధర్మావగాహన మూల సూత్రాలు (ఉసూలె ఫిఖ్) లాంటి అతి ముఖ్యమైన విద్యలు నేర్చుకోవటానికి ఆయనకు అస్సలు అవకాశం లభించలేదు. బహుశా ఆయన ఈ విద్యలకు ప్రాధాన్యత ఇవ్వకపోయి ఉండవచ్చు లేక అవకాశం ఉన్నప్పటికి కూడా పసితనం నుంచే తనకు గల విపరీతమైన రోగాల మూలంగా ఆయనకు వాటిని నేర్చుకునే అవకాశం రాకపోయి ఉండవచ్చు. కుడిచేతి బెణుకు, టి.బి., అతిసార, మూర్ఛ, తలతిరుగుడు, కండరాల బలహీనత, మతిమరుపు, విపరీతమైన బలహీనత – ఏకకాలంలో ఆయనకు ఈ వ్యాధులన్నీ ఉండేవి.[13] (అల్లాహ్ ఈ వ్యాధుల నుంచి అందరిని రక్షించుగాక! ఆమీన్) 

మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని ఉద్యోగం, యవ్వనంలో ఆయన వ్యాపకాలు 

కొంతకాలం తరువాత మిర్జా గులాం అహ్మద్ సియాల్కోట్ న్యాయ స్థానంలో 15 రూపాయల నెలసరి జీతంపై ఉద్యోగం చేశాడు. 1864 నుంచి 1868 వరకు ఇదే వృత్తిలో కొనసాగాడు. తన ఆంగ్లభాష కొద్దిగా మెరుగుపడగానే న్యాయవిభాగంలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. అయితే ఆ తరువాత కొన్ని రోజులకు అదే సంవత్సరం 1868లోనే ఆ ఉద్యోగం వదిలేసి మళ్ళీ తన తండ్రితోపాటు ఉద్యోగంలో చేరిపోయాడు. [15]

ఇవండీ మిర్జా గులాం అహ్మద్ బాల్యం మరియు ఆయన యవ్వన దశ విశేషాలు! ఇకపోతే ఆయన జీవితమంతా ఆంగ్ల ప్రభుత్వానికి సహకారం అందించటంలో, ఆంగ్లేయులకు వత్తాసు పలకటంలోనే గడిచిపోయింది. దీనిగురించి స్వయంగా ఆయన ఏమంటున్నాడో వినండి: “నా జీవితంలోని అధిక భాగం నేను ఆంగ్లేయ ప్రభుత్వానికి సహకరించటంలో, ఆంగ్లేయులకు వత్తాసు పలకటం లోనే గడిపాను. ఆంగ్లేయులపై జిహాద్ విధికాదనీ, పైగా ఆంగ్లపాలకులకు విధేయత చూపటం విధి అన్న విషయాలపై మేము రచించిన గ్రంథాలను, వ్యాసాలను ఒకచోట పోగుచేస్తే వాటితో యాభై అల్మారాలు నిండుతాయి. ఆ గ్రంథాలను భారీ సంఖ్యలో మేము ఈజిప్ట్, సిరియా లాంటి అరబ్బు దేశాల్లో, కాబుల్, రోమ్ వంటి ఇతర దేశాల్లో వ్యాపింపజేశాము. [16]

వివిధ మతాలు, వర్గాలవారి మధ్య వాదనలు, ప్రతివాదనలు, తర్జన భర్జనలు జరుగుతున్న కాలంలో మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని జీవితం మొదలయింది. పాశ్చాత్తవాదులు, క్రైస్తవులు కూడా తమ ధర్మం, తమ దృక్పథాలను జోరుగా ప్రచారం చేస్తున్న కాలం అది. వీళ్లు ఎంతో ప్రభావవంతమైన రీతిలో క్రైస్తవాన్ని వ్యాపింపజేసేవారు. అంతేకాదు, ఇస్లాంకు, ముస్లింలకు వ్యతిరేకంగా కూడా ప్రచారం చేస్తుండేవారు. ఆ పరిస్థితులకు ప్రభావితుడైన మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని కూడా ఆ రంగంలోకి దిగిపోయాడు. దాంతో నలుగురిలో ఆయనకు మంచి పేరు కూడా వచ్చింది. ఆ సమయంలోనే ఆయన ఇస్లాం ధర్మ ఔన్నత్యాన్ని రుజువు చేస్తూ, క్రైస్తవం, ఇంకా భారతదేశంలోని ఇతర మతధర్మాలను వ్యతిరేకిస్తూ ఒక గ్రంథం రాయటం మొదలుపెట్టాడు. దానికి “బరాహీనె అహ్మదియా” అని నామకరణం చేశాడు. 

‘బరాహీనె అహ్మదియా’ రచన, అబద్ధ ప్రకటనలకు ఆరంభం 

ఈ గ్రంథ రచన 1879లో మొదలయింది. ఆయన ఆ సంవత్సరమే వివిధ పండితులకు, వ్యాసరచయితలకు తాను అటువంటి ఒక గ్రంథాన్ని రచించ బోతున్నట్లు లేఖోముఖంగా తెలిపాడు. అంతేకాదు, ఈ గ్రంథ రచనలో తమ అమూల్య సలహాలతో తనకు సహకరించాలని, అలాగే తాము రాసిన వ్యాసాలు ఏవైనా ఉంటే వాటిని తనకు అందజేయాలని, అవి తనకు గ్రంథ రచనలో తోడ్పడతాయని కూడా విన్నవించుకున్నాడు. ఆయనతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపినవారిలో సయ్యిద్ చిరాగ్ అలీ అగ్రగణ్యుడు. ఆ గ్రంథం నాలుగు భాగాలుగా విభజించబడింది. గ్రంథంలోని 562వ పేజీలో రచయిత తరఫున ఇంగ్లీషు మరియు ఉర్దూ భాషల్లో ఒక ప్రకటన ప్రచురించబడింది. మిర్జా మొదటిసారిగా ఇటువంటి ప్రకటన చేశాడు. ఇస్లాం ధర్మం సత్యవంతమైనదని నిరూపించటానికి తాను అల్లాహ్ తరఫున నియమితుడైనవాడినని, ఈ విషయంపై ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు, అనుమానాలు ఉన్నా తాను వాటిని తీర్చి, వారి అనుమానాలను నివృత్తి చేసి, నోళ్ళు మూయించగలడు అన్నది ఆ ప్రకటన సారాంశం. అతని మాటల్లో చెప్పుకోవాలంటే: “ఇస్రాయీల్ సంతతి ప్రవక్త అయిన యేసు మాదిరిగా అత్యంత అణకువ, విధేయత, దీన బలహీన స్థితిలో ప్రజా జీవితాలను చక్కదిద్దే విషయమై ఆలోచించమని అల్లాహ్ నాపై బాధ్యతను మోపాడు. ఆ లక్ష్యంతోనే నేను “బరాహీనె అహ్మదియా” రచనకు పూనుకున్నాను. అభ్యంతరాలు లేవనెత్తేవారి నోరు మూయించే 37 జవాబులు ఈగ్రంథంలో నేను సేకరించాను. ఈ గ్రంథం యొక్క ఒక ప్రతిని నేను మీకు పంపిస్తూ మీకు తెలియజేయునది ఏమనగా – ఈ గ్రంథంలో వున్న సత్యాలను గురించి తెలుసుకున్న తరువాత కూడా ఎవరైనా వీటిని తిరస్కరిస్తే అది వారిపాలిట నష్టదాయ కంగా పరిణమిస్తుందని అల్లాహ్ నుంచి నాకు దివ్యసంకేతం (ఇల్హామ్) అందింది. [18]

ఆ గ్రంథంలోనే మిర్జా తరఫున ఇంకో విషయం కూడా చెప్పబడింది, “ఎవరైనా ఖాదియాన్ పట్టణం వచ్చి నిరంతరాయంగా అక్కడ ఒక సంవత్సరం పాటు నివాసం వుంటే అతనికి ఆకాశంలో చిత్ర విచిత్రమైన చిహ్నాలు కనిపిస్తాయి. ఎవరికైనా అలా కనిపించకపోతే నేను వారికి రెండువందల రూపాయలు బహుమానంగా ఇస్తాను. [19]

దశలవారీగా మిర్జా విచిత్ర ప్రకటనల పర్వం. 

అప్పటివరకు అనామక జీవితం గడుపుతున్న తనకు ఒక్కసారిగా కీర్తి ప్రతిష్టల అందలం లభించటంతో మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని మిడిసి పడటం మొదలెట్టాడు. తనకు లభిస్తున్న ప్రజాదరణను వాడుకోవటానికి ప్రయ త్నించాడు. ఒకదాని తర్వాత మరొకటి మెల్లగా తన గురించి అబద్ధపు ప్రకటనలు చేయటం ప్రారంభించాడు. 

మౌలానా మౌదూది (రహ్మలై) దశల వారీగా అతను చేసిన ప్రకటనలను చారిత్రక క్రమంలో అమర్చి వాటి గురించి విశ్లేషణ జరిపారు. దాని సారాంశం ఈ క్రింద పేర్కొనబడుతోంది. 

1. 1880 – 1888 మధ్యకాలంలో మిర్జా గులాం అహ్మద్ బాగా ఉత్తేజంతో పనిచేస్తున్న ఒక ధర్మప్రచారకుని (దాయీ)గా, ఇస్లాం తరఫున వాదించేవాని (మునాజిర్)గా ప్రఖ్యాతిగాంచాడు. ఈ కాలంలో ఆయన ఇస్లాంపై జరుగుతున్న దాడుల్ని ప్రతిఘటిస్తున్నవానిగా కనిపించాడు. అయితే వాస్తవాలు అందుకు భిన్నంగా వున్నాయి. నిజానికి అతను నాటి సామ్రాజ్యశక్తులు, పాశ్చాత్తవాదులు రూపొందించిన ఒక ముందస్తు వ్యూహాన్ని భవిష్యత్తులో అమలుపరచే మార్గాన్ని తన అబద్ధపు ప్రకటనల ద్వారా సుగమం చేస్తున్నాడు. అయితే ఈ దశలోని అతని చెడు తలంపులను ముస్లింలు పసిగట్టలేకపోయారని దీనర్థం ఎంతమాత్రం కాదు. ముస్లిం సమాజంలోని పండితులు అతని కదలికలన్నిటిని గమనిస్తూ, అతని ఇస్లాం విరుద్ధ ప్రకటనల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చారు. ఆ కాలంలో మిర్జా తాను ముస్లిం సమాజంలోని వలీలందరిలోకెల్లా ఉత్తమమైనవాణ్ణి అని చెప్పుకుంటూ ఉండేవాడు. [20] 

2. 1889 – 1890 మధ్యకాలం. ఈ దశలో ఆయన తనను ఈ యుగంలో ముస్లిం సమాజ పునరుద్ధరణకై పుట్టిన మహావ్యక్తిగా అభివర్ణించుకున్నాడు. అల్లాహ్ తరఫున నియమించబడిన వానిని (మామూర్ మినల్లాహ్) అని కూడా చెప్పుకున్నాడు. తనను అనుసరించమని ప్రజలను ఆదేశించేవాడు. తాను యేసు ప్రవక్త అంతటివాణ్ణని కూడా అనేవాడు. 

3. 1891లో మిర్జా గులాం అహ్మద్, “ఇస్రాయీల్ సంతతికి చెందిన ప్రవక్త యేసు మరణించారు. ఆయన ప్రళయానికి పూర్వం తిరిగి వస్తారని చెప్ప బడింది. ఆ మళ్ళీ రాబోయే యేసుని (మసీహె మౌవూద్ ని) నేనే. అంతేకాదు, ముస్లిం సమాజం ఎదురుచూస్తున్న మహ్దీని కూడా నేనే. ప్రళయానికి పూర్వం యేసు మళ్ళీ వస్తారు అని అల్లాహ్ చెప్పివున్న సంగతి నాకు ఇంతకు ముందు తెలియదు. తెలిసివుంటే ఈ ప్రకటన నేను ఎప్పుడో చేసివుండేవాణ్ణి.” అయితే “బరాహీనె అహ్మదియా”లో ఆయన స్వయంగా “యేసు చనిపోలేదు. ఆకాశానికి ఎత్తుకోబడ్డారు”[21] అని ప్రస్తావించి ఉన్నాడు. అంటే తన రెండో ప్రకటనతో ఆయన “బరాహీనె అహ్మదియా”లో ప్రస్తావించిన మాటను రద్దుపరచుకున్నాడన్న మాట. 

4. 1900 సంవత్సరం అబ్దుల్ కరీమ్ అనే ఆయన అనుయాయి ఒకతను జుమా ప్రసంగం ఇస్తూ, “మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని దైవప్రవక్త, దైవసందేశహరులు. దైవప్రవక్త ముహమ్మద్ ﷺను విశ్వసించటం ఆ కాలంలో సహచరులకు (సహాబాకు తప్పనిసరి (వాజిబ్) అయినట్లు నేడు మిర్జా గులాం అహ్మద్ ఖాదియానిని విశ్వసించటం కూడా తప్పనిసరి” అని ప్రకటించాడు. తన అనుయాయి ప్రకటనను మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని నిజమని ధృవీకరించాడు. అయితే ఈ దశలో ఆయన పరిపూర్ణ దైవదౌత్యం (నబువ్వత్) గురించి ఏమీ ప్రకటించలేదు. కేవలం దైవదౌత్యం (నబువ్వత్)లో స్వల్ప భాగస్వామినని, అయితే ఆ స్వల్ప భాగస్వామ్యం కూడా యేసు (ఈసా) ప్రవక్త దైవదౌత్యం కంటే ఉన్నతమైనదని చెప్పు కొచ్చాడు. 

5. 1901లో మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని స్వయంగా, తాను దైవప్రవక్త నని, దైవసందేశహరుణ్ణి అని ఎంతో నిస్సిగ్గుగా ప్రకటించుకున్నాడు. జలాలుద్దీన్ షమ్స్ అనబడే మిర్జా అనుచరుడు ఒకాయన ఈ ప్రకటనను గురించి వివరిస్తూ ఇలా చెప్పాడు; “1901 కు ముందు రాసిన గ్రంథాల్లో మహాత్ములు సయ్యిద్ మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని తాను దైవ ప్రవక్తను కాను అని ప్రకటించారు. తాను దైవప్రవక్తను కానని, తాను దివ్యసంకేతాలు అందేవ్యక్తి (ముల్ హిమ్)నని మునుపటి గ్రంథాల్లో రాశారు. అయితే ప్రస్తుతం ఆయనకు పరిపూర్ణ దైవదౌత్యం లభించింది. అసలు విషయం ఏమిటంటే, ఇంతకుమునుపు ఆయన దైవదౌత్యం అసంపూర్ణంగా ఉండేది. అందుకని దానిగురించి ఆయన గట్టిగా చెప్పలేకపోయారు. అయితే 1901 తర్వాత ఆయన దైవదౌత్యం పరిపూర్ణం అయింది. కనుక ఆయన ఇప్పుడు తన పరిపూర్ణ దైవదౌత్యాన్ని ప్రకటిస్తున్నారు. [22]

6. అంతకుమునుపు చేసిన ప్రకటనలతోపాటు 1904లో మిర్జా ఖాదియాని మరో కొత్త ప్రకటన చేశాడు, “నేను కృష్ణుణ్ణి” అని. [23]

అదే సంవత్సరం గులాం అహ్మద్ ఖాదియాని “ఇహ్తిరామె ఖుదుస్” పేరుతో ఒక కాన్ఫెరెన్స్ ఏర్పాటు చేశాడు. ఆ కాన్ఫెరెన్స్ లో ఆయన నిస్సంకోచంగా పై విషయాన్ని గురించి వివరిస్తూ ఇలా అన్నాడు: “ఒకసారి కాదు, నిరంతరాయంగా నాపై వహీ (అల్లాహ్ సందేశం) అవతరిస్తూ ఉంది, నేను హిందువుల కోసం కృష్ణుణ్ణి అని, ముస్లింలు, క్రైస్తవుల కోసం మళ్ళీ వస్తారని చెప్పబడిన యేసు (మసీహె మౌవూద్) ని అని. [24]

అబద్ధాలకోరు, దైవదౌత్య అసత్య ప్రకటనకర్త మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని పై ప్రకటనతోపాటు ఇంకోమాట కూడా అన్నాడు, తాను ఈ కాలంలో ముస్లింల కొరకు ముహమ్మద్ ﷺ యొక్క మరో అవతారమని, నా రూపంలో ముహమ్మద్ ﷺ మళ్ళీ ఈ లోకంలో అవతరించారని అన్నాడు. ఆధారం క్రింద ఖుర్ఆన్అని సూరె జుముఆలో “ఆఖిరీన మిన్ హుమ్  లమ్మా యల్ హఖూ బిహిమ్” అన్న ఆయతు చూపెట్టాడు. ఈ కారణం చేతనే నేడు ఏ ఖాదియాని అయినా “లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అని నోటితో అంటే, అతను మనసులో “ఈ కలిమాలో ముహమ్మద్ అంటే గులాం అహ్మద్ ఖాదియాని” అని గట్టిగా నమ్ముతాడు. 

మిర్జా రచనలు 

మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని ఎన్నో రచనలు చేసినట్లు చెబుతారు. వాటిలో కొన్ని ఇవి: 

1. అర్బయీన్  2. ఆర్యధర్మ్  3. గజాలతుల్ అవ్ హాం  4. ఇస్తిఫ్తా  5. ఏజాజ్ అహ్మదీ  6. ఏజాజుల్ మసీహ్  7. అంజామె ఆథమ్  8. అన్వారే ఇస్లామ్ 9. బరాహీనె అహ్మదియా 10. అత్ తబ్లీగ్ 11. తజల్లియాతె ఇలాహియా 12. తజ్కిరయె వహీయె ముఖద్దస్ 13. మజ్మూఅ ముకాషఫాతే గులాం ఖాదియాని 14. హుజ్జతుల్లాహి హఖీ ఖతుల్ మహ్దీ 15. కషఫుల్ గితా నజ్ముల్ హుదా 16. నిషానుస్సమా 17. నుస్రతుల్ హఖ్ 18. నుజూలుల్ మసీహ్ 19. నసీముద్దావా

ఇవేగాకుండా మరెన్నో పుస్తకాలు ఈ దైవదౌత్య అసత్య ప్రకటనకర్త రచించినట్టుగా చెబుతారు. 

హేయమైన మరణం 

దైవదౌత్య ప్రకటనకర్త మిర్జా గులామ్ ఖాదియానీ చేసే ప్రకటనలకు వ్యతిరేకంగా ప్రముఖ అహ్లెహదీస్ పండితులు మౌలానా సనావుల్లా అమృత్ సరి (రహిమహుల్లాహ్) ఎప్పుడూ సవాలుగానే మారారు. ఆయన మీర్జాతో పాటు అనేక సంవాదాలు చేశారు. ప్రతి సంవాదంలోనూ మిర్జా ఓడిపోయి పరాభవం పాలయ్యే వాడు. ఎట్టకేలకు షేఖ్ సనావుల్లా అమృత్ సరి(రహిమహుల్లాహ్) గారితో ఆందోళన చెంది 1907లో మిర్జా స్వయంగా ఆయన్ను ముబాహలా కోసం ఆహ్వానించాడు. ఇద్దరిలో ఎవరైతే అబద్దమాడుతారో వారు నిజం చెప్పినవాడు బతికుండగానే మరణిస్తాడని ఛాలెంజ్ చేశాడు. అతనే స్వయంగా అల్లాహ్ ను “ఓఅల్లాహ్ ! సత్యం చెప్పిన వాడు బతికుండగానే అబద్ధం చెప్పిన వాడికి ప్రాణాంతక వ్యాధి సోకేలా చేయి’ అని వేడుకున్నాడు. ఉదాహరణకు ప్లేగు లేదా గత్తర లాంటి రోగాలు. [25]

చివరకు 1908 మేలో మిర్జా ఖాదియానీ గత్తర వ్యాధి సోకి లా హెూర్లోని ఒక మరుగుదొడ్లో మరణించి తాను దైవదౌత్యపు అబద్ధపు ప్రకటనలు చేశానని నిరూపించుకున్నాడు. అతని మృతదేహాన్ని ‘ఖాదియాన్’కు తీసుకువచ్చారు. అతను రూపొందించుకున్న స్మశాన వాటిక ‘బహష్ తి  మఖ్బిరా’ లో అతన్ని ఖననం చేశారు. [26]

మిర్జా ఖాదియానీ హేయమైన మరణం తరువాత కూడా మౌలానా సనావుల్లా అమృత్సరి నలభై ఏళ్ల వరకు జీవించారు. 1945 మే 15వ తేదీన తన 80వ ఏట మరణించారు. సత్యమేదో అసత్యమేదో స్పష్టపరిచిన ఈ ముబాహలా తరువాత ప్రజలు మౌలానా సనావుల్లా అమృత్సరిని ‘ఖాదియానీల విజేత’ అనే బిరుదుతో సత్కరించారు. అల్లాహ్ ఆయనపై తన కారుణ్యం ప్రసాదించుగాక! (ఆమీన్) 

ఖాదియానీల ఉనికికి వాస్తవ కారణాలు: 

(1) మిర్జా ఖాదియాని మరియు అతని కుటుంబం ఎప్పుడూ సామ్రాజ్య వాద శక్తుల కోసమే త్యాగాలు చేస్తూ వచ్చిందని గత పేజీల్లో మేము మిర్జా ఖాదియానీ మరియు అతని అనుచరులు మిర్జా చేసిన వ్యాఖ్యల ద్వారా తెలియజెప్పాము. “ఖాదియానియ్యత్” సామ్రాజ్యవాద శక్తుల సృష్టి అని చెప్ప టానికి మిర్జా గులాం అహ్మద్ చేసిన ఆ వ్యాఖ్యలు చాలు. ఈ విషవృక్షాన్ని పెంచి పెద్దచేసినవారు ఆంగ్లేయులు. స్వయంగా ఆయనే ఈ విధంగా వ్యాఖ్యా నించాడు: “నేను ప్రచారం చేస్తున్న ధర్మం రెండు ప్రాధమిక సూత్రాలపై ఆధారపడి ఉంది. అంటే నేను ఏ ధర్మాన్నైతే విశ్వసిస్తున్నానో, ప్రజలను ఏ ధర్మం వైపునకు ఆహ్వానిస్తున్నానో ఆ ఇస్లాం ధర్మం రెండు భాగాలుగా ఉంది. మొదటి భాగం, మేము అల్లాహు విధేయులై ఉండాలి. రెండు, మనం బ్రిటీషు ప్రభుత్వానికి సేవలు చేయాలి. ఎందుకంటే ఆ ప్రభుత్వమే దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడుతుంది. మనల్ని తన రక్షణలోకి తీసుకుని దౌర్జన్యపరుల నుంచి రక్షిస్తుంది. [28]

1931లో బ్రిటన్ చక్రవర్తి ఐదో జార్జి భారతదేశాన్ని పర్యటించినప్పుడు మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ కుమారుడు మిర్జా బషీరుద్దీన్ మహమూద్ అహ్మద్ స్వాగత సభను ఏర్పాటు చేశాడు. అందులో అతను ఇలా అన్నాడు: ఈ మతం ” ఖాదియానియ్యత్ పునాది ప్రస్తుత ప్రభుత్వ విధేయతపై, అన్ని రకాల కల్లోలాలకు (అంటే దేశాన్ని దాస్యాన్నుండి విముక్తి కల్పించడం కోసం జరిగే పోరాటాలకు) దూరంగా ఉండడంలోనే ఆధారపడి ఉంది. ఈ మతంలో సభ్యత్వం పొందడం కోసం ఈ మత స్థాపకుడు ఒక నిబంధన కూడా పెట్టాడు. అదేమిటంటే, వారు ప్రస్తుత ప్రభుత్వానికి బ్రిటీషు ప్రభుత్వానికి విధేయుడై ఉండాలి. అందుకనే ఈ మతావలంబీకులు ఎల్లప్పుడూ కల్లోలాలకు దూరంగా ఉండింది. ఈ విధంగా కూడా ఈ మతం ఇతరులకు ఆదర్శం. [29]

(2) పైన పేర్కొన్న వివరణల తరువాత సామ్రాజ్యవాద శక్తులతో ఖాదియానియ్యత్ వారికి సంబంధాలు ఉన్నాయనడానికి మరిన్ని రుజువులు అవసరం లేదు. దీన్ని అర్ధం చేసుకోడానికి పైన పేర్కొన్న సాక్ష్యాలు చాలు. ఈ నిషిద్ధవృక్షాన్ని పెంచడానికి పురికొల్పిన కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎంతయినా ఉంది. జిహాద్ ను వీడడం, సున్నత్ ను  తిరస్కరించడం ఈ రెండూ ఎలాంటి ప్రాధమిక విషయాలంటే దీని ద్వారా సామ్రాజ్యశక్తులకు ఎంతో బలం చేకూరిందనే వాస్తవాన్ని మనం ముందుగానే తెలుసుకున్నాం. కనుక ఎవరయితే ఈ రెండు విషయాల్లో క్రియాశీల పాత్రపోషించారో వారిని సామ్రాజ్యశక్తులు ఘనంగా ఆహ్వానించాయి, స్వాగతించాయి. వ్యవహారం ఇలాంటిది కనుక ఖాదియానియ్యత్ అధిక ప్రయోజనం పొందడానికి ఈ రెండు విషయాలే తమ ఏర్పాటు అసలు లక్ష్యాలుగా నిర్ణయించుకుంది. ఒక వైపు జిహాద్ చేయకూడదని నిరంతరం ఫత్వాలు జారీ చేశారు. మరో వైపు ఇస్లామ్ సాంప్రదాయాలను తిరస్కరించసాగారు. కనుక ఈ వర్గం ఇతర మతాలకంటే కూడా సామ్రాజ్యవాద శక్తులకు, పాశ్చాత్తవాదులకు ప్రియం కాసాగింది. 

జిహాద్ కు అంటే దౌర్జన్యాన్ని వ్యతిరేకించే శక్తికి సామ్రాజ్యవాదులు ఎప్పుడూ భయపడేవారు. ముస్లిములలో జిహాద్ చేయాలనే తపన, అమరగతులవ్వాలనే ఆరాటం ఎక్కడ జాగృత మవుతుందోనని పాశ్చాత్తవాదులు ఆందోళన చెందేవారు. కాబట్టి మిర్జా ఖాదియానీ జిహాద్ చేయకూడదని తన కాలంలో చాలా స్పష్టంగా ఫత్వా జారీచేశాడు. ఈ అంశంపై ఎన్నో రచనలు కూడా చేశాడు. ఆయన రాసిన ఒక వాక్యం ఇలా ఉంది: మసీహ్ మౌఊద్ కాలంలో జిహాద్ పూర్తిగా రద్దు చేయబడింది”. [30]

ప్రవక్త ﷺ సాంప్రదాయాలు (సున్నత్లు) పూర్తి సాక్ష్యాలు, ఆధారాలతో ముస్లిమ్ల వద్ద మిగిలి ఉండడాన్ని పాశ్చాత్తులు చూడలేకపోయేవారు. ముస్లిములు ప్రవక్త ﷺ సాంప్రదాయాల ఆధారంగా తమ అసలైన ధర్మం వైపు మళ్లిపోతారేమోనని వారు ఎప్పుడూ భయపడిపోతూ ఉండేవారు. ఒక వేళ ఇలా జరిగితే ప్రపంచంలో వారు బలం పుంజుకోవడం ఖాయం అని భావించేవారు. కనుక పాశ్చాత్తవాదుల లక్ష్యాలు పూర్తిచేయడం కోసం మిర్జా ఖాదియానీ స్వయంగా తనను అనుసరించమని ప్రజలను ఆహ్వానిస్తూ, కొత్త ధర్మాన్ని ఒడిసి పట్టుకోవాలని తాకీదు చేస్తూ బహిరంగంగానే ప్రవక్త ﷺ సాంప్రదాయాలను తిరస్కరించేవాడు. ఇలా అనేవాడు: “నేను నిరంతరం చెబుతూనే ఉన్నాను, నేను పఠిస్తుంది ఖురాన్ మరియు తౌరాత్ మాదిరిగా దేవుని వాక్యాలే. నేను జిల్లీ [31], బురూజీ [32] మరియు ప్రవక్తను. ధార్మిక విషయాల్లో నాకు విధేయత చూపడం ముస్లిములపై ఎంత విధో అదే విధంగా నేను ఈసాను అనే విషయాన్ని కూడా ముస్లిములు అంతే విధిగా విశ్వసించాలి. నా సందేశం అందినప్పటికీ దాన్ని అంగీకరించడానికి తిరస్కరించిన వారు, నేను ఈసాను అని విశ్వసించని వారు, నాపై అవతరించే వహీ అల్లాహ్ తరఫు నుండి వస్తుందని విశ్వసించని వారు ప్రళయం నాడు ప్రశ్నించబడతారు. వారు ముస్లిం గా చనిపోయినా సరే. ఎందుకంటే వారు విశ్వసించడం తప్పనిసరి అయిన స్పష్టమైన విషయాన్ని తిరస్కరించారు. ఒకవేళ నేను అబద్ధం చెబితే నేను చనిపోవాలి! అంతే కాదు నేను మూసా (అలైహిస్సలాం), దావూద్ (అలైహిస్సలాం), మరియు ముహమ్మద్ ﷺ మాదిరిగా నిజమైన ప్రవక్తను. అల్లాహ్ నన్ను ధ్రువపరచడానికి పదివేల కంటే ఎక్కువగా ఆకాశ మహిమలను అవతరింపజేశాడు. స్వయంగా ఖుర్ఆన్ నేను ప్రవక్తనని సాక్ష్య మిచ్చింది. ప్రవక్తలు నేను రాబోయే కాలాన్ని కూడా నిర్ధారించారు. వారు నిర్ధారిం చిన కాలం ఇదే. ఖుర్ఆన్ కూడా ఈ కాలాన్నే ధ్రువపరుస్తుంది. భూమ్యాకాశాలు మరియు ప్రవక్తలందరూ దీనికి సాక్ష్యంగా ఉన్నారు. [33]

ఇలాంటి అబద్దపు ప్రకటనలు చేయడం నిశ్చయంగా ఖుర్ఆన్, హదీసులు మరియు ఆకాశ గ్రంథాలకు వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటించడమే అవుతుంది. అయినప్పటికీ ఈ ప్రకటన కర్త అప్పుడప్పుడు ఖుర్ఆన్ దైవగ్రంధం అని, దానికి విధేయులవడం తప్పనిసరి అని అంగీకరిస్తాడు కూడా. కాని అతను ప్రవక్త ﷺ సాంప్రదాయాల గురించి తన పుస్తకాలలో ఎక్కడ కూడా తాను ప్రవక్త ﷺ సాంప్రదాయాలను అనుసరిస్తున్నానని కాని, సహాబాల బాటలో నడుస్తు న్నానని గాని సూచనా ప్రాయంగా కూడా రాయలేదు. 

షేఖ్ అబ్దుల్లా సామర్రాయి ఇలా పేర్కొన్నారు: ‘సామ్రాజ్యవాద శక్తులు ఇస్లాం వ్యతిరేక శక్తులను వినియోగం కోసం విశ్లేషించాయి. సంస్కృతి, సాంప్రదాయాలను మరియు ఇస్లాం రూపురేఖలను మార్చడానికి ధనసంపదలు, పరిపాలన, అధికారం ఆశ చూపించారు. బలవంతంగా కూడా తమ లక్ష్యాలను చేరుకోవాలనుకున్నారు. కాని ఫలితంగా వారికి ద్వేషం, వైరం మరియు తిరుగు బాటు తప్ప ఏమీ దొరకలేదు. కనుక ఇస్లాంను ఎదుర్కోడానికి వేరే విధానాన్ని అవలంబించడానికి పూనుకున్నారు. స్వయంగా ముస్లిముల ధార్మిక విషయాల్లో ఎలాంటి విషయాలను చేర్చారంటే అవి చూడ్డానికి ఇస్లాం పరమైనవే అయి వుంటాయి. ఇస్లాం మౌలిక విషయాలలోనివే అయిఉంటాయి. ఇస్లాం చిహ్నాలను గౌరవిస్తున్నట్లుగానే కనిపిస్తాయి. అంతేకాదు బాహ్యంగా ప్రతి ఒక్కరికీ ఇస్లాం మౌలికాంశాలపై నడుచుకోవాలని ఒత్తిడి చేస్తాయి. కాని అంతర్గతంగా విధ్వంసానికి దారితీస్తాయి. ఒక సమయం రాగానే ఇస్లాం మౌలికాంశాలన్నిటినీ తనతో కలుపుకుని మునిగిపోవడానికి ప్రయత్నిస్తాయి. కాని ఇస్లాం మౌలికాంశాలు పరస్పరం పటిష్టంగా, సక్రమంగా ఉన్నాయి. కనుక వాటిని ధ్వంసం చేయడం అంత తేలిక కాదు. అందుకనే దైవదౌత్య ప్రకటనతో దైవదౌత్య సమాప్తమనే పటిష్ట ఇస్లామీయ విశ్వాసంపై దెబ్బకొట్టే మైలురాయిగా పనికొస్తుంది. ఇలా విశ్వాసంలో కల్లోలం సృష్టించడానికి మార్గం సుగమం చేస్తే మొత్తం ఇస్లామ్ భవనాన్నే కూల్చడం సులభతరం అవుతుంది. ఆ తరువాత ఇతర ఇస్లామ్ మౌలిక విషయాలను కూడా తుడిచివేయడంలోనూ విజయం సాధించవచ్చు. [34]

అబద్ధపు దైవదౌత్యం కోసం విక్టోరియా ప్రభుత్వ ప్రణాళిక 

“The arrival of British Empire in India” అనే బ్రిటీషు ప్రభుత్వంలోని ఒక దస్తావేజు ద్వారా ఈ వాస్తవం వెల్లడయింది. భారతీయ ముస్లిములను తమ బానిసలు చేసుకోడానికి, వారిని బలవంతంగా తమ ప్రభుత్వానికి విధేయు లను చేసుకోడానికి ఇక్కడి పరిస్థితులను, స్థితిగతులను, వనరులు సమీక్షించి రమ్మని క్రీ.శ.1869లో బ్రిటన్ ప్రభుత్వం పాశ్చాత్తవాదులు మరియు పాస్టర్లతో కూడిన నేతల ఒక బృందాన్ని భారతదేశానికి పంపిందని తెలుస్తుంది. కనుక ఈ బృందం క్రీ.శ.1870లో ఇక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి సమాచారం తీసుకుని తిరిగి వెళ్లిపోయింది. ప్రభుత్వానికి నివేదికను సమర్పించడంలో సఫలం అయింది. దాని సారాంశం ఇది: ముస్లిములలో అధికమంది తమ ఉలమాలను గుడ్డిగా నమ్ముతున్నారు. వారిలో తనను ప్రవక్తగా ప్రకటించుకునే ఒక వ్యక్తిని వెతికి పట్టుకుంటే ముస్లిం సమాజంలోని ఒక వర్గం తప్పకుండా అతనికి తోడవుతుంది. అలాంటి వ్యక్తిని వెతకడం కష్టమే అయినప్పటికీ ఈ సమస్య పరిష్కారమయితే ప్రభుత్వం చాలా సులువుగా తమ పర్యవేక్షణలో అతని దైవదౌత్యాన్ని అభివృద్ధి చేయవచ్చు. ప్రస్తుతం మొత్తం భారతదేశం మన ఆధీనంలోనే ఉంది. ఈ ప్రణాళికను కార్యరూపం దాల్చేలా చేయాల్సిన అవసరం మనకు ఎంతయినా ఉంది. తద్వారా భారతదేశంలోని వివిధ తెగలు మరియు స్వాతంత్య్ర యోధులైన ముస్లిముల మధ్యలో అంతర్గత విభేదాలు సృష్టించి పోట్లాడుకునేలా చేయవచ్చు. [35]

కనుక బ్రిటన్ ప్రభుత్వం తాము రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం ఒక సరైన వ్యక్తిని ఈ పని కోసం ఎంచుకొని, అతనికి శిక్షణ ఇచ్చి సమర్ధుడిని చేయడం కోసం వెతకడం ప్రారంభించారు. చివరికి వారి దృష్టి మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ మీద పడింది. ఈ పనికి అతనే అర్హుడని ఈ క్రింది విషయాల ద్వారా నిర్ధారించారు: 

1- ఒంటరిగా ఈ పనిని చేసే సామర్ధ్యం అతనిలో ఉండాలి. ఆంగ్లేయుల సేవ చేస్తాడని గుర్తింపు పొంది ఉండాలి. చారిత్రాత్మకంగా, ఆచరణాత్మకంగా బ్రిటన్ ప్రభుత్వం ఆధిపత్యాన్ని అంగీకరించేవాడయి ఉండాలి. వారి సేవలను కూడా గుర్తించేవాడయి ఉండాలి.

2- ముస్లిమ్ అయి ఉండాలి. అతను ఇస్లాంపై దాడుల్ని ఎదుర్కొనే వీరుడుగా ప్రచారం పొంది ఉండాలి. భావజాల యుద్ధంలో ఇస్లామ్ శత్రువులతో తలపడేవాడై ఉండాలి. అతను వ్యాసాలు రాయడంలో, ప్రసంగాలు చేయడంలో నిష్ణాతుడై ఉండాలి. సందర్భం, సమయాన్ని బట్టి తన వైఖరిని మార్చుకోవడంలో ప్రావీణ్యుడై ఉండాలి. 

3- సాహిత్యరంగానికి చెందిన వ్యక్తయి ఉండాలి. నేరుగా అనుభవరంగంలో దిగడానికి సిద్ధంగా ఉండాలి. ఊసరవెల్లిలా రంగులు మార్చే నైపుణ్యం ఉండాలి. అప్పుడప్పుడు ముజద్దిద్  (సమాజ పునరుద్ధారకుడి)లా, మేధావిలా, సూఫీలా నటించాలి. చివరిగా (అబద్దపు) దైవదౌత్య స్థానాన్ని పొందడంలో సఫలం కావాలి. 

4- ఆంగ్లేయుల సామ్రాజ్య శక్తుల విషయంలో పారదర్శకంగా మరియు ఆప్తమిత్రుడిలా ఉండాలి. అతనిలో ఇస్లామ్ కు పోటీగా ఒక కొత్త కట్టడం నిర్మించేలా సమర్దుడై ఉండాలి. తన కార్యం పూర్తయ్యే వరకు నిజా యితీగా ఉండాలి. 

5-అతనిలో ధార్మికపరంగా నేతృత్వ సామర్ధ్యం ఉండాలి. ఇస్లాం విశ్వాసపు పునాదులపై ఏర్పడిన వర్గానికి నాయకత్వం వహించే అనుభవం ఉండాలి. యాధృచ్చికమో లేదా దురదృష్టమో కానీ ఈ లక్షణాలన్నీ మిర్జా అహ్మద్ ఖాదియానీలో ఉన్నాయి. వాటిలో కొన్ని లేకపోయినా ఆంగ్లేయులు ఆ లోటును పూడ్చడానికి అతనిలో సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు శాయ శక్తులా ప్రయత్నించారు. మిర్జా ఖాదియాని తనను దైవ ప్రవక్తగా ప్రకటించుకోవడం కోసం అవసరమయిన వనరులన్నిటినీ ఒకచోట చేర్చారు. [36]

పాశ్చాత్తవాదులు మరియు గులామ్ అహ్మద్ ఖాదియానీ దైవదౌత్యం: 

పాశ్చాత్తవాదుల విషయానికి వస్తే వారికి మిర్జాఖాదియానీకి మధ్య సంబంధాలున్నాయన్న విషయం ఈ క్రింది వివరాలతో అవగతం అవుతుంది. 

మొదటి ఆధారం ఏమిటంటే మేము పైన ప్రస్తావించిన సామ్రాజ్యవాద శక్తుల ప్రణాళికను విజ్ఞులు, కుతంత్రులయిన పాశ్చాత్తవాదులు రూపొందించారు. దాన్ని వారు ముస్లిముల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే రూపొందించారని ముందుమాటలో పేర్కొనడం జరిగింది. 

రెండో స్పష్టమైన ఆధారం ఏమిటంటే, దైవదౌత్య ప్రకటన హఠాత్తుగా సంభవించిన పరిణామం కాదు. పాశ్చాత్తవాదుల ప్రణాళిక ప్రకారం మెల్లమెల్లగా ఒక నిర్ణీత కాలంలో జరిగింది. ఒకవేళ మనం గత అధ్యాయాలను ఒకసారి పరిశీలిస్తే ముందుగా పాశ్చాత్తవాదుల విధానాలు (మిన్ హాజియాత్ ) సర్  సయ్యద్ అహ్మద్ ఖాన్, చిరాగ్ అలీ, అమీర్ అలీ మరియు అల్లామ ఇక్బాల్ లాంటి కొందరు ప్రఖ్యాత వ్యక్తులను సృష్టించాయి. వారు ప్రవక్త ప్రకటన మార్గాన్ని సుగమం చేయడానికి పరోక్షంగా కృషి చేశారు. 

కనుక సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ దైవదౌత్యాన్ని ఈ విధంగా పరిచయం చేశారు: దైవదౌత్యం దైవ కానుక కాదు అల్లాహ్ ఎవరికి పడితే వారికి ఇవ్వడానికి. ఇది సహజ నైపుణ్యం. ఇందులో ఇవరికీ ఎలాంటి ప్రాధాన్యతే లేదు. మానవునిలో ఉండే వేల సామర్ధ్యాలు, మానవునిపై అవతరించే వరాలకు ప్రత్యేకత ఉండదు. మానవుడు సహజంగా ఏదైనా ఒక కళలో నిష్ణాతుడై ఉంటాడు. ఆ కళా నైపు ణ్యమే అతనికి ఉపాధిని తెచ్చిపెడుతుంది. ఉదాహరణకు కమ్మరిని తీసుకుంటే అతన్ని అతని కళలో మేటిగా, ప్రవక్తగా అర్హుడు”. [37]

అదేవిధంగా అల్లామ ఇఖ్బాల్ (రహ్మలై) దైవదౌత్యాన్ని ఈ విధంగా నిర్వచించారు: “దైవదౌత్యం అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు, సర్వసంగ పరిత్యాగులకు కలిగే ప్రత్యేక మగత స్థితి. సూఫీలు మరియు ప్రవక్తల మధ్య తేడా ఏమిటంటే, సూఫీల చివరి గమ్యం అల్లాహ్ వరకు చేరుకోవడం. కాని ప్రవక్తల్లో గొప్ప నైపుణ్యత ఉంటుందంటే వాళ్లు దాంతో ప్రపంచంలో ఒక కొత్త విప్లవానికి తెరతీసి మానవజీవిత దశను పూర్తిగా సత్యత వైపునకు మరలుస్తారు. [38]

సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈ విధంగా పేర్కొన్నారు. దైవదౌత్యం ఒక సహజ వస్తువు. అది దైవప్రసాదం కాదు. దీని ఆధారంగానే ఆయన ‘Adison మరియు ‘Seattle’ లాంటి ఆంగ్లేయులను ప్రవక్తలుగా పరిగణించారు. [39]

అల్లామ ఇఖ్బాల్ నిర్వచనం ప్రకారం వెల్లడవుతున్న విషయం ఏమిటంటే, దైవదౌత్యం సంపాదించే వస్తువు. మనిషి కృషితో దీన్ని సాధించగలడు. అల్లామ ఇఖ్బాల్ రాసిన ఒక కవిత తాత్పర్యం “ఇమామ్ గజాలీలో దైవదౌత్యపు ఠీవి కనబడుతుంది” ద్వారా కూడా ఈ విషయం తెలుస్తుంది. అదే విధంగా పద్దెని మిదో శతాబ్దంలో గ్రీకు జాతీయుడైన ‘Cont’ గురించి కూడా ఇలాంటి వ్యాఖ్యానాలే చేశారు. [40] 

ఏదేమైనప్పటికీ దైవదౌత్యం సహజంగా ప్రాప్తమయిందని నిరూపించాలనుకున్నా లేదా కృషి ద్వారా ప్రాప్తమయిందనుకున్నా ఈ రెండు దృక్పధాలు దైవదౌత్యం దైవ ప్రసాదితం అనే విషయాన్ని తిరస్కరిస్తున్నాయి. ప్రతి ప్రవక్తకు దైవదౌత్యం కొరకు ద్వారాలు తెరువబడతాయి. ఈ పదునైన ఆయుధాన్నే మిర్జా ఖాదియానీ జీవితాంతం ఇస్లాం నిర్మాణంపై వినియోగించాడు. దాన్ని కూల్చడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. 

దైవదౌత్య సమాప్తం గురించి అల్లామ ఇఖ్బాల్ ఇలా వ్యాఖ్యానించారు: నిశ్చయంగా ఇస్లామ్ రాకతో మానవ మేధస్సు ఉత్థాన స్థాయికి చేరిందని ప్రస్ఫుట మయింది. ఇస్లామ్ లో దైవదౌత్యం ప్రామాణికత చివరి స్థాయికి చేరుకుంది. అందుకనే దాని ద్వారాలు మూతపడిపోయాయి. [41]

అల్లామ ఇఖ్బాల్ “దైవదౌత్య సమాప్తాన్ని మానవ మేధ సంపూర్ణతకు కారణంగా పేర్కొన్నారు. దీని భావం ఏమిటంటే, ఒకవేళ మానవ మేధ పతనా వస్థకు చేరితే దైవదౌత్యం మళ్లీ పునః ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

ఇవన్నీ పాశ్చాత్తవాదులు సృష్టించిన వినూత్న దృక్పధాల ఫలితం. మిర్జా ఖాదియానీ తనను దైవప్రవక్తగా పేర్కొనడానికి ఇవన్నీ బలమైన కారణాలుగా, మైలురాయిగా నిలిచాయి. 

హిస్టీరియా వ్యాధి, అబద్ధపు దైవదౌత్య సోపానం 

మూడో ఆధారం ఏమిటంటే, మిర్జా ఖాదియానీ అనేక రోగాల బారిన పడ్డాడు. యవ్వనంలోనే ఆయనకు హిస్టీరియా వ్యాధి సోకింది. ఈ వ్యాధి పాశ్చాత్త వాదుల ఆలోచనలకు అనుగుణంగా మిర్జా ఖాదియానీ దైవదౌత్యం కోసం ఎంతో తోడ్పడింది. ఎందుకంటే ఈ స్థితిలో అతను నరాల బలహీనతతో మూర్ఛ పోయేవాడు. కొన్ని సందర్భాల్లో స్పృహ కోల్పోయి మైకం ఆవహించేది. 

సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈ మూర్ఛనే వహీ అవతరించే సందర్భంగా ఆయన ﷺ ఎదుర్కొనే పరిస్థితులతో పోల్చారు. ఆయన ఇలా అన్నారు: “ప్రవక్త తన మాటలనే తన చెవుల ద్వారా బయటి వ్యక్తి తనతో మాట్లాడుతున్నట్లు వింటాడు. తన రెండు కళ్లతో చూస్తాడు. అంటే తన ముందు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడని భావిస్తాడు. (ఈ వివరణ ఖియాస్ మఅల్ ఫారిక్) మతిస్థిమితంలేని వాడు తన ముందు ఎవరూ లేకపోయినా ఏదో మాటలు తనకు వినబడుతున్నట్లు తన ముందు మనషులు ఉన్నట్లు వారితో తాను మాట్లాడుతున్నట్లు ప్రవర్తిస్తుండడం మనలో చాలా మంది చూస్తూనే ఉంటారు. కాని అతని ముందు ఎవరూ ఉండరు. ఇదంతా ఒట్టి భ్రమ మాత్రమే. ఒక వస్తువు వైపు తన శక్తినంతా ప్రయోగించినందుకుగాను ఇలా జరుగుతుంటుంది. [42]

ఈ భావనతోనే పాశ్చాత్తవాదులు వహీ అవతరణ, మతితప్పి పోతూ ఉండే మూర్ఛ వ్యాధికి మధ్య ఎలాంటి తేడా లేదని వాదిస్తుంటారు. ఆకాశం నుంచి అవతరించే వహీ, మూర్ఛ రోగం ఒకటేనని అంటారు. పాశ్చాత్తవాదులు ఇలా ఎందుకు వాదిస్తుంటారంటే మూర్ఛవ్యాధికి, వహీకి తేడా ఉండకూడదని, ప్రజలు ప్రవక్త ﷺ) దైవదౌత్యాన్ని ఒక మూర్ఛ స్థితిగానే భావించాలని, తద్వారా గులాం మిర్జా ఖాదియానీ ప్రకటించే కొత్త దైవదౌత్య ద్వారాలు సరళంగా తెరుచుకోవాలని. ‘లోథ్రోబ్ స్టోదార్డ్’ అనే పాశ్చాత్తవాది ఇలా అంటాడు: ముహమ్మద్ ﷺ నిరక్ష్య రాస్యులు. ఆయనకు చదవడం, రాయడం రాదు. ఆయన తత్వవేత్తా కాదు. ఎందుకంటే ఆయన నిరంతరం ఈ విషయం గురించే ఆలోచిస్తూ ఉండేవారు. దాని ఫలితంగా ఆయనలో అంచెలంచెలుగా మగత స్థితిలో ఒక కొత్త విశ్వాసం రూపుదిద్దుకుంది. దాన్ని ఆయన విగ్రహారాధనను నిర్మూలించడానికి మూలంగా భావించేవారు. [43]

ఈ పాశ్చాత్తవాదే మరో చోట ఇలా పేర్కొన్నాడు: ముహమ్మద్ ﷺ పై అవతరించే వహీ, ఆయన లేవనెత్తిన ప్రచారానికి మూల కారణం ఆయనపై అప్పుడప్పుడు ఆవహించే మూర్ఛ రోగమే. [44]

‘దర్శింగమ్’ అనే మరో పాశ్చాత్తవాది ఇలా అంటాడు: ముహమ్మద్ ﷺ అధిక సమయం గుహలోయల్లో చెప్పుల్లేకుండా తిరిగేవారు. సూర్యతాపానికి పరితపించేవారు. అక్కడి లోయల్లో పెద్దపెద్ద అంగలతో నడిచేవారు. ఆయన లోయల్లో నడిచేటప్పుడు అక్కడున్న రాళ్లలో నుంచి శబ్దాలు వస్తున్నట్టు ఆయనకు సంశయం కలిగేది. మీరు చూడలేదా! శీతాకాలపు రాత్రిళ్లలో నక్షత్రాల సమూహాలు ఎడారిని తలపిస్తుంటాయి. వాటి నుంచి వెలువడే కాంతి నుంచి అగ్నిరాజేసి నప్పుడు వచ్చే మంటల శబ్దం వస్తున్నట్టుంటుంది. ముహమ్మద్ ﷺ పై అవతరించే వహీ కూడా అలాంటిదే. అంతే తప్ప అది విశ్వంలోని మరే వస్తువూ కాదు. [45]

గులామ్ అహ్మద్ ఖాదియానీని అసత్య ప్రవక్తగా రూపొందించడంలో ప్రముఖ మేధావుల పాత్ర : 

పాశ్చాత్తవాదులు తమ ప్రయత్నాలు కొందరు ముస్లిమ్ మేధావుల భావాల ద్వారా దైవదౌత్య సాధనలో యూదులు, క్రైస్తవ విధానాలను ముస్లిముల మధ్య వ్యాప్తి చేయడంలో సఫలీకృతం అయ్యారు. ఈ భావాన్నే తీసుకుని దాని విత్తనం ద్వారా మిర్జా ఖాదియానీ అబద్ధపు దైవదౌత్యం ప్రస్ఫుటమయింది. “ఖాదియానియత్’ రూపంలో అది దినదిన ప్రవర్ధమానం అయింది. 

ఖాదియానియత్ పురోభివృద్ధికి గల కారణాలను ఒకసారి పరిశీలిస్తే “ప్రకృతివాదం (నేచరీ వర్గం)” కూడా పాశ్చాత్తవాదుల సృష్టేనన్న చారిత్రక వాస్తవం బట్టబయలవుతుంది. ఖాదియానీ వర్గం వెలుగులోకి రావడానికి ఈ వర్గమే దానికి ఎంతగానో తోడ్పడిందని నిరూపితమయింది. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న సత్సంబంధాలే దీనికి ఆధారాలు. 

అల్లామ ఇహ్సాన్ ఇలాహి జహీర్ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు: “మిర్జా ఖాదియానీ దగ్గరకు కొందరు అత్యాశాపరులు, ద్రోహులు స్వయంగా చేరారు లేదా వారిలో ఆశ కలిగించి అతని దగ్గర చేర్పించారు. వారు డబ్బులకు తమ అంతరాత్మలను అమ్ముకున్నారు. ద్రోహబుద్ధిగల ఈ ఆధ్యాత్మిక గురువులే మిర్జా దైవదౌత్యాన్ని ప్రచారం చేశారు. మిర్జా ఖాదియానీది కేవలం కీలుబొమ్మ పాత్ర. అతనికి సూచించిన విషయాలు మాత్రమే అతను చెప్పేవాడు. ఈ విషయాలు మేము చారిత్రక రుజువులు, ప్రత్యక్ష సాక్షుల ఆధారాల ద్వారా తెలుపుతున్నాము. స్వయంగా మిర్జా ఖాదియాని ఈ వాస్తవాలకు చెందిన ఆధారాలను చూపుతున్నాడు. ఆధారం ఏమిటంటే, మిర్జా ఖాదియానీ ఒక పుస్తకం రాయాలని సంకల్పం చేసుకున్నాడు. దాని కోసం అతను ప్రజల సహాయం కోరాడు. చరాగ్ అలీని ఉద్దేశించి ఇలా అంటున్నాడు: మీ ఉత్తరం అందింది. చాలా సంతోషం కలిగింది. దీనికి ముందు నేను ఇస్లామ్ కు సేవ చేయాలనుకుంటున్నాను. మీ ఉత్తరం ద్వారా నాకు ధైర్యం వచ్చింది. ఒక వేళ మీ దగ్గర నేను రాయాలనుకున్న పుస్తకానికి సంబంధించిన వ్యాసాలు ఉంటే తప్పకుండా పంపగలరు. [46]

మిర్జా ఇంకా ఇలా అంటున్నాడు. దైవదౌత్య ఆధారాల గురించి మీ వ్యాసం ఇంకా అందలేదు. దీని కోసం నేను ఎంతగానో నిరీక్షిస్తున్నాను. నేను రెండవసారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. దీనికి సంబంధించిన వ్యాసం మీరు వీలైనంత త్వరగా పంపగలరు. [47]

ఏదేమైనప్పటికీ రెండు వర్గాలు అంటే నేచరీ వర్గం మరియు ఖాదియానీ వర్గం మధ్య ఉన్న పటిష్ట సంబంధాల ఆధారంగా ఈ రెండు వర్గాల విశ్వాసాల్లో ఏకాభిప్రాయం ఉందని, ముఖ్యంగా లాహెూర్కు చెందిన ఖాదియానీ వర్గ విశ్వాసం మరియు నేచర్ వర్గ విశ్వాసాలు ఒక్కటేనని రుజువవుతుంది. ఎందు కంటే ఏ విధంగా సర్సయ్యద్ అహ్మద్ ఖాన్ దైవదూతలు, జిన్నులు, స్వర్గనరకాలు, అగోచర విషయాలు (ఆలముల్ గైబ్), మహిమల వాస్తవాలను తిరస్కరించారో అదే విధంగా ముహమ్మద్ అలీ లాహోరీ కూడా ఈ విషయాలన్నిటినీ తిరస్కరించాడు. అందుకనే ఖాదియానీలు ఇస్లామ్ ధర్మపరిధిలో లేరని మొత్తం సమాజం ఏకీభవించినట్లే, కొందరు ఉలమాలు సర్ సయ్యద్ అహ్మద్ ను కూడా ఇస్లాం ధర్మ తిరస్కారిగా పరిగణించారు. 

ఖాదియానీ వర్గంలోని కొందరు ప్రముఖులు: 

ఖాదియానీ వర్గంలో కొందరు పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. వారి పేర్లు: నూరుద్దీన్, ముహమ్మద్ అలీ, మిర్జా బషీరుద్దీన్ ఇబ్నె గులామ్ అహ్మద్ ఖాదియానీ, ముహమ్మద్ అహ్మద్ బిన్ గులామ్ అహ్మద్ ఖాదియానీ, కమాలుద్దీన్, ముహమ్మద్ అహసన్ అమ్ రోహి, యార్ ముహమ్మద్, అబ్దుల్లాహ్ తీమాపూరి మరియు ముహమ్మద్ సాదిఖ్. వీరందరికి నూరుద్దీన్ మరియు ముహమ్మద్ అలీ నాయకులుగా ఉండేవారు. రాబోయే పేజీల్లో వారి గురించి మేము ప్రత్యేకంగా ప్రస్తావిస్తాము. 

ఖాదియానియ్యత్ తొలి ఖలీఫా నూరుద్దీన్ : 

హకీమ్ నూరుద్దీన్ బిన్ హాఫిజ్ గులామ్ రసూల్ క్రీ.శ. 1841, హి.శ 1258లో జన్మించాడు. అరబీ, ఫార్సీలో కొంత విద్యను పొందాడు. దానితో పాటు భూగోళం, గణిత శాస్త్రాల్లో ప్రాథమిక విద్య నభ్యసించాడు. అరబీ వ్యాకరణం (నహూ), తర్కం, తౌహీద్కు సంబంధించిన పుస్తకాలు కూడా చదివాడు. 

ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేయనారంభించాడు. తర్వాత ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ మధ్యకాలంలోనే తనకు తెలిసిన కొందరు గురువుల దగ్గర శిష్యరికం పొంది మరింత విద్యనార్జించాడు. చివరగా ఒక వైద్యునిగా పని చేయడం మొదలు పెట్టాడు. ఉపాధ్యాయ వృత్తికి స్వస్తి పలికాడు. [48]

ఈ మధ్యకాలంలోనే మిర్జా గులామ్ ఖాదియాని పరిచయం అయ్యాడు. అప్పుడు అతను ‘సియాల్ కోట్’లో ఉండేవాడు. పరిచయం స్నేహంగా మారింది. మిర్జా ఖాదియానీ ‘బరాహీన్ అహ్మదియ’ అనే పుస్తకం రాస్తే దాన్ని నిర్ధారించేందుకు తస్ధికే బరాహీన్ అహ్మదియ’ అనే పుస్తకం రాసి మిర్జా ఖాదియానీ చేతులపై బైత్(ప్రమాణం) చేసి ఆయనకు భక్తుడయ్యాడు. ఇతను ఆ పుస్తకంలో ఎంతటి దిగజారిన వాక్యాలు రాశాడంటే “ఈ వ్యక్తి (అంటే మిర్జా) దైవప్రవక్తనని ప్రకటించుకుని తానే షరీఅత్ కర్తనని, ఖుర్ఆన్ షరీఅత్ ను రద్దు చేస్తున్నానని అంటే దాన్ని నేను హృదయపూర్వకంగా అంగీకరిస్తాను. దాన్ని తిరస్కరించడానికి నా దగ్గర ఏ కారణమూ ఉండదు”. [49]

అల్లామ ఇహన్ ఇలాహి జహీర్ (రహ్మతుల్లా అలైహి) ఇలా పేర్కొంటు న్నారు: నూరుద్దీన్ గురించి ఒక విషయం చాలా ప్రచారంలో ఉంది. సమాజ పునరుద్ధరణ పిలుపు నుంచి దైవదౌత్య ప్రకటన వరకు మిర్జా గులాం ఖాదియానీ తరఫు నుంచి అన్వయిస్తున్న విషయాలన్నిటి వెనుక నూరుద్దీన్ అనే వ్యక్తిత్వం దాగి ఉంది. మౌలానా అబుల్ హసన్ అలీ నద్వీ (రహ్మతుల్లా అలైహి) అభిప్రాయం కూడా ఇదే. [50]

ఈ ధార్మిక పండితుల అభిప్రాయాలు సరైనవే. ఎందుకంటే మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ హదీసు విద్యగాని, ఇస్లాం ధర్మశాస్త్ర విద్యగానీ అభ్యసించలేదు. అతనికి అరబీ భాష కూడా అంతంత మాత్రమే వస్తుంది. కాని నూరుద్దీన్ అరబీ భాషలో ఉన్నత విద్యనభ్యసించడమే కాకుండా అతను హిజాజ్ ప్రాంతంలో కూడా కొన్ని రోజులు ఉన్నాడు. [51]

నూరుద్దీన్ ప్రకృతివాద నేచరీ వర్గానికి చెందిన గురువుల దగ్గర కూడా శిష్యరికం పొందాడు.పాశ్చాత్త భావాలను పెంపొందించుకుని షరీఅత్ ఆదేశాలను, ఇస్లామ్ సంస్కృతిని ప్రకృతి మరియు స్వభావాలకు అనుగుణంగా చేయాలని అంటాడు. 

మౌలానా సయ్యద్ అబుల్ హసన్ అలీ నద్వీ (రహ్మతుల్లా అలైహి) ఇలా పేర్కొం టున్నారు: నూరుద్దీన్ ది అస్థిర వ్యక్తిత్వం. అతనికి బుద్ధిలోపం ఉంది. మొదట్లో పండితులు అనుకరణ (తక్లీద్)ను తిరస్కరించి స్వేచ్ఛా భావాలు కలవానిగా మారాడు. ఆ తరువాత ధార్మిక విశ్వాసాలను మరియు ఖుర్ఆన్ ను ప్రకృతి, స్వభావానికి అనుగుణంగా చేసుకునే వర్గంలో చేరిపోయాడు. ఖుర్ఆన్ మరియు హదీసులకు వ్యతిరేకంగా ఉన్న వాటిని మార్పుచేయసాగాడు. ఈ మార్పులన్నీ భారతదేశంలో పాశ్చాత్త ఆంగ్ల సంస్కృతి పేర ఆచరించసాగారు. 

వాస్తవం ఏమిటంటే ఈ కొత్త విధానం నిరూపించబడిన వాస్తవాలు, సాక్ష్యాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. అయినప్పటికీ ఈ ప్రకృతి విధానాన్ని అమలు పరచడానికి ఏ మార్గాన్ని అనుసరించ డానికైనా వారు సిద్ధంగా ఉన్నారు. అరబీ భాషను రకరకాలుగా మార్చి తమ విధానాన్నే అమలు పరచడానికి పూనుకునే వారు. అందుకనే వారు మహిమలను, అగోచర విషయాలను ఉన్నదున్నట్లు విశ్వసించకుండా వాటికి అనవసర వివరణలు ఇచ్చేవారు. [52]

చివరకు నూరుద్దీన్ క్రీ.శ.1892లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఖాదియాన్ కు వెళ్లిపోయాడు. అక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాడు. క్రీ.శ 1981లో మిర్జా తరువాత ఆయన ఖిలాఫత్ పై ప్రమాణం తీసుకోవడం జరిగింది. తొలి ఖలీఫాగా సత్కారం పొందాడు. ప్రజలు అతన్ని “ఖలీఫయె మసీహుల్ మౌఊద్ నూరుద్దీన్ ఆజమ్”గా పిలువసాగారు. ఆరు సంవత్సరాల వరకు ఖిలాఫత్ స్వీయ ప్రకటిత కిరీటధారుడై క్రీ.శ. 1914 మార్చి 13న మరణించాడు. అతని తరువాత మిర్జా గులాం ఖాదియానీ కుమారుడు మిర్జా బషీరుద్దీన్ మహమూద్ అతని వారసుడయ్యాడు. [53]

లాహోూరు వర్గ స్థాపకుడు ముహమ్మద్ అలీ లాహోరీ: 

ఏ పుస్తకంలోనూ ఈయన జన్మదినం మరియు జన్మస్థలం ప్రస్తావన దొరకదు. కాని ఆయన లాహెూరు నగరంలో నివసించేవారు. అక్కడే లాహెూరు ఖాదియానీ వర్గానికి అంకురార్పణ జరిగింది. దాని ద్వారానే అతన్ని లాహెూరీ అంటారు. ముహమ్మద్ అలీ లాహోరీ ఉన్నత విద్యనభ్యసించాడు. ఎమ్. ఏ చదివాడు. ఉన్నత విద్యనభ్యసించినప్పటికీ ఉద్యోగం దొరకలేదు. చివర్లో అతనికి సామ్రాజ్యవాద భూతం ఆవహించింది. విలువైన విశ్వాసాన్ని అమ్ముకున్నాడు. ఇస్లామ్ గోడలను కూల్చడానికి, ముస్లిముల విశ్వాసాల్లో అనుమానాలు రేపడానికి, వారి మధ్య కల్లోల బీజం నాటడానికి, మిర్జా ఖాదియానీకి సహాయం చేయడానికి సామ్రాజ్యవాద శక్తులు అతన్ని అసత్యవాది అయిన మిర్జాగులామ్ ఖాదియానీకి భాగస్వామునిగా చేర్చారు. ప్రతిఫలంగా అతనికి భారీమొత్తంలో వేతనం లభించేది. [54]

మిర్జా గులామ్ ఖాదియానీ దైవదౌత్యాన్ని ప్రకటించినప్పుడు ముహమ్మద్ అలీ లాహెూరీ ఖాదియాన్లో మిర్జా గులామ్ అహ్మద్ తో పాటు జమాఅత్ కార్య దర్శిగా ఉన్నాడు. అప్పుడప్పుడు భారతదేశంలో నిర్వహించబడే సభలకు ఖాదియానీ ప్రతినిధిగా పాల్గొనేవాడు. [55]

సామ్రాజ్యవాదుల ప్రణాళికల ప్రకారం మిర్జా గులామ్ ఖాదియాని ఖాదియానియత్ కు చెందిన భావాలు, విశ్వాసాలను విద్యావంతులైన ముస్లిమ్ లలో వ్యాప్తి చేసే ఉద్దేశంతో ఆంగ్ల భాషలో “Revive of Religions” అనే మాస పత్రికను ప్రారంభించినప్పుడు ముహమ్మద్ అలీ లాహోరీ దానికి సంపాద కునిగా నియమించబడ్డాడు.[56]

మరోవైపు ఖాదియానీలను తిరస్కరించడానికి, వారిని మార్గభ్రష్టులుగా పేర్కొనడానికి ఉలమాలు ఏకమయ్యారు. దీన్ని ఎవరూ విభేదించలేదు. అతన్ని విశ్వసించిన వారు మార్గభ్రష్టులవుతారని ఫత్వాలు జారీ చేశారు. అనేక రచనలు చేశారు. ఖాదియానియత్కు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని, దాన్ని ఇస్లామ్ నుంచి బహిష్కరించాలని, వారిని ముస్లిమేతరులుగా పరిగణించాలని ముస్లిములు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినప్పుడు సామ్రాజ్యవాదులు ముస్లిము లను మార్గభ్రష్టులను చేసే తమ పన్నాగం పారదని భయపడసాగారు. కనుక గులామ్ అహ్మద్ ఖాదియానీ రైట్ హ్యాండ్ గా  భావించే ముహమ్మద్ అలీ లాహెూరీకి అత్యాశ చూపి ఒక కొత్త జమాఅత్ ప్రారంభించాల్సిందిగా కోరారు. ముహమ్మద్ అలీ వారి కోరిక మేరకు గులామ్ అహ్మద్ ఖాదియానీ ఎప్పుడూ దైవదౌత్యాన్ని ప్రకటించు కోలేదని కేవలం అతను ముజద్దిద్ మరియు ముల్టిమ్ మాత్రమేనని ప్రకటించాడు. 

ముస్లిములను మార్గ భ్రష్టులను చేయడానికి ముహమ్మద్ అలీ లాహెూరీ ఈ కుట్ర పన్నాడు. ఇలా ముస్లిములు అతని ఉచ్చులో చిక్కుకుని ఇస్లామ్ కు దూరమయి ఖాదియానియత్ను ధర్మంగా భావిస్తారనుకున్నాడు. చివరికి ఇలా సామ్రాజ్యవాద శక్తులు మరియు ముహమ్మద్ అలీ లాహెూరీల పరస్పర సహకారాలతో లాహెూరీ జమాఅత్ ఏర్పడింది. [57]

ముహమ్మద్ అలీ లాహెూరీ ఇలా ప్రకటించాడు: నా ఖాదియానీ సోదరులారా! అల్లాహ్ పై ప్రమాణం చేసి చెబుతున్నాను: ఒక వేళ ఈ నమ్మకం సరైనదే అయితే దైవదౌత్య పరంపర ఇంకా పూర్తి కాలేదు. ప్రవక్తలు వస్తూనే ఉంటారు. ఈ విషయాన్ని మహమూద్ అహ్మద్ తన పుస్తకం “అన్వారుల్ ఖిలాఫ’లో దీని గురించి వివరణ ఇచ్చారు. అయినా కూడా వేల సంఖ్యను దాటిన ఈ వర్గాలు ఎందుకు పరస్పరం తిరస్కరించుకుంటున్నాయి? వీటిలోని ఇస్లామీయ ఐక్యత ఎందుకు దూరమవుతుంది? [58]

ముహమ్మద్ అలీ లాహెూరి మొదట్లో మిర్జా గులాం అహ్మద్ బోధనలను ఉన్నదున్నట్టుగా అంగీకరించేవారు. కాని ఆ తరువాత ఆయన మిర్జా ఖాదియానీ చేసిన దైవదౌత్య ప్రకటనకు వివరణ ఏమిచ్చారంటే “మిర్జా గులాం అహ్మద్ ఖాదియాని చేసిన దైవదౌత్య ప్రకటన మరియు ఆయన ప్రబోధించిన ‘హులూలో (ఆత్మ పరమాత్మలో లీనమయ్యే) విశ్వాసం మగత ఆవహించిన స్థితిలో ప్రస్ఫుట మయింది. సూఫీ ఇబ్నె అరబీ తదితరులతో నిరూపితమయిన విషయం లాంటిదే ఇది కూడాను. ఇంకోమాట కూడా ఉంది. ‘నబీ’ అనే పదానికి మొట్టమొదటి అర్ధం శుభవార్త నిచ్చేవాడు. నబీకు హెచ్చరించేవాడని కూడా అర్ధం ఉంది. అంటే భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి సమాచారం ఇస్తాడు.” ఇవే కాకుండా వేరే అనవసర వివరణలు కూడా ఇవ్వసాగారు. [59]

మీ రచయితకు లా హెూరీ ఖాదియానీ జమాఅత్తో చర్చించే, దాని గురించి నేరుగా సమాచారం పొందే అవకాశం దొరికింది. సంభాషణ మధ్యలో వాళ్లు కూడా తమను ముస్లిములుగా భావిస్తారని తెలిసింది. ఖుర్ఆన్ను ప్రస్తావించి దాని నుంచి తమ భావం రాబట్టుకోవటానికి రుజువులు కూడా చూపెడ తారు. కాని హదీసులను మాత్రం వీరు తీవ్రంగా తిరస్కరిస్తారు. హదీసుల్లో సహీహ్ మరియు జయీఫ్ హదీసులు కలగలసిపోయాయని కనుక వీటితో ఆధారాలు చూపడం సరికాదని అంటారు. వీళ్లు గులామ్ అహ్మద్ ఖాదియానీ తొలికాలంలోని కొన్ని రచనలు, ముహమ్మద్ అలీ లాహెూరీ పుస్తకాలు నాకు కానుకగా ఇచ్చారు. క్రింద వాటి పేర్లు పేర్కొనడం జరిగింది. దీంతో ఆ వర్గంవారి మూలగ్రంథాలు ఎలాంటివో, వారు ముస్లిముల్లో ఎలాంటి భావాలను పెంపొందించాలను కుంటున్నారో అర్ధం అవుతుంది. 

నాకు కానుకగా ఇచ్చిన మిర్జా గులామ్ అహ్మద్ పుస్తకాలు: 

  • 1) హుజ్జతుల్ ఇస్లామ్ : రియాజ్ ప్రెస్ అమృత్సర్, ఇండియా ప్రచురణ 
  • 2) అల్ బలాగుల్ ముబీన్: అహ్మదియ అన్జుమన్ ఇషాఅత్ ఇస్లామ్ ముంబై, ఇండియా 
  • 3) ముఖద్దమె హఖీఖతె ఇస్లామ్ : ఆయినె కమాలాతె ఇస్లామ్ నుంచి సేకరణ, ప్రచురణ కర్త పేరు లేదు
  • 4) బగ్దాద్ కానుక : (అరబీ): అలమాఅతుల్ అహ్మదియ ఇషాఅతుల్ . ఇస్లామ్ లాహెూర్ పాకిస్తాన్

ముహమ్మద్ అలీ లాహోరీ మరియు ఇతరుల రచనలు: 

  • 5) బయానుల్ ఖుర్ఆన్: (రెండు పెద్దపెద్ద భాగాల్లో అందమైన ప్రచురణతో) అల్ జమాఅతుల్
    అహ్మదియతుల్ లాహూరియ, లాహెర్, హి.శ. 1401 
  • 6) వఫాతె మసీహ్ వ నుజూలె మసీహ్: అల్ జమీఅతుల్ అహ్మదియ, ఢిల్లీ
  • 7) ఇత్మామె తక్ఫీర్’ అహ్లె ఖిబ్ల అల్ జమీఅతుల్ అహ్మదియ, ఢిల్లీ
  • 8) హఖీఖతె ఇఖ్తిలాఫ్ (ఖాదియానియత్ గురించి) రెండు భాగాల్లో: అల్ జమాఅతుల్ అహ్మదియ, ఢిల్లీ 
  • 9) జమాఅతె అహ్మదీయలోని రెండు వర్గాలు: అల్ జమాఅతుల్ అహ్మదియ, ఢిల్లీ 
  • 10) మన విశ్వాసాలు: సదరుద్దీన్ అల్ జమాఅతుల్ అహ్మదియ, ఢిల్లీ 
  • 11) లా నబియ్య బాదీ: షేర్ ముహమ్మద్ మలిక్ : అల్ జమాఅతుల్ అహ్మదియ, ఢిల్లీ 
  • 12) ఇస్ముహూ అహ్మద్, సదరుద్దీన్: అల్ జమాఅతుల్ అహ్మదియ, ఢిల్లీ
  • 13) ఆకాశపు సాక్షి, ఖుర్షిద్ ఆలమ్, అల్ జమాఅతుల్ అహ్మదియ, ఢిల్లీ
  • 14) అహ్మదీలు ముస్లిములు (దక్షిణాఫ్రికా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు, 1986) 

వాళ్లు ఈ పుస్తకాలన్నీ నాకు (మీ రచయితకు ఉచితంగానే ఇచ్చారు. మొత్తం జమాఅత్ తమ అంధవిశ్వాసాలను వ్యాప్తి చేయడానికి, ప్రచారం చేయ డానికి ఎంత కృషి చేస్తున్నారో విదిత మవుతుంది. వాళ్లు ఈ కార్యం కోసం తమ సమయాన్నే కాకుండా ధనాన్ని కూడా వెచ్చిస్తున్నారు. ‘వహుమ్ యహ్సబూన అన్నహుమ్ యుహాసినూన సున్అ’. 

ప్రస్తావించిన పుస్తకాల్లో ముఖ్య పుస్తకం వారి ఖుర్ఆన్ వ్యాఖ్యానం. అది ‘బయానుల్ ఖుర్ఆన్’ పేరుతో పిలువబడుతుంది. [60]

నేను (మీ రచయిత) బయానుల్ ఖుర్ఆన్ను చదివాను. బయానుల్ ఖుర్ఆన్ వ్యాఖ్యాతకు మరియు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్కు పోలికలున్నాయని స్పష్టమయింది. ఎందుకంటే ఏవిధంగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మార్పులు చేర్పుల ద్వారా ఖుర్ఆనీ విద్యను మరియు భావాలను ప్రకృతి, స్వభావాలకు అనుగుణంగా రూపొందించాలనుకున్నారో మరియు మహిమలు [61]  రఫయె మసీహ్ [62] జిన్నాత్ [63] అగోచర విషయాల ను తిరస్కరించారో అదే విధంగా బయానుల్ ఖుర్ఆన్ వ్యాఖ్యాత కూడా ఈ విషయాలను మరియు వాస్తవాలను తిరస్కరించారు. [64] 

అదేవిధంగా బయానుల్ ఖుర్ఆన్ వ్యాఖ్యాత ఖుర్ఆన్ మరియు దాని వాస్తవ భావాలతో చెలగాటం ఆడాడు. మౌలానా అబుల్ హసన్ అలీ నద్వీ (రహిమహుల్లాహ్) కూడా తన పుస్తకం ‘అల్ ఖాదియానీ వల్ ఖాదియానియత్ లో అందులో మార్పు చేసిన అనేక విషయాల గురించి చర్చించారు. తెలుస్తున్న విషయం ఏమిటంటే, ఖాదియానియత్ తన భావాలు, దృక్పథాలు, విశ్వాసాల దర్పణంలో నేచరీ వర్గం దానికి అనుగుణంగానే ఉంది. వేరేగా లేదు. కొందరు రచయితలు ముహమ్మద్ అలీ లాహెూరీని సర్ సయ్యద్ శిష్యునిగా పరిగణిం చారు. 

[4] ఖాదియానీ విశ్వాసాలు 

[4.1] గులామ్ అహ్మద్ ఖాదియానీ గురించి ఖాదియానీల విశ్వాసాలు: 

ఖాదియానియత్ వర్గ స్థాపకుడు మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానిని విశ్వసించే విషయంలో ఖాదియానీల రెండు వర్గాలలో భేదాభి ప్రాయాలున్నాయి. అహ్మదీ ఖాదియానీ అనే వర్గం గులామ్ మిర్జా దైవ ప్రవక్త అని, మరియు మసీహె మౌఊద్ (పునరాగమన ఈసా అలైహిస్సలామ్) అని, ముస్లిం సమాజం నిరీక్షిస్తున్న మహ్దీ అని అంటారు. ఈ వర్గం వారు నిర్వహించే పత్రిక “అల్ ఫజ్లో” చాలా స్పష్టంగా ‘ వేరే ప్రవక్తల మాదిరిగా గులామ్ అహ్మద్ ఖాదియానీ కూడా ఒక ప్రవక్త’ అని తెలిపింది. అదే విధంగా మిర్జా గులామ్ ఖాదియానీ కుమారుడు మిర్జా షబ్బీర్ అహ్మద్ కూడా ఇలా పేర్కొన్నాడు: సూర్యుడు ఉదయించటం ఎంత స్పష్టమో గులామ్ అహ్మద్ ప్రవక్త అన్న విషయం అంతే స్పష్టం. ముహమ్మద్ ﷺ  ఆయన్ను ‘దైవప్రవక్త’ అని పిలిచారు. అల్లాహ్ ఆయనను యా అయ్యుహన్నబియ్యు’ అని సంబోధిస్తూ వహీ చేశాడు”. [67]

రెండో వర్గం అహ్మదీ లాహెూరీ విశ్వాసం ఏమిటంటే మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ దైవప్రవక్తగాని దైవసందేశహరుడుగాని కాదు. అతను సంస్కర్త మరియు పునరుద్ధారకుడు మాత్రమే. ఆయన్ను తిరస్కరించేవాడు పాపాత్ముడు. దీని గురించి ముహమ్మద్ అలీ లాహోరీ ఇలా ప్రకటించాడు: ‘నేను లాహోూరీ అహ్మదియ వర్గ నేత ముహమ్మద్ అలీ లాహోరీని అల్లాహ్ పై ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను విశ్వసించే విషయం ఏమిటంటే, హజ్రత్ మిర్జాగులామ్ అహ్మద్ కేవలం పునరుద్ధారకుడు మాత్రమే. ఆయన దైవ ప్రవక్త కాదు. ఆయన పునరాగమన ఈసా (అలైహి). ఆయన్ని తిరస్కరించినవాడు ఇస్లాం పరిధిని అతిక్రమించినట్లు కాదు. మిర్జా గులాం అహ్మద్ విశ్వాసం కూడా ఇదే. [68]

అయితే ముహమ్మద్ అలీ లాహోరీ మరియు లాహోరీ జమాఅత్కు సంబంధించి పైన పేర్కొనబడిన విశ్వాసాలు మిర్జా గులాం ప్రబోధనలకు పూర్తి విరుద్ధంగా వున్నాయి. ఎందుకంటే ఈ సంచికలోనే ఈ విషయం కూడా రాయబడి వుంది: మిర్జా గులాం అహ్మద్ ఖాదియానికు మేము మొట్టమొదటి అనుయా యులం, మిర్జా అల్లాహ్ తరపున పంపబడిన ప్రవక్త. ఇది సత్యం. ఉపద్రవాలు తలెత్తుతున్న ఈ యుగంలో అల్లాహ్ ఆయన్ను సత్య మార్గదర్శనం కోసం ఈ లోకానికి పంపించాడు. ఆయనకు విధేయత చూపనిదే సాఫల్యం, విముక్తి సాధ్యం కాదని కూడా మేము విశ్వసిస్తున్నాం. [69]

అదే విధంగా పైన పేర్కొన్న విషయాల నేపథ్యంలో క్రింద పేర్కొనబడు తున్న విషయాలు ఎంత విరుద్ధంగా ఉన్నాయో మీరే గమనించండి. స్వయంగా ముహమ్మద్ అలీ లాహెూరీ ఇలా పేర్కొంటున్నాడు: మిర్జా గులామ్ అహ్మద్ మళ్లీ వస్తానని చెప్పబడిన ఈసా (అలైహి) అని, ముస్లిమ్ సమాజం ఎదురు చూస్తున్న మహ్దీ అని, దైవప్రవక్త అని నేను విశ్వసిస్తున్నాను. ఆయన స్థానం నబీ మరియు రసూల్కు మధ్యలో ఉంటుంది. ఆయన్ను విశ్వసించనివారు సాఫల్యం పొందలేరని మా నమ్మకం. [70]

[4.2] అల్లాహ్ గురించి ఖాదియానీల విశ్వాసం: 

అల్లాహ్ గురించి ఖాదియానీల విశ్వాసం ఏమిటంటే, అల్లాహ్ ఉపవాసాలు ఉంటాడు. నిద్రపోతాడు, మేల్కొంటాడు. రాస్తాడు, ముద్రవేస్తాడు. అల్లాహ్ పొరపాట్లు కూడా జరుగుతాయి. అతను సంభోగం కూడా చేస్తాడు. (సుబ్ హానల్లాహి వ తఆలా అమ్మా యసిపూన్) 

మిర్జా గులాం ఖాదియానీ ఇలా అన్నాడు: తాను నమాజ్ చేస్తానని, ఉపవాసాలు ఉంటానని, నిద్రపోతానని, మేల్కొంటానని అల్లాహ్ నాకు చెప్పాడు.’ [71]

మిర్జా మరోచోట తన సంఘటనను ఇలా తెలుపుతున్నాడు: నేను మగతలో మరియు మహిమల ద్వారా నా ప్రతిపాదనలను ఆమోద ముద్ర వేయడానికి అనేక పత్రాలు నేను అల్లాహ్ ముందు ఉంచడం చూశాను. అల్లాహ్ నా సమక్షంలో ఆ ప్రతిపాదనలను అంగీకరించాడు. వాటిపై ఎర్ర సిరాతో ముద్ర కూడా వేశాడు. నాతో పాటు నా విధేయుడు అబ్దుల్లాహ్ తప్ప ఇంకెవరూ లేరు. అల్లాహ్ వాటిపై సంతకం చేసిన తరువాత తన కలాన్ని విదిలించాడు. దాంతో ఆ ఎర్ర సిరా మరకలు నా దుస్తులపై, అబ్దుల్లాహ్ దుస్తులపై పడ్డాయి. మగతలో నుంచి బయటకు వచ్చిన తరువాత చూస్తే నా బట్టలు, అబ్దుల్లాహ్ బట్టలు ఎర్ర సిరాతో రంగరించి ఉన్నాయి. ఆ సమయంలో మా దగ్గర ఎర్ర సిరా లేదు. అబ్దుల్లాహ్ దగ్గర ఆ బట్టలు ఇప్పటికీ ఉన్నాయి. [72]

[4.3] ఈసా బిన్ మర్యమ్ (అలైహిస్సలాం) గురించి వారి విశ్వాసం: 

గులామ్ అహ్మద్ ఖాదియానీ తనను ఈసా బిన్ మర్యమ్ గా చెప్పుకోడానికి ఈసా (అలైహి)ను రెండు వ్యక్తులుగా చేశాడు. ఒకరు బనీ ఇస్రాయీల్లోని ఈసా అని, ఆయన సహజ మరణం పొందారని అన్నాడు. కాని ఆయన అక్రమ సంతానం అని, తాగుబోతు అని, కాని ఈసా బిన్ మర్యమ్ అల్లాహ్ కుమారుడు అని, ఆయన తాగుబోతు కాదని, అతను తానేనని చెప్పుకొచ్చాడు. 

మిర్జా ఖాదియాని తాను పునరాగమన ఈసానని చెప్పుకునే స్థితిని గురించి ఇలా రాశాడు: తొలి దశలో నన్ను నేను ఒక యవ్వన కన్యగా భావించుకున్నాను. (మర్యమ్ బిస్త్ ఇమ్రాన్). ఆ తరువాత అల్లాహ్ నాలో తన మగతనాన్ని ప్రస్ఫుటం చేశాడు. దాంతో నేను గర్భం దాల్చాను. ఆ తరువాత పది నెలల తరువాత నేను మర్యమ్ బిన్తె ఇమ్రాన్ నుంచి ఈసా బిన్ మర్యమ్ గా మారాను. [73]

దురదృష్టం వరిస్తే నీడ కూడా తోడు విడిచి పోతుందట. ఆంగ్లేయులు మిర్జాను అందరికంటే యోగ్యుడిగా, వివేకవంతునిగా భావించుకున్నారు. కాని అతను ఎంత మూర్ఖుడని తేలాడంటే అతని నోటి నుంచి వెలువడిన మాటలను రాయాలంటే పేపర్ పెన్ను కూడా సిగ్గుతో తలదించు కుంటాయి. మానవత్వం కూడా తల దించుకుంటుంది. “సుమ్మ రదద్నాహు అస్ఫల సాఫిలీన్” భావం ఏమిటో బాహ్యకళ్లు చూశాయి! మీర్జా వాదనలు, ప్రకటనలు చదివి సాధారణ మనిషి కూడా అర్ధం చేసుకుంటాడు అతను ఎంతటి నీచుడో, నికృష్ణుడో. ఒక మంచి వ్యక్తి నోటి నుంచి అలాంటి మాటలు ఎన్నటికీ రావు. 

[4.4] దైవదౌత్యం మరియు దైవదౌత్య సమాప్తం గురించి ఖాదియానీల వైఖరి: 

దైవదౌత్యం మరియు దైవదౌత్య సమాప్తం గురించి ఖాదియానీల విశ్వాసం ఏమిటంటే, ముహమ్మద్ ﷺ తోనే దైవదౌత్యం పూర్తి కాలేదు. ఈ పరంపర ప్రళయం వరకు కొనసాగుతుంది. అల్లాహ్ అవసరాన్ని బట్టి ప్రవక్తలను పంపు తూనే ఉంటాడు. మిర్జా గులామ్ అహ్మద్ దైవ ప్రవక్తల్లో ఉత్తమ ప్రవక్త.[74]

మిర్జా ఇలా పేర్కొంటాడు: ‘ప్రపంచంలో ఎవరికీ ప్రసాదించని వస్తువులను నాకు ప్రసాదించాడు’. [75]. ఇంకా ఇలా అన్నాడు: ‘సామూహికంగా ప్రవక్తలందరికీ కలిపి ఇచ్చిన వస్తువులను నాకొక్కనికే ఇవ్వడం జరిగింది’.[76]

మిర్జా గులామ్ అహ్మద్ ఖాదియానీ కుమారుడు మిర్జా మహమూద్ అహ్మద్ ఇలా పేర్కొన్నాడు: అల్లాహ్ అవసరాన్ని బట్టి ఈ సమాజం మార్గదర్శ కత్వం కోసం తప్పనిసరిగా ప్రవక్తలను పంపుతూనే ఉంటాడని ఖాదియానీలమైన మేము విశ్వసిస్తాం’. [77]

ఆయన ఇంకా ఇలా పేర్కొన్నాడు: అల్లాహ్ ఖజానా ఖాళీ అయిందని ప్రజలు భావిస్తున్నారా? వారు అలా భావిస్తున్నట్లయితే అది తప్పు. వారికి అల్లాహ్ శక్తి గురించి తెలీదు. ఒక్క ప్రవక్త కాదు వేల సంఖ్యల్లో ప్రవక్తలను ఆయన పంపగలడు. [78]

[4.5] ఖుర్ఆన్ మరియు దైవవాణి గురించి వారి విశ్వాసం: 

మిర్జా గులామ్ ఖాదియాని విశ్వాసం ఏమిటంటే, అతని దగ్గర దైవవాణి తీసుకువచ్చే దూత ఒక ఆంగ్లయువకుడు. అతని దగ్గరికి ఆంగ్లంలో దైవవాణి వస్తుంది. 

మిర్జా ఖాదియాని ఇలా అంటున్నాడు: ‘నేను జిబ్రయీల్ ను ఒక అందమైన ఆంగ్ల యువకుని రూపంలో చూశాను. అతని వయసు సుమారు 20 సంవత్స రాలు ఉంటుంది. అతను ఒక కుర్చీ మీద ఆసీనుడై ఉన్నాడు. అతని ముందు ఖరీదైన ఒక టేబుల్ ఉంది. నేను అతనితో ‘మీరు చాలా అందంగా ఉన్నారు’ అన్నాను. అతను అవునన్నట్టు అంగీకరించాడు. ఆంగ్లంలో ‘I Love You’ (నేను నిన్ను ప్రేమిస్తున్నాను), ‘I am with you’ (నేను నీతో ఉన్నాను), I shall help you (నేను నీకు సహాయం చేస్తాను). దాంతో పాటే నాపై వణుకు ఆవహించింది. I can do what I want (నేను చేయాలనుకున్న దాన్ని చేస్తాను అని అన్నాడు. నేను అతని భాషను, మాటతీరును బట్టి అతను ఒక ఆంగ్ల యువకుడని అర్ధం చేసుకున్నాను. అతను నా తల దగ్గర ఉన్నాడు.’ [79]

మిర్జా ఖాదియానీ ఇలా కూడా అన్నాడు: జిబ్రయీల్ నా దగ్గరకు వచ్చారు. నన్ను ఎన్నుకున్నారు. నా వైపు వేలితో సైగ చేస్తూ, అల్లాహ్ శత్రువుల నుంచి నిన్ను రక్షించుగాక! అన్నారు. [80]

ఇంకా ఇలా అన్నాడు: మహిమాన్వితుడైన అల్లాహ్ పై ప్రమాణం చేసి చెబుతున్నాను: ఏ విధంగా నేను ఖుర్ఆన్ మరియు ఆకాశ గ్రంధాలను విశ్వసిస్తానో అదే విధంగా నేను నాపై అవతరించే దైవవాణిని విశ్వసిస్తాను. నాపై అవతరించబడే దైవవాణి అల్లాహ్ వాక్కులని నేను విశ్వసిస్తున్నాను. ఖుర్ఆన్ అల్లాహ్ అవతరింపజేసిన గ్రంధమని ఎలా విశ్వసిస్తున్నానో ఇది కూడా అలాంటిదేనని విశ్వసిస్తున్నాను.” [81]

ఖాదియానీల విశ్వాసం ఏమిటంటే, వారి గ్రంధం అల్లాహ్ వైపు నుంచే అవతరించింది. దాని పేరు “కితాబున్ ముబీన్ (స్పష్టమైన గ్రంధం)”. అది ఖుర్ఆన్ కాదు. ముహమ్మద్ యూసుఫ్ ఖాదియానీ ఇలా అంటున్నాడు: అల్లాహ్ గులామ్ అహ్మద్ ఖాదియానీకి కలిగిన దైవిక సంకేతాలన్నిటిని కలిపి ‘అల్ కితాబుల్ ముబీన్’ అని పేరు పెట్టాడు. ప్రతి ఒక ఇల్హామ్ కు ఆయత్ అని పేరు పెట్టాడు. కనుక ఎవరయితే ప్రవక్త కోసం గ్రంధం అవతరించడం తప్పనిసరి అంటారో వారు మిర్జా గులామ్ అహ్మద్ దైవదౌత్యాన్ని విశ్వసించాలి. ఎందుకంటే అల్లాహ్ ఆయన పై గ్రంధాన్ని అవతరింపజేశాడు. దానికి ‘అల్ కితాబుమ్ ముబీన్’ అని పేరు పెట్టాడు. అల్లాహ్ ఈ గుణంతో సత్కరించాడు. తిరస్కారులకు ఈ విషయం ఎంత కంటగింపుగా మారినా సరే. [82]

[4.6] ఖాదియాన్ నగరం గురించి వారి విశ్వాసం: 

ఖాదియాన్ నగరం గురించి ‘అల్ ఫజల్’ అనే పత్రికలో ఖాదియాన్ అంటే ఏమిటో రాసి ఉంది. అది అల్లాహ్ స్పష్టమైన గొప్ప చిహ్నాల్లో ఒకటి. ఏ విధంగానయితే హజ్రత్ పునరాగమనం చెందిన ఈసా(మిర్జాగులామ్ ఖాదియానీ) పేర్కొన్నాడో. ఈ నగరం దైవప్రవక్త సామ్రాజ్యం, నివాసం, జన్మస్థలం, మరణించిన భూమి కూడా. ఈ నగరంలో ఒక ఇల్లు ఉంది. అందులో ప్రపంచానికి సాఫల్యం ఇచ్చేవాడు, దజ్జాల్ ను చంపేవాడు, శిలువను విరగ్గొట్టే వాడు, ఇస్లామ్ ధర్మాన్ని ఇతర ధర్మాలపై ఆధిపత్యం వహించేలా చేసేవాడు ఉన్నాడు. [83]

ఖాదియానీల రెండో ఖలీఫా మహమూద్ అహ్మద్ బిన్ మిర్జా ఖాదియానీ ఇలా పేర్కొన్నాడు: మీకు నేను సత్యమే చెబుతాను. ఖాదియాన్ భూభాగం చాలా పవిత్రమైందని నాకు తెలుపడం జరిగింది. అందులో అతనికి మక్కా, మదీనాపై అవతరించే పవిత్ర అనుగ్రహాలు అవతరిస్తాయి. [84]

‘అల్ ఫజల్’ పత్రికలో ఇలా కూడా ఉంది: 

“بے شک سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام  إلى المسجد الأقصى الذي باركنا حوله (۸۵) 

‘నిశ్చయంగా సుబహానల్లజీ అస్రా బి అబ్ దిహీ లైలమ్ మినల్ మస్జిదిల్ హరామి ఇలల్ మస్జిదిల్ అఖ్సలజీ బారక్ నా హౌలహూ” [85] లో మస్జిదె అఖ్సా అంటే మస్జిదె ఖాదియాన్ అని భావం. ఎందుకంటే ముహమ్మద్ ﷺ ను మస్జిద్ హరామ్ నుంచి ఈ మస్జిద్ వరకే తీసుకెళ్లడం జరిగింది. ఇది ఖాదియాన్ కు తూర్పు దిశలో ఉంది. అది గులామ్ అహ్మద్ ఖాదియానీ మహిమల కేంద్రం. దీన్ని ప్రవక్త ﷺ కు కానుకగా ఇచ్చారు. [86]

ఖాదియానీల ఇలాంటి అబద్ధపు ప్రకటనలు నిశ్చయంగా ముస్లిములను బైతుల్ మక్దిస్  మరియు మస్జిద్ అక్సాకు దూరం చేయడానికి పన్నిన హేయమైన కుట్ర. అల్లాహ్ మమ్మల్నందరినీ వారి కుట్రల నుంచి, కుతంత్రాల నుంచి రక్షించుగాక! (ఆమీన్) 

[4.7] ఖాదియానియత్ ఒక నూతన ధర్మం మరియు ప్రత్యేక షరీఅత్ 

ఖాదియానీలు తాము ఒక కొత్త ధర్మాన్ని అవలంబిస్తున్నామని, తమకు ఒక ప్రత్యేక షరీఅత్ ఉందని, మిర్జా అనుయాయులు (సహాబీలు), ప్రవక్త అనుయాయులని భావిస్తారు. మిర్జా ఇలా పేర్కొంటున్నాడు: 

నా సమాజం రెండు వర్గాలుగా చీలిపోతుంది. ఒక వర్గం ఈసా తత్వాన్ని అనుసరిస్తుంది, అది నాశనమవుతుంది. మరో వర్గం మహ్దీ విధానాన్ని అవలంబిస్తుంది. అది సాఫల్యం పొందుతుంది. [87]

మీర్జా ఖాదియానీ ఇంకా ఇలా అన్నాడు: షరీఅత్ అంటే ఏమిటో బాగా తెలుసుకోండి. ఆదేశాలు, ఆంక్షలనే షరీఅత్ అంటారు. కనుక ఎవరయితే ఈ విధిని నిర్వహిస్తారో తన సమాజం కోసం ఏదైనా ధర్మాన్ని రూపొందిస్తాడో అతను ధర్మకర్త అనబడతాడు. కనుక నేను కూడా ధర్మకర్తనే. ఎందుకంటే నాక్కూడా ఆదేశాలు, ఆంక్షల గురించి దైవవాణి అవతరించింది. ఏదైనా ధర్మంలో కొత్త ఆదేశాలే ఉండాలన్న ఆంక్ష ఏమీ లేదని బాగా గుర్తుంచుకోండి. ఖుర్ఆన్లో ఉన్న బోధనలే తౌరాత్ గ్రంధంలో ఉన్నాయన్న విషయం మీకు తెలీదా? ఇది దాన్నే సూచిస్తుంది: ‘ఇన్న హాజా లఫిస్సుహుఫిల్ ఊలా సుహుఫి ఇబ్రాహీమ వ మూసా”. [88]

ఇంకా ఆయన ఇలా అన్నాడు నా వర్గంలో చేరిన వాడు వాస్తవంగా ముహమ్మద్ ﷺ  అనుయాయుల్లో (సహాబీల్లో) పరిగణించబడతాడు’. ‘అల్ ఫజల్’ పత్రికలోని వాక్యం ఇలా ఉంది: నిశ్చయంగా ఎవరయితే ఖాదియానియత్ను విశ్వసించి గులామ్ అహ్మద్ ను చూస్తాడో అతను ‘సహాబీ’ అనబడతాడు. [90]

ఎదేమైనప్పటికీ, స్పష్టమైన ఈ ఆధారాల ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే ‘ఖాదియానియత్ ఇస్లామ్ కు వ్యతిరేకం మరియు అది అసత్య ధర్మం. ఏకేశ్వరోపాసన, దైవదౌత్యంపై కాకుండా వేరే రెండు ఇతర పునాదులపై ఏర్పడింది. మిర్జాగులామ్ ఖాదియాని తన నోటితోనే అనేక సార్లు ఈ విషయాన్ని వెల్లడించాడు. షహాదతుల్ ఖుర్ఆన్లో ఇలా రాస్తున్నాడు: నిశ్చయంగా నేను ప్రజలకు బోధిస్తున్న ఇస్లాం ధర్మం రెండు పునాదులపై ఆధారపడి ఉంది. ఒకటి, మేము అల్లాహ్ కు విధేయత చూపాలి. రెండోది, మాకు సుఖశాంతులు కల్పించి, తన ఛాయలో చోటు కల్పించి శత్రువుల నుంచి రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వానికే విధేయులవ్యాలి. అదే బ్రిటీష్ ప్రభుత్వం. ” [91]

ఈ విస్పష్ట రుజువుల ఆధారంగా పాకిస్తాన్ ప్రభుత్వ కేంద్ర న్యాయ శాఖ ఈ విధంగా తన చారిత్రాత్మక తీర్పును వెలువరించింది: ఖాదియానియత్ తన సంపూర్ణ అభివృద్ధిలో మైనారిటీ కలది. తమను ముస్లిములుగా ప్రకటించుకునే అనుమతి వారికి లేదు. వారి ఆరాధనాలయాలను మస్జిద్ అని కూడా పిలువకూడదు”. [92]

విశ్వాస ప్రదాయిని (తఖ్వియతుల్ ఈమాన్) – Taqwiyatul Iman [పుస్తకం]

బిస్మిల్లాహ్

విశ్వాస ప్రదాయిని (Taqwiyatul Iman – తఖ్వియతుల్ ఈమాన్)
(ప్రతి ధార్మిక పౌఠశాలలో బోధన, శిక్షణ, అధ్యయనం కొరకు ఉండవలసిన పుస్తకం)
ఉర్దూ మూలం: హదీసు వేత్త షాహ్ ఇస్మాయీల్ ( రహిమహుల్లాహ్)
(Shah Ismaeeil Shaheed (rahimahullah))
ప్రకాశకులు: గ్రామీణ ముస్లిం స్వయం శిక్షణాభివృద్ధి గ్రంథాలయం
నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆం.ప్ర

[ఇక్కడ పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [112 పేజీలు]

చాఫ్టర్లు

విషయసూచిక

1వ అధ్యాయం – తౌహీద్ (దేవుని ఏకత్వం) వివరణ [PDF] [8p]

  1. ప్రజల అజ్ఞానం
  2. షిర్క్ చేష్టలు
  3. విశ్వాస వాదనలు షిర్క్ చేష్టలు
  4. ఖుర్ఆన్ తీర్పు
  5. అల్లాహ్ తప్ప అధికారం గలవాడు ఎవడూలేడు
  6. అల్లాహ్ తప్ప మరో సంరక్షకుడు ఎవరూ లేడు
  7. అల్లాహ్ తప్ప కార్యసాధకుడు ఎవడూ లేడు
  8. షిర్క్ వాస్తవికత

2వ. అధ్యాయం – షిర్క్ (బహుదైవారాధన) రకాలు [PDF] [7p]

  1. జ్ఞానంలో షిర్క్
  2. అధికారంలో షిర్క్
  3. ఆరాధనల్లో షిర్క్
  4. రోజువారి పనుల్లో షిర్క్

3వ. అధ్యాయం – షిర్క్ లోని కీడు, తొహీద్ లోని మేళ్ళు [PDF] [13p]

  1. బహుదైవారాధన క్షమార్హం కాదు
  2. షిర్క్ కు దృష్టాంతం
  3. షిర్క్ మహాపరాధం
  4. సాఫల్యానికి మార్గం తౌహీద్
  5. అల్లాహ్ షిర్క్ ను లెక్కచెయ్యడు
  6. ఆత్మావస్థలో తౌహీద్ అంగీకారం
  7. షిర్క్ ధృవపత్రం కాజాలదు
  8. ‘మరుపు సాకు’ స్వీకరించబడదు
  9. ప్రవక్తల, గ్రంథాల మౌలిక బోధన
  10. ఏకదైవారాధన మరియు మన్నింపు

4వ. అధ్యాయం – అగోచర జ్ఞానంలో షిర్క్ ఖండన [PDF] [10p] – [పోస్ట్ లింక్]

  1. షిర్క్ ఖండన
  2. అగోచరాల జ్ఞానం కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది
  3. అగోచర జ్ఞానముందని చెప్పేవాడు అబద్ధాల కోరు
  4. అగోచరాల జ్ఞానం
  5. అల్లాహ్ ను తప్ప వేరే వారిని మొరపెట్టుకోకండి
  6. లాభనష్టాలు కేవలం అల్లాహ్ మాత్రమే కలిగించగలడు
  7. ప్రవక్తల అసలు మిషన్
  8. ప్రవక్తలు అగోచర జ్ఞానులు కారు
  9. అగోచర జ్ఞానం గురించి ప్రవక్త ప్రవచనం
  10. మాతృమూర్తి ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉద్బోధ
  11. అల్లాహ్ తప్ప అగోచర విషయాలు తెలిసిన వారు ఎవరూ లేరు

5వ. అధ్యాయం – అధికారం వినియోగంలో షిర్క్ ఖండన [PDF] [15p]

  1. అల్లాహ్ ను మాత్రమే శరణు వేడుకోవడం
  2. లాభనష్టాలు అల్లాహ్ మాత్రమే కలిగించగలడు
  3. అల్లాహ్ తప్ప ఎవరూ ఉపాధి ప్రదాత కారు
  4. అల్లాహ్ నే మొరపెట్టుకోండి
  5. అనుమతితి లేనిదే సిఫారసు లేదు
  6. సిఫారసు రకాలు
  7. గౌరవభావ సిఫారసు అసాధ్యం
  8. ప్రేమ కలిగిన సిఫారసు అసాధ్యం
  9. అనుమతితో సిఫారసు
  10. రుజుమార్గం
  11. అల్లాహ్ ప్రతి ఒక్కరికీ సమీపంలో ఉన్నాడు
  12. అల్లాహ్ పైనే భారం మోపాలి
  13. బంధుత్వముూ పనికిరాదు

6వ. అధ్యాయం – ఆరాధనల్లో షిర్క్ నిషిద్ధం [PDF] [16p]

  1. ఆరాధన నిర్వచనం
  2. ఆరాధన కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకం
  3. సజ్దహ్ (సాప్టాంగం) కేవలం అల్లాహ్ కు మాత్రమే
  4. దైవేతరులను మొరపెట్టుకోవడం షిర్క్
  5. అల్లాహ్ చిహ్నాలను గౌరవించాలి
  6. దైవేతరుల పేరు తీసుకున్న వస్తువు నిషిద్ధం
  7. అధికారం కేవలం అల్లాహ్ ది మాత్రమే
  8. ఇష్టమొచ్చిన దేవుళ్ళ పేర్లు పెట్టడం షిర్క్
  9. స్వయం కల్పిత ఆచారాలు షిర్క్
  10. ప్రజలను తమ గౌరవార్థం నిలుచోబెట్టి ఉంచడం నిషిద్ధం
  11. విగ్రహాల ఆస్థానాల ఆరాధనా భావం కూడా షిర్క్
  12. దైవేతరుల పేర జిబహ్ చేయడం శాపార్హం
  13. ప్రళయ సూచనలు
  14. ఆస్థాన పూజ చేయడం దుర్జనుల పని
  15. విగ్రహాల ప్రదక్షిణ

7వ అధ్యాయం – ఆచార వ్యవహారాలలో షిర్క్ నిషిద్ధం [PDF] [29p]

  1. షైతాను కలతలు
  2. సంతానం విషయంలో షిర్క్ వైపు తీసుకుపోయే దురాచారాలు
  3. వ్యవసాయ వ్యవహారాలలో షిర్క్ దురాచారాలు
  4. పశువుల విషయంలో షిర్క్ కు గురిచేసే దురాచారాలు
  5. హలాల్ హరామ్ (ధర్మం-అధర్మం)
  6. నక్షత్రాల వల్ల లాభనష్టాలు జరుగుతాయని భావించడం షిర్క్
  7. జ్యోతిష్కుడు మాంత్రికుడు,…..
  8. జ్యోతిష్య సంఖ్యా శాస్త్రాలపై విశ్వసించే పాపం
  9. శకునము మరియు సగినము చూడటం కుఫ్ర్ ఆచారాలు
  10. అల్లాహ్ ను సిఫారసుదారునిగా చేయకండి
  11. అల్లాహ్ కు అత్యంత ఇష్టమైన పేర్లు
  12. అల్లాహ్ పేర్లతో ఉపనామాలను జోడించకండి
  13. కేవలం ‘అల్లాహ్ తలిస్తే’ అనండి
  14. దైవేతరుల పై ప్రమాణం చేయడం షిర్క్
  15. మ్రొక్కుబడుల గురించి ప్రవక్త ( సల్లల్లాహు అలైహి వసల్లం) తీర్పు
  16. సజ్దహ్ కేవలం అల్లాహ్ కొరకే మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను గౌరవించండి
  17. ఎవరినైనా దాసుడనిగానీ, దాసి అని గానీ అనడం.
  18. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను గౌరవించే విధానం
  19. ‘సయ్యద్’ పదానికి రెండు అర్థాలు
  20. చిత్రాల గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనాలు
  21. ఘోరమైన ఐదు పాపాలు
  22. తన గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనాలు

షాహ్ ముహమ్మద్ ఇస్మాయీల్ (జననం 26-4-1779, మరణం 6-5- 1831) ఆయన తండ్రి షాహ్ అబ్దుల్ ఘనీ, ఆయన తండ్రి షాహ్ వలీవుల్లాహ్ హదీసువేత్త ఢిల్లీ నివాసి, షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ్యహ్, ఇంకా ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హబ్ గారి సందేశ, సంస్కరణా సేవలు ఆధునిక ధోరణితో కూడి ఉండేవి. ఆయన క్రీ.శ. 1826 (హిజ్రీ 1241)లో ప్రపంచంలోని రెండవ పెద్ద ముస్లిం జనాభా గల భారత ఉపఖండంలో ముస్లింల విశ్వాసాల సంస్కరణ కోసం సమగ్రమూ సర్వజనామోదమూ గల పరిభాషలో “తఖ్వియతుల్ ఈమాన్” (విశ్వాస ప్రదాయిని) అనే రచనను చేశారు.

“విశ్వాసం” అనే అంశంపై ఆ కాలంలో ఇది ఎన్నదగిన రచన. సామాన్య ప్రజానీకానికి మనోపరిశుద్ధత రీతిలో దాదాపు 200 ఏళ్ళుగా క్రమం తప్పక కొనసాగుతూ షాహ్ వలివుల్లాహ్ గారి ఈ విజ్ఞాన వారసత్వం సామాన్యులకు, విద్యావంతులకు ఉనికిపట్టు. మరియు అన్ని వర్గాల వద్ద ఆమోదయోగ్యం పొంది పాఠ్యప్రణాళికలో ఉన్న రచన.

మాకాన లిల్లాహి యబ్ ఖా వమాకాన లి గైరిల్లాహి యన్ ఫద్ ” (ఇమామ్ మాలిక్)

అర్థం: ఏ పని అయితే స్వచ్ఛతగా అల్లాహ్ కొరకు చేయబడుతుందో అది ఎప్పటికీ మిగిలి ఉంటుంది. మరి ఏదైతే మనోవాంఛలకు లోనై అల్లాహ్ యేతరుల కొరకు చేయబడుతుందో అది నశించిపోతుంది.

షాహ్ ఇస్మాయీల్ (రహ్మతుల్లాహ్ అలైహ్) గారి సుమారు 12 రచనలలో ఇది బాగా ప్రాచుర్యం పొందిన రచన. దీనిని ఆయన 200 ఏళ్ళ నాటి “ప్రాచీన మొఘలాయి ఉర్దూ” భాషలో రచించారు. తరువాత 1989లో గులాం రసూల్ మహర్ గారు ఆధునిక ఉర్దూలో సరిక్రొత్తగా సంస్కరించి సంకలన పర్చారు.

మేము ఆ ప్రతినే వాడుకభాషలో అనువదింపజేస్తూ స్థానిక ప్రజల సిలబస్ శైలిలో మలిచాము. ధార్మిక పాఠశాలల వారు దీనిని సిలబస్ గా చేర్చుకునే విధంగా రూపొందించాము.

1989 నుండి 2011 వరకూ కూడా షాహ్ ఇస్మాయీల్ (రహిమ హుల్లాహ్) గారి ఈ చారిత్రక రచనను స్థానిక ఆధునిక సిలబస్ గా బోధించే ధార్మిక పాఠశాలల్లో చేర్చకపోవడం శోచనీయం. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, వివిధ ఆలోచనా విధానాలు గల మదర్సాలు దీనిని సిలబస్ లో చేర్చడం జరిగింది. అయితే దీనిలోని కొన్ని సూక్ష్మమైన లోపాలను సరిదిద్దటం కూడా జరగలేదు.

ప్రియసోదరుడు అతీఖుర్రహ్మాన్ ఖురైషీ ఉమరి ప్రాంతీయ ఆధునిక ధోరణి మరియు పాఠ్యప్రణాళిక రీతిలో ఉదాహరణకు సారాంశం, సంక్షిప్తమైన ప్రశ్నలు, తప్పొప్పులను గుర్తించటం, ఖాళీలను పూరించటం వంటి అంశాలను కూడా చేర్చడానికి సహకరించడం జరిగింది. దానికి తోడు ప్రముఖ దాయి (ధర్మ ప్రచారకులు) జనాబ్ ఫజ్లుర్రహ్మాన్, హైదరాబాద్ గారు ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సూక్ష్మ దృష్టితో దీని భాషను సరళీకరించి సులభగ్రాహ్యం చేశారు. “జజాహుల్లాహు ఖైరన్” (అల్లాహ్ వారికి మంచి ప్రతిఫలం ప్రసాదించుగాక!) ఆమీన్.

ఆంధ్రప్రదేశ్ మారుమూల గ్రామాలలో ధార్మిక పరిజ్ఞానం లేనందువల్ల ధర్మభ్రష్ఠత్వానికి గురైన అమాయక ముస్లింలకు వీరి భాషలో మౌలిక, ధార్మిక బోధనలకు సరళమైన రీతిలో సుబోధకంగా అందించడానికి గ్రామీణ ముస్లిం స్వయం శిక్షణాభివృద్ధి గ్రంథాలయం నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, కేవలం ధర్మ పరిచయం కోసం (వ్యాపార ప్రయోజనాల కోసం కాదు) ధార్మిక పరిజ్ఞాన సాహిత్యం, అనువాదం మరియు ప్రచురణల కార్యక్రమాన్ని వివిధ ఆశయాలతో ప్రారంభించింది.

  • స్థానిక ధార్మిక పండితులు, ధర్మప్రచారకులు మరియు సామాన్య ప్రజానీకానికి ఒక జ్ఞాన ఉనికిపట్టు కావాలని.
  • బహుదైవారాధన, ధర్మంలో కొత్త పోకడల ధోరణులకు అడ్డుకట్ట కట్టాలని.
  • ప్రతి ఒక్కరు ఖుర్ఆన్, హదీసు బోధనల నుండి ప్రవక్త సహచరులు మరియు వీరి అనుచరుల విధానాలను సునాయాసంగా గ్రహించి ప్రయోజనం పొందాలని ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది.
  • ఈ కార్యక్రమంలో ఒక భాగమే చేతిలో ఉన్న ఈ పుస్తకం సీరిస్ నెం.11. ఈ కార్యక్రమం ధర్మరాహిత్యాన్ని తొలగించే ప్రయత్నాల్లో ఒక మైలురాయిగా కావాలని ఆశిస్తూ… మీ ధార్మిక అభిలాషను కోరుతున్నాము.

అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో

ఓ ప్రభూ! నీకు వేనవేల కృతజ్ఞతలు. నీవు మాపై అపార అనుగ్రహాలను అవతరింపజేశావు. నీ సత్యధర్మమార్గ నిర్దేశనం చేశావు. మమ్మల్ని ఏకదైవారాధకులను చేశావు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనుచర సమాజం (ఉమ్మత్) లో పుట్టించావు. ధార్మిక ఆసక్తిని కలిగించావు. ధార్మికులపై ప్రేమను ప్రసాదించావు. ఓ అల్లాహ్ ! నీ ప్రియప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన అనుచరులపై వారి వారసులపై నీ కారుణ్యాన్ని, శాంతిని కురిపించు. మమ్మల్ని కూడా వారిలో చేర్చు. ఇంకా ఇస్లామీయ జీవన పద్ధతిలో జీవించే భాగ్యాన్ని అనుగ్రహించు. విశ్వాస స్థితిలోనే మాకు మరణాన్ని ప్రసాదించు. ఆయన విధేయుల వరుసలో మా పేరును చేర్చు – ఆమీన్.

2. దాసుడు మరియు దాస్యం

మానవులందరూ అల్లాహ్ దాసులు. దాస్యం (విధేయత) చూపడమే దాసుని పని. తప్పించుకు తిరగేవాడు దాసుడు కాజాలడు. దాస్యం మానవ విశ్వాస సంస్కరణపై ఆధారపడి ఉంది. విశ్వాసంలో దోషం వున్నవారి ఆచరణ స్వీకరించ బడదు. ఎవరి విశ్వాసంలో కల్తీ ఉందో వారి ఆచరణ స్వీకరించ బడదు. సరైన విశ్వాసం గల వ్యక్తి స్వల్ప ఆచరణ కూడా అమూల్యమైనదే. కనుక ముస్లింనని చెప్పుకునే ప్రతి వ్యక్తి విశ్వాసాన్ని సరిదిద్దుకోడానికి ప్రయత్నించాలి. విశ్వాస సంస్కరణకు అన్నిటికంటే ప్రాధాన్యత ఇవ్వాలి.

3. ప్రస్తుత పరిస్థితి

నేడు ప్రజలు అనేక మార్గాలను ఏర్పరుచుకున్నారు. కొందరు తాత ముత్తాతల ఆచారాలను అవలంబిస్తున్నారు. మరి కొందరు మహాత్ముల విధానాల్ని అనుసరిస్తున్నారు. ఇంకొందరైతే ధార్మిక పండితులు స్వయంగా కల్పించుకుని చెప్పిన మాటలను ధృవపత్రాలుగా చూపిస్తున్నారు. బుద్ధికి సానబెట్టి ధార్మిక విషయాల్లో జోక్యం చేసుకుంటున్న వారు కూడా ఉన్నారు.

4. అన్నింటికంటే మేలైన మార్గం

దివ్య ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన హదీసులు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరుల పద్ధతిని ప్రామాణికంగా తీసుకున్నదే మేలైన మార్గం. ఈ మూడు చెలమల (దివ్య ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన హదీసులు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం సహచరుల పద్ధతి)తోనే హృదయాన్ని సేద తీర్చాలి. ధార్మిక విషయాల్లో మనస్సు చెప్పినట్లు జోక్యం చేసుకోకూడదు. మహాత్ముల మాటలుగాని, పండితుల పరిష్కారాలుగానీ, ఖుర్ఆన్ ప్రామాణిక హదీసులకు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహచరుల పద్ధతికి అనుగుణంగా ‘ఉంటేనే అంగీకరించాలి. వాటికి విరుద్ధంగా ఉంటే వదలిపెట్టాలి.

5. ధర్మాన్ని అర్థం చేసుకోవడం కష్టం కాదు

ఖుర్ఆన్, హదీసులను అర్థం చేసుకోవడం చాలా కష్టమని ప్రజల్లో ఒక అపోహ ఉంది. వాటిని అర్థం చేసుకోవాలంటే పెద్ద చదువులు చదవాలని, తాము అజ్ఞానులమని అలాంటప్పుడు వాటికనుగుణంగా ఎలా నడుచుకోవాలని, పుణ్యాత్ములు మహాత్ములే వాటిని ఆచరించగలరని భావిస్తారు. వారి భావన నిరాధారమైంది.

అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో చాలా స్పష్టంగా సెలవిచ్చాడు.

2:99 وَلَقَدْ أَنزَلْنَا إِلَيْكَ آيَاتٍ بَيِّنَاتٍ ۖ وَمَا يَكْفُرُ بِهَا إِلَّا الْفَاسِقُونَ

(ఓ ప్రవక్తా!) స్పష్టమైన సూచనలను మేము నీపై అవతరింపజేశాము. అవిధేయులు తప్ప వేరెవరూ వాటిని త్రోసిపుచ్చరు. (దివ్య ఖుర్ఆన్-2: 99)

దైవ వాక్యాలు చాలా స్పష్టమైనవే గాక వాటిని అర్థం చేసుకోవడం చాలా సులువు. కాని వాటిని ఆచరించడమే కష్టం. ఎందుకంటే మనస్సుకు విధేయత చూపడం కష్టమనిపిస్తుంది. ఈ కారణంగానే అవిధేయులు ఆచరించరు.

6. ప్రవక్తలు ఎందుకు వచ్చారు?

దివ్య ఖుర్ఆన్ హదీసులను అర్థం చేసుకోవడానికి ఉన్నతమైన చదువులే అవసరం లేదు. ఎందుకంటే ప్రవక్తలు తెలియని వారికి రుజుమార్గం చూపేందుకు, అజ్ఞానులకు జ్ఞానం నేర్పడం కోసం, మూర్ఖులకు అర్థమయ్యేలా చెప్పడం కోసమే వచ్చారు.

అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు:

62:2 هُوَ الَّذِي بَعَثَ فِي الْأُمِّيِّينَ رَسُولًا مِّنْهُمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِن كَانُوا مِن قَبْلُ لَفِي ضَلَالٍ مُّبِينٍ

ఆయనే నిరక్షరాస్యులైన జనులలో – స్వయంగా వారిలోనుంచే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. అతడు వారికి అల్లాహ్ వాక్యాలను చదివి వినిపిస్తున్నాడు. వారిని పరిశుద్ధపరుస్తున్నాడు, వారికి గ్రంథాన్నీ, వివేకాన్ని బోధిస్తున్నాడు. అంతకు ముందు వారు స్పష్టమైన మార్గవిహీనతకు లోనైఉండేవారు. (దివ్యఖుర్ఆన్ – 62 : 2)

అల్లాహ్ ఇలాంటి ప్రవక్తను పంపడం గొప్ప అనుగ్రహం. ఆయన అజ్ఞానులను జ్ఞానులుగా, అపవిత్రులను పవిత్రులుగా, అభాగ్యులను భాగ్యవంతులుగా, మార్గభ్రష్టులను మార్గదర్శకులుగా చేశారు. ఈ ఆయత్ ను అర్థం చేసుకుని కూడా ఎవరయినా, ఖుర్ఆన్ హదీసులను పండితులే అర్థం చేసుకోగలరు అని అంటే వారు ఈ సూక్తిని తిరస్కరిస్తున్నారు. విశ్వప్రభువు ప్రసాదించిన అనుగ్రహాన్ని గౌరవించడంలేదు. ఈ ఆయత్ ప్రకారం పామరులు పండితులవుతారు, మార్గ భ్రష్టులు మార్గం పొంది మహాత్ములవుతారు.

7. వైద్యుడు, రోగి

ఉదాహరణకు ఒక వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతని దైన్య స్థితికి జాలిపడి ఫలానా వైద్యుడి వద్దకు వెళ్లి వైద్యం చేయించుకోమని సలహా ఇచ్చాడు మరొకడు. “ఆరోగ్యవంతుడైన డాక్టరు వద్దకు ఆరోగ్యవంతులు వెళతారు. కాబట్టి నేను అతని వారి వద్దకు వెళ్ళి వైద్యం చేయించుకోను” అని అంటే అతని గురించి మీరు ఏమనుకుంటారు? పిచ్చివాడేమో, ఆ వైద్యుడి మీద అతనికి నమ్మకం లేదేమో అనుకుంటారు. ఎందుకంటే వైద్యుడు రోగులకే వైద్యం చేస్తాడు. ఆరోగ్యంగా ఉన్న వారికి కాదు.

భావం ఏమిటంటే, పుణ్యాత్ములు, పండితులతోపాటు పాపాత్ములు, పామరులు కూడా ఖుర్ఆన్ హదీసులను తెలుసుకోవాలి, వాటిని అర్థం చేసుకోవాలి. ధార్మిక ఆదేశాలను తప్పనిసరిగా ఆచరించాలి. కనుక ప్రతి సామాన్యుడు, ప్రముఖుడు కూడా విధిగా ఖుర్ఆన్ హదీసుల అన్వేషణలో ఉండాలి. వాటిని అర్థం చేసుకునేందుకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనుచరుల పద్ధతిలో ప్రయత్నం చేయాలి. వాటిని ఆచరించాలి.

8. అల్లాహ్ ఏకత్వం, దైవదౌత్యం

విశ్వాసం (ఈమాన్)లో ప్రధానంగా రెండు భాగాలున్నాయి.

  1. అల్లాహ్ ను తిరుగులేని దేవుడుగా, సర్వాధికారిగా భావించడం.
  2. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను దైవప్రవక్తగా అంగీకరించడం.

అల్లాహ్ ను నిజమైన దేవుడని భావించడమంటే; ఆయనకు భాగస్వాములను కల్పించకూడదు. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను ప్రవక్తగా అంగీకరించడమంటే ఆయన మార్గాన్నే అనుసరించాలి. మొదటి భాగం ఏకదైవారాధన. రెండవ భాగం ప్రవక్త విధేయత, ప్రవక్త విధానం అనుసరణ. షిర్క్ తౌహీద్కు వ్యతిరేకం. బిద్అత్ (దురాచారాలు) సున్నత్ (ఆచారాలు)కు వ్యతిరేకం. ప్రతి ముస్లిం విధిగా తౌహీద్, సున్నత్ (ప్రవక్త సంప్రదాయాలలో)లపై నిలకడగా ఉండాలి. వాటిని హృదయాంతరాళాల్లో నింపుకోవాలి. షిర్క్ మరియు బిద్అత్ లకు దూరంగా ఉండాలి. షిర్క్ మరియు బిద్అత్ ల వల్లనే విశ్వాసానికి చెద పడుతుంది. దీని ద్వారా ఈమాన్ సన్నగిల్లుతుంది. ఇతర పాపాల వల్ల కేవలం ఆచరణల్లో అవరోధం కలుగుతుంది. షిర్క్ మరియు బిద్అత్ లకు దూరంగా ఉంటూ సున్నత్ కు కట్టుబడి ఉండే ఏక దైవారాధకుడైన వ్యక్తి వద్ద కూర్చోవడం వల్ల తౌహీద్ మరియు సున్నత్ లపై మక్కువ పెరుగుతుంది. అటువంటి వారినే గురువులుగా, పండితులుగా భావించాలి.

సారాంశం

  1. ఆచరణల స్వీకృతి సిసలైన విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది.
  2. కొందరు హేతువాదులుగా ఉంటారు. కాని వాస్తవానికి ఖుర్ఆన్ మరియు సున్నత్ (సంప్రదాయం) అనుసరణ పూర్వీకుల(సలఫ్) విధానాల ప్రకారం ఉండాలి.
  3. ప్రతి ఒక్కరూ ధర్మాన్ని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఆచరించవచ్చు.
  4. ప్రవక్త రాక ఉద్దేశం ధర్మాన్ని సులభతరం చేయడమే. కనుక ధర్మం ఎవరి కోసమైనా సులువే.
  5. ఏకేశ్వరోపాసన, సున్నత్ అనుసరణ విశ్వాసంలో ప్రధానంగా గల రెండు భాగాలు. బహుదైవారాధన మరియు బిద్ అత్ (ధర్మంలో కొత్త పోకడలు) వీటికి విరుద్ధం. కనుక ఏకేశ్వరోపాసి మరియు సున్నత్ లను అనుసరించే వారినే గురువులుగా భావించాలి

ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

  1. దాసుని విధి ఏమిటి?
  2. అత్యుత్తమమైన మార్గమేది?
  3. వైద్యుడు, రోగి ఉదాహరణతో ఏవిషయం అర్ధమవుతుంది?
  4. ఈమాన్లో ఎన్ని భాగాలున్నాయి?

తప్పొప్పులను గుర్తించండి

  1. ధర్మాన్ని అర్ధం చేసుకోవడం కష్టం
  2. ప్రవక్తలు ధర్మాన్ని నేర్పేందుకు వస్తారు
  3. ఖుర్ఆన్, హదీసు మరియు ప్రవక్త అనుచరులు అనుసరణ విధానం అన్నిటికంటే అత్యుత్తమమైన మార్గం.

ఖాళీలను పూరించండి

  1. అన్నిటికంటే ఉత్తమమైన మార్గము ……… మరియు ……..
  2. అల్లాహ్ ప్రవక్తలను………. ….. కొరకు పంపాడు.
  3. ఈమాన్ (విశ్వాసం) యొక్క భాగాలు ఉన్నాయి. వాటిలో ఒకటి….. రెండోది ………

1. ప్రజల అజ్ఞానం

సాధారణంగా షిర్క్ (బహుదైవారాధన) ప్రజల్లో వ్యాపించి ఉంటుంది. తౌహీద్ (ఏకేశ్వరోపాసన) అరుదై ఉంటుంది. విశ్వాసులమని ప్రకటించుకునే చాలామందికి కూడా అసలు తౌహీద్ మరియు షిర్క్ అంటే అర్థమేమిటో తెలియదు. పేరుకు మాత్రమే ముస్లిములు. కాని వారు తమ అజ్ఞానం వల్ల షిర్క్ లో పడిఉన్నారు. ముందుగా తౌహీద్ మరియు షిర్క్ అంటే ఏమిటో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే ఖుర్ఆన్ మరియు హదీసుల ద్వారా తౌహీద్, షిర్క్ ల వల్ల జరిగే మంచి చెడులేమిటో తెలుసుకోగలరు.

2. షిర్క్ చేష్టలు

తౌహీద్ గురించి సరిగ్గా తెలియని వారు ఆపద సమయాల్లో పీర్లను, ప్రవక్తలను, ఇమాములను, షహీదులను (అమరవీరులను) దైవదూతలను, మరియు దైవకన్యలను మొరపెట్టుకుంటారు. వారికే విన్నవించుకుంటారు, వారినే మ్రొక్కుకుంటారు. వారికే మొక్కుబడులు చెల్లిస్తుంటారు. రోగాల నుండి రక్షణ పొందడానికి తమ పిల్లలకు వారి పేర్లే పెడుతుంటారు. అబ్దున్నబీ (నబీదాసుడు), అలీ బఖ్ష్ (అలీ ప్రసాదించినది), మదార్ బఖ్ష్ (మదార్ ప్రసాదించినది) మస్తాన్ అలీ (అలీని సహాయం కోరేవాడు), జాన్ షహీదా; బాజీ, మదీనా, వలిబాబా, మీరా, పీరా, బషీరమ్మ లాంటి పేర్లు పెడుతుంటారు. మరికొందరు దేవుళ్ళ పేర జుత్తు పెంచుతారు. మాలలు ధరిస్తారు, ఇంకొందరు ఎవరివైన పేరు మీద బేడీలు, త్రాడులు, దారాలు, కడియాలు, చెవిపోగులు తొడుగుతారు. ఇంకొందరు జంతువులను బలి ఇస్తారు. ఆపదలు, కష్టాలు వచ్చినప్పుడు వారినే వేడుకుంటారు. వారి మీదే ప్రమాణాలు చేస్తారు. ముస్లిమేతరులు దేవీదేవతల పేర్ల మీద చేసే కార్యాలన్నీ ముస్లిములు ప్రవక్తల, ఔలియాల (పుణ్య పురుషుల), ఇమాముల (ప్రముఖ నాలుగు ఇస్లామీయ వర్గీక శాస్త్రాల స్థాపకులు), షహీదుల దైవదూతల మరియు దైవకన్యల పేర్ల మీద చేస్తుంటారు. ఇలాంటి షిర్క్ కార్యాలు చేస్తూనే తాము ముస్లిములమని వాదిస్తుంటారు.

అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు:

وَمَا يُؤْمِنُ أَكْثَرُهُم بِاللَّهِ إِلَّا وَهُم مُّشْرِكُونَ

వారిలో చాలామంది అల్లాహ్‌ను విశ్వసిస్తూ కూడా ఆయనతోపాటు ఇతరులను భాగస్వాములుగా నిలబెడుతున్నారు (దివ్యఖుర్ఆన్ 12:106)

3. విశ్వాస వాదనలు, షిర్క్ చేష్టలు

తమను తాము విశ్వాసులమని ప్రకటించుకునే అనేక మంది ముస్లిములు షిర్క్ ఊబిలో చిక్కుకుని ఉన్నారు. ఎవరయినా వారిని ‘మీరు విశ్వాసులమని ప్రకటించుకుంటున్నారు. కాని చేసేది మాత్రం షిర్క్ కార్యాలు. షిర్క్ మరియు విశ్వాస విరుద్ధ మార్గాలను ఎందుకు కలుపుతున్నారు?’ అని అడిగితే వారు ఈ విధంగా సమాధానమిస్తారు: “మేము షిర్క్ చేయడంలేదు. మేము ప్రవక్తలను, ఔలియాలను (పుణ్యాత్ములను) ప్రేమిస్తున్నాము, వారిని విశ్వసిస్తున్నాము. వారు అల్లాహ్ కు సమానులని భావిస్తేనే కదా షిర్క్ అవుతుంది. మేము వారిని అల్లాహ్ సృష్టితాలుగానే భావిస్తున్నాం. అల్లాహ్ వారికి శక్తిని, అధికారాలను ప్రసాదించాడు. వారు అల్లాహ్ ఇష్టప్రకారమే ఈ ప్రపంచంలో, అధికారం చేస్తున్నారు. వారిని మొరపెట్టుకోవడమంటే అల్లాహ్ ను మొరపెట్టుకోవడమే. వారిని సహాయం కోరితే అల్లాహ్ ను సహాయం కోరినట్టే. వారు అల్లాహ్ ప్రియదాసులు. ఏమైనా చేయగలరు. వారు మా సిఫారసుదారులు, పర్యవేక్షకులు. వారిని పొందితే అల్లాహ్ ను పొందినట్టే. వారిని అర్థించడం వల్ల అల్లాహ్ సాన్నిధ్యం లభిస్తుంది. మేము వారిని ఎంతగా ప్రేమిస్తే మేము అల్లాహ్ కు అంతే దగ్గరవుతాము” అని వృధా మాటలు మాట్లాడుతుంటారు.

4. ఖుర్ఆన్ తీర్పు

దీనంతటికీ కారణం వీరు ఖుర్ఆన్, హదీసులను వదలి పెట్టడమే. వీరు షరీఅత్ (ఇస్లామీయ శాసనాంగం) విషయంలో హేతువాదన చేస్తారు. కొందరైతే కట్టుకథల వెనుకే పరుగెడుతున్నారు. దురాచారాలను ఆధారాలతో పేర్కొంటారు. ఒకవేళ వీరికి ఖుర్ఆన్ మరియు హదీసుల పరిజ్ఞానం ఉంటే; ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ముష్రిక్కులు (బహు దైవారాధకులు) ఇలాంటి ఆధారాలే పేర్కొనే వారని, అందుకనే వారిపై అల్లాహ్ శిక్ష అవతరించిందని, వారు అబద్ధాల కోరులనబడ్డారని తెలిసేది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ وَيَقُولُونَ هَٰؤُلَاءِ شُفَعَاؤُنَا عِندَ اللَّهِ ۚ قُلْ أَتُنَبِّئُونَ اللَّهَ بِمَا لَا يَعْلَمُ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ

వారు అల్లాహ్‌ను వదలి తమకు నష్టాన్నిగానీ, లాభాన్ని గానీ చేకూర్చలేని వాటిని పూజిస్తున్నారు. ఇంకా, “అల్లాహ్‌ సమక్షంలో ఇవి మాకు సిఫారసు చేస్తాయి” అని చెబుతున్నారు. “ఏమిటీ, ఆకాశాలలో గానీ, భూమిలో గానీ అల్లాహ్ కు తెలియని దానిని గురించి మీరు ఆయనకు తెలియజేస్తున్నారా?” వారు కల్పించే భాగస్వామ్యాల నుంచి ఆయన పవిత్రుడు, ఉన్నతుడు అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. (దివ్యఖుర్ఆన్ 10 : 18)

5. అల్లాహ్ తప్ప అధికారం గలవాడు ఎవడూ లేడు

ముష్రికులు ఎవరినయితే పూజిస్తున్నారో వారు నిస్సహాయులు. వారిలో ఎవరికైనా లాభంగానీ నష్టంగానీ కలిగించే శక్తిలేదు. పైగా వీరే అల్లాహ్ వద్ద సిఫారసు చేస్తారని ముష్రిక్కులు అంటున్నారు. ఇది తప్పు. ఎందుకంటే అల్లాహ్ ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు! ఏమిటీ? మీకు భూమ్యాకాశాల విషయాలు అల్లాహ్ కంటే ఎక్కువగా తెలుసా? వారు మీ కోసం సిఫారసు చేస్తారని ఎలా అనగలరు? అసలు విషయమేమిటంటే; ఈ విశ్వంలో మొర పెట్టుకుంటే లాభం చేకూర్చే, మొరపెట్టు కోకపోతే నష్టం కలిగించే సిఫారసుదారులు ఎవరూ లేరు. ప్రవక్తలు సిఫారసు చేయడం కూడా అల్లాహ్ అధికారానికి లోబడే ఉంది. వారు మొరపెట్టుకోవడం వల్ల, మొరపెట్టు కోకపోవడం వల్ల జరిగేదేమీ లేదు. దీనివల్ల తెలుస్తున్న మరో విషయం ఏమిటంటే; ఎవ రయినా ఎవరినైనా సిఫారసుదారునిగా భావించి ఆరాధిస్తే వారు కూడా ముష్రిక్కులే (బహుదైవారాధకులే). అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ ۚ وَالَّذِينَ اتَّخَذُوا مِن دُونِهِ أَوْلِيَاءَ مَا نَعْبُدُهُمْ إِلَّا لِيُقَرِّبُونَا إِلَى اللَّهِ زُلْفَىٰ إِنَّ اللَّهَ يَحْكُمُ بَيْنَهُمْ فِي مَا هُمْ فِيهِ يَخْتَلِفُونَ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي مَنْ هُوَ كَاذِبٌ كَفَّارٌ

జాగ్రత్త! నిష్కల్మషమైన ఆరాధన మాత్రమే అల్లాహ్ కు చెందుతుంది. ఎవరయితే అల్లాహ్‌ను గాకుండా ఇతరులను సంరక్షకులుగా ఆశ్రయించారో వారు, “ఈ పెద్దలు మమ్మల్ని అల్లాహ్‌ సాన్నిధ్యానికి చేర్చటంలో తోడ్పడతారని భావించి మాత్రమే మేము వీళ్లను ఆరాధిస్తున్నామ”ని అంటారు. ఏ విషయం గురించి వారు భేదాభిప్రాయానికి లోనై ఉన్నారో దానికి సంబంధించిన (అసలు) తీర్పు అల్లాహ్‌ (స్వయంగా) చేస్తాడు. అబద్ధాలకోరులకు, కృతఘ్నులకు అల్లాహ్‌ ఎట్టి పరిస్థితిలోనూ సన్మార్గం చూపడు. (దివ్యఖుర్ఆన్ 39 : 3)

6. అల్లాహ్ తప్ప మరో సంరక్షకుడు ఎవడూ లేడు

వాస్తవమేమిటంటే, అల్లాహ్ జ్ఞానపరంగా మానవుడికి అత్యంత సమీపంలో ఉన్నాడు. కాని మానవులు ఈ విషయాన్ని వదలిపెట్టి విగ్రహాలే వారిని అల్లాహ్ కు దగ్గరగా చేస్తాయని అనుకుంటున్నారు. విగ్రహాలనే తమ సంరక్షకులుగా భావించ సాగారు. ‘అల్లాహ్ ప్రత్యక్షంగా అందరి విషయాలను వింటాడు, అందరి మొరలను ఆలకిస్తాడు‘ అన్న విషయాన్ని ధిక్కరించి అల్లాహ్ ఆహ్రానికి గురయిపోయారు. ఇతరులను అర్థించసాగారు. వారి ముందు మొర పెట్టుకోసాగారు. మరీ దారుణం ఏమి టంటే, తప్పుడు విధానాల ద్వారా, అపమార్గాల ద్వారా అల్లాహ్ సాన్నిధ్యాన్ని అన్వేషి స్తున్నారు. ఇలాంటి కృతఘ్నులు, అబద్ధాల కోరులు రుజుమార్గం ఎలా పొందగలరు? వీరు అపమార్గంలో పయనించేకొద్దీ రుజుమార్గానికి దూరమవుతూ ఉంటారు.

7. అల్లాహ్ తప్ప కార్యసాధకుడు ఎవడూ లేడు

దీనిద్వార తెలిసిందేమిటంటే, ఇతరులను పూజించడంవల్ల అల్లాహ్ సాన్నిధ్యం లభిస్తుందని భావించేవారే ముష్రిక్కులు (బహుదైవారాధకులు). ఇలాంటి వారు అబద్ధాలకోరులు, అల్లాహ్ అనుగ్రహాన్ని ధిక్కరించినవారు కూడాను. అల్లాహ్ దివ్య ఖుర్ఆన్అ ఇలా సెలవిస్తున్నాడు:

قُلْ مَن بِيَدِهِ مَلَكُوتُ كُلِّ شَيْءٍ وَهُوَ يُجِيرُ وَلَا يُجَارُ عَلَيْهِ إِن كُنتُمْ تَعْلَمُونَ سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ فَأَنَّىٰ تُسْحَرُونَ

సమస్త విషయాల సార్వభౌమత్వం ఎవరి చేతుల్లో ఉందో, శరణు ఇచ్చేవాడెవడో, ఎవరికి వ్యతిరేకంగా ఏ శరణూ లభించదో- ఆయనెవరో మీకు తెలిసి ఉంటే చెప్పండి? అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు. “అల్లాహ్‌ మాత్రమే” అని వారు చెబుతారు. “మరైతే మీరు ఎలా మోసపోతున్నారు?” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.. (దివ్యఖుర్ఆన్ 23 : 88-89)

అంటే, స్వయంగా సమస్త విషయాల సార్వభౌమత్వం ఎవరి చేతుల్లో ఉందో, ఆయనకు పోటీగా ఎవరూ నిలబడలేరో, ఆయనెవరో చెప్పండి? అని ఒకవేళ ముష్రిక్కులనే (బహుదైవారాధకులను అడిగితే, వారు కూడా ‘అల్లాహ్ మాత్రమే’ అని సమాధాన మిస్తారు. మరలాంటప్పుడు ఇతరులను అర్థించటం పిచ్చికాకపోతే ఇంకేమిటి?

దీని ద్వారా తెలుస్తున్నదేమిటంటే, ఈ విశ్వవ్యవస్థలో అధికారం చేసే శక్తి అల్లాహ్ కు తప్ప ఎవరికీలేదు. ఎవరూ ఎవరికీ సంరక్షకులూ కారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాలంలోని ముష్రిక్కులు కూడా విగ్రహాలను అల్లాహ్ కు సమానమని భావించే వారు కారు. కానీ తాము వారి దాసులమని, సృష్టితాలమని అనుకునేవారు. అంతేకాదు వారిలో దైవత్వశక్తులు ఉండవని వారికి తెలుసు. అయినప్పటికీ వారినే మొరపెట్టుకునే వారు-వారినే మొక్కుకునేవారు. వారికే మొక్కులు చెల్లించేవారు. వారిని సంరక్షకులుగా, సిఫారసుదారులుగా భావించడమే వారు చేస్తున్న షిర్క్. కనుక ఇలా ప్రవర్తించేవారు – విగ్రహాల దాసులమని, వారి సృష్టితాలమని భావించేవారు మరియు అబూజహల్, (ఒక ధర్మ వ్యతిరేకి) వీరు షిర్క్ కార్యం చేయడంలో సరిసమానులు.

8. షిర్క్ వాస్తవికత

షిర్క్ అంటే కేవలం ఎవరినైనా అల్లాహ్ కు సమానులుగా, పోటీదారులుగా భావించటమే కాదు, ఏ విషయాలనైతే అల్లాహ్ తన అస్థిత్వం కోసం, లక్షణాల కోసం ప్రత్యేకించుకున్నాడో మరియు తన దాసుల కోసం ఆరాధనా కార్యాలుగా నిర్ణయించాడో వాటిని ఇతరులకు ఆపాదించడం కూడా షిర్క్ అవుతుంది.

ఉదాహరణకు: సజ్దహ్ చేయడం (సాష్టాంగపడటం). అల్లాహ్ పేర ఇచ్చే ఖుర్బానీ(బలిదానం) ఇతరుల పేర ఇవ్వడం, మొక్కుబడి చెల్లించడం, ఆపదల్లో మొరపెట్టుకోవడం, అల్లాహ్ స్వయంగా ప్రతీ చోట ఉన్నాడని భావించడం. అధికారంలో, సార్వభౌమత్వంలో ఇతరులకు భాగస్వామ్యం ఉందని భావించడం – ఇవన్నీ షిర్క్ లోని రకాలు. సజ్దహ్ కేవలం అల్లాహ్ కోసమే చేయాలి. ఖుర్బానీ (బలిదానం) అల్లాహ్ కోసమే ఇవ్వాలి. అల్లాహ్ నే మొక్కుకోవాలి. ఆపదల్లో ఆయన్నే మొరపెట్టుకోవాలి. ఆయన సమస్తాన్ని పరివేష్టించి, కనిపెట్టి ఉండేవాడు. సార్వభౌమాధికారం ఆయన చేతుల్లోనే ఉంది. వీటిలో ఏ గుణమైనా అల్లాహ్ యేతరుల్లో కూడా ఉందని భావించడం షిర్క్ అవుతుంది. దైవేతరులు అల్లాహ్ కంటే తక్కువ వారని; ఒకవేళ వారు అల్లాహ్ సృష్టితాలు, దాసులు అని భావించినా సరే. ఈ విషయంలో ప్రవక్తలు, పుణ్యాత్ములు జిన్నులు, షైతాన్, భూతం, పిశాచం, దైవకన్యలు మొదలగు వారందరూ సమానులే. వీరందరిలో ఎవరి విషయంలో ఇలా వ్యవహరించినా అది షిర్క్ అవుతుంది. అలా చేసేవారు ముష్రిక్కులు అనబడతారు. యూదులు, క్రైస్తవులు విగ్రహారాధకులు కానప్పటికీ విగ్రహారాధకులకు మాదిరి గానే అల్లాహ్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎందుకంటే వారు ప్రవక్తల, పుణ్యాత్ముల విషయంలో ఇలాగే వ్యహరించేవారు.

అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో ఇలా సెలవిచ్చాడు:

اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِّن دُونِ اللَّهِ وَالْمَسِيحَ ابْنَ مَرْيَمَ وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا إِلَٰهًا وَاحِدًا ۖ لَّا إِلَٰهَ إِلَّا هُوَ ۚ سُبْحَانَهُ عَمَّا يُشْرِكُونَ

వారు అల్లాహ్‌ను వదలి తమ పండితుల (అహ్‌బార్‌)ను, సన్యాసుల (రుహ్‌బాన్‌)ను తమ ప్రభువులుగా చేసుకున్నారు- మర్యమ్‌ కుమారుడైన మసీహ్‌ను కూడా. నిజానికి వారికి, ఒక్కడైన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించవలసిందిగా ఆజ్ఞాపించబడింది. ఆయన తప్ప మరో ఆరాధ్యదైవం లేడు. వారు నిర్థారించుకుంటున్న భాగస్వామ్యాలకు ఆయన అతీతుడు, పవిత్రుడు.. (దివ్యఖుర్ఆన్ 9 : 31)

అంటే పవిత్రుడైన అల్లాహ్ అందరికంటే పెద్ద ప్రభువని, మత గురువులు చిన్న ప్రభువులని వారు నమ్ముతున్నారు. దీని గురించి వారికి ఆదేశించడం జరగలేదు. వారు చేస్తున్నది ఘోరమైన షిర్క్ మాత్రమే. అల్లాహ్ ఒంటరివాడు. అతనికి చిన్నా, పెద్దా భాగస్వాములెవరూ లేరు. అందరూ ఆయనకి నిస్సహాయదాసులే.

అల్లాహ్ దివ్య ఖుర్ఆన్ ఇలా ఆదేశిస్తున్నాడు:

إِن كُلُّ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ إِلَّا آتِي الرَّحْمَٰنِ عَبْدًا لَّقَدْ أَحْصَاهُمْ وَعَدَّهُمْ عَدًّا وَكُلُّهُمْ آتِيهِ يَوْمَ الْقِيَامَةِ فَرْدًا

ఆకాశాలలో, భూమిలో ఉన్న వారందరూ కరుణామయుని వద్దకు దాసులుగా రావలసిందే. వారందరినీ ఆయన చుట్టుముట్టి ఉన్నాడు. అందరినీ పూర్తిగా లెక్కపెట్టి ఉంచాడు. వారంతా ప్రళయ దినాన ఆయన సమక్షంలో ఒంటరిగా హాజరవుతారు. (దివ్యఖుర్ఆన్ 19 : 93-95)

మానవులైనా, దైవదూతలయినా అందరూ అల్లాహ్ బానిసలే. అల్లాహ్ వద్ద వారికి అంతకంటే ఎక్కువ స్థానంలేదు. వారు అల్లాహ్ అధీనంలో ఉన్నారు. వారు నిస్సహాయులు, వారికి ఏ అధికారమూ లేదు. అంతా విశ్వ ప్రభువైన అల్లాహ్ అధికారంలోనే ఉంది. ఆయన అన్నిటినీ తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఆయన ఎవరినీ ఎవరి ఆధీనంలోకీ ఇవ్వడు. లెక్కకోసం అందరూ ఆయన ముందు హాజరు కావలసి ఉంది. అక్కడ ఎవరూ ఎవరికీ సంరక్షకుడు, పరిరక్షకుడు కాలేడు. దివ్య ఖుర్ఆన్లో ఈ అంశానికి సంబంధించి ఎన్నో ఆయత్లు ఉన్నాయి. కాని మేము ఉదాహరణకు కొన్ని ఆయత్లనే పొందుపరిచాము. వాటిని సరిగ్గా అర్థం చేసుకున్న వ్యక్తి ఇన్షా అల్లాహ్ (అల్లాహ్ తలిస్తే) షిర్క్ మరియు తౌహీద్ లను బాగా అర్థం చేసుకుంటాడు.

సారాంశము

1. సామాన్య ప్రజలు సుఖదుఃఖాలలో ముస్లిమేతరుల మాదిరిగానే వివిధ ఆస్థానాల వద్ద కృతజ్ఞతాపూర్వకంగా, సహాయార్థం కోసం వివిధ రకాల దురా చారాలు చేస్తుంటారు. అయినప్పటికీ వారు తమను తాము ముస్లింలుగానే భావించుకుంటారు. కాని వారు బహుదైవారాధకులు.

2. అనేక మంది ముస్లిములు ముస్లిమేతరుల మాదిరిగానే బహుదైవారాధనకు పాల్పడుతుంటారు. పైగా అల్లాహ్ పుణ్యాత్ములకు అధికారం చెలాయించే శక్తినిచ్చాడని, వారధిగా, సిఫారసుదారునిగా చేశాడని వితండవాదనలు చేస్తారు. యదార్ధమేమిటంటే దివ్యఖుర్ఆన్ ఈ వాదనలను చాలా స్పష్టంగా ఖండిస్తుంది. (దివ్య ఖుర్ఆన్-10:18)

3. మిథ్యాదైవాలు నిస్సహాయులు. వారిని సహాయం కోరేవారు బహుదైవారాధకులు. ప్రస్తుత ముస్లిములకు మరియు ఆ కాలపు మక్కా ముష్రిక్కులకు ఇసుమంత తేడా లేదు. వాస్తవానికి ప్రవక్తల, పుణ్యాత్ముల సిఫారసు కూడా అల్లాహ్ చేతిలోనే ఉంది. (దివ్య ఖుర్ఆన్-39 :3)

4. జ్ఞానం పరంగా అల్లాహ్ తన దాసునికి అత్యంత సమీపంలో ఉన్నాడు. సంరక్షకునిగా ఉన్నాడు. దాసుడు తనకు, అల్లాహ్ కు మధ్య ఎన్ని సిఫారసులను, ఎంత మంది సిఫారసుదారులను తీసుకువస్తాడో అతడు అల్లాహ్ కు అంతే దూరం అవుతుంటాడు. (దివ్య ఖుర్ఆన్-23:88-89)

5. అల్లాహ్ తన కోసం ప్రత్యేకించుకున్న గుణాలను మరియు దాస్య చిహ్నాలను ప్రవక్తలకు, పుణ్యాత్ములకు ఆపాదించడం కూడా బహుదైవారాధనే. ఉదాహరణకు: వారిని సహాయం కోరడం, కృతజ్ఞతలు తెలుపుకోవడం. మొక్కుకోవడం, సాష్టాంగపడటం. కనుక యూదులను, క్రైస్తవులను బహు దైవారాధకుల మాదిరిగానే ధూర్తులుగా నిర్ణయించడం జరిగింది. (దివ్యఖుర్ఆన్ 9 : 31)

6. ప్రవక్తలు, పుణ్యాత్ములు అల్లాహ్ ఎదుట బానిసలు, అశక్తులు. అల్లాహ్ తన గుణగణాల్లో, అధికారాల్లో ఒంటరివాడు, ఒకే ఒక్కడు. (19:92)

ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

  1. షిర్క్ వాస్తవికతను వివరించండి?
  2. ప్రజలు ఏ విషయాల్లో షిర్క్ చేస్తున్నారు?
  3. షిర్క్ కు లోనవటానికి గల కొన్ని కారణాలను పేర్కొనండి?
  4. ‘వమా యుమిను అక్సరుహుమ్ బిల్లాహి ఇల్లా వహుమ్ ముష్రికూన్’ (చాలా మంది ప్రజలు అల్లాహ్ ను విశ్వసిస్తూనే షిర్క్ కు పాల్పడుతుంటారు. ఈ ఆయత్ అర్థాన్ని వివరించండి?

తప్పొప్పులను గుర్తించండి

  1. అల్లాహ్ కు భాగస్వాములుగా ఇతరులను నిలబెట్టడం షిర్క్ అవుతుంది.
  2. ముష్రిక్కులు ఆరాధించే దేవతలు ఎలాంటి నష్టాన్ని, లాభాన్ని కల్గించలేరు.
  3. అల్లాహ్ తప్ప వేరొకరు సహాయకులున్నారా?

ఖాళీలను పూరించండి

  1. అల్లాహ్ యే ………………… ఉన్నాడు.
  2. అల్లాహ్ కు సమానులుగా ఎవరినైనా భావిస్తే ……….. అవుతుంది.
  3. అల్లాహ్ ను తప్ప వేరొకరిని వేడుకోవడం, సహాయం కోరడం, సిఫారసు చేసే వారిగా భావించడాన్ని ……………. అంటారు.

షిర్క్ లో నాలుగు రకాలు ఉన్నవి

పవిత్రుడైన అల్లాహ్ తన అస్తిత్వం కోసం ఏ ఏ విషయాలను ప్రత్యేకించుకున్నాడో వాటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. తద్వారా ఆ విషయాలలో అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించకుండా ఉండాలి. ఇలాంటి విషయాలు కోకొల్లలు.

మేము కొన్ని విషయాలను ఖుర్ఆన్ మరియు హదీసుల ద్వారా పరిశీలి స్తున్నాము. దీని ద్వారా ప్రజలు వేరే విషయాలను కూడా అర్థం చేసుకోవచ్చు.

1. జ్ఞానంలో షిర్క్

మొదటి విషయం ఏమిటంటే, అల్లాహ్ జ్ఞానపరంగా సర్వత్రా ఉన్నాడు. ప్రతీ సమయం చూస్తున్నాడు. ప్రతి విషయం అతని జ్ఞాన పరిధిలోనే ఉంది. అందుకనే జరగబోయే విషయాలన్నీ, ప్రతి క్షణం అతనికి తెలిసి ఉంటాయి. ఆ విషయాలు దూరంగా దగ్గరగా, బాహ్యంగా, అంతర్గతంగా, ఆకాశాల్లో, పృధ్విలో, పర్వతాల్లో, లోయల్లో, సముద్ర లోతుల్లో ఎక్కడ ఉన్నా సరే. ఇది అల్లాహ్ గొప్పతనం. మరెవరికీ ఇది సాధ్యం కాదు.

ఎవరయినా కూర్చుంటూ నిలబడుతూ దైవేతరుల పేర్లు తీసుకున్నా లేదా ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ తమ ఆపదలు తొలగించమని దైవేతరులను మొర పెట్టుకున్నా లేదా శత్రు మూకలపై వారి పేరుతో దాడి చేసినా లేదా వారి పేర్లను ధ్యానించినా లేదా వారి ఊహలను మదిలో ఏర్పరచుకుని ‘నేను నోటితో వారి పేరు తీసుకుంటే మనస్సులో వారిని ఊహించుకుంటే వారి ఆకారాన్ని ఆలోచించుకుంటే వారి సమాధిని తలుచుకుంటే వారికి తెలుస్తుంది. నాకు సంబంధించిన ఏ విషయమూ వారి నుండి దాయబడిలేదు. ఇంకా నాపై అవహించే పరిస్థితులు ఉదాహరణకు అస్వస్థత – ఆరోగ్యం, కలిమి-లేమి, జననం-మరణం, దుఃఖం- సంతోషం ఇలాంటి విషయాలన్నీ వారికి తెలిసే ఉంటాయి. నా నోటి నుండి వెలువడే మాటలు వారు వింటారు. నా మదిలోని ఆలోచనలు, భావనలు కూడా వారికి తెలుసు’ ఇలాంటి విషయాలన్నీ షిర్క్ గానే పరిగణించబడతాయి. జ్ఞానంలో షిర్క్ అంటే ఇదే.

అల్లాహ్ కు మాదిరిగానే అల్లాహ్ ఏతరులకూ ప్రతి విషయానికి సంబంధించిన జ్ఞానం ఉంటుందని భావించడం వల్ల మనిషి ముష్రిక్ (బహుదైవారాధకుడు) అవుతాడు. అంతేకాదు, మహాత్ములకు సంబంధించి గానీ, అల్లాహ్ కు అత్యంత సమీపంలో ఉండే దైవదూతల గురించి గానీ, వీరికి అన్ని విషయాల జ్ఞానం ఉందని నమ్మడం షిర్క్ అవుతుంది. ఆ జ్ఞానం వారికి అల్లాహ్ ప్రసాదించాడని భావించినా సరే. లేదా స్వతహాగా వచ్చిందని భావించినా సరే.

2. అధికారంలో షిర్క్

విశ్వంలో అనుకున్నట్టు అధికారం చేయడం, ఆదేశించడం, చంపడం, బ్రతికించడం, కలిమిని-లేమిని ప్రసాదించడం, ఆరోగ్యం-అనారోగ్యం కలిగించడం, అదృష్టం-దురదృష్టానికి పాలుచేయడం, మొరలు ఆలకించడం, ఆపదలు తొలగించడం, కష్టాల్లో ఆదుకోవడం, సమయానికి సహాయపడటం – ఇదంతా అల్లాహ్ గొప్పతనం. దైవేతరులకు ఇలా చేయడం సాధ్యపడదు. వారు ఎంత గొప్ప వారైనా, లేదా దైవదూతలయినా సరే. అల్లాహ్ ను వదలి ఇతరులకు ఇలాంటి అధికారాన్ని అంటగట్టి వారిని మొరపెట్టు కోవడం, వారి పేరున మొక్కుకోవడం, వారి పేర బలి ఇవ్వడం, ఆపదలు వచ్చినప్పుడు తొలగించమని వారిని మొరపెట్టుకోవడం లాంటి పనులు చేసేవారు ముష్రిక్లులు. దీనినే అధికారంలో షిర్క్ అంటారు. అంటే అల్లాహ్ కు మాదిరిగా దైవేతరులు కూడా అధికారం చెలాయించగలరని భావించడం షిర్క్. వారికి అధికారం స్వతహాగా లేదా అల్లాహ్ ప్రసాదించిందని భావించినా, ఎట్టి పరిస్థితిలోనూ ఈ భావన షిర్క్ అవుతుంది.

3. ఆరాధనల్లో షిర్క్

అల్లాహ్ కొన్ని పనులను తన కోసం ప్రత్యేకించుకున్నాడు. వాటిని ఆరాధన అంటారు. ఉదాహరణకు సజ్దహ్ చేయడం, రుకూహ్ చేయడం, చేతులు కట్టుకుని వినయంతో నిలుచోవడం, అల్లాహ్ పేర దానధర్మాలు చేయడం, ఆయన పేరు మీద ఉపవాసాలు ఉండటం, అతని పవిత్ర గృహం (కాబహ్) ను సందర్శించడం కోసం సుదూర ప్రయాణాలు చేయడం, వారి రూపురేఖలను చూసి హరమ్ (పవిత్ర స్థలం) సందర్శకులుగా ప్రజలు గుర్తించడం, మార్గంలో అల్లాహ్ పేరునే పలకడం, చెడు మాటలకు, వేటకు దూరంగా ఉండటం, పూర్తి ఏకాగ్రతతో ఆయన గృహానికి ప్రదక్షిణలు చేయడం, ఆయన కోసం సజ్దహ్ చేయడం, ఆయన కోసం ఖుర్బానీ (బలిదానం) జంతువు తీసుకెళ్లడం, అక్కడ మొక్కుకోవడం, కాబాపై తొడుగు (ఘిలాఫ్) ఎక్కించడం, కాబహ్ ద్వారం ముందు నిలుచొని వేడుకోవడం, ఇహ పరాల మేలుకోరడం, హజ్రె అస్వద్ (నల్ల శిలను) చుంబించడం, కాబహ్ ముల్తజిమ్ (హజ్రె అస్వద్ నుండి కాబహ్ గడుపు వరకు)నకు నోరు, ఛాతి తగిలించి వేడుకోవటం. దాని నలువైపులను కాంతివంతం చేయడం, అందులో సేవకుల మాదిరిగా ఉండటం, ఊడ్వటం, హాజీలకు నీళ్లు త్రాపించడం, వుజూ, స్నానం కోసం నీటి సదుపాయం కల్పించడం, జమ్ జమ్ జలాన్ని శుభముగా భావించి త్రాగడం, తలపై పోసుకోవడం, కడుపునిండా త్రాగడం, ఆ జలాన్ని పరస్పరం పంపిణీ చేయడం, బంధుమిత్రుల కోసం తీసుకెళ్ళడం, దాని పరిసర ప్రాంతాల పొలాలను సురక్షితంగా ఉంచడం, వేటాడకుండా ఉండటం, వృక్షాలు, గడ్డి కోయకుండా ఉండటం, జంతువులను మేపకుండా ఉండటం, ఇవన్నీ అల్లాహ్ తన ఆరాధన కోసమని ముస్లిములకు వివరించాడు.

కనుక ఎవరయినా ప్రవక్తలకు లేదా మహాత్ములకు లేదా భూతపిశాచాలకు లేదా జిన్నాతులు దైవకన్యలకు లేదా మందిరాలకు, మఠములకు, చర్చీలకు, దర్గాలకు, క్షేత్రాలకు, సమాధులకు లేదా ఇళ్ళకు, గుర్తులకు లేదా శవపేటికలకు, సజ్దహ్ చేసినా లేదా రుకూ చేసినా లేదా వారి కోసం ఉపవాసాలు ఉన్నా లేదా వాటి ముందు చేతులు కట్టుకుని నిలబడినా లేదా మొక్కుబడులు చెల్లించినా లేదా వారి పేర జెండాలు పెట్టినా లేదా వారి దగ్గరికి వెనక్కు నడుస్తూ వెళ్లినా లేదా సమాధిని చుంబించినా లేదా సమాధులను సందర్శించడానికి దూరప్రయాణాలు చేసినా లేదా ఆలయాల సందర్శన యాత్ర మరియు నూకాలమ్మ, నంగాలమ్మ, మహంకాళి ఉప్పలమ్మ వార్షికోత్సవాలలో పాలుపంచుకోవటం అక్కడకు వెళ్ళి దీపాలు వెలిగించడం, కాంతి ప్రసరించేలా చేయడం వంటివి చేసినా లేదా వాటి గోడలకు తొడుగులు తొడిగించినా లేదా సమాధిపై దుప్పటి కప్పినా లేదా వాటిపై పందిరి వేసినా, నెమలి ఈకల కట్టెలు పెట్టినా లేదా వాటి ద్వారాలను చుంబించినా లేదా చేతులు కట్టుకుని వేడుకున్నా లేదా వారి ముందు మొరపెట్టుకున్నా లేదా ముజావర్ల (మఠాధిపతుల) రూపమెత్తి సేవలు చేసినా లేదా దాని చుట్టుప్రక్కల మొక్కలను గౌరవించినా ఇలాంటి ఏ రకమయిన పని చేసినా అలాంటి వారు స్పష్టంగా షిర్క్ కు ఒడిగట్టినట్లే. దీనినే ఆరాధనలో షిర్క్(సాటి కల్పించటం) అంటారు. అంటే దైవేతరులు స్వతహాగా గౌరవార్హులయినప్పటికీ లేదా వారిని గౌరవిస్తే అల్లాహ్ సంతోషపడతాడని వారిని గౌరవించడం వల్ల ఆపదలు తొలగిపోతాయని భావించి లేదా అల్లాహ్ ను గౌరవించిన విధంగా వారినీ గౌరవించడం షిర్క్ (సాటి కల్పించటం) అవుతుంది.

4. రోజువారి పనుల్లో (వ్యవహారాలలో) షిర్క్

ప్రాపంచిక పనుల్లో దాసులు అల్లాహ్ ను స్మరిస్తుండాలనీ, వినమ్రులై ఉండాలనీ, తద్వారా వారి విశ్వాసం సక్రమంగా ఉంటుందనీ పనుల్లో శుభం కలుగుతుందని వారికి క్రమశిక్షణ నేర్పాడు. ఉదాహరణకు ఆపదల్లో ఉన్నప్పుడు ఆపద తొలగించమని అల్లాహ్ ను మొక్కుకోవడం, కష్టాల్లో అతన్నే మొరపెట్టుకోవడం, పని ప్రారంభించేటప్పుడు శుభం కలగడం కోసం అల్లాహ్ పేరు స్మరించటం, సంతానం కలిగినప్పుడు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అతని పేర జంతువులను జిబహ్ చేయడం, సంతానం పేర్లు అబ్దుల్లాహ్ (అల్లాహ్ దాసుడు), అబ్దుర్రహ్మాన్ (రహ్మాన్ దాసుడు), ఇలాహీ బఖ్ష్ (అల్లాహ్ వరప్రసాదం) మొదలగునవి పెట్టడం, పంటలోనుండి కొంత ధాన్యాన్ని అల్లాహ్ పేర తీయడం, ఫలాల్లో కూడా కొన్ని అల్లాహ్ పేర తీయడం, జంతువుల్లోనూ కొన్నింటిని అల్లాహ్ పేర చేయడం, అల్లాహ్ పేర కాబా గృహానికి తీసుకు వెళ్లే జంతువులను అపూర్వంగా చూసుకోవటం అంటే వాటిపై స్వారీ కాకుండా వాటిపై బరువు మోపకుండా ఉండటం – తినడం, త్రాగడం, ధరించడం వంటి వాటిల్లో అల్లాహ్ ఆదేశాలను శిరసావహించడం, ఆయన ఆదేశించిన ప్రకారం నడుచుకోవడం, నిషేధించిన విషయాలకు దూరంగా ఉండటం, ప్రాపంచిక జీవితంలో కష్టసుఖాలు, ఆరోగ్యం, అనారోగ్యం, జయాపజయాలు, అదృష్ట దురదృష్టాలు ఏది సంభవించినా అంతా అల్లాహ్ చూస్తున్నాడని అది ఆయన అధికారంలోనే ఉందని భావించడం, ఏదైనా పని చేయ సంకల్పించుకున్నప్పుడు ఇన్షా అల్లాహ్ (అల్లాహ్ తలచుకుంటే) అనడం ఉదాహరణకు “ఇన్షా అల్లాహ్ (అల్లాహ్ తలచుకుంటే) మనం ఫలానా పని చేద్దాం” అనడం – పవిత్రమైన అల్లాహ్ పేర్లు పలికేటప్పుడు ఎంతో మర్యాదతో ఆయన ఔన్నత్యం ఉట్టిపడేలా పలకటం, మన దాస్యము ప్రస్ఫుటమయ్యేలా మెలగటం. ఉదాహరణకు “మా ప్రభువు, మా యజమాని, మా సృష్టికర్త, మా ఆరాధ్యదైవం” వంటి వాటితో పలకాలి. ఒకవేళ ప్రమాణం చేయాల్సిన సందర్భం ఎదురయితే కేవలం అల్లాహ్ పేరు తోనే ప్రమాణం చేయాలి. ఇలాంటి విషయాలను పవిత్రుడైన అల్లాహ్ తన ఔన్నత్యం కోసమే నిర్ణయించుకున్నాడు.

ఎవరైనా ఈ రకమైన గౌరవం దైవేతరుల విషయంలో పాటిస్తే, అది ఆరాధనలో షిర్క్ అవుతుంది. ఆరాధనలో భాగస్వామ్యం అవుతుంది. ఉదాహరణకు పని ఆగిపోయి ఉన్నా లేదా చెడిపోతున్నా దానిని పునఃప్రారంభించడం కోసం లేదా ఆ పని సక్రమంగా జరగాలని దైవేతరులను మొక్కు కోవడం ఉదాహరణకు కొబ్బరికాయ, గుమ్మడికాయ కొట్టడం, హారతి తీయడం, వాస్తుచూడటం, దిష్టి దూరము చేసే విధానాలు. పిల్లలకు నబీ దాసుడు, ఇమామ్ బఖ్ష్ (ఇమామ్ గారు ప్రసాదించిన బిడ్డ) మొదలైనవి, పీర్ ప్రసాద్ (పీర్ గారు ప్రసాదించిన బిడ్డ), దుర్గారావు, యాదగిరి, జాన్ షహిదా లాంటి పేర్లు పెట్టడం, పొలంలో లేదా తోటలో వారి కోసం ఒక భాగం తీయడం, పంటకోతకు వచ్చిన తర్వాత ముందు వారి పేర భాగం తీయడం, తరువాత వాటిని ఉపయోగించడం, జంతువులను వారి పేరుపై వదలి పెట్టడం, అలాంటి జంతువులను అపూర్వంగా చూడటం, అవి దూరి నీళ్లు తాగుతున్నప్పుడు గడ్డిమేస్తున్నప్పుడు గౌరవభావంతో వాటిని అక్కడి నుండి వెళ్లగొట్టకుండా ఉండటం, కర్రలతో రాళ్లతో వాటిని కొట్టటాన్ని పాపంగా భావించడం, తినడం త్రాగడం ధరించడం వంటి పనుల్లో ఆచారాలను పాటించడం, ఫలానా, ఫలానా వారు ఫలానా పదార్థాలు తినకూడదని, ధరించకూడదని భావించడం. ప్రాపంచిక మేళ్ళు, కీడు వారే కలిగిస్తారని భావించడం, ఫలానా, ఫలానా వారు దైవేతరుల శాపానికి గురయ్యారు, అందువల్ల వారు పిచ్చివాళ్ళయ్యారు, వారు తిరస్కరించడం వల్లనే ఫలానా అతను అగత్యపరుడయ్యాడు, దైవేతరులు ఫలానా వారికి ప్రసాదించడం వల్లనే అదృష్టం, సౌభాగ్యం వారి పాదాల చెంత చేరింది, ఫలానా నక్షత్రం వలన కరవు ఏర్పడింది, ఫలానా పని ఫలానా ఘడియలో ఫలానా రోజు ప్రారంభించడం వల్ల అది పూర్తికాలేదు, లేదా “అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కోరితేనే నేను వస్తాను అనడం” లేదా “పీర్గారికి ఇష్టమయితేనే ఈ పని జరుగుతుంది” లేదా “సంభాషణలో గరీబ్ నవాజ్ (దాత), గౌస్ (అగత్యపరుడు), ఖుదాయోఁకా ఖుదా (ప్రభువులకు ప్రభువు), షహెన్ షాహ్ (సర్వ ప్రపంచానికి చక్రవర్తి)” యజమానులకు యజమాని, లాంటి పదాలు ఉపయోగించటం. ప్రమాణం చేయవలసి వచ్చినప్పుడు ప్రవక్తపై, అలీపై, ఇమామ్ పై లేదా పీర్ పై వారి సమాధులపై లేదా నాతోడు అని ప్రమాణం చేయటం ఇలాంటి పనుల ద్వారా షిర్క్ జనిస్తుంది. వీటినే రోజువారి కార్యకలాపాల్లో అల్లాహ్ తో షిర్క్ అంటారు. అంటే, సాధారణ పనుల్లో అల్లాహ్ ను గౌరవించిన విధంగానే దైవేతరులనూ గౌరవించడం. షిర్క్ లోని ఈ నాలుగు రకాల గురించి దివ్యఖుర్ఆన్, హదీసుల్లో సవివరంగా పేర్కొనడం జరిగింది. కనుక మేము ఈ అంశాలన్నింటిన్నీ రానున్న అధ్యాయాల్లో ప్రస్తావించాము.

సారాంశం

1. అల్లాహ్ జ్ఞానం రీత్యా అంతటా ఉన్నాడు, చూస్తున్నాడు. అతని పరిజ్ఞానం మొత్తం విశ్వాన్ని ఆవహించి ఉంది. అతను ఎప్పుడైనా, ఎక్కడైనా ఎవరి పట్లయినా పరోక్షంగా తెలిసినవాడు. ఈ గుణంలో ఎవరినైనా, ఏ విధంగానైనా భాగస్వాములను చేస్తే అది జ్ఞానంలో షిర్క్ (జ్ఞానంలో భాగస్వామ్యం) అవుతుంది.

2. విశ్వమంతటిలో అల్లాహ్ తన ఇష్టప్రకారం ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగాగానీ ఏ విధంగానైనా అధికారం చేయడం అతని సొంత గుణం. ఈ గుణంలో ఎవరినైనా, ఏ విధంగానైనా భాగస్వామిని చేయడం షిర్క్ ఫిత్తసర్రుఫ్ (అధికారంలో భాగస్వామ్యం) అవుతుంది.

3. అల్లాహ్ కోసం ప్రత్యేకించబడిన ఆరాధనల్లో వేరే వారిని ఏ రకంగానైనా, ఏ ఉద్దేశంతోనైనా భాగస్వాములను చేయడాన్ని ఆరాధనల్లో షిర్క్ అంటారు.

4. రోజువారి పనుల్లో గౌరవార్థం, కృతజ్ఞతాపూర్వకంగా శుభము కొరకు అల్లాహ్ పేరు తీసుకోవడం, మంచి చెడు అతని ఇచ్ఛతో, అధికారంతోనే జరుగుతాయని భావించడం మరియు అన్ని సందర్భాల్లోనూ నోటితో, ఆచరణలతో అతని దాస్యమే ప్రస్ఫుటమయ్యేలా చేయడం తౌహీద్ ఫిల్ ఆదాత్ (వ్యవహారాలలో ఏకేశ్వరోపాసన) అవుతుంది. కనుక ఈ పనుల్లో ఎవరినైనా, ఏ విధంగానైనా ఏ ఉద్దేశంతోనైనా భాగస్వాములను చేయడం మరియు ఈ పనులు వారి కోసం ఆపాదించడం వ్యవహారాలలో బహుదైవారాధన అవుతుంది.

ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

  1. “అల్లాహ్ జ్ఞానం” గురించి ఏ విధంగా విశ్వసించాలి?
  2. షిర్క్ లోని కొన్ని ప్రముఖమైన రకాలను తెలుపండి?
  3. జ్ఞానంలో షిర్క్ అంటే ఏమిటి?
  4. అధికారంలో షిర్క్ అంటే ఏమిటి?
  5. ఆరాధనల్లో షిర్క్ చేయడం అంటే ఏమిటి?
  6. రోజువారి పనుల్లో షిర్క్ అంటే ఏమిటి? లేదా వ్యవహారాలలో షిర్క్ అంటే ఏమిటి?

తప్పొప్పులను గుర్తించండి

  1. అల్లాహ్ మాదిరిగానే దైవేతరులకూ ప్రతి విషయానికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది అన్న భావన సమ్మతమే
  2. అల్లాహ్ కు మాదిరిగా ప్రపంచంలో అధికారం చెలాయించే శక్తి మిథ్యా దైవాలకు ఉందని నమ్మడం షిర్క్ అవుతుంది
  3. అవసరమున్నప్పుడు నబీ, వలీ, ఇమామ్ మరియు పీర్లపై ప్రమాణాలు చేయడం షిర్క్ అవుతుంది
  4. మిథ్యా దైవాల కొరకు సజ్దహ్, రుకూల (వంగుట), చేతులు కట్టుకుని వినయంతో నిలుచోవడం ఆరాధనలో షిర్క్ అవుతుంది.
  5. ఆరోగ్యం, అనారోగ్యం, విజయం, వైఫల్యం, సుఖ, దుఖాల్లో దైవేతరులకు అధికారముంది

ఖాళీలను పూరించండి

  1. అల్లాహ్ కు మాదిరిగా దైవేతరులకూ ప్రతి విషయానికి సంబంధించిన జ్ఞానం ఉందనుకోవడం ……… అవుతుంది.
  2. అల్లాహ్ తప్ప ఇతరులను కలిమిలేములను ప్రసాదిస్తారని, పేదరికం, ఆరోగ్యం అనారోగ్యం, వైఫల్యం చెందటం, కష్టాలు, బాధల నుండి విముక్తి కలిగించే వారని భావించడం అవుతుంది.

1. బహుదైవారాధన క్షమార్హం కాదు

అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో ఇలా సెలవిచ్చాడు :

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ ۚ وَمَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا

తనకు భాగస్వామ్యం (షిర్క్‌) కల్పించటాన్ని అల్లాహ్‌ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. షిర్క్‌ మినహా తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అల్లాహ్ కు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టినవాడు మార్గభ్రష్టతలో చాలా దూరం వెళ్ళి పోయాడు. (దివ్యఖుర్ఆన్ 4:116)

మార్గభ్రష్టతలో పడిపోవడమంటే; మానవుడు హలాల్ (ధర్మసమ్మతం) హరామ్ (ధర్మసమ్మతంకాని)ల విషయంలో తేడా చూపకపోవడం, దొంగతనం చేయడం, వ్యర్ధ విషయాల్లో లీనమవడం, నమాజ్ రోజాలను విడిచిపెట్టడం, భార్యా పిల్లల హక్కులు నెరవేర్చకపోవడం మరియు తల్లి దండ్రుల అవిధేయతకు పాల్పడటం – కాని షిర్క్ ఊబిలో పడిపోయినవాడు మరింత ఎక్కువ మార్గభ్రష్టతలో పడిపోతాడు. ఎందుకంటే అతను ఎంతటి మహాపాపానికి ఒడిగట్టాడంటే పశ్చాత్తాపం చెందనంతవరకూ అల్లాహ్ అతన్ని ఎన్నటికీ క్షమించడు. ఇతర పాపాలను పశ్చాత్తాపం చెందకపోయినా అల్లాహ్ తలచుకుంటే క్షమిస్తాడు.

దీన్నిబట్టి తెలుస్తున్న విషయం ఏమిటంటే, షిర్క్ క్షంతవ్యం కాని నేరం. ఈ నేరానికి తప్పకుండా శిక్షపడుతుంది. పెద్ద తరహా షిర్క్ కు పాల్పడితే మనిషి తిరస్కారి (కాఫిర్) అవుతాడు. దానికి శిక్ష శాశ్వత నరకమే. చిన్న తరహా షిర్క్ కు పాల్పడితే దానికి అల్లాహ్ దగ్గర నిర్ణయించబడి ఉన్న శిక్ష తప్పనిసరిగా విధించబడుతుంది [*]. ఇతర పాపాలకు కూడా అల్లాహ్ వద్ద శిక్షలు నిర్ణయించబడి ఉన్నాయి. శిక్ష విధించే విషయం అల్లాహ్ ఇష్టంపై ఆధారపడి ఉంది. ఆయన తలచుకుంటే వదలిపెడతాడు. లేదా శిక్షిస్తాడు.

2. షిర్క్ దృష్టాంతం

షిర్క్ కంటే పెద్ద పాపం మరొకటి లేదని తెలుసుకున్నాం. దీన్ని ఒక ఉదా హరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. రాజు తన రాజ్య ప్రజలు నేరాలకు పాల్పడితే దండించడానికి అన్ని రకాల శిక్షలు నిర్ణయించి ఉంచుతాడు. దొంగతనం, దోపిడీ, పహారా కాస్తూ నిద్రపోవడం, దర్బారుకు ఆలస్యంగా రావడం, యుద్ధ మైదానం నుండి పారిపోవడం, ప్రభుత్వ నిధుల పంపిణీలో అవినీతికి పాల్పడటం లాంటి నేరాలు చేస్తే ఏఏ శిక్షలు విధించాలో ముందుగానే నిర్ణయమై ఉంటుంది. శిక్ష విధించడం రాజుగారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఆయన తలచుకుంటే నేరానికి పాల్పడిన వారిని శిక్షించవచ్చు లేదా క్షమించి విడిచి పెట్టనూవచ్చు. కాని కొన్ని నేరాల ద్వారా నేరస్థుల తిరుగుబాటు ప్రస్ఫుటమవుతుంది. ఉదాహరణకు రాజుగారి సమక్షంలోనే వేరే అధికారిని గానీ మంత్రిని గానీ, చౌదరీని గానీ, ధనవంతుడిని గానీ, త్రాగుబోతును గానీ, అల్పుడిని గానీ రాజును చేయడం లాంటి దుశ్చర్యకు పాల్పడటం తిరుగుబాటు అవుతుంది. అంతే కాదు వారిలో ఎవరికైనా కిరీటంగానీ, సింహాసనంగానీ చేయించడం లేదా రాజు ముందు వారిని కీర్తించడం రాచమర్యాదలు చేయటం, లేదా వారి కోసం ఒక రోజు పండుగ చేసి వారి పేర మొక్కుబడులు తీర్చడం, ఇవన్నీ పెద్ద పెద్ద నేరాలు. ఈ నేరాలకు పాల్పడిన వారికి తప్పకుండా శిక్షపడాల్సిందే. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని రాజు శిక్షించకుండా నిర్లక్ష్యం వహిస్తే అతని సామ్రాజ్యం బలహీనమైపోతుంది. మేధావులు అలాంటి రాజులను అనర్హులుగా, అసమర్థులుగా పేర్కొంటారు.

ప్రజలారా! యజమానులకు యజమాని అయిన ఆ మహా చక్రవర్తికి భయపడండి. అతని శక్తి అపారం. అది అంచనాలకు అందదు. అతను రోషం గలవాడు. అతను బహు దైవారాధకులను శిక్షించకుండా ఎలా ఉంటాడు? శిక్షించకుండా వారిని ఎలా విడిచి పెడతాడు?

అల్లాహ్ ముస్లిములందరినీ క్షమించుగాక! వారిని షిర్క్ లాంటి భయంకరమైన ముప్పు నుండి కాపాడుగాక! అమీన్.

3. షిర్క్ మహాపరాధం

అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో ఇలా సెలవిచ్చాడు:

وَإِذْ قَالَ لُقْمَانُ لِابْنِهِ وَهُوَ يَعِظُهُ يَا بُنَيَّ لَا تُشْرِكْ بِاللَّهِ ۖ إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ

లుఖ్మాన్‌ తన కుమారునికి హితబోధ చేస్తూ ఇలా అన్నాడు: “ఓ నా ముద్దుల పుత్రుడా! అల్లాహ్ కు భాగస్వాములను కల్పించకు. నిస్సందేహంగా అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్‌ చేయటం) ఘోరమైన అన్యాయం..” (దివ్యఖుర్ఆన్ 31 : 13)

అల్లాహ్ లుఖ్మాన్ (అలైహిస్సలాం)కి వివేకాన్ని ప్రసాదించాడు. ఆయన తన బుద్ధి బలంతో ఒకరి హక్కును మరొకరికి ఇవ్వడం అన్యాయమని గ్రహించారు. ఎవరయితే అల్లాహ్ హక్కును అతని సృష్టితాలకు కేటాయిస్తాడో వాడు అత్యున్నతుడికి దక్కాల్సిన హక్కును అల్పునికి ఇచ్చినట్లే. ఎందుకంటే అల్లాహ్ అత్యున్నతుడు. అతని దగ్గర సృష్టితాల స్థానం బానిసల లాంటిది. రాజమకుటాన్ని ఒక అల్పుడి తలపై పెట్టడమంటే దీనికంటే అన్యాయం మరొకటి ఉంటుందా?

వాస్తవమేమిటంటే; మనిషి ఎంత గొప్పవాడయినా లేదా అల్లాహ్ కు అత్యంత సమీప దూత అయినా అల్లాహ్ కు పోటీ దారుడయితే వారి స్థానం హీనుల కంటే అల్పమైనది. షరీఅత్ (ఇస్లామీయ శాసనాంగం) షిర్క్ ను మహాపాపంగా పేర్కొంది. మన బుద్ధి కూడా దాన్ని మహాపాపంగానే పరిగణిస్తుంది. షిర్క్ పాపాలన్నింటిలో మహాపాపం. ఎందుకంటే మానవునిలో ఉన్న లోపం, అతను తన పెద్దలను గౌరవించడు. అల్లాహ్ కంటే పెద్దవాడు మరెవడూ లేడు. షిర్క్ చేయడం అంటే అతని ఔన్నత్యాన్ని అగౌరవ పరచడమే.

4. సాఫల్యానికి మార్గం తౌహీద్ (ఏకేశ్వరోపాసన) మాత్రమే

అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు :

وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ

నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా, “నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్నే ఆరాధించండి” అనే సందేశాన్ని (వహీని) అతనికి పంపాము.(దివ్యఖుర్ఆన్ 21 : 25)

అంటే ప్రవక్తలందరూ అల్లాహ్ నుండి తెచ్చిన ఆదేశం ఏమిటంటే; కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. ఆయన్ని తప్ప మరెవరినీ ఆరాధించకండి. దీని ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే, తౌహీద్ ను ఆదేశించడం షిర్క్ నుండి దూరంగా ఉండటం అన్ని షరీఅత్ (శాసనాంగాల)లకు సంబంధించిన ఏకాభిప్రాయం గల విషయం. కనుక సాఫల్యానికి తౌహీద్ ఒక్కటే మార్గం. మిగితావన్నీ వక్రమార్గాలే.

5. అల్లాహ్ షిర్క్ (భాగస్వామ్యం)ను లెక్కచెయ్యడు

అబూ హురైరహ్ (రజిరదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు:

భాగస్వామ్యం చేయబడే వారందరిలోకెల్లా నేను భాగస్వామ్యంకు అతీతుణ్ణి. ఎవరయినా ఏదయినా పని చేస్తూ, ఆ పనిలో నాకు భాగస్వాములను కల్పిస్తే నేను అతడిని, అతను కల్పించిన భాగస్వామిని విడిచిపెడతాను. వారిని లెక్క చేయను. (హదీసు గ్రంథం : ముస్లిం : 2985)

అంటే ప్రజలు ఉమ్మడి వస్తువులను పరస్పరం పంచుకుంటారు. నేను మాత్రం అలా చేయను. ఎందుకంటే నేను నిరపేక్షాపరుడ్ని. ఎవరయినా నా కోసం ఆచరించి అందులో ఇతరులనూ భాగస్వాములుగా చేర్చినపుడు నేను నా భాగాన్ని తీసుకోను. మొత్తం ఇతరుల కోసమే విడిచిపెడతాను. అతని నుండి ముఖం త్రిప్పుకుంటాను

తెలిసిందేమిటంటే ఎవరయితే అల్లాహ్ కోసం ఆచరించి, దైవేతరుల కోసమూ ఆచరిస్తారో వారు షిర్క్ కు పాల్పడ్డారు. మరో విషయం ఏమిటంటే, ముష్రిక్కులు అల్లాహ్ కోసం చేసే ఆరాధనలు స్వీకరించబడవు.

6. ఆత్మావస్థలో తౌహీద్ (ఏకోశ్వరోపాసన) అంగీకారం

అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు :

وَإِذْ أَخَذَ رَبُّكَ مِن بَنِي آدَمَ مِن ظُهُورِهِمْ ذُرِّيَّتَهُمْ وَأَشْهَدَهُمْ عَلَىٰ أَنفُسِهِمْ أَلَسْتُ بِرَبِّكُمْ ۖ قَالُوا بَلَىٰ ۛ شَهِدْنَا ۛ أَن تَقُولُوا يَوْمَ الْقِيَامَةِ إِنَّا كُنَّا عَنْ هَٰذَا غَافِلِينَ أَوْ تَقُولُوا إِنَّمَا أَشْرَكَ آبَاؤُنَا مِن قَبْلُ وَكُنَّا ذُرِّيَّةً مِّن بَعْدِهِمْ ۖ أَفَتُهْلِكُنَا بِمَا فَعَلَ الْمُبْطِلُونَ

నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి, స్వయంగా వారినే వారికి సాక్షులుగా పెట్టి, ‘నేను మీ ప్రభువును కానా?’ అని అడిగి నప్పుడు ‘ఎందుకు కావు? (నువ్వే మా ప్రభువువి). ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నాం’ అని వారు చెప్పారు. ‘దీని గురించి మాకేమీ తెలియదు’ అని ప్రళయ దినాన మీరు అనకుండా ఉండటానికీ లేదా ‘మొదట్లో మా పూర్వీకులు షిర్క్ కు పాల్పడ్డారు. మేము వారి తరువాతి వారి సంతతిలో పుట్టిన వారము. ఆ దుర్జనులు చేసిన పాపానికి నువ్వు మమ్మల్ని వినాశానికి గురి చేస్తావా?!” అని మీరు అనకుండా ఉండటానికి గాను (మేము ముందే మీ నుండి ఈ విధంగా ఖరారు చేయించాము.). (దివ్యఖుర్ఆన్ 7 : 172–173)

ఉబై బిన్ కఅబ్ (రదియల్లాహు అన్హు) “నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి, వారితో వాగ్దానం తీసుకున్నాడు” అనే సూక్తి భావాన్ని ఇలా వివరించారు: అల్లాహ్ ఆదం సంతానాన్ని ఒక చోట చేర్చాడు. వారి జంటలు చేసాడు. తరువాత వారి ఆకారాలను రూపొందించాడు. వారికి మాట్లాడే శక్తిని ప్రసాదించాడు. వారు మాట్లాడసాగారు. అప్పుడు వారి నుండి వాగ్దానం తీసుకున్నాడు. వారినే సాక్షులుగా చేసి నేను మీ ప్రభువును కానా?” అని ప్రశ్నించాడు. అప్పుడు వారు ‘నువ్వే మా ప్రభువువి’ అని సమాధానం ఇచ్చారు. అల్లాహ్ మళ్ళీ వారితో : నేను సప్తాకాశాలను, సప్తభూములను, మీ తండ్రి ఆదంను కూడా మీపై సాక్షిగా ఉంచుతున్నాను. తరువాత మీరు ప్రళయ దినాన ‘దీని గురించి మాకేమీ తెలియదు’ అని అనకుండా ఉండటానికి. నేను తప్ప ఇతర ఆరాధ్యుడుగానీ ప్రభువుగానీ ఎవరూ లేరు. నాతోపాటు ఎవరినీ భాగస్వాములుగా చేర్చకండి. నేను మీ వద్దకు నా సందేశహరులను పంపుతూ ఉంటాను. వారు మీకు మీరు చేసిన ఈ వాగ్దానాన్ని గుర్తు చేస్తుంటారు. మీపై నా గ్రంథాలను అవతరింప జేస్తాను అని అంటాడు. అందుకు వారు ‘నువ్వే మా ప్రభువువి. ఆరాధకుడివి. నీవు తప్ప మరో ప్రభువుగానీ, ఆరాధ్య దేవుడు గానీ లేడు” అని సమాధానం ఇస్తారు.(*) (హదీసు గ్రంథం – మున్నదె అహ్మద్)

(*) ఆత్మావస్థలో తౌహీద్ (ఏకేశ్వరోపాసన)ను మానవులందరూ అంగీకరించారు. ఆ సమయంలో ఆదమ్ (అలైహిస్సలాం)ని పైకి ఎత్తడం జరిగింది. ఆయన అక్కడ ఉన్న వారందరినీ చూశారు. వారిలో ధనవంతులూ ఉన్నారు. నిరుపేదలూ ఉన్నారు. అందమైన వారూ ఉన్నారు. అందవిహీనులూ ఉన్నారు. ఆయన అల్లాహ్ తో ‘అందరినీ ఒకే విధంగా ఎందుకు పుట్టించలేదు’ అని ప్రశ్నించారు. అందుకు అల్లాహ్ నాకు కృతజ్ఞతలు తెలుపడాన్ని నేను ఇష్టపడతాను’ అని సమాధానమిచ్చాడు. ఆదమ్ (అలైహిస్సలాం) చూసిన వారిలో ప్రవక్తలు కూడా ఉన్నారు. వారు దీపంలా కాంతితో వెలిగిపోతున్నారు. వారి ముఖాల నుండి జ్యోతి ప్రసరిస్తుంది. అల్లాహ్ ప్రవక్తల నుండి దైవదౌత్య విషయంలో కూడా వాగ్దానం తీసుకున్నాడు. ఈ వాగ్దానం గురించి దివ్య ఖుర్ఆన్ ఇలా పేర్కొనడం జరిగింది: ఆ సమయంలో మేము ప్రవక్తల నుండి కూడా వాగ్దానం తీసుకున్నాము. మీ నుండి, నూహ్, ఇబ్రాహీమ్, మూసా, మర్యమ్ కుమారుడు ఈసా (అలైహిస్సలామ్) మొదలైన ప్రవక్తల నుండి కూడా వాగ్దానం తీసుకున్నాము. – అనువాదకుడు

7. షిర్క్ ధ్రువపత్రం కాజాలదు

ఉబై బిన్ కఅబ్ (రదియల్లాహు అన్హు) పైన పేర్కొన్న ఆయత్ (దివ్యఖుర్ఆన్ 7: 172-173) భావాన్ని ఈ విధంగా వివరించారు:

అల్లాహ్ ఆదిమానవుడు ఆదమ్ సంతతి నందరినీ ఒక చోట చేర్చాడు. వారి శరీరాల్లో ఆత్మలను ప్రవేశపెట్టాడు. ఉదాహరణకు: ప్రవక్తలను, మహాత్ములను, షహీదులను (అమర వీరులను), సజ్జనులను, విధేయులను, అవిధేయులను అందరినీ వేరు వేరు చేశాడు. అదే విధంగా యూదులను, క్రైస్తవులను, ముష్రిక్కులను, ఏకదైవారాధకులను అందరినీ వేరు చేశాడు. వారందరికీ ఈ ప్రపంచంలో ఇచ్చిన రూపాన్ని ఇచ్చాడు. కొందరిని అందంగానూ మరి కొందరిని అంద విహీనులుగాను చేశాడు. కొందరికి చూపు ఇచ్చి ఇంకొందరిని అంధులుగా చేశాడు. కొందరిని మాట్లాడేవారుగా, మరికొందరిని మూగవారుగా చేశాడు. ఇంకొందరిని వికలాంగులను చేశాడు. అప్పుడు వారందరికీ మాట్లాడే శక్తిని ఇచ్చి వారితో నేను మీ ప్రభువును కానా?’ అని ప్రశ్నించాడు. వారందరూ అల్లాహ్ ను తమ ప్రభువుగా అంగీకరించారు. అప్పుడు అల్లాహ్ వారితో తనను తప్ప వేరొకరిని పాలకునిగా, యజమానిగా భావించ కూడదని, తనను కాక వేరే వారిని ఆరాధకులుగా చేయ కూడదని వాగ్దానం తీసుకున్నాడు. వారందరూ అల్లాహ్ వాగ్దానం చేశారు. అల్లాహ్ ఆదమ్ (అలైహిస్సలామ్) ని, ఏడు ఆకాశాలను, భూములను సాక్షులుగా చేస్తూ; మీకు ఈ వాగ్దానాన్ని గుర్తు చేయ డానికి ప్రవక్తలు వస్తారు. తమతోపాటు ఆకాశ గ్రంథాలు తీసుకు వస్తారు అని అన్నాడు. అజల్ (ఆత్మావస్థ) రోజునాడు ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా తౌహీద్ (ఏకోశ్వరోపాసన)ను అంగీకరించి, షిర్క్ (బహుదైవారాధన)ను తిరస్కరించాడు. కనుక షిర్క్ లో ఎవరినీ దృష్టాంతంగా పేర్కొనకూడదు. ప్రబోధకులనుగానీ, సన్యాసులను గానీ, మతాధికారులను గానీ, తాతముత్తాతలనుగానీ, చక్రవర్తినిగానీ, పండితులనుగానీ మరియు పుణ్యాత్ములనుగానీ ఎవరినైనా సరే.

8. “మరుపుకు సాకు” స్వీకరించబడదు

ప్రపంచంలో వచ్చాక మాకు ఆ వాగ్దానం గుర్తులేదు. కనుక మేము షిర్క్ చేసినా మమ్మల్ని ఎవరూ పట్టుకోరు, మరిచిపోయిన విషయాల గురించి ఎవరూ ప్రశ్నించరు అని భావించే వారికి సమాధానం ఏమిటంటే; మానవుడికి చాలా విషయాలు గుర్తుండవు. కానీ ఎవరయినా విశ్వసనీయుడు వాటిని గుర్తు చేస్తే నమ్మకం కలుగుతుంది. ఉదాహరణకు ఎవరయినా తాను పుట్టిన రోజు గుర్తులేకపోతే, జనులు చెప్పిన దాన్ని బట్టి తాను ఫలానా రోజు ఫలానా తేదీన ఫలానా ఘడియలో పుట్టానని చెబుతాడు. పెద్దల నుండి విని తన తల్లిదండ్రులను గుర్తుపడతాడు. వేరే వారిని తన తల్లిగా చెప్పుకోడు. ఎవరయినా తన తల్లి హక్కులను నెరవేర్చకపోతే లేదా వేరే వారిని తల్లిగా చెప్పుకుంటే ప్రపంచం అతనిపై ఉమ్మేస్తుంది. ఒకవేళ ఎవరయినా ‘నన్నెందుకు తప్పుపడుతున్నారు. మా అమ్మ ఎవరో నాకు గుర్తులేదు’ అని అంటే అలాంటి వారిని మరీ మతిస్థిమితంలేని వానిగా, అవిధేయునిగా భావిస్తారు.

తెలిసిందేమిటంటే, ప్రజలు చెప్పడం వల్ల మనిషి అనేక విషయాలను నమ్ముతాడు. ప్రవక్తలు ఎంతో గొప్పవారు. అలాంటి వారు చెప్పినా నమ్మకం కలగదా?

9. ప్రవక్తల మరియు గ్రంథాల మౌలిక బోధన

తౌహీద్(ఏకేశ్వరోపాసన)నే అనుసరించాలని షిర్క్(బహుదైవారాధన) కు దూరంగా ఉండాలనీ ఆత్మల లోకంలో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా తాకీదు చేయడం జరిగింది. ప్రవక్తలందరూ ఈ విషయాన్నే గుర్తు చేయడానికి పంపబడ్డారు. ఒక లక్షా ఇరవై నాలుగు వేల ప్రవక్తల ప్రబోధనలు, ఆకాశ గ్రంథాలు ఈ ఒక్క విషయాన్నే నొక్కి వక్కాణించాయి.

గుర్తుంచుకోండి! “తౌహీద్ ను అనుసరించండి. షిర్క్ దరిదాపులకు కూడా వెళ్లకండి. అల్లాహ్ ను తప్ప ఇతరులను పాలకునిగా, సార్వభౌమునిగా భావించకండి. దైవేతరులను యజమానులుగా భావించకండి. వారిని మొరపెట్టుకోకండి. వారికి మొక్కకండి.”

క్రింది హదీసు తెలుసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ షిర్క్ కు ఒడిగట్ట కూడదు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనకు ఇలా ప్రబోధించారని ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. “అల్లాహ్ కు సహవర్తులుగా ఎవరినీ చేర్చకు. నిన్ను చంపినా, తగులబెట్టినా సరే.” (హదీసు గ్రంథం, ముస్నద్ అహ్మద్ 5: 238)

అంటే, అల్లాహ్ ను తప్ప వేరితరులను ఆరాధ్య దైవాలుగా భావించకండి. షైతానులు, జిన్నులు మిమ్మల్ని బాధపెడతారని చింత చెందకండి. ముస్లిములు బాహ్యమైన ఆపదలు కలిగినప్పుడు సహనం వహించాలి. వాటికి భయపడి విశ్వాసాన్ని విడనాడ కూడదు. అలాగే అంతర్గత పీడనల (జిన్నులు, షైతానులు పెట్టే బాధల) విషయం లోనూ సహనం వహించాలి. వాటికి భయపడి విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. సుఖమయినా, దుఃఖమయినా అంతా అల్లాహ్ అధీనంలోనే ఉందని విశ్వసించాలి. అల్లాహ్ విశ్వాసులను పరీక్షిస్తాడు. విశ్వాసులకు వారి విశ్వాసాల ప్రకారం పరీక్షిస్తాడు. దుష్టుల ద్వారా సజ్జనులకు ఆపదలు కలిగించి చిత్తశుద్ధి కలవారెవరో కపటులెవరో పరికిస్తాడు. పుణ్యాత్ములకు పాపాత్ముల ద్వారా, విశ్వాసులకు తిరస్కారులద్వారా కష్టాలు కలిగిస్తాడు. వారు సహనం వహిస్తారు. విశ్వాసం నుండి సడలరు. అదే విధంగా అప్పుడప్పుడు పుణ్యాత్ములకు జిన్నుల ద్వారా, షైతాన్ ద్వారా అల్లాహ్ ఇచ్ఛానుసారం బాధలు కలుగుతాయి. కనుక ఆ సమయంలో కూడా సహనం వహించాలి. బాధలకు భయపడి ఎన్నటికీ వారిని విశ్వసించకూడదు.

దీని ద్వారా తెలిసినదేమిటంటే; ఎవరయినా షిర్క్ ను వీడి దైవేతరులను విడిచి పెట్టి వారి మ్రొక్కులను ఖండిస్తున్నప్పుడు, దురాచారాలను అంతమొందిస్తున్నప్పుడు ఆ మార్గంలో అతనికి ధన నష్టంగానీ ప్రాణ నష్టంగానీ జరిగినా లేదా ఏదైనా షైతాను, దుష్టజిన్నులు, పీర్, ముర్షద్ రూపంలో హింసపెడుతున్నా, అల్లాహ్ తనను పరీక్షిస్తున్నాడని భావించాలి. వాటిని సంతోషంగా భరించాలి. విశ్వాసంపై స్థిరంగా ఉండాలి.

గుర్తుంచుకోండి! అల్లాహ్ దౌర్జన్యపరులకు సడలింపు ఇచ్చి మరీ పట్టుకున్నట్లే, బాధితులను వారి నిరంకుశపు పంజా నుండి మోక్షం ప్రసాదిస్తాడు. అదే విధంగా దుష్ట జిన్నులను కూడా సమయం వచ్చినప్పుడు పట్టుకుంటాడు. వారి దౌర్జన్యం నుండి ఏకదైవారాధకులకు విముక్తిని ప్రసాదిస్తాడు

ఇబ్నె మసూద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో, ఓ ప్రవక్తా! అతి పెద్ద పాపం ఏది? అని అడిగాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: “దైవేతరులను అల్లాహ్ గా భావించి మొరపెట్టుకోవడం పెద్ద పాపం. ఎందుకంటే అల్లాహ్ యే నిన్ను సృష్టించాడు.” (హదీసు గ్రంథం : బుఖారి 6861)

అల్లాహ్ జ్ఞానం అంతటా వ్యాపించి ఉంది. సార్వభౌమాధికారం ఆయన చేతుల్లోనే ఉంది. అందుకనే ప్రతి ఆపదలోనూ ఆయన్నే మొరపెట్టుకోవాలి. అదే విధంగా దైవేతరులకు ఈ గుణాలను ఆపాదించి వారిని మొరపెట్టుకోవడం మహాపాపం. ఎందుకంటే అల్లాహ్ తప్ప ఎవరూ అవసరాలను తీర్చరు. అంతేకాదు మన సృష్టికర్త అల్లాహ్ యే కనుక కష్టాలు వచ్చినప్పుడు ఆయన్నే ఆరాధించాలి. దైవేతరులతో మనకు సంబంధం ఏమిటి? ఉదాహరణకు ఎవరన్నా బానిసలు తమ అవసరాల గురించి తమ రాజు వద్దనే ఏకరువు పెట్టుకుంటారు తప్ప ఇతరుల వద్దకు ఎందుకు వెళతారు? అల్పుని దగ్గరికి అసలు వెళ్ళరు. విశ్వప్రభువు అయిన అల్లాహ్ కు వేరే పోటీదారులు ఎవరూలేరు.అలాంటప్పుడు వేరే వారి వద్దకు వెళ్ళి తమ అవసరాలను ఏకరువు పెట్టడం అజ్ఞానం కాక మరేమిటి?

10. ఏకదైవారాధన మరియు మన్నింపు

అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం అల్లాహ్ ఇలా సెలవిచ్చాడని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు: ‘ఓ ఆదమ్ పుత్రుడా! ఒకవేళ నువ్వు ప్రపంచమంత పాపాలన్నీ చేసినా సరే, నాకు సహవర్తుల్ని కల్పించకుండా వచ్చి నన్ను కలిస్తే, ప్రపంచమంత మన్నింపుతో నేను నిన్ను కలుస్తాను.’ (హదీసు గ్రంథాలు, తిర్మిజీ, అహ్మద్ : 3540)

అంటే ఈ ప్రపంచంలోకి ఫిరౌను (ఈజిప్ట్ పాలకుల బిరుదు), హామాన్ (ఫిరౌను ప్రధానమంత్రి) లాంటి ఎంతో మంది పెద్ద పెద్ద పాపాత్ములు వచ్చారు. షైతాన్ కూడా ఉన్నాడు. వీరి ద్వారా జరిగిన పాప కార్యాలన్నీ, ఇంకా ప్రళయం వరకు జరగ బోయే పాపాలన్నీ ఒకే వ్యక్తి చేశాడు అనుకుందాం. కాని ఆ వ్యక్తి అన్ని పాపకార్యాలు చేసినా షిర్క్ కు పాల్పడకుండా ఉంటే అల్లాహ్ అతను చేసిన పాపాలకు సమానంగా క్షమాభిక్ష అనుగ్రహాలు అతనిపై అవతరింపజేస్తాడు. ఏక దైవారాధన శుభాలతో అతని పాపాలన్నీ క్షమించబడతాయి.(*) అదేవిధంగా షిర్క్ చేయడం వల్ల ఇతర మంచి కార్యాలన్నీ వ్యర్ధమవుతాయి.

యదార్థమేమిటంటే మానవుడు అన్ని రకాల షిర్క్ ల నుండి అన్ని విధాలుగా దూరంగా ఉండాలి. శుభ్రంగా ఉండాలి. అంతేకాదు అల్లాహ్ తప్ప ఎవరూ యజమాని కాదని, ఆయన సామ్రాజ్యం నుండి ఎక్కడికీ పారిపోలేమని, అల్లాహ్ అవిధేయులకు ఎవరూ ఆశ్రయం కల్పించలేరని, ఆయన ముందు అందరూ నిస్సహాయులనీ, ఆయన ఆదేశాన్ని ఎవరూ ధిక్కరించలేరని, ఆయన ముందు ఎవరి సహాయమూ పనికిరాదని, అల్లాహ్ అనుమతిస్తే తప్ప ఎవరూ సిఫారసూ చేయలేరని విశ్వసించాలి. ఒకవేళ ఇలాంటి విశ్వాసుల ద్వారా మానవ తప్పిదంవల్ల లేదా పొరపాటువల్ల పాపాలు జరిగినా తను ఆ పాపాల భారంతో నలిగిపోతుంటాడు. చిరాకు చెందుతాడు. అవమాన భారంతో తలెత్తుకోలేకపోతుంటాడు. అలాంటి వ్యక్తిపై దైవానుగ్రహం అవతరిస్తుంది. పాపకార్యాలు పెరిగే కొద్దీ అతనిలో పశ్చాత్తాప భావం పెరుగుతూ ఉంటుంది. పశ్చాత్తాప భావం పెరిగే కొలదీ అల్లాహ్ అనుగ్రహమూ పెరుగుతుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే; ఇతరులు ఆరాధనలు చేయనటు వంటి పనులు కూడా ఏకదైవారాధనలో స్థిరంగా ఉన్న వ్యక్తి పాపాలు ఆ పనులు చేసి పెడతాయి. ఒక పాపాత్ముడైన ఏకదైవారాధకుడు దైవభీతిగల ఒక బహుదైవారాధకుని కంటే ఎన్నో రెట్లు మేలు. అంతేకాదు నేరస్థుడు, తిరుగుబాటుదారుడు, ముఖస్తుతి చేసేవాడి కంటే కూడా వేల రెట్లు నయం. ఎందుకంటే; మొదటివాడు తాను చేసే పాపాలపై ప్రాయఃశ్చిత్తం చెందుతాడు. కాని రెండోవాడు తాను చేస్తున్న కార్యాలపై గర్వపడతాడు.

సారాంశం

[1] ఆరాధనల్లో, వ్యవహారాల్లో జరిగిన పాపాలకు పశ్చాత్తాపం చెందకుండా చనిపోతే అల్లాహ్ తలిస్తే వాటిని క్షమిస్తాడు. కాని ‘విశ్వాసాల్లో జరిగిన పాపాలకు పశ్చాత్తాపం చెందకుండా చనిపోతే అల్లాహ్ ఎన్నటికీ క్షమించడు. షిర్కె అక్బర్ (బహుదైవారాధన)కి శాశ్వత నరకం, షిర్కె అస్గర్ (ప్రదర్శనాబుద్ధి)కి. తాత్కాలిక నరకం ప్రాప్తమవుతుంది.

[2] బహుదైవారాధన ఘోరాతిఘోరమైన పాపం. అది చక్రవర్తిపై తిరుగుబాటు చేయడం లాంటిది. దానికి శిక్ష నరకమే. తిరుగుబాటు చేయడం చక్రవర్తి దగ్గర మహానేరం. మరణ దండయే దానికి శిక్ష.(దివ్యఖుర్ఆన్ 4: 116)

[3] బహుదైవారాధన మహాపరాధం. ఎందుకంటే అది సర్వోన్నతుడైన సృష్టికర్త హక్కును అధములైన సృష్టితాలకు ఇచ్చివేయడమే. (దివ్యఖుర్ఆన్ 39: 13)

[4] గత శాసనాంగాల మౌలిక బోధన ఏకదైవారాధనయే. కనుక అదే సాఫల్యానికి మార్గం.

[5] అల్లాహ్ నిరపేక్షాపరుడు. తనకోసం ఎట్టి పరిస్థితిలోనూ భాగస్వామ్యాన్ని సహించడు. పూర్తి పుణ్యకార్యాలను రద్దు చేసేస్తాడు.

[6] ప్రళయదినం నాడు ఎలాంటి ఎదురు వాదన జరగకుండా ఉండేందుకు అల్లాహ్ అజల్ (ఆత్మావస్థ) లోనే ఆది మానవుడు ఆదం సంతానం నుండి ఏకదైవారాధన ప్రమాణం తీసుకున్నాడు.

[7] ఆత్మావస్థలో మానవులందరూ అల్లాహ్ వద్ద వ్యక్తిగతంగా ఏకదైవారాధనను అంగీకరించి, బహుదైవారాధనను తిరస్కరించారు. దాన్ని గుర్తు చేయడం కోసమే అల్లాహ్ ప్రవక్తలను, ఆకాశ గ్రంథాలను పంపే ఏర్పాటు చేశాడు. కనుక నేడు చెలామణి అవుతున్న ఏ విషయము కూడా బహుదైవారాధనకు ధ్రువపత్రం కాజాలదు.

[8] ఎవరయినా ఆత్మల లోకంలో జరిగిన ఒప్పందం మరిచిపోయానని సాకులు చూపి బహుదైవారాధనకు పాల్పడితే అతని సాకు స్వీకరించబడదు. ఎందు కంటే ప్రవక్తలు, ఆకాశ గ్రంథాలు సందర్భానుసారం దాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి.

[9] ఆత్మల లోకంలో జరిగిన తమ ఒప్పందాన్ని గుర్తు చేయడానికీ సందర్భానుసారం ఒక లక్షా ఇరవై నాలుగువేల మంది ప్రవక్తలు పంపబడ్డారు. మరియు దైవగ్రంథాలు సందర్భాన్ని బట్టి అవతరించాయి. హత్యచేయబడినా, దహనం చేయబడినా బహుదైవారాధన చేయకూడదని చాటిచెప్పాయి. అందువల్లనే ఏకేశ్వరోపాసన విశ్వాస పరిరక్షణల కోసం భౌతిక, మానసిక బాధలకు ఓర్పు, సహనం వహించాలి. భయపడి షైతానులు, జిన్నాతుల బారిన పడకూడదు. ఎందుకంటే; ఇది అల్లాహ్ తరపు నుండి మీ విశ్వాసానికి పరీక్ష. సృష్టికర్తతోపాటు బహుదైవారాధనకు పాల్పడటం ఘోర పాపం. నిజమైన ప్రభువు, ఆపదలను తొలగించేవాడు, కష్టాల్లో ఆదుకునేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే. ఉత్తమ ప్రతిఫలం మరియు శిక్ష ఇచ్చేవాడు అల్లాహ్ యే.

[10] ఏకేశ్వరోపాసన శుభముతో ప్రపంచమంతటి పాపాలలో మునిగినా క్షమాభిక్ష లభిస్తుంది. కాని బహుదైవారాధన దారిద్ర్యంతో పుణ్యాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతాయి. అంటే ఒక పాపాత్ముడైన ఏకేశ్వరోపాసకుడు, ఒక దైవభీతిపరుడైన బహుదైవారాధకుడి కంటే వెయ్యి రెట్లు మేలు. ముఖస్తుతి చేసే తిరుగు బాటుదారు కన్నా, ప్రభుత్వ విధేయుడైన నేరస్తుడు వెయ్యి రెట్లు నయం అన్న చందాన.

ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

  1. షిర్క్ లోని కొన్ని కీడులను వివరించండి?
  2. తౌహీద్ లోని కొన్ని మేళ్లను వివరించండి?
  3. షిర్క్ ని కొన్ని ఉపమానాలతో వివరించండి?
  4. ప్రవక్తల మౌలిక సందేశం ఏమిటి? వివరంగా వ్రాయండి?

తప్పొప్పులను గుర్తించండి

  1. షిర్క్ ధృవపత్రం కాగలదు. ( )
  2. షిర్క్ విషయంలో “మరుపుకు సాకు” స్వీకరించబడుతుంది. ( )
  3. ప్రళయం రోజున మనిషి తౌహీదు ఒప్పుకుంటాడు. ( )
  4. అల్లాహ్ షిర్క్ చేసే వాడి నుండి అతీతుడు. ( )
  5. షిర్క్ వల్ల విముక్తి కలుగవచ్చు. ( )

ఖాళీలను పూరించండి

  1. అల్లాహ్ షిర్క్ ను ………………………….
  2. షిర్క్ అన్నింటికంటే ………………………..
  3. తౌహీద్ మార్గం ……………….ల మార్గం
  4. అల్లాహ్ ………………………… క్షమించడు.
  5. ప్రతి వ్యక్తి ఆత్మావస్థలో ………………………..ను అంగీకరించాడు.
  6. ప్రళయం రోజున షిర్క్ …………………………. అవ్వదు.
  7. ఒకవేళ ఎవరైనా “మరుపువల్ల” షిర్క్ చేస్తే అతని సంజాయిషీ …….
  8. తౌహీద్ ……….. ……….. కి మార్గం

1.షిర్క్‌(భాగ స్వామ్యం) ఖండన

అల్లాహ్‌ దివ్యఖుర్‌ఆన్‌లో ఇలా సెలవిస్తున్నాడు:

وَعِندَهُۥ مَفَاتِحُ ٱلْغَيْبِ لَا يَعْلَمُهَآ إِلَّا هُوَ ۚ وَيَعْلَمُ مَا فِى ٱلْبَرِّ وَٱلْبَحْرِ ۚ وَمَا تَسْقُطُ مِن وَرَقَةٍ إِلَّا يَعْلَمُهَا وَلَا حَبَّةٍ فِى ظُلُمَـٰتِ ٱلْأَرْضِ وَلَا رَطْبٍ وَلَا يَابِسٍ إِلَّا فِى كِتَـٰبٍ مُّبِينٍ

అగోచరాల తాళం చెవులు అల్లాహ్‌ వద్దనే ఉన్నాయి. అల్లాహ్ కు తప్ప ఇతరులెవరికీ వాటి గురించి తెలియదు. భూమిలోనూ, సముద్రాలలోనూ ఉన్న వస్తువులన్నింటి గురించి ఆయనకు తెలుసు. రాలే ఆకు కూడా ఆయనకు తెలియకుందా ఉండదు. నేలలోని చీకటి పొరలలో పడే ఏ గింజ అయినా – పచ్చిది, ఎండినది ఏది పడినా – స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉంది. (దివ్యఖర్‌ఆన్‌ 6 : 59)

అల్లాహ్‌ మానవునికి బాహ్య వస్తువుల గురించి తెలుసుకోడానికి కొన్ని అవయవాలు ప్రసాదించాడు. ఉదాహరణకు: చూడటానికి కళ్లు, వినడానికి చెవులు, వాసన కోసం ముక్కు, రుచి కోనం నాలుక, వెతకటానికి చేతులు, అర్థం చేనుకోవడానికి బుద్ధిని ప్రసాదించాడు. ఈ అవయవాలన్నిటిపై మానవుడికి అధికారాన్ని ప్రసాదించాడు. తాను తలచుకున్నప్పుడు వాటిని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు: ఏదైనా వస్తువులను చూడకూడదనుకున్నప్పుడు కళ్లు మూనుకుంటాడు. చూడాలనుకున్నవ్పుడు కళ్లు తెరిచిఉంచుతాడు. ప్రతి అవయవాన్ని ఇలాగే ఊహించుకోండి. అదే విధంగా గోచర విషయాలు తెలుసుకోడానికి తాళం చెవులు ఇచ్చాడు. ఉదాహరణకు తాళం తెరవాలో లేదో? తాళం చెవి ఉన్న వాడి అధికారంలోనే ఉంటుంది. ఇలా బాహ్య వస్తువుల గురించి తెలుసుకోవాలో, తెలుసుకోకూడదో? అంతా మానవుడి అదుపులోనే ఉంది.

2.అగోచరాల జ్ఞానం కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది

దీనికి భిన్నంగా అగోచర విషయాలు తెలుసుకోవడం మానవుడి చేతుల్లో లేదు. దాని తాళం చెవులు అల్లాహ్‌ తన వద్ద ఉంచుకున్నాడు. మహా వ్యక్తులకుగానీ, అల్లాహ్‌ సామీప్యం పొందిన దైవదూతలకుగానీ తమకు ఇష్టం వచ్చినప్పుడు అగోచర విషయాలు తెలుసుకోవాలనుకునే, ఇష్టంలేనప్పుడు వదలి పెట్టే అధికారం లేదు. అల్లాహ్‌ తన ఇష్టానుసారం ఎప్పుడైనా ఎవరికైనా అగోచర విషయాలు కావాలనుకున్నంతగా తెలుపుతాడు. అగోచర విషయాలు తెలుపడం అల్లాహ్‌ ఇష్టంపై మాత్రమే ఆధారపడి ఉంది. వేరే వారి ఇష్టంపై ఆధారపడి లేదు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనేకసార్లు ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలనుకునేవారు. కాని ఆ విషయం ఆయన తెలుసుకోలేకపోయేవారు. అల్లాహ్‌ తలచుకున్నప్పుడు వాటిని వెంటనే తెలిపేవాడు. దైవదౌత్య కాలంలో కపటులు మాతృమూర్తి ఆయిషా( రదియల్లాహు అన్హా) పై అపనింద మోపారు. ఆ విషయం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్గం)కు తీవ్రంగా బాధ కలిగించింది. ఆయన (సల్లల్లాహు అలైహి వ నల్లం) చాలా రోజుల వరకు ఆ విషయాన్ని శోధించారు. కాని ఏ విషయమూ తెలుసుకోలేక పోయారు. తర్వాత అల్లాహ్‌ కోరినప్పుడు వహీ అవతరింప జేసి కపటులు అబద్ధాల కోరులని, ఆయిషా (రదియల్లాహు అన్హా) పరమ పవిత్రురాలని తెలియజేశాడు.

కనుక ప్రతి ముస్లిం అగోచరాల ఖజానాల తాళం చెవులు అల్లాహ్‌ తన వద్దనే ఉంచుకున్నాడని, వాటికి ఎవరినీ కోశాధికారిగా చేయలేదని విశ్వసించాలి. ఆయన స్వయంగా ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. అతని చేయిని అడ్డుకునే సాహసం ఎవరికుంది?

3.అగోచర జ్ఞానం ఉందని చెప్పేవాడు, అబద్ధాలకోరు

దీని ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే, అగోచరం తెలుస్తుందని, గడిచిన వాటి గురించి, భవిష్యత్తు గురించి తనకు తెలుసునని వాదించేవాడు అబద్ధాలకోరు. అలాంటి వాడు దైవత్వ ప్రకటన చేస్తున్నాడు. ఎవరయినా ప్రవక్తలను, మహాత్ములను, జిన్నులను, దైవదూతలను, ఇమాములను, సజ్జనులను లేదా పీరులను, అమరవీరులను, సిద్ధాంతిని, జ్యోతిష్కుడిని, పండితులను, భూతాలను అలా భావిస్తే ముష్రిక్కులు (బహు దైవారాధకులు) అనబడతారు. వారు పైన పేర్కొన్న ఆయతు (దివ్య ఖుర్‌ఆన్‌ 6 : 59) లను తిరస్కరిస్తున్నారు. అనుకోకుండా ఎవరయినా జ్యోతిష్యుడి మాట నిజమయితే దాని వల్ల అతను అగోచర జ్ఞాని కాలేడు. ఎందుకంటే అతను చెప్పే చాలా విషయాలు అబద్ధాలు కనుక! అగోచర జ్ఞానం తెలుసుకోవడం వారికి సాధ్యమయ్యే విషయం కాదు. వారి అంచనా ఒక్కోసారి నిజం కావచ్చు. మరికొన్ని సార్లు తప్పు కావచ్చు. జ్యోతిష్యం, కనికట్టు, ఖుర్‌ఆన్‌తో శకునాలు చూడటం కూడా అలాంటిదే. వహీ (దైవవాణి) మాత్రం ఎప్పుడూ అబద్ధం కాదు. అది మాత్రం వారి అధీనంలో లేదు. అల్లాహ్‌ తన ఇష్టప్రకారం తాను తలచుకుంది తెలుపుతాడు. వేరే వారి ఇష్టంపై వహీ ఆధారపడి లేదు. అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు:

قُل لَّا يَعْلَمُ مَن فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ٱلْغَيْبَ إِلَّا ٱللَّهُ ۚ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ

“అల్లాహ్ కు తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర విషయాల జ్ఞానం లేదు. తాము ఎప్పుడు తిరిగి లేపబడతామో కూడా వారికి తెలియదు అని ఓ ప్రవక్తా (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారికి చెప్పు”. (దివ్యఖర్‌ఆన్‌ 27: 65)

అగోచర విషయాలు తెలునుకోవడం ఎవరి తరమూ కాదు. వారు ఎంతటి వారయినా లేదా దైవదూత అయినా సరే. దీనికి స్పష్టమయిన ఆధారం ఏమిటంటే, ప్రళయం వన్తుందని ప్రపంచం మొత్తానికి తెలుసు కాని అది ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అన్ని విషయాలు తెలుసుకోవడం వారికి సుసాధ్యమే అయితే ప్రళయం ఏ రోజు వస్తుందో కూడా తెలుసుకునేవారే.

4.అగోచరాల జ్ఞానం

అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు:

إِنَّ ٱللَّهَ عِندَهُۥ عِلْمُ ٱلسَّاعَةِ وَيُنَزِّلُ ٱلْغَيْثَ وَيَعْلَمُ مَا فِى ٱلْأَرْحَامِ ۖ وَمَا تَدْرِى نَفْسٌ مَّاذَا تَكْسِبُ غَدًا ۖ وَمَا تَدْرِى نَفْسٌۢ بِأَىِّ أَرْضٍ تَمُوتُ ۚ إِنَّ ٱللَّهَ عَلِيمٌ خَبِيرٌۢ

నిస్సందేహంగా ప్రళయానికి సంబంధించిన జ్ఞానం అల్లాహ్‌ వద్ద మాత్రమే ఉంది. ఆయనే వర్షాన్ని కురిపిస్తున్నాడు. మాతృ గర్భాలలో ఏముందో ఆయనకు తెలుసు. తాను రేపు ఏం చేయనున్నదో ఏ ప్రాణీ ఎరుగడు. తాను ఏ గడ్డపై మరణిస్తాడో కూడా ఎవరికీ తెలియదు. అల్లాహ్‌యే సర్వజ్ఞాని, అన్నీ తెలిసినవాడు (అని తెలుసుకోండి). (దివ్యఖర్‌ఆన్‌ 31 : 34)

అగోచరాల జ్ఞానం అల్లాహ్ కు మాత్రమే ఉంది. ఆయన తప్ప అగోచరాల జ్ఞాని ఎవరూ లేరు. ప్రళయం సంభవించడం తథ్యం, మానవులందరికీ ఈ విషయం తెలుసు. కాని అది ఎప్పుడు రాబోతుందో ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు వేరే విషయాల గురించి ఏం చెప్పగలరు. ఉదాహరణకు: విజయం, పరాజయం, స్వస్థత, అస్వస్థత ఇలాంటి విషయాల జ్ఞానమూ ఎవరికీ లేదు.ఇవి ప్రళయమంత ముఖ్య మైనవి కాకపోయినా అవి ఎప్పుడు సంభవిస్తాయో ఎవరికీ తెలియదు. అదే విధంగా వర్షం ఎప్పుడు పడుతుందో ఎవరికీ తెలియదు. దానికోసం ప్రత్యేకంగా ఒక కాలం కూడా ఉంది. అయినా వర్షం పడుతుందో లేదో తెలియదు. వేరే కాలాల్లోనూ వర్షం పడుతుంటుంది. చాలా మంది దీనిని కోరుతుంటారు కూడా. ఒకవేళ దాని సమయం ఎలాగైనా తెలుస్తుందనుకుంటే దాని గురించి ఎవరికైనా తప్పనిసరిగా తెలుస్తుంది. ఉదాహరణకు : ఒక వ్యక్తి జననం, మరణం లేదా సంతానం కలగడం కలగకపోవడం లేదా ధనవంతుడవ్వడం పేదవాడవ్వడం లేదా విజయం సాధించడం, పరాజయం పాలవ్వడం ఈ విషయాలు ఎవరికైనా ఎలా తెలుస్తాయి? మాతృ గర్భంలో ఉన్నది కూడా ఎవరికీ తెలియదు.” [ ఆధునిక వైద్యశాస్త్రం పుట్టబోయే నంతానం ఏదో ప్రసవ సమీప కాలంలో మాత్రమే చెప్పగలుగుతుంది.]

గర్భంలో ఉన్నది ఒకరా లేదా ఇద్దరా? అందులో ఉన్నది ఆడా, మగా? సంపూర్ణంగా ఉన్నారా లేదా లోపంతో ఉన్నారా? అందంగా ఉన్నారా అంద విహీనంగా ఉన్నారా? నిపుణులు ఈ విషయాలన్ని అసంపూర్తిగానే తెలుపుతారు. కాని ఎవరికీ పూర్తిగా పరిస్థితులు తెలియవు. అలాంటప్పుడు మానవ అంతర్గత విషయాల గురించి ఎలా తెలుసుకోగలరు? ఉదాహరణకు: వారి భావాలు, సంకల్పాలు, కోరికలు, వారి విశ్వాస కాపట్య స్థితి. తాను రేపు ఏం చేస్తాడో తనకే తెలియనప్పుడు ఇతరుల గురించి ఎలా తెలుసుకోగలడు? మనిషికి అతను ఎవ్పుడు మరణిస్తాడో తెలియనప్పుడు మరణించబోయే రోజు సమయం ఎలా తెలుస్తుంది? ఏది ఏమైనప్పటికీ అల్లాహ్‌ తప్ప మరెవరూ భవిష్యత్తు విషయాలను తమ అధికారంతో తెలుసుకోలేరు. కనుక అగోచర విషయాల జ్ఞానులమని వాదించేవారు అబద్ధాలకోరులు. కనికట్టు, జ్యోతిష్యం, శకునాలు చూడటం, రాశిఫలాలు అన్నీ అబద్దాలే. ఇవన్నీ షైతాన్‌ పన్నాగాలు. ముస్లిములు ఎన్నటికీ వీటిలో చిక్కుకోకూడదు.

ఎవరైనా “నాకు అగోచర విషయాల జ్ఞానం లేదు, వాటిని తెలుసుకోవడమూ నా వల్ల కాదు, అల్లాహ్‌ నాకు తెలుపుతున్న విషయాలు తప్ప వేరే విషయాలు చెప్పడం నా అధికారంలో లేదు” అని ఎవరయినా అంటే ఇందులో రెండు విషయాలకు అవకాశం ఉంది. అతను నిజం చెప్పవచ్చు లేదా అబద్ధమూ చెప్పవచ్చు. ఉదాహరణకు: sixth sense షర్హే సద్ర్‌ (మనో వికాసం), దైవికంగా తోచినమాట.

5.అల్లాహ్‌ను తప్ప వేరే వారిని మొరపెట్టుకోకండి

అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు:

وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُوا۟ مِن دُونِ ٱللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُۥٓ إِلَىٰ يَوْمِ ٱلْقِيَـٰمَةِ وَهُمْ عَن دُعَآئِهِمْ غَـٰفِلُونَ

“అల్లాహ్ ను వదలి ప్రళయదినం వరకూ తన మొరను ఆమోదించలేని వారిని, పైగా తను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని మొరపెట్టుకునే వానికన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు?” (దివ్యఖుర్‌ఆన్‌ 46:5).

ముష్రిక్కులు పరమ మూర్ఖులు. అల్లాహ్‌ లాంటి శక్తిమంతుణ్ణి, వివేకవంతుణ్ణి విడిచిపెట్టి ఇతరులను మొరపెట్టుకుంటున్నారు. వారు వీరి మొరలను ఆలకించలేరు. వారికి ఎటువంటి శక్తిసామర్థ్యాలూ లేవు. వీరు ఇలాగే ప్రళయం వరకు మొరపెట్టుకున్నా వారు ఏమీ చేయలేరు. ఎవరయితే మహాత్ములను మొరపెట్టుకుంటూ, మా అవసరాలను తీర్చమని మీరు అల్లాహ్‌తో దుఆ చేయండి?’ అనడం కూడా షిర్క్‌గానే పరిగణించబడుతుంది. మేము అవసరాలను తీర్చమని అల్లాహ్‌నే కదా వేడుకున్నాం? ఈ మహాత్ములు కేవలం వారధులు మాత్రమే. అది షిర్క్‌ ఎలా అవుతుంది? అని వారు భావించవచ్చు.అసలు విషయం ఏమిటంటే; వారు దూరంగా ఉన్న వ్యక్తిని (పుణ్యాత్ముణ్ణి) మొరపెట్టు కున్నారు. కనుక ఇది షిర్క్‌ అవుతుంది. ఎందుకంటే పుణ్యాత్ములు దూరం నుండి దగ్గర నుండి కూడా వింటారని వారిని విశ్వసించారు. కాని అది అల్లాహ్‌ ఔన్నత్యం. అల్లాహ్‌ దివ్యఖుర్‌ఆన్‌ 46 : 5 లో “వీరి మొరలను ఆలకించలేరు. వీరు ఎంత మొర పెట్టుకున్నా, చివరకు ప్రళయం వరకు మొరపెట్టుకున్నా వారు వినలేరు’ అని స్పష్టంగా వివరించాడు.

6.లాభనష్టాలు కేవలం అల్లాహ్‌ మాత్రమే కలిగించగలడు

అల్లాహ్‌ దివ్యఖుర్‌ఆన్‌లో ఇలా సెలవిస్తున్నాడు:

قُل لَّآ أَمْلِكُ لِنَفْسِى نَفْعًا وَلَا ضَرًّا إِلَّا مَا شَآءَ ٱللَّهُ ۚ وَلَوْ كُنتُ أَعْلَمُ ٱلْغَيْبَ لَٱسْتَكْثَرْتُ مِنَ ٱلْخَيْرِ وَمَا مَسَّنِىَ ٱلسُّوٓءُ ۚ إِنْ أَنَا۠ إِلَّا نَذِيرٌ وَبَشِيرٌ لِّقَوْمٍ يُؤْمِنُونَ

(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: “అల్లాహ్‌ తలచినంత మాత్రమే తప్ప నేను సయితం నా కోసం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చుకునే అధికారం నాకు లేధు. నాకే గనక అగోచర విషయాలు తెలిసి ఉంటే నేనెన్నో ప్రయోజనాలు పొంది ఉండేవాణ్ణి, ఏ నష్టమూ నాకు వాటిల్లేది కాదు. నిజానికి నేను విశ్వసించే వారికి హెచ్చరించేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి మాత్రమే.” (దివ్యఖుర్‌ఆన్‌ 7: 186)

ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవక్తలకు నాయకులు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా గొప్ప గొప్ప మహిమలు ప్రస్ఫుటమయ్యాయి. ప్రజలు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా ధార్మిక విషయాలు నేర్చుకున్నారు. ప్రజలు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మార్గంలో నడవడం వల్ల ఔన్నత్యం పొందారు. అల్లాహ్‌ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్గం)కు ప్రజల ముందు తన స్థితి ఎలాంటిదో వివరించమని ఆదేశించాడు; “నాకు ఎలాంటి శక్తిలేదు. నేను అగోచర విషయాల జ్ఞానిని కూడా కాను. నేను నా స్వయానికి లాభంగానీ, నష్టంగానీ చేకూర్చు కోలేను. దీంతోనే నా శక్తి ఏపాటిదో మీరు అంచనావేయవచ్చు. అలాంటప్పుడు నేను ఇతరులకు లాభనష్టాలు ఎలా చేకూర్చగలను? ఒకవేళ నేను అగోచరాల జ్ఞానిని అయి ఉంటే పని చేయక ముందే దాని పర్యవసానాన్ని తెలుసుకునేవాడిని. నేను చేయబోయే పని వల్ల నష్టం జరుగుతుందని తెలిస్తే ఆ పనిని ప్రారంభించేవాడినికాను. అగోచర విషయాల జ్ఞానం కలిగి ఉండటం అల్లాహ్‌ గొప్పతనం. నేను కేవలం ప్రవక్తను మాత్రమే. చెడుల పర్యవసానాన్ని హెచ్చరిస్తూ మంచి పనుల శుభవార్తలను అందదేయడమే ప్రవక్తల పని. విశ్వాసం ఉన్న హృదయాలకే ఈ విషయం లబ్ది చేకూర్చగలుగుతుంది. నమ్మకం కలిగించడం అల్లాహ్‌ పని

7.ప్రవక్తల అసలు మిషన్‌

ప్రవక్తల, పుణ్యాత్ముల గొప్పతనం ఏమిటంటే; వారు అల్లాహ్‌ మార్గాన్ని తెలుపు తారు. తమకు తెలిసిన మంచి, చెడుల గురించి ప్రజలకు తెలియజేస్తారు. వారి సందేశ ప్రచారంలో అల్లాహ్‌ ఆకర్షణను ఉంచాడు. వారి సందేశం వల్ల అనేక మంది రుజుమార్గంలో వచ్చి చేరారు. ఒకవేళ అల్లాహ్‌ వారికి విశ్వంలో అధికారం చేసే శక్తి ఇచ్చినా ఆశ్చర్య పోనక్కరలేదు. అవి మహత్యాలు మాత్రమే. అల్లాహ్‌ ఎవరినైనా హతమార్చడం లేదా సంతానం కలిగించడం, ఆపదల నుండి రక్షించటం, మొరలను ఆలకించడం, జయాపజయాలు కలిగించడం. ధనవంతునిగా చేయడం, నిరుపేదగా మార్చడం లేదా రాజుగా చేయడం, ఎవరినైనా బిచ్చగాణ్జీ చేయడం లేదా అధికారినో, మంత్రినో చేయడం. ఎవరి హృదయంలో నైనా విశ్వాసం కలిగించడం, ఎవరి హృదయం నుండైనా విశ్వాసాన్ని లాక్కోవడం. ఎవరికైనా ఆరోగ్యాన్ని ప్రసాదించడం, మరెవరైనా అస్వస్థతకు గురిచేయడం – ఇదంతా అల్లాహ్‌ గొప్పతనమే. అల్లాహ్‌ తప్ప ఈ పనులు ఎవరూ చేయలేరు. ఇంతకు మించి అందరూ నిస్సహాయులే. నిస్సహాయతలో అందరూ సమానులే. ప్రవక్తలు గాని పుణ్యాత్ములుగాని ఏ విషయాలలోనైనా ఏమైనా చేసినా అవి కేవలం అల్లాహ్‌ సహాయంతో మాత్రమే చేయగలరు.

8.ప్రవక్తలు అగోచర జ్ఞానులు కారు

అదే విధంగా అల్లాహ్‌ తలచుకుంటే అగోచరాల జ్ఞానం వారికి ఇవ్వవచ్చు. తద్వారా ఎవరి హృదయంలో ఏముందో తెలునుకోవచ్చు. ఏ అగోచర విషయా న్నైనా తెలునుకోవచ్చు. అయితే ఫలానా వారికి సంతానం కలుగుతుందా? లేదా? వ్యాపారంలో లాభం కలుగుతుందా లేదా? పోరాటంలో విజయం పాందుతారా? పరాజయం పాలవుతారా? ఇలాంటి విషయాలు ఎవరికీ తెలియవు. అప్పుడప్పుడు ఏదైనా విషయం అంచనా వేసుకుని లేదా రుజువులను బట్టి చెబితే అది చెప్పినట్టుగానే జరగనూ వచ్చు. అదే విధంగా అప్పుడప్పుడు పెద్దలు చెప్పేమాటలు కూడా నిజమవుతాయి. ఒక్కోసారి అబద్ధాలూ కావచ్చు. కాని వహీ లేదా దైవిక జ్ఞానోదయం అబద్ధంకాదు. ఇంకా వహీ ప్రవక్తల అధీనంలో ఉండదు.

9.’అగోచర జ్ఞానం’ గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనం

రబీఅ బిన్తె ముఅవ్విజ్‌ బిన్‌ అఫ్రా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం: (పెళ్ళికూతురిగా) నాకు వీడ్కోలు పలికే సమయంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నా వద్దకు వచ్చారు. నా మంచంపై నాకు చాలా దగ్గరగా మీరు కూర్చున్నంత దగ్గరగా కూర్చున్నారు. మా (కుటుంబీకుల) పిల్లలు కొందరు దఫ్‌ (డప్పు) వాయిస్తూ బద్ర్‌ మృతుల సంఘటనను ఆలపించ సాగారు. అందులో ఒకరు “మా ప్రవక్తకు రేపు జరిగే విషయాలు కూడా తెలుసు” అన్నారు. అందుకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి న నల్లం) వారిని వారిస్తూ ‘ఆ విషయాన్ని విడిచి మిగతాది ఆలపించండి’ అని హిత బోధచేశారు. ( హదీసు గ్రంథం బుఖారీ: 5147)

రబీఅ అన్సారియ్య వివాహ సందర్భంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆమెకు దగ్గరగా కూర్చున్నారు. బాలికలు గీతం ఆలపిస్తూ “మా ప్రవక్తకు రేపటి విషయాలు కూడా తెలుసు” అని పాడారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారిని అ మాట అనకండని వారించారు.

మనిషి ఎంత పెద్ద వాడయినా అతని విషయంలో అతను అగోచరజ్ఞాని అని విశ్వసించకూడదు. కవులు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ నల్లం)ను పొగుడుతూ భూమ్యాకాశాల ఎత్తుకు ఎత్తడం, అతిశయం కోసం అన్నామని అనడం సమంజసం కాదు. ఇలా చేయడం తప్పు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తనను పొగుడుతూ ఇలాంటి కవితలు పాడుతున్న బాలికలనే వారించారు. అలాంటప్పుడు అన్నీ తెలిసిన కవులకు, పెద్దలకు ఇలాంటి కవితలు పాడమని ఎలా అనుమతించగలరు.

10.మాతృమూర్తి అయేషా (రదియల్లాహు అన్హా) ఉద్బోధ

అయేషా (రదియల్లాహు అన్హా) ఇలా అన్నారు: “ఆ ఘడియకు సంబంధించిన జ్ఞానం” అల్లాహ్‌ వద్ద మాత్రమే ఉన్నది. (దివ్యఖుర్‌ఆన్‌ 31: 34) అనే ఆయత్‌లో తెలిపిన ఐదు విషయాల సమాచారం ప్రవక్త (నల్లల్లాహు అలైహి వ సల్లం)కు తెలుసని ఎవరైతే చెప్పాడో అతను ప్రవక్తపై ఘోరమైన అపనిందమోపాడు. (హదీసు గ్రంథం : బుఖారి : 3287)

అంటే ఆ అయిదు విషయాలు దివ్యఖుర్‌ఆన్‌ (31: 34)లో ఉన్నాయి. దాని గురించి వివరించడం జరిగింది. అగోచర విషయాలు ఆ అయిదు విషయాల్లోనే ఉన్నాయి. కనుక ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అగోచర విషయాల జ్ఞానం ఉందని తెలిపేవాడు ఆయనపై తీవ్రమైన నిందమోపాడు.

11.అల్లాహ్‌ తప్ప అగోచర విషయాలు తెలిసినవారు ఎవరూ లేరు

ఉమ్మె అలా అన్సారీ (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: “అల్లాహ్‌ సాక్షి! నేను దైవ ప్రవక్త అయినప్పటికీ నా విషయంలో ఏం జరుగుతుందో, మీ విషయంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు”. ( హదీసు గ్రంథం: బుఖారీ : 7018)

అంటే అల్లాహ్‌ తన దాసుల విషయంలో ఈ ప్రపంచంలో గానీ, పరలోకం లోగానీ, సమాధిలోగానీ ఎలా వ్యవహరిస్తాడన్నది ఎవరికీ తెలియదు. ప్రవక్తలకు, పుణ్యాత్ములకు కూడా తెలియదు. తమ పరిస్థితి ఏమవుతుందో తెలియదు. ఇతరుల పరిస్థితి కూడా వారికి తెలియదు. ఒకవేళ ఎవరికైనా ఎప్పుడైనా ఫలానా వ్యక్తి విషయంలో మేలు జరుగుతుందని దైవికంగా తోచిన మాట ద్వారా తెలిస్తే అది ఒక సంక్షిప్త సమాచారం. అంతకు మించి అతను ఎక్కువగా తెలునుకోలేడు.

సారాంశం:

1-2. గోచరాలను తెలుసుకోవడానికి అల్లాహ్‌ మానవుడికి కొన్ని వనరులు ఇచ్చి వాటిని వినియోగించే శక్తిని ప్రసాదించాడు. కాని అగోచరాల తాళం చెవులు మాత్రం అల్లాహ్‌ వద్ద వున్నాయి. అతను తన ఇచ్చ ప్రకారం అందులో నుండి ఎప్పుడైనా ఎవరికైనా కొంచెం తెలుపుతాడు. అత్యవసర సమయాల్లో ప్రవక్తలకు కూడా తెలుపుతాడు.

3. అగోచరజ్ఞానవాది మరియు అతన్ని ధ్రువీకరించేవాడు ఇద్దరూ బహుదైవాదరాధకులే. ఎందుకంటే అగోచరాలు కేవలం అల్లాహ్‌ చేతిలోనే వున్నాయి. ఎప్పుడైనా ఏదైనా విషయం నిర్దారితమైతే అది కేవలం యాదృచ్చికమే.

4-5 అగోచరాల చిన్నా-పెద్ద విషయాలు అల్లాహ్‌ పరిధిలోనే వున్నాయి. మానవుడు ఎప్పుడైన్నా ఎటువంటి వరుసలతోనైనా వాటి వరకు చేరలేడు. జ్యోతిష్యం, తాంత్రిక విద్య, శకునాలు మొదలగునవి షైతాన్‌ కుట్రలు.

6. అంతర్గత -బహిర్గత, దూర-సమీప ప్రార్థనలను ఆయనే వింటాడు. సహాయం చేస్తాడు. వేరేతరులను ఈ విధంగా అర్థించడం బహుదైవారాధన. వారు ప్రళయం వరకు కూడా వినలేరు.

7. అగోచరాల జ్ఞాన గుణం అల్లాహ్‌ సొంత గుణం. ప్రవక్తలు మరియు అంతిమ ప్రవక్త అగోచరాల జ్ఞానులు కారు. లేకపోతే వారు తమను, తమ అనుచరులను కష్టాల నుంచి రక్షించేవారు: దైవప్రవ క్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కేవలం శుభ వార్తాహరులు మరియు హెచ్చరించేవారు మాత్రమే.

8. ప్రవక్తల అసలు పని శుభవార్తలందించడం, హెచ్చరించడం మాత్రమే. వారు కూడా దాసులు మాదిరిగా అల్లాహ్‌ ముందు నిస్సహాయులు, అశక్తులు, విశ్వంలో అధికారం చేయడం కేవలం అల్లాహ్‌ సొంత గుణం,

9. ప్రవక్తలు అగోచర జ్ఞానులు కారు. వారు బుద్ధి మరియు అంచనాల ఆధారంగా ఏ విషయాన్నీ చెప్పరు. అల్లాహ్‌ వారికి వహీ (దైవవాణి) ద్వారా పంపిన సరైన విషయాలనే తెలుపుతారు.

10. కవితల్లో అతిశయానికి పాల్పడుతూ దైవప్రవక్తను అగోచరాల జ్ఞాని అనడాన్ని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తీవ్రంగా వారించారు.

11. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను అగోచరాల జ్ఞాని అని భావించినవాడు ప్రవక్త(స)పై అపనింద మోపాడు. అల్లాహ్ తప్ప మరెవ్వరూ అగోచరాలను గురించి తెలిసినవారు లేరు.

12. ప్రవక్తలకు, పుణ్యాత్ములకు తమకు, తమ అనుచరులకు సంబంధించిన ఇహపరాల, అగోచరాల విషయాలు తెలియవు.

ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

  1. జ్ఞానంలోని షిర్క్ (షిర్క్ ఫిల్ ఇల్మ్) వాస్తవికతను వివరించండి?
  2. “అగోచర జ్ఞానం కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది” ఈ వాక్య భావాన్ని వివరించండి?
  3. అగోచరజ్ఞానం గురించి కొన్ని ఆయతులు, హదీసులను వివరించండి?
  4. లాభనష్టాలను కలిగించే అధికారి ఎవరు? ఆధారాలతో వివరించండి?
  5. ప్రవక్తలకు అగోచరజ్ఞానం ఉందా? వివరించండి?

తప్పొప్పులను గుర్తించండి

  1. వలీలకు దగ్గర నుండి దూరం నుండి మొరపెట్టుకోవడం, ఈ వలీలు తమ మొరలను వింటారని భావించడం, షిర్క్ అవుతుంది.
  2. ప్రవక్తలు స్వయంగా అగోచర జ్ఞానాన్ని కలిగి ఉంటారు
  3. అల్లాహ్ తోపాటు ఇతర దైవాలకు కూడా లాభనష్టాలను కలిగించే శక్తి గలదు

ఖాళీలను పూరించండి

  1. అల్లాహ్ తప్ప మరెవరూ ………. కాదు.
  2. లాభనష్టాలకు యజమాని ………. కారు.
  3. ప్రవక్తలకు అగోచర జ్ఞానం ………………………..

1. అల్లాహ్ ను మాత్రమే శరణు వేడుకోవటం

قُلْ مَن بِيَدِهِ مَلَكُوتُ كُلِّ شَيْءٍ وَهُوَ يُجِيرُ وَلَا يُجَارُ عَلَيْهِ إِن كُنتُمْ تَعْلَمُونَ سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ فَأَنَّىٰ تُسْحَرُونَ

సమస్త విషయాల సార్వభౌమత్వం ఎవరి చేతుల్లో ఉందో, శరణు ఇచ్చే వాడెవడో, ఎవరికి వ్యతిరేకంగా ఏ శరణూ లభించదో ఆయనెవరో మీకు తెలిసి ఉంటే చెప్పండి? అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు. ‘అల్లాహ్ మాత్రమే’ అని వారు చెబుతారు. ‘మరయితే మీరు ఎలా మోసపోతున్నారు?’ అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. (దివ్యఖుర్ఆన్ 23 : 88-89)

అంటే స్వయంగా ముష్రిక్కులతో సమస్త విషయాల సార్వభౌమత్వం ఎవరి చేతుల్లో ఉందో, ఆయన ఏమైనా చేయగలడో, ఆయన్ను ఆపేవారు ఎవరూ లేరో, ఆయన మాటను ఎవరూ జవదాటలేరో – ఆయనెవరో మీకు తెలిస్తే చెప్పండి? అని అడిగితే ‘అల్లాహ్ మాత్రమే’ అని వారు సమాధానం ఇస్తారు. అలాంటప్పుడు వేరే వారిని మొరపెట్టుకోవడం మోసపోవడమే కదా!

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాలంలోనూ ప్రజలు అల్లాహ్ కు సరిసమానులు ఎవరూ లేరని భావించేవారు. కాని వారు విగ్రహాలను తమ సంరక్షకులుగా భావించి పూజించేవారు. అందుకనే వారు ముష్రిక్కులయ్యారు. నేడు కూడా ఎవరయినా ఈ విశ్వంలో సృష్టిరాశులకు సార్వభౌమాధికారం ఉందని భావించి, వారిని సంరక్షకులుగా చేసుకుని వారిని పూజిస్తే అది షిర్క్ అవుతుంది. వారు అల్లాహ్ కు సమానులు కారని, వారికి అంత శక్తిలేదని భావించినా సరే.

2. లాభనష్టాలు అల్లాహ్ మాత్రమే కలిగించగలడు

قُلْ إِنِّي لَا أَمْلِكُ لَكُمْ ضَرًّا وَلَا رَشَدًا قُلْ إِنِّي لَن يُجِيرَنِي مِنَ اللَّهِ أَحَدٌ وَلَنْ أَجِدَ مِن دُونِهِ مُلْتَحَدًا

‘మీకు కీడు (నష్టం) గానీ, మేలు (లాభం) గానీ చేకూర్చే అధికారం నాకు లేదు’ అని (ఓ ప్రవక్తా!) చెప్పు. ‘అల్లాహ్ పట్టు నుండి నన్నెవరూ రక్షించలేరు. నేను ఆయన ఆశ్రయం తప్ప వేరొకరి ఆశ్రయాన్ని పొందలేను’ అని (ఓ ప్రవక్తా వారికి) చెప్పు. (దివ్యఖుర్ఆన్ 72 : 21-22)

అంటే మీకు లాభంగానీ, నష్టంగానీ చేకూర్చే అధికారం నాకు లేదు. మీరు నా సంతతి వారు అయినందు వల్ల గర్వంతో హద్దులు మీరి మేము శక్తిమంతులమని మా సంరక్షకుడు బలవంతుడని, సహాయం చేసేవాడని, ప్రేమగలవాడని, కనుక మేము ఏమి చేసినా చెల్లుతుందని, ఆయన మిమ్మల్ని అల్లాహ్ శిక్ష నుండి కాపాడతాడని భావించకండి. ఎందుకంటే నేను స్వయంగా. భయపడుతున్నాను. అల్లాహ్ తప్ప ఆశ్రయం కల్పించేవాడు ఎవడూలేడు. అలాంటప్పుడు నేను ఇతరులను ఎలా రక్షించగలను? తమ శక్తిని నమ్ముకుని అల్లాహ్ ను విస్మరించేవారు, అల్లాహ్ ఆదేశాలను అతిక్రమించేవారు స్పష్టమైన మార్గభ్రష్టులు. ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనుక్షణం అల్లాహ్ కు భయపడుతుండే వారు. అల్లాహ్ తప్ప మరెవరూ అనుగ్రహించరని విశ్వసించేవారు.

3. అల్లాహ్ తప్ప ఎవరూ ఉపాధి ప్రదాత కారు

وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَمْلِكُ لَهُمْ رِزْقًا مِّنَ السَّمَاوَاتِ وَالْأَرْضِ شَيْئًا وَلَا يَسْتَطِيعُونَ

వారు అల్లాహ్ ను వదలి, తమకు ఆకాశాల నుంచి గానీ, భూమి నుంచిగానీ ఎలాంటి ఉపాధినీ సమకూర్చలేని వారిని, ఏ శక్తి సామర్థ్యమూ లేని వారిని పూజిస్తున్నారా? (దివ్యఖుర్ఆన్ 16: 73)

అంటే వారు నిస్సహాయులను అల్లాహ్ కు మాదిరిగా పూజిస్తున్నారు. ఉపాధి సమకూర్చడంలో వారికి ఎలాంటి సామర్థ్యమూ లేదు. వారు ఆకాశం నుండి వర్షం కురిపించలేరు. భూమి నుండి పంటను పండించలేరు. వారికి ఏ విధమయిన శక్తీ లేదు. ప్రజలు తమ అజ్ఞానంతో కొత్త కొత్త విషయాలు కల్పించుకుంటుంటారు. పుణ్యాత్ములకు విశ్వంలో అధికారం చెలాయించే శక్తి ఉందని, కాని వారు విధి వ్రాతపై అల్లాహ్ కు కృతజ్ఞులై ఉన్నారని, వారు భక్తి కొద్దీ అణకువతో ఉన్నారని, లేదంటే వారు విశ్వంలో అల్లకల్లోలం సృష్టించగలరని ఇత్యాది విషయాలు ప్రజల్లో వ్యాపించి ఉన్నాయి. వాటిని ఎక్కడ నుంచి గ్రహించారో కూడా తెలియదు. ఇది అబద్ధం. విశ్వంలో ప్రత్యక్షం గానూ, పరోక్షంగానూ ఏ విధమైన అధికారం చేసే శక్తి వారికి లేదు.

4. అల్లాహ్ నే మొరపెట్టుకోండి

وَلَا تَدْعُ مِن دُونِ اللَّهِ مَا لَا يَنفَعُكَ وَلَا يَضُرُّكَ ۖ فَإِن فَعَلْتَ فَإِنَّكَ إِذًا مِّنَ الظَّالِمِينَ

‘అల్లాహ్ ను వదలిపెట్టి నీకు ఎలాంటి లాభాన్నిగానీ, కీడును గానీ కలిగించలేని దానిని నువ్వు ఆరాధించకు. ఒకవేళ అలాంటి పని చేశావంటే నువ్వు కూడా దుర్మార్గుల్లో ఒకడివవుతావు’ (అని హెచ్చరించబడింది.) (దివ్య ఖుర్ఆన్ 10 : 106)

గౌరవోన్నతుడు, శక్తిమంతుడు అయిన అల్లాహ్ ను విడిచిపెట్టి లాభంగానీ నష్టం గానీ చేకూర్చలేని నిస్సహాయులను మొరపెట్టుకోవడం అన్యాయం, దుర్మార్గం. ఎందుకంటే వారు అత్యున్నత స్థాయిని అల్పులకు అంటగడుతున్నారు.

దివ్యఖుర్ఆన్లో ఇలా సెలవియ్యబడింది:

قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِن شِرْكٍ وَمَا لَهُ مِنْهُم مِّن ظَهِيرٍ وَلَا تَنفَعُ الشَّفَاعَةُ عِندَهُ إِلَّا لِمَنْ أَذِنَ لَهُ ۚ حَتَّىٰ إِذَا فُزِّعَ عَن قُلُوبِهِمْ قَالُوا مَاذَا قَالَ رَبُّكُمْ ۖ قَالُوا الْحَقَّ ۖ وَهُوَ الْعَلِيُّ الْكَبِيرُ

(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: అల్లాహ్ ను వదలి మీరు ఎవరినయితే ఊహించు కుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవ్వంత అధికారంగానీ, వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్ కు సహాయకుడు కూడా కాడు. ఆయన వద్ద – ఆయన అనుమతించిన వారి కొరకు తప్ప – (ఒకరి) సిఫారసు (ఇంకొకరికి)ఏ మాత్రం ఉపకరించదు. తుదకు వారి హృదయాలలోని ఆందోళన[*] తొలగించబడిన తరువాత, (ఇంతకీ మీ ప్రభువు సెలవిచ్చినదేమిటి?) అని అడుగుతారు. సత్యమే పలికాడు. ఆయన మహోన్నతుడు, ఘనాఘనుడు’ అని వారు చెబుతారు. (దివ్యఖుర్ఆన్ 34 : 22-23)

[*] భావం ఏమిటంటే, సిఫారసు చేసేవారు చేయబడేవారు ఇరువురూ సిఫారసు కోసం నిరీక్షిస్తూ మధన పడుతుంటారు. అనుమతి ఇవ్వబడిన తర్వాత ఇరువురూ “మీ ప్రభువు ఏమని ఆదేశించాడు?” అని ప్రశ్నించుకుంటారు. అనుమతి లభించిన తర్వాత ప్రతి ఒకరి మానసిక స్థితి ఈ విధంగానే ఉంటుంది “అనుమతి లభించిందా? అని.”

5. అనుమతిలేని సిఫారసు లేదు

అంటే కష్ట సమయాల్లో ఎవరినైనా మొక్కుకోవడం. మొక్కుకున్న వారి వద్ద అనేక రకాలుగా మొక్కుబడులు తీర్చుకోవచ్చు. మొక్కుకోబడినవాడు యజమానియై ఉండాలి. లేదా అతనికి భాగస్వామి అయి ఉండాలి. లేదా యజమానిపై అతని ఒత్తిడి అయినా ఉండాలి. ఉదాహరణకు రాజు తన అధికారుల మాటలు వింటాడు. ఎందు కంటే వారు సామ్రాజ్యంలో సభ్యులు. వారు అసంతృప్తి చెందితే పరిపాలనా వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. లేదా వారు యజమానితో సిఫారసు చేస్తారు. ఇష్టం ఉన్నా లేకున్నా యజమాని ఆ సిఫారసు అంగీకరించక తప్పదు. ఉదాహరణకు రాజుకు మహారాణి పై వల్లమాలిన ప్రేమ ఉంటుంది. ప్రేమ వల్ల రాజు ఆమె చేసిన సిఫారసును తిరస్కరిం చడు.

ఒకసారి ఆలోచించండి. ముష్రిక్కులు అల్లాహ్ ను వదలి ఏ పుణ్యాత్ములనైతే మొరపెట్టుకుంటున్నారో, ఎవరినైతే మొక్కుకుంటున్నారో వారు ఈ విశ్వంలో దోమ రెక్కకు కూడా యజమానులు కారు. అల్లాహ్ సామ్రాజ్యంలో భాగస్వాములూ కారు. అల్లాహ్ వారి మాట వినడానికి రాజు గారి సామ్రాజ్యంలోని సభ్యుల్లాగా వారు అల్లాహ్ కు సహాయమూ చేయడం లేదు. అల్లాహ్ అనుమతి లేనిదే వారు సిఫారసు కోసం పెదవి కూడా కదపలేరు. అల్లాహ్ దర్బారు (సన్నిధి)లో వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆయన ఆదేశానికి దిగ్భ్రాంతి చెందుతారు. కలవరపడతారు. భయభ్రాంతులకు గురవుతారు. భయంతో రెండోసారి అడిగే ధైర్యం కూడా ఉండదు. పరస్పరం వారు “అల్లాహ్ మనతో ఏమన్నాడు?” అని ప్రశ్నించుకుంటారు. తెలిసిన తర్వాత ‘విశ్వసించాము, ‘విధేయత చూపాము’ అని మాత్రమే అంటారు. వారికి వాదించే ధైర్యం కూడా ఉండదు.

6. సిఫారసు రకాలు

ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. ప్రవక్తలు, పుణ్యాత్ములు తమ గురించి అల్లాహ్ వద్ద సిఫారసు చేస్తారన్న భావంతో ప్రజలు ఉన్నారు. ఆ సంతోషంలో సిఫారసును తప్పుగా అర్థం చేసుకుని అల్లాహ్ ను విస్మరిస్తున్నారు. ప్రపంచంలో సిఫారసు ఎన్నో రకాలున్నాయి. ఉదాహరణకు పాలకుని వద్ద ఎవరయినా దొంగతనం చేసినట్టు రుజువయితే చట్టపరంగా అతన్ని శిక్షించే అధికారం పాలకునికి ఉంటుంది. కాని ఈ మధ్యలో ఎవరయినా అధికారి అతని విషయంలో సిఫారసు చేస్తే అధికారి ఒత్తిడి వల్ల అతన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అధికారి కూడా రాజ్యంలో ఒక సభ్యుడు. అతని సహకారం వల్ల కూడా రాజ్యంలో అభివృద్ధి జరుగుతుంది. కనుక అతన్ని నిరాశపరచకూడదని పాలకుడు భావిస్తాడు. లేదంటే అతని వల్ల సామ్రాజ్యంలో సంక్షోభం తలెత్తవచ్చు. కనుక పాలకుడు తన కోపాన్నే దిగమ్రింగి దొంగను విడిచిపెడతాడు. ఇలాంటి సిఫారసును “గౌరవభావ సిఫారసు” అంటారు. అంటే అధికారి మీద గౌరవభావంతో అతని మాట వినడం జరిగిందని అర్థం.

7. “గౌరవభావ సిఫారసు” అసాధ్యం

అల్లాహ్ సమ్ముఖంలో గౌరవభావ సిఫారసు ఎట్టి పరిస్థితిలోనూ సాధ్యం కాదు. దైవేతరులను ఇలాంటి సిఫారసు చేస్తారని భావించేవారు ముష్రిక్కులు అజ్ఞానులు. వారు అల్లాహ్ ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. చక్రవర్తి గొప్పతనం, ఔన్నత్యం గుర్తించలేదు. అల్లాహ్ తలచుకుంటే ‘కున్’ (అయిపో) అనే ఒకే ఒక్క పలుకుతో కోటానుకోట్ల ప్రవక్తలను, వలీలను, జిన్నులను, దైవదూతలను, జిబ్రయీల్ (అలైహిస్సలాం)ని, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఒక్కసారే సృష్టించగలడు. విశ్వాన్నంతటిని సర్వనాశనం చేసి మరో అద్భుత ప్రపంచాన్ని సృష్టించగలడు. ఆయన సంకల్పం చేసుకుంటే ప్రతి వస్తువు తయారవుతుంది. వాటిని తయారు చేయడానికి ఆయనకు వస్తువుల, పదార్థాల అవసరమే ఉండదు.

ఒకవేళ ఆదమ్ (అలైహిస్సలాం) నుండి ప్రళయం వరకు రాబోయే సమస్త మానవులు మరియు జిన్నులు కలసి, పుణ్యాత్ములు అయిపోయినా అల్లాహ్ సామ్రాజ్యంలో ఎటువంటి వైభవం పెరగదు. ఒకవేళ వారందరు షైతాన్లుగా, దజ్జాల్లుగా అయి పోయినా ఆయన సామ్రాజ్యంలో ఎటువంటి వైభవం తరగదు. ఆయన అన్ని పరిస్థితుల్లోనూ అందరికంటే గొప్పవాడు. చక్రవర్తులకే చక్రవర్తి. ఎవరూ ఆయనకు కొద్దిగైనా కీడు చేయలేరు, మేలు చేయలేరు’ [*]

[*] నా దాసులారా గుర్తుంచుకోండి!! గతించిన వారు, పుట్టబోయే మానవులూ, జిన్నులు అందరూ కలిసి మీలోని అత్యంత ధర్మపరాయణుడిగా మారినా అల్లాహ్ సామ్రాజ్య వైభవం పెరగదు. నా దాసులారా! మీ మానవులు జిన్నులు గతించిన వారూ, ఇక ముందు పుట్టబోయేవారు అందరూ కలిసి మీలోని అత్యంత నీచునిగా మారినా అల్లాహ్ సామ్రాజ్య వైభవం తరగదు. (హదీసు గ్రంథం ముస్లిం, హదీసు నెం.2588)

8. “ప్రేమ కలిగిన సిఫారసు” అసాధ్యం

ఇది సిఫారసులోని రెండో రకం. రాకుమారుని లేదా రాజకుమారి లేదా చక్రవర్తికి అతి సన్నిహితుడొకడు దొంగకు శిక్షపడకుండా సిఫారసు చేస్తే, చక్రవర్తి తన మిత్రుని మీద ప్రేమతో అతన్ని అయిష్టపరచకూడదని ఆ దొంగను క్షమించేస్తాడు. ఇలాంటి సిఫారసును “ప్రేమ కలిగిన సిఫారసు” అంటారు.

చక్రవర్తి తన సన్నిహితుని ప్రేమకు లొంగి అతనికి అయిష్టత కలిగితే తనకే కీడు కలుగుతుందని భావించి తన సన్నిహితుని మాట వింటాడు. అల్లాహ్ దర్బారులో ఇలాంటి వాటికి చోటుండదు. ఎవరినైనా ప్రవక్తనుగానీ, లేదా వలీను గానీ, ఇలాంటి సిఫారసుదారులుగా భావించేవారు ఖచ్చితమైన ముష్రిక్కులు, నికార్సయిన అజ్ఞానులు. అల్లాహ్ తన దాసులను ఎన్ని అనుగ్రహాలతో ముంచెత్తినా, హబీబ్ (ప్రియుడు), ఖలీల్ (స్నేహితుడు), కలీమ్ (సంభాషించువాడు), రూహుల్లాహ్ (అల్లాహ్ ఆత్మ), వజీహ్ (అందమైనవాడు) లాంటి బిరుదులు ప్రసాదించినా మరి కొందరికి రసూలె కరీమ్, రూహల్ ఖుదుస్ (పవిత్రాత్మ), రూహుల్ అమీన్ (విశ్వసనీయుడైన దైవదూత) లాంటి గౌరవప్రద బిరుదులతో సత్కరించినా, యజమాని యజమానే, దాసుడు దాసుడే. ప్రతి ఒక్కరికీ తమకంటూ ఒక స్థానముంది. దాని నుండి ఎవరూ ముందుకు వెళ్ళలేరు. దాసుడు అల్లాహ్ అనుగ్రహానికి పొంగిపోయి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యే విధంగా అతని ఆగ్రహానికి భీతితో హడలిపోతాడు. భయంతో నిలువునా నీరుగారి పోతాడు.

9. “అనుమతితో సిఫారసు”

ఇది సిఫారసులోని మూడో రకం. దొంగచేసిన దొంగతనం రుజువయింది. కాని అతనిది దొంగతనం చేసే వృత్తి కాదు. దురదృష్టవశాత్తు అతను దొంగతనం చేశాడు. కాని తాను చేసిన కార్యానికి సిగ్గుతో నీరుగారి పోతున్నాడు. పశ్చాత్తాప భావంతో కుంచిచుకుపోతున్నాడు. అహర్నిశలు భయంతో కంపించిపోతున్నాడు. అంతే కాదు తాను చట్టాలను గౌరవిస్తాడు. తాను పాపాత్మునిగా నేరస్తుడిగా, శిక్షకు అర్హునిగా భావిస్తున్నాడు. రాజు గారికి భయపడి మంత్రి దగ్గరికి, అధికారి దగ్గరికి కూడా వెళ్లడం లేదు. తన కోసం వాదించడానికి సంరక్షకుడ్ని తెచ్చుకోడానికీ సిద్ధంగా లేడు. తాను చేసిన తప్పుకు రాజు ఏ శిక్ష విధిస్తాడోనని దిగులు చెందుతుంటాడు. అతని పరిస్థితిని చూసి రాజుకు జాలి కలుగుతుంది. అతన్ని క్షమించాలనుకుంటాడు. ప్రజల దృష్టిలో నుంచి చట్ట గౌరవం పోకుండా అంతా చట్ట పరిధిలోనే జరపాలనుకుంటాడు. మంత్రి లేదా అధికారి, రాజుగారి సూచన మేరకు ఆ వ్యక్తి సిఫారసు కోసం నించుంటాడు. రాజు ఆ అధికారిని ప్రోత్సహించి దొంగ చేసిన తప్పును క్షమిస్తాడు. ఆ అధికారి రాజు గారి అభీష్టం మేరకు దొంగ కొరకు సిఫారసు చేశాడే తప్ప దొంగ ఆ అధికారికి బంధువు కాదు, మిత్రుడు, స్నేహితుడు అంతకన్నా కాదు. అతను సంరక్షించే బాధ్యతా తీసుకోలేదు. కేవలం రాజుగారి అభీష్టం ప్రకారం అతను దొంగ గురించి సిఫారసు చేశాడు. ఎందు కంటే అతను రాజుగారి ప్రతినిధి. దొంగల సంరక్షకుడు కాదు. దొంగను సంరక్షించేవాడూ దొంగే అవుతాడు. ఇలాంటి సిఫారసునే “అనుమతితో కూడిన సిఫారసు” (ఇష్ట ప్రకారం సిఫారసు) అంటారు. అల్లాహ్ దర్బారులో ఇలాంటి సిఫారసులు స్వీకరించబడతాయి. దివ్య ఖుర్ఆన్లో పేర్కొనబడిన ప్రవక్తలు, పుణ్యాత్ములు చేసే సిఫారసు ఇదే.

10. రుజుమార్గం

ప్రతి మానవుడు విధిగా అల్లాహ్ నే మొరపెట్టుకోవాలి. ఎల్లప్పుడూ ఆయనకే భయపడాలి. పాపాలను క్షమించమని ఆయన్నే వేడుకోవాలి. ఆయన ముందే పాపాలను అంగీకరించాలి. ఆయన్ని తన యజమానిగా, సంరక్షకునిగా భావించాలి. అల్లాహ్ నే విశ్వసించాలి. ఇతరుల రక్షణను నమ్మకూడదు. ఎందుకంటే ఆయన లాంటి మరొకడు లేడు గనక. అల్లాహ్ క్షమించేవాడును, అమిత కరుణామయుడూను. ఆగిన పనులన్నీ ఆయన తన అనుగ్రహంతో పూర్తిచేస్తాడు. తన కరుణతో పాపాలన్నీ క్షమిస్తాడు. తన ఆదేశంతో ఎవరినైనా సరే మీ కోసం సిఫారసుదారునిగా చేస్తాడు. మీ ప్రతి అవసరాన్ని ఆయన ముందే విన్నవించుకోండి. అదే విధంగా ఎవరినైనా మీకు సిఫారసు దారునిగా చేయమని వేడుకోండి. నిజ ప్రభువుని విస్మరించకండి. ఇతరులను నమ్మకండి. ఆయన ఆదేశాలను గౌరవించండి. ఆయన ముందు దురాచారాలను తిరస్కరించండి. షరీఅత్ ఆదేశాలను విడిచిపెట్టి దురాచారాలను పాటించడం మహా అపరాధం. ఇలా చేయడాన్ని ప్రవక్తలు, వలీలు అసహ్యించుకుంటారు. షరీఅత్ ఆదేశాలను తిరస్కరిస్తూ అంధ ఆచార వ్యవహారాలను పాటించే వారి కోసం వారు ఎప్పుడూ సిఫారసు చేయరు. దానికి ప్రతిగా వారు వారికి శత్రువులవుతారు. వారిని అసహ్యించుకుంటారు. ఎందుకంటే వారి గొప్పతనం ఈ విషయంపైనే ఆధారపడి ఉంది. వారు అల్లాహ్ కోసం అన్నీ త్యజిస్తారు. భార్యా పిల్లలను, అనుయాయులను, గురువులను, మిత్రులను, పని వారిని అందరిని అల్లాహ్ కోసం విడిచిపెట్టేవారు. వీరు అల్లాహ్ అభీష్టానికి వ్యతిరేకంగా పని చేసే వారికి శత్రువులయ్యేవారు. దైవేతరులను మొరపెట్టుకునే వారిలో ఏం గొప్పతనం ఉందని? పెద్ద పెద్ద వారు సయితం వారి సంరక్షకులై అల్లాహ్ ఆదేశాలకు విరుద్ధంగా వారి వైపు నుండి అల్లాహ్ పోట్లాడతారు? ఇలా ఎన్నటికీ జరుగదు. వారు వారికి శత్రువులు. వారి గొప్పతనం ఏమిటంటే వారు అల్లాహ్ కోసం ప్రేమిస్తారు. అల్లాహ్ కోసం ద్వేషిస్తారు. వారు అల్లాహ్ ఇష్టానికి కట్టుబడి ఉన్నారు. అల్లాహ్ ఇష్టప్రకారమే వారు నడుచుకుంటారు.

ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా పేర్కొన్నారు. ఒక రోజు నేను ప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) వెనుక ఉన్నాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ఓ బాలుడా! అల్లాహ్ ను గుర్తుంచుకో. అల్లాహ్ నిన్ను గుర్తుంచుకుంటాడు. అతన్ని నీ ముందు పొందుతావు. నీకు ఏమయినా అవసరం వస్తే అల్లాహ్ ను మాత్రమే వేడుకో. అల్లాహ్ ను మాత్రమే సహాయం అడుగు. ఒకవేళ ప్రజలందరూ కలిసి నీకు లాభం చేకూర్చాలని నిర్ణయించుకున్నా అల్లాహ్ నీ అదృష్టంలో రాసిపెట్టివున్న వరకే నీకు లాభం చేకూర్చగలరు. ఒకవేళ అందరూ కలసి నీకు కీడు తలపెట్టాలని నిర్ణయించుకున్నా అల్లాహ్ నీ అదృష్టంలో రాసిపెట్టి ఉన్న వరకే కీడును చేకూర్చగలరు. కలములు ఎత్తుకోబడ్డాయి. గ్రంథాలు నిక్షిప్తం చేయబడ్డాయి. (హదీసు గ్రంథం తిర్మిజీ)

అంటే అల్లాహ్ నిజమైన చక్రవర్తి. ఆయన ప్రపంచంలోని చక్రవర్తుల్లాగా అహంకారి కాదు. అందుకనే ప్రజలు నేరుగా చక్రవర్తుల వద్ద తమ సమస్యలు చెప్పరు. మంత్రుల ద్వారా వారి సమస్యల్ని చెప్పుకుంటారు. వారి ద్వారా తమ అభ్యర్థనల్ని మంజూరు చేయించుకుంటారు. కాని అల్లాహ్ గొప్పవాడు. అమిత కరుణామయుడు, అపార కృపాశీలుడు. ఆయన వరకు చేరడానికి ఒకరి ద్వారా రాయబారం పంపాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఆయనకు తెలుసు. ఎవరు సిఫారసు చేసినా చేయక పోయినా ప్రతి ఒక్కరూ ఆయన దృష్టియందుంటారు. ఆయన పరమ పవిత్రుడు, గొప్పవాడూను. ప్రజలు ఆయన వద్దకు చేరకపోవడానికి, అధికారులే ప్రజలపై పెత్తనం చేయడానికి ప్రజలు అధికారుల ఆదేశాలే పాటించడానికి ఆయన దర్బారు ప్రపంచ చక్రవర్తుల దర్బారు లాంటిది కాదు. అది అల్లాహ్ దర్బారు. ఆయన తన దాసులకు అతి దగ్గర ఉన్నాడు. సామాన్య మానవుడు కూడా ఆయన వద్దకు వెళ్ళవచ్చు. ఆయన్ని నేరుగా సంప్రదించవచ్చు. మన మూఢనమ్మకాలు, నిర్లక్ష్యాలే తప్ప అల్లాహ్ వద్దకు చేర్చడంలో మరేవీ మనకు అడ్డంకి కాదు.

11. అల్లాహ్ ప్రతి ఒక్కరికీ సమీపంలో ఉన్నాడు

ఎవరయినా అల్లాహ్ కు దూరంగా ఉంటే కేవలం తన నిర్లక్ష్యం వల్లనే అల్లాహ్ కు దూరంగా ఉన్నాడు. అల్లాహ్ మాత్రం ప్రతి ఒక్కరికి సమీపంలో ఉన్నాడు.. తమను అల్లాహ్ వద్దకు చేర్చమని ప్రవక్తలను, వలీలను మొరపెట్టుకునే వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, అల్లాహ్ వారికే చాలా దగ్గరగా ఉన్నాడు. ఒక విధంగా ప్రవక్తలకు, వలీలకే చాలా దూరంగా ఉన్నాడు. ఈ విషయాన్ని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు.

రాజుగారి వద్ద ఒక బానిస ఒంటరిగా ఉన్నాడు. అతను ఏదైనా అభ్యర్థించ దలచుకుంటే వినడానికి రాజు సిద్ధంగా ఉన్నాడు. కాని అతను మంత్రిని పిలిచి ‘ఈ బానిస గురించి రాజుగారి అభిప్రాయం ఏమిటో తెలుసుకోండి?’ అని అడిగితే అతన్ని పిచ్చోడో లేదా అంధుడో అని భావిస్తాం. కనుక ప్రతి ఒక్కడు అల్లాహ్ నే అభ్యర్థించు కోవాలి. కష్టాల్లో ఆయన సహాయమే కోరాలి. అదృష్టంలో రాసింది చెరుపబడదని గట్టిగా నమ్మాలి. ఒకవేళ ప్రపంచమంతా కలిసి ఎవరికైనా లాభంకానీ నష్టం కానీ చేకూర్చాలను కుంటే వారు అదృష్టంలో ఉన్న దానికంటే ముందు వెళ్ళలేరు. అంటే అదృష్టాన్ని మార్చే ధైర్యం ఎవరికీ లేదు. అదృష్టంలో సంతానం రాసిలేనివారికి సంతానం ఎవరు కలిగించ గలరు? అదృష్టంలో ఆయుష్షు తక్కువగా ఉన్నా వారి జీవిత కాలం ఎవరు పెంచగలరు? కనుక ఈ నేపథ్యంలో అల్లాహ్ వలీలకు అదృష్టం మార్చే శక్తినిచ్చాడని పలకడం పెద్ద తప్పు.

విషయమేమిటంటే, అల్లాహ్ తన దాసులు అభ్యర్థనలను అప్పుడప్పుడు వింటాడు. ప్రవక్తల, వలీల వేడుకోళ్ళను అధికంగా వింటాడు. వేడుకునే సద్బుద్ధిని కూడా ఆయనే ప్రసాదిస్తాడు. వేడుకోళ్ళనూ ఆయనే వింటాడు. వేడుకోవడం ఆ తర్వాత మొక్కు కోవడం రెండూ విధివ్రాత[*]లో రాసి ఉన్నాయి. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయం విధివ్రాతలోనే ఉంది. చిన్నా పెద్దా, సందేశహరులు, ప్రవక్తలు ఎవరికీ ఏ పనీ చేసే శక్తి లేదు. కాని వారు అల్లాహ్ ను వేడుకోవాలి. వారికి అంత శక్తే ఉంది. దాన్ని తన దయతో స్వీకరించాలా? వద్దా? అనేది అల్లాహ్ నిర్ణయంపై ఆధారపడి ఉంది.

[*] దైవజ్ఞానానికి మరో పేరు అదృష్టం. తన అదృష్టంలో, ఇతరుల అదృష్టంలో ఏముందో ఎవరికీ తెలియదు. కనుక ప్రతి మనిషి తప్పనిసరిగా అల్లాహ్ ఆదేశాలను పాటించాలి. నిషేధాలకు దూరంగా ఉండాలి. అల్లాహ్ తన అనుగ్రహంతో మేలు చేస్తాడని విశ్వసించాలి.

12. కేవలం అల్లాహ్ పైనే భారం మోపాలి

అమ్ర బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు: ‘మానవ హృదయానికి ప్రతి రంగంలోనూ ఒక మార్గం ఉంది. ఎవరయితే తన హృదయాన్ని అన్ని మార్గాల వైపునకు పంపుతాడో అతను ఏ మార్గంలో నాశనమైనా అల్లాహ్ పట్టించుకోడు. కాని అల్లాహ్ ను నమ్మిన వాడు ప్రతి రంగంలోనూ అల్లాహ్ ను కార్యసాధకునిగా పొందుతాడు. (హదీసుగ్రంథం, ఇబ్నె మాజహ్ హదీస్ నెం. : 4166)

మానవుడు కష్టాల్లో చిక్కుకున్నప్పుడు లేదా అతనికి ఏదైనా వస్తువు అవసరం వచ్చినప్పుడు అతని ఆలోచనలు నలువైపులా పరుగెత్తుతుంటాయి. ఫలానా ప్రవక్తను లేదా ఫలానా ఇమామ్ను లేదా ఫలానా పీర్ను లేదా ఫలానా అమర వీరుడిని లేదా ఫలానా దూతను మొర పెట్టుకోవాలనుకుంటాడు. లేదా ఫలానా జోతిష్యుణ్ణి లేదా పండితుడిని లేదా మాంత్రికుడిని లేదా రాశిఫలాలు చూసేవాడిని సంప్రదించి శకునాలు చూడాలనుకుంటాడు. ఎవరయితే తన ఆలోచనల వెంట పరుగెత్తుతాడో అల్లాహ్ అతని నుండి తన స్వీకార దృష్టిని మళ్లించుకుంటాడు. అలాంటి వారిని తన చిత్తశుద్ధిగల దాసుల జాబితా నుండి తొలగిస్తాడు. అతను క్రమక్రమంగా అల్లాహ్ మార్గ దర్శకత్వాల నుండి దూరమవుతూ ఉంటాడు. అలా అతను తన ఆలోచనల వెంట పరుగెత్తుతూ చివరికి నాశనమవుతాడు. కొందరు నాస్తికులుగా, మరికొందరు భక్తిహీనులుగా, ఇంకొందరు బహుదైవారాధకులుగా, తిరస్కారులుగా మారతారు. మరెవరయితే అల్లాహ్ ను విశ్వసించి మనో కాంక్షల వెంటపడకుండా ఉంటారో వారు అల్లాహ్ ఆదరణీయ దాసులవుతారు. మార్గదర్శకత్వ మార్గాలు అతని కోసం తెరుచు కుంటాయి. తమ ఆలోచనల వెంట పరిగెత్తేవారు పొందని మానసిక ప్రశాంతతను వారు పొందుతారు. విధివ్రాతలో రాసిందంతా జరుగుతుంటుంది. కాని ఆలోచనల వెంటవెళ్ళే వాడు అనవసరంగా ఆపదల పాలవుతాడు. అల్లాహ్ ను విశ్వసించేవాడు ప్రశాంతతను పొందుతాడు.[*]

[*] అనస్(రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు: ప్రతి ముస్లిం తన అవసరాలన్నిటినీ అల్లాహ్ వద్దనే విన్నవించుకోవాలి. చివరకు ఉప్పు అవసరమున్నా లేదా బూటుకు కట్టే తాడు తెగినా అల్లాహ్ నే అడగాలి. (హదీసు గ్రంథం తిర్మిజీ)

అల్లాహ్ ను ప్రాపంచిక చక్రవర్తుల్లాగా భావించకండి. వారు పెద్ద పెద్ద పనులు వారు చేస్తారు. చిన్న చిన్న పనులు నౌకర్లతో చేయిస్తారు. కనుకనే ప్రజలు చిన్న చిన్న పనుల కోసం నౌకర్లతో అభ్యర్థించుకుంటుంటారు. కాని అల్లాహ్ సామ్రాజ్యం అలాంటిది కాదు. ఆయన ఆదేశిస్తే చాలు రెప్పపాటులో అసంఖ్యాక చిన్న పెద్ద పనులన్నీ జరిగి పోతాయి. సామ్రాజ్యంలో ఆయనకు భాగస్వాములుగానీ, సహవర్తులుగానీ లేరు. అందుకనే చిన్న చిన్న వస్తువులు అవసరమొచ్చినా నేరుగా ఆయన్నే అభ్యర్థించాలి. ఆయన తప్ప వేరే వారు చిన్న వస్తువైనా ఇవ్వలేరు.

13. బంధుత్వమూ పనికిరాదు

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఇలా పేర్కొన్నారు: “మీ అతి సమీప బంధువులను హెచ్చరించండి.” (దివ్యఖుర్ఆన్ 26: 214) అనే ఆయత్ అవతరించినపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన బంధువులను పిలిచి ఇలా చెప్పారు:

”ఓ కఅబ్ బిన్ లూయి సంతానమా! మీ ప్రాణాలను అగ్ని నుండి రక్షించుకోండి. అల్లాహ్ శిక్షనుండి రక్షించడానికి నేను మీకు ఏ విధంగానూ సహాయపడలేను.”“ఓ ముర్రహ్ బిన్ కఅబ్ సంతానమా! మీ ప్రాణాలను అగ్ని నుండి రక్షించుకోండి. అల్లాహ్ శిక్ష నుండి మిమ్మల్ని కాపాడటానికి నేను మీకు ఏ విధంగానూ సహాయపడలేను. “ఓ అబ్దుష్టమ్స్ సంతానమా! మీ ప్రాణాలను అగ్ని నుండి కాపాడుకోండి. అల్లాహ్ శిక్ష నుండి రక్షించడానికి నేను మీకు ఏ విధంగాను సహాయపడలేను.”ఓ అద్దె మునాఫ్ సంతానమా! మీ ప్రాణాలను అగ్ని నుండి కాపాడుకోండి. నేను మీకు అల్లాహ్ శిక్ష నుండి రక్షించడానికి ఏ విధంగానూ సహాయపడలేను. ఓ హాషిమ్ సంతానమా! మీ ప్రాణాలను అగ్ని నుండి కాపాడుకోండి. నేను మీకు అల్లాహ్ శిక్ష నుండి రక్షించడానికి సహాయపడలేను. ఓ అబ్దుల్ ముత్తలిబ్ సంతానమా! మీ ప్రాణాలను అగ్ని నుండి కాపాడుకోండి. నేను మీకు అల్లాహ్ శిక్ష నుండి రక్షించలేను.ఓ ఫాతిమా! నీ ప్రాణాన్నీ అగ్ని నుండి కాపాడుకో. నీకు ఎంత ధనం కావాలో నా దగ్గర తీసుకో. ఎందుకంటే అల్లాహ్ శిక్ష నుండి నేను నిన్ను రక్షించలేను. (హదీసు గ్రంథం ముస్లిం, హదీస్ : 348)

పుణ్యాత్ముల బంధువులు తమను పుణ్యాత్ములే రక్షిస్తారని విశ్వసిస్తారు. అందుకనే వారు అహంకారంతో నిర్భయంగా ఉంటారు. కనుకనే అల్లాహ్ తన ప్రియతమ ప్రవక్తని ‘మీ బంధువులను హెచ్చరించు’ అని ఆదేశించాడు. ప్రవక్త( సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ఒక్కో బంధువుని ఉద్దేశించి చివరకు తన ప్రియ కుమార్తెను ఉద్దేశించి, ‘మానవాధీన విషయాల్లోనే బంధుత్వ హక్కులు సాధ్యమవుతాయ’ని చాలా స్పష్టంగా వివరించారు. నా ధనం నా అధీనంలోఉంది. అది ఇవ్వడంలో లోభత్వంతో వ్యవహరించను. కాని అల్లాహ్ వద్ద జరగబోయే వ్యవహారం నా అధీనంలో లేదు. అక్కడ ఎవరికీ సహాయ పడలేను. ఎవరి సంరక్షకుణ్ణి కాలేను. ప్రతి ఒక్కరూ ప్రళయం కోసం సిద్ధం కావాలి. నరకాగ్ని నుండి రక్షించబడటానికి నేటి నుంచే ఆలోచించాలి.

దీని ద్వారా ”అల్లాహ్ వద్ద పుణ్యాత్ముని బంధుత్వ సంబంధం కూడా సిఫారసు కోసం పనికిరాదని స్పష్టమవుతుంది. మానవుడు స్వయంగా మంచి పనులు చేయనంత వరకు ఆపదలను అధిగమించలేడు.”

సారాంశం

1. ఎవరయినా ఎవరినైనా ప్రపంచంలో అధికారం చేసేవానిగా, అతన్ని అల్లాహ్ వద్ద తన న్యాయవాదిగా భావిస్తూ అతన్ని అల్లాహ్ కు సరిసమానమని భావించనప్పటికీ అతను ముష్రిక్ అయిపోతాడు.

2. స్వయంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తన సమాజం వారికి లాభ నష్టాలు చేకూర్చే అధికారం లేనప్పుడు ప్రజలను పీర్లు, ముర్షిద్లు అల్లాహ్ శిక్ష నుండి ఎలా కాపాడగలరు?

3. ప్రజలు ఎంతో నమ్మకంతో ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు నిస్సహాయులు. తమ శక్తి సామర్థ్యాలతో; తమ కార్యాలతో ఉపాధి ప్రసాదించే, అధికారం చెలాయించే శక్తి వారికి లేదు. అల్లాహ్ మాత్రమే సర్వాధికుడు.

4. నిరపేక్ష సర్వాధికారిని వదలిపెట్టి నిస్సహాయ దాసులను అర్థించడం ఘోర అన్యాయం. ఎందుకంటే ఈ విశ్వంలో వారికి ఇసుమంత అధికారం కూడా లేదు. అంతేకాదు, అనుమతి లేనిదే వారు సిఫారసూ చేయలేరు. అల్లాహ్ గొప్పవాడు, సర్వోన్నతుడు.

5. బహుదైవారాధకులు ఎవరినైతే తమ సిఫారసుదారులుగా భావిస్తున్నారో వారు విశ్వాన్ని సృష్టించడంలో అల్లాహ్ కు భాగస్వాములుకారు, యజమానులూ కారు, సభ్యులు కూడా కారు, వారు అల్లాహ్ సన్నిధిలో నిస్సహాయులు, నిరాసక్తులు, భయస్థులై అనుమతి కోసం ఎదురు చూస్తుంటారు.

6. అల్లాహ్ సమక్షంలో “గౌరవప్రదమైన సిఫారసు, ప్రేమతో కూడిన సిఫారసులు” అన్ని విధాలుగా అసంభవం. ఎవరయినా ఇతరులను ఇలాంటి సిఫారసుదారునిగా భావిస్తే అది తీవ్రమైన షిర్క్. అల్లాహ్ దర్బారులో అనుమతితో కోరుకున్న సిఫారసు మాత్రమే చెల్లుతుంది.

7.ప్రతి ముస్లిం నేరుగా నిజప్రభువునే సహాయకునిగా, సంరక్షకునిగా భావించడం తప్పనిసరి. ఎందుకంటే అల్లాహ్ ఇష్టంలేనిదే ప్రపంచమంతా కలిసి లాభంగాని నష్టంగాని చేకూర్చదు. ఆయన అర్థించేవానికి అత్యంత సమీపంలో ఉన్నాడు.

ఎ) సామాజిక ఆచార వ్యవహారాలకు బదులు ధర్మాదేశాలను పాటించే వారి విషయంలోనే ప్రవక్తలు, సజ్జనులు సిఫారసు చేయగలరు.

బి) “రారాజైన అల్లాహ్” గొప్పతనం ఏమిటంటే; ఎవరయినా సరే హృదయ పూర్వకంగా పూర్తి ఏకాగ్రతతో ఎలాంటి సిఫారసుదారుడు లేకుండానే నేరుగా ఆయన వద్దకు చేరవచ్చు.

8. అల్లాహ్ తన ”పరిజ్ఞానం”, “సామర్థ్యం” పరంగా ప్రతి ఒక్కరికీ అతి సమీపంలో ఉన్నాడు. ప్రపంచంలోని ఏ పనైనా విధివ్రాత పరిధిలోనే ఉంటుంది. అల్లాహ్ మాత్రమే విధివ్రాతను మార్చగలడు. తన దాసులు నేరుగా ఆయన్నే అర్థించాలని అల్లాహ్ ఆశిస్తున్నాడు. ఎందుకంటే అన్నిటిపై ఆయనకే అధికారం ఉంది.

9. కష్ట సమయాల్లో అటూ ఇటూ తచ్చాడేవారు తప్పుద్రోవ పడతారు. ఆందోళన చెందుతారు. మరి ఎవరైతే అల్లాహ్ ను మాత్రమే నమ్ముతారో అల్లాహ్ వారికి చాలు. దానివల్ల వారికి ప్రశాంతత లభిస్తుంది. ఎందుకంటే అల్లాహ్ యే సర్వాధికారి. ప్రతి చిన్న పెద్ద వస్తువును అతనే సమకూరుస్తాడు.

10. మానవుడు తన సామర్థ్యం మేరకే బంధుత్వ హక్కులను నెరవేర్చగలడు. కాని అల్లాహ్ దగ్గర జరిగే వ్యవహారాల్లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఎలాంటి అధికారం ఉండదు. అల్లాహ్ అనుమతి లేనిదే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎవరికీ సిఫారసుదారునిగా వ్యవహరించ లేరు. కనుక ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా పరలోకం కోసం సంసిద్ధులవ్వాలి.

ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

  1. అధికారంలో షిర్క్ గురించి వివరించండి?
  2. ‘సిఫారసు’ అంటే ఏమిటి? వాటి రకాలు తెలపండి?
  3. ప్రేమపూర్వక సిఫారసు’ ధర్మసమ్మతమైనదా? లేదంటే ఎందుచేత?
  4. ‘అనుమతితో కూడిన సిఫారసు’ను నిర్వచించండి?
  5. సిఫారసు విషయంలో రుజుమార్గమేది?

తప్పొప్పులను గుర్తించండి

  1. కష్టకాలంలో కేవలం అల్లాహ్ మొరపెట్టుకోవాలి (. )
  2. అల్లాహ్ ను తప్ప ఇతరులను వేడుకోరాదు ( )
  3. అల్లాహ్ మాత్రమే ఉపాధిని ప్రసాదించేవాడు ( )

ఖాళీలను పూరించండి

  1. అల్లాహ్ తన……… మరియు………….దాసులకు అత్యంత సమీపంలో వున్నాడు.
  2. ఎవరైనా దైవేతరులను గౌరవ భావ సిఫారసుకై వేడుకుంటే అది ఖచ్చిత మైన …………….అవుతుంది.
  3. సిఫారసు……….తప్ప నెరవేరదు.
  4. పుణ్య పురుషుల. లేదా ప్రవక్తల బంధుత్వం…….రాదు.

1. ఆరాధన నిర్వచనం

అల్లాహ్ తన భక్తి ప్రపత్తుల కోసం కొన్ని పనులను నిర్ణయించి దాసులకు నేర్పాడు. వాటినే ఆరాధనలు అంటారు. అల్లాహ్ తన భక్తి కోసం దాసులకు ఏ ఏ పనులు చేయమని చెప్పాడో వాటిని పేర్కొంటున్నాము. దైవేతరుల కోసం ఆ పనులు చేయరాదు. దీనినే షిర్క్ అంటారు. షిర్క్ కు దూరంగా ఉండాలి.

2. “ఆరాధన” (దాస్యం) కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకం

అల్లాహ్ ఇలా ఆదేశించాడు:

మేము నూహ్ (అలైహిస్సలాం)ను ప్రవక్తగా చేసి అతని జాతి వద్దకు పంపాము. ‘నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించేవాడను. మీరు అల్లాహ్ ను తప్ప మరొకరిని ఆరాధించకండి. మీరు బాధాకరమైన దినాన శిక్షించ బడతారేమోనన్న భయం నాకుంది.’ (అని అతను చెప్పాడు). (దివ్యఖుర్ఆన్ 11 : 25-26)

నూహ్ (అలైహిస్సలాం) కాలం నుండి విశ్వాసులకు- అవిశ్వాసులకు మధ్య పోరాటం జరుగుతూనే వస్తుంది. అల్లాహ్ యొక్క ఆదరణీయులైన దాసులు “అల్లాహ్ ను గౌరవించే విధంగా దైవేతరులని గౌరవించకండి” “ఆయన గౌరవార్థం నిర్ణయించిన పనులను వేరే వారి కోసం చేయకండి” అని చెబుతూ వచ్చారు.

3. ‘సజ్దహ్ ‘ (సాష్టాంగం) కేవలం అల్లాహ్ కు మాత్రమే

“మీరు సూర్యునికి గానీ, చంద్రునికి గానీ సాష్టాంగ ప్రణామం (సజ్దా) చేయకండి. నిజంగా మీరు అల్లాహ్ దాస్యం చేసేవారే అయితే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్ కు సాష్టాంగ పడండి.’ (దివ్యఖుర్ఆన్ 41 : 37)

ఈ ఆయత్ ద్వారా ఇస్లాం ధర్మంలో సాష్టాంగ పడటం సృష్టికర్త హక్కు అని తెలుస్తోంది. కనుక సృష్టితాలకు సాష్టాంగపడకూడదు. సూర్యుడు, చంద్రుడు, ప్రవక్త, వలీయుల్లాహ్ (అల్లాహ్ స్నేహితుడు), జిన్నులు మరియు దైవదూతలు ఎవరైనా సరే వారికి సాష్టాంగ పడకూడదు. పూర్వ శాసనాంగాలలో సృష్టిరాశులకు కూడా సజ్దహ్ చేయడం జరిగింది కదా? అని ఎవరైనా అంటే ఉదాహరణకు దైవదూతలు ఆదమ్ (అలైహిస్సలాం)కి, యాఖూబ్ (అలైహిస్సలాం)కి యూసుఫ్ (అలైహిస్సలాం) సజ్దహ్ చేశారు కదా? కనుక మేము పుణ్యాత్ములకు గౌరవ భావంతో సజ్దహ్ చేస్తే ఏమవుతుంది? అనే వారు ముష్రిక్కులుగా పరిగణించబడతారు. వారు విశ్వాసులు కాజాలరు. ఆదమ్ (అలైహిస్సలాం) షరీఅత్లో సొంత చెల్లెళ్లను వివాహం చేసుకోవడం ధర్మ సమ్మతం. ఈ విషయాన్ని ఆధారం చేసుకుని చెల్లెళ్ళను వివాహం చేసుకుంటే ఏమవుతుంది? అంటే ఇది చాలా తప్పు. ఎందుకంటే చెల్లెళ్ళు శాశ్వతంగా నిషేధించబడిన వారు. వీరు ఎట్టి పరిస్థితిలోనూ ధర్మసమ్మతం కారు .

విషయమేమిటంటే, మానవుడు అల్లాహ్ ఆదేశాన్ని తు.చ. తప్పకుండా పాటించాలి. అల్లాహ్ ఆదేశాలను సహృదయంతో స్వీకరించాలి. మా విషయంలోనే ఎందుకు నిషేధించడం జరిగింది? అని అనవసర పిడి వాదానికి దిగకూడదు. ఇలా మాట్లాడటం వల్ల మానవుడు తిరస్కారి (కాఫిర్) అవుతాడు. ఈ అంశాన్ని ఈ ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోండి.

రాజు గారి దగ్గర ఒక చట్టం కొన్ని రోజుల వరకు అమలు చేయబడుతుంది. తర్వాత అవసరమున్నప్పుడు ఆ చట్టాన్ని రాజ్యాంగ కర్తలు రద్దు చేస్తారు. ఆ స్థానంలో మరో కొత్త చట్టం రూపొందిస్తారు. ఇక తప్పనిసరిగా కొత్త చట్టం ప్రకారం నడుచుకోవాలి. ఒకవేళ ఎవరయినా మేము పాత చట్టంపైనే నడుచుకుంటాం, కొత్త చట్టాన్ని అంగీకరించము అంటే వారు తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేసినందుకు రాజు వారికి జైలు శిక్ష విధిస్తాడు. అదే విధంగా అల్లాహ్ ఆదేశాలను తిరస్కరించే వారికి శిక్ష నరకం.

4. దైవేతరులను మొరపెట్టుకోవడం షిర్క్

ఇంకా, మస్జిదులు కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కాబట్టి (వాటిలో) అల్లాహ్ తో పాటు ఇతరులెవరినీ పిలవకండి. అల్లాహ్ దాసుడు (ముహమ్మద్) అల్లాహ్ ను మాత్రమే ఆరాధించటానికి నిలబడినప్పుడు ఈ మూక అమాంతం అతనిపై విరుచుకుపడినట్లే ఉంటుంది. (ఓ ప్రవక్తా!) ‘నేనయితే కేవలం నా ప్రభువునే మొరపెట్టుకుంటున్నాను. ఆయనకు సహవర్తులుగా ఎవరినీ చేర్చను’ అని చెప్పు. (దివ్యఖుర్ఆన్ 72:18-20)

ఎవరయినా “అల్లాహ్ దాసుడు” స్వచ్ఛమైన హృదయంతో అల్లాహ్ ను మొర పెట్టుకుంటే, ఈ అజ్ఞానులు అతన్ని ఎంతో గొప్ప వాడని భావిస్తారు. అతన్ని మహాత్ముడు, ఆదుకునే వాడని విశ్వసిస్తారు. అతను ఎవరికి ఏది కావాలన్నా ఇస్తాడని, ఏది కావాలన్నా లాక్కుంటాడని నమ్ముతారు. అందుకనే అలాంటి వారి వద్దకు గంపెడు ఆశలతో తండోపతండాలుగా ప్రజలు ఆ పుణ్మాత్ముని వద్దకు తరలి వెళ్తారు. అతను తమ జీవితాలను చక్కబెడతాడని. అప్పుడు ఆ దైవదాసుడు వారికి ఇలా తెలియబరచాలి – ఆపదల్లో అల్లాహ్ నే మొరపెట్టుకోవాలని, ఇది ఇతరుల హక్కు కాదని వివరించాలి. అల్లాహ్ మాత్రమే లాభనష్టాలు కలిగించేవాడని నమ్మబలకాలి. ఎందుకంటే ఇతరులను ఉద్దేశించి ఇలా ఆశించడం షిర్క్ అవుతుంది. నేను షిర్క్ ను, షిర్క్ చేసే వారిని అసహ్యించుకుంటాన’ని స్పష్టం చేయాలి. ఎవరయినా నా వద్దకు వచ్చి ఇలాంటి పనులు చేయమని కోరితే నేను వారిని ఇష్టపడను. ఇవ్వడం, తీసుకోవడం అల్లాహ్ చేతుల్లో ఉంది. ఆయనే ఇస్తాడు. ఆయనే తీసుకుంటాడు. నా చేతుల్లో ఏమీ లేదు. నా ప్రభువు ఆయనే. మీ ప్రభువు కూడా ఆయనే.”

కనుక, రండి! మిథ్యా దైవాలను విడిచి పెట్టండి. ఒక్కడైన ఆ విశ్వప్రభువునే మొరపెట్టుకోండి. ఆయన తన ఆరాధనలో, ఏకత్వంలో, ప్రభుతలో, అధికారంలో కేవలం ఒకే ఒక్కడని స్పష్టంగా వివరించాలి.

దీనిద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే; (చేతులు కట్టుకుని మర్యాదగా నిలుచోవడం, మొరపెట్టుకోవడం, దైవనామాన్ని స్మరించడం ఇవన్నీ అల్లాహ్ గౌరవార్థం చేసే పనులు. దైవేతరుల కోసం ఈ పనులు చేయడం షిర్క్ అవుతుంది. అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు:

హజ్ (యాత్ర)కై ప్రజలలో ప్రకటన గావించు. ప్రజలు నీ వద్దకు అన్ని సుదూర మార్గాల నుంచి కాలి నడకన కూడా వస్తారు. బక్కచిక్కిన ఒంటిపై కూడా స్వారీ అయి వస్తారు. వారు తమ ప్రయోజనాలు పొందటానికి రావాలి. అల్లాహ్ తమకు ప్రసాదించిన తమ పెంపుడు పశువుల మీద ఆ నిర్ణీత దినాలలో అల్లాహ్ నామాన్ని స్మరించాలి (ఉచ్చరించాలి). ఆ తరువాత వాటిని మీరూ తినండి. దుర్భర స్థితిలో ఉన్న అగత్యపరులకు కూడా తినిపించండి. ఆ తరువాత వారు తమ మురికిని దూరం చేసుకోవాలి. తమ మొక్కుబడులను చెల్లించాలి. (అనంతరం అల్లాహ్ యొక్క) ఆ ప్రాచీన గృహానికి ప్రదక్షిణ చేయాలి. (దివ్యఖుర్ఆన్ 22:27-29)

5. అల్లాహ్ చిహ్నాలను గౌరవించాలి

అల్లాహ్ తన వైశిష్ట్యం చాటడం కోసం కొన్ని స్థలాలను నిర్ణయించాడు. ఉదాహరణకు కాబా గృహం, అరఫాత్, ముజ్దలిఫహ్, మినా మైదానాలు. సఫా మర్వా పర్వతాలు, మఖామె ఇబ్రాహీం, మస్జిద్ హరాం, మక్కా మొత్తం ప్రాంతం, మొత్తం హరం ప్రాంతం. ప్రజలలో ఈ స్థలాలను సందర్శించాలనే ఆసక్తిని కలిగించాడు. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు స్వారీ అయి, నడచుకుంటూ సుదూర ప్రాంతాల నుండి కాబా గృహం సందర్శించాలని. ప్రయాణ కష్టాలు అనుభవించి నిర్దేశిత దుస్తులు ధరించి ప్రత్యేక రూపంలో అక్కడికి చేరుకోవాలని. అల్లాహ్ పేరుతో ఖుర్బానీ ఇవ్వాలని. తమ మొక్కుబడులు పూర్తి చేసుకోవాలని. కాబా గృహ ప్రదక్షిణలు చేయాలని. హృదయాల్లో తమ యజమాని కోసం ప్రోది చేసుకున్న వైశిష్ట్యాన్ని కాబా గృహానికొచ్చి చాటాలని. మరికొందరు ఎతికాఫ్ లో కూర్చుని అహర్నిశలు అల్లాహ్ నామస్మరణ చేస్తున్నారు. ఇంకొందరు మర్యాదతో మౌనంగా నిలుచొని కాబతుల్లాహ్ వైపు చూస్తూ కళ్లను చల్లబరుచు కుంటున్నారు. ఏది ఏమయినప్పటికీ ఈ పనులన్నీ అల్లాహ్ గౌరవార్థం చేయబడతాయి. అల్లాహ్ వారిని, వారి పనుల వల్ల ఇష్టపడతాడు. వారికి ఇరులోకాలలో లబ్ది చేకూరుతుంది. కనుక ఇలాంటి పనులు దైవేతరుల గౌరవార్ధం చేయడం నిషిద్ధం, షిర్క్.

ఏదైనా సమాధిని సందర్శించడం కోసం లేదా ఆస్థానం కోసం లేదా ఆశ్రమం కోసం సుదూర ప్రయాణ కష్టాలు అనుభవించి మాసిన దుస్తులతో అక్కడికి వెళ్ళడం, అక్కడకు వెళ్లి జంతువులను ఖుర్బానీ ఇవ్వడం, మొక్కుబడులు చెల్లించడం, సమాధి లేదా ఇంటి ప్రదక్షిణ చేయడం, దాని సమీప పొలాలను మరియు అడవులను గౌరవించడం, అక్కడ వేటాడకుండా ఉండటం, అక్కడి వృక్షాలు కోయకుండా ఉండటం, గడ్డి పోచలను తెంచకుండా ఉండటం ఇలాంటి ఇతర పనులు చేయకుండా అందులోనే ఇహపరాల సాఫల్యం ఉందని ఆశించడం అంతా షిర్క్ గానే పరిగణించబడుతుంది.

కనుక ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే షరీఅత్ ఆదేశించిన ప్రాంతాలను విడిచిపెట్టి వేరే వాటిని గౌరవించడం, అవి ధర్మంలోని విషయాలేనని భావించడం బిద్అత్ (దురాచారం). సృష్టికర్తకే వినమ్రులై ఉండాలి. ఆయనకే విధేయత చూపాలి, సృష్టితాలకు కాదు.

6. దైవేతరుల పేరు తీసుకున్న వస్తువు నిషిద్ధం

قُل لَّا أَجِدُ فِي مَا أُوحِيَ إِلَيَّ مُحَرَّمًا عَلَىٰ طَاعِمٍ يَطْعَمُهُ إِلَّا أَن يَكُونَ مَيْتَةً أَوْ دَمًا مَّسْفُوحًا أَوْ لَحْمَ خِنزِيرٍ فَإِنَّهُ رِجْسٌ أَوْ فِسْقًا أُهِلَّ لِغَيْرِ اللَّهِ بِهِ ۚ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَإِنَّ رَبَّكَ غَفُورٌ رَّحِيمٌ

ఓ ప్రవక్తా! వారికి చెప్పు: (వహీ ద్వారా) నా వద్దకు వచ్చిన ఆజ్ఞలలో చచ్చిన జంతువు, ప్రవహించే రక్తం, పంది మాంసం – అది పరమ అశుద్ధం గనక! ఇంకా దైవేతరుల పేర కోయబడిన జంతువు తప్ప మరేదీ తినేవాడి కోసం నిషేధించబడినట్లు నాకు కనిపించదు. అయితే గత్యంతరం లేని పరిస్థితిలో రుచి కోసం కాకుండా, హద్దు మీరకుండా ఉంటే (వాటిని తింటే అట్టి స్థితిలో)నే ప్రభువు క్షమించేవాడూ, కరుణించేవాడు. (దివ్యఖుర్ఆన్ 6 : 145)

రక్తం, మృత జంతువు, పందిమాంసం లాగానే దైవేతరుల పేరు మీద బలి ఇచ్చిన జంతువు కూడా నిషిద్దమే. సృష్టితాల పేరు నిర్ణయించిన జంతువు అశుద్ధమని, నిషిద్ధమని దీని ద్వారా తెలుస్తుంది. ఉదాహరణకు: ఇవి దేవిదేవతల, దర్గాల, పేర్ల మీద మొక్కుబడిగా వదలబడే ఆంబోతులు మరియు గొర్రె పోతులు మొదలగునవి.

పై ఆయత్ ద్వారా తెలుస్తున్న విషయం మేమిటంటే, జిబహ్ చేసేటప్పుడు దైవేతరుల పేరు తీసుకోవడమే కాకుండా వారి పేరు మీద వదిలిపెట్టే జంతువులు కూడా నిషిద్ధమే. కోడిని, మేకను, ఒంటెను, ఆవును, లేదా ఏదైనా జంతువును సృష్టితాలైన వలీ పేరున గానీ, ప్రవక్త పేరున గానీ, తాతముత్తాతల పేరునగానీ లేదా పీర్, పండితుల, దూతల పేరునగానీ, వదలిపెట్టడం నిషిద్దం, అపరిశుద్ధం కూడాను. అలా చేసేవాడు ముష్రిక్ అనబడతాడు!

7. ‘అధికారం’ కేవలం అల్లాహ్ ది మాత్రమే

అల్లాహ్ యూసుఫ్ (అలైహిస్సలాం) సంఘటనను వివరిస్తూ ఇలా సెలవిచ్చాడు; ఆయన తన కారాగార సహచరులతో ఇలా పేర్కొన్నారు:

يَا صَاحِبَيِ السِّجْنِ أَأَرْبَابٌ مُّتَفَرِّقُونَ خَيْرٌ أَمِ اللَّهُ الْوَاحِدُ الْقَهَّارُ مَا تَعْبُدُونَ مِن دُونِهِ إِلَّا أَسْمَاءً سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا أَنزَلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ ۚ إِنِ الْحُكْمُ إِلَّا لِلَّهِ ۚ أَمَرَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُون

‘ఓ కారాగార సహచరులారా! అనేక మంది విభిన్న ప్రభువులు మేలా? లేక సర్వాధిక్యుడైన ఒక్క అల్లాహ్ మేలా? (మీరే చెప్పండి!). ఆయనను వదలి మీరు పూజిస్తున్నవి మీరూ, మీ తాతముత్తాతలూ స్వయంగా కల్పించుకున్న కొన్నిపేర్లు తప్ప మరేమీ కావు. వాటికి సంబంధించి అల్లాహ్ ఏ ప్రమాణాన్నీ అవతరింపజెయ్యలేదు. పరిపాలనాధికారం అల్లాహ్ కు తప్ప వేరొకరికి లేదు. మీరంతా ఆయన దాస్యాన్ని తప్ప ఇంకొకరి దాస్యం చెయ్యరాదన్నదే ఆయన ఆజ్ఞ. ఇదే సరైన, స్థిరమైన ధర్మం. కాని చాలా మంది ఈ విషయాన్ని తెలుసుకోరు.’ (దివ్యఖుర్ఆన్ 12 : 39-40)

ఒక బానిసకు అనేక మంది యజమానులుంటే చాలా కష్టం. కాని అతనికి ఒక్కడే యజమాని ఉండి, అతను అత్యంత గొప్పవాడై ఉంటే చాలా బాగుంటుంది.

యజమాని ఒక్కడే. మానవుల మొరలన్నింటిని ఆలకిస్తాడు. మానవుల జీవితాన్ని చక్కదిద్దుతాడు. ఆయన ముందు అసత్య దేవుళ్లకు స్థానంలేదు. ఒక దేవుడు వర్షం కురిపిస్తాడు, ఇంకొకడు ఆధిక్యతను ప్రసాదిస్తాడు, మరొకడు సంతానాన్ని కలిగిస్తాడు, ఒకడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు లాంటి భావాలు నిరాధారమైనవి. మీకు మీరే దేవుళ్ల పేర్లు నిర్ణయించి ఫలానా అతనికి ఫలానా అధికారం ఉందని బలవంతంగా అంటగట్టి అవసరం వచ్చినపుడు వాటి గురించి వారి ముందు మొరపెట్టుకుంటున్నారు. కొంతకాలానికి అలాంటి ఆచారాలే రూపుదిద్దుకుంటాయి.

8. ఇష్టమొచ్చినట్టు దేవుళ్ల పేర్లు పెట్టడం షిర్క్ (బహుదైవారాధన)

“అల్లాహ్” తప్ప దేవుడు ఎవరూ లేడు. ఈ నామము (అల్లాహ్) గలవాడు ఎవడూ లేడు. ఒకవేళ ఎవరిదైనా దైవ నామము ఉంటే అతనికి దైవాధికారాల్లో ఏ విధమైనటు వంటి జోక్యం లేదు. అన్ని పనులు చేసే అధికారంగల నామమే “అల్లాహ్”. బాబాలు, ముర్షదులు, స్వాములు అవతారాలు గల నామముగల వాళ్ళకి విశ్వంలో ఏ పనీ చేసే అధికారం లేదు. ఇలాంటి భావాలు ఏర్పర్చుకోమని “అల్లాహ్” ఆదేశించ లేదు.

కాని చాలా మంది ఈ మార్గం నుండి తప్పి పోయారు. పీర్ల, ఇమాముల, స్వాముల, బాబాల, ఋషుల, పాస్టర్ల మార్గాన్ని అల్లాహ్ మార్గం కంటే గొప్పదైనదిగా భావిస్తున్నారు.

9. స్వయం కల్పిత ఆచారాలు షిర్క్ (బహుదైవారాధన)

వేరే వారి మార్గాన్ని, ఆచారాన్ని అనుసరించకుండా అల్లాహ్ ఆదేశాలను పాటించడం అల్లాహ్ తన వైశిష్ట్యం కోసం నిర్ణయించుకున్న విషయాల్లోనిది[*]. ఎవరయినా ఈ పనులు సృష్టితాల కోసం చేస్తే ముష్రిక్ అవుతాడు. ప్రవక్తల ద్వారానే అల్లాహ్ ఆదేశాలు మానవుల వద్దకు చేర్చడం సాధ్యమవుతుంది ఎవరయినా ఇమాముల, పండితుల, మహాత్ముల, మత గురువుల, ముల్లాల, పీర్ల తాతముత్తాతల, రాజు, మంత్రి లేదా ఫాదర్ (పాస్టర్)ల మాటలను లేదా వారి ఆచారాలను షరీఅత్ ఆదేశాల కంటే ఎక్కువ ప్రాధాన్యమైనవిగా భావించడం, ఖుర్ఆన్ హదీసులు మరియు సహాబాల జ్ఞాన అనుసరణ వివరణ (ఫఫ్మె సలఫ్) ఉండగా పీర్ల, పండితుల, ఇమాముల వ్యాఖ్యానాలను పేర్కొనడం, లేదా ప్రవక్తలకు సంబంధించి వారు ఆదేశించినదే షరీఅత్ అని విశ్వసించడం, వారికి ఇష్ట మైనట్టు ఆదేశించేవారు వాటిని విధిగా ఆచరించాలి అని భావించడం – ఇవన్నీ షిర్క్ గానే భావించడం జరుగుతుంది.

కనుక అల్లాహ్ నిజమైన అధికారిగా భావించాలి. ప్రవక్తలు కేవలం అల్లాహ్ ఆదేశాలను ప్రజల వద్దకు చేర్చుతారు. కనుక ఖుర్ఆన్, హదీసుల, సహబాల అనుసరణ ప్రకారం నడుచు కోవాలి. వాటికి విరుద్ధమైన వాటిని విడిచిపెట్టాలి.

10. తమ గౌరవార్థం ప్రజలను నిలుచోబెట్టి ఉంచడం నిషిద్ధం

ముఆవియహ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘ప్రజలు తన ముందు బొమ్మల్లాగా నిలుచొని ఉండటాన్ని ఇష్టపడే వాడు తన నివాసం నరకంలో ఏర్పరుచుకోవచ్చు.’ (హదీసు గ్రంథం తిర్మిజీ: 2755)

ప్రజలు తమ ముందు గౌరవంతో కదలకుండా చేతులు కట్టుకుని నిలుచోవాలి, అటు ఇటు చూడకూడదు, మాట్లాడకుండా విగ్రహాల్లా నిలుచోవాలి అని కోరుకునే వారు నరకవాసులు. ఎందుకంటే, వారు దైవత్వాన్ని ప్రకటించుకుంటున్నారు. అల్లాహ్ అస్తిత్వం కోసం ప్రత్యేకమైన విశిష్టత తమ కోసం కావాలని కోరుకుంటున్నారు. నమాజ్ చేసేవారు నమాజ్లో దిక్కులు చూడకుండా మౌనంగా నిలుచుంటారు. అది అల్లాహ్ అస్థిత్వం కోసం ప్రత్యేకం. కనుక ఎవరి ముందైనా అమిత గౌరవం, మర్యాద ఉద్దేశంతో నిలుచోవడం సమ్మతంకాదు. అది కూడా షిర్కే.

11. “విగ్రహాల” “ఆస్థానాల” పట్ల ఆరాధనా భావం కూడా షిర్క్ (బహుదైవారాధన)

సౌబాన్ (రదియల్లాహు అన్హు)ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘నా సమాజంలోని అనేక తెగలు ముష్రిక్కులతో కలిసిపోనంతవరకు, విగ్రహారాధనను అవలంబించ నంతవరకు ప్రళయం సంభవించదు.’ (హదీసు గ్రంథం తిర్మిజీ, హదీస్ : 2219)

విగ్రహాలు రెండు రకాలుగా ఉంటాయి.

ఒకటి: ఎవరిదైనా విగ్రహాన్ని లేదా శిల్పాన్ని తయారు చేసి దాన్ని పూజించడం. ఆ విగ్రహాలను అరబీ భాషలో ‘సనమ్‘ అంటారు.

రెండు: ఏదైనా స్థలంలో, చెట్టుకు, పుట్టకు, కర్రకు లేదా కాగితానికి ఏదైనా పేరు పెట్టి పూజించడాన్ని ‘వసన్‘ అంటారు. సమాధి, ఆస్థానం, చేతికర్ర, జెండాలు, అబ్దుల్ ఖాదిర్ జీలానిల గోరింటాకు, గురువులు పండితులు కూర్చునే ఆ స్థలాలు ఇవన్నీ ‘వసన్’గానే పరిగణించబడతాయి. అదే విధంగా అమరవీరుల పేర బలిచ్చే స్థూపాలు, తోపులు, ఇంకా కొన్ని స్థలాలు వ్యాధుల పేర్లతో పేరుగాంచాయి. ఉదాహరణకు : ఆటలమ్మ, కాళి, అమ్మోరు, బతుకమ్మ, ఉప్పలమ్మ, భవానీ, బరాహీ [*] మొదలగు వాటితో కొన్ని స్థలాలు ఏర్పరచడం జరిగింది. ఇవన్నీ వసన్ గానే పరిగణించబడతాయి.

సనమ్, వసన్ రెండింటినీ పూజించడం షిర్క్ అవుతుంది. ప్రళయ సమీప కాలంలో ముస్లిములు ఇలాంటి షిర్క్ కార్యాలకే ఒడిగడతారని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు. హిందువులూ లేదా మక్కా ముష్రిక్కులు అధికంగా విగ్రహారాధన చేసేవారు. వారు కూడా ముష్రిక్కులే. అల్లాహ్ మరియు ప్రవక్తకు శత్రువులే.

[*] ఇవన్నీ హిందూ దేవతల పేర్లు: ఆటలమ్మ: ఇదొక వ్యాధిదేవత పేరు కూడాను. ఆటలమ్మ సోకినప్పుడు అమ్మవారిని పూజిస్తే ఆ వ్యాధి నయమవుతుందని వారు విశ్వసిస్తారు. మసానీ: హిందువుల విశ్వాసం ప్రకారం ఆటలమ్మకు ఏడుగురు చెల్లెళ్ళు. అందులో ఒకామె పేరు మసానీ. ఈమె చిన్న చెల్లెలని వారి నమ్మకం. భవానీ, కాళి, కాళికాలు కూడా హిందువుల దేవతల పేర్లు.

12. దైవేతరుల పేర జిబహ్ చేయడం శాపార్హం

అబిత్తుఫైల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం అలీ (రదియల్లాహు అన్హు) ఒక పుస్తకం తీసారు. అందులో ఈ హదీసు ఉంది: ‘దైవేతరుల పేర జిబహ్ చేసే వారిని అల్లాహ్ శపిస్తాడు.’ (హదీసు గ్రంథం ముస్లిం, హదీస్ : 1978)

జిబహ్ చేసేటప్పుడు అల్లాహ్ పేరు ఉచ్చరించకుండా సృష్టితాల పేరు తీసుకునే వాడు శాపగ్రస్తుడు. అలీ (రదియల్లాహు అన్హు) ఒక పుస్తకంలో ప్రవక్తగారి ప్రవచనాలను రాసి పెట్టుకున్నారు. అందులో పైన పేర్కొన్న హదీసు కూడా ఉంది. కనుక అల్లాహ్ పేరు తీసుకుని జిబహ్ చేయబడిన పశువు మాత్రమే ధర్మసమ్మతం. ఇంకా మిధ్యా దేవుళ్ళ పేరుతో గుర్తింపబడిన జంతువును అల్లాహ్ పేరుతో జిబహ్ చేసినా శాపగ్రస్తుడే. ఆ పశువు కూడా నిషిద్ధమే. అదే విధంగా దైవేతరుల పేర వదలి పెట్టిన పశువు కూడా నిషిద్ధమే. దాన్ని జిబహ్ చేసేటప్పుడు అల్లాహ్ పేరు తీసుకున్నా సరే.

13. ప్రళయ సూచనలు

ఆయిషహ్ (రదియల్లాహు అన్హా) ఇలా అన్నారు; నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెబుతుండగా విన్నాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు: “లాత్, ఉజ్జహ్ ప్రాచీన విగ్రహాలు (మళ్లీ) పూజించబడనంతవరకు రాత్రింబవళ్ళు అంతమవ్వవు”. నేను ఇలా అన్నాను: ” ఆయనే తన ప్రవక్తకు సన్మార్గాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి పంపాడు – దాన్ని మత ధర్మాలన్నింటిపై ఆధిక్యం వహించేలా చేయటానికి! ఈ విషయం బహుదైవారాధకులకు ఇష్టం లేకపోయినాసరే. (దివ్యఖుర్ఆన్ 9 :33, 61 : 9) అనే ఆయత్ ను అవతరింపజేశాడు కదా! అందుచేత ప్రళయం వరకు ధర్మం అలాగే ఉంటుందని ఊహించాను. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారు: “అల్లాహ్ కు ఇష్టమున్నంత వరకు ధర్మం తన స్థితిలో అలాగే ఉంటుంది. ఆ తర్వాత అల్లాహ్ పరిశుభ్రమైన గాలిని పంపుతాడు. ఆ గాలి రవ్వంత విశ్వాసం ఉన్నవారిని కూడా చంపుతుంది. కేవలం చెడ్డవారే మిగులుతారు. వారు తమ తాత ముత్తాతల ధర్మం వైపు మళ్లుతారు“. (హదీసు గ్రంథం ముస్లిం, హదీస్ : 2907)

ఆయిషహ్ (రదియల్లాహు అన్హా) సూరె తౌబహ్ (9:33) సూరతుస్సఫ్ (61:9)లోని సూక్తి ద్వారా ఇస్లాం ప్రళయం వరకు తన ఆధిక్యతతో ఉంటుందేమో అని భావించారు. కాని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ తలచినంత వరకే దాని ఆధిక్యత ఉంటుందని వివరించారు. ఆ తర్వాత అల్లాహ్ పరిశుభ్రమైన గాలిని పంపుతాడు. దానివల్ల విశ్వాసులందరూ మరణిస్తారు. చివరికి రవ్వంత విశ్వాసం కలవారు కూడా చనిపోతారు. తిరస్కారులు మాత్రమే మిగిలి ఉంటారు. వారి హృదయాల్లో ప్రవక్త ఔన్నత్యంగానీ, ధర్మం పట్ల ప్రేమాభిమానంగానీ ఉండదు. అజ్ఞానులు, బహుదైవారాధకులైన తమ తాతముత్తాతల ధర్మాలను అవలంబిస్తారు. ముష్రికుల మార్గాన్ని అవలంబించిన వాడూ ముష్రిక్ అవుతాడు.

దీనిద్వారా తెలిస్తున్నదేమిటంటే; చివరి కాలంలో పూర్వకాలపు షిర్క్ ప్రబలుతుంది. నేడు ముస్లిం సమాజంలో గత కాలపు షిర్క్, ఆధునిక షిర్క్ కూడా కలగలసి ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పిన భవిష్యవాణి నిజమవుతుంది. ఉదాహరణకు: ముస్లిములు ప్రవక్తల, వలీల, అమరవీరుల విషయంలో షిర్క్ కు పాల్పడుతున్నారు. అదే విధంగా పూర్వకాలపు షిర్క్ కూడా వ్యాపిస్తుంది. వారు ముస్లిమేతరుల విగ్రహాలను పూజిస్తున్నారు. వారి ఆచారాలను అవలంబిస్తున్నారు. ఉదాహరణకు: పండితుల ద్వారా తమ జాతకం చెప్పించుకుంటున్నారు. శకునాలు తీస్తున్నారు. శుభఘడియలు, దుర్ఘడియలని విశ్వసిస్తున్నారు. పౌర్ణమి, నవమి, అమావాస్య, ఆటలమ్మ, అమ్మవారు, హనుమాన్ ను మొరపెట్టుకుంటున్నారు. హోలీ, దీపావళీ, క్రిస్మస్, మీలాదున్నబీ (ప్రవక్త జన్మదినం), ముహర్రమ్ (హుసైన్ రదియల్లాహు అన్హు మరణం) పండుగలు చేస్తున్నారు. రాశులను నమ్ముతున్నారు. ఇవన్నీ హిందువుల, ముష్రిక్కుల ఆచారాలు. అవి ముస్లిముల్లో వ్యాపించి ఉన్నాయి. ఖుర్ఆన్ హదీసులను విడిచిపెట్టి తాతముత్తాతల ఆచారాలను అవలంబించడం వల్ల ముస్లిముల్లో షిర్క్ ద్వారాలు తెరుచుకుంటున్నాయి.

14. ఆస్థాన పూజ చేయడం దుర్జనుల పని

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: (నా సమాజంలో) దజ్జాల్ వస్తాడు. అప్పుడు అల్లాహ్ ఈసా (అలైహిస్సలాం)ని పంపుతాడు. ఆయన దజ్జాల్ ను వెతికి పట్టుకుని చంపుతారు. అప్పుడు అల్లాహ్ సిరియా దేశం వైపు నుండి చల్లటి గాలులను పంపుతాడు. ఆ గాలి పృధ్విపై రవ్వంత విశ్వాసం కల వారిని కూడా చంపుతుంది. దుర్జనులు పక్షుల మాదిరిగా బుద్ధిహీనులై, క్రూర జంతువుల్లా [*] పీక్కుతింటుంటారు. వారు మంచిని మంచిగా చెడును చెడుగా భావించరు. షైతాన్ మానవ రూపంలో వాళ్ళ దగ్గరికి వచ్చి ‘మీకు సిగ్గులేదా? ‘ అంటాడు. అప్పుడు వారు ఏం చేయాలో చెప్పమని అడుగుతారు. షైతాన్ వారికి విగ్రహారాధన చేయమని ఆదేశిస్తాడు. (ఆస్థానాలను పూజించమంటాడు) వారు ఆ పనిలోనే లీనమవుతారు. వారికి విస్తృతంగా ఉపాధి లభిస్తుంటుంది. వారి జీవితం సుఖంగా సాగుతుంది. (హదీసు గ్రంథం ముస్లిం, హదీస్ : 2940)

[*] హదీసు పారంగతులు షేఖ్ అబ్దుల్ హఖ్ దహ్లవీ గారు ఈ వాక్యానికి భావం ఇలా తెలిపారు: ప్రజలు పాపాలు, దుష్కార్యాలు వ్యాపింపజేయడంలో, మానసిక కోరికలు తీర్చుకోవడంలో పక్షుల్లా తొందరపడుతుంటారు. దౌర్జన్యం, రక్తపాతం సృష్టించడంలో క్రూరమృగాల్లా ప్రవర్తిస్తారు.

చివరి కాలంలో విశ్వాసులు అందరూ చనిపోతారు. అవిశ్వాసులు మూర్ఖులు మాత్రమే మిగిలి ఉంటారు. వారు ఇతరుల ధనాన్ని కొల్లగొడతారు. వారు తాము చేసే పనులకు కొంచెం కూడా సిగ్గుపడరు. వారు మంచి చెడుల్లో తారతమ్యం చూడలేక పోతారు. షైతాన్ మహాత్ముడి రూపంలో వారి దగ్గరకు వచ్చి ‘ధర్మాన్ని అనుసరించక పోవడం చాలా చెడ్డ విషయం. ధర్మంపై నడవండి’ అని హితబోధ చేస్తాడు. అతని మాట విని వారికి ధర్మంపై మక్కువ కలుగుతుంది. కాని వారు ఖుర్ఆన్ హదీసు వెలుగులో సహబాల ప్రకారం నడచుకోరు. తమ బుద్ధిజ్ఞానాలతో ధార్మిక విషయాలను సృష్టిస్తారు. వారు షిర్క్ లో చిక్కుకుంటారు. ఈ క్రమంలో వారికి విస్తృతంగా ఉపాధి లభిస్తుంది. వారి జీవితం ఆనందంగా గడుస్తుంటుంది. మేము సక్రమమైన మార్గంలోనే నడుస్తున్నామ’ని భావిస్తుంటారు. వారు చేసే పనులను అల్లాహ్ ఇష్టపడుతున్నాడని అనుకుంటుంటారు. అందుకనే వారి జీవితాలు బాగున్నాయని భావిస్తారు. ఆచారాలను పాటిస్తున్న కొద్ది వారి మొక్కుబడులు తీరుతున్నాయని భావించి షిర్క్ ఊబిలో చిక్కుకుని పోతుంటారు. అల్లాహ్ అప్పుడప్పుడు బాగా సడలింపు ఇచ్చి ఒక్కసారిగా పట్టుకుంటాడు.

కనుక ముస్లిములు చాలా జాగ్రత్తగా ఉండాలి. అల్లాహ్ కు భయపడుతూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో మానవుడు షిర్క్ లో పడిపోతాడు. దైవేతరులను మొక్కుకుంటాడు. అల్లాహ్ దాసులకు తప్పించుకునే ఏ అవకాశమూ వదలిపెట్టకుండా చేయడం కోసం అతని మొక్కులు పూర్తిచేస్తుంటాడు. కాని అతను తాను నిజమైన మార్గంలోనే ఉన్నానని, దైవేతరులను మొక్కుకోవచ్చని, అందుకే తన మొక్కులు పూర్తవుతున్నాయని భావిస్తాడు. కనుక మొక్కులు తీర్చబడటాన్ని నమ్మకండి. దాని మూలంగా సత్య ధర్మాన్ని అంటే ఏకదైవారాధనను విడిచి పెట్టకండి. మనిషి ఎంత నీచుడైనా, పాపాత్ముడైనా, అశ్లీలవంతుడైనా, పరుల సొమ్ము కాజేస్తున్నా, మంచి చెడుల మధ్య బేధం చూపించక పోయినా సరే అతను షిర్క్ చేసే వారి కంటే, దైవేతరులను విశ్వసించే వారి కంటే మేలైన వాడు. ఎందుకంటే షైతాన్ ఆ విషయాలు పక్కనపెట్టించి ఈ విషయం నేర్పుతాడు.[*]

[*] ఈ వివరణ ద్వారా షిర్క్ ఎంత తీవ్రమైన పాపమో స్పష్టమవుతుంది. షిర్క్ చేయకుండా పాపాలు చేయొచ్చన్న ఉద్దేశమూ సరికాదు.

15. విగ్రహాల ప్రదక్షిణ

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘ దౌస్ తెగ స్త్రీలు, జులఖలసహ్ విగ్రహ ప్రదక్షిణ చేయనంత వరకు ప్రళయం సంభవించదు.’ (హదీసు గ్రంథాలు బుఖారి 7116 ముస్లిం: 2906)

అరబ్బులో “దౌస్” అనే ఒక తెగ ఉండేది. అజ్ఞాన కాలంలో (ఇస్లాంకు ముందు) వారికొక విగ్రహం ఉండేది. దాన్ని ‘జుల్ ఖలసహ్’ అనే వారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాలంలో దాన్ని కూల్చారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) భవిష్యవాణి తెలుపుతూ ప్రళయ సమీప కాలంలో ప్రజలు ఆ విగ్రహాన్ని మళ్లీ విశ్వసించడం మొదలెడతారనీ, దౌస్ మహిళలు దాని ప్రదక్షిణలు చేస్తారని అన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు వారు ప్రదక్షిణలు చేస్తుండడం కానవచ్చింది.

దీని ద్వారా తెలిసేదేమిటంటే కాబా గృహం తప్ప వేరే గృహాల ప్రదక్షిణ చేయడం అవిశ్వాస ఆచారం.

సారాంశం

1-2. అల్లాహ్ తన గౌరవార్థం కొన్ని పనులు నిర్ణయించి వాటిని ప్రవక్తల ద్వారా దాసులకు నేర్పించాడు: ఉదాహరణకు: నమాజ్, రోజా, జకాత్, హజ్, సహాయం కోరడం, మొక్కుకోవడం, నమ్మకం, ప్రేమ, భీతి మొదలగునవి వీటిని ఆరాధనలు అంటారు. ఇవన్నీ అల్లాహ్ కోసమే చేయాలి.

3. సాష్టాంగపడటం (సజ్దా ) సృష్టికర్త హక్కు. సృష్టితాలకు ఏ రకంగా సాష్టాంగపడ్డా అది షిర్క్ అవుతుంది. గత షరీఅత్ లు (ధార్మిక శాసనాలు) రద్దుచేయబడ్డాయి.

4. మురీద్ లు, ముర్షద్ లు (గురువులు, పండితులు, శిష్యులు) కేవలం అల్లాహ్ నే విశ్వసించాలి. మరియు ఆయనపై ఆశ ఉంచడం తప్పనిసరి. ఆయన తన ఏకత్వం, దైవత్వం, ప్రభుతలో అద్వితీయుడు. ఆయన గౌరవార్థం ప్రత్యేకించబడిన ఆదేశాలను ఆయన కోసమే పాటించాలి.

5. అల్లాహ్ తన గౌరవార్థం ఏ స్థలాలనయితే దైవ చిహ్నాలుగా నిర్ణయించాడో అక్కడకే వెళ్ళాలి. తాను సూచించిన విధంగానే గౌరవించాలి. ఆ స్థలాలు కాకుండా వేరే చోట్లకు వెళ్ళడం, అక్కడకు వెళ్ళి భక్తి చాటడం షిర్క్ అవుతుంది.

6. పంది, రక్తం, మృత జంతువు, దైవేతరుల పేర వదిలిపెట్టిన జంతువులు, వస్తువులు కూడా అధర్మం (హరాం) అపవిత్రం. అవి చేసేవారు, చేయించేవారు వాటిలో పాల్గోనేవారు బహుదైవారాధకులు.

7. అధికారం కేవలం అల్లాహ్. ఆయన తిరుగులేని అధికారి. మిగతా వారందరూ నిరాధారులు, కల్పించబడ్డవారు మాత్రమే.

8. సర్వాధికారం అల్లాహ్ కు మాత్రమే ఉంది. సృష్టితాలకు ఇలాంటి బిరుదులుంటే అవి కల్పితాలు మాత్రమే. అధికారం కేవలం అల్లాహ్ కే కలదు. కనుక పుణ్యాత్ముల ఆదేశానికంటే అల్లాహ్ ఆదేశానికే ప్రాధాన్యతనివ్వాలి.

9. ఎవడయితే అల్లాహ్ చట్టానికి బదులు దాసులు చట్టాలను అనుసరిస్తాడో, ఖుర్ఆన్, హదీసుల మరియు సహబాల అనుసరణకు బదులు ఇమాముల (నాయకుల) వ్యాఖ్యలకు ప్రాధాన్యతనిస్తాడో, ప్రవక్తల షరీఅత్ (ధర్మశాసనాలను) కల్పితాలుగా భావిస్తాడో వాడు ముష్రిక్ అయిపోతాడు. ఎందుకంటే నిజమైన అధికారి అల్లాహ్ యే. మరియు ప్రవక్తలు కేవలం సందేశహరులు మాత్రమే. “ఖుర్ఆన్, హదీసులు మరియు సహబాల అనుసరణ మాత్రమే గీటురాయి.”

10. ప్రజలను గౌరవార్థం ఎవరి ముందయినా ముందు నిలుచోబెట్టటం షిర్క్ (బహుదదైవారాధన) అవుతుంది. ఎందుకంటే గౌరవార్థం ఎవరి ముందయినా నిలుచోవడ మంటే అది అల్లాహ్ కోసమే ప్రత్యేకించబడింది. ఉదాహరణకు నమాజు.

11. విగ్రహాలను శిల్పాలను ఆరాధించడం బహుదైవారాధన. ముస్లిములు వాటిని ఆరాధించడం ప్రళయ సూచన.

12. దైవేతరుల పేర నిర్ణయించిన జంతువు, దైవేతరుల పేర బలిచ్చిన జంతువు రెండూ నిషిద్ధం. ఇది బహుదైవారాధనా కార్యం.

13. ప్రళయ సూచనల్లోని ఒక విషయం ఏమిటంటే ముస్లిములు ఖుర్ఆన్, హదీసు సహబాల అనుసరణను విడిచిపెట్టి తాతముత్తాతల బహుదైవారాధన ఆచారాలను పాటిస్తూ, మక్కా ముష్రిక్కుల మాదిరిగా షిర్క్ (బహుదైవారాధన) కు పాల్పడతారు.

14. ప్రళయ సూచనల్లో మరో విషయం ఏమిటంటే; ఆవగింజంత విశ్వాసమున్న వాడూ అంతమవుతాడు. దుర్మార్గులు, దుష్టులు మిగిలి ఉంటారు. వారు షైతాన్ ధర్మాన్ని అవలంబిస్తారు. తద్వారా వారు ప్రాపంచిక లబ్ది పొందుతారు. దాని వల్ల వారు ఘోర షిర్క్ (బహుదైవారాధన)లో లీనమయిపోతారు.

15. ఒకవేళ బహుదైవారాధనా ఆచారాలతో కోరికలు మరియు వరములు పూర్తి అవ్వుతే అవి కేవలం ఎదురు వాదనకు దిగకుండా ఉండడానికి అల్లాహ్ కల్పించిన సౌకర్యం మాత్రమే. అవి ఒక పరీక్ష కూడాను. దాని పర్యవసానం శాశ్వత నరకం మాత్రమే. ఎందుకంటే మొక్కుబడులు తీరడం, తీరకపోవడం సత్యధర్మం కోసం ‘ప్రమాణం’ (ఆధారం) కాదు.

16. దైవగృహం (బైతుల్లాహ్) వద్ద కాకుండా వేరే చోట ప్రదక్షిణ చెయ్యడం అవిశ్వాసంతో కూడిన ఆచారం. ఇది కూడా ప్రళయ సూచనే.

ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

  1. “ఆరాధన”ను నిర్వచించండి?
  2. స్వయంకల్పిత ఆచారాలను, షిర్క్ ను, వాటి రకాలను వివరించండి?
  3. ప్రళయ సమీప సూచనల్లో కొన్నింటిని వ్రాయండి?

తప్పొప్పులను గుర్తించండి

  1. అల్లాహ్ ను వదలి దైవేతరులను మొరపెట్టుకోవడం సమ్మతము ( )
  2. దైవేతరుల పేరు మీద జంతువును జిబహ్ చెయ్యడం, దైవేతరులపై ప్రమాణాలు చేయ్యడం షిర్క్ అవుతుంది ( )
  3. గౌరవార్ధం ప్రజలను నిలుచోబెట్టి ఉంచడం ధర్మసమ్మతము. ( )
  4. అధికారం కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందుతుంది. ( )

ఖాళీలను పూరించండి

  1. ప్రళయ సూచనల్లో ఒక సూచన ప్రజలు తమ తాత ముత్తాతల ………… ………………… వైపు మరలుతారు.
  2. విగ్రహాల, సమాధుల ప్రదక్షిణ చేయడం ……………………..
  3. దైవ చిహ్నాలు కేవలం…………………………….. కోసం సమ్మతం.

ఈ అధ్యాయంలోని ఖుర్ఆన్ సూక్తులు, హదీసుల ద్వారా మానవుడు ప్రాపంచిక విషయాల్లో అనేక పనుల ద్వారా తనకు అల్లాహ్ మీద గల భక్తి ప్రపత్తులను ప్రకటిస్తాడు. ఇలాంటి వ్యవహారం దైవేతరుల విషయంలో చేయకూడదని అవి నిరూపిస్తాయి.

1. షైతాను కలతలు

إِن يَدْعُونَ مِن دُونِهِ إِلَّا إِنَاثًا وَإِن يَدْعُونَ إِلَّا شَيْطَانًا مَّرِيدًا لَّعَنَهُ اللَّهُ ۘ وَقَالَ لَأَتَّخِذَنَّ مِنْ عِبَادِكَ نَصِيبًا مَّفْرُوضًا وَلَأُضِلَّنَّهُمْ وَلَأُمَنِّيَنَّهُمْ وَلَآمُرَنَّهُمْ فَلَيُبَتِّكُنَّ آذَانَ الْأَنْعَامِ وَلَآمُرَنَّهُمْ فَلَيُغَيِّرُنَّ خَلْقَ اللَّهِ ۚ وَمَن يَتَّخِذِ الشَّيْطَانَ وَلِيًّا مِّن دُونِ اللَّهِ فَقَدْ خَسِرَ خُسْرَانًا مُّبِينًا يَعِدُهُمْ وَيُمَنِّيهِمْ ۖ وَمَا يَعِدُهُمُ الشَّيْطَانُ إِلَّا غُرُورًا أُولَٰئِكَ مَأْوَاهُمْ جَهَنَّمُ وَلَا يَجِدُونَ عَنْهَا مَحِيصًا

వారు అల్లాహ్‌ను వదలి స్త్రీలను మొరపెట్టు కుంటున్నారు. వాస్తవానికి వారసలు పొగరుబోతు షైతానును మొరపెట్టు కుంటున్నారు.అల్లాహ్‌ వాణ్ణి శపించాడు. షైతాను ఇలా అన్నాడు: “నీ దాసుల నుండి నేను నిర్ణీత భాగాన్ని పొంది తీర్తాను. వారిని దారి నుంచి తప్పిస్తూ ఉంటాను. వారికి ఉత్తుత్తి ఆశలు చూపిస్తూ ఉంటాను. పశువుల చెవులు చీల్చమని వారికి పురమాయిస్తాను. అల్లాహ్‌ సృష్టిని మార్చమని వారిని ఆదేశిస్తాను.” వినండి! అల్లాహ్‌ను వదలి షైతానును తన స్నేహితునిగా చేసుకున్నవాడు స్పష్టంగా నష్టపోయినట్లే.వాడు వారికి వట్టి వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. ఆశలు కలిగిస్తూ ఉంటాడు. కాని షైతాను వారితో చేసే వాగ్దానాలన్నీ మోసపూరితమైనవే.ఇటువంటి వారు చేరుకోవలసిన స్థలం నరకం. ఇక వారికి దాన్నుంచి తప్పించుకునే మార్గం ఏదీ ఉండదు. (దివ్యఖుర్ఆన్ 4: 117–121)

దైవేతరులను మొరపెట్టుకునేవారు వాస్తవానికి స్త్రీల పూజారులు. కొందరు నూకాలమ్మ, మర్యమ్మ, పోచమ్మ, ఉప్పలమ్మ, మైసమ్మ, కోటసత్తమ్మ, బషీరమ్మ, బతుకమ్మ, నంగాలమ్మ, సమక్క, సారలమ్మ ఇంకా ఎందరో దేవతలను, అమ్మవారిని మరియు కాళీని పూజిస్తుంటారు. ఇవన్నీ కేవలం కల్పితాలు మాత్రమే. వారికి ఎటువంటి వాస్తవం లేదు. అవన్నీ షైతాన్ కల్పించిన దురాలోచనలు మాత్రమే. వాటినే వారు దైవాలుగా భావిస్తున్నారు. ఈ కల్పిత దైవాలు చూపించేవి, చెప్పేవి అంతా షైతాన్ ఆడుతున్న నాటకం.

ముష్రిక్కులు(బహుదైవారాధకులు) చేస్తున్న ఆరాధనలన్నీ షైతాన్ కోసమే. వారు దేవతలను మొక్కుకుంటున్నామని అనుకుంటున్నారు. వాస్తవానికి వారు షైతాన్ ను మొక్కుకుంటున్నారు. ఈ విషయాల వల్ల ప్రాపంచిక ప్రయోజనం ఉండదు. ధార్మిక ప్రయోజనమూ ఉండదు. ఎందుకంటే షైతాన్ బహిష్కరించబడినవాడు. ఇతని వల్ల ధార్మిక ప్రయోజనం ఏ కోశానా లేదు. ఎందుకంటే షైతాన్ మానవుడి బద్ధ శత్రువు. అలాంటివాడు మానవుడికి మేలు జరగాలని ఎలా కోరుకుంటాడు? అతను అల్లాహ్ ముందు, ‘నేను నీ దాసులను దారి మళ్ళించి నా దాసులుగా చేసుకుంటాను, నన్నే విశ్వసించేలా వారి మనసుల్ని మార్చేస్తాను, వారు నా పేర జంతువులను జిబహ్ చేస్తారు. వారిపై నా కోసం మొక్కుకున్న గుర్తులుంటాయి. ఉదాహరణకు: జంతువుల చెవులను కోస్తారు. వారి మెడలో దండలేస్తారు. వారి నొసటిపై గోరింటాకు రాస్తారు. నోట్లో డబ్బు పెడతారు. వాటి వల్ల చాలా స్పష్టంగా అది మొక్కుకోబడిన జంతువని ఇట్టే అర్థమవుతుంది. నా ప్రభావం వల్ల నీవు ఇచ్చిన రూపాన్ని కూడా మార్చుకుంటారు. దేవతల పేర కేశాలు కత్తిరించకుండా అలాగే వదలిపెడతారు. చెవులు, ముక్కులు కుట్టించు కుంటారు. గడ్డాలు తీయించుకుంటారు. కనుబొమ్మలు తీయించుకుని నిరుపేదల్లా కనబడేలా చేస్తాను’ అన్నాడు.

ఇవన్నీ షైతాన్ కార్యాలే. ఇవన్నీ ఇస్లాం ధర్మానికి విరుద్ధం. కరుణామయుడైన అల్లాహ్ ను వదలి, శత్రువైన షైతాన్ మార్గాన్ని అవలంబించినవాడు స్పష్టమైన మోసంలో పడిపోయాడు. ఎందుకంటే షైతాన్ దురాలోచనలు రేపడం తప్ప మరేమీ చేయలేడు. అబద్ధాలతో, వాగ్దానాలతో మానవుణ్ణి మోసపుచ్చుతాడు. ఫలానా పని చేస్తే ఫలానా మంచి జరుగుతుంది. ఇన్ని డబ్బులుంటే చాలు అందమైన తోటను తయారు చేసుకోవచ్చు. సుందరమైన భవనాన్ని నిర్మించుకోవచ్చు అని ఆశలు రేకెత్తిస్తాడు. కాని ఆ కోరికలు తీరవు. కనుక మానవుడు ఆందోళన చెంది అల్లాహ్ ను విస్మరించి ఇతరులను మొరపెట్టుకుంటాడు. కాని అతని అదృష్టంలో ఉన్నదే జరుగుతుంది. వారిని నమ్మడం వల్ల ఒరిగేది ఏమీలేదు. ఇవన్నీ షైతాన్ రేపే కలతలు. ఇది అతని కుట్ర. అతని మాటలు విని మానవుడు షిర్క్ లో చిక్కుకుంటాడు. ఎంత ప్రయత్నించినా షైతాన్ ఉచ్చునుండి విముక్తి పొందలేకపోతాడు. చివరికి నరకానికి పాత్రుడవుతాడు. ఈ విషయాలు తెలిసిన తరువాత స్పృహ కలిగి తప్పించుకోనే ప్రయత్నం చేసి అల్లాహ్ అనుగ్రహంతో రక్షించబడిన వాడు తప్ప.

2. సంతానం విషయంలో షిర్క్ వైపు తీసుకుపోయే దురాచారాలు

هُوَ الَّذِي خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ وَجَعَلَ مِنْهَا زَوْجَهَا لِيَسْكُنَ إِلَيْهَا ۖ فَلَمَّا تَغَشَّاهَا حَمَلَتْ حَمْلًا خَفِيفًا فَمَرَّتْ بِهِ ۖ فَلَمَّا أَثْقَلَت دَّعَوَا اللَّهَ رَبَّهُمَا لَئِنْ آتَيْتَنَا صَالِحًا لَّنَكُونَنَّ مِنَ الشَّاكِرِينَ فَلَمَّا آتَاهُمَا صَالِحًا جَعَلَا لَهُ شُرَكَاءَ فِيمَا آتَاهُمَا ۚ فَتَعَالَى اللَّهُ عَمَّا يُشْرِكُونَ

ఆ అల్లాహ్ యే మిమ్మల్ని ఒకే ప్రాణి (వ్యక్తి) నుంచి పుట్టించాడు. మరి అతని నుండే అతని జంటను కూడా సృష్టించాడు. అతను ఆమె ద్వారా ప్రశాంతతను పొందటానికి! ఆ తరువాత అతను తన సహధర్మచారిణితో సమాగమం జరపగా ఆమె ఒక తేలికైన భారం దాల్చింది (గర్భవతి అయింది). ఆమె ఆ భారాన్ని మోసుకుంటూ తిరిగేది. మరి భారం అధిక మైనప్పుడు భార్యా భర్తలిరువురూ తమ ప్రభువైన అల్లాహ్ ను, ‘నీవు గనక మాకు ఏ లోపమూ లేని బిడ్డను ప్రసాదిస్తే మేము నీకు తప్పకుండా కృతజ్ఞులమై ఉంటామ’ని ప్రార్థించసాగారు. మరి అల్లాహ్ వారికి (ఏ లోపమూ లేని) బిడ్డను ప్రసాదించాడుగానీ, ఆ ప్రసాదితంలో వారిద్దరూ ఆయనకు భాగస్వాముల్ని కల్పించటం మొదలెట్టారు. వారు చేసే ఈ భాగస్వామ్య చేష్టలకు అల్లాహ్ అతీతుడు, ఉన్నతుడు. (దివ్యఖుర్ఆన్ 7:189-190)

మొదట్లోనూ అల్లాహ్ యే మానవుణ్ణి సృష్టించాడు. అతనికి భార్యనిచ్చాడు. ఇద్దరిలో ప్రేమను పుట్టించాడు. వారికి సంతానం కావాలని కోరిక కలిగినప్పుడు వారు అల్లాహ్ తో వేడుకున్నారు: తమకు ఆరోగ్యవంతులైన మంచి సంతానం కలిగితే తాము అల్లాహ్ కు కృతజ్ఞులమై ఉంటామని ఆశిస్తారు. వారి కోరిక ప్రకారమే వారికి సంతానం కలుగుతుంది. కాని అప్పుడు వారు దైవేతరులను విశ్వసిస్తారు. వారినే మొక్కుకోవడం ప్రారంభిస్తారు. సంతానాన్ని ఆస్థానాల వద్దకు, సమాధుల వద్దకు తీసుకెళ్తారు. వారి పేర వెంట్రుకలు విడిచి పెడతారు. మెడల్లో మాలలు వేసుకుంటారు. చేతులకు కడియాలు [*] ధరిస్తారు. కొందరి పేర బైరాగులు అవుతారు. పేర్లు కూడా షిర్క్ పేర్లు పెట్టుకుంటారు. ఉదాహరణకు : గంగా దాస్ (గంగానదికి దాస్యం చేసేవాడు), మదీనా, సయాద్ బాజీ, జాన్ షహీదా, యాదగిరి, పీరా, మీరాన్, జమునా దాస్ (యమునా నదికి దాస్యం చేసేవాడు) మొదలగునవి. అల్లాహ్ కు ఇలాంటి మ్రొక్కు బడులతో ఎలాంటి సంబంధం ఉండదు. కాని ఈ అవివేకులు ఇలా చేయటం వల్ల వారి నుండి విశ్వాసం దూర మవుతూ ఉంటుంది.

3. వ్యవసాయ వ్యవహారాలలో షిర్క్ దురాచారాలు

وَجَعَلُوا لِلَّهِ مِمَّا ذَرَأَ مِنَ الْحَرْثِ وَالْأَنْعَامِ نَصِيبًا فَقَالُوا هَٰذَا لِلَّهِ بِزَعْمِهِمْ وَهَٰذَا لِشُرَكَائِنَا ۖ فَمَا كَانَ لِشُرَكَائِهِمْ فَلَا يَصِلُ إِلَى اللَّهِ ۖ وَمَا كَانَ لِلَّهِ فَهُوَ يَصِلُ إِلَىٰ شُرَكَائِهِمْ ۗ سَاءَ مَا يَحْكُمُونَ

అల్లాహ్ సృష్టించిన పంట పొలాలలో నుంచి, పశువులలో నుంచి వీళ్లు కొంత భాగాన్ని అల్లాహ్ కోసం నిర్ధారించారు. పైపెచ్చు ‘ఇది అల్లాహ్ భాగం, ఇది మేము నిలబెట్టిన సహవర్తుల భాగం’ అని స్వయంగా తామే తీర్మానించుకుని చెబుతారు. సహవర్తుల కోసం నిర్ధారించిన భాగం అల్లాహ్ కు ఎలాగూ చేరదు. కాని అల్లాహ్ కోసం నిర్ధారించినది మాత్రం వారు నిలబెట్టిన సహవర్తులకు ఇట్టే చేరిపోతుంది. వారి ఈ తీర్పు ఎంత ఘోరమైనది? (దివ్యఖుర్ఆన్ 6: 136)

ధాన్యాన్ని, జంతువులను అల్లాహ్ యే పుట్టిస్తున్నాడు. ముష్రిక్కులు (బహుదైవా రాధకులు) అందులో నుంచి అల్లాహ్ కు భాగం తీసినట్టు దైవేతరుల కోసం కూడా భాగం తీస్తారు. దైవేతరుల భాగం తీసేటప్పుడు ఎంత మర్యాదగా వ్యవహరిస్తారో అల్లాహ్ విషయంలో అంత గౌరవంగా వ్యవహరించరు.

4. పశువుల వ్యవహారాలలో షిర్క్ కు గురిచేసే దురాచారాలు

وَقَالُوا هَٰذِهِ أَنْعَامٌ وَحَرْثٌ حِجْرٌ لَّا يَطْعَمُهَا إِلَّا مَن نَّشَاءُ بِزَعْمِهِمْ وَأَنْعَامٌ حُرِّمَتْ ظُهُورُهَا وَأَنْعَامٌ لَّا يَذْكُرُونَ اسْمَ اللَّهِ عَلَيْهَا افْتِرَاءً عَلَيْهِ ۚ سَيَجْزِيهِم بِمَا كَانُوا يَفْتَرُونَ

‘ఈ కొన్ని పశువులు, పంట పొలాలు అందరికీ సమ్మతం కావు. మేము కోరిన వారు తప్ప ఇతరులెవరూ వాటిని తినడం సమ్మతం కాదు’ అని వారు తమంతట తాముగా కల్పించుకొని చెబుతారు. కొన్ని పశువులపై స్వారీ చేయడం, వాటి ద్వారా బరువు లాగించడం నిషేధించబడింది (అని అంటారు). మరికొన్ని పశువులపై (జిబహ్ చేసే సమయంలో) వారు అల్లాహ్ పేరు ఉచ్చరించరు. అల్లాహ్ కు అబద్ధాన్ని అంటగట్టడానికి గాను (వారు ఇలా చేస్తారు). వారు కల్పించే ఈ అబద్ధాలకుగాను త్వరలోనే అల్లాహ్ వారికి దాని ప్రతిఫలం ఇస్తాడు. (దివ్యఖుర్ఆన్ 6:138)

కొందరు తమ అభిప్రాయాన్ని తెలుపుతూ ఫలానా వస్తువు అస్పృశ్యమైనది. అది ఫలానా వ్యక్తి మాత్రమే తినాలి అంటారు. మరికొందరు కొన్ని పశువులపై భారాన్ని మోపకుండా, వాటిపై స్వారీ అవ్వకుండా మొక్కుబడి పశువులని, వీటిని గౌరవించాలని అంటుంటారు. మరికొందరు అల్లాహ్ సంతోషిస్తాడని, తమ మొక్కులను తీరుస్తాడని పశువులను దైవేతరుల పేర వదలిపెడతారు. కాని వారు చేస్తున్న పనులు, వారి ఆలోచనలన్నీ అబద్ధం. దానికిగాను వారికి తప్పకుండా శిక్ష లభిస్తుంది.

مَا جَعَلَ اللَّهُ مِن بَحِيرَةٍ وَلَا سَائِبَةٍ وَلَا وَصِيلَةٍ وَلَا حَامٍ ۙ وَلَٰكِنَّ الَّذِينَ كَفَرُوا يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ ۖ وَأَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ

అల్లాహ్ ‘బహీరా’ను గానీ, ‘సాయిబా’ను గాని, ‘వసీలా’నుగానీ, ‘హామ్’ను గానీ ఏర్పరచలేదు. అయినప్పటికీ అవిశ్వాసులు అల్లాహ్ కు అబద్ధాన్ని అంట గడుతున్నారు. వారిలో చాలామంది అవివేకులు. (దివ్యఖుర్ఆన్ 5: 103)

ఏదైనా పశువును ఎవరి పేరనయినా వదలిపెట్టేటప్పుడు ఆ జంతువుల చెవులకు అచ్చువేసేస్తారు. అలాంటి పశువులను ‘బహీరహ్’ అంటారు. ఆంబోతును ‘సాయిబహ్’ అంటారు. ఏదైనా పశువు విషయంలో దీనికి మగపశువు పుట్టితే దానికి కూడా మొక్కులు ఇచ్చేస్తామని మొక్కుకుంటారు. ఒకవేళ ఆ పశువుకు ఆడ, మగ రెండూ జన్మిస్తే మగపశువును కూడా మొక్కు కోసం ఇవ్వరు. ఇలాంటి దాన్ని ‘వసీలహ్’ అంటారు. ఏదైనా పశువుకు పది పిల్లలు కలిగితే దానిపై స్వారీ చేయడం, వాటిపై బరువు మోయడం లాంటివి చేసేవారు కాదు. వాటిని ‘హామ్’ అంటారు.

ఈ విషయాలు ధార్మిక మైనవి కావు. ఇవి కేవలం ఆచారాలు మాత్రమే.

దీనిద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే, ఏదైనా పశువును ఎవరి పేరనయినా వదలిపెట్టడం, దానిపై అచ్చు వేయడం, ఆవు, మేక, కోడి ఫలానా వారి కోసం మొక్కుబడి అని నిర్ణయిం చడం లాంటి పనులన్నీ అజ్ఞాన ఆచారాలు. షరీఅత్ (ధర్మశాస్త్రాని)కి విరుద్ధమైన పనులు.

5. హలాల్ (ధర్మసమ్మతం), హరాం (నిషిధ్ధం) విషయంలో అల్లాహ్ పై నింద

وَلَا تَقُولُوا لِمَا تَصِفُ أَلْسِنَتُكُمُ الْكَذِبَ هَٰذَا حَلَالٌ وَهَٰذَا حَرَامٌ لِّتَفْتَرُوا عَلَى اللَّهِ الْكَذِبَ ۚ إِنَّ الَّذِينَ يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ لَا يُفْلِحُونَ

ఏ వస్తువునయినా తమ నోటితో ‘ఇది ధర్మసమ్మతం’ అని, ‘ఇది నిషిద్ధమనీ’ ఇష్టమొచ్చినట్లు అబద్ధం చెప్పేసి, అల్లాహ్ కు అబద్ధాలు ఆపాదించకండి. అల్లాహ్ కు అబద్ధాలు ఆపాదించేవారు సాఫల్యాన్ని పొందలేరు. (దివ్యఖుర్ఆన్ 16:116)

మీకు మీరే హలాల్ హరాంలను నిర్ణయించకండి. అది అల్లాహ్ గొప్పతనం. అలా నిర్ణయించడం వల్ల అల్లాహ్ కు అబద్ధాలు ఆపాదించినవారవుతారు. ‘ఫలానా పని ఇలా చేస్తే బాగుండేది అలా చేయకపోవడం వల్లనే అది పాడయిపోయింది’ అని భావించడం తప్పు. ఎందుకంటే వాస్తు, ముహూర్తాల ద్వారా అల్లాహ్ కు అబద్ధాలు ఆపాదించి మానవుడు సాఫల్యం పొందలేడు. ముహర్రం మాసంలో కిల్లీ (పాన్) తినకూడదు, ఎర్ర దుస్తులు ధరించకూడదు, వివాహ సమయాల్లో ఫలానా ఆచారాలు పాటించడం, దుఃఖ సమయాల్లో ఫలానా ఆచారాలు పాటించడం తప్పనిసరి, భర్త చనిపోయిన తర్వాత భార్య వివాహం చేసుకోకూడదు, వివాహాలకు వెళ్ళకూడదు, పచ్చడి చేయ కూడదు, ఫలానా వ్యక్తి నీలి దుస్తులు ధరించకూడదు, ఫలానా వ్యక్తి ఎర్ర దుస్తులు ధరించకూడదు. ఇలాంటి విశ్వాసాలు, భావనలన్నీ షిర్క్. ముష్రిక్కులు అల్లాహ్ గొప్పతనంలో జోక్యం చేసుకుంటున్నారు. తమ ధర్మాన్ని వేరుగా ఏర్పరచుకుంటున్నారు.

6. నక్షత్రాల వల్ల లాభనష్టాలు జరుగుతాయని భావించడం షిర్క్ (బహుదైవారాధన)

జైద్ బిన్ ఖాలిద్ జుహనీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, ఒక రోజు హుదైబియ్య రాత్రి వర్షం కురిసింది. ఆ రోజు ఉదయం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఫజ్ర్ నమాజ్ చేయించారు. నమాజ్ పూర్తయిన తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహాబాలనుద్దేశించి, ‘మీ ప్రభువు ఏమన్నాడో తెలుసా?’ అని ప్రశ్నించారు. సహచరులు ‘అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు’ అని సమాధానం ఇచ్చారు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు: “నా దాసులు ఉదయం కొందరు విశ్వాసులుగానే ఉన్నారు. కాని కొందరు అవిశ్వాసులయ్యారు. అల్లాహ్ అనుగ్రహం వల్ల, అతని కరుణ వల్ల వర్షం కురిసిందన్న వారు నన్ను విశ్వసిం చారు. నక్షత్రాలను తిరస్కరించారు. ఫలానా నక్షత్రం[*] వల్ల వర్షం కురిసిందనేవారు నక్షత్రాలను విశ్వసించారు. నన్ను తిరస్కరించారు.’ (హదీసు గ్రంథాలు బుఖారి, హదీస్ : 846, ముస్లిం, హదీస్ : 71)

విశ్వంలో సృష్టితాల ప్రభావం ఉందని భావించేవారిని అల్లాహ్ తన తిరస్కారులుగా పరిగణిస్తాడు. అలాంటి వారు నక్షత్ర పూజారులు. విశ్వమంతా అల్లాహ్ ఆదేశం మేరకు నడుస్తుందనే వారు అల్లాహ్ ప్రియదాసులు. శుభ ఘడియలు (ముహూర్తాలు), దుర్ఘడియలు(శకునాలు) ఉన్నాయని విశ్వసించడం, మంచి చెడు రోజులున్నాయని నమ్మడం, జ్యోతిష్కుల మాటలను విశ్వసించడం వల్ల షిర్క్ ద్వారాలు తెరుచు కుంటాయి. ఎందుకంటే నక్షత్రాలను విశ్వసించడం జ్యోతిష్కుల పని.

7. “జ్యోతిష్కుడు”, “ మాంత్రికుడు” “తాంత్రికుడు” కాఫిరులే.

ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘భౌతిక విజ్ఞాన విద్య వదలి అల్లాహ్ ప్రస్తావించని జ్యోతిష్య విద్య నేర్చుకున్నవాడు జాల విద్యలో ఒక భాగం నేర్చుకున్నాడు. ప్రతీ జ్యోతిష్కుడు తాంత్రికుడే. ప్రతి తాంత్రికుడు మంత్రగాడే. మరియు ప్రతి మంత్రగాడు అవిశ్వాసి అవుతాడు.’ దివ్య ఖుర్ఆన్లో నక్షత్రాల ప్రస్తావన ఉంది. వాటి ద్వారా అల్లాహ్ సామర్థ్యం, కార్యదీక్ష తెలుస్తుంది. వాటివల్లనే ఆకాశం అందంగా కానవస్తుంది. వాటి ద్వారానే షైతానులను తరిమి తరిమి కొట్టడం జరుగుతుంది. కాని వాటి ద్వారా విశ్వంలో జోక్యం జరగడంగాని, లాభనష్టాల ప్రభావం పడటంగాని జరగదు. అలాంటప్పుడు ఎవరయినా నక్షత్రాల ప్రయోజనాలను విడిచిపెట్టి, అజ్ఞానకాలంలో (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాకముందు) జ్యోతిష్కులు, మాంత్రికులు, జిన్నులను అడిగి అగోచర విషయాలు తెలిపే మాదిరిగా జ్యోతిష్కులు నక్షత్రాల ద్వారా తెలుసుకుని చెప్పే మాదిరిగా, నక్షత్రాల ద్వారానే ప్రపంచం నడుస్తుందని చెప్పేవారు అగోచర విషయాలు తెలుసని ప్రకటించే వారి మార్గం మాంత్రికుల, జ్యోతిష్కుల, తాంత్రికుల మార్గం ఒక్కటే. మంత్రగాళ్లు, జ్యోతిష్కుల మాదిరిగా జిన్నులతో స్నేహం చేస్తారు. వారిని అనుసరించకుండా జిన్నులతో స్నేహం ఏర్పడదు. వారిని మొరపెట్టుకోవడం, నైవేద్యం సమర్పించడం వల్లనే స్నేహం ఏర్పడుతుంది.

కనుక ఇవన్నీ షిర్క్, తిరస్కార విషయాలు. అల్లాహ్ ముస్లిములను షిర్క్ నుండి రక్షించుగాక! ఆమీన్.

8. “జోతిష్య”, సంఖ్య శాస్త్రంపై విశ్వసించే పాపం

మాతృమూర్తి హఫ్సహ్ (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: “జ్యోతిష్కుని దగ్గరికి వెళ్లి సమాచారం అడిగే వారి నలభై రోజుల నమాజు స్వీకరించబడదు. “ (హదీసు గ్రంథం ముస్లిం, హదీస్ 2230)

అంటే ఎవరయినా తనకు అగోచర విషయాలు తెలుసని ప్రకటించుకుంటే, అలాంటి వ్యక్తి దగ్గరకు వెళ్లి ఏదైనా అడిగితే అతని నలభై రోజుల ఆరాధన స్వీకరించ బడదు. ఎందుకంటే అతను షిర్క్ చేశాడు. షిర్క్ ఆరాధనా జ్యోతిని ఆర్పుతుంది. జ్యోతి ష్కుడు, తాంత్రికుడు, శకునాలు చూసేవాడు అందరూ జ్యోతిష్కులుగానే పరిగణించ బడతారు.

9. శకునము మరియు సగినము చూడటం కుఫ్ర్ ఆచారాలు

ఖుత్న్ బిన్ ఖబీసహ్ ఉల్లేఖించారు: ఆయన ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘శకునాలు చూడటం కోసం పక్షులను ఎగుర వేయడం, గవ్వలు వేయడం,[*] దుశ్శకునంగా భావించటం కుఫ్ర్ పని’. (హదీసు గ్రంథం అబూదావూద్, హదీస్ నెం. 3907)

[*] పక్షులను ఎగురవేసేవారు లేదా జింకను వదలిపెట్టేవారు, అది కుడి వైపు వెళ్తే శుభంగా, ఎడమ వైపు వెళ్తే అశుభంగా భావించి పని చేయకుండా వదలిపెట్టేవారు. అదే విధంగా రాళ్ళు కొట్టి లేదా ఇసుక మీద గీతలు గీసి శకునాలు చూసేవారు.

హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: “శకునాలు చూడటం షిర్క్, శకునాలు చూడటం షిర్క్, శకునాలు చూడటం షిర్క్”. (హదీసు గ్రంథం అబూ దావూద్, హదీస్ నెం. 3910)

అరబ్ లో శకునాలు చూసే సంప్రదాయం ఉండేది. వారు శకునాలను బాగా నమ్మేవారు. అందుకనే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘షిర్క్’ అని అనేక సార్లు నొక్కి చెప్పారు. ప్రజలు దానికి దూరంగా ఉండాలని ఆదేశించారు.

సఅద్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘గుడ్లగూబ (శకునం) కాదు, అల్లాహ్ నిర్ణయించకుండా ఒకరి వ్యాధి ఇంకొకరికి సోకదు. ఏ వస్తువులోనూ అశుభం లేదు. ఒకవేళ ఎందులోనైనా అశుభం అనేది ఉంటే అది స్త్రీ, ఇల్లు, గుర్రంలో ఉండేది.’ (‘హదీసు గ్రంథం అబూదావూద్, హదీస్ నెం. 3921)

అరబ్బుల్లో ఓ వింతైన మూఢ నమ్మకం ఉండేది. హతుని ప్రతీకారం తీర్చుకోక పోతే అతని పుర్రెలోనుండి గుడ్లగూబ బయటికొచ్చి ఫిర్యాదు చేస్తూ తిరుగుతుంటుందని వారు విశ్వసించేవారు. దీనినే ‘హామ్‘ అంటారు. ఈ విషయం నిరాధారమైనదని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు. పునర్జన్మకు ఎలాంటి ఆధారాలు లేవని దీని ద్వారా తెలుస్తుంది.

గజ్జి, కుష్ఠు రోగం లాంటి కొన్ని వ్యాధులు ఒకరి నుండి మరొకరికి సోకుతాయని అరబ్బులు భావించేవారు. అది కూడా అవాస్తవమని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారు. అదే విధంగా కొందరు, మసూచి సోకిన వారి వద్దకు పిల్లలను పంపకుండా దూరంగా ఉంచుతారు. వ్యాధికి తనకు తనుగా అంటుకొనే శక్తి ఉందని భావించడం తిరస్కారానికి సంబంధించిన ఆచారమే. అంటే అల్లాహ్ ఆదేశం లేనిదే ఒకరి వ్యాధి దానంతట అదే మరొకరికి సోకుతుందని నమ్మకూడదు. ఎందుకంటే అల్లాహ్ ఆదేశంతోనే రోగాలు వస్తాయి. కాని వైద్య పరంగా జాగ్రత్తలు వహించడంలో తప్పులేదు.

ఫలానా పని ఫలానా వ్యక్తి చేస్తే అశుభం అనీ, అది అచ్చిరాదని ప్రజల్లో ఒక భావన ఉంది. ఇందులో కూడా వాస్తవం లేదని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హితబోధ చేశారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా బోధించారు: మూడు విషయాలు ప్రభావితం చేయగలవు. ఇల్లు, గుర్రం మరియు స్త్రీ.[*] ఇవి కొన్ని ప్రత్యేకమైన రకాలలో అశుభంగా నిరూపితమవ్వొచ్చు. కాని ప్రజల్లో చలామణి అయివున్న శకునాలు అశుభాలు మాత్రం కావు.

ఒకవేళ కొత్త ఇల్లుగానీ, గుర్రంగానీ కొంటే లేదా కొత్తగా వివాహం చేసుకుంటే వారి విషయంలో మేలు చేయమని అల్లాహ్ ని అర్థించాలి. వాటి కీడు నుండి అల్లాహ్ శరణు వేడుకోవాలి. ఇతర విషయాల్లో ఫలానా పని కలిసొచ్చింది. ఫలానా పని కలిసి రాలేదు అని భావించకూడదు.

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘అంటూ లేదు, గుడ్ల గూబ శకునము లేదు, సఫర్ (మాసంలో అవి ఇవి చేయకూడదని) లేదు. ‘ (హదీసు గ్రంథం బుఖారి, హదీస్ నెం.5770)

అరబ్బులు జువుల్ కల్బ్ (కుక్క ఆకలి) అనే వ్యాధి సోకిన వారి గురించి అతని కడుపులో ఏదో ఆపద దూరిందని, అది అతని కడుపులోని ఆహారాన్ని తింటుందని, అందువల్ల అతని కడుపు నిండడం లేదని భావించేవారు. అదొక భూతమతి దాని పేరు ‘సఫర్‘ అని ప్రతీతి. అదంతా కల్పన అని, అది భూతం కాదని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారు.

దీని ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే, రోగాలు దేవీ దేవతల వల్ల సంభవించవు. కొందరు పొంగు అమ్మోరు వంటి రోగాలు ఫలానా వలన సంభవించాయని భావిస్తారు. ఉదాహరణకు- సతలా, అమ్మోరు, నూకాలమ్మ, మసానీ, బరాహీ [*] మొదలగునవి. కాని అది వాస్తవం కాదు. అజ్ఞాన కాలంలో (మహాప్రవక్త రాక ముందు) సఫర్ మాసాన్ని అశుభంగా భావించేవారు. ఆ మాసంలో పనులు చేసేవారు కారు. ఆ నెలలో ఆపదలు అవతరిస్తాయని భావించేవారు. అదంతా అవాస్తవం. అదే విధంగా ఏదైనా వస్తువును, తేదీని, రోజును, ఘడియను అశుభంగా భావించడం కూడా షిర్క్ అవుతుంది.

జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుష్ఠు రోగి చేయి పట్టుకుని దాన్ని తనతోపాటు పాత్రలో పెట్టి ‘అల్లాహ్ పై నమ్మకముంచి తిను’ అన్నారు. (హదీసు గ్రంథాలు అబూదావూద్, హదీన్: 3925; తిర్మిజీ, హదీస్ నెం. 1817; ఇబ్నెమాజ హదీస్ నెం. 3546) అంటే అల్లాహ్ పై మనకు నమ్మకం ఉండాలి. ఆయన తాను తలచుకున్న వారిని అస్వస్థతకు గురి చేస్తాడు, తాను తలచుకున్న వారికి ఆరోగ్యాన్నిస్తాడు. ఎవరితోనైనా కలిసి తినడానికి శంకించకూడదు. వారితో కలిసి తినడం వల్లనే వ్యాధి సోకుతుందని భావించకూడదు.

10. అల్లాహ్ ను సిఫారసుదారునిగా చేయకండి

జుబైర్ బిన్ ముత్ యిమ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు ఒక గ్రామస్తుడు వచ్చి ‘ప్రజలు ఆపదలో ఉన్నారు, పిల్లలు ఆకలితో నకనకలాడుతున్నారు. తగినంత ధనం లేదు, పశువులు చనిపోతున్నాయి, వర్షం పడాలని మీరు మా కోసం అల్లాహ్ కు దుఆ చేయండి. అల్లాహ్ వద్ద మేము మిమ్మల్ని సిఫారసు దారుడ్ని చేయాలను కుంటున్నాము, మీ వద్ద అల్లాహ్ ను సిఫారసుదారుడ్ని చేయాలనుకుంటున్నాము’ అని విన్నవించుకున్నాడు. అందుకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), “అల్లాహ్ పరమ పవిత్రుడు! అల్లాహ్ పరమ పవిత్రుడు! అని చాలా సేపు అల్లాహ్ పవిత్రతను చాటారు. సహాబాల ముఖాలపై దాని ప్రభావం పడటం గమనించారు. తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: అమాయకుడా! అల్లాహ్ ఎవరి వద్దా సిఫారసు చేయడు. ఆయన గొప్పతనం వారి కంటే గొప్పది, ఉన్నతమైంది. అమాయకుడా! అల్లాహ్ అంటే ఎవరో నీకు తెలుసా? ఆయన సింహాసనం ఆకాశంపై ఎలాగుందంటే (వేళ్లను గోపురం మాదిరిగాచేసి) ఆయన వల్ల అది విలవిలలాడుతుంది. ఒంటె వీపుపై ప్రయాణించే వాని భారం వల్ల పల్లకి విలవిలలాడినట్టు.” (హదీసు గ్రంథం అబూదావూద్, హదీస్ నెం. 4726)

ఒకసారి అరేబియా దేశంలో క్షామం ఏర్పడింది. వర్షాలు పడటం ఆగిపోయాయి. ఒక గ్రామస్తుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చి ప్రజల దీనావస్థను వివరించాడు. అల్లాహ్ ను వేడుకోమని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను కోరాడు. అక్కడితో ఆగకుండా ‘మీరు అల్లాహ్ వద్ద సిఫారసు చేయాలని, అల్లాహ్ మీ వద్ద సిఫారసు చేయాలని కోరుకుంటున్నాం’ అన్నాడు. ఆ మాట విని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ భీతితో, భయంతో కంపించిపోయారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) నోటిపై అల్లాహ్ కీర్తి వచనాలు వెలువడ్డాయి. అల్లాహ్ ఔన్నత్యం వల్ల సభికుల ముఖాలపై వస్తున్న మార్పు స్పష్టంగా కనిపించింది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ గ్రామస్తుడికి అర్థమయ్యేలా వివరించారు: “అధికారమంతా అల్లాహ్ చేతుల్లోనే ఉంది. ఒకవేళ అల్లాహ్ ఎవరి సిఫారసు అయినా స్వీకరిస్తే అది ఆయన అనుగ్రహమే. కాని ప్రవక్త వద్ద అల్లాహ్ ను సిఫారసు దారునిగా చేయడం అంటే ప్రవక్తకు అధికారం అంటగట్టడం, అతన్నే యజమానిగా భావించడం అన్నమాట. కాని అది అల్లాహ్ గొప్పతనం. ఇక ముందు ఇలాంటి మాటలు మాట్లాడకు.”

అల్లాహ్ ఔన్నత్యం అద్వితీయం. ప్రవక్తలు, ఔలియాలు ఆయన ముందు చాలా చిన్నవారు. ఆయన సింహాసనం భూమ్యాకాశాలను ఆవరించి ఉంది. సింహాసనం అంత పెద్దదయినప్పటికీ అల్లాహ్ ఔన్నత్యం వల్ల దాన్ని మోయలేక విలవిలలాడుతుంది.

ఆయన ఔన్నత్యం సృష్టితాల ఊహకు కూడా అందదు. తమ భావాల ద్వారా ఆయన ఔన్నత్యాన్నీ వివరించలేరు. ఆయన పనిలో జోక్యం చేసుకోలేరు. ఆయన సామ్రాజ్యంలో కూడా జోక్యం చేసుకోలేరు. సైన్యం, మంత్రులు, అధికారులు లేకుండానే ఆయన కోటానుకోట్ల పనులు చేస్తాడు. అలాంటప్పుడు ఆయన ఒకరి వద్దకు వచ్చి సిఫారసు ఎందుకు చేస్తాడు? ఆయన ముందు అధికారం చేసే ధైర్యం ఎవరికుంది? అల్లాహ్ పరమ పవిత్రుడు!

ఒక సామాన్య గ్రామస్తుడి నోటి నుండి వెలువడిన మాటవల్ల మానవులందరిలో అత్యున్నతుడు అయిన మానవులు, అల్లాహ్ ప్రియ దాసులైన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దైవభీతితో హడలెత్తి భూమ్యాకాశాల్లో ఉన్న అల్లాహ్ ఔన్నత్యాన్ని కీర్తించడం మొదలు పెట్టారు. అలాంటప్పుడు అల్లాహ్ తో స్నేహం, బంధుత్వం కలిపే వారి పరిస్థితిని, ఆలోచించకుండా మితిమీరి మాట్లాడేవారి గురించి ఏం చెప్పమంటారు? ఒకడు నేను దేవుణ్ణి ఒక రూపాయికి కొన్నాను అంటాడు, ఇంకొకడు నేను దేవుడికంటే రెండు సంవత్సరాలు పెద్దవాణ్ణి అంటాడు. నా అల్లాహ్ నా కాలి రూపంలో కంటే వేరే రూపంలో వస్తే నేనెప్పుడూ అతణ్ణి చూడను అని మరొకడంటాడు. ఇంకొకడు నా హృదయం ముహమ్మద్ ప్రేమలో గాయమైంది. నేను నా ప్రభువుతో సాన్నిహిత్యాన్ని కలిగి వుంటాను అంటాడు. అల్లాహ్ ను ప్రేమించు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో జాగ్రత్తగా ఉండు అని మరొకడు. ఇంకొందరయితే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను దైవత్వం కంటే గొప్పగా చెబుతుంటారు.

అల్లాహ్ శరణు వేడు కుంటున్నాను! అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను!! ఈ ముస్లిములకు ఏమయింది? పవిత్ర ఖుర్ఆన్ ఉన్నప్పటికీ వీరి బుద్ధులపై తెరలెందుకు పడ్డాయి? ఏమిటీ ఈ వక్ర మార్గాలు? అల్లాహ్ మమ్మల్ని అందర్నీ రక్షించుగాక. అల్లాహ్ మమ్మల్ని అందర్నీ రక్షించుగాక!! ఆమీన్.

ఎవరో చాలా చక్కగా పేర్కొన్నారు:
“మర్యాద ప్రసాదించమని మేము అల్లాహ్ ను కోరుతున్నాము. అమర్యాదస్థులు అల్లాహ్ అనుగ్రహాన్ని పొందలేరు.”

కొందరు ఈ వాక్యం పలుకుతుంటారు. “ఓ అబ్దుల్ ఖాదిర్ జీలానీ! అల్లాహ్ కోసం మా మొక్కుబడులను స్వీకరించు.” ఇలా అనడం స్పష్టమైన షిర్క్.

అల్లాహ్ ముస్లింలను ఇలాంటి వాటి నుండి రక్షించుగాక! ఆమీన్! షిర్క్ ప్రస్ఫుటమయ్యే, అమర్యాద కలిగించే మాటలు నోటి నుండి వెలువడనివ్వకండి. అల్లాహ్ ఎంతో గొప్పవాడు. నిత్యం ఉండే శక్తివంతుడైన చక్రవర్తి. చిన్న పొరపాటును పట్టుకోవడం లేదా క్షమించి వదలిపెట్టడం ఆయన చేతిలోనే ఉంది. అలాంటిది అమర్యాదగా మాట్లాడటం, ఆ తర్వాత అలా మాట్లాడలేదనడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే అల్లాహ్ పొడుపు కథలకు అతీతుడు. ఎవరయినా పెద్దవారితో పరాచి కాలాడితే ఎంత చెడుగా భావిస్తాం? చక్రవర్తితో పరిహాసమాడడం సమంజసమా?.

11. అల్లాహ్ కు అత్యంత ఇష్టమైన పేర్లు

ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘అబ్దుల్లాహ్, అబ్దుర్రహ్మాన్ అనే పేర్లు అల్లాహ్ కు ఎంతో ఇష్టం.’ (హదీసు గ్రంథం ముస్లిం హదీస్ నెం. 2136)

“అల్లాహ్ దాసుడు”, “రహ్మాన్ దాసుడు” చాలా చక్కనైన పేర్లు. అదే విధంగా అబ్దుల్ ఖుద్దూస్, అబ్దుల్ జలీల్, అబ్దుల్ ఖాలిఖ్, ఇలాహీ బఖ్ష్, మొదలగు పేర్లు కూడా మంచివే. వీటివల్ల అల్లాహ్ తో ఉన్న సంబంధం స్పష్టమవుతుంది.

12. అల్లాహ్ పేర్లతో ఉపనామాలను జోడించకండి

షురైహ్ తన తండ్రి హానీ (రదియల్లాహు అన్హు) ద్వారా పేర్కొన్నారు: నేను నా తెగ బృందంతో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చాను. నన్ను నా మిత్రులు ‘అబుల్ హకమ్'(ఆదేశించేవాని తండ్రి) అని పిలుస్తారని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) విన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నన్ను పిలిచి ఇలా ఉపదేశించారు: “ఆదేశించేవాడు అల్లాహ్ యే. ఆయనే ఆదేశించగలడు. నీకు అబుల్ హకమ్ (ఆదేశించేవాని తండ్రి) అని ఉపనామం ఎవరు పెట్టారు?”” (హదీసుగ్రంథం అబూదావూద్, హదీస్ నెం. 4945)

ప్రతి తీర్పులో న్యాయం చేయడం, వివాదాలను పరిష్కరించడం అల్లాహ్ గొప్ప తనం. పరలోకంలో అది స్పష్టమవుతుంది. అక్కడ ముందు వెనుక జరిగిన అన్ని పోట్లాటలు పరిష్కరించబడతాయి. ఈ శక్తి సృష్టితాలకు లేదు. కనుక అల్లాహ్ గొప్ప తనాన్ని చాటే పదాలు దైవేతరుల కోసం ఉపయోగించకూడదు. ఉదాహరణకు: చక్రవర్తులకు చక్రవర్తి (షెహన్ షా) అని అల్లాహ్ నే అనాలి. ఆయనే విశ్వలోకాలకు ! ప్రభువు. ఆయన తలచుకుంది చేస్తాడు. ఈ పదం అల్లాహ్ ఔన్నత్యం చాటడం కోసం చెప్పడం జరుగుతుంది. అదే విధంగా నిరపేక్షాపరుడు, వివేకవంతుడు, ఆరాధ్యుడు వంటి పదాలన్నీ అల్లాహ్ ఔన్నత్యాన్ని చాటుతాయి.

13. కేవలం “అల్లాహ్ తలిస్తే ” అనండి

    హుజైఫహ్(రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు: “అల్లాహ్ మరియు ముహమ్మద్ (సల్లల్లహు అలైహి వ సల్లం) తలిస్తే అని అనకండి. “కేవలం ఒక్కడైన అల్లాహ్ తలిస్తే” అని అనండి.” (హదీసు గ్రంథం షర్హ్ సున్నహ్, 3391)

    దైవత్వంలో సృష్టితాల జోక్యానికి తావులేదు. అతను ఎంతటి పెద్దవాడైనా, అత్యంత సన్నిహితుడయినాసరే. ఉదాహరణకు: అల్లాహ్ మరియు దైవప్రవక్త (సల్లల్లహు అలైహి వ సల్లం) తలిస్తే ఫలానా పని జరిగిపోతుంది అనకూడదు. ఎందుకంటే ప్రపంచమంతా అల్లాహ్ ఆదేశం మేరకు నడుస్తుంది. ప్రవక్త (సల్లల్లహు అలైహి వ సల్లం) తలచుకుంటే ఏమీ అవదు. ఫలానా వ్యక్తి మనసులో ఏముంది? ఫలానా వ్యక్తి వివాహం ఎప్పుడు జరుగుతుంది? ఫలానా చెట్టుకు ఎన్ని ఆకులున్నాయి? ఆకాశంలో ఎన్ని నక్షత్రా లున్నాయి? అని ఎవరయినా అడిగితే, ‘అల్లాహ్ మరియు ప్రవక్తకే తెలుసు’ అని సమాధానమివ్వకూడదు. ఎందుకంటే అగోచర విషయాలు అల్లాహ్ కు మాత్రమే తెలుసు. ప్రవక్తగారికి తెలియదు. ధార్మిక విషయాల్లో అలా అనడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే అల్లాహ్ తన ప్రవక్తకు ధర్మానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుపుతాడు. ప్రజలు తమ ప్రవక్తకు విధేయులై మెలగాలి.

    14. దైవేతరులపై ప్రమాణం చేయడం షిర్క్ (బహుదైవారాధన)

      ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచిస్తుండగా నేను విన్నాను. ‘దైవేతరుల మీద ప్రమాణం చేసినవాడు షిర్క్ చేశాడు.’ (హదీసుగ్రంథం తిర్మిజీ, హదీస్ నెం: 1535)

      అబ్దుర్రహ్మాన్ బిన్ సమురహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘విగ్రహాల మీద ప్రమాణం చేయకండి, ఇంకా తండ్రుల మీద కూడా ప్రమాణం చేయకండి.’ (హదీసుగ్రంథం ముస్లిం, హదీస్ నెం: 1648)

      ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా హితబోధ చేశారు: “తండ్రులపై, తాతలపై ప్రమాణం చేయకూడదని అల్లాహ్ మిమ్మల్ని. వారిస్తున్నాడు. ప్రమాణం చేయాలనుకున్నవాడు అల్లాహ్ పై ప్రమాణం చేయాలి. లేదంటే మౌనం వహించాలి.” (హదీసు గ్రంథం బుఖారి, హదీస్ నెం: 1646)

      అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు: “ఎవరయితే (తొందరపాటుతో) లాత్, ఉజ్జహ్ (ప్రాచీన అరబ్బుల విగ్రహాల)పై ప్రమాణం చేశాడో అతను ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అని పలకాలి.” (హదీసు గ్రంథం బుఖారి, హదీస్ : 6650), (హదీసుగ్రంథం ముస్లిం హదీస్ 1649)

      అజ్ఞాన కాలం (ప్రవక్త రాక పూర్వం)లో విగ్రహాల మీద ప్రమాణం చేసేవారు. ఎవరయినా ముస్లిం షరీఅత్ కు విరుద్ధంగా విగ్రహాలపై ప్రమాణం చేస్తే, అతను వెంటనే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ పఠించి ఏక దైవారాధనను ధృవీకరించాలి.

      దీని ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే; అల్లాహ్ తప్ప మరి దేనిపైనా ప్రమాణం చేయకూడదు. ఒకవేళ పొరపాటుగా దైవేతరులపై ప్రమాణం చేస్తే వెంటనే తౌబా చేసుకోవాలి. ముష్రిక్కుల దేవతలపై ప్రమాణం చేస్తే విశ్వాసంలో అవరోధం ఏర్పడుతుంది.

      15 మ్రొక్కుబడుల గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తీర్పు

        సాబిత్ బిన్ జహ్హాక్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాలంలో ఒక వ్యక్తి బవానా [*] వెళ్ళి ఒంటెను జిబహ్ చేస్తానని మొక్కుకున్నాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చి తన మ్రొక్కు గురించి తెలిపాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహాబాలను ఉద్దేశించి, ‘అజ్ఞాన కాలంలోని ఆస్థానాలేమైనా అక్కడ ఉన్నాయా? అని ప్రశ్నించారు. సహాబాలు ‘లేవు’ అని సమాధాన మిచ్చారు. ‘అక్కడ పండుగలేమైనా జరుపుతారా?’ అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మళ్లీ అడిగారు. ‘లేదు’ అని సమాధానం ఇచ్చారు సహాబాలు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘నీ మ్రొక్కును తీర్చుకో. ఎందుకంటే అల్లాహ్ కు అవిధేయత తెలిపే మొక్కులను తీర్చడం నిషిద్ధం.’ (హదీసుగ్రంథం అబూ దావూద్, హదీస్ 3313)

        అల్లాహ్ తప్ప ఇతరులకు మొక్కుకోవడం పాపం. అలాంటి మ్రొక్కులను పూర్తి చేయకూడదు. ఎందుకంటే అలా మ్రొక్కుకోవటమే పాపం. అలాంటప్పుడు మ్రొక్కుబడి తీర్చుకోవడం మరీ పాపం. మరో విషయం ఏమిటంటే; దైవేతరుల పేర బలిచ్చే ప్రాంతాల్లో, దైవేతరుల పూజలు చేసే చోట లేదా అందరూ కలిసి షిర్క్ చేసే ప్రదేశాల్లో అల్లాహ్ పేరున మ్రొక్కుకున్న పశువులను కూడా తీసుకెళ్ళకూడదు. అలాంటి వాటిల్లో పాలుపంచు కోకూడదు. సదుద్దేశం ఉన్నా, దురుద్దేశం ఉన్నాసరే. ఎందుకంటే వాటిల్లో పాల్గొనడం కూడా పాపమే.

        16. సజ్దహ్ (సాష్టాంగం) కేవలం అల్లాహ్ కొరకే మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను గౌరవించండి

          ఆయిషహ్ (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం, ఒకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముహాజిర్ల, అన్సార్ల సమూహంతో పాటు ఉన్నారు. ఒక ఒంటె ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చి సజ్దహ్ చేసింది (సాష్టాంగపడింది). అప్పుడు సహాబాలు, ‘ఓ ప్రవక్తా! మీకు పశువులు, వృక్షాలు కూడా సజ్దహ్ చేస్తున్నాయి. మీకు సజ్దహ్ చేయడంలో వాటి కంటే మాకే ఎక్కువ హక్కు ఉంది’ అని విన్నవించుకున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘మీ ప్రభువును ఆరాధించండి. మీ సోదరుణ్ణి గౌరవించండి’ (హదీసు గ్రంథం ముస్నద్ అహ్మద్ 76/86)

          మానవులందరూ పరస్పరం సోదరుల్లాంటి వారు. అందరి కంటే పెద్దవారు పెద్ద సోదరుల్లాంటి వారు. వారిని గౌరవించండి. అందరి యజమాని, ప్రభువు అల్లాహ్ మాత్రమే. ఆయన్నే ఆరాధించాలి. దీని ద్వారా తెలిస్తున్న విషయం ఏమిటంటే, అల్లాహ్ సన్నిహితులు ప్రవక్తలు, ఔలియాలు అందరూ నిస్సహాయులే. అల్లాహ్ వారికి ఔన్నత్యం ప్రసాదించాడు. కనుక మనకు సోదరుల్లాంటివారయ్యారు. వారికి విధేయులై ఉండమని మనల్ని ఆదేశించడం జరిగింది. ఎందుకంటే మన స్థాయి వారికంటే చిన్నది. కనుక వారిని మానవుల మాదిరిగానే గౌరవించాలి. వారిని దేవుళ్ళను చేయకూడదు. కొందరు పుణ్యాత్ములను చెట్లు, జంతువులు కూడా గౌరవిస్తాయి. కనుక కొన్ని దర్గాల వద్దకు పులులు, ఏనుగులు, తోడేళ్ళు వస్తుంటాయి. మానవులు వాటితో పోటీ పడకూడదు. అల్లాహ్ తెలిపిన విధంగానే వారిని గౌరవించాలి. హద్దులు మీరి ప్రవర్తించకూడదు. ఉదాహరణకు : ముజావర్లుగా మారి సమాధుల వద్ద ఉండటం షరీఅత్లో ఎక్కడా లేదు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ముజావర్ల (దర్గా యజమానులు) అవతారం ఎత్తకూడదు. మనుషులు జంతువులను చూసి అనుకరించడం సమంజసం కాదు.

          ఖైస్ బిన్ సఅద్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: నేను హీరా నగరానికి వెళ్లాను. అక్కడి ప్రజలు తమ రాజుకు సాష్టాంగపడటం నేను చూశాను. నిశ్చయంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సజ్దహ్ చేయబడటానికి ఎక్కువ అర్హులు అని మనసులో అను కున్నాను. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరకు వెళ్ళి ‘నేను హీరాలో ప్రజలను రాజుకు సజ్దహ్ చేస్తుండగా చూశాను. వాస్తవానికి మా సజ్దాలకు మీరే ఎక్కువ హక్కు దారులు’ అని అన్నాను. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘ఒకవేళ నువ్వు నా సమాధి దగ్గర నుండి వెళితే దానిపై సజ్దహ్ చేస్తావా? అని ప్రశ్నించారు. ‘లేదు’ అని సమాధాన మిచ్చాను. అయితే ‘అలా చేయకు’ అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హితబోధ చేశారు. (హదీసు గ్రంథం అబూ దావూద్, హదీస్ 2140)

          ఏదో ఒకరోజు నేను మరణించి సమాధి ఒడిలో నిద్రపోతాను.[*] అలాంటప్పుడు నేను సజ్దహ్ చేయబడటానికి ఎలా అర్హుణ్ణి కాగలను. నిత్యుడు అయిన అల్లాహ్ యే సజ్దహ్ కు అర్హుడు. కనుక బతికున్న వాడికిగానీ, చనిపోయిన వానికి గానీ సజ్దహ్ చేయ కూడదు. సమాధికిగానీ, ఆస్థానంలో కూడా సజ్దహ్ చేయకూడదు. ఎందుకంటే బతికున్న వారు ఏదో ఒక రోజు చనిపోతారు. చనిపోయినవారు కూడా ఒకప్పుడు బ్రతికున్నవారే. మనిషి చనిపోయి అల్లాహ్ కాలేడు. దాసునిగానే ఉంటాడు.

          17. ఎవరినైనా “నా దాసుడని” గానీ, “నా దాసి అని” గానీ అనడం సమ్మతం కాదు

            అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు: “మీలో ఎవరూ (ఎవరినీ) ‘నా దాసుడు, నా దాసురాలు’ అని అనకండి. మీరందరూ అల్లాహ్ దాసులు. మీ స్త్రీలందరూ అల్లాహ్ దాసీలే. బానిస తన యజమానిని ‘మౌలా’ (యజమాని) అనకూడదు. ఎందుకంటే మీ అందరి ‘మౌలా’ (యజమాని) అల్లాహ్ మాత్రమే“. (హదీసు గ్రంథం ముస్లిం, హదీస్ : 2249)

            బానిస కూడా ‘నేను ఫలానా వ్యక్తి బానిసను. ఫలానా వ్యక్తి నా యజమాని’ అని సంభాషణ జరపకూడదు. ఒకరి బానిసలని చెప్పుకోకుండా, అబ్దున్నబీ (నబిదాసుడు), బన్ద అలీ (అలీ దాసుడు), బన్ద హుజూర్ (ప్రవక్త దాసుడు), ప్రత్యేక పూజారి, కనక పూజారి, పీర్ల పూజారి అని చెప్పించుకోవడం, ప్రతి ఒక్కరిని దేవుడనడం, దాత అనడం, స్వామి అనడం, వృధాప్రేలాపన. చాలా పెద్ద తప్పు. చిన్న చిన్న విషయాలకు భయపడి ‘నువ్వు నా ప్రాణానికి, ధనానికి యజమానివి, మాపై అధికారం నీదే, ఏమైనా చేసుకో’ అని అనడం కూడా షిర్క్ గా పరిగణించడం జరుగుతుంది.

            18. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను గౌరవించే విధానం

              ఉమర్(రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: “క్రైస్తవులు ఈసా (అలైహిస్సలాం) విషయంలో మితిమీరిపోయినట్టు మీరు నా శ్రీ విషయంలో మితిమీరకండి. నేను కేవలం అల్లాహ్ దాసుడిని మాత్రమే. మీరు ‘నన్ను అల్లాహ్ దాసుడు, దైవప్రవక్త అని అనండి.” (హదీసుగ్రంథం బుఖారి, హదీస్ 3445) .

              అంటే; అల్లాహ్ నాకు ప్రసాదించిన గొప్పతనం, ఔన్నత్యాలు అన్నీ నన్ను దాసుని, ప్రవక్త పరిధులకే పరిమితం చేస్తాయి. ఒక మానవుడికి దైవదౌత్యం లభించడం కంటే అధికస్థాయి ఇంకేముంటుంది? అన్ని స్థానాలు దాని తరువాతే. కాని మానవుడు ప్రవక్త అయినప్పటికీ మానవునిగానే ఉంటాడు. దాసునిగా ఉండటమే అతనికి శోభాయ మానం. ప్రవక్త అయినంత మాత్రాన మనిషిలో దైవత్వమంతటి గొప్పతనం రాదు. అల్లాహ్ అస్తిత్వంలో కలవలేడు. మానవుడ్ని మానవాళి స్థానంలోనే ఉంచండి. క్రైస్తవుల మాదిరిగా అయిపోకండి. వారు ఈసా (అలైహిస్సలాం)ని మానవ పరిధిని దాటించి దైవత్వ కిరీటాన్ని అలంకరించారు. దాని వల్ల వారు తిరస్కారులయ్యారు. అల్లాహ్ ఆగ్రహం వారిపై అవతరించింది. అందుకనే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సమాజం వారి నుద్దేశించి ‘క్రైస్తవుల మాదిరిగా ప్రవర్తించకండి. నన్ను పొగడటంలో మితిమీరకండి. లేదంటే అల్లాహ్ ఆగ్రహానికి పాత్రులవుతారు’ అని హితబోధ చేశారు. అయినప్పటికీ సమాజంలోని కొంతమంది మూర్ఖులు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హితబోధను పట్టించుకోలేదు. క్రైస్తవుల మాదిరిగానే ప్రవర్తించారు. ఈసా (అలైహిస్సలాం) అల్లాహ్ రూపంలో అవతరించారని క్రైస్తవులు అనేవారు. ఆయన ఒక విధంగా మానవుడు మరో విధంగా అల్లాహ్ అనేవారు.

              కొందరు అతివాదులు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) విషయం లోనూ ఇలాగే వ్యవహరించారు. ఇలా అన్నారు: ‘ప్రతి కాలంలో అల్లాహ్ ప్రవక్తల రూపంలో వస్తాడు. చివరిగా ఆయన అరబ్బు రూపంలో వచ్చాడు. వచ్చి అక్కడి చక్రవర్తి అయ్యాడు.’ మరి కొందరు ఇలా అన్నారు: “ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆధునికులు కూడాను. పూర్వీకులూను. సాధ్యులు, అసాధ్యులు కూడాను”. లాహౌల వలాఖువ్వత ఇల్లా బిల్లాహ్. అల్లాహ్ ముస్లిములకు జ్ఞానాన్ని ప్రసాదించుగాక! ఆమీన్.

              కొందరు అబద్ధాలకోరులు ఒక హదీసును వక్రీకరించి వారే దాన్ని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఆపాదించి ‘నేను స్తోత్రాలకు అర్హుడిని’ [*] అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పినట్లు పేర్కొన్నారు. అలాంటిదే ఒక సుదీర్ఘమైన అరబీ సంపుటానికి ‘ఖుత్బతుల్ ఇఫ్తి ఖార్ ‘ అని పేరు పెట్టి దాన్ని అలీ (రదియల్లాహు అన్హు)కి అన్వయించారు. ఎంత పెద్ద అపనింద!

              ఓ ప్రభూ! నువ్వు అన్ని షిర్క్ ల నుండి పవిత్రుడివి. నీపై తీవ్ర నింద మోప బడింది ఓ ప్రభూ! సత్యాన్ని వ్యాపింపజేయి. అబద్ధాలకోరులకు తగిన శాస్తి జరిగేలా చూడు. ఆమీన్!

              ఈసా (అలైహిస్సలాం) ఇహపరాలలో అధికారం కలవారని క్రైస్తవులు విశ్వసిస్తారు. వారిని విశ్వసించి వారిని అర్థించే వారు అల్లాహ్ ను ఆరాధించవలసిన అవసరం లేదు. పాపాలు అతని విశ్వాసంలో అడ్డంకి కాజాలవు. అతను హలాల్, హరాంలలో ఎలాంటి వ్యత్యాసం పాటించవలసిన అవసరం ఉండదు. అతను అల్లాహ్ ఆంబోతులా తిరుగుతాడు. అతనికి ఇష్టమొచ్చినట్టు చేయవచ్చు. ఈసా (అలైహిస్సలాం) పరలోకంలో అతనికి సిఫారసు చేసి దైవశిక్ష నుండి కాపాడుతారు. అజ్ఞానులైన ముస్లిములు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) విషయంలో కూడా ఇలాంటి విశ్వాసాలనే కలిగి వున్నారు. అంతే కాదు ఇమాములు, ఔలియాల విషయంలోనూ ఇలాంటి నమ్మకాన్ని కలిగిఉన్నారు. ప్రతి పండితుల, గురువుల విషయంలోనూ వారి విశ్వాసం అలాంటిదే. అల్లాహ్ వారికి రుజుమార్గం చూపుగాక!

              ముతర్రిఫ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ షిఖీర్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు: నేను బనూ ఆమిర్ తెగవారి బృందంతో పాటు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సేవలో హాజరయ్యాను. మేము ఆయనతో ‘మీరే మా యజమాని’ అన్నాము. అందుకు ఆయన ‘యజమాని అల్లాహ్ మాత్రమే’ అన్నారు. అప్పుడు మేము ‘మాలో మీరు ఉత్తములు, గొప్పవారు, దాత [*] కూడాను’ అన్నాము. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘అవును! ఇందులో కొన్ని లేదా అన్ని మాటలు అనొచ్చు. కాని షైతాన్ మిమ్మల్ని తప్పుదోవ పట్టించకుండా చూసుకోండి.’ (హదీసు గ్రంథం అబూదావూద్, హదీస్ 4806, ముస్నద్ అహ్మద్ 25/4)

              మహాత్ముల గురించి ఆచితూచి మాట్లాడాలి. వారిని మానవులకు మాదిరిగానే పొగడండి. కొంచెం తక్కువగా పొగడండి. కళ్లెం తెంచుకున్న గుర్రంలా మితిమీరి పొగ డకండి. దైవత్వం గొప్పతనానికే కళంకం కలిగించేలా ప్రవర్తించకండి.

              19. ‘సయ్యిద్’ పదానికి రెండు అర్థాలు

                సయ్యిద్ పదానికి రెండు అర్థాలున్నాయి: (1) స్వయం ప్రతిపత్తి కలవాడు, సంపూర్ణ యజమాని, పాలితుడు కానివాడు, ఏదైనా చేయగలవాడు. ఇవన్నీ అల్లాహ్ గొప్పతనాలు. ఈ అర్థాన్ని బట్టి చూస్తే అల్లాహ్ తప్ప మరెవ్వరూ సయ్యిద్ కాజాలడు. (2) మొదట పాలకుని ఆదేశం అతని వద్ద రావాలి. ఆ తరువాత అతను వేరే వారికి ఆదేశించాలి. ఉదాహరణకు: చౌదరి, భూస్వామి. ఈ అర్థాన్నిబట్టి చూస్తే ప్రతి ప్రవక్త తన సమాజానికి నాయకుడు లాంటివాడు. యోధుడు తన అభిమానులకు, పండితుడు తన శిష్యులకు, ప్రతి మహాత్ముడు తన అనుచరులకు నాయకుడు. వీరు మొదట తాము ఆదేశాలను శిరసావహిస్తూ తమ అనుచరులకు నేర్పతారు. ఈ విధంగా మన ప్రవక్త విశ్వానికి నాయకులు. అల్లాహ్ దృష్టిలో ప్రవక్త (సలల్లాహు అలైహి వ సల్లం) ఉన్నతులు. అందరి కంటే ముందు ఆయన ధర్మాదేశాలకు కట్టుబడి ఉన్నారు. అల్లాహ్ ధర్మాన్ని నేర్చుకోవడంలో ప్రజలకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అవసరం ఎంతైనా ఉన్నది. ఈ విధంగా చూసినా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను విశ్వ నాయకుడు అనవచ్చు. అనాలి కూడా. మొదటి అర్థం ప్రకారం ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను ఒక్క చీమకు నాయకునిగా కూడా భావించకూడదు. ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన తరపు నుండి ఏ విధంగా కూడా చీమపైన అధికారం చేయలేరు.

                20. చిత్రాల గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనాలు

                  ఆయిషహ్ (రరదియల్లాహు అన్హా) కథనం ప్రకారం ఆమె ఒక తివాచీ కొన్నారు. దానిపై చిత్రాలు ఉన్నాయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దాన్ని చూసి తలుపు వద్దనే ఆగి పోయారు. లోపలికి రాలేదు. ఆమె (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: నేను ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముఖంలో అసహ్యతను గమనించాను. నేను ఇలా అన్నాను: ఓ దైవప్రవక్తా! క్షమించండి! నేను ఏం తప్పు చేశాను? ఆయన (సల్లల్లహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: ఈ తివాచీ ఏమిటి? నేను ఇలా అన్నాను: దీన్ని నేను మీకోసం కొన్నాను. మీరు దీని మీద కూర్చుంటారని దిండుగా ఉపయోగించు కుంటారని. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “ఈ చిత్రాలు గీసిన వారికి ప్రళయం రోజు శిక్ష పడుతుంది. వారితో ‘మీరు గీసిన చిత్రాల్లో ప్రాణం పోయండి’ అని అనబడుతుంది. ఇంకా ‘చిత్రపటాలున్న ఇంట్లో దైవదూతలు ప్రవేశించరు’ అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు. (హదీసు గ్రంథం బుఖారీ, హదీస్ : 2105) (హదీసు గ్రంథం ముస్నద్ అహ్మద్ 246/6)

                  అనేక మంది బహుదైవారాధకులు విగ్రహాలను పూజిస్తుంటారు. అందుకనే దైవదూతలకు, ప్రవక్తలకు విగ్రహాలంటే జుగుప్స కలుగుతుంది. అందుచేతనే దైవ దూతలు అలాంటి ఇళ్లల్లో ప్రవేశించరు. బహుదైవారాధనకు సామగ్రి సమకూరుస్తున్నందుకు చిత్రాలు వేసే వారికి శిక్ష పడుతుంది. కనుక ప్రవక్తల, ఇమాముల, వలీల, బాబాల, స్వాముల, మత గురువుల చిత్రాలుగానీ, ఇంకా మరే విధమైన చిత్రాలుగానీ. వేయడం నిషిద్ధం. వాటిని భద్రపరచడం కూడా నిషిద్ధమే. తమ పూర్వీకుల చిత్రాలను గౌరవిస్తూ, వాటిని పవిత్రంగా పదిలపరుచుకున్న వారు స్పష్టమైన మార్గభ్రష్టతలో ఉన్నారు. ప్రవక్తలు దైవదూతలు వారిని అసహ్యించుకుంటారు.

                  ముస్లిము విధి ఏమంటే చిత్రాలను ఇళ్ళల్లో ఉంచుకోకూడదు. అప్పుడే వారి ఇళ్లల్లో కారుణ్య దూతలు అవతరిస్తారు. శుభాలు కలుగుతాయి.

                  21. ఘోరమైన ఐదు పాపాలు

                    అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా విన్నాను, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు, ‘ప్రవక్తను చంపిన వారికి, ప్రవక్త ద్వారా చంపబడిన వారికి, తన తల్లిదండ్రులను హత్య చేసిన వారికి, చిత్రాలు గీసే వారికి, తాను పొందిన విద్య ద్వారా లబ్ది పొందని ఆలిమ్ కు ప్రళయంనాడు అత్యధికంగా శిక్షపడుతుంది. (హదీసు గ్రంథం షుఅబిల్ ఈమాన్ 197/6 నెం. 7888)

                    చిత్రాలు గీసేవాడు కూడా ఘోరమైన పాపాలు చేసేవారిలో ఉన్నాడు. ప్రవక్తను హత్య చేసిన వాడు ఎంత పాపాత్ముడో చిత్రాలు వేసేవాడూ అంతే పాపాత్ముడు.

                    హజ్రత్ అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుండి విన్నాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: నా లాగా సృష్టించడానికి ప్రయత్నించిన వాడి కంటే దుర్మార్గుడు మరొకడు ఉండడు. వారు చిన్న వస్తువైనా, ధాన్యపు గింజయినా, రాగి గింజనయినా సృష్టించి చూపించగలరా? (హదీసు గ్రంథం బుఖారీ హదీస్ : 7559), (హదీసు గ్రంథం ముస్లిం, హదీస్ 2111)

                    చిత్రకారుడు ఒక విధంగా దైవత్వాన్ని ప్రకటించుకుంటున్నాడు. అల్లాహ్ సృష్టిం చిన మాదిరిగా తాను సృష్టించాలనుకుంటున్నాడు. ఇది మహా అపరాధం. చిత్రకారుడు ఒక్క గింజ కూడా సృష్టించలేడు. కానీ కాపీ కొడుతుంటాడు. చిత్రకారులు అల్లాహ్ శాపానికి గురవుతారు.

                    22. తన గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనాలు

                      అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘అల్లాహ్ నాకు ఇచ్చిన స్థానం కంటే ఎక్కువ చేసి చూపకండి. నేను ముహమ్మద్ ని, అబ్దుల్లాహ్ కుమారుణ్ణి. దైవదాసుడిని. ఆయన ప్రవక్తను.[*] (హదీసుగ్రంథం అత్తక్రీద్)

                      ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సమాజం విషయంలో జాలి, కరుణ కలవారు. తన సమాజం ధర్మంపై నిలకడగా ఉండాలని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అహర్నిశలు చింత చెందేవారు. తన అనుయాయులు తనను అమితంగా ప్రేమిస్తారని, తనకు కృతజ్ఞులై ఉంటారని తెలుసు. ప్రేమికుడు తన ప్రియుణ్ణి సంతోష పరచడం కోసం ఏమైనా చేస్తాడని తెలుసు. పొగడ్తలు హద్దులు మీరి అల్లాహ్ గొప్ప తనానికి భంగం కలిగించేవిగా ఉండకూడదు. తద్వారా వారి ధర్మం నాశనమవు తుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అప్రసన్నతకూ పాత్రులవుతారు. అందుకనే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘నాకు అతిశయోక్తి ఇష్టంలేదు’ అన్నారు. నా పేరు ముహమ్మద్. నేను సృష్టికర్తను కాను. ఉపాధి ప్రదాతనూ కాను. నేను మానవులందరి లాగానే ఒక తండ్రి ద్వారా పుట్టాను. దాసునిగా ఉండటంలోనే నా ఔన్నత్యం ఉంది. నేను ప్రజలకు ఒక విషయంలో వేరుగా ఉన్నాను. నాకు అల్లాహ్ ఆదేశాలు తెలుసు. కాని ప్రజలకు తెలియవు. కనుక వారు నా దగ్గర అల్లాహ్ ధర్మం నేర్చుకోవాలి.

                      ఓ మా ప్రభూ! కారుణ్యమూర్తి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై అనుగ్రహాల, శుభాల వర్షం కురిపించు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మా లాంటి జనులకు ధర్మం నేర్పించడం కోసం విపరీతంగా శ్రమించారు. నువ్వే ఆయన విలువను ఎరిగిన వాడివి. ఓ ఉన్నతుడా! మేము నీ నిస్సహాయ దాసులం. మా అధికారంలో ఏమీలేదు. నువ్వు నీ అనుగ్రహాలలో షిర్క్, తౌహీద్ల ల భావాన్ని తెలియ జేశావు. “లా ఇలాహ ఇల్లల్లాహ్” గురించి తెలిపావు. బహుదైవారాధకుల నుంచి తీసి ఏకదైవారాధకునిగా, పవిత్రునిగా చేశావు. అదే విధంగా నీ అనుగ్రహాలతో మాకు బిద్అత్, సున్నత్ ల వాస్తవికత తెలుపు. “ముహమ్మదు రసూలుల్లాహ్”వచనం యొక్క అవసరాలను తెలుపు. బిద్అత్ ల (కొత్త పోకడల) నుండి ముల్ హిదీన్ (నాస్తికుల) నుండి మమ్మల్ని వేరుచేసి ఖుర్ఆన్ హదీసు మరియు సహాబాల పద్ధతికి విధేయులను చెయ్యి. ఆమీన్, సుమ్మ ఆమీన్.

                      వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
                      సకలస్తోత్రాలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే.

                      సారాంశం

                      1. దైవేతర ఆరాధకులు, స్త్రీల పూజారులు వాస్తవానికి షైతాన్ ఆరాధకులు.

                      2. షైతాన్ కలతలలో చిక్కుకుని కొందరు జంతువుల మరియు తమ ఆకారాన్ని పాడు చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద ఆశల్లోపడి, షైతాన్ పన్నాగాలకు చిక్కి నరకవాసులవుతున్నారు. (దివ్యఖుర్ఆన్ 4 : 117-121)

                      3. సంతానం విషయంలో దురాచారాలు మరియు షిర్క్ పేరుల నుండి అల్లాహ్ అతీతుడు. (దివ్యఖుర్ఆన్ 7 : 190)

                      4. ధాన్యాన్ని, జంతువులను కేవలం అల్లాహ్ మాత్రమే సృష్టించాడు. అందులో దైవేతరుల భాగం తీస్తే (అలాంటి విషయంలో) అల్లాహ్ తన భాగంలో నిరపేక్షాపరుడు. (దివ్యఖుర్ఆన్ 6: 136)

                      5. మొక్కుబడుల పేర ఇష్టమొచ్చినట్లు జంతువులను దైవేతరుల పేర వదలి పెట్టడం, వాటిని గౌరవించడం లాంటి వాటిని చేయడం అల్లాహ్ పై నింద మోపడమే. ఇది బహుదైవారాధనా ఆచారం. (దివ్యఖుర్ఆన్ 6:138)

                      6. దురాచారాలు మరియు హలాల్, హరామ్ గా నిర్ణయించబడే ఆచారాలన్నీ అల్లాహ్ పై నిందలు మోపేవే. (దివ్యఖుర్ఆన్ 16:116)

                      7. రాశిఫలాల ప్రభావాలను నమ్మడం, రోజులను శుభము, అశుభమైనవిగా భావించడం, జోతిష్కుల మాటలను విశ్వసించడం వల్ల షిర్క్ (బహుదైవారాధన) ద్వారాలు తెరుచుకుంటాయి.

                      8. జోతిష్కుడు, మంత్రగాడు, తాంత్రికుడు అందరూ తిరస్కారులే. వారి జోలికి వెళ్లేవాడు కూడా తిరస్కారి అవుతాడు.

                      9. విశ్వంపై సృష్టితాల ప్రభావం ఉంటుందని భావించేవాడి మరియు జోతిష్కుడిని విశ్వసించేవారి నలభై రోజుల నమాజు స్వీకరించబడదు.

                      10. శకునాలు చూడటం, ఏదైనా ప్రదేశాన్ని, రోజును, వ్యక్తిని అపశకునంగా భావించడం, రోగాన్ని స్వతహాగానే అంటువ్యాధిగా భావించడం, ఒకరి విషయంలో ఏదైనా పనిని అశుభంగా భావించడం, అంటరానితనం, ఆపదలు అన్నీ బహుదైవారాధనా భావనలే.

                      11. అల్లాహ్ యే అధికారం కలవాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయన సమక్షంలో నిస్సహాయులు. అల్లాహ్ ఔన్నత్వం సృష్టితాల అంచనాలకు అందదు. తమ ఊహాగానాలతో అల్లాహ్ ఔన్నత్యాన్ని ఎవరూ చాటలేరు. ఆయన ఔన్నత్యంతో సింహాసనం (అర్ష్ పీఠం) కూడా కంపిస్తుంది. ఆయన ఏమైనా చేయగలడు. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ వద్ద అనుమతి తీసుకున్న తరువాతే సిఫారసు చేస్తారు. కనుక అల్లాహ్ దైవత్వంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) భాగస్వామ్యం స్ఫురించేలా ఉన్న పదాలు కలిపి ఉపయోగించకూడదు.

                      12. అల్లాహ్ తో సంబంధం స్పష్టమయ్యే పేర్లు ఉత్తమమైన పేర్లు.

                      13. అల్లాహ్ ఔన్నత్యాన్ని చాటే పదాలు వేరే వారి కోసం వినియోగించకూడదు. ఉదాహరణకు: రాజాధిరాజు (షహెన్ షాహ్), అధికారులకు అధికారి మొదలగునవి.

                      14. అల్లాహ్ సొంత గుణాల్లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) భాగస్వామ్యం ప్రస్ఫుటమయ్యే వాక్యాలను కూడా పలుకకూడదు.

                      15. దైవేతరులపై ప్రమాణం చేయడం బహుదైవారాధన. ఒకవేళ అనాలోచితంగా నోటి నుండి వెలువడితే పశ్చాత్తాపం చెందాలి.

                      16. దైవేతరుల పేర మొక్కుకోవడం, ఆస్థానాల వద్ద అల్లాహ్ పేరు మీద బలివ్వడం, తీర్థాలు మొదలగు వాటిల్లో పాల్గొనడం షిర్క్.

                      17. సజ్దహ్ (సాష్టాంగపడటం) అల్లాహ్ కోసం ప్రత్యేకం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను కేవలం గౌరవించాలి. మహాత్ములు బ్రతికున్నా, చనిపోయినా వారిని కేవలం గౌరవించాలి.

                      18. ఎవరినీ ‘నా దాసుడు’ అని అనకండి. దాస్యసంబంధాలను దైవేతరుల కోసం ఆపాదించకండి. మిమ్మల్ని మీరు అన్నీ చేయగల అధికారి, దాత అని అనిపిం చుకోకూడదు.

                      19. క్రైస్తవులకు మాదిరిగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను కీర్తించడంలో అతిశయానికి పాల్పడ కూడదు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) గొప్పతనం దాస్యత్వాన్ని, దైవత్వంలో కలపకూడదు.

                      20. సయ్యిద్ అంటే సర్వాధికారి, స్వయంప్రతిపత్తికలవాడు అని అర్థం. ఇవి అల్లాహ్ సొంత గుణాలు. సయ్యిద్ పదానికి సర్దారు అనే అర్థం కూడా ఉంది. అది సృష్టితాల గుణం.

                      21. చిత్రపటాలను గీయడం, వాటిని శుభప్రదంగా భావించి పెట్టడం వాటిని గౌరవించడం బహుదైవారాధన. అలా చేయడం వల్ల శుభాల దైవదూతలు ఇళ్ళల్లో ప్రవేశించరు.

                      22. చిత్రకారుడు ప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం) హంతకుని మాదిరిగా పాపా త్ముడు. ఎందుకంటే అతను దైవత్వవాది. ధూర్తుడు.

                      23. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దైవదౌత్య స్థాయి కంటే దాస్యత్వ స్థాయినే ఇష్టపడేవారు.

                      ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

                      1. ఆచారాలలో షిర్క్ గురించి రాయండి?

                      2. కొందరు విగ్రహాల పూజారులు. వీళ్ళ వాస్తవికత ఏమిటి?

                      3. వ్యవసాయం మరియు పశువుల వ్యవహారాలలో షిర్క్ ఆచారాలను గురించి వ్రాయండి?

                      4. కొన్ని మొక్కుబడులు పురుషులకు సమ్మతం, మరికొన్ని మొక్కుబడులు స్త్రీలకు సమ్మతం ఇది అల్లాహ్ పై అసత్యాన్ని ఆపాదించడం కాదా? దీన్ని గురించి వివరంగా రాయండి.

                      5. నక్షత్రాలు మనిషిపై లాభనష్టాల ప్రభావం చూపెడతాయా?

                      6. జ్యోతిష్కుడు, మాంత్రికుడు, అవిశ్వాసి గురించి ఇస్లాం ఏం చెబుతుంది?

                      7. జ్యోతిష్కం, ప్రశ్నాశాస్త్రంపై విశ్వసించడం ఎలాంటిది?

                      8. శకునాల గురించి ఇస్లాం ఏం చెబుతుంది?

                      తప్పొప్పులను గుర్తించండి

                      1. అల్లాహ్ పై ప్రమాణం చేసేలాగా ఇతరులపై ప్రమాణం చేయడం షిర్క్ అవుతుంది ( )

                      2. దైవ ఇచ్ఛ, ప్రవక్త ఇచ్ఛ వేరు వేరు ( )

                      3. ప్రవక్తలకు సాష్టాంగం (సజ్దహ్) చేయడం సమ్మతం ( )

                      4. ప్రవక్తలందరూ నిస్సహాయులే ( )

                      5. ఎవరినైనా “దాసుడు” లేదా “దాసి” అనడం సమంజసం ( )

                      ఖాళీలను పూరించండి.

                      1. సయ్యిద్ మొదటి అర్ధం …………. రెండవ అర్థం ……………..

                      2. ఘోరమైన……….. పాపాల్లో ఒకటి……. ……ఉన్నది

                      3. అల్లాహ్ కు అత్యంత ఇష్టమైన పేర్లు (1)………………… మరియు (2)…………….

                      4. జ్యోతిష్యుడు, మాంత్రికుడు, తాంత్రికుణ్ణి నమ్మేవాడు………………….

                      5. శకునాలను నమ్మడం……..

                      << End of the Book >>

                      Book: అఖీదా తౌహీద్ : దేవుని ఏకత్వము (Aqeedah at-Tawheed) – Shaykh Salih Fawzan

                      Aqeedah at-Tawheed - Shaykh Fawzan (telugu)

                      Read / Download PDF Book

                      ప్రవక్త విధేయతే పరమావధి – ఇమామ్ బిన్ బాజ్[పుస్తకం]

                      Following the Sunnah - by Ibn Baz

                      Following the Sunnah is Compulsory [Sunnath par Amal Waajib]
                      సంకలనం : అల్లామ అబ్దుల్లా బిన్ బాజ్ (రహమతుల్లా అలై) (ibn Baz)
                      అనువాదకులు : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
                      ప్రకాశకులు : హదీస్ పబ్లికేషన్స్ ,హైదరాబాద్,ఆంధ్ర ప్రదేశ్,ఇండియా

                      [ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
                      [PDF] [32 పేజీలు] [ఫైల్ సైజు: 1.4 MB] [మొబైల్ ఫ్రెండ్లీ]

                      విషయసూచిక 

                      అన్ని చాఫ్టర్లు PDF లింకులు గా క్రింద ఇవ్వబడ్డాయి. లింక్ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చదవవచ్చు.

                      1. తొలిపలుకులు [1p]
                      2. మహా ప్రవక్త విధానాన్ని అనుసరించటం అనివార్యం. కాదనటం కుఫ్ర్ కి తార్కాణం [18p]
                        1. మొదటి (అసలు) ప్రాతిపదిక దైవ గ్రంథం
                        2. రెండవ ప్రాతిపదిక దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) విధానం (సున్నత్‌)
                      3. ప్రవక్త సహచరులు, వారి తరువాత వారు మరియు ఇస్లామీయ విద్వాంసులు దృష్టిలో సున్నత్‌ ఔన్నత్యం [10p]
                      4. ఇదే మాసందేశం (పుస్తక పబ్లిషర్స్ నుండి) [1p]

                      తొలిపలుకులు

                      పొగడ్తలన్నీ సర్వలోకాల అధిపతియైన అల్లాహ్‌కే చెందును. ఆయన అంతిమ ప్రవక్తయైన ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు మరియు ఆయన బాటన నడిచిన పుణ్యాత్ములపై అల్లాహ్‌ కారుణ్యం  వర్షించు గాక, ఆమీన్…

                      మనందరికి తెలిసినట్లు ఇస్లాం (విధేయత) మాత్రమే అల్లాహ్‌ వద్ద స్వీకరించదగిన ధర్మము, ఇది అల్లాహ్‌ ఆరాధన మరియు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి పద్ధతిని (సున్నత్‌) అనుసరించడం ద్వారా పూర్తవుతుంది. ఈ విషయాన్ని దివ్యఖుర్‌ఆన్ మరియు స్వయంగా ప్రవక్తగారి కంటే బాగా ఎవరూ భోధించలేరన్నది వాస్తవం. ఈ చిన్న పాఠం మనం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.

                      ఈ వాస్తవాన్ని జనాలకు నచ్చ చెప్పేందుకు తన జీవితాన్ని ధారపోసిన గొప్ప పండితుల్లో సౌదీ అరేబియాకు చెందిన షేక్‌ బిన్‌ బాజ్‌ గారు (మరణం 1420 హిజ్రీ) ఒకరు .

                      అల్లాహ్‌ ఆయన ఆత్మకు శాంతి కలిగించుగాక ! ఆమీన్‌. ఆయన ఓ గొప్ప మేధావి, ధార్మిక పండితుడు మరియు ఇస్లామీయ చట్టానికి అనుగుణంగా జీవితం చాలించిన మహా మనిషి. తన రచనల ద్వారా ప్రసంగాల ద్వారా ఆలోచన ప్రక్రియ ద్వారా ఇస్లాంకు సేవలందించిన మహానీయుడు. నేటికి కోట్లాది మందికి మార్గదర్శకత్వం వహిస్తున్న దార్శనికుడు.

                      ఆయన వ్రాసిన ఈ చిరు పుస్తకాన్ని తెలుగు పాఠకులకు సమర్పించడానికి మేము చేస్తున్న ఈ కృషిని అల్లాహ్‌ స్వీకరించుగాక మరియు మనందరికి ఈ పుస్తకం ద్వారా సన్మార్గం చూపుగాక ! ఆమీన్‌ …

                      – హాఫిజ్‌ ముహమ్మద్‌ అబ్దుర్ రవూఫ్‌ ఉమరి

                      మహాప్రవక్త విధానాన్ని అనుసరించటం అనివార్యం. కాదనటం కుఫ్ర్ కి తార్కాణం

                      (ఈ మధ్య కొన్ని మిథ్యావాదాలు ప్రబలి  ప్రవక్త విధానాన్ని అనుసరించే విషయమై విపరీతార్ధాలు తీస్తున్నాయి. అందుచేత మేము ఈ చిరు పుస్తకాన్ని ప్రచురించి ప్రవక్త సంప్రదాయాన్ని పాటించటం తప్పనిసరి అనీ, దాన్ని తిరస్కరించటం తిరస్కారానికి ఆనవాలు అని సృష్టంగా చెప్పదలిచాము. ప్రవక్త అనుయాయులైన ముస్లిం ప్రజానీకం ఈ ఘోర అపరాధానికి దూరంగా ఉండాలన్నదే మా అభిమతం).

                      ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్‌కే శోభిస్తాయి. శ్రేయాలు సదాచార సంపన్నులు, భయభక్తులు గల వారి కొరకే. మరియు సద్వర్తనులైన దాసులు, అతని ప్రవక్తలు, ఇంకా సకల లోకాల కొరకు కారుణ్యంగా ప్రభవింపచేయబడిన ప్రియ ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై శాంతీ శుభాలు వర్షించుగాక! వాస్తవానికి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రభవనం సమస్త మానవాళి కొరకు సాక్ష్యం! ఆయనపై ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై, ఆయన అనంతరం దైవ గ్రంథాన్ని దైవప్రవక్త సంప్రదాయాన్ని కంటికి రెప్పలా కాపాడేందుకు ఉనికిలోకి తీసుకురాబడే సజ్జనులందరిపై దేవుడు శాంతీశ్రేయాలను కురిపించుగాక!!

                      ధర్మాధర్మాలు, సత్యాసత్యాలను నిర్ధారించే ప్రమాణాలు (లేక సూత్రాలు) ప్రధానంగా నాలుగు (4) అన్న విషయంలో పూర్వపు పండితులు, తరువాయి పండితుల మధ్య ఏకాభిప్రాయం ఉంది –

                      మొదటిది : దైవగ్రంథమైన ఖుర్‌ఆన్‌. దీనిలో ముందు నుంచి గానీ, వెనుక నుంచి గానీ అధర్మం జొరబడజాలదు.

                      రెండవది : మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) వారి సంప్రదాయం. ఎందుకంటే ఆయన ఏది చెప్పినా తన మనోకాంక్షల కనుగుణంగా చెప్పరు. పైగా ఆయన చెప్పే ప్రతి ప్రవచనం దైవ సంకేతానికి (వహీ)కి లోబడి ఉంటుంది.

                      మూడవది : ముస్లిం సమాజానికి చెందిన పండితుల ఉమ్మడి అభిప్రాయం.

                      నాలుగవది : అంచనా కొంత మంది ఉలమా (పండితులు) “అంచనాతో ఏకీభవించరు. అంచనా ‘ప్రమాణబద్ధం కాదని వారి వాదన. అయితే అంచనాకి ఆధారభూతమైన అంశాలన్నీ ఎన్నదగ్గవైన పక్షంలో దాని ప్రామాణికతలో సందేహానికి తావుండదని అత్యధిక మంది పండితులు అభిప్రాయపడతారు. దీనికి సంబంధించిన నిదర్శనాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. అవి, ఎంత ప్రముఖమైన నిదర్శనాలంటే ఇక్కడ వాటిని పేర్కొనవలసిన అవసరం కూడా లేదు. అసలు చర్చనీయాంశం కూడా ఇది కాదు. మా చర్చనీయాంశం ప్రవక్త విధానాన్ని అనుసరించటం అవశ్యం అన్నదే.

                      మొదటి (అసలు) ప్రాతిపదిక దైవగ్రంథం :

                      విశ్వ ప్రభువు తరపున అవతరింపజేయబడిన పవిత్ర ఖుర్‌ఆన్‌లోని అనేక వచనాలలో చెప్పబడిన దాని ప్రకారం మనం ఈగ్రంధాన్ని అనుసరించటం విధి అవశ్యం. అలాగే అది నిర్ణయించిన హద్దులను అతిక్రమించకుండా ఉండటం అనివార్యం. విశ్వప్రభువు అయిన అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు :

                      “ప్రజలారా! మా ప్రభువు తరపు నుండి మీ పై అవతరింపజెయ్యబడిన దానిని అనుసరించండి. మీ ప్రభువును కాదని ఇతర సంరక్షకులను అనుసరించకండి – కాని మీరు హితబోధను స్వీకరించటం అరుదు” (అల్‌ ఆరాఫ్‌-39)

                      అల్లాహ్‌ ఇంకా ఇలా సెలవిస్తున్నాడు :

                      “మేము ఈ (గ్రంథాన్ని అవతరింపజేశాము. ఇది శుభాలు కల గ్రంధం. కనుక మీరు దీనిని అనుసరించండి. భయభక్తుల వైఖరిని అవలంబించండి. తద్వారా మీరు కనికారానికి నోచుకునే అవకాశముంది”. (అల్‌అన్‌ఆమ్‌ – 155)

                      వేరొక చోట ఏమనబడిందో చూడండి :

                      “మీవద్దకు అల్లాహ్‌ తరపు నుండి కాంతి వచ్చేసింది. సత్యం వైపునకు మార్గం చూపే ఒక గ్రంథం కూడా. దాని ద్వారా అల్లాహ్‌ తన సంతోషం పొందగోరే వారికి శాంతిపథాలను చూపుతాడు. తన ఇచ్చానుసారం వారిని చీకట్ల నుండి వెలికి తీసి వెలుగు వైపుకు తీసుకువస్తాడు. ఇంకా వారిని రుజుమార్గం వైపుకు నడుపుతాడు.” (అల్‌ మాయిద-15, 16)

                      పరమోన్నతుడైన అల్లాహ్‌ ఇంకా ఈ విధంగా అంటున్నాడు: –

                      “తమ ముందుకు హితబోధ వచ్చినపుడు, దానిని విశ్వసించకుండా తిరస్కరించిన వారు వీరే. కాని యదార్ధం ఏమిటంటే, ఇది ఒక శక్తిమంతమైన గ్రంథం. అసత్యం దాని మీదకు ముందు నుండీ రాజాలదు, వెనుక నుండీ రాజాలదు. వివేకవంతుడు, స్తుతిపాత్రుడూ అయిన దేవుడే అవతరింపజేసిన గ్రంథం ఇది”. (హామీమ్‌-అస్‌-సజ్దా  : 41, 42)

                      పరమ ప్రభువైన అల్లాహ్‌ ఈ విధంగా కూడా సెలవిచ్చి ఉన్నాడు :

                      “(ఓ ముహమ్మద్‌-(సల్లలాహు అలైహి వ సల్లం)) నీవు వారితో చెప్పు. “మిమ్మల్నీ, ఇంకా ఎవరెవరి వద్దకు చేరుతుందో వారందరినీ నేను హెచ్చరించడానికి గాను ఈ ఖుర్‌ఆన్‌ నా వద్దకు వహీ” ద్వారా పంపబడింది.” (అల్‌ అన్‌ఆమ్‌ -19)

                      వేరొకచోట అవతరించిన దైవాదేశం ఇది :

                      “సర్వ మానవులకు ఇదొక సందేశం. తద్వారా వారిని హెచ్చరించాలనీ” (ఇబ్రాహీమ్‌-52)

                      దివ్యఖుర్‌ఆన్‌ లో ఇంచుమించు ఇదే భావాన్ని స్ఫురింపజేసే ఆయతులు ఇంకా అనేకం ఉన్నాయి. ఇవిగాక మరికొన్ని హదీసులు కూడా దైవగ్రంథమైన ఖుర్‌ఆన్‌ను అనుసరించటం అవశ్యమని ధృవీకరిస్తున్నాయి. ఎవరయితే ఖుర్‌ఆన్‌ ఆదేశాలను శిరసావహించాడో అతడు సన్మార్గం పొందాడనీ మరెవరయితే ఖుర్‌ఆన్‌ పట్ల విముఖత చూపాడో అతడు మార్గభ్రష్టతకు లోనయ్యాడని కూడా ఈ హదీసుల ద్వారా రూఢీ అవుతోంది.

                      అంతిమ హజ్‌ యాత్ర సందర్భంగా మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు పలికిన నిర్ణయాత్మకమైన ప్రవచనాలు కూడా ఈ విషయాన్ని ధృవపరుస్తున్నాయి. ఆ సందర్భంగా ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు:

                      “మీ మధ్య ఆ వస్తువును వదలి వెళుతున్నాను. మీరు దానికి కట్టుబడి ఉన్నంతవరకు మీరు ఎట్టి పరిస్థితిలోనూ మార్గభ్రష్టులవరు. అదే దైవ గ్రంథం.” (ముస్లిం)

                      ‘సహీహ్‌ ముస్లింలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి మరొక ప్రవచనం ఇలా ఉల్లేఖించబడింది.

                      మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని జైద్‌బీన్‌ అర్‌ఖమ్‌ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: నేను మీ మధ్య రెండు అమూల్యమైన, స్వఛ్చమైన వస్తువులను వదలి వెళుతున్నాను. ఆ రెండింటిలో మొదటిది, దైవగ్రంథం. అందులో మార్గదర్శకత్వం ఉంది, కాంతి ఉంది. కాబట్టీ మీరు దైవగ్రంథాన్ని గట్టిగా పట్టుకోండి. దానిపై స్థిరంగా ఆచరించండి. రెండవది : నా ఇంటి వారలు. నేను మీకు నా ఇంటివారల గురించి అల్లాహ్‌కు జ్ఞాపకం చేస్తాను. నేను మీకు నా ఇంటివారలగురించి అల్లాహ్‌కు జ్ఞాపకం చేస్తాను.”

                      మరో ఉల్లేఖనంలో “ఖుర్‌ఆన్‌ గురించి” అని ఉంది. ఖుర్‌ఆన్‌ అంటే అల్లాహ్ త్రాడు అన్నమాట. ఈ త్రాటిని ఎవరు గట్టిగా పట్టుకుంటారో వారు సన్మార్గాన్ని పొందారు. మరెవరు దాన్ని వదిలేశారో వారు మార్గం తప్పిపోయారు. ఈ అంశంపై ఎన్నో హదీసులు ఉన్నాయి. ఈ విషయంలో ఈ ఆధారాలు, నిదర్శనాలను కూలంకషంగా చర్చించవలసిన అవసరం లేదు. మహాప్రవక్త ప్రియ సహచరుల రిజ్వానుల్లాహి అలైహిమ్‌ అజమయీన్‌) మొదలుకుని విద్వాంసులు, విశ్వాసుల వరకు అందరూ ఒక విషయంలో ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. అదేమంటే దైవగ్రంథానుసారం మసలుకోవటం అవశ్యం. అంతేకాదు, ధార్మిక వ్యవహారాలన్నీ దైవగ్రంథంతో పాటు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సంప్రదాయానికి లోబడి పరిష్కరించబడతాయి, పరిపాలనా వ్యవహారాలు సయితం దైవగ్రంథానికి, దైవప్రవక్త విధానానికి కట్టుబడి అమలవుతాయి.

                      రెండవ ప్రాతిపదిక దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) విధానం (సున్నత్‌)

                      రెండవ ప్రామాణికమైన ప్రాతిపదిక దైవప్రవక్త(సల్లలాహు అలైహి వ సల్లం) గారి విధానం. అంటే ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) గారి ప్రవచనాలు, ఆచరణలు లేక ప్రసంగాలు. అయితే ఇవన్నీ విశ్వసనీయ వర్గాల ద్వారా ఉల్లేఖించబడినవై ఉండాలి. ఆ విధంగా ధృవీకరించబడినవన్నీ “హదీసు”గా పరిగణించబడతాయి. దీన్నే సున్నత్‌ (మహాప్రవక్త విధానం, సంప్రదాయం)గా వ్యవహరిస్తాడు.

                      మహాప్రవక్త గారి ప్రియసహచరుల నుండి నేటి పండితుల వరకూ- అందరూ ఈ సిసలైన (హదీసు) ప్రాతిపదికను దృఢంగా విశ్వసించడమేగాక దీనిని తమ ‘స్వీకృతికి కొలబద్దగా పరిగణిస్తారు. ముస్లిం సమాజానికి దీని ప్రకారం శిక్షణను ఇస్తారు. ఇంకా ఈ “విద్య”ను ప్రాచుర్యంలోకి తెచ్చే ఉద్దేశ్యంతో వారు గ్రంథాలను సంకలనం చేశారు. ఫికహ్‌ సూత్రాలను, హదీసు పరిభాషను వివరించే గ్రంథాలలో దీనిని ప్రముఖంగా విశదీకరించారు.

                      “సున్నత్‌ (ప్రవక్త విధానం) ప్రామాణికమైనదనే విషయమై ఎన్ని ఆధారాలు ఉన్నాయంటే, అసలు వాటిని గణించటమే గగనమైపోతుంది. వాటిలో కొన్ని ఆధారాల ప్రస్తావన ఖుర్‌ఆన్‌లోనూ ఉంది. అందులో మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారికి విధేయత చూపి, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) అడుగుజాడలలో నడుచుకోవలసిందిగా ఆదేశించబడింది. ఈ ఆదేశం ఆయన సమకాలికులకు వర్తించినట్లుగానే ఆయన అనంతరం వచ్చే వారందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఆయనే అంతిమ దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం). కాబట్టి ఆయన అనుచరులందరూ ప్రళయదినం వరకూ ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) కు విధేయులై ఉండవలసి ఉంది. ఎందుకంటారేమో? మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)గారు దివ్యఖుర్‌ఆన్‌కు తాత్పర్యం వంటివారు. ఆయన మాటలుగానీ, చేతలుగానీ, ఆయన ప్రసంగాలు గానీ – అన్నీ దివ్యఖుర్‌ఆన్‌లోని ఆయతులను ప్రతిబింభిస్తాయి.

                      ‘సున్నతే’ గనక లేకుంటే నమాజులో ఎన్నిరకతులున్నాయో, వాటి స్వరూప స్వభావాలేమిటో, అవసరాలేమిటో ప్రజలకు తెలిసేది కాదు. అలాగే ఉపవాసాలు, జకాత్‌, హజ్‌ వంటి విధుల రూపురేఖలను కూడా ప్రజలు తెలుసకోలేకపోయేవారు. అదే విధంగా సున్నత్‌ లేకుంటే ప్రజలకు మంచిని పెంపొందించే, చెడులను అరికట్టే ఆజ్ఞల తీరుతెన్నులు బోధపడేవి కావు. లావాదేవీలేమిటో, ధర్మాధర్మాలేమిటో, అల్లాహ్‌ విధించిన హద్దులు, కట్టుబాట్లు ఏమిటో కూడా నెలకొల్పబట్టి సులువుగా అర్ధం చేసుకోగలుగుతున్నారు.

                      ఈ సందర్భంగా దివ్యఖుర్‌ఆన్‌లోని పలు వాక్యాలను ఉదాహరించి మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారి విధానాన్ని అనుసరించటం అనివార్యమని నిరూపించవచ్చు. మచ్చుకు అలి ఇమ్రాన్‌ సూరాలో అల్లాహ్‌ ఇలా ఆదేశించాడు

                      “అల్లాహ్‌కూ, ప్రవక్తకూ విధేయత చూపండి. మీరు కరుణింపబడే అవకాశం ఉంది.” (ఆలి ఇమ్రాన్‌ : 132)

                      “నిసా” సూరాలో ఈ విధంగా సెలవీయబడింది :

                      “ఓ విశ్వసించిన వారలారా | అల్లాహ్‌కు, ప్రవక్తకూ, మీలో అధికారం అప్పగించబడిన పెద్దలకు విధేయత చూపండి. మీ మధ్య ఏ విషయంలోనయినా వివాదం తల ఎత్తితే దాన్ని అల్లాహ్‌ మరియు ప్రవక్తకు నివేదించండి. మీరు నిజంగానే అల్లాహ్‌ మరియు అంతిమదినం మీద విశ్వాసం గలవారైతే (మీరు ఇలాగే చేయాలి). ఇదే సరైన పద్ధతి. ఫలితాన్ని బట్టి కూడా ఇదే ఉత్తమమైనది.” (అన్‌ నిసా : 59)

                      “నిసా” సూరాలోనే వేరొక చోట పరమ ప్రభువు ఇలా ఆదేశిస్తున్నాడు :

                      “ప్రవక్తకు విధేయత చూపిన వాడు వాస్తవంగా అల్లాహ్‌కు విధేయత చూపినట్లే. కాని ఎవడయితే విముఖుడయ్యాడో అటువంటి వారిపై మేము నిన్ను కావలివానిగా చేసి పంపలేదు.” (నిసా సూరా, ఆయత్‌ నెం. 80)

                      మరి మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారి విధానం మనకు ప్రమాణబద్ధం కాదనుకుంటే, (లేక) అది సురక్షితంగా లేదని ఊహించుకుంటే, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) గారికి విధేయత చూపటం ఎలా సాధ్యమవుతుంది? ఏదైనా విషయంలో వివాదం తలెత్తినప్పుడు దాన్ని దైవగ్రంథం మరియు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) విధానం వైపుకు మరలించటం ఎలా సంభవమవుతుంది?

                      ఒకవేళ మన ఆలోచనలు గనక ఇలా వక్రంగా సాగినట్లయితే ఇంకా ఎన్నో భయంకరమైన సందేహాలు పొడసూపుతాయి – అంటే అసలు ఉనికిలో లేని విషయాల గురించి అల్లాహ్‌ తన దాసులకు ఆదేశాలిచ్చాడన్నమాట! ఇదంతా మిధ్య అన్న మాట!! (అల్లాహ్ మన్నించుగాక!)

                      అల్లాహ్‌ అన్‌ నహ్ల్‌ సూరాలో ఏమని అంటున్నాడో చూడండి :

                      “ఈ జ్ఞాపికను నీ (ప్రవక్త) పై కూడా అవతరింపజేశాము. నీవు ప్రజల ముందు వారి కోసం అవతరింపజేయబడిన ఉపదేశాన్ని సృష్టంగా వివరించటానికి, (స్వయంగా) ప్రజలు కూడా ఆలోచించటానికి.” (అన్‌ నహ్ల్‌ 44)

                      అన్‌ నహ్ల్‌ సూరాలోనే మరోచోట ఇలా అనబడింది :

                      “మేము ఈ గ్రంథాన్ని నీపై ఎందుకు అవతరింపజేశామంటే, వారు గురి అయివున్న విభేదాల యదార్దాన్ని నీవు వారికి స్పష్టం చేయాలని. ఈ గ్రంథం తనను విశ్వసించే వారి కోసం మార్గదర్శకత్వంగానూ, కారుణ్యంగానూ అవతరించింది.” (నహ్ల్‌ సూరా, ఆయత్‌ నెం. 64)

                      ఆలోచించండి! మహనీయ ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) వారి సున్నత్‌ ఉనికిలో లేని పక్షంలో, ప్రవక్తగారి సున్నత్‌ ప్రమాణబద్ధం కాని పక్షంలో దైవగ్రంథాన్ని విడమరచి చెప్పే బాధ్యతను అల్లాహ్‌ తన అంతిమ ప్రవక్తకు ఎందుకు అప్పగిస్తాడు?

                      దివ్యఖుర్‌ఆన్‌లోని నూర్‌ సూరాలో కూడా అల్లాహ్‌ ఇదే విధంగా ఆదేశిస్తున్నాడు :

                      (ఓ ముహమ్మద్‌! వారితో ఇలా అను) “అల్లాహ్‌కు విధేయులు కండి, దైవప్రవక్త ఆదేశాలను పాటించండి. కాని ఒకవేళ మీరు విముఖలవుతే, బాగా తెలుసుకోండి, దైవప్రవక్తపై పెట్టబడిన కర్తవ్యభారం వరకే అతను బాధ్యుడు. మీపై మోపబడిన కర్తవ్య భారానికి మీరు బాద్యులు. దైవప్రవక్తకు విధేయులైతే మీరే మార్గదర్శకత్వం పొందుతారు. లేకపోతే స్పష్టంగా ఆజ్ఞను అందజేయటానికి మించి ఎక్కువ బాధ్యత దైవప్రవక్తపై లేదు.” (నూర్‌ సూరా, ఆయత్‌ నెం. 54)

                      నూర్‌ సూరాలోనే వేరొక చోట విశ్వ ప్రభువైన అల్లాహ్‌ ఆజ్ఞాపించాడు :

                      “నమాజును స్థాపించండి, జకాత్‌ ఇవ్వండి, దైవప్రవక్తకు విధేయులుగా ఉండండి. తద్వారా మీరు కరుణింపబడే అవకాశం ఉంది.”(నూర్‌ సూరా, ఆయత్‌ నెం. 56)

                      అల్‌ ఆరాఫ్‌ సూరాలో అల్లాహ్ ఇలా ఆదేశించాడు :

                      ఓ ముహమ్మద్‌! ఇలా ప్రకటించు – “మానవులారా! నేను మీ అందరి వైపుకు వచ్చిన అల్లాహ్‌ సందేశహరుణ్ణి. ఆయన భూమ్యాకాశాల సామ్రాజ్యానికి ప్రభువు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఆయనే మృత్యువును ఇస్తాడు. కనుక విశ్వసించండి అల్లాహ్‌ను, ఆయన పంపిన నిరక్షరాస్యుడైన ప్రవక్తను – అతను అల్లాహ్‌ను, ఆయన సూక్తులను విశ్వసిస్తాడు – అతనిని అనుసరించండి. మీరు సరియైన మార్గం పొందే అవకాశం ఉంది.” (అల్‌ ఆరాఫ్‌ : 158)

                      మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయులై ఉంటూ, ఆయన విధానాన్ని అనుసరించినపుడే మనకు సన్మార్గం ప్రాప్తిస్తుందని, దైవ కారుణ్యం అవతరిస్తుందని ఈ ఆయతుల ద్వారా స్పష్టంగా బోధపడుతున్నది. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపనిదే సరైన మార్గం ఎలా లభిస్తుంది? కరుణింపబడే అవకాశం ఎక్కడుంటుంది? సున్నత్‌ (ప్రవక్త విధానం) సరైంది కాదనలేక అది ఉల్లేఖించబడిన వైనం నమ్మశక్యం కాదనో వంకలు పెట్టినప్పుడు మానవుడు మార్గదర్శకత్వానికి ఎలా పాత్రుడు కాగలుగుతాడు ?

                      సూరె నూర్‌లో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు :

                      “దైవప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించేవారు, తాము ఏదైనా ఉపద్రవంలో చిక్కుకు పోతామేమో అనీ, తమపై బాధాకరమైన శిక్ష ఏదైనా అవతరిస్తుందేమో అనీ భయపడాలి.”(అన్‌ నూర్‌ – 68)

                      హష్ర్  సూరాలో దైవాదేశం ఇలా ఉంది.

                      “దైవప్రవక్త మీకు ఇచ్చినదాన్ని తీసుకోండి, ఆయన మిమ్మల్ని నిషేధించిన దాని జోలికి పోకండి.” (అల్‌ హష్ర్ – 7)

                      ఈ భావార్థం గల ఆయతులు ఇంకెన్నో ఉన్నాయి. వీటన్నింటిలోనూ చెప్పబడిన విషయం ఒక్కటే – అదే, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారికి విధేయులై ఉండటం, ఆయనను అనుసరించటం, ఆయన ప్రసాదించిన దానిని స్వీకరించటం, ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం అవశ్యం, అనివార్యం అని ఈ ఆయతులు నొక్కి పలుకుతున్నాయి.

                      దైవగ్రంథం మరియు దైవప్రవక్త విధానం – ఈరెండూ ఒకదానితో మరొకటి పెనవేసుకుపోయిన మూలాధారాలు. ఒకటి లేకుండా ఇంకొకటి లేదు. వీటిలో ఏ ఒక్కదానిని కాదన్నా రెండవదానిని కూడా కాదన్నట్లే. వాస్తవానికి ఇది ధిక్కారం. అవిశ్వాసం కిందికి వస్తుంది. ఇంకా ఈ ధిక్కార వైఖరి మార్గ విహీనతకు, మార్గభ్రష్టతకు దారితీస్తుంది. ఈ ధిక్కార పోకడకు పాల్పడిన వ్యక్తి విశ్వాసుల, పండితుల పరిధి నుండి వెలివేయబడిన వాడవుతాడు. (అంతే కాదు, దైవప్రవక్త – (సల్లల్లాహు అలైహి వ సల్లం)-విధానాన్ని ప్రమాణబద్దమైనదిగా ఒప్పుకోనంతవరకూ నేనంటాను. పవిత్ర ఖుర్‌ఆన్‌ దైవగ్రంథం అని అసలు మనకు చెప్పింది ఎవరు?

                      హజ్రత్‌ ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం)గారే కదా! మరి ఆయనగారి హదీసులు, విధానాలే నమ్మశక్యం కానపుడు ఖుర్‌ఆన్‌ మాత్రం దైవగ్రంథం అని ఎలా నిరూపితం అవుతుంది? (దైవం మన్నించుగాక) అన్న ప్రశ్న ఈ సందర్భంగా ఉత్పన్నమవుతుంది.)

                      మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపటం, ఆయన తీసుకు వచ్చిన వాటి ప్రకారం ఆచరించటం అవశ్యమవటం, ఆయన పట్ల అవిధేయత హరామ్‌ అవటం – ఇవన్నీ ప్రామాణికమైన హదీసుల ద్వారా రూఢీ అయినవి. పైగా ఈ ధర్మములు అందరికీ వర్తిస్తాయి. వారు మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారి సమకాలీకులైనా, లేక ఆయన తదనంతరం ప్రళయదినం వరకు పుట్టేవారైనా – అందరికీ యథాతథంగా వర్తిస్తాయి. ఆ హదీసులలో మచ్చుకు కొన్ని ఇక్కడ పేర్కొంటున్నాము-

                      మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారని హజ్రత్‌ అబూహూరైర (రది అల్లాహు అన్హు) చెప్పారు: “ఎవరు నాకు విధేయత చూపారో వారు అల్లాహ్‌కు విధేయత చూపారు. మరెవరు నా యెడల అవిధేయులుగా ఉన్నారో వారు అల్లాహ్‌ యెడల అవిధేయులయ్యారు.”

                      2. సహీహ్‌ బుఖారీలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారు ప్రబోధించారని హజ్రత్‌ అబూహురైర (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు.

                      “నా అనుచర వర్గీయుల్లో నన్ను ధిక్కరించిన వారు తప్ప అందరూ స్వర్గంలో ప్రవేశిస్తారు.” ఓ దైవప్రవక్తా! మిమ్మల్ని ధిక్కరించిన వాడు అంటే ఎవరు? అని ప్రశ్నించగా, “నాకు విధేయుడై ఉన్నవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. మరి నా యెడల అవిధేయుడుగా మెలగినవాడు నన్ను ధిక్కరించిన వాడవుతాడు” అని అన్నారు.

                      3. అహ్మద్‌, అబూదావూద్‌ మరియు హాకిమ్‌లు ప్రామాణికమైన ఆధారాలతో క్రింది హదీసును పేర్కొన్నారు – వారు ఇలా వ్రాశారు :

                      ప్రవక్త మహనీయులు (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారని మఖ్ధమ్‌బిన్‌ మాదీకరబ్‌ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

                      “నిస్ససందేహంగా నాకు గ్రంథం వొసగబడింది. గ్రంథంతో పాటు దాని ఉపమానం (అంటే హదీసు. ఇది కూడా అల్లాహ్ సంకేతం ప్రకారమే అయి ఉంటుంది.) కూడా ప్రసాదించబడింది. జాగ్రత్త! అతి చేరువకాలంలోనే కడుపు నిండిన మనిషి ఒకడు బయలుదేరాడు. అతడు హాయిగా మెత్తని దిండుపై కూర్చుని – మీరు ఈ ఖుర్‌ఆన్‌ను మీ కొరకు అవసరమైనదని భావించండి. ఇందులో మీరు ధర్మసమ్మతమైనది (హలాల్‌)గా గ్రహించిన దానిని ధర్మసమ్మతంగా భావించండి. ఇందులో అధర్మమైనది (హరామ్‌)గా గ్రహించిన దానిని అధర్మమైనదిగా తలపోయండి” అని అంటాడు”.

                      (అంటే మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తరువాత కాలంలో జన్మించే వారిలో కొంతమంది; “మీకు ఖుర్‌ఆన్‌ మాత్రం చాలు అనే నినాదం విని హదీసులను త్రోసిపుచ్చటం మొదలెడతారు. ఉదాహరణకు : పాకిస్తాన్‌లో అబ్దుల్లా చక్‌డాల్వీ మరియు అతని మానస పుత్రులైన గులాం అహ్మద్‌ పర్వేజ్, డా. ఫజ్లుర్రహ్మాన్ తదితరులు ఇలాంటి నినాదమే ఇచ్చి మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సున్నత్‌ను త్రోసిరాజన్నారు) – అనువాదకుడు

                      అబూదావూద్‌, ఇబ్నుమాజ యెన్నదగ్గ ఆధారాలతో క్రింది ఉల్లేఖనాన్ని పొందుపరచారు;

                      మహనీయ ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రవచించారని తన తండ్రి చెప్పినట్లు హజ్రత్‌ ఇబ్నె అబీ రాఫె చెప్పారు – “మీలో ఒకడు తప్పనిసరిగా ఇలా ఉంటాడు, అతడు తన దిండుకు ఆనుకుని ఆసీనుడవుతాడు. అతని వద్దకు నా ఆజ్ఞలలోని ఒక ఆజ్ఞ వస్తుంది. ఫలానా పనిని చేయాలనో లేక చేయకూడదనో నేను అందులో ఆజ్ఞాపించి ఉంటాను. అప్పుడతను, “అదేం మాకు తెలీదు (ఎందుకంటే) దైవగ్రంథంలో మా దృష్టికి వచ్చిన ఆజ్ఞను మాత్రమే మేము శిరసావహిస్తాము. అని అతనంటాడు”.

                      4. వేరొక ఉల్లేఖనంలో ఇలా వివరించబడింది. దానిని హసన్‌ బిన్‌ జాబీర్‌ గారు మఖ్‌దామ్‌ బిన్‌ మాదీకరబ్‌ నుండి సంగ్రహించారు : ఆయన ఇలా అంటున్నారు –

                      ఖైబర్‌ విజయం వరించిన నాడు ప్రవక్త మహనీయులవారు కొన్ని వస్తువులను హరామ్‌ (నిషిద్ధం)గా ఖరారు చేశారు. ఆ సందర్భంగానే ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా పలికారు – “త్వరలోనే మీలోని ఒకడు నన్ను ధిక్కరించవచ్చు. వాడు హాయిగా ఆనుకుని కూర్చుని ఉంటాడు. నా హదీసును ఎవరయినా వినిపిస్తే ‘మీకూ-మాకూ మధ్య ఖుర్‌ఆన్‌ ఎలాగూ ఉంది కదా! అందులో దేనిని హలాల్‌గా పొందుతామో దానినే ‘హలాల్‌ పరిగణిద్దాము. మరి దేనిని “’హరామ్ గా  పొందుతామో దానిని హరామ్‌గా భావిద్దాము’ అని అతను అంటాడు. జాగ్రత్త! దైవప్రవక్త దేనిని హరామ్‌ (నిషిద్ధం)గా చేశారో అది అల్లాహ్ హరామ్‌గా చేసిన దానితో సమానం.”

                      తరచూ మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారు తన ప్రియ సహచరులను ఉద్దేశించి, “మీలో ఇక్కడ ఉన్నవారు ఇక్కడలేనివారికి” విషయాన్ని చేరవేయండి అని తాకీదు చేసేవారు. వారితో ఇంకా ఇలా అంటూ ఉండేవారు: “విషయాన్ని వినే వారిలో చాలామంది విషయాన్ని చేరవేసిన వారికన్నా బాగా గుర్తు పెట్టుకునే వారై ఉండవచ్చు. వివేకసంపన్నులై ఉండవచ్చు”. అంతిమ హజ్‌ యాత్ర సందర్భంగా కూడా మహనీయ ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) గారు అరఫా రోజున తన సహచరులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇలా అన్నారని సహీహ్‌ హదీసుల ద్వారా తెలుస్తోంది

                      “ఇక్కడున్నవారు ఇక్కడలేని వారికి (నా సందేశాన్ని) అందజేయండి. ఎందుకంటే వినే వారిలో చాలామంది అందజేసిన వారికన్నా ఎక్కువ గుర్తు పెట్టుకోవచ్చు. ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) హదీసును విన్నవారిపై ఈ బాధ్యత పడి ఉండకపోతే, ప్రళయదినం వరకు ఆయన హదీసు మిగిలి ఉండకపోతే అసలు ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) దానిని ప్రచారం చేసే బాధ్యతనే మనకు అప్పగించేవారు కాదు. దీన్ని బట్టి బోధపడేదేమిటంటే ప్రవక్త మహనీయ (సల్లలాహు అలైహి వ సల్లం) వారి నోట ఎవరయితే హదీసును విన్నారో, ఇంకా ఎవరెవరి వద్దకయితే స్పష్టమైన ఆధారాల ద్వారా హదీసు చేరిందో వారందరిపై దాన్ని ఆచరించే, ప్రచారం చేసే బాధ్యత పడుతుంది. ఆ విధంగా అది వారందరి కొరకు “హుజ్జత్‌” అవుతుంది.

                      ప్రవక్తగారి ప్రియ సహచరులు (సహాబా-రది అల్లాహు అన్హుమ్) ప్రవక్తగారి మాటలను, చేతలను కేవలం తమ వరకే గుర్తు పెట్టుకోకుండా వారు తమ అనుయాయులకు హెచ్చుతగ్గులు లేకుండా వాటిని అందజేశారు. మరి ఆ అనుయాయులు తమ తరువాతి తరం వారికి ఈ అమానతును సురక్షితంగా అప్పగించారు. ఈ విధంగా ఒక తరం వారు ఇంకొక తరం వారికి వారసత్వంగా ఈ అమానతును యధాతథంగా అందజేసుకుంటూ వచ్చారు. ఉలమా (పండితులు) ఈ సున్నత్‌ను గ్రంథస్థం చేశారు. అత్యంత ప్రామాణికమైన ఉల్లేఖనాలను బలహీనమైన ఉల్లేఖనాల నుండి వేరు చేశారు. ప్రామాణికమైన హదీసులేవో, బలహీనమైనవి ఏవో పరీక్షించి నిర్ధారించడానికి కొన్ని సూత్రాలను సైతం క్రోడీకరించారు.

                      (ఈ ప్రక్రియలో భాగంగానే హదీసు సూత్రాలు – ముస్తలాహుల్‌ హదీస్‌, అస్మావుర్రిజాల్‌ యొక్క శాశ్వతమైన విద్యలు ఉనికిలోకి వచ్చాయి. ఈ అంశాల ఆధారంగా అనేక గ్రంథాలు రచించబడ్డాయి. ఆఖరికి బలహీనమైన హదీసుల గురించి, హదీసు అంశాల గురించి కూడా గ్రంథాలు వెలువడ్డాయి –  అనువాదకుడు).

                      పండితుల, హదీసువేత్తల నిరంతర కృషి ఫలితంగా బుఖారీ షరీఫ్‌, ముస్లిం షరీఫ్‌లతో పాటు మరెన్నో హదీసు గ్రంథాలు ఆవిష్కరించబడ్డాయి. ఆ విధంగా హదీసులు సురక్షితం గావించబడ్డాయి. ఏ విధంగానైతే పరమప్రభువైన అల్లాహ్‌ తన గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ని) నాస్తికుల, మీథ్యావాదుల ప్రక్షిప్తాల నుండి, స్వార్ధపరుల కల్తీ బారి నుండి కాపాడాడో అదే విధంగా హదీసు వేత్తలు హదీసుల పరిరక్షణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఖుర్‌ఆన్‌ కాపాడే విషయమై అల్లాహ్‌ స్వయంగా ఖుర్‌ఆన్‌లోనే ఈ విధంగా సెలవిచ్చాడు: .

                      “మేము ఈ ఖుర్‌అన్‌ను అవతరింజేశాము. మరి స్వయంగా మేమే దీనిని  కాపాడుతాము”.

                      మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారి ప్రవచనాలు మరియు సున్నత్‌ కూడా ఇదే కోవకు చెందినది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. (ఇవి కూడా అల్లాహ్ సంకేతానుసారమే అవతరింపజేయబడ్డాయి). అల్లాహ్ తన గ్రంథాన్ని రక్షించినట్లే సున్నత్‌ను కూడా రక్షించాడు.

                      అల్లాహ్‌ ఈ లక్ష్యం కొరకు ఉలమా (పండితుల) సమూహాన్ని ఉనికిలోకి తెచ్చి, హదీసులను సంరక్షించే సద్బుద్ధిని వారికి వొసగాడు. ఈ పండితులు నిరంతరం హదీసులకు రక్షా కవచంలా నిలబడ్డారు. మిధ్యావాదులు హదీసులలో ప్రక్షిప్తాలకు పాల్పడినప్పుడల్లా వాటిని ఖండించారు. అజ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో ఎవరు హదీసులకు వక్రభాష్యాలు చెప్పినా వాటిని ఖండించారు. అజ్ఞానులు ఎప్పుడు ఈ హదీసులలో బూటకపు ఉల్లేఖనాలను మిళితం చేసినా ఉలమా వాటిని ప్రామాణికమైన హదీసుల నుండి వేరుపరచారు. ఆ విధంగా ఇది కూడా దైవికంగా జరిగిన ఏర్పాటు అనటంలో సందేహం లేదు. ఎందుకంటే అల్లాహ్‌ హదీసులను తన గ్రంథం యొక్క తాత్పర్యంగా చేశాడు. దివ్యఖుర్‌ఆన్‌లో ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించటం సాధ్యం కాదు. అయితే హదీసులలో వాటి వివరాలు వస్తాయి. ఉదాహరణకు :- పాలు తాపే ఆదేశాలు, వారసత్వ పంపిణీకి సంబంధించిన వ్యవహారాలు, వివాహాది కార్యాలలోని ధర్మాధర్మాలు మొదలగునవి.

                      దీంతో పాటు మరెన్నో ఆదేశాలున్నాయి. సహీహ్‌ హదీసులలో వాటి ప్రస్తావన ఉంది. కాని ఖుర్‌ఆన్‌లో వాటి ప్రస్తావన లేదు.

                      ప్రవక్త సహచరులు, వారి తరువాత వారు మరియు ఇస్లామీయ విద్వాంసులు దృష్టిలో సున్నత్‌ ఔన్నత్యం

                      సహీహ్‌ హదీసులలో హజత్‌ అబూహురైర (రది అల్లాహు అన్హు)ఉల్లేఖనం ప్రకారం:

                      మహనీయ ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పరమపదించిన తరువాత అరేబియాలోని కొన్ని తెగలు ధర్మభ్రష్టమయ్యాయి. ఈ పరిస్థితిని గమనించిన హజ్రత్‌ అబూబకర్‌ (రది అల్లాహు అన్హు) ఇలా అన్నారు: “అల్లాహ్ సాక్షి! నమాజ్‌ మరియు జకాత్‌ల మధ్య తేడా కనబరచిన వానికి వ్యతిరేకంగా ధర్మయుద్ధం చేస్తాను”. ఈ మాట విన్న హజ్రత్‌ ఉమర్‌, “మీరు వారికి వ్యతిరేకంగా ఎలా పోరాడుతారు? వాస్తవానికి దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారు ఈ విధంగా చెప్పి ఉన్నారు – “ప్రజలు లా ఇలాహ ఇల్లల్లాహ్‌ పఠించే వరకూ వారితో ధర్మయుద్ధం చేయమని నాకు ఆజ్ఞాపించబడింది. వారు ఈ కలిమాను గనక పఠిస్తే  వారి ధన ప్రాణాలు నా తరపున సురక్షితం గావించబడతాయి. దీని (కలిమా) సత్యతమూలంగా వారికి రక్షణ లభిస్తుంది. ఇది విన్న హజ్రత్‌ అబూబకర్‌ (రది అల్లాహు అన్హు), “ఏమిటీ జకాత్‌ దాని (కలిమా) సత్యతలో అంతర్భాగం కాదా!? అల్లాహ్ సాక్షి! వాళ్లు గనక మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) జీవితకాలంలో చెల్లిస్తూ ఉండే ఒంటె త్రాడును ఆపి ఉంచినా నేను వారికి వ్యతిరేకంగా ధర్మయుద్ధం చేస్తాను.” ఇది వినగానే హజ్రత్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు) నాకిప్పుడు విషయం బోధపడింది. నిస్సందేహంగా అల్లాహ్‌ ధర్మయుద్ధం విషయంలో హజ్రత్‌ అబూబకర్‌ (రది అల్లాహు అన్హు)కు సరియైన అవగాహనను ప్రసాదించాడు. ఇదే సత్యమని నాకు తెలిసిపోయింది” అని అన్నారు. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సహచరులు ఈ విషయంలో హజ్రత్‌ అబూబకర్‌తో ఏకీభవించటమే గాకుండా ధర్మభ్రష్టతకు పాల్పడిన వారితో జిహాద్‌ చేసి వారిని తిరిగి రుజువర్తనుల్ని చేశారు. తమ ధర్మభ్రష్టతపై మొండికేసిన వారిని తుదముట్టించారు.

                      ఈ వృత్తాంతం ప్రకారం సున్నత్‌ యెడల గౌరవం కలిగి ఉండటం, దానిని తు.చ. తప్పకుండా పాటించటం అవసరమని స్పష్టంగా తెలుస్తోంది.

                      ఒక “తాతమ్మ” హజ్రత్‌ అబూబకర్‌ (రది అల్లాహు అన్హు) సన్నిధికి వచ్చి తన వారసత్వపు సమస్యను గురించి నివేదించుకుంది. దైవగ్రంథంలోనయితే దీని గురించిన వివరాలు లేవు. మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) దీని గురించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా నాకు తెలీదు. దీని గురించి నేను ప్రజలను అడిగి తెలుసకుంటాను అని హజ్రత్‌ అబూబకర్‌ (రది అల్లాహు అన్హు) అన్నారు. ఈ వ్యవహారం గురించి ఆయన ప్రజలను దర్యాప్తు చేయగా కొంతమంది ప్రవక్త సహచరులు (రది అల్లాహు అన్హు) ధృవీకరించారు. మహాప్రవక్తవారు ‘తాతమ్మకు వారసత్వంలో ఆరవభాగం ఇప్పించారని వారు సాక్ష్యం పలకగా తదనుగుణంగా అబూబకర్‌ (రది అల్లాహు అన్హు) తీర్పు ఇచ్చారు.

                      హజ్రత్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు) గారు శిస్తును, జకాతును వసూలు చేసే ప్రతినిధులకు తాకీదు చేస్తూ ఇలా అనేవారు.

                      “మీరు  ప్రజల మధ్య అల్లాహ్ గ్రంథానుసారం తీర్పు చెయ్యండి. ఒకవేళ ఏ సమస్యకయినా పరిష్కారం దైవగ్రంథంలో మీకు కానరాకపోతే దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సంప్రదాయం ప్రకారం పరిష్కరించాలి సుమా!”

                      ఒకసారి హజ్రత్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు) గారికి ఒక మహిళ ఇమ్లాస్‌[1] కి సంబంధించిన సమస్య క్లిష్టతరంగా పరిణమించింది. అప్పుడాయన సహాబాను సంప్రతించగా, ముహమ్మద్‌ బిన్‌ సలమ, ముగైర బిన్‌ షాబ (రజి అల్లాహు అన్‌హుం)లు ఆయన సన్నిధికి వచ్చి, “ఈ వ్యవహారంలో ఒక బానిస లేక బానిసరాలికి స్వాతంత్రం వొసగటం తగిన పరిహారంగా మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)తీర్పు ఇచ్చారంటూ సాక్ష్యమిచ్చారు. ఆ మేరకు హజ్రత్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు) కూడా తీర్పు ఇచ్చారు.

                      [1] ఇమ్లాస్‌ అంటే ఒక స్త్రీ తన గర్భస్థ శిశువును ఒకరి ఒత్తిడి లేక వేధింపు మూలంగా (భ్రూణ హత్య చేయటం]

                      హజ్రత్‌ ఉస్మాన్‌ (రది అల్లాహు అన్హు) దగ్గరకు ఒక సమస్య వచ్చింది. భర్త చనిపోయిన మీదట భార్య తన ఇంట్లో ఎన్ని రోజులు “ఇద్దత్‌” (శోకం) పాటించాలి? అన్నది ఆ సందేహం. ఈ వ్యవహారంపై ఆయన దర్యాప్తు చేయగా అబూసయీద్‌ (రది అల్లాహు అన్హు) సోదరి అయిన ఫరీయ బిన్తె మాలిక్‌ బిన్‌ సనాన్‌ కబురంపిస్తూ, తన భర్త మరణించినపుడు అతని ఇంట్లోనే నిలకడగా ఉంది నిర్ణీత ఇద్దత్‌ గడువును పూర్తి చేయవలసిందిగా దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తనకు ఆదేశించారని ధృవీకరించారు. చివరకు హజ్రత్‌ ఉస్మాన్‌ (రది అల్లాహు అన్హు) కూడా ఈ మేరకే తీర్పు ఇచ్చారు.

                      అలాగే హజ్రత్‌ ఉస్మాన్‌ (రది అల్లాహు అన్హు) గారు, వలీద్‌ బిన్‌ ఉఖబ మద్యం సేవించారని తెలిసి సున్నత్‌ ప్రకారం శిక్ష విధించారు.

                      హజ్‌ యాత్రకు సంబంధించిన ఒకానొక క్రియ (తమత్తు) విషయం హజ్రత్‌ ఉస్మాన్‌ (రది అల్లాహు అన్హు) గారి అభిప్రాయం భిన్నంగా ఉందని హజ్రత్‌ అలీ (రది అల్లాహు అన్హు)గారికి తెలిసినపుడు హజ్రత్‌ అలీ (రది అల్లాహు అన్హు) హజ్‌ మరియు ఉమ్రా రెండింటికీ సంబంధించిన “ఇహ్రామ్‌” కట్టుకుని ఇలా చెప్పారు. “నేను ప్రజలలో ఏ ఒక్కరో వెలిబుచ్చిన అభిప్రాయం ఆధారంగా దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సున్నత్‌ను త్యజించజాలను”.

                      మరి కొంతమంది హజ్రత్‌ అబూబకర్‌, హజ్రత్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు)ల అభిప్రాయం ఆధారంగా హజ్రత్‌ అబ్దుల్లా బిన్‌ అబ్బాస్‌ (రది అల్లాహు అన్హు) సన్నిధికి వచ్చి ‘తమత్తు”పై హజ్టె ఇఫ్రాద్‌ శ్రేష్టమైనదని నిదర్శనం ఇవ్వగా హజ్రత్‌ అబ్దుల్లా బిన్‌ అబ్బాస్‌ ఇలా పలికారు: “త్వరలోనే ఆకాశం మీద నుండి మీపై రాళ్లు పడతాయి! దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఈ విధంగా చెప్పారని నేనంటూ ఉండగా, అబూబకర్‌,ఉమర్‌ల అభిప్రాయం ఇలా ఉందని మీరంటారా?!”

                      ఎవరైనా హజ్రత్‌ అబూబకర్‌, ఉమర్‌ల మాటపై ఆచరిస్తూ సున్నత్‌ను వ్యతిరేకించగా దైవానుగ్రహం విరుచుకుపడే ప్రమాదం కనిపించినపుడు, ఇక అబూబకర్‌, ఉమర్‌ల కన్నా తక్కువస్థాయి గల వ్యక్తి మాటలపై, సలహాలపై నడుస్తూ నున్నత్‌ను’ వ్యతిరేకించిన వారి స్థితి ఇంకెంత నికృష్ణంగా తయారవుతుందో కాస్త ఆలోచించండి.

                      మరి కొంతమంది కొన్ని హదీసుల విషయంలో హజ్రత్‌ అబ్దుల్లా బిన్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు)తో విభేదించగా, “ఏమిటీ, మనం ఉమర్‌ను అనుసరించడానికి కట్టుబడి ఉన్నామా!?” అని అబ్దుల్లా బిన్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు) ఆశ్చర్యం వ్యక్తపరిచారు.

                      ఇమ్రాన్‌ బిన్‌ హసీన్‌ (రది అల్లాహు అన్హు) హదీసు పాఠం ఇస్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి, “మీరు మాకు ఖుర్‌ఆన్‌ గురించి విశదీకరించండి” అని కోరాడు. ఇది విని ఆయన కోపగించుకున్నారు. పైగా ఆయన ఇలా అన్నారు: “దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారి సున్నత్‌ ఖుర్‌ఆన్‌కు తాత్పర్యం వంటిది. సున్నతే గనక లేకుంటే జుహ్ర్‌లో నాలుగు రకాతులున్నాయనీ, మగ్రిబ్‌లో మూడు రకాతులనీ, ఫజ్ర్లో రెండు రకాతులనీ మనకు తెలిసేది కాదు. అలాగే జకాత్‌ తీరుతెన్నులను గురించి మనం తెలుసకోలేకపోయేవారం. అలాగే నేడు సున్నత్‌లో ఉన్న మరెన్నో అంశాలు మనకు తెలియకుండా పోయేవి”.

                      దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)గారి సున్నత్‌ పట్ల ప్రవక్త సహచరులకు గల భక్తి శ్రద్ధలు అపారం. ఒక్కో సున్నత్‌ను ఆచరణలో పెట్టాలని వారు ఉవ్విళ్లూరు తుండేవారు. ఏ సున్నత్‌నయినా ఎవరన్నా చిన్నచూపు చూస్తున్నట్లు అగుపిస్తే దైవానుగ్రహం ఎక్కడ విరుచుకు పడుతుందోనని వారు భీతిల్లేవారు. సున్నత్‌ను ఎవరయినా నిర్లక్ష్యం చేస్తే ఆగ్రహోదగ్రులయ్యేవారు. అలాంటి సంఘటనలు చరిత్రలో కోకొల్లలు. ఉదాహరణకు ఒక సంఘటనను చూడండి :-

                      “అల్లాహ్ దాసీలను (మహిళలను) మస్జిద్లకు రాకుండా అడ్డుపడకండి” అని మహనీయ ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్‌ అబ్దుల్లా బిన్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు) వివరిస్తుండగా ఆయన కుమారులలో ఒకరు కల్పించుకుని, ‘అల్లాహ్ సాక్షి! మేము వాళ్లను తప్పకుండా అడ్డుకుంటాము’ అని అన్నాడు. దానిపై అబ్దుల్లా బిన్‌ ఉమర్‌ (రది అల్లాహు అన్హు) తీవ్రమైన ఆగ్రహాన్ని వెలిబుచ్చటమే గాక తన కొడుకుని తీవ్రంగా మందలించారు. ఇంకా ఆయన ఇలా అన్నారు: – “దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రబోధించారు” అని నేనంటూ ఉండగా “మేము తప్పక అడ్డుకుంటాము” అని నువ్వంటావా?!”

                      మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రత్యక్ష సహచరులలో ఒకరైన అబ్దుల్లా బిన్‌ మగ్‌ఫిల్‌ ముజ్‌నీ (రది అల్లాహు అన్హు) గారు తన బంధువైన ఒక వ్యక్తి కంకరరాళ్లు విసురుతుండగా చూచి అతన్ని వారించారు. ఇంకా అతనికి ఇలా నచ్చజెప్పారు. “దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కంకరరాళ్లు విసరడాన్ని వారించారు. ఎందుకంటే ఇవి వేటాడే వాటిని కూల్చడం గానీ, శత్రువును గాయపరచటం గానీ చేయలేవు. కాకపోతే వీటి మూలంగా పల్లు (దంతాలు) రాలటమో, కళ్లు పగలడమో జరుగుతుందని దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సెలవిచ్చి ఉన్నారు.” మరి కొన్నాళ్ల తరువాత కూడా ఆ వ్యక్తి కంకరరాళ్లు విసరుతుండటం చూచి, “అల్లాహ్ సాక్ష్యం! నేను ఇక ఎన్నటికీ నీతో మాట్లాడను. దైవప్రవక్త గారు కంకరరాళ్లు విసరరాదని చెప్పారని నేను ఎంత మొత్తకున్నా నువ్వు మళ్లీ అదే పని చేస్తున్నావు” అని ఆయన తన అయిష్టాన్ని అసహనాన్ని అభివ్యక్తం చేశారు.

                      “మీరు ఎప్పుడయినా, ఎవరి ముందరయినా హదీసు పాఠం ఇస్తూ ఉండగా, “దీన్ని వదలండి, మాకు (కేవలం) పవిత్ర ఖుర్‌ఆన్‌ నుంచి ఏదైనా బోధించండి” అని అతనంటే అతడు మార్గవిహీనుడయ్యాడని మీరు తెలుసకోండి” అని ప్రముఖ తాబయీ అయూబ్‌ సక్తియానీ చెప్పినట్లు ఇమామ్‌ బైహఖీ నకలు చేశారు.

                      ఇమామ్‌ అవ్‌జాయి (రహమతుల్లా అలై) మాటల్లోనే చెప్పాలంటే సున్నత్‌ దైవగ్రంథానికి విపులీకరణ వంటిది. (భావమేమిటంటే) ఖుర్‌ఆన్‌లో క్లుప్తంగా ఉన్న దానిని ప్రవక్తగారి సున్నత్‌ వివరించి చెబుతుంది). నిక్షిప్తమై ఉన్న విషయాన్ని విడమరచి – అందరికీ అర్ధమయ్యేలా – చెబుతుంది. ఉదాహరణకు అల్లాహ్  ఇలా సెలవిచ్చాడు.

                      “(ఓ ప్రవక్తా!) ఈ జ్ఞాపికను (ఖుర్‌ఆన్‌ను) నీపై అవతరింపజేశాము. నీవు ప్రజల ముందు వారి కోసం అవతరింపజేయబడిన ఉపదేశాన్ని స్పష్టంగా వివరించటానికి, (స్వయంగా) ప్రజలు కూడా ఆలోచించటానికీనూ”. (ఆన్‌ నహ్ల్‌ – 44)

                      “నాకు గ్రంథం వొసగబడింది. దాంతో పాటు దాని ఉపమానం (సున్నత్‌) కూడా ప్రసాదించబడింది” అన్న ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారి పలుకు ఇంతకు ముందు కూడా వచ్చింది.

                      ఆమిర్‌ షాబీ గారు జనుల ఉద్దేశ్యించి ఇలా పలికారని ఇమామ్‌ బైహకీ పొందు పరిచారు. “ఎప్పుడైతే మీరు చిహ్నాలను (అనగా సహీహ్‌ హదీసులను) వదలి వేశారో అప్పుడు మీరు వినాశం పొందారని తెలుసుకోండి”.

                      ఇమామ్‌ అవ్‌జాయి కొంతమంది సహచరులనుద్దేసించి ఇలా ప్రబోధించారు: “దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారి ద్వారా నీకు ఏదయినా హదీసు చేరినపుడు మరో మాట చెప్పడానికి నీవు భయపడాలి. ఎందుకంటే దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారుఅల్లాహ్ తరపున నియుక్తులైన సందేశ ప్రదాత”. (దీనిని కూడా ఇమామ్‌ బైహఖీ గారే నకలు చేశారు.)

                      ప్రఖ్యాత ఇమామ్‌ సుఫియాన్‌ సవ్రీ  చెప్పారని ఇమామ్‌ బైహఖీ ఉల్లేఖించారు: “జ్ఞానం అనేది ఏదైనా ఉంటే అది సాంతం చిహ్నాల (సహీహ్‌ హదీసుల) జ్ఞానమే”.

                      ఇమామ్‌ మాలిక్‌ (రహమతుల్లా అలై) ఇలా ఉపదేశించారు: “మనలో ప్రతి ఒక్కరిమాట స్వీరించవచ్చు లేక అతని మాట అతని పైనే రద్దు చేయవచ్చు. కాని ఈ సమాధివాసి విషయం అలా కాదు”. ఇలా పలుకుతూ ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి సమాధి వైపు సంజ్ఞ చేశారు. అంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి హదీస్‌ పై అమల్‌ చేయటమేగాని తిరస్కరించరాదు. తిరస్కరిస్తే అది కుఫ్ర్కి దారి తీస్తుంది.

                      ఇమామ్‌ అబూహనీఫా (రహమతుల్లా అలై) ఉపదేశించారు: “మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తరపున ఏదైనా హదీసు అందితే అది మాకు శిరోధార్యం అవుతుంది”.

                      ఇమామ్‌ షాఫయి (రహమతుల్లా అలై) ఒకసారి ఇలా అన్నారు: “మహనీయ ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) ద్వారా ఏదైనా సహీహ్‌ హదీసు అందగా నేను దాన్ని స్వీకరించకపోతే నాకు మతి చలించిందనుకోవాలి. ఈ మాటకు మిమ్మల్ని సాక్ష్యంగా పెడుతున్నాను. (అంటే నేను పిచ్చివాణ్ణి అయినపుడే ఇలా విపరీతంగా ప్రవర్తిస్తాను)”.

                      ఆయన ఇంకా ఇలా అన్నారు:

                      నేను ఎప్పుడైనా ఏదైనా విషయంలో అభిప్రాయం వ్యక్తం చేయగా అది దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారి హదీసుకు విరుద్ధంగా ఉంటే నా అభిప్రాయాన్ని గోడకేసి కొట్టండి”.

                      ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌ (రహమతుల్లా అలై) తన సహచరులు కొంతమందిని ఉద్దేశ్యించి ఇలా ప్రబోధించారు:

                      “మీరు నన్ను గానీ, ఇమామ్‌ మాలిక్‌ని గాని, ఇమామ్‌ షాఫయిని గానీ అనుసరించకండి. దీనికి బదులు మేము ఎక్కడి నుంచి విషయాన్ని గ్రహించామో అక్కడి నుండి మీరూ గ్రహించండి”.

                      ఆయన ఈ విధంగా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు: “దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారి గురించి, ఆయన హదీసుల ప్రామాణికత గురించి క్షుణ్ణంగా తెలిసి కూడా సుఫియాన్‌ సూరీ అభిప్రాయల వైపుకు మొగ్గుచూపే ఈ జాతిని చూసి నాకు ఆశ్చర్యమేస్తుంది. వాస్తవానికి అల్లాహ్‌ ఇలా ఆజ్ఞాపించి ఉన్నాడు-

                      “దైవప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించేవారు, తాము ఏదయినా ఉపద్రవంలో చిక్కుకుపోతామేమో అనీ, తమపై బాధాకరమైన శిక్ష వదైనా అవతరిస్తుందేమో అనీ భయపడాలి”. (సూర నూర్‌ – 63)

                      తరువాత ఇమామ్‌గారు ఇలా అన్నారు: “చెడుగు (ఉపద్రవం) ఏమిటో మీకు తెలుసా? అదే షిర్క్‌ దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గారి ఏ ప్రవచనాన్నయినా మనిషి రద్దు చేసినవాడు మనిషి హృదయంలో వక్రత చోటు చేసుకుని అది అతన్ని వినాశం పాలుజేసే అవకాశం ఉంది”.

                      ప్రముఖ తాబయి హజ్రత్‌ ముజాహిద్‌ గారి పలుకులను ఇమామ్‌ బైహఖీ ఉటంకించారు – హజ్రత్‌ ముజాహిద్‌ ఇలా అన్నారు – “మీ మధ్య ఏదేని విషయంలో వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త వైపుకు మరలించండి అని ఖుర్‌ఆన్‌లో ఉంది. ఇక్కడ అల్లాహ్‌ అంటే భావం దైవగ్రంథం (ఖుర్‌ఆన్‌). దైవప్రవక్త అంటే భావం దైవప్రవక్త నెలకొల్పిన సంప్రదాయం వైపుకు మరలటం.”

                      హజ్రత్‌ ఇమామ్‌ జహ్‌రీ పలుకులను కూడా ఇమామ్‌ బైహఖి పొందుపరచారు: “మనకు పూర్వం గడచిన పండితులు, సున్నత్‌ను గట్టిగా పట్టుకొని ఉండటంలోనే మోక్షం ఉందని చెప్పేవారు”.

                      ఇంతకు ముందు ఉదాహరించబడిన సూరె నూర్‌లోని 63వ ఆయతుకు వ్యాఖ్యానం చెబుతూ అల్లామా ఇబ్నె కసీర్‌ ఇలా అన్నారు:

                      “దైవప్రవక్త ఆజ్ఞ అంటే ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) గారి మార్గం, పద్ధతి, విధానం, సంప్రదాయం, ధర్మం అని భావం. అంటే మనిషి యొక్క మాటలు, చేతలు అన్నీ దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) మాటలు, చేతల కనుగుణంగా ఉన్నాయో లేదా అని పరీక్షించబడతాయి. ఉంటే అవి స్వీకారాయోగ్యమవుతాయి. లేకుంటే మరుగుపరచబడతాయి – ఆ మనిషి ఎంత గొప్పవాడైనా సరే!”

                      సహీహ్‌ బుఖారీ, ముస్తిం మరియు ఇతర ప్రామాణికమైన గ్రంథాల ద్వారా ధృవీకరించబడిన ఒక హదీసులో మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారు ఇలా ప్రవచించారు:

                      మన్‌ అమిల అమలన్‌ లైస అలైహి అమ్‌రునా ఫహువ రద్దున్‌.

                      ఎవరయినా మేము ఆజ్ఞాపించని దానిని ఆచరిస్తే అటువంటి ఆచరణ త్రోసిపుచ్చబడుతుంది.

                      కాబట్టి ఇలాంటి పోకడలకు దూరంగా ఉండటమే గాకుండా వాటికి భయపడాలి. ఎందుకంటే మహనీయ ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం)గారి షరీయత్‌ను “లోలోపలగానీ, బహిర్గతంగా గానీ వ్యతిరేకించినవాడు ఉపద్రవంలో చిక్కుకున్న వాడవుతాడు. అలాంటి వ్యక్తి హృదయంలో అవిశ్వాసం, కాపట్యం, అపసవ్యతలు జొరబడి అతడు దైవానుగ్రహానికి పాత్రుడయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. ఆ ఆగ్రహం అనేక విధాలుగా ఉండవచ్చు. మార్గభ్రష్టతకు పాల్పడి గందరగోళాన్ని సృష్టించినందుకు అతడు హతమార్చబడవచ్చు, లేక ఆంక్షలకు గురికావచ్చు లేదా నిర్బంధించబడనూ వచ్చు!

                      మహనీయ ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్ అబూహురైర (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

                      “నేను మరియు మీ యొక్క ఉపమానం అగ్నిని రాజేసిన వ్యక్తి లాంటిది. ఆ అగ్ని పరిసరాలను దేదీప్యమానం చేయగా దీపపు పురుగులు దాని చుట్టూ మూగి తమను తాము అగ్నికి ఆహుతి చేసుకోసాగాయి. అతను వాటిని ఆపసాగాడు. కాని అవి అతనిపై ఆధిక్యతను ప్రదర్శించి ఆత్మాహుతి చేసుకుంటాయి. నేనూ మరియు మీ యొక్క ఉపమానం కూడా ఇలాంటిదే. అగ్ని నుంచి కాపాడే ఉద్దేశ్యంతో నేను మిమ్మల్ని ఆపసాగాను. కాని మీరు నాపై ఆధిపత్యం చెలాయించి మిమ్మల్ని మీరు అగ్నికి ఆహుతి చేసుకుంటున్నారు”. (ఇహమ్‌ అహ్మద్‌)

                      అల్లామా సుయూతీగారు తన గ్రంథం “మిఫ్తాహుల్‌ జన్నతి ఫిల్‌ ఇహ్తే జాజ్‌ బిస్సున్నా లో ఇలా వ్రాశారు:

                      “అల్లాహ్‌ మీపై దయజూపుగాక! హదీసు సూత్రాల ప్రకారం ఏ హదీసు అయితే సహీహ్‌ హదీసుగా నిరూపించబడిందో – అది ఒకవేళ వాక్కు అయినా సరే, కర్మ అయినా సరే – దాని ప్రామాణికతను గనక ఎవరయినా త్రోసిపుచ్చితే అతడు కాఫిర్‌ అయిపోతాడు, ఇస్లాం పరిధి నుండి బహిష్మరించబడతాడు. ప్రళయదినాన అతడు యూదులు క్రైస్తవులతో పాటు లేపబడతాడు”.

                      సున్నత్‌ పట్ల గౌరవం, దాని ఆచరణ యొక్క ఆవశ్యకత, దాని పట్ల వ్యతిరేక భావం యొక్క దుష్పరిణామానికి సంబంధించిన ఎన్నో ఉల్లేఖనాలు సహాబాలు, తాబయీన్‌ల ద్వారా రూఢీ అవుతున్నాయి. ఆ మహనీయుల అనంతరం వచ్చిన పండితులు, విద్వాంసులు, హదీసువేత్తలు కూడా ఈ విషయంలో ప్రమాణబద్ధమైన ప్రకటనలు చేశారు….. ఈ అంశంపై నేను ఉదాహరించిన ఖుర్‌ఆన్‌ ఆయతులు, హదీసులు, ఉల్లేఖనాలు, ఉదంతాలు విషయావగాహనకు సరిపోతాయని ఆశిస్తాను. సత్యం కొరకు తహతహలాడే వారికి ఈ ఉదాహరణలు సంతృప్తిని కలిగిస్తాయని భావిస్తాను.

                      మేము మా కొరకు, సమస్త ముస్తిముల కొరకు ఈ సత్యార్యాలను చేసే సద్బుద్ధిని ప్రసాదించమని అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నాము. అల్లాహ్‌ను ప్రసన్నుణ్ణి చేయడానికి ఆరాటపడే, ఆయన ఆగ్రహానికి దూరంగా ఉండాలని కాంక్షించే వారి కొరకు ప్రార్ధిస్తున్నాము. ఆయన మనందరినీ సన్మార్గంపై నడిపించాలని ప్రార్ధన! నిస్సందేహంగా ఆయన వినేవాడు, చేరువలో ఉన్నవాడు.

                      ఇదే మాసందేశం (పుస్తక పబ్లిషర్స్ నుండి)

                      అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన అనుచర వర్గానికి దేని గురించి ఆదేశించారో,దేనిని స్వయంగా ఆచరించి చూపించారో, మరి దేన్ని అనుమతించారో దాన్ని యధావిధిగా ఆచరించాలి. పవిత్ర ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు :

                      “దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దానిని పుచ్చుకోండి, ఇంకా ఆయన మిమ్మల్ని వారించిన దానికి దూరంగా ఉండండి.” (59:7)

                      దైవ ప్రవక్త ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) తన జీవిత కాలంలో చేయని దానిని మీరు మీ ఇష్టానుసారం చేసి కొత్త పుంతలు తొక్కకండి. అలా చేస్తే మీరు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) విధానాన్ని నిర్లక్ష్యం చేసిన వారవుతారు. దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఇలా హెచ్చరించాడు: “విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తను మించి పోయే యత్నం చేయకండి.” (49:1)

                      మహనీయ ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) గారి విధానమే ఆదర్శనీయం, అనుసరణీయం. దాన్ని కాదని ఇతరత్రా విధానాలను అనుసరించి, ఇతరుల అభిప్రాయాలను ప్రమాణంగా తీసుకుని మీ సదాచరణలను పాడు చేసుకోకండి. ఈ విషయాన్నే పరమ ప్రభువు తన గ్రంథంలో ఇలా పేర్కొన్నాడు : “ఓ విశ్వసించిన వారలారా! అల్లాహ్‌కు, మరియు ఆయన ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపండి. ఇంకా, మీ  ఆచరణలను వృధా చేసుకోకండి.” (47:99)

                      షిర్క్ నాలుగు సూత్రాలు – షేఖుల్ ఇస్లాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ [పుస్తకం & వీడియో పాఠాలు]

                      al-qawaid-al-arbah.gif

                      ఇస్లాం ధర్మం యొక్క నాలుగు నియమాలు
                      (అల్ ఖవాఇద్ అల్ ఆర్బా)
                      షిర్క్ నాలుగు సూత్రాలు

                      మూలం:షేఖుల్ ఇస్లాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ (రహమతుల్లాహ్ అలై)
                      అనువాదకులు:ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
                      పుస్తకం నుండి:ఇస్లాం మూల సూత్రాలు (హదీసు పబ్లికేషన్స్)

                      [ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
                      [PDF] [9 పేజీలు] [మొబైల్ ఫ్రెండ్లీ]


                      بسم الله الرحمن الرحيم

                      أسأل الله الكريمَ ، ربَّ العرش العظيم: أن يتولاّك في الدنيا والآخرة، وأن يجعلك مباركاً أينما كُنْتَ

                      మహోన్నత సింహాననానికి అధిపతి అయిన అల్లాహ్‌ దర్బారులో అభ్యర్ధించుకుంటున్నాను – ఆయన ఇహపరాలలో మిమ్మల్ని పర్యవేక్షిస్తూ ఉండుగాక! మీరెక్కడున్నా మిమ్మల్ని శుభవంతుల్ని చేయుగాక!

                        وأن يجعلكَ مِمن إذا أعطي شَكَر، وإذا ابْتُلي صَبر، وإذا أذنب استغفر، فإن هذه الثلاث عنوانُ السعادة

                      కలిమిని ప్రసాదించినపుడు కృతజ్ఞతలు తెలుపుకునే, లేమికి గురి చేసినప్పుడు సహనం వహించే, తప్పులు జరిగిపోయినప్పుడు పశ్చాత్తాపం చెందే సజ్జనులకోవలో మిమ్మల్ని చేర్చుగాక!- ఈ మూడు విషయాలే మహాభాగ్యం అనబడతాయి.

                      اعلم أرشدك الله لطاعته أن الحنيفية – مِلةَ إبراهيمَ – : أنْ تَعبُدَ الله مُخلصاً له الدين، وبذلك أمرَ الله جميع الناس، وخَلَقهم لها ، كما قال

                      ఆరాధనలో ఏకాగ్ర చిత్తం కలిగి ఉండటం – ఇబ్రాహీం (అలైహిస్సలాం) అనుయాయునిగా మారటం – అంటే ఏమిటో తెలుసా?! ఒక్కడైన అల్లాహ్‌ను సేవించడంలో చిత్తశుద్ధినీ, వజ్ర సంకల్పాన్ని కనబరచటం! అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు:

                      وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ

                      “మేము మానవుల్ని, జిన్నుల్ని మా దాస్యం కోసమే పుట్టించాము.” (అజ్జారియాత్‌ 51:56)

                      فإذا عرفتَ أن الله خلقك لعبادته: فاعلم أنّ العبادةَ لا تُسمى عبادةً إلا مع التوحيد، (كما أنّ الصلاة لا تُسمى صلاة إلا مع الطهارة)

                      అల్లాహ్‌ తన దాస్యం కోసమే మిమ్మల్ని పుట్టించాడన్న సంగతి మీకు తెలిసినప్పుడు, ఆ దాస్యం స్వచ్చమైన – ఏకేశ్వరోపాసన (తౌహీద్‌) – తో కూడుకున్నదై ఉండాలన్న సత్యం కూడా మీరు తెలుసుకోవటం అవసరం. ఏ విధంగానయితే మీరు శుచీ శుభ్రతల (తహారత్‌)ను పాటించినపుడే నమాజ్‌ నెరవేరుతుందో అదే విధంగా అద్వితీయుడైన అల్లాహ్ కు భాగస్వామ్యం (షిర్క్‌)కల్పించకుండా ఉన్నప్పుడే దాస్యం స్వీకార యోగ్యం అవుతుంది.

                      فإذا دخل الشركُ في العبادة فسدتْ، (كالحَدَثِ إذا دخل في الصلاة) ، كما قال تعالى

                      ఆరాధన (దాస్యం)లోనే గనక “షిర్క్‌” వచ్చి చేరితే అది కలుషితం అయిపోతుంది.శుచీ శుభ్రతలను అశుద్ధ వస్తువులు పాడు చేసేసినట్లే షిర్క్‌తో కూడుకున్న పనులు స్వచ్చమైన తౌహీద్‌ను పాడు చేసేస్తాయి. దివ్యగ్రంథంలో అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు:

                      مَا كَانَ لِلْمُشْرِكِينَ أَن يَعْمُرُوا مَسَاجِدَ اللَّهِ شَاهِدِينَ عَلَىٰ أَنفُسِهِم بِالْكُفْرِ ۚ أُولَٰئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ وَفِي النَّارِ هُمْ خَالِدُونَ

                      “ముష్రిక్కులు అల్లాహ్‌ మసీదులలో సంరక్షకులుగా, సేవకులుగా ఉండటానికి పనికి రారు. ఎందుకంటే వారే స్వయంగా అవిశ్వాసులమని తమకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నారు. వారి కర్మలైతే అన్నీ వ్యర్థమై పోయాయి.నరకంలో వారు కలకాలం ఉండాలి.” (అత్‌ తౌబా 9:17)

                      فإذا عرفتَ أنّ الشرْكَ إذا خالط العبادة أفسدها وأحبط العمل وصار صاحبه من الخالدين في النار: عرفتَ أن أهمَّ ما عليك: معرفةُ ذلك؛ لعل الله أن يخلصك من هذه الشبكة، وهي الشرْكُ بالله

                      ‘షిర్క్‌’ (భాగస్వామ్యం) వల్ల ఆరాధనలు, ఆచరణలన్నీ వ్యర్థమైపోతాయనీ, ముష్రిక్కుల పర్యవసానం నరకమని మీకు తెలిసిపోయిన మీదట, ఆ “షిర్క్‌” గురించి క్షుణ్ణంగా తెలుసుకుని, దానిపట్ల జాగ్రత్త పడవలసిన బాధ్యత కూడా మీపై ఉంది; అప్పుడే మీరు ఆ వినాశకర చేష్ట నుండి మిమ్మల్ని మీరు రక్షించు కోగలుగుతారు. దాని గురించి అల్లాహ్‌ ఇలా అంటున్నాడు:

                      إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ

                      “అల్లాహ్‌ దృష్టిలో షిర్కు ఒక్కటే క్షమార్హం కానిది.అది తప్ప తాను కోరిన వారి అన్ని పాపాలను ఆయన క్షమిస్తాడు.” (అన్‌ నిసా 4:116)

                      : وذلك بمعرفة أربع قواعد ذكرها الله في كتابه

                      అల్లాహ్‌ తన గ్రంథంలో ప్రస్తావించిన ఈ క్రింది నాలుగు ప్రధానాంశాలను తెలుసుకున్నప్పుడే దీని గురించిన పూర్తి అవగాహన ఏర్పడుతుంది.

                      మొదటి నియమం :

                      దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు వ్యతిరేకంగా వైర వైఖరిని అవలంబించి, కయ్యానికి కాలు దువ్విన అవిశ్వాసులు కూడా అల్లాహ్‌ను సృష్టికర్తగా, ఉపాధి ప్రదాతగా, విధాతగా అంగీకరించేవారు. కాని వారి ఈ అంగీకారం వారిని ఇస్లాంలో చేర్చలేకపోయింది. (అంటే ఒక్కడైన అల్లాహ్‌ను సేవించే వరకూ వారు ముస్లింలు కాలేకపోయారు.) దివ్యగ్రంథంలోని దైవోపదేశం ఇందుకు ప్రబల నిదర్శనం:

                      قُلْ مَن يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ أَمَّن يَمْلِكُ السَّمْعَ وَالْأَبْصَارَ وَمَن يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَيُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ وَمَن يُدَبِّرُ الْأَمْرَ ۚ فَسَيَقُولُونَ اللَّهُ ۚ فَقُلْ أَفَلَا تَتَّقُونَ

                      వారిని అడుగు : ఆకాశం నుండీ, భూమి నుండీ మీకు ఉపాధినిచ్చేవాడు ఎవడు? వినే శక్తీ, చూసే శక్తీ ఎవడి అధీనంలో ఉన్నాయి? ప్రాణములేని దాని నుండి ప్రాణమున్న దానినీ, ప్రాణమున్న దాని నుండి ప్రాణములేని దానినీ వెలికి తీసేవారు తప్పకుండా అంటారు. ఇలా అను: “అలాంటప్పుడు మీరు (షిర్క్‌కు వ్యతిరేకంగా నడవటం) మానుకోరేమిటి?” (యూనుస్‌ 10:31)

                      రెండవ నియమం :

                      తాము వాళ్ళను (తమ మిథ్యా దైవాలను, వలీలను) కేవలం సామీప్యం కోసం, సిఫారసు కోసమే పిలుస్తున్నామని ముష్రిక్కులు అనేవారు. ఈ సామీప్యానికి వారిచ్చే నిదర్శనం ఏమిటంటే ఈ వలీలు, పుణ్య పురుషులు తమను అల్లాహ్‌కు చేరువ చేస్తారని అనేవారు. కాని ఇది పచ్చి షిర్క్‌. ఈ సందర్భంగా అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు :

                      أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ ۚ وَالَّذِينَ اتَّخَذُوا مِن دُونِهِ أَوْلِيَاءَ مَا نَعْبُدُهُمْ إِلَّا لِيُقَرِّبُونَا إِلَى اللَّهِ زُلْفَىٰ إِنَّ اللَّهَ يَحْكُمُ بَيْنَهُمْ فِي مَا هُمْ فِيهِ يَخْتَلِفُونَ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي مَنْ هُوَ كَاذِبٌ كَفَّارٌ

                      ఇక ఆయనను వదిలివేసి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారు, (తమ ఈ చర్యకు సమర్థింపుగా) “వారు మమ్మల్ని అల్లాహ్‌ వద్దకు చేరుస్తారని మాత్రమే వారిని ఆరాధిస్తున్నాము” అని అంటారు.అల్లాహ్‌ నిశ్చయంగా వారి మధ్యన వారు విభేదిస్తున్న అన్ని విషయాలను గురించి తీర్పు చెబుతాడు. అసత్యవాదీ, సత్య ధిక్కారి అయిన ఏ వ్యక్తికీ అల్లాహ్‌ సన్మార్గం చూపడు.” (జుమర్‌-3)

                      సిఫారనుకు సంబంధించిన (అంటే వారు కల్పించుకున్న కాల్పనిక దేవుళ్ళు వారికి వారధిగా ఉంటారన్న వారి నమ్మకం షిర్క్‌ అని చాటి చెప్పే) ఆయతు:

                      وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ وَيَقُولُونَ هَٰؤُلَاءِ شُفَعَاؤُنَا عِندَ اللَّهِ ۚ قُلْ أَتُنَبِّئُونَ اللَّهَ بِمَا لَا يَعْلَمُ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ

                      “ఈ ప్రజలు అల్లాహ్‌ను కాదని తమకు నష్టాన్ని గానీ, లాభాన్ని గానీ కలిగించలేని వారిని పూజిస్తున్నారు.పైగా ఇలా అంటున్నారు : “వారు అల్లాహ్‌ వద్ద మా కొరకు సిఫారసు చేస్తారు.” (ప్రవక్తా!) వారితో ఇలా అను : ఆకాశాలలో గానీ, భూమిలో గానీ అల్లాహ్‌ ఎరుగని విషయాన్ని గురించి ఆయనకు మీరు తెలుపుతున్నారా?” ఆయన పరిశుద్దుడు.ఈ ప్రజలు చేసే షిర్కుకు అతీతుడు, ఉన్నతుడూను.” (యూనుస్‌ 10:18)

                      సిఫారసు రెండు రకాలు. ఒకటి: నకారాత్మక సిఫారను. రెండు : సకారాత్మక సిఫారసు.

                      1. నకారాత్మక సిఫారసు : అంటే అల్లాహ్‌కు మాత్రమే సాధ్యమైన వాటి కోసం దైవేతరుల ముందు అర్థించటం. దీనికి ఆధారం ఇది :

                      يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِمَّا رَزَقْنَاكُم مِّن قَبْلِ أَن يَأْتِيَ يَوْمٌ لَّا بَيْعٌ فِيهِ وَلَا خُلَّةٌ وَلَا شَفَاعَةٌ ۗ وَالْكَافِرُونَ هُمُ الظَّالِمُونَ

                      “విశ్వసించిన ఓ ప్రజలారా! క్రయ విక్రయాలు కూడా జరగని, మైత్రీ ఉపయోగ పడని, సిఫారసు కూడా చెల్లని, ఆ (చివరి) దినము రాక పూర్వమే, మేము మీకు ప్రసాదించిన సిరి సంపదలనుండి (మా మార్గంలో) ఖర్చుపెట్టండి. వాస్తవంగా అవిశ్వాస మార్గం అవలంబించేవారే దుర్మా ర్గులు”.’ (అల్‌ బఖర 2:254)


                      * ఈ సూక్తి గురించి వ్యాఖ్యానిస్తూ అల్లామా ఇబ్నె కసీర్‌ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు – అల్లాహ్‌ తన దాసులకు, తాను ప్రసాదించిన ఉపాధి నుండి, తన మార్గంలో ఖర్చుపెట్టమని ఆదేశిస్తున్నాడు.ఎందుకంటే వారు తవు ప్రభువు వద్ద తమ పుణ్య రాసులను సమకూర్చుకొవాలని! ప్రళయ దినం రాకముందే వారు ఈ పని చేసుకోవాలి.ఆ రోజు ఎంత కఠినమైనదంటే, ఆనాడక్కడ క్రయ విక్రయాలు గానీ, బేరసారాలు గానీ, స్నేహసంబంధాలు గానీ, రికమండేషన్లు గానీ ఏ మాత్రం పనికిరావు. పరిహారంగా సొమ్ము ఇవ్వటం కుదరదు. భూమండలం లోని బంగారాన్నంతటినీ ఇచ్చినా ఆనాడు మనిషి తనను విడిపించుకోలేడు. ఆవగింజంత ప్రయోజనం కూడా తన  ఆత్మకు చేకూర్చుకోజాలడు.

                      శంఖం ఊదబడిన రోజున వారు ఒక పట్టాన నిలదొక్కుకోవటం గానీ, ఒకరినొకరు పరామర్శించుకోవటం గానీ చేయలేరు. సిఫారసు చేసేవారి సిఫారసు కూడా ఏ విధంగానూ వారికి ఉపయోగ పడదు.


                      2. సకారాత్మక సిఫారసు : అంటే అల్లాహ్‌ను మాత్రమే వేడుకొనే సిఫారసు. సిఫారసు చేసేవాడు కూడా ఈ సిఫారసు మూలంగా ఆదరణీయుడవుతాడు. ఎవరి కోసమైతే సిఫారసు చేయబడుతుందో అతని వట్ల అల్లాహ్‌ కూడా ప్రసన్నుడవు తాడు. ఇటువంటి సిఫారసు కేవలం అల్లాహ్‌ నుండి మాత్రమే అర్థించబడుతుంది. ఎందుకంటే సిఫారసును ఆమోదించటం లేక ఆమోదించక పోవటమన్నది అల్లాహ్‌ అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది.కనుక దైవేతరుల నుండి అర్ధించేవాడు షిర్కుకు ఒడిగట్టినట్లే. ఎందుకంటే అతడు చేయరాని పనిని చేశాడు.’వేడుకోలు’కు విరుద్ధమైన వైఖరిని అవలంబించాడు.అల్లాహ్‌ కేవలం ఏకేశ్వరోపాసనను మాత్రమే ఇష్టపడతాడు. ఏకేశ్వరోపాసకులకై చేసే సిఫారసును మాత్రమే అంగీకరించి ఆమోదిస్తాడు. దివ్య ఖుర్‌ఆన్‌లో ఆయన సెలవిచ్చినట్లు:

                      مَن ذَا الَّذِي يَشْفَعُ عِندَهُ إِلَّا بِإِذْنِهِ

                      “ఆయన సన్నిధిలో ఆయన అనుజ్ఞ లేకుండా సిఫారసు చెయ్యగల వాడెవ్వడు?” (అల్‌ బఖర 2:255)

                      يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يَشْفَعُونَ إِلَّا لِمَنِ ارْتَضَىٰ

                      “వారు ఎవరిని గురించీ సిఫారసు చేయరు, సిఫారసు వినటానికి అల్లాహ్‌ ఇష్టపడిన వాని విషయంలో తప్ప.” (అంబియా 21:28)

                      قُل لِّلَّهِ الشَّفَاعَةُ جَمِيعًا

                      “ఇంకా ఇలా అను : సిఫారసు అనేది పూర్తిగా అల్లాహ్‌ చేతిలోనే ఉన్నది.” (అజ్‌ జుమర్‌ 29:44)

                      మూడవ నియమం:

                      దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పెక్కు ఆరాధ్య దైవాలను పూజించే ప్రజల్లో ప్రభవింప జేయబడ్డారు.ఆ ప్రజల్లో కొందరు దైవదూతలను పూజించగా, మరి కొందరు దైవప్రవక్తలను ఆరాధించేవారు. కొందరు మహనీయులను కొలవగా, ఇంకొందరు చెట్టు పుట్టలను, రాళ్ళు రప్పలను కొలిచేవారు. మరికొందరు సూర్యచంద్రులను సేవించేవారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వీళ్ళందరి మిథ్యా విధానాన్ని అంతమొందించారు.ఈ విషయంలో వారి మధ్య ఎలాంటి వ్యత్యాసం కనబరచలేదు. దీనికి నిదర్శనం ఖుర్‌ఆన్‌లోని ఈ సూక్తి:

                      وَقَاتِلُوهُمْ حَتَّىٰ لَا تَكُونَ فِتْنَةٌ وَيَكُونَ الدِّينُ كُلُّهُ لِلَّهِ

                      “పీడన ఏ మాత్రం మిగలకుండా పోయే వరకు, అల్లాహ్‌నిర్ణయించిన ధర్మం పూర్తిగా నెలకొల్పబడే వరకు ఈ అవిశ్వాసు లతో యుద్ధం చేయండి.” (అన్‌ఫాల్‌ 8:39)

                      సూర్యచంద్రుల దాస్యానికి సంబంధించిన నిదర్శనం ఇది:

                      وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ

                      “రేయింబవళ్ళు, సూర్యచంద్రులు అన్నీ ఆయన(అద్వితీయ శక్తికి) నిదర్శనాలలోనివి. కనుక మీరు సూర్యునికి గానీ, చంద్రునికి గానీ సాష్టాంగ పడకండి. మీకు దైవారాధన చేయాలనే ఉంటే ఈ నిదర్శనాలన్నింటినీ సృష్టించిన దైవానికి మాత్రమే సాష్టాంగపడండి.” (హామీమ్‌సజ్దా 41:37)

                      దైవదూతలను పూజించటం కూడా షిర్కేనన్న దానికి తార్కాణం:

                      وَلَا يَأْمُرَكُمْ أَن تَتَّخِذُوا الْمَلَائِكَةَ وَالنَّبِيِّينَ أَرْبَابًا

                      “మీరు దైవదూతలను, దైవప్రవక్తలను మీ ప్రభువుగా చేసుకోమని ఆయన మిమ్మల్ని ఆదేశించటం లేదు.” ‘ (ఆలె ఇమ్రాన్‌ 3:80)

                      దైవప్రవక్తలను పూజించటం, అక్కరల కోసం వారిని అర్థించటం ‘షిర్క్‌’ అన్న దానికి ఈ సూక్తి నిదర్శనం:

                      وَإِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ أَأَنتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُونِي وَأُمِّيَ إِلَٰهَيْنِ مِن دُونِ اللَّهِ ۖ قَالَ سُبْحَانَكَ مَا يَكُونُ لِي أَنْ أَقُولَ مَا لَيْسَ لِي بِحَقٍّ ۚ إِن كُنتُ قُلْتُهُ فَقَدْ عَلِمْتَهُ ۚ تَعْلَمُ مَا فِي نَفْسِي وَلَا أَعْلَمُ مَا فِي نَفْسِكَ ۚ إِنَّكَ أَنتَ عَلَّامُ الْغُيُوبِ

                      (ఆ సన్నివేశాన్ని గురించి కాస్త ఆలోచించండి) “మర్యమ్‌ కుమారుడవైన ఓ ఈసా! నీవు మనుష్య జాతితో, అల్లాహ్‌ను కాదని నన్నూ, నాతల్లిని దేవుళ్ళుగా భావించండి అని బోధించావా? అని అల్లాహ్‌ అడిగినప్పుడు అతను ఇలా మనవి చేనుకుంటాడు: “నీవు అత్యంత పవిత్రుడవు! ఏ మాటను అనే హక్కు నాకు లేదో ఆ మాటను అనడం నాకు యుక్తమైన పని కాదు. ఒకవేళ నేను ఆ విధంగా అని ఉంటే, అది నీకు తప్పకుండా తెలిసి ఉండేది. నామనస్సులో ఏముందో నీకు తెలుసు. నీమనస్సులో ఏముందో నాకు తెలియదు. నీవు గుప్తంగా ఉన్న యదార్థాలన్నీ తెలిసిన మహా జ్ఞానివి.” (అల్‌ మాయిద 5:116)

                      ఇక ఔలియాలు, పుణ్యపురుషులకు సంబంధించిన నిదర్శనం (అంటే వాళ్ళను వేడుకుని, వాళ్ళ ఆధారంగా దేవుని సామీప్యం పొందవచ్చుననుకోవటం షిర్క్‌. ఇలాంటి వ్యవహారాలకు అల్లాహ్‌ అతీతుడు, ఉన్నతుడు). ఈ సూక్తిని గమనించండి:

                      أُولَٰئِكَ الَّذِينَ يَدْعُونَ يَبْتَغُونَ إِلَىٰ رَبِّهِمُ الْوَسِيلَةَ أَيُّهُمْ أَقْرَبُ وَيَرْجُونَ رَحْمَتَهُ وَيَخَافُونَ عَذَابَهُ ۚ إِنَّ عَذَابَ رَبِّكَ كَانَ مَحْذُورًا

                      “ఈ ప్రజలు ఎవరిని మొర పెట్టుకుంటున్నారో వారే స్వయంగా తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందడానికి మార్గాన్ని వెతుకుతున్నారు. ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. వారు, ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు. ఆయన శిక్షకు భయపడుతున్నారు.” (బనీ ఇస్రాయీల్‌ 17:57)

                      ఇక చెట్టు పుట్టలు, రాళ్ళు రప్పలకు సంబంధించిన నిదర్శనం – అంటే వృక్షాలను, రాళ్ళను పూజించటం, మహనీయుల సమాధుల నుండి శుభం పొందాలని తాపత్రయ పడటం, తమ కష్టాలను, కడగండ్లను దూరం చేసుకోవటానికి వాళ్ళను మొక్కుకోవటం, వారి పేరున జంతువులను కోయటం, ఆ సమాధుల వద్ద కొంత కాలంపాటు గడపటం, అక్కడే ఆరాధనలు చేయటం, అక్కడి మట్టితో, వస్త్రాలతో ‘శుభం’ పొందగోరటం-ఇవన్నీ ‘షిర్క్‌’గా పరిగణించ బడతాయి. అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు –

                      أَفَرَأَيْتُمُ اللَّاتَ وَالْعُزَّىٰ

                      ఇప్పుడు చెప్పండి : “ఈ లాత్‌, ఈ ఉజ్జా, మూడోది ఒక దేవత అయిన మనాత్‌ల వాస్తవికత గురించి మీరు కాస్తయినా ఆలోచించారా?” (అన్‌ నజ్మ్‌ 53:19)


                      1 ఈ సూక్తికి వ్యాఖ్యానంగా హాఫిజ్‌ ఇబ్నె కసీర్‌ ఇలా అంటున్నారు: తనను తప్ప మరొకరిని పూజించమని అల్లాహ్ ఎన్నడూ ఆదేశించడు. తన దూతలను పూజించమని గానీ, తాను పంపిన ప్రవక్తలను ఆరాధించమని గానీ కోరడు. ఇస్లాం స్వీకరించిన తరువాత ధిక్కార వైఖరికి ఒడిగట్టమని కూడా అనడు. దైవేతరుల దాస్యం చేయమని పిలుపు ఇచ్చేవాడే ఇలాంటి ఆజ్ఞలు జారీ చేస్తాడు. దైవేతరుల దాస్యం కొరకు ఆహ్వానించిన వాడు నిశ్చయంగా  కుఫ్ర్కి (అవిశ్వాసానికి) ఒడిగట్టాడు. కాగా; దైవప్రవక్తలు సతతం ఈమాన్‌ గురించి మాత్రమే ఉపదేశిస్తారు. సాటిలేని సృష్టికర్తను నమ్మటం, దాస్యం చేయటమే ఈమాన్‌ బిల్లాహ్‌.

                      2. “ఊలాయి కల్లజీన……..” సూక్తి గురించి బుఖారీలో హజ్రత్‌ అబ్దుల్లాహ్ చే ఇలా ఉల్లేఖించబడింది – “ప్రజలు మొర పెట్టుకునే ఆ కొంతమంది ఎవరంటే వారు జిన్ను వర్గానికి చెందిన వారు. తరువాత వారు ఇస్లాం స్వీకరించారు.”

                      హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రది అల్లాహు అన్హు) కథనం ఈ విధంగా వుంది: “ఈ ఆయతు జిన్నులను పూజించే అరబ్బులను ఉద్దేశించి అవతరించింది. ఆ జిన్నులు తరువాత ఇస్లాం స్వీకరించారు. ఆ సందర్భంగానే ఈ ఆయతు అవతరించింది. వాస్తవం అల్లాహ్‌ యెరుక” (షేఖ్‌ ముహమ్మద్‌ మునీర్‌ డెమాస్కసీ)


                      అల్లాహ్‌ ముష్రిక్కుల వైఖరిని ఖండిస్తూ ఈ ఆయతును అవతరింపజేశాడు. వాళ్లు విగ్రహాలను, దేవీదేవతలను పూజించేవారు. వాళ్ల పేరుతో కాబా గృహం మాదిరిగా కట్టడాలు నిర్మించేవారు.

                      లాత్‌ : తాయఫ్‌లో ఒక తెల్లని రాయి ఉండేది. దానిపై ఓ గృహం నిర్మించబడింది. అందులో అనేక తెరలు ఉండేవి. అనేక మంది సేవకులుండేవారు. దాని చుట్టూ మైదానాలుండేవి. తాయఫ్‌లో సఖీఫ్‌ తెగవారి దృష్టిలోఈ కట్టడం ఎంతో పవిత్రమైనదిగా, పూజనీయంగా ఉండేది.ఆ ప్రదేశంలో ఆ విగ్రహం ఉన్నందుకు ఖురైషులతోపాటు ఇతర అరబ్బు తెగలవారు కూడా గర్వపడేవారు.

                      ఉజ్జా: ఇదొక వృక్షం.ఇది ‘నఖ్లా’ అనే స్థలంలో ఉంది. ఈ “నఖ్లా’ మక్కా నగరానికి తాయఫ్‌ పట్టణానికి మధ్య ఉంది. ఈవృక్షంపై ఒక కట్టడం వెలిసింది. దానిపై కొన్ని పరదాలు వేలాడదీయబడ్డాయి. ఖురైష్‌ తెగవారు ఈ కట్టడాన్ని ఆరాధించేవారు. ఈ కారణంగానేనేమో ఉహుద్‌ యుద్ధ దినాన అబూ సుఫ్యాన్‌ ఈ కట్టడాన్ని తలచుకుంటూ”మాకు అండగా, ఉజ్జా దేవత ఉంది. మీకెవరున్నారు?!” అని ముస్లింలకు సవాలు విసిరాడు.దానికి సమాధానంగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ప్రీయ సహచరుల చేత, “అల్లాహ్‌ మాకు అండగా ఉన్నాడు. మీకు అండగా ఎవరూ లేరు” అని చెప్పించారు.

                      మనాత్‌ : మక్కా-మదీనా నగరాల మధ్య ముసల్లల్‌ అనే స్ధలంలో ఈ విగ్రహం ఉండేది. అజ్ఞాన కాలంలో ఖుజాఅ, బెస్‌, ఖజ్రజ్‌ తెగల వారు ఈ విగ్రహానికి తమ శ్రద్ధాభక్తుల నివాళి ఘటించేవారు. హజ్‌ నెలలో కాబాకు వచ్చే యాత్రికులు ఈ స్థలం నుండే ఇహ్రామ్‌ దీక్ష బూనేవారు.ఈ కట్టడాలన్నింటినీ కూల్చడానికి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొంతమంది సహాబీలను పంపించారు. హజ్రత్‌ ఖాలిద్‌ బిన్‌ వలీద్‌ (రజి యల్లాహు అన్హు)ని మాత్రం “ఉజ్జా’ వైపునకు పంపారు.ఆయన ఆ కట్టడాన్ని నేలమట్టం చేస్తూ ఇలా పలికారు:-

                      ఓ ఉజ్జా! నేను నిన్ను ధిక్కరిస్తున్నాను. నీ పవిత్రతను కొనియాడబోను. అల్లాహ్‌ నీకు దుర్గతి పట్టించాడు.”

                      హజ్రత్‌ ముగీరా బిన్‌ షోబ (రజి యల్లాహు అన్హు), హజ్రత్‌ సుఫ్యాన్‌ (రజి యల్లాహు అన్హు)లను “లాత్‌’ విగ్రహం వైపునకు పంపించగా వారిద్దరూ కలసి ఆ విగ్రహాన్ని కూల్చివేశారు. ఆస్థలంలో ఒక మస్జిద్ను కూడా నిర్మించారు.ఈ విగ్రహం తాయఫ్‌ పట్టణంలో ఉండేది. మనాత్‌ విగ్రహం వైపునకు హజ్రత్‌ సుఫ్యాన్‌ పంపించబడ్డారు.ఆయన దాన్ని పడగొట్టారు. హజ్రత్‌ అలీ బిన్‌ అబూ తాలిబ్‌ పడగొట్టారని కూడా ఒక ఉల్లేఖనం ఉంది.

                      మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు సత్య ధర్మాన్ని తీసుకువచ్చారు. ఒక్కడైన సృష్టికర్తను సేవించమనీ, దైవారాధన స్వచ్భంగా ఉండాలనీ ఆయన ప్రజలకు బోధించారు. దురాచారాలను, షిర్కుతో కూడుకున్న కర్మలను ఆయన నిర్మూలించారు. ఆయన ప్రియ సహచరులు, వాళ్ల శిష్యులు కూడా ఈ సత్య ధర్మంపై స్థిరంగా ఉన్నారు. అయితే కాలక్రమేణా అనుయాయుల ధర్మావలంబనలో మార్చులు వచ్చాయి. ఆచరణలు కలగాపులగం అయి చాలా మంది ముస్లింలు షైతాన్‌ ఎత్తులకు చిత్తయిపోయారు. మిథ్యావాదులు ముస్లింలను లోబరుచు కున్నారు. వాళ్లు మళ్లీ విగ్రహారాధన వైపునకు మొగ్గసాగారు. తమకు తెలియ కుండానే వాళ్లు నెమ్మదిగా బహు దైవోపాసన వైపునకు తీసుకుపో బడుతున్నారు. కాని పండితులు ఈ విషయాన్ని పట్టించు కోవటం లేదు.ఇది ఎంతో శోచనీయం.

                      – షేక్‌ ముహమ్మద్‌ మునీర్‌ డెమాస్కసీ

                      హజ్రత్‌ అబూ వాఖిద్‌ లైసీ (రజి యల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: “మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలిసి హునైన్‌ వైపునకు బయలుదేరాము. ఆరోజుల్లోనే మేము దైవధిక్కార (కుఫ్ర్) ఊబిలో నుండి బయటపడి ఉన్నాము. దారిలో ఒక రేగి చెట్టు ఉండేది. బహు దైవారాధకులు ఆ వృక్షం వద్ద బైఠాయించేవారు. తమ ఆయుధాలను ఆ వృక్షానికి వ్రేలాడదీసేవారు. ఆ వృక్షం “జాతుల్‌ నవాద్‌”గా పిలువబడేది. ఆ వృక్షం వద్దకు సమీపించగానే, “దైవప్రవక్తా! ఏవిధంగానయితే ఈ వృక్షం వాళ్లకోసం ‘జాతుల్‌ నవాద్‌’గా ఉందో ఆ విధంగా మాక్కూడా ‘జాతుల్‌ నవాద్‌’ గా చేయండి”అని మేము ప్రాధేయపడ్డాము.దీనిపై మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఆగ్రహం చెందారు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వ్యాఖ్యానించారు:

                      “అల్లాహు అక్బర్‌! ఇవైతే ప్రాచీన కాలవు ఆచారాలు. ఎవరి అధీనంలో నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. ఇస్రాయీల్‌ సంతతి వారు మూసా (అలైహిస్సలాం)తో అన్న మాటలే ఈనాడు మీరు అన్నారు.”వాళ్ళకున్న ఆరాధ్య దైవాల వంటివే మాకోసం కూడా కల్పించండి” అని ఇస్రాయీల్‌ వంశీయులు చెప్పి ఉన్నారు. మీరు ఒట్టి అజ్ఞానులు. మీరు మీ పూర్వీకులయిన యూదుల, కైస్తవుల పద్ధతులను అనుసరించేలా ఉన్నారు.” (తిర్మిజీ)

                      నాల్గవ నియమం :

                      ఈ కాలపు ముష్రిక్కులు పూర్వకాలపు ముష్రిక్కుల కన్నా కడు హీనంగా ఉన్నారు. ఎందుకంటే, పూర్వకాలపు ముష్రిక్కులు కలిమిలో షిర్క్‌ (బహు దైవోపాసన)కు పాల్చడే వారు. కష్టకాలం దాపురించగానే ఒక్కడైన దైవం వైపుకు చిత్తశుద్ధితో మరలేవారు. కాని ఈ కలికాలపు ముష్రిక్కులైతే కష్ట కాలంలోనే గాక,సుఖ సంతోషాల సమయాల్లో సైతం బహు దైవారాధనకు పాల్పడుతున్నారు. దైవ గ్రంథంలోని ఈ దైవోపదేశం ఇందుకు ప్రబల తార్కాణం :

                      فَإِذَا رَكِبُوا فِي الْفُلْكِ دَعَوُا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ فَلَمَّا نَجَّاهُمْ إِلَى الْبَرِّ إِذَا هُمْ يُشْرِكُونَ

                      “వారు పడవలోకి ఎక్కినప్పుడు తమ ధర్మాన్ని అల్లాహ్‌కే ప్రత్యేకించుకుని ఆయన్ని వేడుకుంటారు.తరువాత ఆయన వారిని రక్షించి నేలపైకి తీసుకు రాగానే, అకస్మాత్తుగా వారు బహుదైవారాధన చేయటం ఆరంభిస్తారు.” (అన్‌కబూత్‌ 29:65)

                      మనలోని చాలా మంది తమ పూర్వీకుల, సజ్జనుల సమాధుల వద్దకు పోయి,వాటి ముందు చేయి చాచి అర్థించటం మనం చూస్తూ ఉన్నాము. కలిమిలోనూ లేమిలోనూ కూడా వీళ్లు ఈ పని చేస్తున్నారు. ప్రాచీన కాలపు ముష్రిక్కులే నయం. ఎందుకంటే వాళ్లు కష్టాల్లో మాత్రం నిజదైవం వైపునకు మరలి, కష్టాలు తీరిపోయిన తరువాత బూటకపు దైవాల వద్దకు పోయేవారు. కాని నవీన ముష్రిక్కులకు ఇలాంటి తేడా పాడా లేమీ లేవు. పైగా కష్టకాలంలో వీళ్ల బహు దైవోపాసనా చేష్టలు మరింత పెరిగిపోతున్నాయి. లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహిల్‌ అలియ్యిల్‌ అజీమ్‌.

                      సర్వోన్నతుడైన అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు:

                      وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ اللَّهُ ۚ قُلْ أَفَرَأَيْتُم مَّا تَدْعُونَ مِن دُونِ اللَّهِ إِنْ أَرَادَنِيَ اللَّهُ بِضُرٍّ هَلْ هُنَّ كَاشِفَاتُ ضُرِّهِ أَوْ أَرَادَنِي بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكَاتُ رَحْمَتِهِ ۚ قُلْ حَسْبِيَ اللَّهُ ۖ عَلَيْهِ يَتَوَكَّلُ الْمُتَوَكِّلُونَ

                      “మీరు అల్లాహ్‌ను కాదని వేడుకునే మీ దేవీలు ఆయన కలిగించే నష్టం నుండి నన్ను కాపాడగలరా? లేదా అల్లాహ్‌ నాపై కనికరం చూపగోరికే, వారు ఆయన కారు ణ్యాన్ని అడ్డుకోగలరా? మీ అభిప్రాయ మేమిటీ? కనుక వారితో ఇలా అను : “నాకు అల్లాహ్‌ ఒక్కడే చాలు. నమ్ముకునే వారు ఆయననే నమ్ముకుంటారు.” (అజ్‌ జుమర్‌ 39:38)

                      ఇంకా ఈ విధంగా ఉపదేశించబడింది:

                      أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ وَيَجْعَلُكُمْ خُلَفَاءَ الْأَرْضِ ۗ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ

                      “కలత చెందినవాడు మొర పెట్టుకున్నప్పుడు, అతని మొరను ఆలకించి, అతని బాధను తొలగించేవాడు ఎవడు? భూమిపై మిమ్మల్ని ప్రతినిధులుగా చేసినవాడు ఎవడు? అల్లాహ్‌తో పాటు (ఈ పనులు చేసే) మరొక దేవుడు కూడా ఎవడయినా ఉన్నాడా? కాని మీరు చాలా తక్కువగా ఆలో చిస్తారు?” (అన్‌ నమల్‌ 27:62)

                      ఇంకా ఈ విధంగా సెలవీయబడింది :

                      يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ كُلٌّ يَجْرِي لِأَجَلٍ مُّسَمًّى ۚ ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ ۚ وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍ إِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ ۚ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍ

                      “ఆయనను కాదని మీరు పిలిచే ఇతరులు కనీసం ఒక గడ్డిపోచకు కూడా యజమానులు కారు. వారిని వేడుకుంటే, వారు మీ ప్రార్థనలను వినలేరు. ఒకవేళ విన్నా, వాటికి ఏ నమాధానమూ మీకు ఇవ్వలేరు. మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు ప్రళయంనాడు తిరస్కరిస్తారు. సత్యాన్ని గురించిన ఈ సరైన సమాచారాన్ని తెలిసినవాడు తప్ప మరొకడెవ్వడూ మీకు అందజెయ్యలేడు.” (ఫాతిర్‌ 35: 13,14)

                      ఇంకా ఈ విధంగా కూడా ఉపదేశించబడింది:

                      وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ

                      “అల్లాహ్‌ను కాదని, ప్రళయం వచ్చే వరకు అతనికి నమాధానమైనా ఇవ్వలేని వారిని, మొరపెట్టుకునే వారు తమకు మొరపెట్టుకుంటున్నారనే విషయం కూడా ఎరుగని వారిని వేడుకునే వాడికంటే పరమభ్రష్టుడైన మానవుడు ఎవడు ఉంటాడు? మానవులందరినీ సమావేశ పరచినప్పుడు, వారు తమనువేడుకున్న వారికి విరోధులై పోతారు. వారి ఆరాధనను తిరస్కరిస్తారు.” (అల్‌ అహ్‌ఖాఫ్‌ 46:5,6)


                      [వీడియో పాఠం]

                      షిర్క్ కి సంబంధించిన నాలుగు సూత్రాలు (The Four Principles of Shirk)
                      https://youtu.be/nAglSs0ggPE [~ 40 నిముషాలు]
                      వక్త: సయ్యద్ అబ్దుస్సలామ్ ఉమ్రి (హఫిజహుల్లాహ్)

                       

                      దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ధర్మం [పుస్తకం]

                      Daiva Pravaktha dharmam - Telugu Islam


                      రచయిత
                      :ముహమ్మద్ ఖలీలుర్ రహ్మాన్
                      పునర్విచారకులు :హాఫిజ్ అబ్దుల్ వాహెద్ ఉమ్రీ మదని, విజయవాడ
                      ప్రకాశకులు : అల్ అసర్ ఇస్లామిక్ సెంటర్, హైదరాబాద్

                      [ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి]
                      https://bit.ly/daiva-pravaktha-dharmam
                      [PDF] [250 పేజీలు] [మొబైల్ ఫ్రెండ్లీ బుక్]

                      ఆప్త వాక్కులు

                      బిస్మిల్లా హిర్రహ్మానిర్రహీం

                      విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ కు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి” (దివ్వ ఖుర్ఆన్ 3:103)

                      వాస్తవంగానే అల్లాహ్ ప్రవక్తలో మీకు ఒక మంచి ఆదర్శం ఉంది. అల్లాహ్ పై, అంతిమ దినంపై ఆశలు పెట్టుకొని అత్యధికంగా అల్లాహ్ ను స్మరించే వ్యక్తికి“.(దివ్య ఖుర్ఆన్ 33:21)

                      ప్రస్తుతం ముస్లిం సమాజంలోని అధిక శాతం ప్రజలలో కానవచ్చే విశ్వాసాలు ఆరాధనా పద్ధతులు మరియు ఆచరణా వ్యవహారాలు అన్నీ ధర్మం పేరుమీద ధర్మ వ్యతిరేకమైన కొత్త పద్ధతులు కొనసాతున్నాయి. ఇందుకు కారణం ఖుర్ఆన్ మరియు ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆచరణ విధానాల గురించి ప్రజలలో నిజమైన అవగాహన లేకపోవటమే.

                      ప్రస్తుతం ముస్లిములలో తౌహీద్ (దేవుని ఏకత్వ) భావన అధిక శాతం లోపించింది. ఇందుకు భిన్నంగా షిర్క్ (బహుదైవారాధన) భావాలు ప్రజలలో పెరిగి పోతున్నాయి. తత్కారణంగా నేటి ముస్లిం సమాజంలో అనేక మూఢ విశ్వాసాలు, అనేక మూఢ నమ్మకాలు మరియు ఒళ్ళు గగ్గురపరిచే అనేక అజ్ఞానపు చేష్ఠలు సర్వసామాన్యం అయిపోయాయి.

                      ప్రపంచానికి మార్గదర్శకం వహించాల్సిన ముస్లిం సమాజంలోని అధిక ప్రజలు ప్రస్తుతం పతనావస్థకు చేరుకున్నారు.

                      ఇంతకంటే అనేక రెట్లు అజ్ఞానపు మూఢత్వంలో ఉన్న అరబ్బు జాతిని ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు తౌహీద్, ఆఖిరత్ అనే నినాదాన్ని పునాదిగా చేసుకుని పతనావస్థలో ఉన్న ఆ సమాజాన్ని విశ్వాసపరంగా మరియు నైతికపరంగా ఉన్నత స్థాయికి చేర్చి ప్రపంచానికి ఆదర్శంగా మలిచారు. అందుకు కారణం ఖుర్ఆన్లోని వాక్యాలు ఎలా అవతరించాయో అలానే ప్రజలలో సర్వసామాన్యం చేయటమే.

                      ఈ రోజు ఖుర్ఆన్ మరియు ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆచరణ యధాస్థితిలో ఉన్నా ముస్లిం సమాజం స్థితి మారకపోవటానికి కారణం, (ఎ) ఆహారం తమ దగ్గర ఉన్నా పస్తులుండే వానివలె (బి) మందులు తమ దగ్గర ఉన్నా అనారోగ్యాన్ని దూరం చేసుకోలేని వాని పరిస్థితి వలె దైవ మార్గదర్శకత్వాన్ని పొంది కూడా దానిని పెడచెవిన పెట్టి అంధకారంలో తచ్చాడుతున్న వారిలా మారిపోయారు ముస్లింలు. అందువల్లనే అల్లాహ్ తన గ్రంథంలో ఇలా అంటున్నాడు.

                      “ఇక నా తరఫు నుండి మార్గదర్శకత్వం మీ దగ్గరకు వస్తే ఎవడు ఈ మార్గదర్శ కత్వాన్ని అనుసరిస్తాడో అతడు మార్గం తప్పడు, దౌర్భాగ్యానికి గురికాడు. నా జ్ఞాపికకు విముఖుడైన వానికి ప్రపంచంలో జీవితం ఇరుకే అవుతుంది. ప్రళయంనాడు మేము అతన్ని అంధుడుగా లేపుతాము” (దివ్యఖుర్ఆన్ 20:123 124)

                      అందుకే ఈ రోజు ముస్లింలు ప్రపంచంలో తమ స్థితిని చక్కబరచుకోవాలంటే ఒక్కటే మార్గం. అల్లాహ్ అవతరింపజేసిన ఖుర్ఆన్ బోధనలు మరియు దానిని ఆచరించి చూపిన ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) జీవిత విధానాలు సర్వసామాన్యం చేయటం తప్ప వేరే మార్గం లేదు అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఈ పుస్తకం రచయిత జనాబ్ మహమ్మద్ ఖలీలుర్రహ్మాన్ గారు తౌహీద్ అంశంపై తెలుగు భాషలో సవివరంగా చర్చించటం జరిగినది. తౌహీద్ వాస్తవికతను అర్థం చేసుకోవ టానికి ఈ పుస్తకం ఉపకారి కాగలదు. పుస్తక రచనలో రచయిత సౌదీ అరేబియాలోని ప్రామాణిక రచయితల గ్రంథాల నుండి సేకరించిన అంశాలను పొందుపర్చటం జరిగినవి. తౌహీద్ తోపాటు ప్రజలు చేసే షిర్క్ దేవుని వేడుకోలు, గుణాలు, నామాలు సోదాహరణగా చర్చించటం జరిగినవి. విశ్వాసాలు, ఆరాధనలలో తౌహీద్ యొక్క వాస్తవ దృక్పథాన్ని వివరించడం జరిగినది. ఈ పుస్తకం దైవదాసులైన మానవాళికి మార్గదర్శి కావాలని, సందేశ దాతలకు సందేశ సామగ్రిగా ఉపయోగ పడాలని, పుస్తక రచయితకు అల్లాహ్ ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ…

                      హాఫిజ్ అబ్దుల్ వాహెద్ ఉమ్రి మదని

                      విషయ సూచిక:

                      1. తొలి పలుకులు [PDF]
                      2. దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ధర్మం [PDF]
                      3. లా ఇలాహ ఇల్లల్లాహ్ మహమ్మదుర్రసూలుల్లాహ్ అని సాక్షమివ్వడం [PDF]
                      4. లా ఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం-నియమాలు [PDF]
                      5. లా ఇలాహ ఇల్లల్లాహ్ వివరణ [PDF]
                      6. తౌహీద్ ఆల్ రుబూబియాత్ [PDF]
                      7. తౌహీద్ ఆల్ ఉలూహియాత్ [PDF]
                      8. హృదయారాధనలు [PDF]
                      9. నోటి ఆరాధనలు [PDF]
                      10. ఇతర శారీరక ఆరాధనలు [PDF]
                      11. తౌహీద్ అల్ అస్మా వ సిఫాత్ [PDF]
                      12. తౌహీద్ ప్రయోజనాలు [PDF]
                      13. షిర్క్ యెక్క ఆరంభము [PDF]
                      14. దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కాలం నాటి ముష్రిక్కులు [PDF]
                      15. ముహమ్మదుర్రసూలుల్లాహ్  సాక్ష్యం వాస్తవీకత [PDF]
                      16. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం )విధేయత లాభాలు [PDF]
                      17. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) అవిధేయత నష్టాలు [PDF]
                      18. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) సహచరుల విధేయత [PDF]
                      19. నలుగురు ఇమాములు [PDF]
                      20. సున్నత్-బిద్అత్ [PDF]
                      21. సలఫ్ మరియు సున్నత్ [PDF]
                      22. బిద్అత్ [PDF]
                      23. యాసిడ్ టెస్ట్ [PDF]
                      24. ఈమాన్ [PDF]
                      25. ఇహ్ సాన్ [PDF]

                      ఏకత్వం వాస్తవికత (Hakeekath-Tawheed)

                      tawheed-telugu-islam
                      సంకలనం
                      : మౌలానా  అబ్దుస్ -సలాం  ఉమ్రి (Moulana Abdus-Salam Umri)
                      అనువాదం : మౌలానా  ముహమ్మద్  జాకీర్  ఉమ్రి (Moulana Muhammad Zakir Umri)
                      మస్జిద్ -ఎ -ఫరూఖియః ,హకీంపేట్ , టోలిచౌకి , హైదరాబాద్ (Masjid-e-Farooqiyah, Hakeempet, Tolichowki, Hyderabad)
                      ప్రకాశకులు: ఐదార ఫిక్రే ఆఖిరత్

                      ఏకదైవత్వం (తౌహీద్), ఆరాధనలు, బహుదైవారాధన – అల్లాహ్ కు సాటి కల్పించడం, ప్రార్థనలు, అగోచర జ్ఞానం, సిఫారసు, చికిత్స మొదలైన విషయాలు.

                      [PDF చదవండి /డౌన్ లోడ్ చేసుకోండి]

                      విషయ సూచిక :

                      1. ముందు మాట
                      2. తౌహీద్ (ఏకత్వం) అంటే ఏమిటి?
                      3. ఇబాదత్ (ఆరాధన) అంటే ఏమిటి?
                      4. షిర్క్ (సాటి కల్పించటం) అంటే ఏమిటి?
                      5. మొక్కుబడులు, నైవేద్యాలు, ఆరాధనలు
                      6. దుఆ  (ప్రార్ధన) ఆరాధనే
                      7. తౌహీద్ మూడు రకాలు
                      8. తౌహీదే జాత్
                      9. తౌహీదే ఆస్మా  వసిఫాత్
                      10. అల్లాహ్ దూరం దగ్గర అన్నీ చూస్తాడు
                      11. అల్లాహ్ అర్ధిస్తే సంతోషిస్తాడు , అర్ధించని యెడలఆగ్రహం వ్యక్తం చేస్తాడు
                      12. మన ప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) కూడా అల్లాహ్ నే ప్రార్ధించాడు
                      13. తౌహీదే రుబూబియత్
                      14. విగ్రహాల పట్ల విగ్రహారాధకుల వ్యర్ధ నమ్మకాలు
                      15. మానవ అవసరాలు రెండు రకాలు
                      16. తౌహీదే ఉలూహియత్
                      17. ఓ ప్రజలారా!
                      18. ఏకత్వమే ఆరాధనకు పునాది
                      19. తౌహీద్ ప్రాధాన్యం
                      20. తౌహీద్ ఇస్లాం ధర్మం పునాది రాయి
                      21. తౌహీద్ అన్నిటి కంటే విలువైనది, బరువైనది
                      22. తౌహీద్ పాపలన్నిటినీ తుడుచి వేస్తుంది
                      23. ప్రతి వ్యక్తి ఎకదైవారాధకుడుగానే  జన్మిస్తాడు
                      24. వాస్త ఏక దైవరాధకుడు విచారణ లేకుండా స్వర్గంలోనికి ప్రవేసిస్తాడు
                      25. తౌహీద్ విధులు
                      26. శక్తి యుక్తులు వినియోగించడం, నమ్మకం రెండూ తప్పనిసరి
                      27. అల్లాహ్ నూహ్ జాతిని ముంచి వేశాడు
                      28. తవక్కుల్ తౌహీద్ ఆత్మ మరియు జీవిత సామగ్రి
                      29. షిర్క్ వాస్తవం
                      30. షిర్క్ కి రెండు కారణాలున్నాయి
                      31. బహు దైవరాధకులు నరకంలో శాశ్వతంగా ఉంటారు
                      32. షిర్క్ నాలుగు రకాలు
                      33. బహు దైవరాధకులు వారి చిల్లర దైవాలు ఇద్దరూ బలహీనులే
                      34. విగ్రహారాధకుల సాక్ష్యాదారాలు
                      35. విశ్వ సృష్టికర్త మాత్రమే సర్వ జ్ఞాని
                      36. సృష్టికర్తేనే ఆరాధించాలి
                      37. అల్లాహ్ సర్వ శక్తి సంపన్నుడు పరిపూర్నుడూనూ
                      38. సంతానం దైవత్వానికి వ్యతిరేకం
                      39. లాభ నష్టాలు విశ్వసృష్టికర్త పాలకుడైన అల్లాహ్ చేతుల్లోనే ఉన్నాయి
                      40. అల్లాహ్ పరిపూర్ణ శక్తియుక్తులు గలవాడు
                      41. అల్లాహ్ గోచర అగోచర జ్ఞాని
                      42. మార్గదర్శకున్నే అనుసరించాలి
                      43. వాసీఅహ్
                      44. షరీఅత్తులో షిఫాఅత్ స్థానం
                      45. షఫాఅత్  వాస్తవికత
                      46. షఫాఅత్ కు విశ్వాసులే అర్హులు
                      47. గులూ అంటే గౌరవాభిమనాల్లో హద్దు మీరి ప్రవర్తించటం
                      48. అగోచర జ్ఞానం వాస్తవికత
                      49. జిన్నాతులకు అగోచర జ్ఞానం లేదు
                      50. దైవదూతలకు అగోచర జ్ఞానం లేదు
                      51. అగోచర జ్ఞానం లేని మూసా (అలైహిస్సలాం)
                      52. ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) కూ అగోచర జ్ఞానం లేదు

                      కితాబుత్ తౌహీద్ (ఏక దైవారాధన పుస్తకం) | మర్కజ్ దారుల్ బిర్ర్

                      kitab-at-tawheed-AbdulWahhab-book-cover

                      Touheed (Eka Daivaradhana) (Telugu) – Kitabut Touheed
                      Compiled by : Allama Mohammad bin Abdul Wahhab
                      Translated by : Abdul Rab bin Shaik Silar
                      Edited by : Dr. Sayeed Ahmed Oomeri Madani, S.M. Rasool Sharfi
                      Publisher : Markaz Darul Bir, Ahmad Nagar, Pedana A.P. India

                      [మొబైల్ ఫ్రెండ్లీ బుక్]
                      [ఇక్కడ చదవండి / PDF డౌన్ లోడ్ చేసుకోండి]
                      [PDF] [163 పేజీలు] [ఫైల్ సైజ్ : 4 MB]

                      విషయ సూచిక

                      అన్ని చాఫ్టర్లు PDF లింకులు గా క్రింద ఇవ్వబడ్డాయి. లింక్ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చదవవచ్చు.

                      తొలిపలుకులు

                      1. ఏక దైవారాధన యొక్క ఆవశ్యకత
                      2. ఏక దైవారాధన యొక్క ప్రాముఖ్యత, సకల పాప సంహారిణి
                      3. ఏక దైవారాధకుడు విచారణ  లేకుండానే స్వర్గమున ప్రవేశించును
                      4. బహు దైవరాధన గురించి భయపడవలసిన ఆవశ్యకత
                      5. “లా ఇలాహ ఇల్లల్లాహ్” నమ్మి సాక్ష్యమివ్వమని ప్రజలకు హితభోద చేయుట
                      6. తౌహీద్ మరియు కలిమయే తౌహీద్ ధృవీకరణల సారాంశం
                      7. కష్ట నష్టాల విముక్తికి తాయత్తులు , దారాలు, రక్ష రేకులు ధరించుట
                      8. ఊదుట & తాయత్తులు ధరించుట నిషిద్దం
                      9. రాళ్ళను, చెట్లను శుభం కల్గించేవిగా  భావించుట
                      10. అల్లాహ్ యేతరులకు ‘బలి’ సమర్పించేవారు
                      11. అల్లాహ్ యేతరులకు అర్పించబడే స్థలములో అల్లాహ్ నామము పై అర్పణ కూడా నిషేధము
                      12. అల్లాహ్ యేతరుల మొక్కుబడి షిర్కే
                      13. అల్లాహ్ యేతరుల ‘శరణు’ షిర్కే
                      14. అల్లాహ్ యేతరులను వేడుకొనుట షిర్కే
                      15. నిరాధారమైన సృష్టిని వేడుకొనుట
                      16. “వారి హృదయముల నుండి భయం తొలగిపోయినప్పుడు, ఈ విధముగా ప్రశ్నించు కుంటారు” –   (సబా  34 :23)
                      17. సిఫారసు వాస్తవికత
                      18. “(ఓ ప్రవక్తా!) నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వమును ప్రసాదించలేవు. కాని అల్లాహ్ తనకు ఇష్టమైన వారందిరికీ మార్గదర్శకత్వము ప్రసాదించగలడు” (28 :56)
                      19. ఆదం సంతతి అవిశ్వాసులగుటకు కారణం మత గురువుల విషయంలో హద్దు మీరి ప్రవర్తించటమే
                      20. పుణ్యాత్ముల, మత గురువుల సమాధుల వద్ద అల్లాహ్ ని ఆరాధించుట నిషిద్ధం
                      21. పుణ్యాత్ముల సమాధుల  విషయంలో హద్దు మీరుట ధైవేతరుల ఆరాధన జరిగేందుకు అనువుగా వారి సమాధులను విగ్రహారాధనాలయాలుగా మార్చుట
                      22. ఏక ధైవోపాసనను భధ్రపరచటమే కాకుండా భంగపరచు మార్గములను కూడా ప్రవక్త అరికట్టెను
                      23. ప్రవక్త ముహమ్మద్ ( సల్లల్లాహు అలైహి వసల్లం)  గారి ‘ఉమ్మత్’లో కొందరు విగ్రహారాధన లాంటి సంకటములో చిక్కుకొనుట
                      24. చేతబడి
                      25. జాదులోని కొన్ని విధానాలు
                      26. జ్యోతిష్యుడు మరియు అతని కోవకు చెందిన వారి గురించి
                      27. జాదు చేయబడిన వ్యక్తికి వైద్యము చేయుట
                      28. దుశ్శకున (అపశకున) దర్శనము
                      29. జ్యోతిష్యం గురించి
                      30. నక్షత్రముల ప్రభావముతో వర్షం కురియునని నమ్ముట
                      31. అల్లాహ్ ను ప్రేమించుట – ధర్మమునకు పునాది
                      32. అల్లాహ్ పట్ల భయ భక్తులు కలిగి ఉండుట
                      33. ఒక్క అల్లాహ్ నే నమ్ముకోవలెను
                      34. అల్లాహ్ వ్యూహాల పట్ల నిర్భయముగా ఉండరాదు – అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందరాదు
                      35. అల్లాహ్ నిర్ణయించిన విధి పై సహనం ఈమాన్ లోని అంతర్భాగమే
                      36. ప్రదర్శనా బుద్ధితో చేయు సత్కార్యాలు షిర్కే
                      37. ఇహలోక లబ్ధికి చేయు సత్కార్యములు కూడా ‘షిర్క్’లాంటివి
                      38. అల్లాహ్ చే పవిత్రము అనబడిన వాటిని నిషేధించుట మత గురువులను ప్రభువుగా చేసుకొనుట
                      39. ‘విశ్వసించితిమి ‘అను వారి వాస్తవము
                      40. అల్లాహ్ నామములో, గుణ గణాలలో కొన్నింటిని తిరస్కరించటం
                      41. అల్లాహ్ ప్రసాదించిన భాగ్యమును తిరస్కరించుట
                      42. అల్లాహ్ కు భాగస్వాములను కల్పించే కొన్ని గుప్తరూపములు
                      43. అల్లాహ్ పై ప్రమాణం తో సంతృప్తి చెందని వాడు
                      44. అల్లాహ్ కోరినది మరియు మీరు కోరినది అని పలుకుట షిర్కే
                      45. కాలాన్ని దూషిస్తే అల్లాహ్ కు భాధ కలిగించినట్లే
                      46. ఎవరినైనా రాజాధిరాజు అని పిలుచుట
                      47. అల్లాహ్ నామాలను గౌరవించుట
                      48. అల్లాహ్ ను , ఖుర్ఆనును, ప్రవక్త (సల్లాలహు అలైహి వసల్లం) ను హేళన చేసే వారి కోసం శాసనము
                      49. అల్లాహ్ అనుగ్రహమునకు కృతజ్ఞత
                      50. అల్లాహ్ సంతానం ప్రసాదిన్చినప్పుడు షిర్క్ కు పాల్పడుట
                      51. అల్లాహ్ మహోన్నత నామములు
                      52. అల్లాహ్ పై సలాం అని పలుకరాదు
                      53. “అల్లాహ్ నీకు ఇష్టమైతే నన్ను క్షమించు” అని పలుకరాదు
                      54. “నా బానిస” అని పలుకరాదు
                      55. అల్లాహ్ నామముతో యాచించు వానిని ఒట్టి చేతులతో పంపరాదు
                      56. అల్లాహ్ నామమున స్వర్గమును మాత్రమె కోరవలెను
                      57. కష్ట నష్టాలు సంభవించినప్పుడు “ఒక వేళ ఇలా జరిగి ఉంటే” అని పలుకుట
                      58. గాలిని తిట్టుట నిషిద్దం
                      59. అల్లాహ్ ను శంకించుట నిషిద్దం
                      60. అల్లాహ్ నిర్ణయించిన విధిని తిరస్కరించేవారు
                      61. చిత్రాలు,శిల్పాలను చిత్రించుట ఒక దుష్టమైన పని
                      62. ఎక్కువగా ప్రమాణములు చేయుట
                      63. అల్లాహ్ ప్రవక్త పేర పూచీ ఇచ్చినప్పుడు కట్టుబడి ఉండుట
                      64. అల్లాహ్ నామమున ప్రమాణము చేయుట
                      65. సృష్టిరాశులను సంతోష పెట్టడానికి అల్లాహ్ ను సిఫారసుదారుగా చేయరాదు
                      66. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తౌహీదును పరిరక్షించారు, షిర్క్ మార్గాలకు కళ్ళెం వేశారు
                      67. అల్లాహ్ ఘనత, గౌరవము (ఔన్నత్యము)

                      [పుస్తకం టెక్స్ట్]

                      తొలిపలుకులు

                      సర్వస్తోత్రాలు సకలలోక ప్రభువైన అల్లాహ్ కే. మహనీయులైన ఆయన ప్రవక్తపై, ఆయన కుటుంబీకులపై, సహచరులందరిపై శాంతీ కారుణ్యాలుకురియుగాక! 

                      ఇక అసలు విషయానికి వస్తే…., 

                      ఏకదైవారాధన (తౌహీద్) ఇస్లాం ధర్మానికి పునాది. ఆధారం. మానవ హృదయాలకు జీవం. పరలోక ముక్తికి మార్గం. జీవితంలో దాన్ని పుణికిపుచ్చుకున్న మనిషి తప్పకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. పరలోకంలో అతనికి విచారణ అనేది ఉండదు. పోతే, తౌహీద్ విధానాన్ని లెక్క చేయకుండా అల్లాహు కు ఇతరుల్ని భాగస్వాములుగా నిలబెట్టినవారు ఖచ్చితంగా నరకానికి పోతారు. అందులో సందేహం అక్కర్లేదు. మనిషికి తౌహీద్ అవసరం అన్నపానీయాలకన్నా, గాలి నీరులకన్నా ఎక్కువ. 

                      సులభంగా బోధపడేందుకుగాను పండితులు తౌహీద్ ను మూడు భాగాలుగా విభజించారు: 

                      1) అల్లాహ్ నామాలు, గుణవిశేషాల్లో (అస్మా వ సిఫాత్ లో) తౌహీద్,
                      2) ప్రభుత పరంగా (రుబూబియత్ లో ) తౌహీద్,
                      3) ఆరాధనలో (ఉలూహియత్ లో ) తౌహీద్ 

                      1) అల్లాహ్ నామాలు, గుణవిశేషాల్లో తౌహీద్, అంటే అల్లాహ్ గురించిన పరిజ్ఞానంలో, అల్లాహ్ ను  గుర్తించటంలో ఏకదైవ భావనను కలిగివుండటం. దివ్యఖుర్ఆన్ మరియు దైవప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ప్రవచనాల్లో ప్రస్తావించబడిన విధంగా అల్లాహు కు అత్యుత్తమమైన పేర్లు, మహోన్నతమైన గుణవిశేషాలు ఉన్నాయని మనలో ప్రతి ఒక్కరూ గుర్తించాలి. వాటితోనే మనం ఆయన్ని వేడుకుంటాము. ఎలాంటి అనుచిత వివరణలు ఇవ్వకుండా, మార్పులు చేర్పులు లేకుండా, వాస్తవాలకు విఘాతం కలగకుండా, స్థితిగతులను వివరించకుండా, పోలికలు సారూప్యతల జోలికి పోకుండా అల్లాహ్ నామాలను, గుణవిశేషాలను మనం సంపూర్ణంగా విశ్వసిస్తాము, ధృవపరుస్తాము. 

                      2) ఇక రుబూబియత్ లో  (ప్రభుత ప్రకారం) తౌహీద్. అల్లాహ్ కార్యాల్లోనూ, అల్లాహ్ చేతల్లోనూ అల్లాహ్ ఒకే ఒక్కడని నమ్మటమే ఈ తౌహీద్ ఉద్దేశం. అల్లాహ్ మాత్రమే ప్రభువు, సృష్టికర్త, యజమాని, ప్రదాత, జీవన్మరణాలకు అధిపతి, క్షమించేవాడు, కరుణ గలవాడు, ఈ విషయాలన్నిటిలో ఆయనకు మరో భాగస్వామి గాని, సహవర్తుడు గాని లేదు అని తౌహీద్లోని ఈ విభాగం చెబుతుంది. సృష్టిలోని అణువణువూ ప్రస్ఫుటం చేసే తౌహీద్ ఇది. సృష్టిలోని ప్రతి ప్రాణిలోనూ ఈ తౌహీద్ నిశ్చలంగా ఉంటుంది. మనుషుల మతధర్మాలు వేరైనా, సంస్కృతీ నాగరికతలు విభిన్నమైనా అత్యంత సహజరూపంలో వారి ఉనికే ఈ తౌహీద్ ను చాటుతుంది. 

                      3) ఇక మిగిలింది ఆరాధన (ఉలూహియత్)లో తౌహీద్. ఇది దాసులు తమ కార్యాలను ఒకే దేవునికి అర్పించుకునే తౌహీద్. దీన్ని ఉద్దేశానికి, సంకల్పానికి సంబంధించిన తౌహీద్  గానూ చెప్పవచ్చు. ఆకాశం నుంచి గ్రంథాలు అవతరించటానికి గల లక్ష్యం ఇదే. లోకంలో ప్రవక్తలు ప్రభవించింది ఈ తౌహీద్ కోసమే. అసలు మనుషుల, జిన్నాతుల పుట్టుక పరమార్ధమే ఈ తౌహీద్. అల్లాహ్ ఇలా ప్రకటించాడు: 

                      మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాధించటానికే!”  (సూరె జారియాత్ : 56) 

                      ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఈ “తౌహీద్ పుస్తకం” గౌరవ విద్వాంసులు ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్లాబ్ (రహిమహుల్లాహ్) రచించినది. ఆరాధనలోని తౌహీద్ గురించి సామాన్య ప్రజలకు తెలియజెప్పటానికి ఆయన ఈ పుస్తకం రాశారు. నాటి నుంచి నేటి దాకా ఎన్నో తరాలు ఈ పుస్తకం ద్వారా ప్రయోజనం పొందాయి. వివిధ భాషల్లో దీనికి అనువాదాలూ, తాత్పర్యాలూ రాయబడ్డాయి. 

                      నిన్న మొన్నటి దాకా మన తెలుగు జనావళికి ఇటువంటి పుస్తకం ఏదీ అందుబాటులో ఉండింది కాదు. ఎట్టకేలకు ఈ అవసరాన్ని గుర్తించిన గౌరవనీయులు అబ్దుర్రబ్ బిన్ షేఖ్ సిలార్ గారు అరబీ భాషలోని ఈ పుస్తకాన్ని సులభశైలిలో తెనుగీకరించటానికి పూనుకున్నారు. అల్లాహ్ దయవల్ల ఆయన ద్వారా ఈ కార్యం నెరవేరింది. అనంతరం ధార్మిక సోదరులు ఎస్. ఎమ్. రసూల్, షేఖ్ నసీరుర్రహ్మాన్, నేను ముగ్గురం ఈ పుస్తకాన్ని పునఃపరిశీలించి మూడవ ముద్రణకు పంపించాము. ఇప్పుడు ఈ పుస్తకం మునుపటి కన్నా శుద్ధంగా, సరికొత్తగా ప్రచురించబడుతోంది. 

                      రచయితకు, అనువాదకునికి, పరిశీలకులకు, ఇంకా ఈ సత్కార్యంలో పాలు పంచుకున్న వారందరికీ అల్లాహ్ ఇహపరలోకాల్లో ఉత్తమ ప్రతిఫలం ప్రసాదించాలని కోరుకుంటూ…… 

                      డా|| సయీద్ అహ్మద్ ఉమరి, మదనీ. 
                      జనరల్ సెక్రటరీ, 
                      మర్కజ్ దారుల్ బిర్, పెడన, 

                      పాఠము- 1 : ఏక దైవారాధన యొక్క ఆవశ్యకత 

                      అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా సంబోధించెను: 

                      وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْأِنْسَ إِلَّا لِيَعْبُدُونِ
                      నేను జిన్నాతులనూ, మానవులనూ నా ఆరాధన కొరకు మాత్రమే సృష్టించితిని.” (అజ్-జారియాత్-51:56) 

                      وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَسُولًا أَنِ اُعْبُدُوا اللهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ
                      మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేసితిమి. ఒక్క అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి మరియు తాగూత్ (తమంతట తాము సృష్టించుకున్న దేవతల)ఆరాధనకు తావివ్వకండని తెలుపుటకు.” (16:36) 

                      وَقَضَى رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ وَبِالوَالِدَيْنِ إِحْسَانًا
                      నీ ప్రభువు నిర్ణయం చేసెను. మీరు కేవలం ఆయననే (అల్లాహ్) ఆరాధించండి మరియు తల్లిదండ్రులతో దయ, మర్యాదలతో వ్యవహరిం చండి అని.” (17:23) 

                      وَاعْبُدُوا اللهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا
                      మరియు మీరంతా కేవలం అల్లాహ్ కు దాస్యము చేయండి మరియు ఆయనకు భాగస్వాములను కల్పించవద్దు.” (4:36) 

                      قُلْ تَعَالَوْا أَتْلُ مَا حَرَّمَ رَبُّكُمْ عَلَيْكُمْ ۖ أَلَّا تُشْرِكُوا بِهِ شَيْئًا ۖ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا ۖ وَلَا تَقْتُلُوا أَوْلَادَكُم مِّنْ إِمْلَاقٍ ۖ نَّحْنُ نَرْزُقُكُمْ وَإِيَّاهُمْ ۖ وَلَا تَقْرَبُوا الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ ۖ وَلَا تَقْتُلُوا النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ ۚ ذَٰلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ

                      (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “రండి, మీ ప్రభువు మీపై నిషేధించిన వస్తువులు ఏవో మీకు చదివి వినిపిస్తాను. అవేమంటే; అల్లాహ్‌కు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల యెడల ఉత్తమరీతిలో మెలగండి. పేదరికపు భయంతో మీ సంతానాన్ని హతమార్చకండి. మేము మీకూ ఆహారం ఇస్తున్నాము, వారికీ ఇస్తాము. సిగ్గు మాలిన పనులు- అవి బాహాటంగా జరిగేవైనా, గుట్టుగా జరిగేవైనా – వాటి దరిదాపులక్కూడా వెళ్ళకండి. సత్య (న్యాయ) బద్ధంగా తప్ప అల్లాహ్‌ నిషేధించిన ఏ ప్రాణినీ హతమార్చకండి. మీరు ఆలోచించి పనిచేస్తారని, అల్లాహ్‌ మీకీ విషయాలను గురించి గట్టిగా తాకీదు చేశాడు.(అల్-అన్ ఆమ్-6:151) 

                      హజరత్ ముఆజ్ బిన్ జబల్ (రది యల్లాహు అన్హు) ఈ విధంగా ఉల్లేఖించెను: ఒకసారి నేను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఇద్దరం ఒకే కంచర గాడిదపై ప్రయాణించుచుంటిమి. అప్పుడు దైవప్రవక్త నాతో ఈ విధముగా పలికెను: “ఓ ముఆజ్! అల్లాహ్ యొక్క హక్కు దాసులపై మరియు దాసులు హక్కు అల్లాహ్ పై ఏమిటో నీకు తెలుసునా?” జవాబుగా నేను “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం) కే బాగా తెలుసును” అని పలికితిని. అప్పుడు ప్రవక్త ఈ విధంగా తెలిపెను: “అల్లాహ్ హక్కు దాసులపై ఏమిటంటే, వారు ఒక్క అల్లాహ్ ఆరాధించాలి మరియు ఆయనకు సాటినిగాని లేదా భాగస్వాము లను గాని సృష్టించకూడదు. మరియు దాసుల హక్కు అల్లాహ్ పై ఏమిటంటే, ఏ దాసులైతే అల్లాహ్ కు సాటిని, భాగస్వామిని సృష్టించరో వారిని ఆయన శిక్షించకూడదు.” “నేను ఈ శుభవార్తను ప్రజలకు అందజేయనా?” అని నేను అడిగాను. అందుకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  అన్నారు, “వద్దు. వారు దీనినే నమ్ముకుని కూచుండి పోగలరు. (బుఖారీ, ముస్లిం) 

                      దీనిలో 24 అర్థ తాత్పర్యములు గలవు 

                      1. జిన్నాతుల, మానవుల సృష్టికి కారణము తెలుపబడింది. 

                      2. ఆరాధన అంటే అసలు ఏక దైవారాధన. ఎందుకంటే ప్రవక్తలందరు 

                      తమ జాతులకు ఏక దైవారాధన గురించే ఉపదేశించారు. 

                      3. ఎవరైతే ఏకదైవారాధనకు కట్టుబడి ఉండరో, వారు అల్లాహ్ యొక్క ఆరాధన చేయనట్లే. ‘కాఫిరూన్’ యొక్క ఆయత్ ప్రకారం, వేటినైతే మీరు ఆరాధిస్తున్నారో నేను వాటిని ఆరాధించువాణ్ణి కాదు (కాను).” (109-3) 

                      4. దీనితో ప్రవక్తలను ప్రభవింపజేయుటకు కారణము కూడా తెలియు చున్నది. 

                      5. అల్లాహ్ ప్రతి జాతిలోనూ ప్రవక్తలను ప్రభవింపజేసెను.

                      6. ప్రవక్తలందరి మతము ఒక్కటే. అది ఏక దైవారాధన. 

                      7. తాగూత్ (తమంతట తాము సృష్టించుకొన్న దేవతల)ను తిరస్కరించకుండా ఏక దైవారాధన సాధ్యము కాదు. 

                      8. “తాగూత్(తమంతట తాము సృష్టించుకున్న దేవతల)ని తిరస్కరించి అల్లాహ్ నే విశ్వసించినవాడు సుస్థిరమైన, ఎప్పటికీ విడిపోని ఆశ్రయము పొందినవాడయ్యెను.” 

                      9. అల్లాహ్ ని తప్ప ఆరాధించబడేవి అన్నీ తాగూత్ అనబడును. 

                      10. అల్లాహ్ ఉపదేశించిన అతిముఖ్యమైన 10 ఉపదేశములలో ఏక దైవారాధన మరియు బహుదైవారాధన నిషేధం ప్రధానమైనవి. అల్లాహ్ ఖుర్ఆన్ (17:22)లో 18 ఉపదేశాలు తెలిపెను. వాటిలో మొదటిది మరియు చివరిది రెండూ కూడా బహుదైవారాధన నిషేధం గురించి తెలియ జేస్తున్నాయి. “ఇవి వివేకముతో నిండివున్న విషయములు. వీటిని నీ ప్రభువు నీ వైపునకు అవతరింపజేసెను.” (బనీ ఇస్రాయీల్-17:39). 

                      11. అల్లాహ్ ఖుర్ఆన్ లో తెలిపిన 10 ఉపదేశాలలోని ప్రధాన ఉపదేశం: “మీరు కేవలం ఒక్క అల్లాహ్క దాస్యం చేయండి. ఆయనకు భాగస్వాములను కల్పించకండి.” (అన్ నిసా- 4:36) 

                      12. ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఉపదేశించిన బోధనలు కూడా తెలుప బడ్డాయి. 

                      13. మనపై అల్లాహ్ కు ఉన్న హక్కు తెలుపబడింది. 

                      14. దాసులు అల్లాహ్ యొక్క హక్కు నెరవేర్చినప్పుడు, అల్లాహ్ పై దాసులకు ఉన్న హక్కు తెలుపబడింది. 

                      15. హదీసుల్లో తెలుపబడిన విషయాలు చాలా మంది అనుచరులకు తెలియవు. 

                      16. ఏదైనా అవసరాన్నిబట్టి కొన్ని విషయాలు రహస్యంగా ఉంచవచ్చును. 

                      17. ఎవ్వరికైనా మంచి వార్త తెలుపటం సున్నత్. 

                      18. అల్లాహ్ యొక్క దయాకరుణలను దృష్టిలో ఉంచుకొని మంచి పనులను ఆచరించడంలో నిర్లక్ష్యము చేయరాదు. 

                      19. మనకు తెలియని విషయాల పట్ల “అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  కే బాగా తెలుసు” అనాలి. 

                      20. అవసరాన్ని బట్టి కొన్ని విషయాలు కొంత మందికే తెలియజేయ వచ్చును. మరికొందరికి తెలుపకుండా ఉండవచ్చును. 

                      21. ఈ హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  యొక్క నిరాడంబరత మరియు సుహృ ద్భావము గోచరిస్తోంది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)  అతి పెద్ద హోదాగల వారై నప్పటికీ కంచర గాడిదపై ప్రయాణించెను. ఒక సాధారణ వ్యక్తిని కూడా తనతో పాటు కూర్చోబెట్టుకొనెను.

                      22. వాహనంపై వేరే వ్యక్తిని కూర్చోబెట్టుకోవచ్చును. 

                      23. ఈ హదీసు ద్వారా ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు యొక్క ప్రాముఖ్యత తెలుస్తోంది. 

                      24. ఈ హదీసు ఏక దైవారాధన యొక్క విశిష్టతను తెలుపుతుంది. 

                      పాఠము-2 : ఏక దైవారాధన ప్రాముఖ్యత, సకల పాపసంహారిణి 

                      అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉపదేశించెను. 

                      الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا اِيْمَانَهُمْ بِظُلْمٍ أُولَيكَ لَهُمُ الْاَمْنُ وَهُمْ مُهْتَدُونَ 

                      “వాస్తవంగా విశ్వసించి, తమ విశ్వాసాన్ని దుర్మార్గంతో కలుషితం చేయని వారికే శాంతి. వారే ఋజుమార్గంపై ఉన్నారు.” (అల్ అన్ ఆమ్- 6:82) 

                      హజరత్ ఉబాదా బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధంగా ఉపదేశించారు. “ఎవరైతే ఈ విషయాలను నమ్మి సాక్ష్యమిస్తారో: అల్లాహ్ తప్ప ఎవ్వరూ ఆరాధనకు అర్హులు కారు. ఆయన ఒక్కడే. ఆయనకు ఎవరూ సాటిగానీ భాగస్వాములు గానీ లేరు. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఆయన యొక్క దాసుడు, ప్రవక్త. హజరత్ ఈసా అలైహిస్సలాం కూడా ఆయన దాసుడు, ప్రవక్త. అల్లాహ్ యొక్క వాక్కు దానిని ఆయన మరియం అలైహస్సలాంకు అనుగ్రహించెను మరియు ఆయన అల్లాహ్ అనుగ్రహించిన ప్రాణం అని మరియు స్వర్గ నరకములు అక్షర సత్యాలని నమ్మి సాక్ష్య మిచ్చునో, వారిని అల్లాహ్ స్వర్గములో (ఎప్పటికైనా) ప్రవేశింపజేస్తాడు. అతని ఆచరణ ఎలాంటిదైనాసరే.” (బుఖారీ, ముస్లిం) 

                      హజరత్ ఉత్బాన్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: “ఎవరైతే అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని పొందుటకు “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు) అని విశ్వసించి సాక్ష్యమిస్తారో, అల్లాహ్ వారికొరకు నరకాన్ని నిషేధిస్తాడు. (బుఖారీ, ముస్లిం) 

                      హజరత్ అబూ సయీద్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధముగా ప్రబోధించారు: “ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ తో ఈ విధముగా విన్నవించెను. ఓ నా ప్రభూ! నాకు కొన్ని అతి ఉత్తమమైన వాక్యములు నేర్పుము. వాటితో నేను నిన్ను స్తుతిస్తూ స్మరిస్తూ ఉంటాను. దానికి అల్లాహ్ ఈ విధముగా ఉద్బోధించెను: “ఓ మూసా! లా ఇలాహ ఇల్లల్లాహ్ పఠించి, స్మరించుము.” మూసా అలైహిస్సలాం ఈ విధముగా పలికెను: ఓ అల్లాహ్! నీ దాసులందరూ ఈ స్తోత్రములు స్మరించు చున్నారు. అప్పుడు అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను. ఓ మూసా! సప్త భూమ్యాకాశాలు త్రాసులోని ఒక పళ్ళెంలో ఉంచి ఈ స్తోత్రాన్ని వేరే పళ్ళెంలో ఉంచిన ఎడల “లా ఇలాహ ఇల్లల్లాహ్” వాటన్నిటికంటే భారము కలది అగును. (ఇబ్నె హిబ్బాన్, హాకిం-సహీ సనద్) 

                      సునను తిర్మిజీలో హసన్ సనద్ హజరత్ అనస్ రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖించెను: నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధంగా ఉపదేశిస్తుండగా విన్నాను: అల్లాహ్ ఈ విధంగా ప్రబోధించెను “ఓ ఆదం కుమారుడా! నీవు నా వద్దకు భూమి నిండునంతటి పాపములతో వచ్చినా, నీవు ఆరాధనలో నాకు భాగస్వాములను కల్పించక వచ్చిన ఎడల నేను నిన్ను నా దయాదాక్షిణ్యాలతో క్షమించివేయగలను.” 

                      దీనిలో 20 అర్థ తాత్పర్యములు కలవు 

                      1. అల్లాహ్ అమిత కరుణామయుడు. 

                      2. అల్లాహ్ దృష్టిలో ఏకదైవారాధన ప్రధాన పుణ్యకార్యము. 

                      3. ఏకదైవారాధన పుణ్యకార్యమే కాకుండా పాపములను కూడా పరిహరించును. 

                      4. ఖుర్ఆన్లోని ఆయత్ (6:82) లో ‘జులుం’ అంటే అర్థం బహుదైవారాధన.

                      5. హజరత్ ఉబాదా రదియల్లాహు అన్హు మరియు ఉత్బాన్ రదియల్లాహు అన్షు యొక్క రెండు హదీసులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎడల ఏక దైవారాధన యొక్క అర్థం స్పష్టంగా తెలియును. అంతే కాకుండా ఒట్టి నోటి మాటతో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ చదివినంత మాత్రాన స్వర్గ ప్రవేశము లభించుననుకోవటం పొరపాటని తెలియగలదు. 

                      6. హజరత్ ఉబాదా రదియల్లాహు అన్హు తెలిపిన హదీసులోని 5 ఉపదేశములను క్షుణ్ణంగా పరిశీలించి ఆచరించవలెను.

                      7. హజరత్ ఉత్బాన్ రదియల్లాహు అన్హు యొక్క హదీసులోని మాటలను క్షుణ్ణంగా పరిశీలించ వలయును.

                      8. ప్రవక్తలు కూడా స్తోత్రం తెలుసుకోవలసిన అవసరం కలిగివున్నారు. ఈ వాస్తవం కూడా గుర్తుంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

                      9. “లా ఇలాహ ఇల్లల్లాహ్” సప్త భూమ్యాకాశాల కంటే బరువైనప్పటికీ ఈ కలిమ చదివే వారి చాలా మంది పళ్ళెములు తేలికగా ఉండును.

                      10. దీని ద్వారా 7 ఆకాశాలే కాకుండా భూములు కూడా 7 ఉన్నట్లు తెలియు చున్నది. 

                      11. భూమ్యాకాశాలలో జీవరాశులు ఎన్నో జీవించుచున్నవి. 

                      12. అల్లాహు కు సాటిలేని ‘సిఫాత్'(గుణములు) ఉన్నట్లు తెలుస్తుంది. 

                      13. హజరత్ అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసు క్షుణ్ణంగా పరిశీలించిన ఎడల హజరత్ ఉత్బాన్ రదియల్లాహు అన్షు ఉల్లేఖించిన హదీసులోని “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క అర్థం బహుదైవారాధన ను పూర్తిగా విడనాడాలని స్పష్టం అగుచున్నది. 

                      14. ఈ విషయం కూడా గుర్తించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ హదీసులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఈసా అలైహిస్సలాం ఇద్దరినీ దాసులుగానూ, ప్రవక్తలుగానూ సంబోధించ బడింది. 

                      15. ప్రతివస్తువు అల్లాహ్ చే అనుగ్రహించబడినది. అదే విధముగా హజరత్ ఈసా అలైహిస్సలాం కూడా అల్లాహ్ అనుగ్రహింపబడెను.

                      16. ప్రాణం కూడా అల్లాహ్ యే అనుగ్రహించును. కాబట్టి హజరత్ ఈసా అలైహిస్సలాం యొక్క ప్రాణం కూడా అల్లాహ్ యే అనుగ్రహించెను

                      17. స్వర్గ నరకములపై విశ్వసించవలసిన ఆవశ్యకత తెలుపబడెను. 

                      18. హజరత్ ఉబాదా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసు ద్వారా, స్వర్గప్రవేశమునకు ఏకదైవారాధన నిబంధన అవసరమని తెలియ వస్తున్నది.

                      19. ప్రళయదినంనాడు మన అందరి పాప పుణ్యకార్యములు తూచబడును

                      20. ఈ హదీసులో అల్లాహ్ యొక్క ‘ముఖము’న్నదని తెలుపబడెను. కాని అది ఎట్లు ఉండును అనునది మనకు తెలుపబడలేదు అని నమ్మవలెను.

                      పాఠము-3 : ఏకదైవారాధకుడు విచారణ లేకుండానే స్వర్గమున ప్రవేశించును 

                      అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా పేర్కొనెను. 

                      ان ابراهيمَ كَانَ أَمَةً قَانِتَا لِلَّهِ حَنِيفًا، وَلَمْ يَكُ مِنَ الْمُشْرِكِينَة 

                      “నిశ్చయంగా ఇబ్రాహీం (అబ్రహం) అలైహిస్సలాం ప్రజలకు మార్గదర్శి. అల్లాహ్ యొక్క అమిత విధేయుడు. ఎప్పటికీ ఆయన పైనే మనస్సు నిలిపి యుండెను. ఆయన ఎన్నడూ బహుదైవారాధనకు పూనుకోలేదు.” (~5-35-16:120) 

                      والَّذِينَ هُمْ بَرَتِهِمْ لَا يُشْرِكُونَ : ) 

                      “నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ కు భాగస్వాములు కల్పించరో వారే విశ్వాసులు.”(అల్-మోమినూన్-23:59) 

                      హుసైన్ బిన్ అబ్దుర్రహ్మాన్ రహమతుల్లాహి అలైహ్ ఈ విధంగా తెలిపెను: నేను ఒకసారి సయీద్ బిన్ జుబైర్ రహమతుల్లాహి అలైహి దగ్గర హాజరై ఉంటిని. ఆయన “మీలో రాత్రి వ్రాలుతున్న నక్షత్రాన్ని ఎవరు తిలకించితిరి?” అని ప్రశ్నించెను. అప్పుడు “నేను తిలకించితినని” జవాబు పలికితిని. ఇంకా ఈ విధంగా విశదీకరించితిని. “నేను ఆ సమయంలో ప్రార్థనలో లేకుంటిని. ఆ సమయాన విషపురుగు యొక్క కాటుకు గురియై ఉంటిని.” అప్పుడు జుబైర్ “మరి, ఏమి చేసితివని” ప్రశ్నించెను. “నేను స్తోత్రము పఠించితిని” అని జవాబు ఇచ్చితిని. మరల ఆయన “అలా ఎందుకు చేశావు” అని ప్రశ్నించిరి. అప్పుడు నేను “షాబిరహమతులాహి అలైహి ఒక హదీసు తెలిపెను. అందుచే నేను స్తోత్రము పఠించితిని (దమ్ చేసితిని)” అని వివరించితిని. మరల సయీద్ బిన్ జుబైర్ “షాబి రహమతుల్లాహి అలైహి మీకు ఏమి తెలిపెను?” అని ప్రశ్నించెను. 

                      నేను జవాబుగా ఆయన మాకు బురైదా బిన్ హాసైబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీసు తెలిపెను. “చెడు చూపు (దిష్టి) మరియు విషపురుగు కాటుకు తప్ప ఎట్టి పరిస్థితిలోను రుఖయ (స్తోత్ర పఠనము) చేయకూడదు.” అప్పుడు సయీద్ బిన్ జుబైర్ రహమతుల్లాహి అలైహి మీరు ఆలకించి అమలు పరచినది సరియైనదే కావచ్చు, కాని మాకు ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా జగత్ ప్రవక్త యొక్క ఈ హదీసును తెలిపిరి : 

                      నాకు చాలా మంది ప్రవక్తల అనుచరులను చూపబడెను. కొంతమంది ప్రవక్తలతో ఎక్కువ అనుచరులు ఉండిరి. మరి కొంతమంది ప్రవక్తలతో పాటు ఒకళ్ళిద్దరు అనుచరులు ఉన్నారు. నేను ఒక్క అనుచరుడు కూడా లేని ప్రవక్తను చూసితిని (తిలకించితిని). అంతలో నేను ఒక పెద్ద కూటమి (గుంపు) ని చూసి వీరు నా అనుచరులు అనుకొంటిని. కానీ వారు ప్రవక్త మూసా మరియు వారి అనుచరులని తెలుపబడెను. వారిలో 70 వేల మంది ఎలాంటి లెక్క, ఏ విధమైన శిక్షకు గురి కాకుండా స్వర్గమున ప్రవేశించుదురు అని పలికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం లేచి ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడు అనుచరులు 70 వేల మంది ఎవరై ఉంటారా అని ఆలోచనలో నిమగ్నులై ఉండిరి. మరల ప్రవక్త విచ్చేసినప్పుడు అనుచరులు ఆయనను ప్రశ్నించగా ఆయన ఈ విధంగా సంబోధించెను: 

                      “ఎవరైతే మంత్రదండనలు చేయరో, వైద్యము కొరకు వాతలు పెట్టించు కొనరో, జ్యోతిష్యము, హస్తసాముద్రికము, వాస్తులను నమ్మక ఒక్క అల్లాహ్ నే విశ్వసించి శిరసావహిస్తారో వారే!” ఇది విని ఉక్కాషా బిన్ ముహ్సన్ రదియల్లాహు అన్హు లేచి నిలబడి ఈ విధంగా పలికెను. “ఓ ప్రవక్తా! అల్లాహ్ నన్ను వారిలో ఒకణ్ణి చేయమని ప్రార్థించండి.” అప్పుడు ప్రవక్త, “మీరూ వారిలో ఒక్కరు” అని పలికెను. అంతలో వేరే వ్యక్తిలేచి నిలబడి, “ఓ ప్రవక్తా! అల్లాహ్ నన్ను కూడా వారిలో చేర్చమని ప్రార్థించండి”అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త అన్నారు, “ఉక్కాషా నీకంటే ముందే ఈ ప్రార్ధనను సొంతం చేసుకున్నాడు.” (దీనిని బుఖారి, ముస్లిం, తిర్మిజీ, నసాయి పొందుపరిచెను.) 

                      దీనిలో 22 అర్థ తాత్పర్యములు కలవు 

                      1. ఏకదైవారాధన విషయంలో జనుల స్థితిలో మార్పు కలదు.

                      2. అల్లాహ్ ఏకత్వంపై ఎలా అమలు చేయవలెనో తెలిసినది. 

                      3. ఇబ్రాహీం అలైహిస్సలాం ఎన్నడూ బహుదైవారాధనకు పూనుకోలేదని 

                      అల్లాహ్ యే స్పష్టముగా చెప్పెను. 

                      4. ఏ దైవప్రవక్త కూడా బహుదైవారాధనకు పూనుకోలేదని, ప్రవక్తలందరూ బహుదైవారాధనను నిరసించినట్లుగా అల్లాహ్, స్పష్టపరిచెను.

                      5. మంత్ర పఠనం, వాతలు పెట్టించుకోవటం వంటి పనులకు దూరంగా ఉండుట ఏకదైవారాధనలో అతి ప్రాముఖ్యము గలవి.

                      6. ఇటువంటి మూఢ నమ్మకములను నిరాకరించుటయే నిజంగా అల్లాహ్ పై నమ్మకము కలిగియున్నట్లు.

                      7. దీనిలో ప్రవక్త అనుచరులు యొక్క విద్యలో గల నైపుణ్యం కూడా అగుపడు తుంది. ఇటువంటి అతి ఉత్తమ స్థానము వారు వారి పుణ్యకార్యముల వలన పొందగలిగారు. 

                      8. దైవప్రవక్త అనుచరులు పుణ్యకార్యాలు చేయుటలో ఎలా ముందుండే వారో అర్థం అవుతుంది. 

                      9. చివరి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క అనుచరులు అందరికంటే అధికులు మరియు ఉత్తములు. 

                      10. ప్రవక్త మూసా అలైహిస్సలాం యొక్క ఘనత కూడా తెలుస్తోంది. 

                      11. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లంకు ఇతర ప్రవక్తలందరి అనుచరులు చూపబడెను. 

                      12. ప్రతి సంతతినీ వారి వద్దకు పంపబడిన ప్రవక్తతో పాటు ప్రళయదినాన వేరువేరుగా హాజరుపరచబడును. 

                      13. ప్రవక్తల హితబోధనలను ప్రతి జాతిలోను చాలా తక్కువ మంది స్వీకరించిరి. 

                      14. కొంతమంది ప్రవక్తల హితబోధనలను ఎవ్వరూ స్వీకరించలేదు. 

                      15. ఎక్కువ అనుచరులున్నారని గర్వపడకూడదు. తక్కువ అనుచరులున్నారని బాధపడకూడదు. 

                      16. చెడు చూపు(దిష్టి) మరియు విష పురుగుల కాటుకు మాత్రం స్తోత్ర పఠనం చేయవచ్చును.

                      17. సయీద్ బిన్ జుబైర్ వాక్కుతో “సలఫె సాలిహీన్” యొక్క దైవజ్ఞానము కానవస్తుంది. మొదటి హదీసు, రెండవ హదీసుకు వ్యతిరేకం కాదు.

                      18. సలపె సాలిహీన్ ఒక మనిషిలో లేని సద్గుణం గురించి పొగడటానికి దూరంగా ఉండేవారు. 

                      19. దైవప్రవక్త, హజరత్ ఉక్కాషా రదియల్లాహు అన్హు ను “నీవు వారిలో ఒకడివి” అనుట దైవప్రవక్త సూచనలలో ఒకటి. 

                      20. దీని ద్వారా హజరత్ ఉక్కాషా రదియల్లాహు అన్షు యొక్క విశిష్ఠత బోధపడుతుంది.

                      21. ఏదైనా తెలియని విషయం గురించి మనం చర్చించుకోవచ్చును. 

                      22. హజరత్ ఉక్కాషా రదియల్లాహు అన్హు తర్వాత ప్రార్ధన కొరకు కోరిన వ్యక్తిని ఉత్తమ రీతిలో కూర్చోబెట్టుటలో ప్రవక్త యొక్క సుహృద్భావము కానవస్తుంది. 

                      పాఠము-4 : బహుదైవారాధన గురించి భయపడవలసిన ఆవశ్యకత 

                      అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధంగా ప్రబోధించెను: 

                      اِنَّ اللهَ لا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ ، وَمَن يُشْرِكْ بِاللهِ فَقَدِ افْتَرَ إِثْمًا عَظِيمات 

                      “తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని(షిర్కును) అల్లాహ్ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరినవారి పాపాలను క్షమించగలడు. అల్లాహ్ కు భాగస్వామ్య కల్పన చేసినవాడు ఘోరమైన అబద్ధమును కల్పించాడు” (4:48) 

                      ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం ఈ విధంగా ప్రార్థించెను. 

                      وَاجْنُبْنِي وَبَنِى أَن نَّعْبُدَ الْأَصْنَامَة 

                      “(ఓ ప్రభువా) నన్ను మరియు నా సంతతిని విగ్రహారాధన నుండి రక్షించుము.” (14: 35) 

                      ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధంగా ఉపదేశించెను: 

                      “మీరు చిన్నషిర్క్క పాల్పడగలరని నాకు చాలా భయముగా ఉన్నది.” చిన్న షిర్క్క పాల్పడటం అంటే ఏమిటని ప్రశ్నించగా ఆయన “ఎదుటివాడు చూసి మెచ్చుకొనేందుకు చేయు పుణ్యకార్యములు” అని పలికెను. (ముస్నదె అహ్మద్-5:428-429) 

                      హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖించెను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ప్రబోధించెను. 

                      “ఏ వ్యక్తి అయితే ఆరాధనలో అల్లాహ్ కు భాగస్వాములను కల్పిస్తూ మరణిస్తాడో అతడు నరకవాసి.” (బుఖారీ) 

                      హజరత్ జాబిర్ రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖించెను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ఉపదేశించెను: 

                      “ఏ వ్యక్తి అయితే ఆరాధనలో అల్లాహ్ కు భాగస్వాములను కల్పించ కుండా మరణిస్తాడో అతడు స్వర్గమున ప్రవేశించును. ఏ వ్యక్తి అయితే అల్లాహు ఆరాధనలో భాగస్వాములను కల్పిస్తూ మరణిస్తాడో అతడు నరకవాసి. (ముస్లిం)

                      దీనిలో 11 అర్థ తాత్పర్యములు కలవు. 

                      1. అల్లాహు సాటిగానీ, భాగస్వాములనుగానీ సృష్టించుటకు భయపడ వలెను. 

                      2. ఎదుటి వారు చూసేందుకు పుణ్యకార్యములు చేస్తే అల్లాహు భాగస్వాములను కల్పించినట్లే. 

                      3. ప్రదర్శనా బుద్ధితో మంచి పనులు చేసినట్లయితే స్వల్ప షిర్క్క పాల్పడినట్లే. 

                      4. పుణ్యాత్ముల విషయంలో అన్నింటికంటే ఎక్కువగా ప్రదర్శనాబుద్ధి లాంటి చిన్న తరగతి షిర్క్క సంబంధించి భయపడవలసి ఉంటుంది. 

                      5. స్వర్గము మరియు నరకము మానవునికి సమీపములో ఉన్నవి. 

                      ఒకే హదీసులో స్వర్గ నరకముల గురించి విశదీకరింపబడెను. 

                      6. ప్రపంచంలో మనుగడ సాగించినంత కాలం ఆరాధనలో అల్లాహ్ కు భాగస్వాములను కల్పించనివాడు స్వర్గమున ప్రవేశింపబడును.

                      7. ఎవరైతే అల్లాహ్ కు భాగస్వాములను కల్పిస్తాడో అతడు నరకమున ప్రవేశించును. అతడు ఎంతటివాడైనా సరే. 

                      8. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తనను, తన సంతానాన్ని విగ్రహారాధన నుండి కాపాడమని అల్లాహ్ ని వేడుకొనుటలో ఒక పెద్ద ఉపదేశము కలదు. 

                      9. “ఓ అల్లాహ్! ఈ విగ్రహాల వలన చాలా మంది మార్గభ్రష్టులైనారు” అని హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం పలికెను. (ఖుర్ఆన్-14:36) అందువల్ల తనను, తన సంతతిని విగ్రహారాధన నుండి రక్షించమని అల్లాహ్ ని వేడుకొనెను. 

                      10. పైన తెలిపిన ఖుర్ఆన్ వాక్యాలు మరియు ప్రవక్త హదీసుల ద్వారా ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ కి అర్థం క్షుణ్ణంగా తెలుపబడెను. 

                      11. “షిర్క్” నుండి రక్షించబడిన వాని ఘనత. 

                      పాఠము- 5 : “లా ఇలాహ ఇల్లల్లాహ్”ను నమ్మి సాక్ష్యమివ్వమని ప్రజలకు హితబోధ చేయుట 

                      అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ప్రస్తావించెను: 

                      قُلْ هَذِهِ سَبِيلِ اَدْعُوا إِلَى اللهِ عَلَى بَصِيرَةٍ أَنَا وَمَنِ اتَّبَعَنِي وسبحن الله وَمَا أَنَا مِنَ المُشْرِكِينَ . 

                      (ఓప్రవక్తా!) నువ్వు వాళ్ళకు చెప్పేయి: “నా మార్గమైతే ఇదే. నేనూ, నా అనుయాయులూ పూర్తి అవగాహనతో, దృఢ నమ్మకంతో అల్లాహ్ వైపుకు పిలుస్తున్నాము. అల్లాహ్ పరమ పవిత్రుడు. నేను, అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించే(షిర్క్ చేసే) వారిలోని వాణ్ణి కాను.”(యూసుఫ్-12:108) 

                      హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఈ విధముగా ఉల్లేఖించెను: 

                      ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం హజరత్ ముఆజ్ రదియల్లాహు అన్హుని ‘యెమన్’ ప్రదేశానికి సాగనంపుతూ ఈ విధముగా ఉద్బోధన చేసెను: 

                      “నీవు గ్రంథ ప్రజల (క్రైస్తవుల) వైపుకు పయనించుచున్నావు. నీవు వారిని అన్నిటికంటే ముందు ఏకదైవారాధన చేయవలెనని ఆహ్వానించు. వారు నీ మాటను అంగీకరించిన పక్షములో వారికి అల్లాహ్ ఒక రోజులో 5 పూటల నమాజు (ప్రార్థన) ఆచరించుటకు ఆజ్ఞాపించెనని తెలుపు. వారు దీనికి కూడా అంగీకరిస్తే తర్వాత అల్లాహ్ ‘దానధర్మం’ (జకాత్) విధి కావించెనని వారికి తెలుపుము. అది వారిలోని ధనికుల దగ్గర నుండి సేకరించబడి, వారిలోని బీదవారికి పంచబడును. వారు వీటిని స్వీకరించిన పక్షములో వారి యొక్క మంచి వస్తువులను అర్థించకుము. దౌర్జన్యము చేసి వారి శాపమునకు గురికాకుము. ఎందుకంటే దౌర్జన్యము చేయబడిన వారి ప్రార్థనకు మరియు అల్లాహ్ కు మధ్య అడ్డు ఏదీ లేదు.” 

                      హజరత్ సహల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్షు) ఈ విధముగా ఉల్లేఖించెను: 

                      “ఖైబర్ రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా సంబోధించెను: “రేపు నేను మీలోని ఒక వ్యక్తి చేతికి జెండా ఇస్తాను. అతడు అల్లాహ్పట్ల ప్రవక్త పట్ల అమిత ప్రేమ కలవాడు. అల్లాహ్ మరియు ప్రవక్త కూడా అతనిని ప్రేమిస్తున్నారు. అతని చేతుల మీదుగా అల్లాహ్ విజయాన్ని కల్పిస్తాడు.” అప్పుడు జెండా ఎవరి చేతికి ఇవ్వబడుతుందోనని అనుచరులు ఊహించసాగిరి. మరుసటి రోజు అలీ (రదియల్లాహు అన్హు) పిలువబడెను. అతని యొక్క కళ్ళు సరిగా లేకుండెను ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఉమ్మిరాసి దుఆ చేయగా ఆయన కళ్ళు సరయ్యెను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం హజరత్ అలీ (రదియల్లాహు అన్షుకు ఈ విధముగా ఉద్బోధించెను: “శాంతముగా బయలుదేరి వెళ్ళుము. ఖైబర్ చేరి అన్నిటికంటే ముందు వారికి ఏకదైవారాధన గురించి తెలియజేయుము. అల్లాహ్ యొక్క ఆజ్ఞలను కూడా వారికి తెలుపుము. వారిలో ఒకళ్ళయినా నిజాన్ని స్వీకరించినచో అది మీకు ఎరుపు ఒంటే కంటే ఉత్తమమైనది.” 

                      దీనిలో 30 అర్థ తాత్పర్యములు కలవు 

                      1. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క అనుచరులు కూడా ప్రజలను అల్లాహ్ వైపుకు ఆహ్వానించేవారు. 

                      2. ప్రదర్శనా బుద్ధితో చేయు పనుల వల్ల పుణ్యఫలం లభించదని అర్థమవుతుంది. 

                      3. ప్రజలను ఏకదైవారాధన వైపు పిలుచునప్పుడు మంచిగా ఉద్బోధించ వలెను. 

                      4. ఉత్తమ ఏకదైవారాధన ఏమనగా అల్లాహ్ కు ఎలాంటి లోపాలు లేవని అంగీకరించుట. 

                      5. బహుదైవారాధన చేయటమంటే, అల్లాహ్ ను కించపరచటమే. ఇంకా ఆయనకు భాగస్వాములున్నారని భావించుట.

                      6. బహు దైవారాధకులకు దూరంగా ఉండవలసిన ఆవశ్యకత. 

                      7. ఇస్లాంకు ప్రధాన మూలాధారం ఏక దైవారాధన. 

                      8. జనులకు ఉద్బోధన ఏకదైవారాధనతో ప్రారంభించవలెను. 

                      9. అల్లాహ్ ను తప్ప ఎవరినీ ఆరాధించకూడదన్నా, ఏకదైవారాధన అన్నా ఒకే అర్థము. 

                      10. కొంత మందికి దైవగ్రంథము ఇవ్వబడినప్పటికీ, వారు ఏకదైవారాధన కు ప్రాముఖ్యత ఇవ్వలేదు.ఏక దైవారాధనయే సరియైనదని గ్రహించి కూడా వారు ఆచరణశీలురు కాలేదు. 

                      11. ఏకదైవారాధన గురించి క్షుణ్ణంగా విశదీకరించి తెలుపవలెను.

                      12. అన్నిటికంటే ముందు ప్రధాన అంశములు తెలుపవలెను. 

                      13. దీనిలో ‘విధి దానం’ (జకాత్) యొక్క లక్ష్యము కూడా తెలుపబడెను.

                      14. తెలుసుకోగోరిన వారికి, వాళ్ళ అనుమానాలను పోగొట్టవలెను.

                      15. ‘విధిదానం (జకాత్)లో మంచి ఆభరణములు తీసుకోకూడదు. వేటినైతే ఇస్తారో వాటినే తీసుకోవలెను. 

                      16. దౌర్జన్యము చేసి బాధింపబడ్డ వ్యక్తి శాపమునకు గురికాకుము. 

                      17. దౌర్జన్యము చేయబడిన వ్యక్తి యొక్క శాపమును అల్లాహ్ వెంటనే స్వీకరించును. 

                      18. దైవప్రవక్తలు మరియు వారి అనుచరులు ఇహలోకంలో కష్టములకు గురిచేయబడుటకు కారణం వారు ప్రజలను ఏకదైవారాధన వైపుకు ఆహ్వానించుటయే. 

                      19. దైవప్రవక్త, “రేపు నేను జెండా అలాంటి వ్యక్తికి ఇస్తాను ఎవరైతే…” అనటం 

                      ఆయన దైవప్రవక్త అగుటకు ఒక చిహ్నం. 

                      20. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం, అలీ (రదియల్లాహు అన్హు) కళ్ళను నయపరచుట ఆయన దైవప్రవక్త అనుటకు ఒక నిదర్శనము. 

                      21. దీనిలో అలీ (రదియల్లాహు అన్హు) ప్రాముఖ్యత కూడా తెలుస్తుంది. 22. అనుచరులు ఆలోచనలో నిమగ్నులయిరి. 

                      23. దీనితో మంచి చెడుల విధిరాతపై కూడా విశ్వాసము కలుగును. ఏదైనా మనం కోరుకున్నట్లు కాక అల్లాహ్ నిర్ణయం ప్రకారం జరుగును.

                      24. శాంతముగా పయనించుము అని అలీ (రదియల్లాహు అన్హు)కు బోధించుట. 

                      25. ప్రతి పనికి ముందు ఇస్లాం వైపు ఆహ్వానించ వలయును. 

                      26. ఎట్టి పరిస్థితులలోను ఇస్లాం గురించి క్షుణ్ణంగా విశదీకరించి తెలుపుతూ ఉండవలెను. 

                      27. ఇస్లాం గురించి మంచిగా సామరస్యంతో బోధించవలెను. 

                      28. ఇస్లాం స్వీకరించిన పిదప అల్లాహ్ ఆజ్ఞలను క్షుణ్ణంగా తెలుసుకోవలెను. 

                      29. ఏ వ్యక్తి ద్వారా అయినా కనీసం ఒక్క వ్యక్తి అయినా మార్గ భ్రష్టతను విడనాడి దైవమార్గము స్వీకరించిన ఎడల అది ఎంతో ఉత్తమము. 

                      30. ఫత్వా: ఏదైనా ప్రశ్నపై సరైన జవాబిచ్చినప్పుడు ప్రమాణము చేయ వచ్చును. 

                      పాఠము-6 : తౌహీద్ మరియు కలిమయె తౌహీద్ ధృవీకరణల సారాంశం 

                      అల్లాహ్ ఖుర్ఆన్లో ఈ విధముగా పేర్కొనెను. 

                      أو ليك الذِينَ يَدْعُونَ يَبْتَغُونَ إلى رَبِّهِمْ الوَسيلَةَ أَنهم اَقْرَبُ وَيَرْجُونَ رَحْمَتَهُ وَيَخَافُونَ 

                      عذابه اِنَّ عَذَابَ رَبِّكَ كَانَ مَعْدُورًا ) 

                      “వీరు ఎవరినైతే (అల్లాహ్ ను  కాకుండా) ఆరాధిస్తున్నారో వారే అల్లాహ్ యొక్క సాన్నిధ్యం పొందుటకు ప్రయత్నిస్తుంటారు. ఒకరితో ఒకరు పోటీపడి ఆయన కారుణ్యాన్ని ఆశిస్తూ, ఆయన శిక్షకు భయపడుచున్నారు. నిశ్చయముగా నీ ప్రభువు యొక్క శిక్ష భయపడ దగినటువంటిదే.” (బనీ ఇస్రాయీల్-17:57) 

                      وَإِذْ قَالَ ابْراهِيمُ لأَبِيهِ وَقَوْمِة انتي برام تما 

                      اِنَّنِي 

                      تَعْبُدُونَ الَّا الَّذِي فَطَرَنِي فَإِنَّهُ سَيَهْدِيْنِ . 

                      وَجَعَلَهَا كَلِمَةً بَاقِيَةً فِي عَقِبِهِ لَعَلَّهُمْ يَرْجِعُونَ ) 

                      “ఇబ్రాహీం (అబ్రహం) అలైహిస్సలాం తన తండ్రిని, తన జాతిని ఉద్దేశించి ఈ విధముగా పలికెను: “మీరు ఆరాధిస్తున్న వాటితో నాకు ఏ విధమైన సంబంధములేదు. నా సంబంధం కేవలం నన్ను సృష్టించిన వానితోనే కలిగియున్నది. ఆయనే నన్ను సన్మార్గమున నడుపును.” ఇబ్రాహీం ఈ వచనాన్నే తన వెనుక తన సంతానము కొరకు విడిచి వెళ్ళెను. వాళ్ళు అనుసరించగలరని. (అజ్-జుబ్రుఫ్-43:26-28) 

                      اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِّنْ دُونِ الله 

                      “వారు అల్లాహ్ ను విడిచి తమ పండితులను తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసికొనిరి.” (అత్-తౌబా-9:31) 

                      وَمِنَ النَّاسِ مَنْ يَتَّخِذُ مِنْ دُونِ اللَّهِ 

                      انْدَادًا يُحِبُّونَهُمْ كَحُبّ الله 

                      “మరి కొందరు అల్లాహు భాగస్వాములను కల్పించి వారిని అల్లాహు అభివర్ణించే విధంగా అభివర్ణిస్తారు, ప్రేమించే విధంగా ప్రేమిస్తారు. కాని విశ్వాసులు అల్లాహ్ నే అమితంగా ప్రేమిస్తారు.” (2:165) 

                      ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ఉపదేశిం చారు: “ఎవరైతే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ‘ను నమ్మి సాక్ష్యమిచ్చి, బహు దైవారాధనను నిరాకరించారో వాళ్ళ జీవితము ధన్యమైనది. అటువంటివారి ఆచరణ అల్లాహ్ చూచుకొనును.” 

                      దీనిలో 6 అర్థ తాత్పర్యములు కలవు 

                      1. అతి ముఖ్యమైన విషయం ఏకదైవారాధన. దాని అర్థం స్పష్టముగా తెలుపబడినది.

                      2. అల్లాహ్ ను విడిచి వేరే వారిని వేడుకొనుటయే బహుదైవారాధన, 

                      3. గ్రంథప్రజలు అల్లాహ్ ను వదిలి తమ మత గురువులను ఆరాధించే వారు కాదు. కేవలం వారు చూపిన వక్ర కార్యములను అనుసరించే వారు. అంటే అల్లాహ్ ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఎవరి ఆజ్ఞలను శిరసావహిస్తారో వారిని ఆరాధించినట్లు. 

                      4. ప్రవక్త ఇబ్రాహీం (అలైహిస్సలాం) తిరస్కారులను ఉద్దేశించి పలికిన వచనములు: “మీరు ఆరాధిస్తున్న వాటితో నాకు సంబంధము లేదు. నా సంబంధము నన్ను సృష్టించిన అల్లాహ్ తోనే” అని. స్పష్టంగా కల్పిత దేవుళ్ళను నిరాకరించి, తనను సృష్టించిన అల్లాహ్ నే ఆరాధించటం చిత్త శుద్ధితో కూడుకున్న పని అని విశదీకరించెను. ఈ విధమైన స్పష్టమైన 

                       ఏకదైవారాధననే ఇబ్రాహీం (అలైహిస్సలాం) తన సంతతికి ఉద్బోధించి వెళ్ళెను. బహుశా వారు అనుసరించ గలరని. 

                      5. అల్లాహ్ ఖుర్ఆన్ తిరస్కారుల గురించి ప్రస్తావిస్తూ, వారు నరకము నుండి విముక్తి చెందలేరని తెలిపెను. వారు కల్పిత భాగస్వాములను అల్లాహ్ ను ప్రేమించినట్లు ప్రేమించుచున్నారు. దీనితో అర్థం అయ్యే దేమనగా బహుదైవారాధకులు కూడా సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్ ను విశ్వసించి, ఆయనకు భాగస్వాములను కూడా కల్పించేవారు. అందుచే అల్లాహ్ ను విశ్వసించినప్పటికీ అల్లాహు భాగస్వాము లను కల్పించుట ద్వారా వారు నరక వాసుల య్యారు. అందుచే ఒక్క అల్లాహ్ నే ఆరాధించవలెను. ఆయనకు భాగస్వాములను కల్పించకుండా ఉన్నప్పుడే అల్లాహ్ విధేయులము కాగలము. లేనిచో నరకము నుండి విముక్తి అసంభవము. 

                      6. బహుదైవారాధనను ధిక్కరించకుండా కేవలం ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ చదివినంత మాత్రాన ఒక వ్యక్తి అల్లాహ్ విధేయుడు (ముస్లిం) కాలేడని హదీసులో స్పష్టముగా తెలుపబడింది. 

                      పాఠము-7 : కష్టనష్టాల విముక్తికి తాయత్తులు, దారాలు, రక్షరేకులు ధరించుట 

                      అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా సంబోధించెను. 

                      قُلْ أَفَرَعَيْتُمْ مَا تَدْعُونَ مِنْ دُونِ اللَّهِ إِنْ أَرَادَ نِيَ اللهُ بصْرِهَل هُنَّ كَشِفْتُ صُرَةٍ اَوْ اَرَادَنِي بِرَحْمَةٍ هَل هُنَّ ملَتْ رَحْمَتِهِ قَلْ حَسْبِيَ اللهُ عَلَيْهِ يَتَوَكَّلُ الْمُتَوَكَّلُونَ . 

                      “ఓ ప్రవక్తా! వారిని ఉద్దేశించి పలుకుము. ఒకవేళ అల్లాహ్ నన్ను దండించదలచిన ఎడల అల్లాహ్ ని కాదని మీరెవరినైతే ఆరాధిస్తున్నారో వారు నన్ను రక్షించగలరా? లేదా అల్లాహ్ నన్ను కరుణించదలచినచో వీరు అల్లాహ్ కరుణను అడ్డుకొనగలరా? మీరే ఆలోచించండి. నాకు అల్లాహ్ ఒక్కడే చాలని చెప్పండి, నమ్ముకునే వారు ఆయన్నే నమ్ముకుంటారు.”(అజ్-జుమర్-39:38) 

                      హజరత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖించెను: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఒక వ్యక్తి తన చేతిలో ఇత్తడి కడియాన్ని తొడిగి ఉండటం చూసి, ఇది ఏమిటని ప్రశ్నించెను. ఆ వ్యక్తి ఇది ‘వాహినా’ (బలహీనత) కారణముగా తొడిగితిని అని జవాబు పలికెను. అప్పుడు ప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం)  దీనిని తీసివేయి. అది(నీకు ఏమీ లాభము చేకూర్చదు) నిన్ను ఇంకా బలహీనపరుస్తుంది. అది తొడిగి ఉండగా నీకు మరణము సంభవిస్తే నీవు మోక్షము పొందలేవు” అని అన్నారు. (ముస్నద్ అహ్మద్-సహీసనద్) 

                      హజరత్ ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ప్రబోధించారు: “తాయత్తులు ధరించే వారి కార్యములను అల్లాహ్ పూర్తి చేయకుండుగాక! గవ్వలు వ్రేలాడదీసే వారికి అల్లాహ్ శాంతినివ్వకుండుగాక! (ముస్నద్ అహ్మద్) 

                      “తాయత్తులు వ్రేలాడదీసే వారు అల్లాహ్ కు భాగస్వామ్యాన్ని కల్పించిన వారే.”  (ముస్నద్ అహ్మద్) 

                      ఇబ్నె అబీ హాతిం హజరత్ హుజైఫా రదియల్లాహు అన్హు గురించి ఈ విధముగా ఉల్లేఖించెను: ఆయన ఒక వ్యక్తి చేతికి అనారోగ్య కారణంగా తాడు కట్టబడి ఉండుట చూచెను. ఆయన దానిని త్రెంచి వేసి ఖుర్ఆన్లోని ఈ ఆయత్పఠించెను. 

                      وَمَا يُؤْمِنُ أَكْثَرُهُمْ بِاللهِ اِلَّا وَهُمْ مُّشْرِكُونَ . 

                      “అల్లాహ్ ని విశ్వసించిన వారిలోని అధికులు భాగస్వాములను కూడా కల్పిస్తూ ఉంటారు.” (యూసుఫ్-12:106) 

                      దీనిలో 11 అర్థ తాత్పర్యములు కలవు 

                      1.తాయత్తులు లేదా ఏవైనా వస్తువులు ధరించుట నిషిద్ధము.
                      2. ప్రవక్త సహచరుడైనా తాయత్తులు ధరించి మరణించిన ఎడల మోక్షము పొందలేరు. ” చిన్న తరగతి షిర్క్ ఘోరపాపాల కన్నా అతిఘోరమైనది” అన్న దైవప్రవక్త సహచరుల మాటకు ఈ హదీసు సాక్ష్యం (సమర్ధన) లభిస్తోంది.
                      3. తెలియక చేసినప్పటికీ మోక్షము లభించదు. 

                      4. ఈ వస్తువులు ఇహలోకములో కూడా లాభదాయకంకావు. పైగా నష్టం కలిగిస్తాయి. ఎందుకంటే దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) “అది నిన్ను ఇంకా బలహీన పరుస్తుంది” అన్నారు. 

                      5. ఇలాంటి వక్ర ఆచరణలు చేయువానిని గట్టిగా వారించవలెను. 

                      6. ఎవరైతే ఏ వస్తువు వ్రేలాడదీయునో దానికి అప్పజెప్పబడును. 

                      7. తాయత్తులు ధరించేవారు అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించినవారే. 

                      8. జ్వరం వచ్చినా తాళ్ళు కట్టుట నిషిద్ధం. 

                      9. హజరత్ హుజైఫా రదియల్లాహు అన్హు యొక్క వచనం ప్రకారం- ‘షిర్కె అక్బర్ ‘కు సంబంధించిన ఆయతు ‘షిర్కె అస్గర్ ‘కి కూడా వర్తించును.

                      10. దిష్టి నుండి కాపాడబడుటకు గవ్వలను తొడుగుట అల్లాహ్ కు భాగస్వాములను కల్పించినట్లు. 

                      11. తాయత్తులు మరియు గవ్వలు తొడుగు వానిని శపించవచ్చును. 

                      తాయెత్తులు ధరించేవారి కార్యములను అల్లాహ్ పూర్తిచేయడు. గవ్వలు ధరించేవారిని అల్లాహ్ వారిమానాన వదిలేస్తాడు. (అంటే వారికి ఉపశమనం లభించదు). 

                      పాఠము-8 : ఊదుట మరియు తాయత్తులు ధరించుట నిషిద్ధం 

                      బుఖారీ, ముస్లింలలో హజరత్ అబూ బషీర్ అన్సారీ రదియల్లాహు అన్హు ఈ ఉల్లేఖనమును పొందుపరిచెను: “నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వెంట ప్రయాణించుచుంటిని. ప్రవక్త, ఒక చాటింపు వేయువానిని పంపి ఈ విధముగా చాటింపు వేయించెను. “ఏ ఒంటె మెడలోనూ (దిష్టి నివారించుటకు) కట్టబడిన ఏ వస్తువూ ఉండకూడదు. ఉన్న వాటిని తీసివేయ వలెను” అని. 

                      అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖిం చెను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ప్రబోధిం చెను: “మంత్రాలు, తాయత్తులు, తౌల అన్నీ అల్లాహ్ కు భాగస్వామ్యాన్ని కల్పించినట్లే (అని అర్థం)”. (ముస్నదె అహ్మద్, అబూ దావూద్) 

                      అత్తమాయిమ్ (తాయత్తులు): ఇతర వస్తువుల దిష్టి తగలకుండా ధరించే తాయత్తులు.

                      అర్రుఖా (మంత్ర పఠనం లేదా ఊదుట): షిర్క్ కు తావులేని స్తోత్రములు తప్ప వేరేవి పఠించకూడదు. 

                      తౌల: భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుటకు ధరించునటు వంటివి. హజరత్ అబ్దుల్లా బిన్ హకీం రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖించారు: 

                      “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ప్రబోధిం చెను. “ఏ వ్యక్తి అయినా ఏదైనా ధరించిన యెడల అతనిని దాని వశము చేసి వేయబడును.” (ముస్నద్ అహ్మద్ వ సునన్ తిర్మిజీ). 

                      ఇమాం అహ్మద్ హజరత్ రువైఫీ రదియల్లాహు అన్హు ద్వారా ఈ విధముగా ఉల్లేఖించెను: “ప్రవక్త ముహమ్మద్, ఎవరైతే తాయత్తులు ధరించుదురో, శుద్ధి కొరకు ఎండిన పేడ లేక ఎముక ఉపయోగించెదరో వారితో ప్రవక్తకు, ఇస్లాంకు సంబంధము లేదు.’ 

                      “ఎవరైతే ఒకరి మెడ నుంచి అయినా తాయత్తు తీసివేసిన యెడల అతనికి ఒక బానిసను విముక్తి కలిగించినంత పుణ్యము లభించును. (వకీ రహ్మతుల్లా అలైహ్ దీనిని పొందుపరచెను)

                      వకీ రహమతుల్లాహ్ అలై, ఇబ్రాహీం నఖయీ రహమతుల్లాహ్ అలై ద్వారా ఈ విధముగా ఉల్లేఖించెను: “ఇబ్నె మద్ రదియల్లాహు అన్హు తాయత్తులన్నింటినీ వారించెను. వాటిలో ఖుర్ఆన్ ఆయత్లు లిఖించి ఉన్నా, వేరేవి ఉన్నాసరే.” 

                      దీనిలో 8 అర్థ తాత్పర్యములు కలవు 

                      1. అత్తమాయిమ్, అర్రుఖా అర్థము తెలుపబడెను.

                      2. “అత్తాలా” అర్థము తెలుపబడెను.

                      3. అర్రుఖా, అత్తమాయిమ్, అత్తావిల అన్నియూ అల్లాహ్ కు భాగస్వాము లను కల్పించుటయే. 

                      4. దిష్టి మరియు విషపురుగు కాటు వైద్యమునకు అల్లాహ్ కు భాగస్వా ములు కల్పించనటువంటి స్తోత్రముల పఠనము వారించబడలేదు. 

                      5. ఖుర్ఆన్ ఆయత్లు లిఖించబడిన తాయత్తులు ధరించుట నిషిద్ధమా? కాదా అనే విషయంలో పండితుల మధ్య అభిప్రాయ భేదము కలదు. అందుచే ధరించకపోవుటయే ఎంతో ఉత్తమము. 

                      6. దిష్టి విముక్తి కొరకు జంతువుల మెడలో ఏవైనా వస్తువులు వ్రేలాడదీ యుట అల్లాహు భాగస్వాములుగా కల్పించినట్లే. 

                      7. జంతువుల మెడలో ఏమైనా వ్రేలాడ దీయుట గట్టిగా వారించ బడినది. 

                      8. ఎవరి మెడలోనైనా వ్రేలాడుతున్న తాయత్తును తీసివేయుట ద్వారా కలుగు పుణ్యము తెలుపబడెను.  

                      9. ఇబ్రాహీం నఖయీ రహమతుల్లాహ్ అలై, అబూ బిన్ మస్ ఊద్  రజి అల్లాహు అన్హుగారి శిష్యులు. ఆయన తాయత్తులను ధరించుట నిషేధిం చబడినట్లు స్పష్టపరిచెను అని తెలిపెను. 

                      పాఠము-9 : రాళ్ళను, చెట్లను శుభం కల్గించేవిగా భావించుట 

                      అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉపదేశించెను: 

                      اَفَرَيَتُمُ اللتَ وَالْعُزَّى وَمَنْوةَ الثَّالِثَةَ الْأُخْرى 

                      “లాత్, ఉజ్జా మరియు మూడో విగ్రహమైన మనాత్ వాస్తవికతను గురించి ఆలోచించారా?” (అన్-నజ్-53:19-20) 

                      హజరత్ అబూవాఖిద్ లైసీ రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖిం చెను: “మేము ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తోపాటు హునైన్ పట్టణానికి ప్రయాణించుచుంటిమి. మేము అప్పుడే క్రొత్తగా ఇస్లాం స్వీకరించి ఉంటిమి. ఆ మార్గములో ఒక రేగి చెట్టు ఉంది. బహుదైవారాధకులు ఆ చెట్టును ప్రార్థించేవారు. వారి వస్తువులను కూడా ఆ చెట్టుకు వ్రేలాడదీసే వారు. దాని పేరు ‘జాత్ అన్వాత్.’ మా ప్రయాణంలో ఒక రేగి చెట్టు సమీపమునకు చేరినప్పుడు, ఓ ప్రవక్తా! ఏ విధముగానైతే బహుదైవారాధకుల కొరకు శుభము పొందుటకు “జాత్ అన్వాత్” ఉన్నదో, అటువంటిదే మా కొరకు కూడా ఒకటి నిశ్చయించండి అని చెప్పాము. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధంగా ఉద్బోధించారు: అల్లాహు అక్బర్, అల్లాహ్ అందరికంటే ఉత్తముడు. ఇవి పూర్వీకుల విధానాలే! అయితే అల్లాహ్ పై ప్రమాణము చేసి చెబుతున్నాను. ఎవరి చేతిలోనయితే నాప్రాణముందో ఆయన సాక్షిగా చెబు తున్నాను. ప్రవక్త మూసా అలైహిస్సలామ్ ని, ఆయన అనుచరులు (బనీ ఇస్రాయీల్) ఏవైతే కోరారో మీరూ అవేకోరారు. “ఓ మూసా! ఏ విధముగా అయితే ఆరాధన కొరకు వారికి విగ్రహాలు కలవో అదే విధముగా మా కొరకు కూడా ఒక విగ్రహమును తయారుచేయి.” అప్పుడు ప్రవక్త మూసా (అలైహిస్సలాం), వారిని మీరు వట్టి తెలివిమాలిన వారు అని కోపగించారు. తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం, “మీరు కూడా పూర్వపు జాతులను అనుసరిస్తారు” అని చెప్పారు. (తిర్మిజీ) 

                      దీనిలో 22 అర్థ తాత్పర్యములు (పాఠములు) కలవు 

                      1. సూరయె నజ్ ఆయత్ (53:19-20) యొక్క అర్థం. 

                      2. అనుచరులు ‘జాత్ అన్వాత్’ గురించి అడుగుట ఏమిటంటే, అసలు వాస్తవికత ఏమిటని, ఎవరి చేతిలో నా ప్రాణం ఉన్నదో ఆ అల్లాహ్ పై ప్రమాణం చేసి చెబుతున్నాను. 

                      3. అనుచరులు తమ అభిప్రాయము విన్నవించిరిగాని, అమలు పరచలేదు.. 4. అనుచరులు దానిని అల్లాహ్ స్వీకరించునని భావించిరి. 

                      5. అనుచరులకు ఇటువంటి పని చేయుట అల్లాహ్ కు భాగస్వాములను కల్పించుట అని తెలియనప్పుడు, వేరే వారికి కూడా తెలియ నట్లు.
                      6. పుణ్యము మరియు క్షమాపణ అనుచరులకు లభించునట్లు అందరికీ లభించవు. 

                      7. అనుచరులు ‘జాత్ అన్వాత్’ కోరినప్పుడు, ప్రవక్త, వారు తెలియక అడిగారని ఊరుకొనక, ఇదే మార్గభ్రష్టత్వము, మీరు కూడా మునుపటి సంతతుల అడుగుజాడల్లో నడవగలరని స్పష్టముగా వివరించి నిరోధించెను. 

                      8. అన్నిటికంటే ముఖ్య విషయం, ప్రవక్త తన అనుచరులతో ఈ విధముగా సంబోధించుట. “మీరు కూడా ఇస్రాయీల్ సంతతి కోరినట్లు కోరు చున్నారు. వారు, ఓ మూసా! మా కొరకు కూడా ఒక విగ్రహాన్ని నిర్ణయిం చుము” అని పలికిరి. మీరు కూడా అదే విధముగా ప్రశ్నించారు. 

                      9. అటువంటి వస్తువులు, ప్రదేశములు, ఏ విధమైన శుభము కలిగించ జాలవని గుర్తించడమే ఏకదైవారాధనకు నిదర్శనము. దీనిని ప్రారంభంలో అనుచరులు కూడా గ్రహించలేకపోయారు. ఇది అతి జాగ్రత్తగా గ్రహిం చవలసిన విషయం. 

                      10. ప్రవక్త ముఖ్య విషయం కాబట్టి చేశారు. 

                      11. అనుచరులు ఈ విధముగా కోరుటతో అల్లాహ్ కు భాగస్వాములను కల్పించిరి. కానివారు అవిశ్వాసులు కాలేదు, దీనివలన షిర్క్ లో హెచ్చు తగ్గులు కలవని అర్థం అవుతుంది. 

                      12. అప్పుడే మేము ఇస్లాం స్వీకరించితిమి అంటే పాత వారికి ఇది తెలియక ఉండకూడదు.

                      13. ఆశ్చర్యము కలిగినప్పుడు “అల్లాహ్ అతి ఉత్తముడు” అని పలకవచ్చును. 

                      14. బహుదైవారాధన మరియు వక్ర కార్యములకు దారితీయునటువంటి వాటి నన్నిటినీ నిషేధించవలెను. 

                      15. దీనిలో పూర్వీకులను అనుసరించుటను నిషేధించబడెను

                      16. విద్యాభోధన చేయునప్పుడు కోపగించుకొనుట. (విద్యార్థులపై) 

                      17. ప్రవక్త దీనిలో మునుపటి సంతతుల విధానములను వివరించెను. 

                      18. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు కూడా మునుపటి వారి వలె చేయగలరని తెలియపరచుట, ఆయన ప్రవక్త అనుటకు ఒక నిదర్శనము. 

                      19. అల్లాహ్! యూదులను, క్రైస్తవులను వేటి గురించి అయితే నిందించెనో, నిశ్చయముగా అవి మన కొరకు కూడా వర్తించును. అటువంటి కార్యముల నుండి మనం అన్ని విధాలా దూరంగా ఉండి జాగ్రత్తగా మసలుకోవాలి. 

                      20. అల్లాహ్ యొక్క ఆజ్ఞను శిరసావహించుటయే ఆరాధనకు నిదర్శనం. 

                      21. గ్రంధము అనుగ్రహించబడిన వారి విధానములు కూడా బహు దైవారాధకుల విధానముల వలె ఉండెను. 

                      22. ఎవరైతే చెడు నుంచి నిజం వైపుకు వస్తారో, వారిలో కొన్ని పాత పద్ధతులు ఇమిడి ఉంటాయి. వాటిని గ్రహించి జాగ్రత్తగా వాటి నుండి విముక్తి పొందుటకు ప్రయత్నించవలెను. 

                      పాఠము- 10 : అల్లాహ్ యేతరులకు ‘బలి’ సమర్పించేవారు 

                      అల్లాహ్ ఖుర్ఆన్లో ఈ విధముగా పేర్కొనెను. 

                      قُلْ اِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَلَمِينَ لا شَرِيكَ لَهُ، وَبِنالِكَ أُمِرْتُ وَأنا أوّلُ الْمُسْلِمِينَ . 

                      “(ఓ ప్రవక్తా!) ఈ విధముగా ప్రకటించుము: నా ఆరాధన, నా అర్పణ, నా జీవితం, నా మరణం, సమస్తమూ సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కే అంకితం. ఆయనకు సాటిగానీ, భాగస్వాములుగానీ లేరు. నాకు ఇదే ఆజ్ఞాపించబడినది మరియు నేను ప్రప్రథమంగా శిరసావహించిన విధేయుణ్ణి.” (6:162-163) 

                      فصل لربك وانحر: 

                      “కాబట్టి నువ్వు నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి, ఖుర్బానీ ఇవ్వు.” (108:2) 

                      హజరత్ అలీ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు నాలుగు ఉద్బోధనలు చేసిరి. 

                      1) ఎవరైతే అల్లాహ్ కు తప్ప ఇతరులకు జంతువును అర్పిస్తారో వారు శాపగ్రస్తులవుతారు. 

                      2) ఎవరైతే తమ తల్లిదండ్రులను శపిస్తారో వారే స్వయంగా శాపగ్రస్తు లవుతారు.

                      3) బిర్అత్ లకు కు పాల్పడేవారికి ఎవరయితే ఆశ్రయం కల్పించుదురో, వారు కూడా శాపగ్రస్తులవుతారు. 

                      4) ఎవరైతే హద్దు రాళ్ళను మార్చివేస్తారో, వారు శాపగ్రస్తులవుతారు. 

                      (సహీముస్లింలో ఈ హదీసు పొందుపరచబడెను) 

                      హజరత్ తారిఖ్ బిన్ షిహాబ్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ఉపదేశించారు: 

                      “ఒక వ్యక్తి ఈగ కారణమున స్వర్గములో ప్రవేశించెను మరొక వ్యక్తి ఈగ కారణముననే నరకములో చేరెను.” అప్పుడు అనుచరులు అదెలా ప్రవక్తా? అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా విశదీకరించెను: “ఇద్దరు వ్యక్తులు ఒక ప్రదేశము నుండి ప్రయాణం సాగించారు. అచ్చటి ప్రజలు వాళ్ళ విగ్రహానికి అర్పణ చేయకుండా ఎవ్వరినీ ఆ మార్గము నుండి వెళ్ళనిచ్చేవారు కాదు. వారు ప్రయాణీకులలో ఒకరిని అర్పణ చేయమని పిలిచిరి. అతడు అర్పించుటకు నా దగ్గర ఏమీ లేదని పలికెను. వారు ఈగ అయినా సరే అర్పించవలసినదేనని చెప్పారు. అతను ఈగను ఆ విగ్రహానికి అర్పించెను. అప్పుడు వారు అతనిని విడిచిపెట్టిరి. అతడు ఆ ఈగను విగ్రహానికి అర్పించుట వలన నరకమున ప్రవేశింప జేయబడెను. మరల వారు వేరే వ్యక్తిని నీవు కూడా ఏమైనా అర్పించి వెళ్ళుము అని పలికిరి. కాని అతను నేను ఒక్క అల్లాహు తప్ప వేటికీ అర్పించను అని పలికెను. వారు అతనిని చంపివేసిరి. అతను స్వర్గమున ప్రవేశింప జేయబడెను.” (ముస్నద్ అహ్మద్) 

                      దీనిలో 13 పాఠములు కలవు 

                      1. వాక్యము (6:162-163) యొక్క తఫ్సీర్ (భావము). 

                      2. వాక్యము (108:2) యొక్క తఫ్సీర్ (భావము). 

                      3. అల్లాహ్ యేతరులకు అర్పించువారిని శపించుట మొట్టమొదటిది. 

                      4.నీవు వేరే వారి తల్లిదండ్రులను శపించిన యెడల అతడు నీ తల్లిదండ్రు లను శపించును. ఆ కారణముగా నీవే నీ తల్లిదండ్రులపై శాపమునకు కారకుడవగుదువు. 

                      5. ఎవరైనా వక్ర కార్యములకు పూనుకున్న వ్యక్తికి ఆశ్రయము ఇచ్చిన యెడల అతడు శాపమునకు అర్హుడగును (వక్ర కార్యము అంటే అల్లాహ్ ఆజ్ఞను ధిక్కరించుట లేదా అల్లాహు, ప్రవక్తకు అవిధేయత చూపుట). 

                      6. హద్దుల రాళ్ళను మార్చినవారిపై శాపము. 

                      7. ప్రత్యేక వ్యక్తిని శపించుటలో మరియు ఎవరినీ గుర్తించకుండా శపిం చుటలో వ్యత్యాసము కలదు. 

                      8. ఒక్క ఈగను అర్పించి నరకమున ప్రవేశింపబడుట గమనార్హము.

                      9. ఈగను అర్పించిన వ్యక్తి అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించే ఉద్దేశముతో చేయలేదు. అతను తనప్రాణమును కాపాడుకొనుటకు చేసెను. దీనితో అల్లాహ్ కు కాకుండా ఇతరులకు అర్పించుట ఎంత ఘోరమైన పాపమో అర్థమవుతుంది. 

                      10. అల్లాహ్ యొక్క నిజమైన విధేయుడు మరణించుటకు సిద్ధపడెను. కాని అల్లాహక్కు తప్ప ఇతరులకు అర్పించుటకు పూనుకోలేదు. 

                      11. వారిలో ఈగను విగ్రహానికి అర్పించి నరకమున ప్రవేశించిన వ్యక్తి కూడా ముస్లింయే. విశ్వాసంలేని యెడల ఒక్క ఈగ కారణముగా నరకమున ప్రవేశించెను.

                      12. ఈ హదీసు వేరొక హదీసు ‘స్వర్గ నరకములు మీ బూట్ల లేజుల కంటే సమీపమున కలవు” (బుఖారీ)ను ధృవీకరించెను.

                      13. ప్రతి ఒక్కరికీ ఆత్మవిశ్వాసం అన్నిటికంటే ముఖ్యము.

                      పాఠము-11 : అల్లాహ్ యేతరులకు అర్పించబడే స్థలములో అల్లాహ్ నామముపై అర్పణ కూడా నిషేధము 

                      ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా సెలవిచ్చెను: 

                      لَا تَقُمْ فِيهِ اَبَدًا لَمَسْجِدُ أُتِسَ عَلَى التَّقْوى مِنْ أَوَّلِ يَوْمٍ اَحَقُّ أَن تَقُومَ فِيهِ فِيهِ رِجَالُ تُحِبُّونَ 

                      ان يتَطَهَّرُوا وَاللهُ يُحِبُّ الْمُطَهِّرِينَ . 

                      “మీరు ఎప్పటికీ దానిలో నమాజు చేయకండి. ప్రారంభము నుండే భయ భక్తుల ప్రాతిపదికపై నిర్మించిన మసీదే నీవు నమాజు చేయదగినది. అందులో పరిశుద్ధంగా ఉండుటకు ఇష్టపడేవారు ఉన్నారు. అల్లాహ్ నిశ్చయముగా పరిశుద్ధతను పాటించు వారిని ఇష్టపడును (ప్రేమించును).” (అత్-తౌబా 9:108) 

                      హజరత్ సాబిత్ బిన్ జహాక్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ఒక వ్యక్తి ‘బువాన’ అనే ప్రదేశములో ఒంటెను అర్పించుదునని వాగ్దానము చేసుకొనెను. అతను ఆ విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ప్రస్తావించగా ఆయన ఈ విధముగా అడిగెను. “అచ్చట మునుపటి విగ్రహాలలో ఏదైనా (పూజింపబడు) విగ్రహము ఉన్నదా?” అనుచరులు జవాబుగా లేదని పలికారు. మరల ప్రవక్త ఈ విధముగా ప్రశ్నించారు: “అక్కడ బహుదైవారాధకులు ఉత్సవాలు జరుపుకునేవారా?” అనుచరులు జవాబుగా లేదని పలికారు. అప్పుడు ప్రవక్త, “నీ అర్పణ పూర్తి చేయుము” అని పలికెను. “గుర్తుంచుకోండి. ఏ వాగ్దానమైనా సరే (మొక్కు బడి) అల్లాహ్ యొక్క అవిధేయతకు సంబంధించినదైతే దానిని పూర్తి చేయ కూడదు (ఆచరించకూడదు). తమ అందుబాటుకు మించివున్న మొక్కుబడిని కూడా పూర్తిచేయనవసరంలేదు.” (దీనిని సుననె అబూదావూద్, సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలలో నిబంధనల మేరకు పొందుపరచబడెను.) 

                      దీనిలో 11 పాఠములు కలవు 

                      1. వాక్యము (9:108) యొక్క భావము. 

                      2. అల్లాహ్ విధేయత భూమిపై కూడా ప్రభావితపరచును. 

                      3. ఏదైనా కష్టమైన సమస్యను తెలియజేయుటకు అనుమానము లేకుండా విశదీకరించి తెలుపవలెను.

                      4. అవసరాన్నిబట్టి అన్ని విషయాలు అడిగి తెలుసుకొని జవాబు చెప్పవలెను. 

                      5. ఏదైనా ప్రదేశంలో అర్పణకు వాగ్దానము చేయునప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి చేయవలెను. 

                      6. మునుపటి రోజుల్లో అచ్చట విగ్రహారాధన జరిగిన ఎడల, ఇప్పుడు అచ్చట విగ్రహారాధన జరగనప్పటికీ అచ్చట మొక్కుబడి పూర్తి చేయుట నిషిద్ధము. 

                      7. పాత ఆచారములు గల ఏ ప్రదేశములో కూడా మొక్కుబడి పూర్తి చేయకూడదు. 

                      8. ఎవరైనా బహుదైవారాధన జరుగు ప్రదేశములో మొక్కుబడి వాగ్దానము చేసిన యెడల ఆ మొక్కుబడి పూర్తి చేయుట నిషిద్ధం. 

                      9. పండగలు చేయుటలో ముస్లిమేతరుల పద్ధతిని పాటించరాదు. 

                      10. అల్లాహ్ అవిధేయతకు పూనుకొను మొక్కుబడి నిషేధించబడినది. 

                      11. మనం చేయలేని వాగ్దానాలనుచేయుట నిషేధించబడినది. 

                      పాఠము-12 : అల్లాహ్ యేతరుల మొక్కుబడి షిర్కే 

                      అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా సెలవిచ్చాడు: 

                      يُوفُونَ بِالنَّذْرِ وَيَخَافُونَ يَوْمًا كَانَ شَرُّهُ مُسْتَطِيرًا

                      వారు తమ మొక్కుబడులను చెల్లిస్తుంటారు. ఏ రోజు కీడు నలువైపులా విస్తరిస్తుందో ఆ రోజు గురించి భయపడుతుంటారు. (అల్-ఆరాఫ్-76:7) 

                      وَمَا أَنفَقْتُم مِّن نَّفَقَةٍ أَوْ نَذَرْتُم مِّن نَّذْرٍ فَإِنَّ اللَّهَ يَعْلَمُهُ

                      మీరు ఏదైతే ఖర్చు చేశారో, మొక్కుబడి చేసుకున్నారో, నిశ్చయముగా అల్లాహ్ కు తెలుసును.” (అల్-బఖర-2:270) 

                      హజరత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈవిధముగా ప్రబోధించెను: 

                      “ఎవరైతే అల్లాహ్ విధేయతకు సంబంధించిన మొక్కుబడి చేశారో (వాగ్దానము చేశారో) వారు నిశ్చయముగా విధేయతను పూర్తి చేయవలెను. ఎవరైతే అల్లాహ్ అవిధేయతకు సంబందించిన మొక్కుబడి (వాగ్దానము) చేశారోవారు ఎట్టి పరిస్థితిలోనూ అవిధేయతకు పూనుకోకూడదు. 

                      దీనిలో 3 ప్రకరణములు కలవు 

                      1. వాగ్దానము (మొక్కుబడి) పూర్తి చేయవలెను. 

                      2. మొక్కుబడి ఆరాధన కాబట్టి వేరే వారికి మొక్కుకొనుట అల్లాహు భాగస్వాములను కల్పించుట అని అర్థం. 

                      3. అల్లాహ్ అవిధేయతకు పాల్పడే మొక్కుబడులు చేయకూడదు. తెలియక చేసినా వాటిని పూర్తి చేయుట నిషిద్ధం. 

                      పాఠము-13 : అల్లాహ్ యేతరుల ‘శరణు’ షిర్కే 

                      ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా బోధించెను:

                       وَأَنَّهُ كَانَ رِجَالٌ مِّنَ الْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍ مِّنَ الْجِنِّ فَزَادُوهُمْ رَهَقًا

                      “మానవులలో కొందరు జిన్నాతులలోని కొందరిని శరణు వేడుకొను చుండెడివారు. ఈ విధముగా వారి గర్వము అధికమయ్యెను.” ( సూరా అల్ జిన్న్72:6) 

                      హజరత్ ఖౌలా బిన్తె హకీం (రదియల్లాహు అన్హా) గారి కథనం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈవిధముగా ఉద్బోధిస్తుండగా నేను విన్నాను: ఎవరైతే ఏదైనా ప్రదేశములో దిగి, “నేను అల్లాహ్ సృష్టించిన ప్రతి దాని కీడు నుండి అల్లాహ్ సమస్త పదములతో శరణు కోరుచున్నాను” అని దుఆ చదివిన యెడల అతడు అక్కడ నుండి వెళ్ళనంత వరకు ఏ కీడు హాని కల్పించదు.” (ముస్లిం దీనిని పొందుపరచెను) 

                      దీనిలో 5 పాఠములు కలవు 

                      1. సూరె జిన్ (72 : 6) ఆయత్ అర్థం. 

                      2. అల్లాహ్ యేతరుల శరణు కోరటం అల్లాహు భాగస్వామ్యం కల్పించి నట్లు. 

                      3. అల్లాహ్ “పదములు” సృష్టి కావు. ఒకవేళ అల్లాహ్ పదములు సృష్టి అయినచో, సృష్టితో ప్రవక్త శరణు కోరే వారే కాదు. ఎందుకంటే సృష్టిలో దేనినైనా శరణు కోరుట అల్లాహ్ కు భాగస్వాములను కల్పించినట్లు అగును 

                      4. దీనిద్వారా ఆ దుఆ (ప్రార్ధన) యొక్క విశిష్ఠత తెలుస్తోంది. 

                      5. ఏదైనా వక్ర పద్ధతి ద్వారా ఇహలోకంలో లాభము పొందుట లేదా చెడు నుంచి రక్షణ పొందుటకు ప్రయత్నించుట బహుదైవారాధన కాదని అనుకొనుట పొరపాటు. 

                      పాఠము- 14 : అల్లాహ్ యేతరులను వేడుకొనుట షిర్కే 

                      ఖుర్ఆన్ లో అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను: 

                      وَلَا تَدْعُ مِن دُونِ اللَّهِ مَا لَا يَنفَعُكَ وَلَا يَضُرُّكَ ۖ فَإِن فَعَلْتَ فَإِنَّكَ إِذًا مِّنَ الظَّالِمِينَ وَإِن يَمْسَسْكَ اللَّهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ ۖ وَإِن يُرِدْكَ بِخَيْرٍ فَلَا رَادَّ لِفَضْلِهِ ۚ يُصِيبُ بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَهُوَ الْغَفُورُ الرَّحِيمُ

                      “అల్లాహ్ ను వదలి నీకు లాభనష్టాలు కలిగించలేని వేటినీ వేడుకోకు. నీవు అలా చేసిన పక్షంలో దుర్మార్గుడవైపోతావు. ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదైనా ఆపదకు గురి చేసినచో స్వయంగా అల్లాహ్ తప్ప ఆ ఆపద నుంచి నిన్ను తొలగించువారు ఎవ్వరూలేరు. నీకు ఆయన మేలు చేయాలనుకుంటే ఆయన అనుగ్రహాన్ని ఎవ్వరూ నివారించలేరు. ఆయన తన దాసులలో తను తలచిన వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. నిశ్చయముగా ఆయన క్షమించేవాడూ, కరుణించేవాడూను.” (యూనుస్ 10:106-107) 

                      إِنَّمَا تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ أَوْثَانًا وَتَخْلُقُونَ إِفْكًا ۚ إِنَّ الَّذِينَ تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ لَا يَمْلِكُونَ لَكُمْ رِزْقًا فَابْتَغُوا عِندَ اللَّهِ الرِّزْقَ وَاعْبُدُوهُ وَاشْكُرُوا لَهُ ۖ إِلَيْهِ تُرْجَعُونَ

                      “యదార్థముగా అల్లాహ్ ను కాదని మీరు పూజిస్తున్నవి విగ్రహాలే. మీ అంతట మీరు అసత్యాలను అల్లుతున్నారు. అల్లాహ్ ను కాదని మీరు వేటినైతే పూజిస్తున్నారో అవి మీకు ఏ విధమైన ఉపాధి కల్పించలేవు. ఉపాధి కొరకు అల్లాహ్ అడగండి. ఆయనకే దాస్యం చేయండి. ఆయనకు కృతజ్ఞతలు తెలుపండి. ఆయన వైపునకే మీరు మరలించబడతారు.” (అన్ కబూత్ 29:17) 

                      وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ

                      “అల్లాహ్ ను  కాదని ప్రళయం వచ్చే వరకూ అతనికి సమాధానము ఇవ్వలేని వారిని మొరబెట్టుకునేవాడు, తమకు మొరబెట్టుకుంటు న్నాడనే విషయం కూడా తెలియని వారిని వేడుకుంటున్న వాడికంటే పరమ భ్రష్టుడు ఎవరు? ప్రజలందరినీ సమావేశపరచినప్పుడు, వారు తమను వేడుకున్న వారికి విరోధులైపోతారు, వారి ఆరాధనను తిరస్కరిస్తారు.” (అహ్ ఖాఫ్ 46:5-6) 

                      أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ وَيَجْعَلُكُمْ خُلَفَاءَ الْأَرْضِ ۗ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ

                      “బాధితుడు మొరబెట్టుకున్నప్పుడు, అతని మొరను ఆలకించి అతని కష్టమును తొలగించు వాడెవడు? భూమిపై మిమ్ములను ప్రతినిధులుగా చేసినవాడెవడు? అల్లాహ్ తోపాటు మరొక దేవుడు కూడా ఉన్నాడా? మీరు చాలా తక్కువగా ఆలోచిస్తున్నారు.” (నమ్ల్  27:62) 

                      ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క కాలంలో ఒక కపటుడు ముస్లింలకు కష్టనష్టములు కలిగించెడివాడు. అప్పుడు అను చరులు ప్రవక్త వద్దకుపోయి మొరబెట్టు కొనుదుము అని ప్రవక్త వద్దకు వెళ్ళిరి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారినుద్దేశించి ఈ విధముగా ప్రబోధించెను: “చూడండి! నా వద్ద మొరబెట్టుకో కూడదు. ఒక్క అల్లాహ్ వద్ద మాత్రమే మొరబెట్టుకొనవలెను.” (తబ్రానీ) 

                      దీనిలో 18 పాఠములు కలవు 

                      1. వేడుకొనుట అందరూ చేస్తారు. కాని మొరబెట్టుకొనుట బాధితులు మాత్రమే చేస్తారు. 

                      2. వాక్యము (10:106) యొక్క భావము తెలుపబడినది. 

                      3. అల్లాహ్ ని తప్ప వేరే వారిని వేడుకొనుట, పెద్ద బహుదైవారాధన

                      4. ఎంతటి వ్యక్తి అయినా, అల్లాహ్ ని తప్ప వేరే వారిని వేడుకొనిన యెడల అతడు కూడా దుర్మార్గులలో చేరుతాడు. 

                      5. వాక్యము (10:107) యొక్క భావము తెలుపబడింది. 

                      6. అల్లాహ్ ని తప్ప వేరే వారిని వేడుకొనుట అల్లాహ్ ను ధిక్కరించినట్లు. 

                      7. వాక్యము (29:17) యొక్క అర్థము తెలుపబడినది.

                      8. అల్లాహ్ ని తప్ప వేరేవారిని ఉపాధి కొరకు వేడుకొనరాదు, ఎలాగైతే స్వర్గం కొరకు అల్లాహ్ ని తప్ప మరెవ్వరితో కోరరో, అలాగే ఉపాధిని కూడా అల్లాహ్ ని తప్ప మరెవ్వరితోనూ కోరకూడదు. 

                      9. వాక్యము (46:5) యొక్క భావము తెలుపబడినది. 

                      10. ఎవరైతే అల్లాహ్ ని కాదని వేరే వారిని వేడుకుంటాడో, మొరబెట్టు కుంటాడో, అతన్ని మించిన మార్గభ్రష్టుడు ఎవ్వడూ లేడు. 

                      11. అల్లాహ్ ని తప్ప ఎవరికైతే మొరబెట్టుకుంటున్నారో, వానికి మొరబెట్టు కుంటున్న విషయం కూడా తెలియదు. 

                      12. అల్లాహ్ ని కాదని ఎవరినైతే వేడుకొంటున్నారో, వారు ప్రళయదినం నాడు వారిని వేడుకున్న కారణంగా వారికి శత్రువులవుతారు. 

                      13. వేటినైతే వేడుకుంటున్నారో వారు ప్రళయ దినాన్ని నిరాకరిస్తారు. 

                      14. అల్లాహ్ ని కాకుండా వేరే వారిని వేడుకొనుట, నిశ్చయముగా వారిని ఆరాధించినట్లు. 

                      15. అల్లాహ్ ని కాదని ఇతరులను వేడుకొనుట కారణముగానే ఆ వ్యక్తి అందరికంటే ఎక్కువ మార్గభ్రష్టుడైనాడు. 

                      16. వాక్యము (27:62) భావము తెలుపబడినది. 

                      17. నిశ్చయముగా ఆలోచించదగ్గ విషయం ఏమనగా, బహు దైవా రాధకులు కూడా కష్టములలో నుండి మొరబెట్టుకొనువాని మొర ఒక్క అల్లాహ్ యే వినగలడని, కష్టముల నుండి ఒక్క అల్లాహ్ యే రక్షించగలడని విశ్వ సించి, కష్ట పరిస్థితులలో వారు కూడా ఏకాగ్రతతో ఒక్క అల్లాహ్న వేడు కునేవారు. 

                      18. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏకదైవారాధనను ఎటువంటి లోపాలు లేకుండా భద్రపరిచారు. అనుచరులకు ఏక దైవారాధన విషయంలో నీతి మర్యాదలను బోధించారు. అల్లాహ్ పట్ల అమితమైన మర్యాదలను, గౌరవాన్ని సమకూరుస్తూ వివరించారు. 

                      పాఠము- 15 :ఏ వస్తువునూ సృష్టించలేని వారిని వీరు అల్లాహ్ కు భాగస్వాములుగా చేస్తున్నారా?

                      ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా ప్రస్తావించెను: 

                      أَيُشْرِكُونَ مَا لَا يَخْلُقُ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ وَلَا يَسْتَطِيعُونَ لَهُمْ نَصْرًا وَلَا أَنفُسَهُمْ يَنصُرُونَ

                      “ఏమిటి వీరు, వేటినీ సృష్టించలేని వారిని, అల్లాహ్ సృష్టింపబడిన వారిని, ఎవ్వరికీ సహాయం చేయలేని వారిని, స్వయంగా తమకు కూడా సహాయం చేసుకోలేని వారిని అల్లాహు కు భాగస్వాములుగా చేస్తున్నారా?” (7:191-192) 

                       وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍإِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ ۚ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍ

                      “అల్లాహ్ ని విడిచి వేటినైతే మీరు వేడుకుంటున్నారో వారు కనీసం ఖర్జూరపు గింజపై ఉన్న పొరకు కూడా యజమానులు కారు. మీరు వారిని వేడుకున్నా, వారు మీ మొరలను ఆలకించలేరు. ఒకవేళ విన్నా ఏ సమాధానమూ మీకు ఇవ్వలేరు, వారు, మీరు అల్లాహ్ కు కల్పించిన భాగస్వామ్యమును తిరస్కరించుదురు. సత్యము ఎరిగిన అల్లాహ్ తప్ప ఎవ్వరూ మీకు ఈ సత్యసందేశమును అందజేయలేరు.” (35:13-14) 

                      హజరత్ అనస్ రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఉహుద్ యుద్ధంలో గాయపడ్డారు. ఆయన రెండు దంతాలు విరిగిపోయాయి. అప్పుడు ఆయన ఈ విధముగా చెప్పారు: “ఇటువంటి ప్రజలు ఏ విధముగా సాఫల్యము పొందు తారు?” అప్పుడు అల్లాహ్ ఈ వాక్యము అవతరింపజేసెను. (బుఖారి) 

                      ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఫజర్ నమాజు రెండవ రకాతు రుకూ నుంచి లేచి “సమి అల్లాహు లిమన్ హమిద, రబ్బనా వలకల్ హమ్ద్” చదివిన తరువాత “ఓ అల్లాహ్! ఫలానా వారిని శాపగ్రస్తులుగా చేయుము” అని పలికిరి. అప్పుడు అల్లాహ్ ఈ వాక్యము “(ఓ ప్రవక్తా!) ఆ విషయంలో మీకు ఏ విధమైన అధికారమూ లేదు” అని తెలిపెను. 

                      మరోచోట ఈ విధముగా ఉల్లేఖించబడినది: 

                      ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సవ్వాన్ బిన్ ఉమయ్య, సుహైల్ బిన్ అమర్, హారిస్ బిన్ హిషామ్ శపిస్తుండగా ఈ వాక్యము అవతరింపబడెను: “(ఓ ప్రవక్తా!) ఆ విషయంలో మీకు ఏ విధమైన అధికారమూ లేదు.” వేరొకచోట, అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: “ఓ ప్రవక్తా! మీ సమీప బంధువులకు ఉద్బోధించుము” అనే వాక్యము అవతరింపబడినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం లేచి నిలబడి ఈ విధముగా ప్రబోధించారు: “ఓ నా జాతి ప్రజలారా! మిమ్మల్ని మీరు రక్షించుకోండి, అల్లాహ్ సమక్షములో మీకు నేను ఏ విధమైన సహాయమూ చేయలేను. ఓ నా మేనత్త సఫియా! అల్లాహ్ వద్ద నేను మీకు ఏ సహాయమూ చేయలేను. ఓ నా ప్రియమైన కూతురు ఫాతిమా! నా వద్ద ఉన్న సంపదలో ఏమికావాలో అడిగి తీసుకో. కాని అల్లాహ్ సమక్షంలో నేను నీకు ఏ విధమైన సహాయమూ అందించలేను.” 

                      దీనిలో 12 పాఠములు కలవు 

                      1. వాక్యములు (7:191-192) భావము తెలుపబడెను. 

                      2. ‘ఉహద్’లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  గాయపడుటను తెలుపబడెను. 

                      3. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం నమాజులో చివరి రుకూ తర్వాత దుఆ యే ఖునూత్ చదివినట్లు స్పష్టమవుతుంది. సహచరులు ఆయన వెనుక ఆమీన్ అని పలుకుట కూడా తెలుస్తుంది. 

                      4. ధిక్కరించిన వారినే శాపగ్రస్తులుగా చేయమని కోరబడినది.

                      5. విశ్వాసులను, ప్రవక్తను, ధిక్కారులు అతిగా కష్టాలకు గురిచేశారు. అంతేకాకుండా విశ్వసించిన వారు, దౌర్జన్యపరులకు సమీప బంధువులై నప్పటికీ వారిని హతమార్చిరి. ప్రవక్తని “ఎవరైతే తమ ప్రవక్తను గాయ పరిచితిరో” ఆయనను గాయపరచటమే కాకుండా, హతమార్చుటకు పూనుకొనిరి. ఆయన వారి సమీప బంధువైనప్పటికీ

                      6.ధిక్కారులు ఈ నీచ కార్యముల కారణంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  వారిని శాపగ్రస్తులుగా చేయమని కోరినప్పుడు అల్లాహ్, “ఆ విషయంలో మీకు ఏ అధికారమూ లేదు” అనే వాక్యమును అవతరింపజేసెను.

                      7. అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను: “నిశ్చయముగా అల్లాహ్ వారిని క్షమించగలడు లేదా శిక్షించగలడు.” చివరికి అల్లాహ్ వారిని క్షమించెను. వారు విశ్వాసులయ్యారు.  

                      8. అవసరాన్ని బట్టి ఖునూత్ దుఆ చదవవచ్చునని అర్థం అవుతుంది

                      9. ఎవరినైతే శాపగ్రస్తులుగా చేయమని కోరబడుతుందో వారి పేరు తెలుపవచ్చును. 

                      10. “నీ సమీప బంధువులను ఉద్బోధించుము” అనే వాక్యము అవతరింప బడినప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  తన సమీప బంధువులను పిలిచి వారిని నరకము నుండి తమను తాము కాపాడుకోమని ఉద్బోధించుటను తెలుపబడినది. 

                      11. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఏకదైవారాధనకు పిలుపునిచ్చినప్పుడు ఆయనను ప్రజలు పిచ్చివాడని పలికారు. ఇప్పటికీ ఏకదైవారాధనకు పిలుపు ఇచ్చినచో అటువంటి మాటలే వినవలసి ఉంటుంది. 

                      12. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం తన బంధువులందరికీ, “నేను అల్లాహ్ సమక్షములో మీకు ఏ విధముగా కూడా సహాయ పడలేను అని పలికినప్పుడు, తన కన్న కూతురుతో కూడా ఇదే విధముగా పలికారు. ప్రవక్తయే నిస్సహాయులు అయినప్పుడు ఇతరులు ఏం సహాయం చేయగలరు. ఈ రోజుల్లో సహాయం కొరకు ఎవరినైతే వేడుకొంటున్నారో వారు ఏం సహాయం చేయగలరు చెప్పండి!! 

                      పాఠము – 16 : అల్లాహ్ ఏదైనా సందేశము అవతరింపజేసినప్పుడు దైవదూతలకు కలుగు భయాందోళనల గురించి

                      ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను: 

                      إِذَا فُزِّعَ عَن قُلُوبِهِمْ قَالُوا مَاذَا قَالَ رَبُّكُمْ ۖ قَالُوا الْحَقَّ ۖ وَهُوَ الْعَلِيُّ الْكَبِيرُ

                      “వారి హృదయముల నుండి భయం తొలగిపోయినప్పుడు, ఈ విధముగా ప్రశ్నించు కుంటారు. మీ ప్రభువు ఏమని పలికెను. అప్పుడు (దైవదూతలు) ఆయన సత్యమును పలికెను. ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడును” అని చెబుతారు. (సబా-34:23) 

                      హజరత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుంచి హదీసును ఈ విధముగా ఉల్లేఖించెను. (బుఖారీ) 

                      “అల్లాహ్ ఆకాశములపై తన నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు, దైవదూతలు ఆ ఆజ్ఞను శిరసావహిస్తూ తమ రెక్కలను, శుభ్రమైన రాయిపై మెత్తని గొలుసు తగిలినప్పుడు వచ్చు శబ్దము వచ్చునట్లు ఆడిస్తారు. ఆ నిర్ణయం ఆ దైవదూతలందరికీ చేరుతుంది. వారి హృదయముల నుండి భయభ్రాంతులు తొలిగిన తరువాత వారు ఒకరినొకరు “అల్లాహ్ ఏమని సంబోధించెను” అని ప్రశ్నించుకుంటారు. అప్పుడు వారు అల్లాహ్ సత్యమును పలికెను. ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడూను” అని పలుకుతారు. షైతానులు ఆ మాటలను ఒక నిచ్చెనలాగా తయారై వింటారు. (షైతానులు మాటలను ఎలా చేరవేస్తారో హదీసు ఉల్లేఖకులు సుఫ్యాన్  సంజ్ఞలతో సహా వివరించారు. అందరికంటే పైన ఉన్న షైతాను తన క్రింద ఉన్న వారికి, ఆ షైతాను వాని క్రిందివానికి, ఆ విధముగా చివరి షైతాను జ్యోతిష్యులకు తెలియజేస్తాడు. కొన్ని సమయములలో ఆ మాట జ్యోతిష్యునికి చేరక ముందే షైతానులు పారద్రోలబడుతారు. కొన్ని సమయాల్లో షైతానులు జ్యోతిష్యునికి ఆ మాటను తెలియపరుస్తారు. జ్యోతిష్యుడు షైతాను తెలిపిన మాటలకు వంద అసత్యాలు జతపరుస్తాడు. ఏదైనా సంఘటన సంభవించినప్పుడు, ప్రజలు ఫలానా రోజు ఆ జ్యోతిష్యుడు తెలిపాడు గదా? అందురు. అందు మూలంగా ఆ ఒక్క వార్త సరిగా తెలిపినందుకు ఆ జ్యోతిష్యుడు సత్యవంతుడు అని ప్రజలు నమ్ముతారు. వాస్తవానికి ఆ వార్త షైతాన్ ద్వారా ఆకాశము నుండి వినబడినదై ఉంటుంది. 

                      హజరత్ నవ్వాస్ బిన్ సమ్ఆన్  (రదియల్లాహు అన్హు) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుంచి ఈ విధముగా ఉల్లేఖించెను: 

                      “అల్లాహ్ ఏమైనా అవతరింపజేసినప్పుడు అల్లాహ్ భయముతో సకల ఆకాశములపై భయాందోళనలు కమ్ముకుంటాయి. అప్పుడు ఆకాశం మీద ఉన్నవారు ఆ శబ్దానికి మూర్ఛబోయి సాష్టాంగములో పడిపోతారు. ఆ తర్వాత జిబ్రయీల్ దూత అందరి కంటే ముందు తల పైకెత్తుతారు. అల్లాహ్ తను అవతరింప జేసిన విషయాన్ని ఆయనకు తెలియజేస్తాడు. తరువాత జిబ్రయీల్ అలైహిస్సలాం వేరే దైవదూతల దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు వారు ఓ జిబ్రయీల్, మన ప్రభువు ఏమి అవతరింప జేసెను అని ప్రశ్నిస్తారు. అప్పుడు జిబ్రయీల్ (అలైహిస్సలాం) అల్లాహ్ సత్యమును అవతరింపజేసెనని పలుకుతారు. ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడు అని తెలుపుతారు. అప్పుడు దైవ దూతలందరూ అదే సందేశాన్ని ఉచ్చరించుతారు. జిబ్రయీల్ అలైహిస్సలాం అల్లాహ్ ఆజ్ఞ మేరకు ఆ సందేశాన్ని అందజేస్తారు.”

                      దీనిలో 22 పాఠములు కలవు 

                      1. వాక్యము (34:23) యొక్క భావము (అల్లాహ్ ఏదైనా సందేశము అవతరింపజేసినప్పుడు దైవదూతలకు కలుగు భయాందోళనల గురించి తెలుపబడెను.) 

                      2. ఈ వాక్యములో మేము ఫలానా వారిచే సిఫారసు చేయించు కోగలము అన్న భావన ఖండించబడినది

                      3. దీనిలో “అల్లాహ్ నిశ్చయముగా సత్యమును పలికెను, ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడు” అని తెలుపబడింది. 

                      4. దైవదూతలు ఒకరినొకరు ప్రశ్నించుకొనుట తరువాత జవాబు తెలుపుకొనుట ఇచ్చట పొందుపరచబడెను. 

                      5. దైవదూతలు ప్రశ్నించినప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం, అల్లాహ్ అవతరింపజేసిన సందేశము వారికి తెలియపరుస్తారు. 

                      6. దైవదూతలందరూ మూర్ఛపోయినప్పుడు అందరికంటే ముందు, జిబ్రయీల్ (అలైహిస్సలాం) తేరుకొంటారు. 

                      7. ప్రశ్నించిన దైవదూతలందరికీ జిబ్రయీల్ (అలైహిస్సలాం) జవాబు ఇస్తారు. 

                      8. మూర్ఛబోవుట దైవదూతలందరిపై సంభవించును.

                      9. అల్లాహ్ సంబోధించునప్పుడు ఆకాశము కంపించును. 

                      10. అల్లాహ్ ఆజ్ఞ మేరకు జిబ్రయీల్ (అలైహిస్సలాం) అల్లాహ్ యొక్క సందేశమును తెలియపరుస్తారు. 

                      11. షైతానులు రహస్యంగా అల్లాహ్ యొక్క సందేశములు వినుటకు ప్రయత్నించెదరు. 

                      12. దీని కొరకు వారు ఒకరిపై ఒకరు నిచ్చెనలా అధిరోహిస్తారు. 

                      13. ఈ షైతానులను పారద్రోలుటకు ఉల్కలు పంపబడును. 

                      14. కొన్ని సందర్భాలలో అల్లాహ్ సందేశము షైతాన్ కు చేరకముందే పారద్రోలబడును. కొన్ని సందర్భాలలో సందేశాన్ని షైతాను తన స్నేహి తునికి తెలుపుతాడు. 

                      15. కొన్ని సందర్భాలలో జ్యోతిష్యుని మాట నిజమవుతుంది. 

                      16. జ్యోతిష్యుడు ఆ ఒక్కమాటకు వంద అసత్యములు కలుపుతాడు. 

                      17. ప్రజలు ఒక సరియైన మాటకు కారణముగా జ్యోతిష్కుడిని నమ్ము తారు. నిశ్చయముగా ఆ ఒక్క సత్యము కూడా షైతాన్ ద్వారా సేకరించ బడినదే.

                      18. జ్యోతిష్కుని ఒక్క సరియైన మాటను ఆదర్శముగా తీసుకుంటారు గానీ, అతడి నూరు అసత్యాలను గ్రహించరు. 

                      19. షైతానులు ఒకరి ద్వారా ఒకరు తెలుసుకొని, అబద్దములు పలుకు వారిని సత్యవంతులుగా చిత్రీకరిస్తారు. 

                      20. దీనిద్వారా అల్లాహ్ స్వభావములు కూడా నిర్ధారణ అవుతాయి. 

                      21. ఆకాశములపై సంభవించు కంపనలు అల్లాహ్ యొక్క భయముతో జరుగును.

                      22. దైవదూతలందరూ అల్లాహ్ కు సాష్టాంగ ప్రణామం చేస్తారు. 

                      పాఠము- 17: సిఫారసు వాస్తవికత 

                      ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా పేర్కొనెను:

                      وَانْذِرُ بِهِ الَّذِينَ يَخَافُونَ أَنْ يُحْشَرُ وا إِلَى رَبِّهِمْ لَيْسَ لَهُمْ 

                      مِنْ دُونِهِ وَلِيُّ وَلَا شَفِيعُ لَعَلَّهُمْ يَتَّقُونَ . 

                      “(ఓ ప్రవక్తా!) తమ ప్రభువు ముందు ఆయన తప్ప తమకు సహాయము చేయువారుగానీ లేదా సిఫారసు చేయువారుగానీ ఎవ్వరూ లేని పరిస్థితిలో హాజరు కావలసి వస్తుందని భయపడేవారికి నీవు దీని ద్వారా ఉపదేశించుము. బహుశా వారు అల్లాహు కు భయపడగలరు.” (6:51)

                      قُل لِّلَّهِ الشَّفَاعَةُ جَمِيعًا
                      “సిఫారసు అధికారము అల్లాహ్ కలదు.” (39:44) 

                      مَن ذَا الَّذِي يَشْفَعُ عِندَهُ إِلَّا بِإِذْنِهِ
                      “ఆయన సమక్షములో ఆయన ఆజ్ఞ లేకుండా సిఫారసు చేయగల వారెవ్వరు?” (2:255) 

                      وَكَم مِّن مَّلَكٍ فِي السَّمَاوَاتِ لَا تُغْنِي شَفَاعَتُهُمْ شَيْئًا إِلَّا مِن بَعْدِ أَن يَأْذَنَ اللَّهُ لِمَن يَشَاءُ وَيَرْضَىٰ

                      “ఆకాశంలో ఎంతోమంది దైవదూతలున్నారు, కాని వారి సిఫారసు ఏ మాత్రం ఉపయోగపడదు, అల్లాహ్ ఎవరి గురించైనా ఏదైనా విన్నపం వినదలచుకుంటే, ఆ వ్యక్తి విషయంలో ఇష్టపడి సిఫారసుకు అనుమతిస్తేనే తప్ప.” (53:26) 

                      قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ

                      “(ప్రవక్తా! ఆ బహుదైవారాధకులతో) ఈ విధముగా పలకండి. అల్లాహ్ ను కాదని మీరు ఆరాధ్యులుగా భావిస్తున్న వారిని పిలిచి చూడండి. వారు ఆకాశాలలోగానీ, భూమిలోగానీ రవ్వంత వస్తువుకు కూడా యజమానులు కారు. వారు భూమ్యాకాశాల ఆధిపత్యంలో భాగస్వాములు కారు. వారిలో ఎవ్వరూ అల్లాహ్ కు సహాయకులు కూడా లేరు. అల్లాహ్ ఏ వ్యక్తి విషయంలో సిఫారసుకు అనుమతించునో, ఆ వ్యక్తికి తప్ప మరెవరికీ ఏ సిఫారసూ అల్లాహ్ సమక్షములో లాభదాయకము కాదు.” (34:22-23) 

                      షేఖుల్ ఇస్లాం ఇమాం ఇబ్నె తైమియా (రహమతుల్లాహ్ అలైహ్) ఈ విధముగా విశదీకరించెను: 

                      “అల్లాహ్ తను సృష్టించిన దానిలో సకల సృష్టిరాశుల యొక్క భాగస్వామ్యము ఏదీ లేదని స్పష్టపరిచెను. వేటినైతే బహు దైవారాధకులు భాగస్వాములుగా కల్పిస్తుండేవారో వాటన్నిటినీ అల్లాహ్ ఖండించెను. ఉదాహ రణకు ఎవరికీ భూమ్యాకాశాలలో ఏ విధమైన అధికారము లేదని స్పష్టపరి చెను. అలాగే అల్లాహు కు ఎవ్వరూ సహాయం చేయలేదు. నిశ్చయముగా బహుదైవారాధకులు ఆశిస్తున్న సిఫారసు, అసలు సిఫారసుకు భిన్నమైనదని ఖుర్ఆన్ స్పష్టము చేసెను

                      وَلَا يَشْفَعُونَ إِلَّا لِمَنِ ارْتَضَىٰ
                      “ఎవరినైతే అల్లాహ్ స్వయంగా ఇష్టపడతాడో వారికి తప్ప మరెవ్వరికీ సిఫారసు చేయలేరు.” (అల్-అంబియా-21:28) 

                      “ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం), ప్రళయ దినం నాడు అల్లాహ్ సమక్షములో హాజరు అయి అల్లాహ్ ముందు సాష్టాంగ ప్రణామం చేయును. అల్లాహ్ ను స్మరించి వేడుకొనును. ఆ తరువాత ఆయన సాష్టాంగ ప్రణామం నుండి లేవగానే ఏమి కావలెనో కోరమని తెలుపబడును” అని ముహహ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వివరించెను. అప్పుడు హజరత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు), “ఓ ప్రవక్తా! మీ సిఫారసు పొందే ఆ అదృష్టవంతులెవరు?” అని ప్రశ్నించెను. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  “ఎవరైతే స్వచ్ఛమైన మనస్సుతో, అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారని విశ్వసించి సాక్ష్యమిస్తారో వారు” అని పలికెను. 

                      దీనితో ఈ సిఫారసు అల్లాహ్ అనుమతితో, ఒక్క అల్లాహ్ యే ఆరాధనకు అర్హుడని నమ్మి సాక్షమిచ్చువానికే వర్తించును, బహు దైవారాధకులకు వర్తించదు. దీని ద్వారా స్పష్టమయ్యే విషయం ఏమనగా ఏకదైవారాధకులపై అల్లాహ్ ప్రత్యేక దయాదాక్షిణ్యములు చూపును, ఎవరికైతే సిఫారసు చేయుటకు అనుమతి ఇవ్వబడెనో, వారి ప్రార్థన ద్వారా ఏక దైవారాధకులు మాత్రమే కనికరించబడతారు. సిఫారసు చేయు వాని (ప్రవక్త) సిఫారసు విశ్వసించిన వారికి మరియు అల్లాహ్ కు భయపడు వారికి మాత్రమే. 

                      దీనిలో 8 భావములు (పాఠములు) కలవు 

                      1. సిఫారసు గురించి పేర్కొనబడిన ఆయతుల యొక్క భావము తెలుప బడెను. 

                      2. నిషిద్ధ సిఫారసులు స్పష్టముగా తెలుపబడెను. 

                      3. అల్లాహ్ ఆజ్ఞతో స్వీకరించబడు సిఫారసు తెలుపబడెను. 

                      4. అతి ఉత్తమ సిఫారసుగా పేర్కొనబడెను. 

                      5. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ సమక్షములో సాష్టాంగ ప్రణామం చేస్తారు. సిఫారసుకు అనుమతింపబడినప్పుడే సిఫారసు చేయగలరు. 

                      6. సిఫారసుకు అందరికంటే ఎక్కువ అర్హులైనవారు విశ్వాసులు. 

                      7. ఈ సిఫారసుకుబహుదైవారాధకులు (అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించువారు) అనర్హులు. 

                      8. సిఫారసు గురించి క్లుప్తంగా తెలుపబడినది. 

                      పాఠము- 18 : (ఓ ప్రవక్తా!) నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వమును ప్రసాదించలేవు

                      ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను; 

                      إِنَّكَ لَا تَهْدِي مَنْ أَحْبَبْتَ وَلَٰكِنَّ اللَّهَ يَهْدِي مَن يَشَاءُ ۚ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ

                      “(ఓ ప్రవక్తా!) నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వమును ప్రసాదించలేవు. కాని అల్లాహ్ తనకు ఇష్టమైన వారందరికీ మార్గదర్శకత్వము ప్రసాదించ గలడు. ఆయనకు తన మార్గదర్శకత్వము స్వీకరించువారు ఎవరో తెలుసును.” (28:56) 

                      సయీద్ బిన్ ముసయ్యిబ్ (రహ్మతుల్లాహ్  అలై) తన తండ్రి ముసయ్యిబ్ (రదియల్లాహు అన్హు) ద్వారా ఈ విధముగా ఉల్లేఖించెను: 

                      “అబూ తాలిబ్ చావు సమీపించినప్పుడు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) విచ్చేసిరి, అప్పుడు ఆయన వద్ద అబ్దుల్లా బిన్ అబీ ఉమయ్య మరియు అబూ జహల్ కూర్చుని ఉండిరి. అప్పుడు ప్రవక్త ఈ విధముగా సంబోధించెను: “నా ప్రియమైన బాబాయి! అల్లాహ్ తప్ప ఎవ్వరూ ఆరాధనకు అర్హులు కారని సాక్ష్యమివ్వండి. నేను మీ సాక్ష్యమును అల్లాహ్ వద్ద సమర్పించుకుంటాను. అప్పుడు వాళ్ళిద్దరు అబూ తాలిబ్ తో, నీవు అబ్దుల్ ముత్తలిబ్ ధర్మాన్ని చేజార్చుతావా? అని ప్రశ్నించిరి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో ఆ ఇద్దరూ తమ మాటలను మరీ మరీ తిప్పి ప్రశ్నించుచుండిరి. చివరికి అబూ తాలిబ్, తమ అబ్దుల్ ముత్తలిబ్ ధర్మము పైనే ఉండుటకు నిశ్చయించుకొనెను. అల్లాహ్ తప్ప ఎవ్వరూ ఆరాధనకు అర్హులు కారని సాక్ష్యమిచ్చుటకు నిరాకరించెను. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  “నన్ను అల్లాహ్ వారించనంత వరకూ నేను మీ మోక్షము కొరకు అల్లాహ్ కు మనవి చేస్తాను” అని పలికెను. అప్పుడు అల్లాహ్ ఈ వాక్యాలు అవతరింపజేసెను. 

                      مَا كَانَ لِلنَّبِيِّ وَالَّذِينَ آمَنُوا أَن يَسْتَغْفِرُوا لِلْمُشْرِكِينَ وَلَوْ كَانُوا أُولِي قُرْبَىٰ 

                      “బహుదైవారాధకుల మోక్షము కొరకు ప్రార్థించుట ప్రవక్తకూ, విశ్వాసులకూ తగని పని, వారు వారికి బంధువులైనప్పటికీ.” (9:113) 

                      అల్లాహ్ అబూతాలిబ్ గురించి ఖుర్ఆన్ (28:56)లో ఆ వాక్యము అవతరింపజేసెను. 

                      దీనిలో 12 పాఠములు కలవు 

                      1. వాక్యముల (28:56) భావము తెలుపబడెను. 

                      2. వాక్యముల (9:113) భావము తెలుపబడెను

                      3. ప్రవక్త “అల్లాహ్ తప్ప ఎవ్వరూ ఆరాధనకు అర్హులు కారని సాక్ష్య మివ్వమని కోరుట.” 

                      4. ప్రవక్త అబూ తాలిబి ని అల్లాహ్ తప్ప ఎవ్వరూ ఆరాధనకు అర్హులు కారని సాక్ష్యమివ్వమని కోరినప్పుడు వారు ఇద్దరు ఆయనను అడ్డుకున్నారు. 

                      5. తన బాబాయి అల్లాహ్ ను విశ్వసించాలని ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) శాయశక్తులా ప్రయత్నిం చారు.

                      6. ఎవరైతే అబ్దుల్ ముత్తలిబ్ విశ్వాసి అని అనుకుంటారో, వారికి అతను విశ్వాసి కాదని స్పష్టమవుతుంది. 

                      7. అబూ తాలిబ్ మోక్షము కొరకు ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వేడుకొన్నప్పుడు, వారించబడెను.

                      8. చెడ్డవారితో స్నేహము చేయుట వలన అపార నష్టము వాటిల్లును

                      9. తమ తాతముత్తాతల సంప్రదాయములను, ఆధారములు లేకుండా పాటించుట నష్టదాయకము

                      10. అబూ జహల్ చేసినటువంటి వక్ర కార్యములు చేయువారందరికీ గుణపాఠము. 

                      11. జీవితపు చివరి ఘడియల్లోని ఆచరణలే మోక్ష భాగ్యము కలిగి ఉన్నవి. 

                      12. మార్గభ్రష్టులు చూపిన నిరాధార తాతముత్తాతల సంప్రదాయాలను (10:113) నమ్ముట వలననే అబూ తాలిబ్ విశ్వాసి కాలేకపోయారని గ్రహించవలెను. 

                      పాఠము- 19 : ఆదం సంతతి అవిశ్వాసులగుటకు కారణం మత గురువుల విషయంలో హద్దు మీరి ప్రవర్తించటమే 

                      ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను; 

                      يَا أَهْلَ الْكِتَابِ لَا تَغْلُوا فِي دِينِكُمْ وَلَا تَقُولُوا عَلَى اللَّهِ إِلَّا الْحَقَّ

                      “ఓ గ్రంథ ప్రజలారా! మీ ధర్మం విషయాలలో హద్దుమీరి ప్రవర్తించకండి. అల్లాహు కు సత్యం తప్ప వేరే ఏ విషయాలనూ ఆపాదించకండి.” (అన్-నిసా- 4:171) 

                      హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) వాక్యము (71:23) గురించి ఈ విధముగా వివరించెను: 

                      “వీరంతా (వద్, సువా, యగూస్, యవూఖ్, నసర్) నూహ్ (అలైహి స్సలాం) సంతతికి చెందిన మత పెద్దలు. వారు మరణించినప్పుడు అప్పటి ప్రజలు దుఃఖిస్తున్న సమయములో షైతాను ఆ ప్రజలకు ఆ పుణ్యవంతులు కూర్చునే చోట వారిని గుర్తించుకొనుట కొరకు వారి విగ్రహాలను ప్రతిష్ఠీకరించమని ఉసిగొల్పెను. వారు రాళ్ళను (విగ్రహాలను) ఆరాధించేవారు కాదు. అప్పటి ప్రజలు మరణించిన తర్వాత, వారి తర్వాత వచ్చిన ప్రజలు ధర్మ (మత) విద్యను కోల్పోయి, వాస్తవాలను మరచి ఆ విగ్రహాలను ఆరాధించుట ప్రారంభించారు.” (బుఖారి) 

                      ఇమాం ఇబ్నె ఖయ్యిం (రహమతుల్లాహ్ అలైహ్) ఈ విధముగా తెలిపెను: 

                      “సలఫ్ సాలెహీన్ ఈ విధముగా విశదీకరించిరి. వారు మరణించిన తర్వాత వారి శిష్యులు. వారి సమాధుల వద్ద కూర్చొనుట ప్రారంభించారు. తరువాత వారి విగ్రహాలను తయారుచేశారు. ఆ విధముగా చాలా కాలము గడిచిన పిదప వారి ఆరాధన ప్రారంభమయ్యెను.”

                      హజరత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ఉద్బోధిం చెను. మీరు నన్ను పొగడుటలో హద్దుమీరకండి! ఏ విధముగా అయితే ఈసా ఇబ్నె మరియం (అలైహిస్సలాం) విషయంలో క్రైస్తవులు హద్దుమీరిపోయారో!! నేను ఒక దాసుణ్ణి. మీరు నన్ను అల్లాహ్ దాసుడు, ప్రవక్త అని పలకండి.” (బుఖారి, ముస్లిం) 

                      హజరత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈవిధముగా ప్రబోధిం చారు: “దైవదాసులు విషయంలో హద్దుమీరి ప్రవర్తించకండి. హద్దుమీరి ప్రవర్తించుట వలనే పూర్వ ప్రజలు మార్గభ్రష్టులయ్యారు.” (అహ్మద్, తిర్మిజీ, అబూదావూద్) 

                      హజరత్ అబ్దులా బిన్ మస్ ఊద్  (రదియల్లాహు అన్హుమా) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) హద్దుమీరి ప్రవర్తించువారు నాశనమగుదురు” అని మూడు సార్లు పలికెను. 

                      దీనిలో 20 పాడములు కలవు 

                      1. ఈ భాగము మరియు రాబోవు 2 భాగములు చదివిన ఎడల ఇస్లాం మరియు ఇతర మతాల మధ్యగల భేదము స్పష్టమగును. మనస్సులను మార్చగల అధికారము అల్లాహ్ కే కలదని స్పష్టమగును. 

                      2. దైవప్రవక్తల విషయంలో హద్దు మీరుట వలనే భూమిపై మొదటి సారిగా విగ్రహారాధన ప్రారంభమయ్యెను. 

                      3. అల్లాహ్ పంపిన ప్రవక్తలు బోధించిన ధర్మములో మార్పులు చేయుట వలనే ప్రజలు మార్గభ్రష్టులయ్యారు. 

                      4. ప్రజలు వక్ర కార్యములకు తొందరగా లోనవుతారు. కాని ఇస్లాం దీనిని వారించెను

                      5. బహుదైవారాధన ప్రారంభమగుటకు కారణం, మత గురువుల విషయంలో హద్దుమీరుట, తదుపరి వారు తమ గురువుల విద్యను అర్థం చేసుకొనలేకపోవుట. 

                      6. వాక్యము (71:23) భావమును విశదీకరించి తెలుపబడెను. 

                      7. వాస్తవంగా మనిషి మంచికి దూరమవుతూ చెడుకి సమీపిస్తూ ఉంటాడు. 

                      8. సత్యమును నిరాకరించుట వలనే కల్పిత వక్ర కార్యములకు పాల్పడు తారని స్పష్టమవుతుంది. 

                      9. కల్పిత కార్యము చేయువానికి దాని ప్రతిఫలము తెలియనప్పటికీ షైతానులకు బాగా తెలుసును. 

                      10. హద్దుమీరి ప్రవర్తించుట నిషిద్ధం. హద్దుమీరి ప్రవర్తించుటకు దారితీయు విషయాలు తెలుసుకోవలెను. 

                      11. శ్మశానములో మంచి పని కొరకు కూర్చొనుట కూడా చాలా నష్ట దాయకము. 

                      12. విగ్రహాల నిషిద్ధం మరియు వాటిని తుడిచిపెట్టవలసిన ఆవశ్యకత స్పష్టమవుతుంది. 

                      13. బహుదైవారాధన లేదా అల్లాహ్ కు భాగస్వాములను కల్పించుట అంటే అర్ధము స్పష్టముగా తెలుసుకోవలెను. కాని చాలా మంది ముస్లింలకు ఇది తెలియదు.

                      14. విచారకరమైన విషయం: వారు ఈ విషయాలను హదీసు పుస్తకాలలో చదువుతారు. వాటిని అర్థం చేసుకుంటారు. కాని వారు చేయు పనులు మత గురువులను గౌరవించుట కోసమే అనుకుంటారు. అల్లాహ్ మరియు ప్రవక్త వారించిన బహుదైవారాధన, అవిశ్వాసులు చేయు విగ్రహారాధననే బహుదైవారాధన అని భావించుచున్నారు.

                      15. వాటిని వేడుకొనువారు, అవి సిఫారసు చేయగలవని నమ్మేవారు.

                      16. తదుపరి బహుదైవారాధకులు, మత పెద్దలు, ఆ విగ్రహాలను ఆరాధించుటకు అధిష్టించినట్లు భావించిరి. 

                      17. మీరు నన్ను పొగడుటలో హద్దుమీరకండి! ఏ విధముగా అయితే క్రైస్తవులు ప్రవక్త ఈసా (అలైహిస్సలాం) విషయంలో హద్దుమీరిపోయారో!!! “నేను ప్రజలకు సఫలీకృత మార్గము చూపువాడను కాను” అని ప్రవక్త స్పష్టముగా తన బాధ్యతను నిర్వర్తించెను

                      18. హద్దుమీరి ప్రవర్తించువారు ఎప్పుడూ నాశనమవుతారు. 

                      19. దీని ద్వారా మత విద్య నభ్యసించవలసిన ఆవశ్యకత తెలియును. విద్య నభ్యసించకపోవుట వలన కలుగు నష్టము తెలియును. నూహ్ (అలైహిస్సలాం) సంతతిలో దైవ విద్య అంతరించిన కారణంగానే బహుదైవారాధన ప్రారంభమయ్యెను. 

                      20) మత గురువులు మరణించిన తదుపరి వారు దైవ విద్యనభ్యసించక పోవుటయే దైవవిద్య అంతరించుటకు కారణము. 

                      పాఠము – 20 : పుణ్యాత్ముల, మత గురువుల సమాధుల వద్ద అల్లాహ్ ని ఆరాధించుట నిషిద్ధం 

                      హజరత్ ఆయిషా (రదియల్లాహు అస) ఈ విధముగా ఉల్లేఖించారు: 

                      “హజరత్ ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హా) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముందు తను అబీసీనియాలో చూసిన ఒక చర్చి గురించి, అందులోని చిత్రాలు మరియు విగ్రహాల గురించి ప్రస్తావిం చెను. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా ప్రబోధించెను: “వారిలోని మత గురువు మరణించినప్పుడు వారు అతని సమాధిపై మస్జిద్ కట్టెడివారు మరియు దానిలో ఇలాంటి చిత్రాలను చిత్రించెడివారు. వీరు అల్లాహ్ వద్ద అందరికంటే హీనులు.” వీరు రెండు చెడులను ఒక చోట జమచేసిరి. ఒకటి సమాధులను ఆరాధించుట, రెండవది చిత్రాలు చిత్రించుట. 

                      మరోచోట (బుఖారి, ముస్లిం) ఆయిషా రదియల్లాహు అన్హా ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ లోకము విడిచి పోవునప్పుడు తీవ్రమైన జ్వరంతో దుప్పటి కప్పుకున్నారు. గాభరాపడి దుప్పటి ముఖంపైనుంచి తీసి ఈ విధముగా ప్రబోధించెను. 

                      యూదులు, క్రైస్తవులు శాపగ్రస్తులు కాగలరు! వారు తమ ప్రవక్తల సమాధులను సాష్టాంగాల ఆలయాలుగా మార్చిరి”. దీని ద్వారా ప్రవక్త ఉద్దేశ్యం తన అనుచరులను అటువంటి కార్యముల నుండి నివారించుట, ప్రవక్త సమాధిని, మస్జిద్ చేయగలరని భావించకుంటే ప్రవక్త సమాధి బహిరంగ ప్రదేశములో ఉండేది. 

                      హజరత్ జుందుబ్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం మరణానికి ఐదు రోజుల ముందు ఈ విధముగా ప్రబోధిస్తుండగా విన్నాను: 

                      నేను అలాహ్ సమక్షమున ప్రకటించుచున్నాను. నేను ఎవ్వరినీ నా ప్రియమైన స్నేహితునిగా ప్రకటించలేదు. నన్ను అల్లాహ్ తన ప్రియమైన స్నేహితునిగా చేసుకొనెను. ఏ విధముగా అయితే ఇబ్రాహీం అలైహిస్సలాంని తన (ఖలీల్) స్నేహితునిగా చేసుకొనెనో, నేను నా అనుచరులలో ఎవరినైనా ప్రియ స్నేహితునిగా చేయదలచుకుంటే అబూబకర్ రదియల్లాహు అన్హు ని చేయుదును. మునుపటి ప్రజలు తమ ప్రవక్తల సమాధులను మస్జిదులుగా మార్చుకొనిరి. ఎట్టి పరిస్థితి లోను మీరు సమాధులను మస్జిదులుగా చేయవద్దు (పూజించవద్దు). నేను మిమ్మలను ఈ చెడు కార్యముల నుండి నివారించుచున్నాను” (ముస్లిం). 

                      ప్రవక్త తన చివరి ఘడియల్లో కూడా ఇటువంటి కార్యాముల నుండి నివారిం చెను. సమాధులను పూజించువారిని శాపగ్రస్తులు అగుదురని వక్కాణించెను. సమాధులను పూజించుట, సమాధుల వద్ద నమాజు ఆచరించుట నిషేధించ బడినది. ఆయిషా రదియల్లాహు అన్హా తెలిపెను: “ప్రవక్త సమాధిని మస్జిద్ చేయగలరని భావించకుంటే” యొక్క అర్థము కూడా ఇదే! అనుచరులు ఎప్పటికీ ప్రవక్త యొక్క సమాధిపై మస్జిద్ కట్టువారు కాదు. ఎందుకంటే ఏ ప్రదేశములో అయితే నమాజు చేయబడునో ఆ ప్రదేశము మస్జిద్ అనబడును. 

                      ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈవిధముగా ప్రబోధించెను. (బుఖారీ, ముస్లిం) “సకల భూమిని నా కొరకు మస్జిద్ మరియు శుద్ది పొందు ప్రదేశముగా చేయబడెను.” 

                      ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ప్రబోధించెను: “ప్రళయ దినం ఎవరిపై సంభవించునో వారు పరమ నీచులు మరియు ఎవరైతే సమాధులను మస్జిద్లుగా భావించుకుంటారో వారు కూడా పరమ నీచులు.” ఇబ్నె మస్ ఊద్  రదియల్లాహు అన్హు ఉల్లేఖించెను (ప్రామాణిక సనద్ ద్వారా ముస్నద్ అహ్మద్ మరియు సహీ సనద్ అబూహాతిం పొందు పరచెను. ఇది మర్ ఫు  హదీసు). 

                      దీనిలో 16 పాఠములు (భావాలు) కలవు 

                      1. మతగురువుల సమాధిపై మస్జిద్ నిర్మించుటను ప్రవక్తగారు స్పష్టముగా నిషేధించెను. 

                      2. బొమ్మలను, విగ్రహాలను తయారు చేయుట నిషేధింపబడెను. 

                      3. ఈ వక్ర కార్యముల నిషేధము మొదటి నుంచి ఉన్నప్పటికీ, మరల చివరి ఘడియల్లో, వాటిని నివారించుటతో, దాని ప్రాముఖ్యత స్పష్టమగుటయేగాక అది అతి పెద్ద పాప కార్యమని అర్థమగును.

                      4. ప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం)  తన సమాధిని కూడా ‘మస్జిద్’ చేయవద్దని స్పష్టపరచెను.

                      5. ప్రవక్తలు, మత గురువుల సమాధులపై మస్జిద్ లు కట్టి ఆరాధనలు చేయుట యూదుల, క్రైస్తవుల ఆచరణ

                      6. దాని కారణంగా (సమాధులపై మస్జిద్ లు నిర్మించిన యూదులు, క్రైస్తవులు శాపగ్రస్తులవుతారని పలికెను.

                      7. అందుమూలముగా వారు శాపగ్రస్తులగుదురని తెలుపుటకు కారణం, ముస్లింలు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  సమాధిపై మస్జిద్ కట్టకూడదని స్పష్టీకరించుట. 

                      8. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  సమాధిని, బహిరంగ ప్రదేశములో లేకుండా చూడుటకు కారణము కూడా స్పష్టమగును. 

                       9. సమాధులను మస్జిద్లు చేయుట అంటే అర్థం కూడా స్పష్ట మవుతుంది. 

                      10. ప్రవక్త సమాధులపై మస్జిద్ నిర్మించువారిని, ప్రళయదినం ఎవరిపై సంభవించునో వారిని ఒకేచోట విశదీకరించిరి, నిశ్చయముగా ఆయన, అవిశ్వాసము, బహుదైవారాధన అనుచరులలో ప్రబలుటకు ముందే అవి ఎట్లు ప్రబలునో, వాటి కష్టనష్టములు ఏమిటో క్షుణ్ణముగా విశదీకరించెను. 

                      11. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన మరణమునకు 5 రోజుల ముందు ప్రబోధించిన ఖుత్బాలు రాఫిజీ, జహమియ (అను) కూటములు నిరాధారములైనవని స్పష్టమగును. రాఫిజా మొట్టమొదట సమాధిపై మస్జిద్ నిర్మించిరి. వారి వలనే ముస్లింలలో అల్లాహ్ కు భాగస్వాములను కల్పించుట, కల్పిత కార్యములు ప్రారంభమయ్యెను. 

                      12. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  మరణించినప్పుడు, జ్వరము, తలనొప్పి వంటి బాధలు కలిగెనని తెలియుచున్నది.

                      13. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు అల్లాహ్ యొక్క ప్రియ స్నేహితుడు (ఖలీల్) అయ్యే అదృష్టం కలిగినది. 

                      14. ‘ఖలీల్’ అంటే ప్రియ స్నేహితుడు కంటే ఉత్తమమైన పదము.

                      15. దీనిలో అబూబకర్ సిద్దీక్ (రదియల్లాహు అన్హు) అందరికంటే ఉత్తమ అనుచరుడని స్పష్టమగును. 

                      16. ఈ ప్రబోధనలో అబూబకర్ (రదియల్లాహు అన్హు) ఖలీఫాగా అర్హుడని స్పష్టమగును.

                      పాఠము-21 : పుణ్యాత్ముల సమాధుల విషయంలో హద్దుమీరుట దైవేతరుల ఆరాధన జరిగేందుకు అనువుగా వారి సమాధులను విగ్రహారాధనాలయాలుగా మార్చుట 

                      ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించిరి: 

                      “ఓ అల్లాహ్ ! నా సమాధిని విగ్రహమువలె చేయకుము. దేనినైతే ప్రజలు పూజించుదురో వారిపై అల్లాహ్ ఆపద వచ్చిపడునో ఎవరైతే తమ ప్రవక్తల సమాధులను ఆరాధనా స్థలములుగా మార్చుకుందురో.”

                      ఇబ్నె జరీర్ రహమతుల్లాహ్ అలైహ్ “అఫరఐ తుముల్లాత వల్ ఉజ్జా” యొక్క తఫ్సీర్, సుఫ్యాన్, మన్ సూర్  విధానములో ముజాహిద్ గారి ఉల్లేఖనంలో ఈ విధముగా విశదీకరించెను: 

                      “లాత్” హజ్ చేయుటకు వచ్చువారికి విపరీతమైన సేవలు అందించువాడు. అతడు మరణించిన తరువాత ప్రజలు అతని సమాధిపై, సమాధి సేవకులై కూర్చుండిరి. 

                      అబూ అల్ జవ్జా  కూడా హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్షు) నుంచి ఈ విధముగా ఉల్లేఖించారు: లాత్ హాజీలకు విపరీతమైన సేవలు అందించేవాడు. 

                      హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: “ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం), సమాధులను దర్శించు స్త్రీలను శాపగ్రస్తులవుతారని పలికెను. సమాధులపై మస్జిద్ లు నిర్మించేవారు, సమాధుల వద్ద దీపములు వెలిగించేవారు కూడా శాపగ్రస్తులవు తారని పలికెను. (దీనిని  ‘అహ్లుస్ సునన్’ పొందుపరిచెను). 

                      దీనిలో 10 పాఠములు కలవు 

                      1. విగ్రహముల గురించి విశదీకరించబడెను (కాబా గృహములో అధిష్టిం చిన విగ్రహముల గురించి). 

                      2. ఆరాధన విశదీకరించబడెను. 

                      3. ప్రవక్త ఆయనకు ఏ కీడు సంభవించునని అనుమానము కలిగెనో వాటి నుండి అల్లాహ్ ను శరణు వేడుకొనెను. 

                      4. ప్రవక్త “యా అల్లాహ్! నా సమాధిని ప్రజలు పూజించు విగ్రహముగా చేయకుము” అని ప్రార్థించినప్పుడు “మునుపటి ప్రజలు తమ ప్రవక్తల సమాధులను ఆరాధనా స్థలములుగా చేసుకొనిరి” అని కూడా స్పష్ట పరిచెను. 

                      5. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  “ఇటువంటి పనులు చేసిన వారిపై విపరీతమైన ఆపదలు వచ్చిపడెను” అని ఉద్భోదించెను

                      6. ‘లాత్’ అరబ్బులలో అతి పెద్ద విగ్రహము. దాని ఆరాధన ఏ విధముగా ప్రారంభమయ్యేనో తెలుపబడెను. 

                      7. ‘లాత్’ ఒక మంచి సేవకుని సమాధిగా ఉండెనని తెలియుచున్నది. 

                      8. ‘లాత్’ సమాధిలో పూడ్చిపెట్టబడిన మనిషి పేరు. 

                      9. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  “సమాధులను దర్శించు స్త్రీలు శాపగ్రస్తులగుదురని”  తెలిపెను. 

                      10. “సమాధులపై దీపములు వెలిగించువారు కూడా శాపగ్రస్తులగుదురని” ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  పలికెను. 

                      పాఠము – 22 : ఏకదైవోపాసనను భద్రపరచటమే కాకుండా భంగపరచు మార్గములను కూడా ప్రవక్త అరికట్టెను 

                      ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను; 

                      لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ

                      فَإِن تَوَلَّوْا فَقُلْ حَسْبِيَ اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ عَلَيْهِ تَوَكَّلْتُ ۖ وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيمِ

                      “(ప్రజలారా!) మీ నుంచే మీ వద్దకు ఒక ప్రవక్త విచ్చేసెను. మీరు హాని చెందుట ఆయనకు కష్టం కలిగిస్తుంది. మీ సాఫల్యాన్ని ఆయన తీవ్రంగా కాంక్షిస్తుండును. ఆయన విశ్వాసులపై వాత్సల్యం, కారుణ్యం కలవాడు.” ఒకవేళ వీరు విముఖత తెలిపినచో, మీరు వారితో ఈ విధముగా పలకండి, “నాకు అల్లాహ్ యే చాలును. ఆయన తప్ప ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయననే నేను నమ్ముకున్నాను. ఆయన మహత్తరమైన అర్థ(సింహాసనము) కు ప్రభువు.” (9:128-129) 

                      హజరత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ప్రవక్త చేసిన ప్రబోధనను ఈ విధముగా ఉల్లేఖించెను: “మీ ఇళ్ళను శ్మశానాలుగా చేయకండి, నా సమాధిని జాతర చేయు స్థలముగా మార్చకండి. మీరు ఎక్కడ ఉన్నా నాపై సలాము పంపండి. మీ సలాము నాకు చేర్చబడును”. (అబూ దావూద్ హసన్ సనద్ దీని రావి ‘సిఖహ్’) 

                      జైనుల్ ఆబిదీన్ అలీ బిన్ హుసైన్ (రహమతుల్లాహ్ అలైహ్) ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి వద్ద ప్రార్థన చేయు చుండగా చూసి, అతనిని వారించి, నేను నీకు ఆ హదీసు తెలుపుదునా, అది నా తండ్రిగారు హజరత్ హుసైన్ (రదియల్లాహు అన్హు), నా తాతగారు హజరత్ అలీ (రదియల్లాహు అన్హు)తో, ఆయన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుండి వినెను. ఆయన ఈ విధముగా సంబోధించెను: “నా సమాధిని జాతర ప్రదేశముగా మార్చకండి. మీరు (నమాజు చదకవ, ఖుర్ఆన్ చదవక, దుఆ చేయక) మీ ఇళ్ళను శ్మశానాలుగా మార్చుకోవద్దు. నాపై దరూద్ పంపు తుండండి, మీరు ఎక్కడ ఉన్నా మీ సలాము నాకు చేర్చబడును.” 

                      దీనిలో 9 ప్రకరణములు కలవు 

                      1. వాక్యము (9: 128-129) యొక్క భావము మరియు వివరణ తెలుపబడెను. 

                      2. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  తన అనుచరులను బహుదైవారాధన సరిహద్దుకు కూడా పోకుండా వారించెను. 

                      3. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాపై విశేష వాత్సల్యం, కరుణ కలిగియుండెను. మార్గదర్శకమును అతిగా కాంక్షించేవారు

                      4. ప్రవక్త తన సమాధిని దర్శించుటను ప్రత్యేకంగా వారించెను. ఆయన సమాధిని దర్శించుట మంచి కార్యము అయినప్పటికీ

                      5. సమాధులను ఎక్కువగా సందర్శించుటను ప్రవక్త వారించెను.

                      6. ప్రవక్త నఫిల్ నమాజులు ఇంటిలో ఆచరించమని ఉద్భోదించారు.

                      7. అనుచరులందరికీ శ్మశానములో నమాజు చేయరాదని తెలుసును.

                      8. సలాం ఎక్కడ ఉండి చెప్పినా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు చేరును. దాని కొరకు ఆయన సమాధి దగ్గరకు వెళ్ళనవసరం లేదు.

                      9. దీనిలో ప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం)  ‘బర్ జఖ్’ లో ఉన్నట్లు స్పష్టమగును. అనుచరులు పంపిన సలాములు ఆయనకు చేర్చబడును. 

                      పాఠము-23 : ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)  గారి ‘ఉమ్మత్’లో కొందరు విగ్రహారాధన లాంటి సంకటములో చిక్కుకొనుట 

                      ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా బోధించెను: 

                      أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِّنَ الْكِتَابِ يُؤْمِنُونَ بِالْجِبْتِ وَالطَّاغُوتِ

                      గ్రంథంలో కొంతభాగం ఇవ్వబడిన వారిని నీవు చూడలేదా? వారు విగ్రహాల (జిబ్త్)పై, మిథ్యా దైవాల (తాగూత్) పై విశ్వాసం కలిగి ఉన్నారు. అవిశ్వాసుల గురించి అభిప్రాయపడుతూ, “విశ్వాసుల కంటే వీరే చాలా వరకు సన్మార్గాన ఉన్నారు” అని అంటారు. (4:51) 

                      قُلْ هَلْ أُنَبِّئُكُم بِشَرٍّ مِّن ذَٰلِكَ مَثُوبَةً عِندَ اللَّهِ ۚ مَن لَّعَنَهُ اللَّهُ وَغَضِبَ عَلَيْهِ وَجَعَلَ مِنْهُمُ الْقِرَدَةَ وَالْخَنَازِيرَ وَعَبَدَ الطَّاغُوت

                      “మీరు వారితో ఇలా చెప్పండి. నేను మీకు వారి గురించి తెలుపనా, ఎవరి పరిణామము పాపులకంటే హీనంగా ఉంటుందో? వారు అల్లాహ్ శాపగ్రస్తులైరి. ఆగ్రహించబడిరి. వారు కోతులు, పందులు చేయబడ్డారు. వారు తాగూతు దాస్యం చేశారు.” (5:60) 

                      قَالَ الَّذِينَ غَلَبُوا عَلَىٰ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِم مَّسْجِدًا

                      వారిలో ఎవరైతే తమ వ్యవహారములలో జయించారో, ” మేము తప్పకుండా వారిపై ఆరాధనాలయము నిర్మించెదము” అని పలికిరి. (18:21) 

                      హజరత్ అబూ సయీద్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: “మీరు మునుపటి సమాజములను అనుసరిస్తూ, వారితో సమానులై పోతారు. ఒకవేళ వారు పుట్టలో దూరినా, మీరు కూడా దూరిపోతారు.” అప్పుడు అనుచరులు, “మునుపటి సమాజములంటే యూదులు, క్రైస్తవులా?” అని ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ‘మరెవరు?’ అని జవాబు పలికారు. 

                      హజరత్ సౌబాన్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: “అల్లాహ్ నా కొరకు భూమిని దగ్గరకు చేర్చెను. నేను దాని యొక్క తూర్పు, పడమరలను తిలకించితిని. నా అనుచరులు రాజ్యము ఉన్నంత వరకు నా తుదిచూపు ఉన్నది. ఎంత వరకు అయితే నాకు భూమిని దగ్గర చేసి చూపెట్టబడెనో, నాకు ఒక ఎర్రటి, రెండవది, తెల్లటి నిధులు ప్రసాదించబడెను. నేను నా ప్రభువుతో నా అనుచరుల కొరకు ఈ విధముగా ప్రార్థించితిని. “వారిని అనావృష్టితో నాశనము చేయకుము. వారిపై బద్ధ శత్రువును అధిష్టించకుము. వారిని నాశనము చేసి విడిచిపెట్టగలడు. నా ప్రభువు ఈ విధముగా సెలవిచ్చెను: ఓ! ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం), నేను నిర్ణయించిన తర్వాత అది మార్చబడదు. నేను మీ అనుచరుల విషయంలో మీ ప్రార్థన స్వీకరించితిని. వారిని అనావృష్టితో నాశనము చేయను. వారిని నాశనము చేసే బద్ద శత్రువులను కూడా నియమించను, శత్రువులందరూ వారికి వ్యతిరేకంగా ఏకీభవించినాసరే, కాని వారే ఒకరినొకరు నాశనము చేసుకొందురు. ఖైదీలుగా చేయుదురు. 

                      హాఫిజ్ బర్ ఖాని కూడా తన పుస్తకము ‘సహీ లో దీనిని పొందుపరచెను. “నాకు నా అనుచరులలో మార్గభ్రష్టము చెందిన మార్గదర్శకుల విషయంలో అపాయము కానవస్తుంది. ఒకవేళ వారిలో ఒకసారి యుద్ధము ప్రారంభమైన యెడల, ప్రళయదినం వరకూ అది ఆగదు. నా అనుచరులలో ఒక సమూహము బహదైవారాధకులతో చేయి కలిపేంతవరకూ, నా అనుచరులలో కొన్ని సమూహములు విగ్రహాలను పూజించనారంభించనంత వరకూ ప్రళయదినము సంభవించదు. నా ఉమ్మత్ లో  30 మంది దజ్జాల్లు వచ్చెదరు. వాళ్ళందరూ మేము ప్రవక్తలమని వాదన చేయుదురు. నేను చివరి ప్రవక్తను, నా తర్వాత వేరే ప్రవక్త ఎవ్వరూ రారు. నా అనుచరులలో ఒక సమూహము ఎల్లప్పుడూ సత్యమార్గములో ఉంటారు. అల్లాహ్ వారికి సహాయము చేస్తాడు. వారిని వదలి వెళ్ళువారు వారికి ఏమీ కీడు చేయలేరు. చివరికి ప్రళయ దినం సంభవించును. 

                      దీనిలో 14 ప్రకరణములు కలవు 

                      1. వాక్యము (4:51) భావము తెలుపబడెను (దానిలో విగ్రహాలు, షైతాన్ను ఆరాధించిన విషయం కలదు). 

                      2. వాక్యము (5:60) భావము కలదు. పాపులకంటే నీచమైన వారి గురించి తెలుపబడెను. 

                      3. వాక్యము (18:21) భావము కలదు. ‘కహఫ్’ వారి గుహపై మస్జిద్ నిర్మాణం గురించి తెలుపబడెను. 

                      4. జిబ్త్, తాగూత్లను విశ్వసించువారి గురించి తెలుపబడెను. 

                      5. తమ అవిశ్వాసము తెలిసిన అవిశ్వాసులు, విశ్వాసులకంటే ఉత్తములని యూదుల భావన. 

                      6. సత్యవంతులు ప్రతి కాలంలోను ఉన్నారు, ఉంటారు అని స్పష్టమవుతుంది. 

                      7. అనుచరులలో చాలా మంది బహుదైవారాధనకు పాల్పడతారు. 

                      8. ముఖ్తార్ అబూ ఉబైద్ సఖఫీ తాను ప్రవక్త అని వాదన చేసెను. అతడు ఏక దైవారాధన, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవక్త అని, ఖుర్ఆన్ సత్య సంబోధమని నమ్మెడివాడు. కాని ఖుర్ఆన్లో ముహమ్మద్ (సల్లల్లాహు వ అలైహి వ సల్లం) చివరి ప్రవక్త అని విశ్లేషించినప్పటికి, కొన్ని సమూహములు అతనిని అనుసరించిరి. 

                      9. సత్యవంతులు సాంతం నాశనము కారు. ప్రళయ దినం వరకూ ఒక సత్యవంతుల సమూహము ఉంటుంది. 

                      10. సత్యవంతులను విడిచిపెట్టి వెళ్ళేవారు వారికి ఏ విధమైన కీడు చేయలేరు. 

                      11. సత్యవంతులు ప్రళయ దినం వరకూ ఉంటారు. 

                      12. ఈ ఉత్తమ నిదర్శనములు తెలుపబడెను. అల్లాహ్ తన ప్రవక్త కొరకు భూమిని దగ్గరకు చేర్చెను. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  తెలిపినవన్నీ నిజమని తెలిసినది, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  అల్లాహక్కు విన్నవించుకున్న రెండు దుఆలు స్వీకరించబడినట్లు తెలిపెను. మూడవ దుఆ స్వీకరించబడలేదు. తన ఉమ్మత్ లో  యుద్ధము ప్రారంభమై ప్రళయదినం వరకు అంతం కాదని తెలుపుట, నా ఉమ్మత్ లో  అసత్య ప్రవక్తలు వాదనలు చేయుదురు అని తెలిపెను. ప్రళయదినం వరకూ సత్య సమాజము అభివృద్ధి చెందుతుండు నని తెలుపుట. ఈ పైన తెలిపినవన్నీ సంభవించెను, ఏవైతే నమ్మశక్యము కానివో అవి జరిగెను. 

                      13. మార్గభ్రష్టత చెందిన నాయకుల వలనే ప్రవక్త అనుచర సమాజానికి అపాయము కలదని తెలుపబడింది. 

                      14. ఆయన(సల్లల్లాహు అలైహి వ సల్లం)  విగ్రహారాధన యొక్క భావము విశదీకరించితెలిపెను. 

                      పాఠము- 24 : చేతబడి 

                      ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా పేర్కొనెను: 

                      وَلَقَدْ عَلِمُوا لَمَنِ اشْتَريهُ مَالَهُ فِي الآخِرَةِ مِنْ خَلَاقٍ 

                      “ఈ విద్యను నేర్చుకొనేవారికి పరలోకములో భాగము ఏ మాత్రం లేదని వారికి బాగా తెలుసును.” (2:102)

                      يُؤْمِنُونَ بِالجبت والطاغوت 

                      “వారు విగ్రహాలను, షైతానులను విశ్వసిస్తున్నారు. వారు జిబ్త్, తాగూత్ ను విశ్వసించారు.”(4:51) 

                      హజరత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా తెలిపెను. ‘జిబ్త్’ అనగా – చేతబడి (జాదూ), ‘తాగూత్’ అనగా షైతాన్.” 

                      హజరత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా తెలిపెను: “తాగూత్ అంటే ఎవరిపై షైతాన్ వచ్చునో అటువంటి జ్యోతిష్యుడు, ప్రతి దేశములో వేరే జ్యోతిష్యుడు ఉండేవాడు.” 

                      హజరత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించిరి: “ఏడు నాశనము చేయు పనుల నుండి తమను తాము కాపాడుకోండి.” అప్పుడు అనుచరులు ఆ ఏడు కార్యములు ఏవి అని ప్రశ్నించగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా తెలిపెను: 

                      1. అల్లాహ్ కు భాగస్వాములను కల్పించుట. 

                      2. చేతబడి చేయుట, మంత్రములతో కనికట్టు చేయుట. 

                      3. అనవసరంగా ఎవరినైనా సంహరించుట. 

                      4. వడ్డీ వ్యాపారము చేయుట. 

                      5. అనాధల సొమ్ము తినుట. 

                      6. శత్రువులతో యుద్ధము చేయునప్పుడు వెనుదిరిగి పారిపోవుట. 

                      7. పతివ్రతలపై అభాండము మోపుట. 

                      హజరత్ జుందుబ్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  నుంచి ఈ విధముగా ఉల్లేఖించెను: “జాదు (చేతబడి) చేయువానికి మరణ శిక్ష విధించండి.” (దీనిని తిర్మిజీ పొందుపరచెను. ఇది దైవప్రవక్త సహచరుని ఉవాచ అన్న విషయం సరైనదని తెలిపెను. 

                      బజాల బిన్ అబ్దహు ఈ విధముగా పేర్కొనెను. “ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు), జాదు చేయువారికి మరణ శిక్ష విధించమని ప్రకటించినప్పుడు, మేము ముగ్గురు చేతబడి చేయువారికి మరణశిక్ష విధించితిమి. (సహీబుఖారీ) 

                      హఫ్సా (రదియల్లాహు అన్హు) తన సేవకురాలిని జాదు చేసిన కారణముగా మరణశిక్ష విధింపజేసెను. (ముఅత్తా ఇమాం మాలిక్) 

                      ఇదే విధముగా జుందుబ్ (రదియల్లాహు అన్హు) దీనిని ధృవీకరించెను. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ (రహ్మతుల్లా అలై) జాదు చేయువారికి మరణశిక్ష విధించారన్న విషయాన్ని ముగ్గురు అనుచరులు ధృవీకరించారని తెలిపెను. 

                      దీనిలో 8 ప్రకరణములు కలవు 

                      1. వాక్యము (2:102)లో జాదు నేర్చుకొనేవారికి ప్రతిఫలము తెలుపబడెను. 

                      2. వాక్యము (4:51)లో జాదు చేయువారు విగ్రహాలను షైతానును విశ్వసిం చుదురని తెలుపబడెను. 

                      3. జిబ్, తాగూత్ యొక్క భావము మరియు వాటి మధ్య భేదము తెలుప బడెను. 

                      4. తాగూత్ జిన్నాతులు కూడా ఉంటారు. మానవులు కూడా ఉంటారు. 

                      5. వినాశము చేయు ఏడు కార్యములు తెలుపబడెను. వాటిని నివారించెను. 

                      6. జాదు చేయువాడు అవిశ్వాసి. 

                      7. జాదు చేసేవాడు క్షమాపణ కోరుకోకుండా చనిపోతే, అతడు నరకములోకి నెట్టివేయబడతాడు.

                      8. జాదు చేయువారు ఉమర్ (రదియల్లాహు అన్హు) కాలములో కూడా ఉండిరి. ఇప్పటికీ ఉన్నారు. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

                      పాఠము- 25 : జాదులోని కొన్ని విధానాలు 

                      ఇమాం అహ్మద్ బిన్ హంబల్, ముహమ్మద్ బిన్ జాఫర్ నుంచి, ఆయన అవుఫ్ బిన్ హిబ్బాన్ బిన్ అల్ అలా నుంచి, ఆయన ఖతన్ బిన్ ఖుబైసా నుంచి, ఆయన తన తండ్రి ఖుబైసా నుంచి, ఆయన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుంచి ఈ విధముగా ఉల్లేఖించెను. 

                      “పక్షులను ఎగురవేసి శకునము తీయుట, భూమిపై రేఖలు గీసి ప్రశ్నలు తీయుట (ప్రశ్నశాస్త్రము), ఏదైనా అడ్డు వచ్చినచో చెడు అని భావించుట, ఇవన్నీ జాదు యొక్క విధాన ములు.” 

                      (దీనిని ముస్నద్ అహ్మద్, అబూదావూద్, నసాయి, ఇబ్నె హిబ్బాన్ సహీలో పొందుపరచెను.) 

                      హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు మా) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ప్రబోధించెను: 

                      “ఎవరైతే జ్యోతిష్యములో ఎంత భాగము నేర్చుకొనెనో, అంత జాదు నేర్చుకున్నట్లు, ఎంత ఎక్కువ నేర్చుకుంటే, దాని కారణముగా అంత (భాగము) ఎక్కువ పాపము పెరుగును.” (అబూదావూద్, సహీ సనద్ పొందుపరచెను) 

                      హజరత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: 

                      “ఎవరైతే ముడివేసి దానిలోకి ఊదునో, నిశ్చయముగా అతడు జాదు చేసెను. ఎవరైతే జాదు చేసెనో అతడు బహుదైవారాధనకు పాల్పడెను, ఏ వ్యక్తి అయినా (తన నడుముకు, మెడకు, చేతికి) ఏదైనా (కట్టిన లేక) వ్రేలాడదీసిన యెడల అతనిని దానికి అప్పగించబడును”. (సునన్ నసాయి) 

                      హజరత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: “నేను మీకు “ఇదతు” గురించి తెలుపనా? అది ఒక దాడి. దాని ద్వారా ప్రజలలో కలత రేపబడును.” (ముస్లిం) 

                      హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: కొన్ని ప్రసంగాలలో కూడా ‘జాదు’ లాంటి ప్రభావం ఉండును

                      దీనిలో 6 ప్రకరణములు కలవు 

                      1. ‘తర్ ఖ్’, ‘తీయర’, ‘అయాఫ’, ‘జిబ్త్’ అన్నీ జాదు విధానములు. 

                      2. ఈ మూడింటి గురించి వివరముగా తెలుపబడెను. 

                      3. జ్యోతిష్యము కూడా జాదులో ఒక విధానము. 

                      4. ముడివేసి ఊదుట కూడా జాదు విధానము అని చెప్పబడింది. 

                      5. చాడీలు చెప్పి ప్రజలలో కలత రేపుట కూడా జాదు విధానము. 

                      6. కొంతమంది వాక్చాతుర్యము కొన్ని సమయాలలో జాదులాగ పని చేయును. 

                      పాఠము-26: జ్యోతిష్యుడు మరియు అతని కోవకు చెందిన వారి గురించి 

                      కొంత మంది ప్రవక్త సతీమణులు ముతహ్హరాత్ (రదియల్లాహు అన్హున్న) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా పేర్కొన్నట్లు ఉల్లేఖించిరి: (సహీముస్లిం) 

                      ఏ వ్యక్తి అయినా జ్యోతిష్యుడు దగ్గరకు వెళ్ళి, ఏదైనా అడిగి తెలుసుకొని దానిని రూఢీ పరచినచో, 40రోజుల వరకు అతని నమాజు స్వీకరించబడదు.” (అబూదావూద్) 

                      అబూహురైర (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: 

                      “ఏ వ్యక్తి అయినా జ్యోతిష్యుడు లేదా గుప్త విద్యకలవాడి దగ్గరకు వెళ్ళి అతను తెలిపిన మాటలను ధృవీకరించినచో, ఈ వ్యక్తి మతము (ఇస్లాం)ను నిరాకరించిన వాడవుతాడు.” (అబూదావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నెమాజ) (ఇమాం హాకిం దీనిని తన పుస్తకములో బుఖారీ, ముస్లింల సిద్ధాంతముల ప్రాతిపదికన సహీ అని తెలిపెను). 

                      హజరత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను. 

                      “శకునము తీయువాడు, తీయించువాడు, గుప్తవిద్య చేయువాడు, చేయించువాడు, జాదు చేయువాడు, చేయించువాడు మనలోలేరు (అంటే ఇస్లాంలో లేరు). ఏ వ్యక్తి అయినా గుప్త విద్య చేయువాని వద్దకు వెళ్ళి అతడు చెప్పిన మాటలను ధృవీకరించిన ఎడల అతడు మతమును నిరాకరించిన వాడవుతాడు” (దీనిని ఉత్తమ సనద్ బజ్జార్ ఉల్లేఖించెను) 

                      ఇమాం బగ్వీ రహ్మతుల్లా అలైహ్ ‘అర్రాఫ్’ గురించి ఈ విధముగా తెలిపెను, కొన్ని మాటలతో కార్యముల విద్య యొక్క వాదన చేయుట, మాట ద్వారా తిరస్కరించబడిన, కోల్పోయిన వస్తువుల గురించి తెలుపుట, 

                      కొంతమంది విద్యావేత్తలు ‘అర్రాఫ్’ అనగా ‘కాహిన్’ అంటే భవిష్యత్తులో జరుగు వాటిని తెలుపువాడు అంటున్నారు. 

                      షేఖుల్ ఇస్లాం అబుల్ అబ్బాస్ ఇబ్నె తైమియా (రహమతుల్లాహ్ అలై), ‘అర్రాఫ్’, అనే పదము, అది కాహిన్, నుజూమి, రమ్మాల్, గుప్త విద్య వాదము చేయుదురో, వారందరి గురించి వాడబడుతుంది. 

                      హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఈ విధముగా తెలిపెను: ఎవరైతే అక్షరములు (అబాజాద్) వ్రాసి లెక్క వేస్తారో, నక్షత్రముల ద్వారా లెక్క కడతారో నాకు తెలిసినంత వరకు ఈ విధముగా చేయువారికి అల్లాహ్ వద్ద ప్రళయ దినమున ఏ భాగ్యమూ లేదు. 

                      దీనిలో 7 ప్రకరణములు కలవు 

                      1. ఖుర్ఆన్ను విశ్వసించుట, కాహిన్ ను విశ్వసించుట ఈ రెండు ఒకే మనస్సులో జమ కాలేవు. 

                      2. కాహిన్ మాటను ధృవీకరించుట (కుఫ్ర) అవిశ్వాసానికి పాల్పడినట్లు. 

                      3. ‘కహానత్’ చేయించువాని గురించి నిషేధమని కూడా తెలుపబడెను. 

                      4. ‘ఫాల్’ (శకునము) తీయించుట కూడా నిషేధము. 

                      5. జాదు చేయించువాని పాపము తెలుపబడెను

                      6. “అబాజాద్” వ్రాసి లెక్క చేయువారి గురించి తెలుపబడెను. 

                      7. దీనిలో కాహిన్ మరియు అర్రాఫ్ మధ్య భేదము తెలుపబడెను. (వీరందరూ మతభ్రష్టులు. వీరికి ఇస్లాంతో ఎటువంటి సంబంధము లేదు) 

                      పాఠము – 27 : జాదు చేయబడిన వ్యక్తికి వైద్యము చేయుట

                      హజరత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను నషరహ్ (జాదుని జాదు ద్వారా తొలగించుట) గురించి ప్రశ్నించగా, ఆయన “అది షైతాను అమలు (పనులు) అని తెలిపిరి.” (అహ్మద్, అబూదావూద్ ఉత్తమ సనద్ పొందుపరచెను). 

                      ఇమాం అబూదావూద్ (రహ్మతుల్లాహ్ అలై) ఈ విధముగా తెలిపిరి: ఇమాం అహ్మద్ (రహమతుల్లాహ్ అలై)ను నషరహ్ గురించి ప్రశ్నించగా ఆయన ఈ విధముగా తెలిపెను: 

                      “హజరత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్షు) ఈ పనులన్నీ చెడ్డ పనులని అయిష్టత చూపేవారు.” 

                      ఇమాం ఇబ్నె ఖయ్యం (రహమతుల్లాహ్ అలై) ఈ విధముగా విశదీకరించిరి: 

                      “చేతబడితో నిరోధించుట. ఇది షైతాన్ కార్యము, నిషేధించబడినది. ఈ విషయంలో జాదును తొలగించువాడు, జాదు చేయబడినవాడు ఇద్దరూ షైతానికి ఇష్టమైన పనులు చేయుదురు. షైతాన్ సంతోషించే పనులు చేయుట ద్వారా షైతాన్ తన ప్రభావమును తొలగించును. దీనిలో 2 విధానములు కలవు. 

                      1. జాదును దాని ద్వారానే తొలగించుట. ఇది షైతాను పని. 

                      2. బహుదైవారాధనకు తావులేని ఖుర్ఆన్ వాక్యములు అల్లాహ్, దుఆ చేస్తూ జాదు యొక్క వైద్యము చేయవచ్చును. 

                      దీనిలో 2 ప్రకరణములు కలవు 

                      1. జాదు వైద్యము జాదు ద్వారా చేయుట నిషిద్ధము. 

                      2. ఖుర్ఆన్ ద్వారా జాదు వైద్యము చేయుట సరియైనది. 

                      పాఠము 28 : దుశ్శకున (అపశకున) దర్శనము 

                      ఖుర్ఆన్ లో అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను: 

                       أَلَا إِنَّمَا طَائِرُهُمْ عِندَ اللَّهِ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ

                      “నిశ్చయముగా వారి అపశకునం అల్లాహ్ అధీనంలో ఉంది. కాని వారిలో చాలా మంది జ్ఞానహీనులు.” (7:131) 

                      قَالُوا طَابِرُكُمْ مَعَكُمْ، اَبِنْ ذُكِرْتُم ، 

                      بل انتُم قَوْم مرفونَ ) 

                      అప్పుడు ప్రవక్తలు ఇలా అన్నారు: “మీ దరిద్రమంతా మీ వెంటే ఉంది. ఏమిటీ, మీకు చేసే ఉపదేశాన్ని మీరు దరిద్రంగా తలపోస్తున్నారా? అసలు విషయం అదికాదు. మీరసలు బరితెగించిపోయారు.” (36:19) 

                      హజరత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖిం చారు: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: “ఏ వ్యాధీ అల్లాహ్ ఆజ్ఞ లేకుండా సోకదు. దుశ్శకునం అనేది లేదు. గుడ్లగూబ కూతలు కూడా ఏ విధమైన అపశకునానికి దారితీయవు. ‘సఫర్’ నెలలో కూడా ఏ విధమైన అపశకునం లేదు.” (సహీబుఖారి,సహీముస్లిం) 

                      సహీ ముస్లింలో ఈ పదములు, అధికముగా పొందుపరచబడెను. 

                      “నక్షత్రముల బెడద మరియు భూతముల బెడద అనేవి అవాస్తవములు.” 

                      హజరత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ప్రబోధించెను: “ఏ వ్యాధి కూడా అందరికీ అంటదు. దుశ్శకునం అనేది లేదు. నాకు ‘ఫాల్’ అంటే ఇష్టం”. అప్పుడు అనుచరులు ప్రశ్నించారు: ‘ఫాల్’ అంటే ఏమిటి? అని.” “ఉత్తమమైన మంచి మాట” అని ప్రవక్త జవాబు ఇచ్చెను. 

                      ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను దుశ్శకునం గురించి ప్రశ్నించగా ఆయన ఈ విధముగా ప్రబోధించెను: 

                      “వీటన్నింటికంటే ఉత్తమమైన మంచిమాట మేలైనది. అది ఏ ముస్లించి కూడా అతని విధి నుండి నివారించలేదు. అందుచేత ఎవరైనా చెడును చూచినప్పుడు ఈ దుఆ చదవవలెను: “ఓ అల్లాహ్! నీవు తప్ప ఎవరూ మేలు చేకూర్చలేరు. నీవు తప్ప ఎవరూ కీడును నిర్మూలించలేరు. నీ అనుగ్రహము లేనిదే మాకు మేలు చేకూర్చుకునే శక్తిగాని లేదా కీడు నుండి రక్షించుకునే శక్తిగాని లేదు.” (దీనిని అబూదావూద్ సహీ సనత్తో పొందుపరచెను.) 

                      ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుండి హజరత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: 

                      “అపశకునమును విశ్వసించుట అల్లాహు కు భాగస్వాములను కల్పించుట. మనలో ఎవరు (సృష్టి కారణముగా కొన్ని అనుమానాలు కలిగినా) అల్లాహ్ ను విశ్వసించి ఆయనపై నమ్మకము ఉంచిన కారణముగా అల్లాహ్ దానిని నిర్మూలించును.” (అబూదావూద్, తిర్మిజీ) 

                      హజరత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: “అపశకునం అని ఎవరైతే తన కార్యమును మానుకొనెనో అతడు షిర్క్ చేసెను” అని ప్రవక్త తెలిపినప్పుడు అనుచరులు దానికి పాప పరిహారము ఏమిటి అని ప్రశ్నించిరి. దాని పాప పరిహారము ఈ దుఆ “యా, అల్లాహ్ ! నీవు అనుగ్రహించు మేలు తప్ప వేరే మేలు లేదు. నీవు విధించు కష్టము తప్ప వేరేకష్టము లేదు, నీవు తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారు.” (ముస్నద్ అహ్మద్) 

                      ముస్నద్ అహ్మద్ లో హజరత్ ఫజల్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు మా) ఈ విధముగా ఉల్లేఖించారని పొందపరచబడినది: “నిన్ను ఏదైనా పని నుండి నివారించునది లేదా ప్రోత్సహించునది దుశ్శకునము.”

                      దీనిలో 11 ప్రకరణములు కలవు 

                      1. వాక్యములు (7:131) మరియు (36:19)ల భావము విశదీకరించి తెలుప బడెను.

                      2. అల్లాహ్ ఆజ్ఞ లేకుండా ఏ వ్యాధి సోకదని స్పష్టపరచబడెను. 

                      3. దుశ్శకునం అనేది ఒట్టి భ్రమ అని స్పష్టపరచబడెను. 

                      4. గుడ్లగూబ కూతలతో అపశకునం వాటిల్లును అని భావించుట కూడా నిరోధించబడినది. 

                      5. ‘సఫర్’ నెల అపశకునం కలదని భావించుట కూడా నిరోధించ బడింది.

                      6. ఉత్తమమైన మంచి మాటలు తెలుపవలెను.

                      7. చెడు మాటలు, మంచి మాటల గురించి విశదీకరించబడెను. 

                      8. మనస్సులో ఏమైనా చెడు ఆలోచనలు వచ్చినప్పుడు అల్లాహ్ ను విశ్వసించుట వలన అవి దూరమగును

                      9. ఎవరికైనా మనస్సులో చెడు ఆలోచనలు వచ్చినప్పుడు హదీసులో తెలుపబడిన దుఆ, “యా, అల్లాహ్! నీవు తప్ప ఎవరూ మేలు చేకూర్చ లేరు. నీవు తప్ప ఎవరూ కీడును నిర్మూలించలేరు. నీ అనుగ్రహం లేనిదే మాకు మేలు చేసే శక్తి ఎవరికీ లేదు. లేదా కీడు నుంచి రక్షించు కునే శక్తిగాని లేదు” అని చదువవలెను. 

                      10. అపశకునాలను భావించుట షిర్క్క పాల్పడుట అని స్పష్ట పరచబడెను.

                      11. అపశకునం గురించి విశదీకరించి తెలుపబడెను. 

                      పాఠము – 29 : జ్యోతిష్యం గురించి 

                      ఇమాం బుఖారీ (రహమతుల్లాహ్ అలై) తన సహీ బుఖారీలో హజరత్ ఖతాదా (రదియల్లాహు అన్హు) వచనములను పొందుపరచెను: 

                      “అల్లాహ్ ఈ నక్షత్రములను మూడు కారణముల కొరకు సృష్టించెను. ఆకాశమును అలంకరించుట కొరకు, షైతానులను పారద్రోలుటకు, సముద్రము, భూమిపై దారి తెలుసుకొనుటకు. ఎవరైనా వీటిని మించి వేరే కారణములు భావించిన ఎడల అతను తప్పు దోవ పట్టును, ప్రతి మేలు నుండి తన భాగము కోల్పోవును. అతను తనకు తెలియని జ్ఞానభారాన్ని తనపై మోపుకున్నాడు. 

                      హజరత్ ఖతాదా, సుఫ్యాన్ చంద్రుని చలనము గురించి తెలుసు కొనుట సరికాదనిరి. కాని ఇమాం అహ్మద్ బిన్ హంబల్ ఇసఖ్ (రహమతుల్లాహ్ అలైహిమా) చంద్రుని ఘట్టములను తెలుసుకొనుటకు సమ్మతించెను. హజరత్ అబూ మూసా అష్రీ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: మూడు రకాల ప్రజలు స్వర్గమున ప్రవేశింప లేరు. 

                      1. మత్తుపానీయములు సేవించుటకు అలవాటుపడినవారు.

                      2. బంధుత్వం త్రెంచుకొనువారు. 

                      3. ‘జాదు’ని విశ్వసించువారు. 

                      దీనిలో 4 ప్రకరణములు కలవు 

                      1. నక్షత్రముల సృష్టికి కారణములు తెలుపబడెను.

                      2. ఈ కారణములు తప్ప వేరే కారణములు భావించుట నిషేధించ బడినది. 

                      3. చంద్రుని చలనములను గురించి తెలుసుకొనుటలో విద్యావంతుల మధ్య విభేదము కలదు. 

                      4. జాదు చెడ్డ పాపమని తెలుసుకొని కూడా దానిని నేర్చుకొనుట నిషేధించ బడినదని తెలియుచున్నది. 

                      పాఠము 30 : నక్షత్రముల ప్రభావముతో వర్షం కురియునని నమ్ముట 

                      ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా సెలవిచ్చెను: 

                      وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ

                      దీనిని తిరస్కరించుటయే మీ జీవనోపాధిగా చేసుకొన్నారా?” (56:82) 

                      హజరత్ అబూ మాలిక్ అష్రీ (రదియల్లాహు అన్హు) ప్రవక్త ప్రబోధనను ఈ విధముగా ఉల్లేఖించెను: “మా సమాజములో ప్రజలు వీడని నాలుగు దురాచారములు కలవు. తమ వంశముపై గర్వపడుట, వేరే వంశములలో దోషములను వెలికితీయుట మరియు ఎత్తిపొడుచుట. నక్షత్రముల ప్రభావం వలన వర్షము కురియునని భావించుట. ఆప్తులు మరణించినప్పుడు బట్టలు చించుకొని రోదించుట. ఇంకా ఈ విధముగా పలికెను. ఈ విధముగా బట్టలు చించుకొని రోదించిన వారు తమ మరణమునకు ముందు అల్లాహ్ సమక్షములో క్షమాపణ కోరని ఎడల ప్రళయదినము రోజు వారికి గంధకము మరియు చర్మమును కష్టపరచు దుస్తులు తొడగింపబడును. 

                      హజరత్ జైద్ బిన్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా పేర్కొనెను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం హుదైబియా వద్ద ఒక రాత్రి వర్షము కురిసిన తరువాత మాకు ఫజర్ నమాజు చదివించిరి. ఆయన సలాముచేసి నమాజు ముగించిన తర్వాత అనుచరులను ఉద్దేశించి ఈ విధముగా ప్రబోధించారు: అల్లాహ్ ఏమన్నాడో మీకు తెలుసా? అనుచరులు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే తెలుసును అని జవాబు పలికిరి. మరల ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా పేర్కొనెను: అల్లాహ్ కృపతో మాపై వర్షము కురిసినది అని పలికిన వారు నన్ను విశ్వసించిరి. ఫలానా నక్షత్ర ప్రభావము వలన వర్షము కురిసినది అని పలికినవారు నన్ను నిరాకరించి నక్షత్రముల ప్రభావమును విశ్వసించిరి. (బుఖారి, ముస్లిం) 

                      హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా తెలిపెను: కొంతమంది ఫలానా నక్షత్రము వలన లాభం చేకూరెను అని పలికి నప్పుడు అల్లాహ్ ఖుర్ఆన్లో ఈ ఆయత్లను అవతరింపజేసెను. 

                      فَلَا أُقْسِمُ بِمَوَاقِعِ النُّجُومِ  وَإِنَّهُ لَقَسَمٌ لَّوْ تَعْلَمُونَ عَظِيمٌ إِنَّهُ لَقُرْآنٌ كَرِيمٌ فِي كِتَابٍ مَّكْنُونٍ لَّا يَمَسُّهُ إِلَّا الْمُطَهَّرُونَ تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ أَفَبِهَٰذَا الْحَدِيثِ أَنتُم مُّدْهِنُونَ وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ

                      “నక్షత్రముల చలనముల ప్రమాణము, మీరు తెలుసుకుంటే ఇది చాలా పెద్ద ప్రమాణము. నిశ్చయముగా ఇది ఒక మహోన్నతమైన ఖుర్ఆన్. సురక్షిత పరచ బడినది. దానిని పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు. ఇది సకల లోకాలప్రభువు అవతరింపజేసినది. అయినా మీరు ఈ దైవవాణిని నిర్లక్ష్యము చేయుచున్నారా? దీనిని తిరస్కరించటమే మీ జీవిత లక్ష్యంగా చేసుకున్నారా?” (56:75-82) 

                      దీనిలో 10 ప్రకరణములు కలవు 

                      1. వాక్యము(56:82) (ఖుర్ ఆన్ ని తిరస్కరించేవారిని గురించి తెలుపబడెను.)

                      2. నాలుగు దురాచారాల గురించి విశదీకరించబడెను.

                      3. వీటిలో కొన్ని కుఫ్ర్కు దారితీయునవి.

                      4. కొన్ని రకాల కుఫ్ర (కృతఘ్నత) కారణముగా మానవుడు ఇస్లాం ధర్మము నుంచి వెలుపలకు రాడు.

                      5. అల్లాహ్, “నా దాసులలో కొంతమంది విశ్వాసులైరి. కొంతమంది అవిశ్వాసులైరి” అని తెలిపాడు. అల్లాహ్ అనుగ్రహం అవతరించిన మీదట ఈ సంఘటన జరిగింది.

                      6. విశ్వాసము గురించి క్షుణ్ణంగా పరిశీలించవలెను. 

                      7. అవిశ్వాసము గురించి క్షుణ్ణంగా పరిశీలించవలెను. (చిన్న వాక్కుతో విశ్వాసి అవిశ్వాసి అగును)

                      8. ఫలానా నక్షత్ర ప్రభావము సరియైనది అనుట అవిశ్వాసము. 

                      9. తెలియనివారు నీకు తెలుసునా అని అడిగి తెలుసుకొనవచ్చును.

                      10. ఎవరైనా మరణించినప్పుడు బట్టలు చించుకొని రోదించువారి శిక్ష తెలుప బడెను. “నా దాసులలో కొంతమంది విశ్వాసులైరి. మరి కొంతమంది అవిశ్వాసులైరి” అని తెలుపబడెను. 

                      పాఠము – 31 : అల్లాహ్ ను ప్రేమించుట – ధర్మమునకు పునాది 

                      అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ప్రబోధించెను; 

                      وَمِنَ النَّاسِ مَنْ يَتَّخِذُ مِنْ دُونِ اللَّهِ أَنْدَادًا يُحِبُّونَهُمْ كَحُتِ اللهِ 

                      “కొంతమంది అల్లాహు కు సాటి మరియు భాగస్వాములను కల్పిస్తారు. అల్లాహ్ ని ప్రేమించవలసిన విధముగా వారిని ప్రేమిస్తారు.” 

                      قُلْ إِن كَانَ اَباؤُكُمْ وَابْنَاؤُكُم وَإخْوَانُكُمْ وَأَزْوَاجُكُمْ وَعَشِيرَتُكُمْ 

                      و اَمْوَالُ اقْتَرَفْتُمُوهَا وَتِجَارَةٌ تَخْشَونَ كَسَادَهَا وَ 

                      مسكن تَرْضَوْنَهَا اَحَبَّ إِلَيْكُمْ مِنَ اللهِ وَ رَسُولِهِ وَجِهَادِ فِي سَبِيلِهِ فَتَرَبَّصُوا حَتَّى يَأْتِيَ اللهُ بِأَمْرِهِ ، وَاللهُ لَا يَهْدِ الْقَوْمَ الْفَسِقِينَ 

                      “(ప్రవక్తా!) ఇలా పలుకుము: ఒకవేళ మీ తల్లిదండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ బంధువులు, మీరు సంపాదించిన ఆస్తులు, మందగిస్తాయేమో అని మీరు భయపడే మీ వ్యాపారాలు, మీకు ఇష్టమైన మీ గృహాలు, అల్లాహకంటే, ఆయన ప్రవక్త కంటే, ఆయన మార్గంలో జిహాద్ చేయుటకంటే మీకు ఎక్కువ ప్రియమైనచో అల్లాహ్ తన తీర్పును ఇచ్చేవరకు నిరీక్షించండి. అల్లాహ్ దోషులకు సన్మార్గము చూపడు.” (9:24) 

                      హజరత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: “మీరు నన్ను మీ సంతానముకంటే, తల్లి దండ్రులందరికంటే ప్రియతమునిగా గ్రహించే వరకూ నిజమైన విశ్వాసులు కాజాలరు. (బుఖారీ, ముస్లిం) 

                      మూడు సుగుణములు ఎవరి వద్ద ఉండునో వారు విశ్వాస తియ్యదనము పొందుదురు. 

                      1. అల్లాహ్ ప్రవక్తను అందరికంటే ప్రియతములుగా గ్రహించినవాడు. 

                      2. స్వచ్ఛముగా అల్లాహ్ కొరకు వేరే వారిని ప్రేమించువాడు. 

                      3. అల్లాహ్ అతనిని అవిశ్వాసము నుండి రక్షించినప్పుడు అగ్నిలో ప్రవేశిం చుటకు అయిష్టపడునట్లుగా అతడు కుఫ్ర్ (అవిశ్వాసమున) కు అయిష్ట పడువాడు. 

                      ఇబ్నె జరీర్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు మా) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఉల్లేఖనాన్ని ఈ విధముగా పొందుపరచెను: “ఎవరైతే స్వచ్ఛముగా అల్లాహ్ ఇష్టపడుట కొరకు వేరే వారిని ప్రేమించునో, (చెడుల కారణముగా) అసహ్యించు కొనునో, స్నేహం చేయునో, చెడుల కారణముగా విభేదించినచో నిశ్చయముగా అల్లాహ్ స్నేహం వాటి వలననే ప్రాప్తించును.” ఎవరూ ఈ పై విధానములతో తప్ప నిశ్చిత విశ్వాసము పొందజాలరు, వారు ప్రార్థనలు చేయు నప్పటికీ, ఉపవాసములు ఉండునప్పటికీ చాలా మంది తన స్నేహం ప్రపంచ విషయాల కారణముగా పెంచుకొందురు. ఈ స్నేహం వారికి లాభ దాయకము కాదు. 

                      హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) వాక్యము (2:166) “వారి సత్సంబంధాలు తెగిపోవును” ను విశదీకరిస్తూ ఈ విధముగా తెలిపెను: ఇచ్చట సత్సంబంధాలు అంటే, వారి స్నేహము, ప్రేమ, వారి సాధనముల సంబంధాలు అని అర్థము. 

                      దీనిలో 11 ప్రకరణములు కలవు 

                      1. వాక్యము (2:165) అర్థము (అవిశ్వాసులు అల్లాహ్ ను  కాదని వేరే వారిని ప్రేమించుట) గురించి తెలుపబడెను. 

                      2. వాక్యము (9:24) అర్థము (అల్లాహ్ ప్రవక్తతో కాకుండా వేరే వాటిని ప్రేమించుట వలన కలుగు ప్రతిఫలము) తెలుపబడినది. 

                      3. తమ ప్రాణము, సంతానము, సంపద అన్నింటికంటే ఎక్కువగా ప్రవక్తను ప్రేమించ వలయును. 

                      4. కొన్ని సమయములలో విశ్వాసము కోల్పోవుట అంటే పూర్తిగా అవిశ్వాసి అయినట్టు అర్థము కాదు. 

                      5. విశ్వాస తియ్యదనము కొన్ని సమయములలో తెలియును. 

                      6. నాలుగు మనసుకు సంబంధించిన కార్యముల కారణముగా మానవుడు అల్లాహ్ ప్రేమను పొందగలడు. అవి లేకుండా విశ్వాస రుచిని పొంద జాలడు. 

                      7. సాధారణంగా ప్రజల మధ్య స్నేహం ప్రాపంచిక ప్రయోజనాల నిమిత్తమే ఉంటుందని ప్రవక్త సహచరులు గ్రహించారు. 

                      8. ప్రళయ దినాన వారి సంబంధాలన్నీ తెగిపోవునని తెలుపుటను గ్రహించవలెను.

                      9. అల్లాహ్ కు భాగస్వాములను కల్పించువారిలో కొంతమంది అల్లాహ్ ను అమితముగా ప్రేమించెదరు. 

                      10. వాక్యము (9:24)లో తెలిపినట్లు అవి అల్లాహ్ కంటే ప్రియమైనవైతే వారు నష్టము భరించుటకు సిద్ధపడవలెను. 

                      11. ఎవరైనా తన నిరాధారమైన విగ్రహమును అల్లాహ్ ను ప్రేమించినట్లు ప్రేమించిన యెడల అది షిర్క్ అగును. 

                      పాఠము-32 : అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండుట 

                      అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ప్రబోధించెను: 

                      إِنَّمَا ذَٰلِكُمُ ٱلشَّيْطَـٰنُ يُخَوِّفُ أَوْلِيَآءَهُۥ فَلَا تَخَافُوهُمْ وَخَافُونِ إِن كُنتُم مُّؤْمِنِينَ 

                      “నిశ్చయముగా షైతాను తన మిత్రుల గురించి మిమ్ములను భయ పెట్టును. మీరు నిజమైన విశ్వాసులైతే వారికి భయపడకండి. నాకుభయపడండి.” (3:175) 

                      إِنَّمَا يَعْمُرُ مَسَـٰجِدَ ٱللَّهِ مَنْ ءَامَنَ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ وَأَقَامَ ٱلصَّلَوٰةَ وَءَاتَى ٱلزَّكَوٰةَ وَلَمْ يَخْشَ إِلَّا ٱللَّهَ ۖ فَعَسَىٰٓ أُو۟لَـٰٓئِكَ أَن يَكُونُوا۟ مِنَ ٱلْمُهْتَدِينَ 

                      “అల్లాహ్ ను  ప్రళయ దినమునూ విశ్వసించి, నమాజును స్థిరపరచువారు, జకాతు ఇచ్చేవారు అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ భయపడనివారు మాత్రమే అల్లాహ్ మసీద్లలకు సేవకులూ, సంరక్షకులూ కాగలరు. వీరే మార్గ దర్శకత్వం పొందినవారని ఆశించవచ్చును.” (9:18) 

                      وَمِنَ ٱلنَّاسِ مَن يَقُولُ ءَامَنَّا بِٱللَّهِ فَإِذَآ أُوذِىَ فِى ٱللَّهِ جَعَلَ فِتْنَةَ ٱلنَّاسِ كَعَذَابِ ٱللَّهِ

                      “ప్రజలలో కొంతమంది మేము అల్లాహు విశ్వసించాము అని పలికేవారు న్నారు. కాని అల్లాహ్ మార్గంలో వారికి కష్టము కలిగినప్పుడు ప్రజలు పెట్టిన బాధలను అల్లాహ్ విధించిన శిక్షగా భావిస్తారు.” (29:10) 

                      హజరత్ అబూ సయీద్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా   ప్రబోధించెను: “నిశ్చయముగా నీవు అల్లాహ్ ను అయిష్టపరచి ప్రజలను ఇష్టపరచుకొనుట, అల్లాహ్ ప్రసాదించిన ఆహారమునకు ప్రజలను పొగడుట, అల్లాహ్ ప్రసాదించని ఎడల వేరేవారిపై నిందమోపుట ఇవన్నీ విశ్వాస క్షీణత వలనే! నిశ్చయముగా అల్లాహ్ ప్రసాదించిన ఆహారమును అత్యాశపరుని ఆశ పొందలేదు. ఇష్టపడని వారి అయిష్టత దానిని ఆపలేదు.” 

                      ఆయిషా రదియల్లాహు అన్హా ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధముగా ప్రబోధించెను: “ఎవరైతే ప్రజలను అయిష్టపరచి అయినా అల్లాహ్ ను ఇష్టపరచిన ఎడల అల్లాహ్ దానిని స్వీకరించును. ప్రజలను కూడా ఈ విషయములో ఇష్టపడు నట్లు చేయును. కాని ఎవరైతే అల్లాహ్ ను అయిష్టపరచి ప్రజలను ఇష్టపరచదలచుకుంటే అల్లాహ్ అతనిని నిరాకరించి ప్రజలను కూడా అతనితో అయిష్టపడునట్లు చేయును.” (దీనిని ఇబ్నె హిబ్బాన్ సహీలో పొందుపరచెను.) 

                      దీనిలో 8 ప్రకరణములు కలవు 

                      1. వాక్యము (3:175) భావము (ఒక్క అల్లాహ్ కే భయపడవలెనని) తెలుపబడెను. 

                      2. వాక్యము (9:18) యొక్క భావము (అల్లాహ్ మసీద్ సేవకుల గురించి) తెలుపడెను. 

                      3. వాక్యము (29:10) భావము (విశ్వాసము క్షీణించిన వారి గురించిన) తెలుపబడెను. 

                      4. విశ్వాసములో క్షీణత, పెరుగుదల కలదు. 

                      5. విశ్వాసము క్షీణించినటువంటి ఉదాహరణములు తెలుపబడెను. 

                      6. ఒక్క అల్లాహ్ భయపడుట ఇస్లాం విధులలో ఒకటి. 

                      7. ఒక్క అల్లాహ్ భయపడువాని యొక్క పుణ్యము తెలుపబడెను. 

                      8. ఎవరైతే ఒక్క అల్లాహ్ కే కాకుండా ఇతరులకు కూడా భయపడతాడో అతని శిక్ష తెలుపబడెను. 

                      పాఠము – 33 : ఒక్క అల్లాహ్ నే నమ్ముకోవలెను 


                      ఖుర్ఆన్ లో అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను: 

                      وَعَلَى اللهِ فَتَوَكَّلُوا إِن كُنْتُمْ مُؤْمِنِينَ 

                      “మీరు నిజంగా విశ్వసించిన వారైతే ఒక్క అల్లాహ్న నమ్ముకోండి.” (5:23) 

                      إنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ إِذَا ذُكِرَ اللهُ وَجِلَتْ قُلُوبُهُمْ وَإِذَا تُلِيَتْ 

                      عَلَيْهِمْ أَيْتُهُ زَادَتْهُمْ إِيمَانًا وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ 

                      “అల్లాహ్ ను ప్రస్తావించినప్పుడు నిజమైన విశ్వాసుల హృదయాలు కంపిం చును. వారి సమక్షములో అల్లాహ్ ఆయత్లు పఠించినప్పుడు వారి విశ్వాసము పెరుగును. వారు తమ ప్రభువు పట్ల నమ్మకము కలిగి ఉంటారు.” (8:02) 

                      يَايُّهَا النَّبِيُّ حَسُبُكَ اللهُ وَمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ 

                      “ఓ ప్రవక్తా! నీకు, నిన్ను అనుసరిస్తున్న విశ్వాసులకు అల్లాహే చాలు.” (8:64) 

                      وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ. 

                      “ఎవరైతే అల్లాహ్ ను  నమ్ముకుంటారో వారికి అల్లాహ్ యే చాలును.” (65:03) 

                      హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు మా) ఈ విధముగా తెలిపెను: ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాంను అగ్నిలో వేసినప్పుడు ఆయన ఇలా అన్నారు: 

                      حسبنا الله ونعم الوكيل 

                      “నాకు అల్లాహ్ యే చాలును. ఆయనే ఉత్తమ కార్యసాధకుడు.” అదే విధముగా ప్రజలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో, “అవిశ్వాసులు మీపై దండయాత్రకు సైన్యము సమకూర్చుకొనిరి “మీరు వారికి భయపడండి అని చెప్పారు. కాని ఆ సమయంలో ప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం)  వారితో తలపడి నప్పుడు ఆయన విశ్వాసము ఇంకా పెరిగి ఆయన ఇలా అన్నారు: 

                      حَسبُنَا الله ونعم الوكيل 

                      “మాకు అల్లాహ్ యే చాలును. ఆయనే ఉత్తమ కార్యసాధకుడు” (3:173) 

                      దీనిలో 6 ప్రకరణములు కలవు 

                      1. ఒక్క అల్లాహ్ నే నమ్ముకొనుట ఇస్లాం విధి. 

                      2. ఇది విశ్వాస నిబంధన. 

                      3. వాక్యము (8:2) భావము (విశ్వసించిన వారి గుణములు) తెలుప బడెను. 

                      4. “వారు తమ ప్రభువు పట్ల నమ్మకము కలిగి ఉంటారు”కు భావము విశదీకరించబడెను. 

                      5. వాక్యము (65:3) భావము (అల్లాహ్న నమ్ముకొనువారికి అల్లాహ్ యే చాలును.) 

                      6. వాక్యము (నాకు అల్లాహ్ యే చాలును. ఆయనే ఉత్తమ నేర్పరి)కు గల ప్రాముఖ్యత తెలుపబడెను. అల్లాహు ఇద్దరు స్నేహితులు. ఇబ్రాహీమ్ (అలై), ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) .

                      పాఠము 34 : అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందడం, అల్లాహ్ ఎత్తుగడ పట్ల నిర్భయంగా ఉండటం గురించి

                      ఖుర్ఆన్ అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను: 

                      آقا مِنُوا مَكَرَ اللهِ فَلَا يَأْمَنُ مَكَرَ اللهِ إِلَّا القَوْمُ الخَيرُونَ 

                      “ఏమిటి మీరు అల్లాహ్ వ్యూహాల పట్ల నిర్భయముగా ఉన్నారా? నిశ్చయముగా నాశనం కాబోయే వారు మాత్రమే అల్లాహ్ వ్యూహాలపట్ల నిర్భయముగా  ఉంటారు.” (7:99) 

                      قَالَ وَمَنْ يَقْنَطُ مِن رَّحْمَةِ رَبَّةٍ إِلا الضَّالُونَ : 

                      “మార్గభ్రష్టులే తమ ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు.” (15:56) 

                      హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు మా) ఈ విధముగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను ఘోర పాపములు ఏమిటని ప్రశ్నించగా ఆయన ఈ విధముగా తెలిపెను: “అల్లాహ్ పట్ల ఘోర షిర్క్ కు పాల్పడుట. అల్లాహ్ కారుణ్యము పట్ల నిరాశ చెందుట. అల్లాహ్ ఉపాయములంటే నిర్భయముగా ఉండుట.” 

                      హజరత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ఘోర పాపములు: అల్లాహు కు భాగస్వాములను కల్పించుట, అల్లాహ్ వ్యూహాల పట్ల నిర్భయముగా ఉండుట, అల్లాహ్ దయాకారుణ్యాల పట్ల నిరాశ చెందుట.  (దీనిని అబ్దుర్రజాక్ పొందుపరచెను) 

                      దీనిలో 4 ప్రకరణములు కలవు 

                      1. వాక్యము (7:99) భావము (అల్లాహ్ యొక్క ఉపాయముల పట్ల నిర్భయముగా ఉండకూడదని) తెలుపబడెను.  

                      2. వాక్యము (15:56) భావము (మార్గభ్రష్టులే అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశచెందుతారు) అని తెలుపబడెను. 

                      3. అల్లాహ్ వ్యూహాలకు నిర్భయముగా ఉన్నవారు భయభ్రాంతులకు గురి అవుతారు.

                      4. అల్లాహ్ కారుణ్యానికి నిరాశ చెందిన వారు కూడా భయభ్రాంతులకు గురిఅవుతారు.  

                      పాఠము  35 : అల్లాహ్ నిర్ణయించిన విధిపై సహనం – ఈమాన్ లోని అంతర్భాగమే

                      అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉపదేశించెను. 

                      مَا أَصَابَ مِن مُّصِيبَةٍ إِلَّا بِإِذْنِ اللَّهِ ۗ وَمَن يُؤْمِن بِاللَّهِ يَهْدِ قَلْبَهُ ۚ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ

                      “అల్లాహ్ అనుమతి లేనిదే ఏ ఆపదా రాదు. ఎవడు అల్లాహ్ ను విశ్వసిస్తాడో అతని హృదయానికి అల్లాహ్ (సరైన దిశలో) మార్గదర్శకత్వం వహిస్తాడు. అల్లాహ్ అన్ని విషయాలూ తెలిసినవాడు.” (64:11) 

                      హజరత్ అల్ ఖమా (రదియల్లాహు అన్హు) ఈ విధముగా విశదీకరిం చిరి: “దీని అర్థం ఏ వ్యక్తికైన కష్టము కలిగినప్పుడు అతడు ఇది అల్లాహ్ (తీర్పు) ఉపాయమని గ్రహించి దానిని సమ్మతించి మనస్సుతో అంగీకరిస్తాడు.” 

                      హజరత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ప్రవక్త బోధనను ఈ విధముగా ఉల్లేఖించెను “ప్రజలలో ధిక్కరించే రెండు అలవాట్లు కలవు. వంశములను ఎత్తిపొడుచుట, మరణించినప్పుడు బిగ్గరగా ఏడ్చుట.” (ముస్లిం) 

                      హజరత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్షు) ప్రవక్త బోధనను ఈ విధముగా ఉల్లేఖించెను: “కష్ట సమయములలో తమను తాము హింసించు కొనువారు, బట్టలు చించుకొనువారు, అజ్ఞానపు మాటలు పలుకు వారు, మాలోని వారు కారు.” (బుఖారీ, ముస్లిం) 

                      హజరత్ అనస్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  బోధనను ఈ విధముగా ఉల్లేఖించిరి (తిర్మిజీ, హాకిం, తబ్రాని) “అల్లాహ్ తన దాసునికి మంచి చేకూర్చదల్చుకుంటే అతని పాపములకు ఇహలోకములోనే శిక్ష విధిస్తాడు, ఏ దాసునికి కీడు చేయదలచుకున్నాడో అతని పాపముల శిక్షను నిలిపివేస్తాడు. చివరికి ప్రళయ దినం రోజు అతని పాపములకు పూర్తి లెక్క కడతాడు.’ 

                      ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ఉపదేశిం చెను: “పెద్ద పరీక్ష, పెద్ద బహుమానము ఉండును. అల్లాహ్ ఏదైనా జాతిని ప్రేమించిన ఎడల వారిని పరీక్షించును. ఎవరైతే ఆ పరీక్షకు సమ్మతించునో అల్లాహ్ అతనిని అంగీకరిస్తాడు. ఎవరైతే ఈ పరీక్షకు సమ్మతించరో అల్లాహ్ వారిని నిరాకరిస్తాడు. ” (హసన్, తిర్మిజీ) 

                      దీనిలో 11 ప్రకరణములు కలవు 

                      1. వాక్యము (64:11) భావము (అల్లాహ్ విశ్వసించిన వారి హృదయానికి మార్గదర్శకత్వం ప్రసాదించును.) 

                      2. అల్లాహ్ విధించిన విధిపై ఓర్పు వహించుట అల్లాహ్ ను విశ్వసించుట లో భాగము. 

                      3. ఎవరి వంశమునైన ఎత్తిపొడుచుట ఇస్లాంను ఉల్లంఘించినట్లే.

                      4. కష్ట సమయములలో ఓర్పు వహించక హింసించుకొనుట, బట్టలు చించుకొనుట, అజ్ఞాన కాలమునాటి పలుకులు పలుకువారు హెచ్చరించబడును. 

                      5. అల్లాహ్ తన దాసుని మంచి కోరును. 

                      6. ఎవరినైతే శిక్షించునో వారి గురించి తెలుపబడినది. 

                      7. అల్లాహ్ ఎవరిని ప్రేమించునో వారి గురించి తెలుపబడినది. 

                      8. అల్లాహ్ విధిపై అసంతృప్తి చెందుట నిషేధించబడినది. 

                      9. పరీక్ష సమయములలో సమ్మతించుటలో చాలా పుణ్యము కలదు. 

                      పాఠము- 36 : ప్రదర్శనా బుద్ధితో చేయు సత్కార్యాలు షిర్కే 


                      ఖుర్ఆన్ అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను:

                      قُلْ إِنَّمَا أَنَا بَشَرٌ مِّثْلُكُمْ يُوحَىٰ إِلَيَّ أَنَّمَا إِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ ۖ فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا

                      (ప్రవక్తా! ఇలా చెప్పండి: “నేను మీలాంటి మానవమాత్రుణ్ణే, నాకు వహీ ద్వారా ఇలా తెలుపబడింది. ‘మీ ఆరాధనలకు అర్హుడు కేవలం ఒకే ఒక్కడు. కనుక తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి, ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ చేర్చకూడదు”) (18:110) 

                      హదీసే ఖుద్సీలో హజరత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: 

                      ఎవరినైతే నాకు భాగస్వాములుగా చేస్తున్నారో నేను ఆ భాగస్వాములందరి నిరపేక్షాపరుణ్ణి. ఎవరైతే ఏదైనా కార్యము చేస్తూ అందులో మరెవరినైనా భాగస్వామిగా చేర్చితే నేను అతనిని, నాకు ఎవరినైతే భాగస్వామిగా నియమించాడో అతనికి ఆ కార్యాన్ని వదలి వేస్తాను (నాకు ఎటువంటి సంబంధము లేదు). 

                      హజరత్ అబూ సయీద్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రంబోధించెను: “నేను మీకు మసీహుద్దజ్జాల్ పీడ కంటే ఎక్కువ పీడ కలిగించే విషయము తెలుపనా?” తప్పక తెలుపండి ప్రవక్తా అని అనుచరులు జవాబు పలికారు, అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా పలికెను: ‘షిర్కె ఖఫీ’. ఎవరైనా నమాజు చదువు చున్నప్పుడు తమ నమాజును ఇతరులకు చూపుటకు మంచిగా ఆచరించుట. 

                      దీనిలో 6 ప్రకరణములు కలవు 

                      1. వాక్యము (18:110) భావము (అల్లాహ్ ను కలియుటకు సత్కార్య ములు చేయవలెను. అల్లాహు సాటిగాని, భాగస్వాములనుగాని కల్పించి ఉండకూడదు అని) తెలుపబడెను. 

                      2. సత్కార్యములు అల్లాహ్ తోపాటు ఇతరుల కొరకు కొంచెం చేసినా, అది స్వీకరించబడదు. 

                      3. ఏదైనా కార్యములో అల్లాహ్ కు భాగస్వాములను కల్పించుటతో అది కారణము అల్లాహ్ ఈ కార్యమును అసలు నిరాకరించబడుటకు అంగీకరించడు. 

                      4. అల్లాహ్ కు భాగస్వాములను కల్పించబడిన కార్యములు నిరాకరించ బడుటకు వేరొక కారణము, అల్లాహ్ వారు కల్పించిన భాగస్వాముల బలహీనతలకు అతీతుడు. 

                      5. ప్రవక్త, అనుచరుల విషయములో “ప్రజలకు చూపుటకు చేయు సత్కార్యముల” గురించి కలత చెందెడివారు. 

                      6. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ప్రదర్శనా బుద్ధితో చేయు సత్కార్యముల గురించి ఈ విధముగా తెలిపెను. ఒక వ్యక్తి నమాజును అల్లాహ్ కొరకు ఆచరిస్తూ ఎవరైనా చూస్తుంటే, నమాజును బాగా ఆచరిం చిన ఎడల అది ‘రియాకారి’ ప్రదర్శన అగును.  

                      పాఠము – 37 : ఇహలోక లబ్దికి చేయు సత్కార్యములు కూడా ‘షిర్క్’ లాంటివి 

                      ن كَانَ يُرِيدُ الحَياةَ الدُّنْيَا وَزِينَتَهَا نُوَقِ اِلَيْهِمْ اَعْمَا لَهُمُ 

                      مَنْ بهَا وَهُمْ فِيهَا لَا يُبْخَسُونَ ) أو لَيْكَ الَّذِينَ لَيْسَ لَهُمْ فِي الأخرة إِلا النَّارُ وَحَبِطَ مَا صَنَعُوا فِيهَا وَيُطِل مَا كَانُوا 

                      يعملون 

                      “కేవలం ఈ ప్రాపంచిక జీవితాన్ని, దాని ఆకర్షణలను కోరుకొనేవారు చేసిన కార్యములకు పూర్తి ప్రతిఫలాన్ని మేము వారికి ఇక్కడే ఇచ్చివేశాము. అందులో వారికి తగ్గించడమనేది జరుగదు. కాని పరలోకములో వారికి అగ్ని తప్ప మరేమీ ఉండదు. వారు ప్రపంచంలో చేసినదంతా వ్యర్ధము. సత్కార్యములన్నీ నాశనం అగును.” (11:15-16) 

                      హజరత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధించిన హదీసును ఈ విధముగా ఉల్లేఖించారు: 

                      “డబ్బు దాసుడు నాశనం అగును. బట్టల దాసుడు నాశనం అగును. అతనికి ఇవి లభించిన ఎడల సంతోషించును. లభించని ఎడల అసంతృప్తి చెందును. అతడు నాశనం అయ్యెను. బెంగపడిన వాడయ్యెను. అతనికి గ్రుచ్చుకొన్న ముల్లు కూడా తీయజాలదు. “ఎవరయితే గుర్రం కళ్లెం పట్టుకొని అల్లాహ్ మార్గంలో బయలుదేరాడో, ఎవరి తల మాసి వుంటుందో, కాళ్లు దుమ్ము కొట్టుకొని ఉంటాయో వారికి శుభవార్త. వారిని సైన్యం ముందు పంక్తుల్లో నిలబెడితే, అలాగే నిలబడతాడు. వెనుక పంక్తుల్లో నిలబెడితే, వెనుకే నిలబెడతాడు. అతను అనుమతి కోరినా అతనికి ఆ అనుమతి లభించదు. అతను ఎవరి గురించి అయినా సిఫారసు చేస్తే ఆ సిఫారసూ స్వీకరించబడదు.” 

                      దీనిలో 7 ప్రకరణములు కలవు 

                      1. మానవుడు, పరలోకము కన్న ఇహలోకానికి ప్రాముఖ్యత నిచ్చుట నివారించబడినది

                      2. వాక్యము (11:15-16) భావము (కేవలం ఇహలోకము కోరుకునే వారికి పరలోకంలో స్థానము లేదు అని) స్పష్టంగా తెలియచేయబడింది.  

                      3. దీనిలో ఒక ముస్లింను డబ్బు దాసునిగా పేర్కొనుట గమనార్హము.

                      4. అతనికి ఇవ్వబడినప్పుడు సంతోషించును. లేనిచో అసంతృప్తి చెందును. 

                      5. అతడే నాశనమగును. భంగపడునని శపించటము జరిగింది. 

                      6. అతనికి ఎవరూ సహాయపడలేరు (అతనికి ముల్లు గ్రుచ్చుకొన్నా ఎవరూ తీయలేరు). 

                      7. అల్లాహ్ మార్గమున ఎంతటి కష్టములనైనను భరించి, తన కర్తవ్యమును నెరవేర్చువాడు ప్రశంసించబడును.

                      పాఠము-38 : అల్లాహ్ చే పవిత్రము అనబడిన వాటిని నిషేధించుట మత గురువులను ప్రభువుగా చేసుకొనుట 

                      హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు మా) ఈ విధముగా పేర్కొన్నారు: “మీ పై రాళ్ళ వర్షం కురిసే సమయం ఆసన్నమైనది. నేను మీకు ప్రవక్త ప్రబోధనలు వినిపించుచున్నాను. మీరే దానికి వ్యతిరేకంగా అబూ బకర్, ఉమర్ (రదియల్లాహు అన్హు) గారు చెప్తున్నారు అని పలుకుతున్నారు.” 

                      ఇమాం అహ్మద్ బిన్ హంబల్ (రహమతుల్లాహ్ అలైహ్) ఈ విధముగా తెలిపారు: “నాకు వారిపై ఆశ్చర్యము కలుగుచున్నది.” హదీసు ఆధారము నిజమైనదని తెలిసి కూడా సుఘ్యాన్ సౌరి యొక్క అభిప్రాయముపై నడుచు చున్నారు. అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను: 

                      فَلْيَحْذَرِ الَّذِينَ يُخَالِفُونَ عَنْ أَمْرة 

                      أن تَصِيبَهُم فِتْنَةٌ أو يُصِيبَهُمْ عَذَابٌ اليمن 

                      “దైవప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించువారు తాము ఏవైనా బాధల్లో చిక్కుకుపోతామే మోనని, ఏదైనా శిక్ష అవతరిస్తుందేమోనని భయపడవలెను.” (24:63) 

                      “ఫిత్నా” అంటే తెలుసా? షిర్క్. ఎవరైతే ప్రవక్త మాటలను ఉల్లంఘించునో అతని మనస్సులో దుష్టము రేగుట వలన అతడు నాశనమైపోవును. 

                      హజరత్ అదీ బిన్ హాతిం (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ వాక్యము పఠించుచున్నప్పుడు విన్నారు: 

                      “వారు అల్లాహ్ ని కాదని తమ పండితులను, తమ సన్యాసులను తమ ప్రభువుగా చేసుకున్నారు. మరియమ్ కుమారుడు మసీహ్ (అలైహిస్సలాం) ను కూడా! వాస్తవానికి ఒకే దేవుడిని తప్ప మరెవరి దాస్యాన్ని చేసే ఆజ్ఞ వారికి ఇవ్వబడలేదు. అల్లాహ్ తప్ప ఆరాధనకు ఎవ్వరూ అర్హులుకారు. ఆయన పరిశుద్ధుడు. వారు కల్పించు భాగస్వాములకు అతీతుడు.” (9:31) 

                      ఈ ఆయతులు విని నేను “మేము పండితులు, సన్యాసులను ఆరాధించేవారము కాదు” అన్నాను. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా జవాబు పలికెను. “మీరు అల్లాహ్ హలాల్ చేసిన వాటిని వారి మాటలపై నిషేధించలేదా? అల్లాహ్ నిషేధించిన వాటిని వారి మాటలపై హలాల్ చేసుకో లేదా?” అప్పుడు ఆయన “అవును” అని పలికిరి. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ‘ఇదే వారిని ఆరాధించుట’ అని పలికారు. (మస్నద్ అహ్మద్, సునన్ తిర్మిజ) 

                      దీనిలో 5 ప్రకరణములు కలవు 

                      1. వాక్యము (24:63) భావము (ప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించిన వారు భయపడవలెను) తెలుపబడెను. 

                      2. వాక్యము (9:31) భావము (దానిలో పండితులను, సన్యాసులను ప్రభువుగా చేసుకొనుట గురించి) తెలిపెను. 

                      3. “ఆరాధన అంటే ఒక్క ప్రార్థనయే కాదు. ఆరాధన అంటే విధేయత చూపుట, ఆజ్ఞలను పాటించుట” అని హజరత్ హాతిం (రదియల్లాహు అన్షు) హదీసులో తెలుపబడింది. 

                      4. ప్రవక్త ప్రవచనమునకు వ్యతిరేకముగా ఎవరి ప్రవచనమూ ఆమోద యోగ్యము కాదని స్పష్టపరచబడెను. హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు), హజరత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు), హజరత్ ఉమర్ (రదియల్లాహు అన్హు), ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) మరియు సుఫ్యాన్ సౌరి పేర్లను ప్రస్తావించుటను నిరాకరించెను. 

                      5. ప్రస్తుత కాలములో ప్రజలు తమ పండితుల ఆరాధనను అన్నింటికంటే ఉత్తమమైన సత్కార్యమని భ్రమలో పడివున్నారు. దీనిని విలాయత్ (పూచి) అనబడుతుంది. అదే విధముగా విద్య, శాస్త్రజ్ఞుల పేరుతో విద్యావంతు లను కూడా ఆరాధించుచున్నారు. చివరికి వ్యవహారం చెడి అవిద్యా వంతుల ఆరాధన కూడా జరుగుచున్నది. వీటన్నింటి నుండి వారించబడినది. ఇవన్నీ షిర్క్ పనులే. 

                      పాఠము 39 : ‘విశ్వసించితిమి’ అను వారి వాస్తవము 

                      అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉపదేశించెను: 

                      الم تَرَ إِلَى الَّذِينَ يَزْعُمُونَ أَنَّهُمْ أمَنُوا بِمَا أُنْزِلَ إِلَيْكَ وَمَا أُنْزِلَ مِن قَبْلِكَ يُرِيدُونَ أَن يَتَحَاكَمُوا إلى الطَّاغُوتِ وَقَدْ أمِرُوا أَن تَكْفُرُوا بِه . وَيُرِيدُ الشَّيْطنُ اَنْ يُضِلَهُمْ ضَللًا بَعِيدًا وَإِذَا قِيلَ لَهُمْ تعالوا إلى مَا أَنْزَلَ اللهُ وَإِلَى الرَّسُولِ رَأَيْتَ الْمُنْفِقِينَ يَصُدُّونَ عَنْكَ صدُودًا نَ فَكَيْفَ إِذَا اَصَابَتْهُمْ مُصِيبَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ثُمَّ 

                      جَاءُوكَ يَحْلِفُونَ باللهِ اِنْ اَرَدْنَا إِلا إِحْسَانًا وَتَوْفِيقات 

                      …..వాదన అయితే చేసి తమ వ్యవహారముల పరిష్కారము కొరకు ‘తాగూత్’ వద్దకు పోవాలని కోరుకునేవారిని నీవు చూడలేదా? వాస్తవానికి, వారికి తాగూత్ను తిరస్కరించమని ఆదేశించబడింది. షైతాన్ వారిని పెడదోవ పట్టించి సన్మార్గమునకు బహుదూరముగా తీసుకుపోవాలని చూస్తున్నాడు. “అల్లాహ్ అవతరింపజేసిన దాని (ఖుర్ఆన్) వైపునకు రండి. ప్రవక్త వైపునకు రండి” అని చెప్పినప్పుడు, ఈ కపటులు నీ వైపునకు రాకుండా తప్పించుకుపోవడాన్ని నీవు చూస్తావు. కాని వారు తమపై తెప్పించుకున్న ఆపద వారిపై వచ్చినప్పుడు వారు నీ వద్దకు ప్రమాణాలు చేస్తూ వస్తారు. దేవుని సాక్షిగా మంచినే కాంక్షించాము. వారిని రాజీవరచుటకు ఉద్దేశించాము అని పలుకుదురు. (4:60-61) 

                      “భూమిపై అశాంతి, సంక్షోభము కలిగించకండి” అని వారితో పలికినప్పు డల్లా వారు “మేము సంస్కర్తలము మాత్రమే” అని పలికెదరు. 

                      “భూమిపై సంస్కరణ జరిగిన తరువాత దానిపై సంక్షోభాన్ని, సృష్టించ కండి. భయంతోను, ఆశతోనూ ఆయననే వేడుకోండి. నిశ్చయముగా అల్లాహ్ కారుణ్యం ఉదారబుద్ధిగలవారి సమీపమున కలదు.” (7-57) 

                      افحكم الجَاهِلِيَّةِ يَبْغُونَ ، وَمَنْ اَحْسَنُ من الله حُكْنَا القَوْم يُوقِنُونَ : 

                      “(వారు అల్లాహ్ శాసనానికి విముఖులై) అజ్ఞానపు తీర్పు కావాలని కోరుకుంటున్నారా? కాని అల్లాహ్ పై నమ్మకము గలవారి దృష్టిలో అల్లాహ్ కంటే ఉత్తమమైన తీర్పు చేయగలవారెవ్వరూ లేరు.” (5-50) 

                      హజరత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హుమా) ఈ విధముగా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ప్రబోధించారు: “మీలో నాకు ప్రసాదించబడిన ఈ ధర్మశాస్త్రము లోబడి ఉండుటలో (తమ కోరికలన్నీ) వారు విశ్వాసులు కాజాలరు.” ( ఇమాం నవవీ దీనికి కితాబుల్ హజ్ సహీ సనద్ తో పొందుపరచెను.) 

                      షాబి (రహిమహుల్లాహ్)  ఈ విధముగా తెలిపెను: ఒక కపటుడు, ఒక యూదుని మధ్య వివాదము ఏర్పడెను. యూదులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లంచం తీసుకోరు కాబట్టి ఆయన దగ్గర ఈ సమస్య తీర్పు కోరెదము అని పలికెను. కాని ఈ కపటుడు, కాదు, మనము ఈ సమస్య తీర్పు కొరకు ఒక యూదుని వద్దకు పోవుదుము అని పలికెను. అతనికి యూదుని వద్ద లంచముతో పని జరుగునని తెలుసును. చివరికి వారిద్దరు జుహైనా సంతతికి చెందిన ఒక కాహిన్ (గుప్తవిద్యావాదులు) వద్ద ఆ సమస్యకు తీర్ప కోరెదమనిరి. అప్పుడు ఈ వాక్యము (4:60) అవతరింపబడెను. 

                      కొంతమంది విద్యావేత్తలు ఈ విధముగా తెలిపిరి: “ఇద్దరి మధ్య ఒక విషయములో విభేదము ఏర్పడెను. అప్పుడు ఒక వ్యక్తి ప్రవక్త దగ్గరకు ఈ సమస్యకు తీర్పు కోరుదుమని పలికెను. కాని వేరే వ్యక్తి కాబ్ బిన్ అషరఫ్ వద్దకు పోవుదుమని పలికెను. చివరికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  దగ్గర తీర్పు కోరబడెను. ప్రవక్త తీర్పు ఇచ్చిన తరువాత మరల ఉమర్ (రదియల్లాహు అన్హు) దగ్గరకు తీర్పు కొరకు తీసుకొని వెళ్ళెను. అప్పుడు ఆ వ్యక్తి జరిగినదంతా తెలిపి ప్రవక్త తన పక్షములో తీర్పు ఇచ్చెనని తెలిపెను. అప్పుడు ఉమర్ (రదియల్లాహు అన్హు) రెండవ వ్యక్తిని నిజమేనా అని అడిగినప్పుడు అతడు నిజమేనని తెలిపెను. అంతటితో ఉమర్ (రదియల్లాహు అన్హు) అతడిని అంతమొందించెను. అప్పుడు ఈ వాక్యము (4:60) అవతరించబడెను. 

                      దీనిలో 8 ప్రకరణములు కలవు 

                      1. వాక్యము (4:60) భావము మరియు తాగూత్ గురించి విశదీకరించ 

                      2. వాక్యము (2:11) భావము (సంక్షోభములు సృష్టించువారు తమను సంస్కర్తలు అని పలుకుదురు). 

                      3. వాక్యము (7-56) భావము (భూమిపై అల్లరి సృష్టించుట నివారించ బడెను). 

                      4. వాక్యము (5:50) భావము (అల్లాహ్ ను మించిన ఉత్తమ తీర్పు నిచ్చువాడు ఎవ్వరూ లేరు). 

                      5. వాక్యము (4-60)పై షాబీ (రహమతుల్లాహ్ అలై)ల విశదీకరణ తెలుపబడెను. 

                      6. స్వచ్ఛమైన విశ్వాసము, కపట విశ్వాసము గురించి తెలుపబడెను. 

                      7. కపటులతో హజరత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) నడవడిక తెలుప 

                      8. తన కోరికలు ఇస్లాం ధర్మశాస్త్రమునకు లోబడి లేని పక్షంలో అతడు విశ్వాసి కాజాలడు అని స్పష్టపరచబడెను. 

                      పాఠము 40 : అల్లాహ్ నామములలో, గుణగణాలలో కొన్నింటిని తిరస్కరించటం 

                      అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉపదేశించెను: 

                      وَهُمْ يَكْفُرُونَ بِالرَّحْمَنِ، قُلْ هُوَ رَى لَا اله إلا هُوَة عَلَيْهِ تَوَكَّلْتُ وَإِلَيْهِ مَتَابٍ . 

                      “వారు రహమాన్ (కరుణామయుడు)ని తిరస్కరించారు. వారితో ఇలా పలుకుము: ఆయనే(రహ్మన్) నా ప్రభువు. ఆయన తప్ప మరే దేవుడూలేడు. ఆయననే నేను నమ్ముకున్నాను. ఆయనే నాకు ఏకైక ఆశ్రయం.” (13:30) 

                      హజరత్ అలీ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉద్బోధించారు: “ప్రజలకు వారు అర్థం చేసుకొనే విషయాలు మాత్రమే తెలుపండి. (వారికి అర్థం కాని విషయాలను తెలిపి) వారు అల్లాహ్ ప్రవక్తను తిరస్కరించవలెనని మీరు ఆశించుచున్నారా?” (బుఖారి) 

                      ఇమామ్ అబ్దుల్ రజాక్, మఅమర్ నుండి, ఆయన ఇబ్నె తావూస్ నుండి, ఆయన తండ్రి తావూస్ నుండి ఈ విధముగా ఉల్లేఖించెను: హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు మా) ఉల్లేఖనం: “ఒక వ్యక్తి అల్లాహ్ స్వభావమును గురించి ఒక హదీసు తెలుసుకొని చికాకుపడ్డాడు. అతనికి ఆ హదీసు నచ్చలేదు.” ఇది చూసి ఈ విధముగా తెలిపిరి: వీరి భయము విచిత్రమైనది. దృఢమైన స్పష్టమైన అల్లాహ్ వాక్యములు విన్నప్పుడు వీరిపై దుఃఖము తారసిల్లును. బహులార్థముగల వాక్యములు విని తిరస్కరించి) నాశనమగుదురు. (ముస్నద్ అబ్దురజ్జాఖ్). ఖురైష్ వంశస్థులు ప్రవక్త నోటి నుండి రహమాన్ (కరుణా మయుడు) అని విని వారు దానిని తిరస్కరించిరి. అప్పుడు అల్లాహ్ వాక్యము (13:10) అవతరించెను ముస్నద్ రజ్జాక్. 

                      దీనిలో 5 ప్రకరణములు కలవు 

                      1. అల్లాహ్ నామములు లేదా స్వభావములను తిరస్కరించిన ఎడల విశ్వాసము కోల్పోవుదురు. 

                      2. వాక్యము (13:10) భావము (రహమాన్ గురించి) తెలుపబడెను. 

                      3. ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోలేని పక్షములో ఆ మాటను వదిలి వేయవలెను

                      4. ఏ మాట అయితే అల్లాహ్, ఆయన ప్రవక్తను తిరస్కరించినట్లు అగునో, అతని ఉద్దేశము తిరస్కరించుట కాకపోయినప్పటికీ అటువంటి మాటలకు దూరముగా ఉండవలెను. 

                      5. ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు మా తెలిపినట్లు ఎవరైనా అల్లాహ్ నామము లేదా స్వభావమును తిరస్కరించిన ఎడల అతడు నాశనం అయ్యే స్థితికి చేరును.

                      పాఠము 41 : అల్లాహ్ ప్రసాదించిన భాగ్యమును తిరస్కరించుట 

                      يَعْرِفُونَ نِعْمَتَ ٱللَّهِ ثُمَّ يُنكِرُونَهَا وَأَكْثَرُهُمُ ٱلْكَـٰفِرُونَ

                      వారు అల్లాహ్ యొక్క భాగ్యమును గుర్తించి కూడా తిరస్కరిస్తారు. వారిలో చాలా మంది కృతఘ్నులు” (16:83)

                      పై వాక్యము వివరణలో ముజాహిద్ (రహమతుల్లాహ్ అలైహ్) ఈ విధముగా విశదీకరించెను: 

                      “ఏ వ్యక్తి అయినా ఈ ధనము నా పిత్రార్జితము అని పలుకుట, అల్లాహ్ ప్రసాదించిన భాగ్యమును తిరస్కరించి నట్లు.” 

                      ఔన్ బిన్ అబ్దుల్లా ఇలా తెలిపెను: “ఫలానా వ్యక్తి లేకపోతే అలా జరిగేది’ అని పలుకుట. అల్లాహ్ భాగ్యమును తిరస్కరించుట. ఇబ్నె ఖుతేబా ఈ విధముగా తెలిపెను: “ఇది మా పూజితుల యోగ్యత చూపుట వలన లభించినది అని పలుకుట కూడా” ఈ వాక్యములో కూర్చబడినది. 

                      షేఖుల్ ఇస్లాం అబుల్ అబ్బాస్ ఇబ్నె తైమియా (రహమతుల్లాహ్ అలై) జైద్ బిన్ ఖాలిద్ జహనీ (రదియల్లాహు అన్హు) హదీసు “ఈ ఉదయం నా దాసులలో కొంతమంది నన్ను విశ్వసించినారు. కొంతమంది తిరస్క రించినవారాయెను” అని అల్లాహ్ తెలిపెను. (ఈ హదీసు ఇంతకు ముందు వివరించబడినది) తరువాత “ఎవరైతే అల్లాహ్ కృపాకారుణ్యాలను వేరే వారి వైపునకు అనుగుణ్యం చేస్తారో, అల్లాహ్ కు భాగ స్వాములను కల్పిస్తారో అటువంటివారిని అల్లాహ్ ఖుర్ఆన్లో, ప్రవక్త హదీసులో గట్టిగా వారించెను. 

                      ఈ విషయమును విశదీకరించుటకు పూర్వపు మత గురువులు (అస్లాఫ్) ఈ ఉదాహరణలు పేర్కొనిరి: “కొంతమంది గాలి బాగా వీచింది” అని పలుకు దురు. “నావికుడు మంచి ప్రావీణ్యుడు, నేర్పరి” అని చాలా మంది పలుకుదురు. ఇటువంటి పలుకుల వలన మనిషి సులభంగా షిర్క్ లోకి జారిపోతాడు. 

                      దీనిలో 4 అర్థ తాత్పర్యములు కలవు. 

                      1. అల్లాహ్ ప్రసాదించిన భాగ్యములను గుర్తించి, తిరస్కరించుట. 

                      2. అల్లాహ్ ప్రసాదించిన భాగ్యములను తిరస్కరించే పలుకులు ప్రజల వాడుకలో ఉన్నవి. 

                      3. అల్లాహ్ భాగ్యములను తిరస్కరించునట్లు చేయు పలుకులు తెలుప బడెను

                      4. ఒకే మనస్సులో అల్లాహ్ ప్రసాదించిన భాగ్యముల అంగీకారము, తిరస్కారము ఉన్నట్లు తెలుస్తుంది. 

                      పాఠము 42 : అల్లాహ్ కు భాగస్వాములను కల్పించే కొన్ని గుప్తరూపములు

                      అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉపదేశించెను;

                      فَلَا تَجْعَلُوا۟ لِلَّهِ أَندَادًۭا وَأَنتُمْ تَعْلَمُونَ

                      ఇక మీకు తెలిసినప్పుడు అల్లాహ్ కు సాటి కల్పించకండి.” (2:22) 

                      హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ వాక్యం తఫ్సీర్లో ఈ విధముగా తెలిపెను: “అన్-దాద్  అంటే భాగస్వాములను కల్పించుట” అని అర్థము. ఏదైతే చీకటి రాత్రిలో నల్లటి రాయిపై చీమ నడకకంటే గుప్తమైనది. భాగస్వాములను కల్పించుట అనేది ఈ విధముగా పలుకుట. “అల్లాహ్ యొక్క ప్రమాణము మరియు నీ జీవితముపై ప్రమాణము” లేదా ఇలా పలుకుట, “ఓ వ్యక్తి నా ప్రాణము యొక్క ప్రమాణము” లేదా ఇలా పలుకుట, “ఈ కుక్క లేనిచో మా ఇంటిలో దొంగలు పడేవారు” లేదా ఇలా పలుకుట, “అల్లాహ్ కోరుకున్నది, మీరు కోరుకున్నది” లేదా ఇలా పలుకుట “ఒకవేళ అల్లాహ్ లేకపోతే నీవులేవు” ఇటువంటి పలుకులలో అల్లాహ్ తోపాటు ఇతరులని చేర్చవద్దు. ఇవన్నీ అల్లాహ్ కు షిర్క్ వంటి మాటలు. (దీనిని ఇబ్నె అబీ హాతిం పొందుపరచెను) 

                      హజరత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త బోధనను ఈ విధముగా ఉల్లేఖించారు: 

                      “ఎవరైతే అల్లాహ్ పేరును తప్ప ఇతరుల ప్రమాణము చేయునో వాడు తిరస్కరించిన వాడయ్యెను. లేదా షిర్క్క పాల్పడినట్లు చేసెను. (దీనిని తిర్మిజీ పొందుపరచి హసన్ అని తెలిపెను. హాకిం సహీ అని తెలిపెను) 

                      హజరత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉద్బోధించారు: 

                      “నా వద్ద అల్లాహ్ కాక ఇతరులపై స్వచ్ఛమైన ప్రమాణము చేయుటకంటే అల్లాహ్ పై అసత్య ప్రమాణము చేయుట మేలు.” 

                      హజరత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధనను ఇలా తెలిపారు: 

                      “అల్లాహ్ కోరునది మరియు మీరు కోరునది” అని పలకవద్దు. కాని ఈ విధముగా పలకండి, “ముందు అల్లాహ్ కోరుకున్నది ఆ తరువాత మీరు కోరుకున్నది.” (అబూ దావూద్, సనద్ సహీ) 

                      ఇబ్రాహీం నఖయి ఈవిధముగా విశదీకరించారు: “అవూజు బిల్లాహి వబిక” అని పలకరాదు. 

                      “అవూజు బిల్లాహి సుమ్మబిక” అని పలకవచ్చును. అదే విధముగా “లవ్ లా  అల్లాహు సుమ్మ ఫలానున్” అని పలకవచ్చును. “లవ్ లా అల్లాహు వఫులానున్” అని పలకరాదు. 

                      దీనిలో 5 ప్రకరణములు కలవు 

                      1.  అన్-దాద్ గురించి (2:22) వాక్యము భావము విశదీకరించబడెను. 

                      2. ‘షిర్కె అక్బర్’ గురించి అవతరించబడిన వాక్యములను అనుచరులు ‘షిర్కె అస్గర్’కి కూడా వివరిస్తూ విశదీకరించేవారని స్పష్టమగుచున్నది. 

                      3. అల్లాహ్ పేరుపై తప్ప ఇతరులపై ప్రమాణము చేయుట షిర్క్. 

                      4. అల్లాహ్ పేరున కాకుండా ఇతరుల పేరున చేయు సత్యమైన ప్రమాణము, అల్లాహ్ పేరున చేయు అసత్య ప్రమాణము కంటే పెద్ద పాపము

                      5. వావ్ (మరియు), సుమ్మ (తర్వాత) అనే  పదములు అర్థములో చాలా వ్యత్యాసము కలదు

                      పాఠము 43 : అల్లాహ్ పై ప్రమాణముతో సంతృప్తి చెందనివాడు 

                      హజరత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు మా) ఈ విధముగా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించారు. 

                      “మీరు మీ తాతముత్తాతల పేర ప్రమాణములు చేయకండి. ఎవరైతే అల్లాహ్ పేరున ప్రమాణము చేయునో అతడు తప్పక సత్యము పలకవలెను. ఎవరి కొరకు అయితే అల్లాహ్ ప్రమాణము చేసెనో అతడు అంగీకారము తెలపడో అల్లాహు కు ఏ విధమైన సంబంధము లేదు.” (దీనిని ఇబ్నె మాజా హసన్ సనద్ పొందుపరచెను) 

                      దీనిలో 3 ప్రకరణములు కలవు 

                      1. తాతముత్తాతల పేర ప్రమాణము చేయుట నిషిద్ధము. 

                      2. ఎవరి కొరకు అయితే అల్లాహ్ పేరున ప్రమాణము చేయబడెనో అతడు అంగీకరించబడెను.

                      3. అల్లాహ్ పేరున ప్రమాణము చేసినప్పటికీ అంగీకరించని వారిని బెదిరింపబడెను. (జరగబోయే కీడు గురించి తెలుపబడెను.) 

                      పాఠము – 44 : అల్లాహ్ కోరినది మరియు మీరు కోరినది అని పలుకుట షిర్కే 

                      హజరత్ ఖుతైబ (రదియల్లాహు అన్హు)  ఈ విధముగా ఉల్లేఖించారు: ఒక యూదుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం దగ్గరకు వచ్చి ఈ విధముగా పలికెను: “మీరు (ముస్లింలు) అల్లాహ్ తో షిర్క్ కు పాల్పడు తున్నారు. అదెలాగంటే ఈ విధముగా పలుకుతారు” అల్లాహ్ కోరినది మరియు మీరు కోరినది, ఇంకా కాబా గృహము ప్రమాణము అని, దానికి జవాబుగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా ఆజ్ఞాపించెను: 

                      ప్రమాణము చేయదలచిన వారు కాబా గృహ ప్రమాణము చేయకండి. కాబా గృహము యొక్క ప్రభువు పేరిట ప్రమాణము చేయండి. “అల్లాహ్ కోరినది మరియు మీరు కోరునది అని పలక వద్దు. “అల్లాహ్ కోరునది ఆ తరువాత మీరు కోరునది అని పలకండి.” (దీనిని నసాయి సహీ సనత్తో పొందు పరచెను) 

                      నసాయిలో హజరత్ ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ఈ విధముగా ఉన్నది: ఒక వ్యక్తి ప్రవక్తకు ఈ విధముగా చెప్పెను: “అల్లాహ్ కోరునది మరియు మీరు కోరునది. అప్పుడు ప్రవక్త ఇలా పలికిరి. “ఏమిటి నీవు నన్ను అల్లాహ్ కు సమానంగా చేసితివా? ఈ విధముగా పలుకు, ఒక్కడైన అల్లాహ్ కోరినది” అని. 

                      హజరత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) సవతి సోదరుడు హజరత్ తుఫైల్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు: “నేను నా కలలో యూదుల సమూహంలో పోవుచున్నట్లు చూశాను. నేను వారితో ఇలా అన్నాను. మీరు గనుక హజరత్ ఉజైర్ (అలైహిస్సలాం) ని అల్లాహ్ కుమారుడని పలకనిచో మీరు చాలా మంచివారు. అప్పుడు వారు ఇలా అన్నారు: ‘మీరు కూడా మంచి వాళ్ళే అయి ఉండేవారు. మీరు అల్లాహ్ మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కోరునది” అని పలకనిచో.” తరువాత క్రైస్తవుల గుంపు పోవుచుండగా నేను ఈ విధముగా పలికితిని, “మీరు మంచివారు అయి ఉండే వారు, మసీహ్ (అలైహిస్సలాం)ని అల్లాహ్ కుమారుడని పలకనిచో.” అప్పుడు వారు “మీరు కూడా మంచి వాళ్ళేకాని మీరు అల్లాహ్ అనుకున్నది మరియు ప్రవక్త అనుకున్నది అని పలకనిచో.” ఉదయం నేను ఈ కలను కొంతమందికి తెలిపి తరువాత ప్రవక్త వద్దకు పోయి తెలిపాను. అప్పుడు ప్రవక్త నీవు ఈ కలను ఎవరికైనా తెలిపావా? అని ప్రశ్నించారు. నేను తెలిపానన్నాను. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  లేచి, అల్లాహ్ ను స్తుతించి, ఈ విధముగా ప్రబోధించిరి: “జుబైర్ చూసిన కల మీకు తెలిపెను. మీరు ఒక వాక్యం పలుకుచున్నారు. నేను మిమ్ములను ముందుగానే నివారించి ఉండవలసినది. ఎప్పుడూ మీరు అల్లాహ్ అనుకున్నది మరియు ప్రవక్త అనుకున్నది అని పలకవద్దు. కాని, ఒక్క అల్లాహ్ అనుకున్నది అని పలకండి.” 

                      దీనిలో 6 ప్రకరణములు కలవు 

                      1. యూదులకు ‘షిర్కె అస్గర్’ గురించి కూడా తెలుసును. 

                      2. మానవుడు తన ఇష్టానుసారంగా విషయాలను అర్థము చేసు కొనుటకు ప్రయత్నించును.

                      3. ఒక వ్యక్తి ప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం)  వద్ద “అల్లాహ్ ఇష్టం మరియు మీ యొక్క ఇష్టం” అని పలికినప్పుడు-ప్రవక్త అతనిని “నీవు నన్ను అల్లాహ్ కు సమానం చేస్తు న్నావా?” అని పలికిరి. ఇటువంటప్పుడు ఎవరైనా “ఓ ప్రవక్తా నీవు తప్ప నాకు శరణు ఇచ్చేవారు ఎవరూ లేరు” అను పలుకువారు ముష్రిక్కులు అగుటలో ఎటువంటి సందేహం లేదు. 

                      4. అల్లాహ్ ఇష్టం మరియు నీ ఇష్టం అనుట ‘షిర్కె అక్బర్’ కాదు. లేనిచో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముందే నివారించి యుండేవారు. 

                      5. మంచి కల కూడా అల్లాహ్ సూచన.

                      6. మంచి కల ఒక్కొక్కసారి చట్టములను ప్రతిబింబించును.

                      పాఠము 45 : కాలాన్ని దూషిస్తే అల్లాహ్ కు బాధ కలిగించినట్లే 

                      అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉపదేశించెను: 

                      وَقَالُوا مَا هِيَ الحَيَاتُنَا الدُّنْيَا نَمُوتُ وَنَحْيَا وَمَا يُهْلِكُنا إلا الدهرُه وَمَا لَهُمْ بِذلِكَ مِنْ عِلم، إن هُمْ إِلَّا يَظُنُّونَ : 

                      వారు ఇలా అటున్నారు:“మన జీవితం కేవలం ఈ ప్రాపంచిక జీవితమే. ఇక్కడే మన మరణం, ఇక్కడే మన జీవితం. మనలను నాశనం చేసేది కాలభ్రమణమే తప్ప మరేదీ కాదు. వాస్తవానికి వారి వద్ద ఈ విషయమునకు సంబంధించి జ్ఞానమేదీ. లేదు. కేవలం వారు తమ ఊహలకు లోనైయున్నారు. (45:24) 

                      అబూహురైరా (రదియల్లాహు అన్హు) హదీసె ఖుద్సీలో ఈ విధముగా ఉల్లేఖించెను: అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా ఉపదేశించెను: 

                      “ఆదం కుమారుడు కాలాన్ని దూషించి నాకు బాధ కలిగిస్తాడు. వాస్తవానికి నేనే కాలాన్ని సృష్టించాను. రాత్రింబవళ్ళను నేనే మార్చేవాడిని” (సహీ బుఖారి). వేరొక హదీసులో ఈ విధముగా పేర్కొనెను: “కాలమును చెడ్డది అని పలక వద్దు. అసలు కాలము అల్లాహ్ కొరకే.. 

                      దీనిలో 4 ప్రకరణములు కలవు

                      1. కాలాన్ని దూషించుట, చెడ్డది అనుట నిషేధించబడినది. 

                      2. కాలాన్ని చెడ్డది అని పలుకుట అల్లాహ్ ను బాధపెట్టుట అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  తెలిపారు. 

                      3. “ఫఇన్నల్లాహ హువద్దహర్” గురించి ఆలోచించవలెను. 

                      4. కొన్ని సమయాల్లో మానవుడు తనకు తెలియకుండానే కొన్ని తప్పులు పలుకుతుంటాడు. 

                      పాఠము 46 : ఎవరినైనా రాజాధి రాజు అని పిలుచుట 

                      హజరత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధనను ఈ విధముగా ఉల్లేఖించెను: “తనకు తాను రాజాధిరాజు అని పలుకువాడు అల్లాహ్ వద్ద అందరికంటే నీచుడు. వాస్తవానికి అల్లాహ్ తప్ప ఎవరూ రాజాధిరాజు లేడు” (బుఖారి). 

                      హజరత్ సుఫ్యన్ సౌరి “మాలికు అలముల్క్” యొక్క అర్థము రాజాధిరాజు అని తెలిపిరి. మరొక హదీసులో ఈ విధముగా తెలుపబడింది: “ప్రళయదినం నాడు అల్లాహ్ వద్ద అందరికంటే నీచుడు (దౌర్జన్యపరుడు) తనకు తాను రాజాధిరాజు అని చెప్పించుకున్నవాడు.” 

                      దీనిలో 4 ప్రకరణములు కలవు 

                      1. ఎవ్వరినీ రాజాధిరాజు అనకూడదు. 

                      2. ఇటువంటి గౌరవనామాలు, బిరుదులతో కూడా పిలుచుట నిషేధము. 

                      3. ఇటువంటి నామాలతో పదాలు ఎప్పుడూ వాడకుండా, అందరూ జాగ్రత్త పడవలెను. మనస్సులో స్వచ్ఛందంగా వాటి భావములు తెలియకుండా చేసినను ఈ పదాలు వాడుట నిరోధించబడెను. 

                      4. ఈ పదాలు అల్లాహ్ ఘనత, మహత్యమునకు మాత్రమే వాడుట సముచితము. 

                      పాఠము 47 : అల్లాహ్ నామాలను గౌరవించుట

                      అల్లాహ్ ను అగౌరవపరచే పేర్లు దాసులకు ఉంటే వాటిని మార్చవలెను. హజరత్ అబూ షురైహ్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ఆయనను ప్రజలు అబుల్ హకం అని పిలిచెడివారు. దానికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయనతో ఈ విధముగా పలికెను: “నిర్ణయించువాడు అల్లాహ్ యే, శాసనము కూడా ఆయనదే.” అప్పుడు అబూ షురైహ్ (రదియల్లాహు అన్హు) ఇలా పలికారు: “నా సంతతి వారు తమ విభేదముల పరిష్కారానికి నా వద్దకు వచ్చినప్పుడు నేను వారి మధ్య విభేదము లను పరిష్కరించినప్పుడు వారు అంతా అంగీకరించెదరు.” అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా తెలిపెను. “అది చాలా మంచి మాట. నీ సంతానములో ఎవరెవరు ఉన్నారు?” అని ప్రశ్నించిరి. అప్పుడు నేను “షురైహ్, ముస్లిం, అబ్దుల్లాహ్” అని తెలిపాను. ప్రవక్త పెద్ద కుమారుడెవరు అని అడిగెను. నేను “షురైహ్” అని తెలిపాను. అప్పుడు ప్రవక్త నన్ను “నీవు అబూ షురైహ్” అని (అబూదావూద్, ఇతరులు) పలికిరి. 

                      దీనిలో 3 ప్రకరణములు కలవు 

                      1. అల్లాహ్ నామములు మరియు స్వభావములను పూర్తిగా గౌరవించ వలెను. భావము తెలియకుండా ఇతరులకు ఆ పేర్లను వాడరాదు. 

                      2. అల్లాహ్ నామాల గౌరవార్థం షిర్క్క అనుగుణంగా ఉన్న పేర్లను మార్చి వేయవలెను. 

                      3. మారు పేరు (పిలువబడు పేరు) ‘కునియత్’ కొరకు పెద్ద కొడుకును ఎన్నుకొనుట. 

                      పాఠము 48 : అల్లాహ్ ను , ఖుర్ఆన్ ను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను హేళన చేసే వారి కొరకు శాసనము 

                      ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను: 

                      ولين سالَتَهُمْ لَيَقُولُنَ إِنَّمَا كُنَّا نَخُوضُ وَتَلْعَبُ ، قُلْ آبِ اللهِ وَايَتِهِ وَرَسُولِهِ كُنتُمْ تَسْتَهْزِرُونَ . 

                      (మీరు మాట్లాడుకుంటున్నదేమిటి?) అని ఒకవేళ వారిని అడిగితే “మేము సరదాగా వేళాకోళంగా మాట్లాడుకుంటున్నాము” అని పలుకుదురు. మీరు వారితో ఇలా పలకండి. “మీ వేళాకోళం అల్లాహ్ నా, ఆయత్లతోనా, ఆయన ప్రవక్తతోనా.’ (9:65) 

                      హజరత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ముహమ్మద్ బిన్ కాబ్, జైద్ బిన్ అస్లాం ఖతాదా (రహమతుల్లాహ్ అలైహి) ఈ విధముగా తెలిపారు:

                      తబూక్ యుద్ధ సందర్భంలో ఒక కపటుడు ఈ విధముగా పలికెను: “తిండికి ఎగబడువారు, అబద్ధము పలుకువారు, యుద్ధ సమయములో పిరికివారు ఈ విద్యావంతులను మించి మేము ఎవ్వరినీ చూడలేడు” అతడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  అనుచరుల వైపు సైగ చేసి ఇలా పలికెను. అప్పుడు ఔఫ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) అతడితో నీవు అబద్ధమాడు కపటుడవని పలికి, నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఈ మాటలు తెలిపెదనని బయలు దేరెను. కాని ఆయన చేరక ముందే ఈ విషయము ‘వహీ’ (ఆయతులు) అవతరింపబడెను. ఆ కపటుడు కూడా క్షమాపణ తెలుపుటకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరకు చేరెను. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఒంటెపై ప్రయాణించుచుండెను. అతడు ఈ విధముగా విన్నవించు కొనెను: ఓ ప్రవక్తా! మేము సరదాగా వేళాకోళానికి అటువంటి మాటలు మాట్లాడుకొంటిమి, ప్రయాణ బాధలను మరచుటకు. అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఈ విధముగా విశదీకరించిరి: 

                       “ఆ దృశ్యం ఇంకా నా కళ్లకు కనిపిస్తోంది. ఆ వ్యక్తి దైవప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం)  కూర్చున్న ఒంటె అంబారీ తాడు పట్టుకొని ఉన్నాడు. అతని కాళ్లు రాళ్లపై ఈడ్చుకుంటూ వెళ్తున్నాయి. “మేము కేవలం వేళాకోళానికి, పరాచికానికి అలా మాట్లాడుకుంటూ ఉన్నాం” అని అతను అంటున్నాడు. అప్పుడు దైవప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం) ”అల్లాహ్, అల్లాహ్ వాక్యాలతో, ఆయన ప్రవక్తతోనా మీ పరాచికాలు? ఇప్పుడు సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తర్వాత మళ్లీ అవిశ్వాసానికి పాల్పడ్డారు” అంటూ ముందుకు కదిలారు. అతని వంక చూడలేదు. ఇంకా ఎక్కువ మాట్లాడనూ లేదు. 

                      దీనిలో 8 ప్రకరణములు కలవు 

                      1. ప్రవక్తను, ఆయన అనుచరులను, ఇస్లాం చిహ్నాలను హేళన చేసినవాడు అవిశ్వాసి అగును. 

                      2. ఎవరైనా అలా పలికితే, ఈ వాక్యం (9:65-66) అనుగుణంగా వారు అవిశ్వాసులుగా పరిగణించబడతారు. 

                      3. చాడీలు చెప్పుటకు, అల్లాహ్ మరియు ప్రవక్తల విషయంలో నిజా నిజాలు తెలుపుటకు భేదం కలదు. 

                      4. అల్లాహ్ అనంత కరుణామయుడైనప్పటికీ శిక్షల విషయంలో ఆయన విధానం విభిన్నంగా ఉంటుంది. 

                      5. కొన్ని పశ్చాత్తాపములు స్వీకరించబడేవిగా ఉంటాయి.

                      పాఠము – 49 : అల్లాహ్ అనుగ్రహమునకు కృతజ్ఞత 

                      ఖుర్ఆన్ అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను: 

                      وَلَئِنْ أَذَقْنَاهُ رَحْمَةً مِّنَّا مِن بَعْدِ ضَرَّاءَ مَسَّتْهُ لَيَقُولَنَّ هَٰذَا لِي وَمَا أَظُنُّ السَّاعَةَ قَائِمَةً وَلَئِن رُّجِعْتُ إِلَىٰ رَبِّي إِنَّ لِي عِندَهُ لَلْحُسْنَىٰ ۚ فَلَنُنَبِّئَنَّ الَّذِينَ كَفَرُوا بِمَا عَمِلُوا وَلَنُذِيقَنَّهُم مِّنْ عَذَابٍ غَلِيظٍ

                      కష్టాలు వచ్చిన తర్వాత మేమతనికి మా కారుణ్యం రుచిని చూపినట్లయితే “అదెలాగూ నాకు దక్కవలసిందే (ఆ యోగ్యత నాలో ఉంది గనక). ప్రళయ ఘడియ నెలకొంటుందని నేనైతే అనుకోను. ఒకవేళ నేను నా ప్రభువువద్దకు మరలించబడినా, నిశ్చయంగా ఆయన దగ్గర నాకు మంచి(స్థానమే) లభిస్తుంది” అని బీరాలు పలుకుతాడు. ఇలాంటి తిరస్కారులకు మేము తప్పకుండా వారు ఏమేమి చేశారో తెలియ పరుస్తాము. వారికి దుర్భరమైన యాతనను చవిచూపిస్తాము. (41:50) 

                      ముజాహిద్ రహమతుల్లాహ్ అలై “హాజా లీ” కి వివరణ ఇస్తూ ఈ విధముగా తెలిపిరి: “ఈ సంపద నా కష్టార్జితము, నేను దీనికే అర్హుడను ” ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు ఈ పదమునకు “ఈ సంపద అసలు నాదే” అని విశదీకరించిరి. “ఈ సంపద నాకు నా జ్ఞానము మూలముగా లభించినది’ అను వాక్యమునకు ఖతాదా రహమతుల్లాహ్ అలై “ఈ సంపద నాకు నా అనుభవము, నా జ్ఞానముల కారణముగా లభించెను” అని విశదీకరించిరి. వేరే విద్యావేత్తలు “నేను అల్లాహ్ వద్ద ఈ సంపదకు అర్హుడను. అందుచే నాకు ఈ సంపద లభించినది” అని విశదీకరించిరి. ముజాహిద్ రహమతుల్లాహ్ అలై తెలిపిన దాని అర్థము కూడా ఇదే. “ఈ సంపద నాకు నా విశేషత, గౌరవము  కారణముగా లభించెను.” 

                      హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం బోధను ఈ విధముగా ఉల్లేఖించారు: 

                      ఇస్రాయీల్ సంతతిలో ముగ్గురుని (ఒకడు తెల్ల మచ్చల రోగం గలవాడు, వేరొకడు బట్టతల గలవాడు, మూడవ వ్యక్తి అంధుడు) పరీక్షించుటకు, వారి వద్దకు అల్లాహ్ ఒక దైవదూతను పంపెను. దైవదూత తెల్లమచ్చల వాని వద్దకు వచ్చి నీకు అన్నిటికంటే ఇష్టమైనది ఏమిటి అని అడిగెను. “నాకు ఈ వ్యాధి నుండి విముక్తి, అందమైన చర్మము ఇష్టము” అని పలికెను. దైవదూత అతనిపై తన చేతిని తాకెను. అంతటితో అల్లాహ్ అతని వ్యాధిని నయము చేసెను. మంచి అందమైన చర్మము లభించెను. మరల ప్రశ్నించెను “నీకు ఏ సంపద ఇష్టము” అని. అతడు “ఒంటెలు లేదా ఆవులు” అని జవాబు పలికెను. అతనికి ఒక సూడి ఒంటె ప్రసాదించబడెను. దైవదూత అతని కొరకు ఇలా ప్రార్థించెను: “అల్లాహ్! ఇతనికి ఈ ఒంటెలో భాగ్యము (సమృద్ధి) కలిగించుము.” తరువాత ఆ దైవదూత బట్టతలవాని వద్దకు వెళ్ళి నీకు “ఇష్టమైనది ఏమిటి!” అని ప్రశ్నించెను. దానికి అతడు “నాకు ఈ వ్యాధి దూరమై మంచి వెంట్రుకలు కావాలి” అని పలికెను. అప్పుడు దైవదూత అతనిపై తన చేతిని తాకెను. అంతటితో అల్లాహ్ అతని వ్యాధిని నయపరచి వెంట్రుకలు ప్రసాదించెను. తరువాత “నీకు ఏ సంపద ఇష్టము!” అని ప్రశ్నించెను. అతడు “నాకు ఒంటె లేదా ఆవు” అని జవాబు పలికెను. అతనికి ఒక సూడి ఆవు ప్రసాదించబడెను. దైవదూత అతని కొరకు ఈ విధముగా ప్రార్థించెను: “అల్లాహ్ ఇతనికి ఆవులో భాగ్యము (సమృద్ధి) కలిగించుము” అని. తరువాత ఆ దైవదూత అంధుని వద్దకు వెళ్ళి ‘నీకు ఇష్టమైనది ఏమిటి?’ అని ప్రశ్నించెను. అతడు ‘అల్లాహ్ నాకు చూపును ప్రసాదించుట’ అని జవాబు పలికెను. అప్పుడు దైవదూత తన చేత్తో అతన్ని తాకినప్పుడు అల్లాహ్ అతనికి చూపును ప్రసాదించెను. మరల “నీకు ఏ సంపద ఇష్టం” అని ప్రశ్నించెను. అతడు ‘మేకలు’ అని జవాబు పలికెను. అతనికి సూడి మేక ఇవ్వబడెను. చాలా కాలము తర్వాత ఒంటె, ఆవు, మేకల యొక్క సంతానము పెరిగి, వారి సంపద బాగా పెరిగెను. మరల ఆ దైవదూత మొదటి వ్యక్తి దగ్గరకు వచ్చి నేను బీదవాడిని, నా దగ్గర ఏమీ లేదు, నాకు ఒక ఒంటె దానము చేసిన ఎడల నేను దానిపై ప్రయాణము చేసి నా ఇంటికి చేరగలను. మీకు అందమైన చర్మము, ఈ సంపద ప్రసాదించిన అల్లాహ్ పేరుతో నేను మిమ్ములను అర్థిస్తున్నాను అని పలికెను. కాని అతడు నాకు చాలా అవసరాలు ఉన్నవి. నేను నీకు ఒంటెను ఇవ్వలేను అని పలికెను. దానికి దైవదూత “నీవు తెల్లమచ్చలతో ఉండేవాడివి, బీదవాడివి. నీకు ఇవన్నీ అల్లాహ్ ప్రసాదించెను. నాకు తెలుసును” అని పలికెను. దానికి అతడు “ఇది నా పిత్రార్జితము” అని పలికెను. మరల ఆ దైవదూత బట్టతల వాని దగ్గరకు వెళ్ళి మొదటివానితో పలికినట్లు పలికెను. అతడు కూడా అదే విధమైన సమాధానము పలికెను. అప్పుడు దైవదూత “నీవు అబద్ధము పలికేవాడివైతే అల్లాహ్ నిన్ను పాతస్థితికి చేర్చును” అని పలికెను. చివరికి దైవదూత మూడవ వ్యక్తి దగ్గరకు వెళ్ళి “నేను బీద బాటసారిని, నా దగ్గర దారి ఖర్చులు లేవు. అల్లాహ్ యొక్క దయ, పిదప మీరు సహాయము చేయకపోతే నేను ఇంటికి చేరలేను. ఏ అల్లాహ్ అయితే నీకు చూపును ప్రసాదించెనో ఆ అల్లాహ్ పేరుపై నేను నిన్ను ఒక్క మేకను కోరుచున్నాను” అని పలికెను. అతడు ఈ విధముగా జవాబు పలికెను: “నేను అంధుణ్ణి. అల్లాహ్ నాకు నా చూపు ప్రసాదించెను. నీకు కావలసినంత సంపాదన తీసుకొని నీకు ఇష్టము వచ్చినంత వదలి వెళ్ళుము, అల్లాహ్ పేరుపై నీవు ఎంత తీసుకొని వెళ్ళినను నిన్ను వారించను.” అప్పుడు దైవదూత, “నీ సంపద నీ దగ్గరే ఉంచుము, మీరు పరీక్షించబడిరి. అల్లాహ్ మీ పట్ల ప్రసన్నుడయ్యెను. నీ ఇద్దరి స్నేహితుల పట్ల అప్రసన్నుడయ్యెను” అని చెప్పాడు. (బుఖారి, ముస్లిం) 

                      దీనిలో 8 ప్రకరణములు కలవు 

                      1. వాక్యము (41:50) యొక్క భావము (కృతఘ్నుడు హెచ్చరించబడెను). 

                      2. “లయఖూలన్న హాజా లీ” యొక్క విశ్లేషణ తెలుపబడెను. 

                      3. “ఇన్నమా ఊతీతుహు అలా ఇల్మిన్ ఇందీ” యొక్క విశ్లేషణ తెలుపబడెను.

                      4. ముగ్గురి యొక్క సంఘటనలో దాగివున్న నీతిని గ్రహించవలెను. 

                      పాఠము 50 : అల్లాహ్ సంతానం ప్రసాదించినప్పుడు షిర్క్ కు  పాల్పడుట

                      ఖుర్ఆన్లో అల్లాహ్ విధముగా ఉపదేశించెను:

                      فَلَمَّا آتَاهُمَا صَالِحًا جَعَلَا لَهُ شُرَكَاءَ فِيمَا آتَاهُمَا ۚ فَتَعَالَى اللَّهُ عَمَّا يُشْرِكُونَ

                      أَيُشْرِكُونَ مَا لَا يَخْلُقُ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ

                      “అప్పుడు అల్లాహ్ వారికి చక్కని పవిత్రమైన సంతానము ప్రసాదించెను. కాని వారు ఆయన ప్రసాదించిన ఈ కానుకలో ఇతరులను సాటి కల్పించారు. వారు చేసే ఈ షిర్కు పనులకు అల్లాహ్ అతీతుడు, ఉన్నతుడూను.” ఏమిటీ, ఏ వస్తువునూ సృష్టించలేని వారినీ, వారే స్వయంగా ఒకరి చేత సృష్టించబడిన వారిని వీళ్లు (అల్లాహ్ కు) భాగస్వాములుగా నిలబెడుతున్నారా?  (7: ఆరాఫ్: 190-191). 

                      ఇబ్నె హజం రహమతుల్లాహ్ అలై ఈ విధముగా తెలిపెను:

                      ఏదైనా పేరులో అల్లాహ్ దాస్యము కాకుండా ఇతరులకు దాస్యమని ఉన్న అది నిషిద్దము. ఈ విషయంలో మత గురువుల ఏకాభిప్రాయము కలదు. ఉదాహరణకు అబ్దుల్ అమర్, అబ్దుల్ కాబా, అబ్దుల్ ముత్తలిబ్ అటువంటి పేరు కాదు (దీని అర్థము బానిస అని వచ్చును, దాసుని పరిగణనలోకి రాదు). 

                      దీని విశ్లేషణలో హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా తెలిపారు: “హవ్వా (అలైహిస్సలాం) గర్భవతి అయినప్పుడు, షైతాను వారి వద్దకు వచ్చి, నేను మిమ్ములను స్వర్గము నుండి బయటకు తీయించాను. మీరు నా మాట వినండి, లేకపోతే నీ గర్భములో ఉన్న శిశువునకు రెండు కొమ్ములు కల్పిస్తాను. ఆ శిశువు నీ గర్భమును చీల్చి బయటకు వచ్చును. మిమ్ములను అనేక విధాలుగా కష్టపెట్టును, అందుచే మీరు నా మాట విని మీకు కాబోయే సంతానాన్ని అబ్దుల్ హారిస్ అని నామకరణము చేయండి” అని వారిని భయ పెట్టెను. కాని ఆదం, హవ్వ (అలైహిస్సలాం) అతని మాటలను ఖాతరు చేయలేదు. వారికి ఒక చచ్చిన శిశువు పుట్టెను. మరల గర్భవతి అయినప్పుడు షైతాన్ వచ్చి మరల అదే విధముగా బెదిరించెను. ఈసారి వారి మనస్సుకు  సంతానముపై ప్రేమ ఆవరించింది. వారు తమ బిడ్డకు “అబ్దుల్ హారిస్” అని పేరు పెట్టారు. “వారు అల్లాహ్ ప్రసాదించిన సంతానము పై షిర్క్ కు పాల్పడిరి అన్న మాటకు భావం ఇదే. (దీనిని ఇబ్నె అబీహాతిమ్ నిజమైన ఆధారముతో హజరత్ ఖాతాదా రహమతుల్లాహ్ అలైహి ద్వారా పొందుపరచెను). 

                      ఆయన ఈ వాక్యము గురించి ఇలా వివరించెను: “ఆదం, హవ్వాలు షైతాన్ మాటలను మన్నించిరి, కాని షైతాన్ను ప్రార్థించలేదు మరియు ఇబ్నె అబీహాతిమ్ సపీసనద్ ముజాహిద్ (రహిమహుల్లాహ్)  యొక్క విశ్లేషణ ఈ విధముగా తెలిపెను: వారి సంతానము ఒక వేళ మానవుడి రూపమేమో అని భయపడిరి.” హజరత్ హసన్ బసరీ, సయీద్ (రహ్మతుల్లాఅలై) కూడా ఇటువంటి విశ్లేషణలు తెలిపిరి. 

                      దీనిలో 8 ప్రకరణములు కలవు 

                      1) అల్లాహ్ కు తప్ప ఇతరులకు దాస్యము కలుగు ప్రతి నామము నిషేధించబడినది. 

                      2) వాక్యము (7:190) భావము (దానిలో బహుదైవారాధనకు తావు కల్పించు పేర్లు నిషేధించబడినవి) 

                      3) హదీసులో నామకరణములో గల షిర్క్ పదాలు తెల్పెను. కాని ప్రార్థనారాధనలలో కాదు. 

                      4) ఎవరికైనా చక్కని ఆరోగ్యవంతులైన సంతానము కలుగుట అల్లాహ్ ప్రసాదమే.

                      5) విధేయత చూపు భాగస్వామ్యమునకు, ప్రార్థనలు చేయుటకు మధ్య వ్యత్యాసమును మతపండితులు తెలిపిరి. 

                      పాఠము 51 : అల్లాహ్ మహోన్నత నామములు 

                      అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉపదేశించెను;

                      وَلِلَّهِ الْأَسْمَاءِ الْحُسْنَى فَادْعُوهُ بِهَام 

                      وَذَرُوا الَّذِينَ يُلْحِدُونَ فِي أَسْمَابِ 

                      “అల్లాహ్ కు అందమైన యోగ్యత గల పేర్లు గలవు. మీరు ఆయన్ను ఆ పేర్లతోనే మొరపెట్టుకోండి. ఆయన నామములతో భక్తిహీనత చేయువారిని విడనాడండి.” 

                      బుఖారీలో అబూ హురైరా(రదియల్లాహు అన్హు) గారి ముర్సల్ ఉల్లేఖనం లో ఈ విధముగా తెలిపెను: 

                      అల్లాహ్ కు 99 అందమైన యోగ్యతగల నామములు కలవు. ఎవరైతే వాటిని కంఠస్తము చేయునో వాడు స్వర్గమున ప్రవేశించును. అల్లాహ్ బేసి (సంఖ్యలో ఉన్నాడు). బేసి సంఖ్యను ఆయన ఇష్టపడతాడు. తిర్మిజీలో అల్లాహ్ యొక్క 99 అందమైన నామములు పేర్కొనబడెను.) 

                      హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ వాక్య విశ్లేషణలో ‘ఇల్హాద్’ అంటే షిర్క్ అని తెలిపెను. బహుదైవారాధకులు ‘అల్లాహ్ నుండి అల్లాత్ మరియు అల్ అజీజ్ నుండి ‘అల్ ఉజ్జా’ అను పదములను ఉత్పన్నము చేశారు. (ఇబ్నె అబీహాతిం) 

                      అల్లాహ్ యొక్క స్వచ్ఛమైన యోగ్యతగల నామములలో వేరే నామము లను చేర్చుటను ఇల్హాద్ (భక్తి హీనత) అని ఆమష్ తెలిపిరి. 

                      దీనిలో 7 ప్రకరణములు కలవు 

                      1) అల్లాహ్ కు స్వచ్ఛమైన యోగ్యత గల పేర్లు కలవని స్పష్టపరచబడెను. 

                      2) అల్లాహ్ పేర్లన్నీ స్వచ్ఛమైనవి.

                      3) అల్లాహ్ యొక్క స్వచ్ఛమైన నామములను తిరస్కరించువారిని లక్ష్య పెట్టరాదు. 

                      4) ఇల్హాద్ భావము తెలుపబడెను. 

                      5) భక్తిహీనత గురించి తెలుపబడినది. 

                      6) అల్లాహ్ ను స్వచ్ఛమైన, అందమైన యోగ్యతగల నామములతో ప్రార్థించ మని ఆజ్ఞ ఇవ్వబడింది.

                      పాఠము – 52 : అల్లాహ్ పై సలాము అని పలకరాదు 

                      హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు: నమాజులో మేము “అల్లాహ్ పై శాంతి కలుగును, ఫలానా వారిపై శాంతి కలుగును” అని పలికితిమి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా సెలవిచ్చెను: “అల్లాహ్ పై శాంతి కలుగును అని పలకకండి. ఎందుకంటే, అల్లాహ్ యే స్వయంగా శాంతి కలిగించువాడు.” (బుఖారి, ముస్లిం)

                      దీనిలో 5 ప్రకరణములు కలవు 

                      1) సలాము గురించి విశ్లేషించబడింది. 

                      2) ఈ పదము (సలాము) ముస్లింలలో ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే బహుమతి. 

                      3) ఈ పదమును అల్లాహ్ పై అని పలకరాదు. 

                      4) అల్లాహ్ పై సలాము అని పలకరాదనుటకు కారణము తెలుపబడెను. 

                      5) అల్లాహ్ కొరకు చదవబడు సరియైన పదములు, చదవకూడదనే పదములు తెలుపబడెను. 

                      పాఠము – 53 : “అల్లాహ్ నీకు ఇష్టమైతే నన్ను క్షమించు” అనకూడదు 

                      హజరత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధముగా ఉద్బోధించారు: 

                      మీలో ఎవ్వరూ “ఓ అల్లాహ్! నీకు ఇష్టమైతే నన్ను క్షమించు” అని లేదా “ఓ అల్లాహ్ ! నీకు ఇష్టమైతే నాపై దయతలుచు” అని ప్రార్థించరాదు. నిశ్చయముగా అల్లాహ్ ను స్థయిర్యము మరియు విశ్వాసముతో ప్రార్థించి వేడుకోండి. ఎందుకంటే, అల్లాహు ను వారించగల వాడెవ్వడూ లేడు. (సహీ బుఖారీ, సహీ ముస్లిం) 

                      మీరు అల్లాహు ను పెద్ద పెద్ద యోగ్యములు ప్రసాదించమని ప్రార్థించండి. ఎందుకంటే, అల్లాహ్ వద్ద ఏదీ పెద్దది కాదు. (సహీ ముస్లిం)

                      దీనిలో 5 ప్రకరణములు కలవు 

                      1) అల్లాహ్ ను ప్రార్థించునప్పుడు షరతు పెట్టి ప్రార్థించరాదు. 

                      2) షరతులతో కూడిన ప్రార్థన నిషేధానికి కారణము తెలుపబడెను. 

                      3) స్థయిర్యముతో, విశ్వాసముతో అల్లాహు ప్రార్థించవలెను. వేడుకోవలెను. 

                      4) అల్లాహ్ ను పెద్ద పెద్ద యోగ్యములు ప్రసాదించమని వేడుకొనవలెను.

                      5) అల్లాహ్ ను పెద్ద యోగ్యములు ప్రసాదించమని వేడుకోవలెనని పలుకుటకు గల కారణము తెలుపబడెను. 

                      పాఠము 54 : ‘నా బానిస’ అని పలకరాదు 

                      ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధనను హజరత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు: 

                      “మీరెవరూ మీ సేవకులను, “నీ ప్రభువుకు అన్నం తీసుకొనిరా లేదా నీ ప్రభువుకు నీళ్ళు తీసుకొనిరా” అని పలకవద్దు. “అధికారి” అని పలకండి, మీ బానిసలను, “నా దాసుడు, నా దాసి ” అని పలకవద్దు. “నా సేవకులు” అని పలకండి”. (సహీ ముస్లిం) 

                      దీనిలో 5 ప్రకరణములు కలవు 

                      1) ‘నా బానిస’ అనుట నిషిద్ధం. 

                      2) బానిసలు తమ అధికారిని ‘మా ప్రభువు’ అనుట నిషేధించబడింది. 

                      3) అధికారులు తమ సేవకులను “దాసులు, బానిసలు” అని పలుకుటకు బదులు సేవకులు అని పలకవలెనని బోధించబడెను.

                      4) బానిసలు తమ అధికారిని ‘మా అధికారి లేదా మా పెద్ద’ అని పలుకవలెను.

                      5) దీనికి అసలు కారణం, ఏకదైవారాధన శ్రేష్ఠతకు భంగము కలగకుండా ఉండటం. కనుక మాటలలో ఇతరులను, పిలుచుటలో కూడా ఏకదైవా రాధన శ్రేష్ఠతకు భంగం ఏర్పడకుండా జాగ్రత్త వహించవలెను. 

                      పాఠము 55 : అల్లాహ్ నామముతో యాచించువానిని ఒట్టి చేతుల్తో పంపరాదు 

                      హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త బోధనలను ఈ విధముగా ఉల్లేఖించారు: 

                      “అల్లాహ్ నామముపై యాచించువారికి ఏమైనా తప్పకుండా ఇవ్వండి. అల్లాహ్ నామమున ఆశ్రయము కోరు వారికి ఆశ్రయము ఇవ్వండి. మిమ్ములను విందుకు ఆహ్వానించువారి విందును స్వీకరించండి. మీకు సహాయము చేసి లాభమును, మర్యాదను చేకూర్చిన వారికి, మీరు కూడా అతని సహాయమునకు సరిపడినంత సహాయమైనా చేయండి. లేక మీరు సహాయము చేయలేని పక్షములో వారి కొరకు అల్లాహ్ వారి మేలు తీర్చ గలిగాను అనుకున్నంత వరకు దుఆ చేయండి.” (అబూదావూద్, నసాయి-సహీ సనద్) 

                      దీనిలో 6 ప్రకరణమలు కలవు 

                      1) అల్లాహ్ నామముతో ఆశ్రయము కోరిన వారికి ఆశ్రయము ఇవ్వవలెను. 

                      2) అల్లాహ్ నామముతో యాచించిన వారికి ఏమైనా తప్పక ఇవ్వవలెను. 

                      3) ఆహ్వానమును స్వీకరించవలెను. 

                      4)సహాయము చేసిన వారికి ప్రతిఫలము ఇవ్వవలెను. 

                      5) సహాయము చేసిన వారికి ప్రతిఫలము ఇవ్వలేని వారు అతని మేలు కొరకు అల్లాహ్ తో దుఆ చేయవలెను.

                      6) సహాయము చేసిన వారి ప్రతిఫలముగా మేలు తీర్చగలిగాను అనుకున్నంత వరకు అల్లాహ్ దుఆ చేస్తుండవలెను. 

                      పాఠము 56 : అల్లాహ్ నామమున స్వర్గమును మాత్రమే కోరవలెను 

                      హజరత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా సంబోధించారు: “అల్లాహ్ నామమున స్వర్గము తప్ప వేరేదీ యాచించవద్దు.” 

                      దీనిలో 2 ప్రకరణములు కలవు 

                      1) అల్లాహ్ ముఖము నిమిత్తము పలికినప్పుడు అన్నిటినీ మించిన ఉద్దేశితము స్వర్గము కాకుండా వేరే వాటిని యాచించరాదు. 

                      2) అల్లాహు ముఖము కలదని స్పష్టమగుచున్నది. అది ఎలాగున్నదో మనకు తెలియదు. 

                      పాఠము – 57 : కష్టనష్టాలు సంభవించినప్పుడు ‘ఒకవేళ ఇలా జరిగి ఉంటే’ అని పలుకుట 

                      ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను: 

                      يَقُولُونَ لَوْ كَانَ لَنَا مِنَ الأمْرِ شَيء مَا قُتِلْنَا ههناء 

                      “….. (అల్లాహ్ మార్గములో వెళ్ళిన వారి గురించి) ఒకవేళ వీరు మా మాటలు విని ఉంటే చంపబడేవారు కాదని పలుకుచున్నారు.” (3:154) 

                      హజరత్ అబూహురైరా(రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు: హజరత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా సంబోధించారు: 

                      నీకు లాభదాయకమైన దానినే కాంక్షించు. ఒక్క అల్లాహ్ శరణము మాత్రమే కోరుకో, చేతకానివాడి వలె కూలబడకు, నీకు కష్టనష్టములు వాటిల్లితే “ఒకవేళ నేను ఇలా చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది” అని పలకకు, “ఇది అల్లాహ్ నిశ్చయించినది, ఆయన నిశ్చయము ప్రకారము జరిగినది” అని పలుకు. ఎందుకంటే, “ఒకవేళ అని” అనే పలుకు షైతాను అమలుకు దారితీస్తుంది. (సహీ ముస్లిం) 

                      దీనిలో 6 ప్రకరణములు కలవు 

                      1) వాక్యములు (3:154, 23:168) కు భావము (ఒకవేళ అనే పలుకు వారి గురించి తెలుపబడెను.) 

                      2) కష్టనష్టాలలో ఒకవేళ ఇలా చేస్తే ఇలా అయ్యేదేమో అనుట నిషిద్ధం. 

                      3) ఒకవేళ అని పలకకూడదు అనుటకు కారణము, షైతాన్ అమలుకు దారి తెరుస్తుంది. 

                      4) మంచి పలుకులు పలుకుటకు ప్రేరేపించబడెను. 

                      5) లాభదాయకమైన వాటినే కాంక్షించాలి, అల్లాహ్ సహాయము కోరాలి. 

                      6) చేతకానివాడి వలె కూలబడుట నివారించబడింది. 

                      పాఠము 58 : గాలిని తిట్టుట నిషిద్ధం 

                      హజరత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  బోధనను ఈ విధముగా ఉల్లేఖించారు: 

                      “గాలిని తిట్టకండి. మీరు సుడిగాలిని చూసినప్పుడు ఇలా చదవండి: “ఓ అల్లాహ్ ! మేము ఈ గాలితో మంచిని కోరుచున్నాము, ఈ గాలిని ఆజ్ఞాపించబడిన దానిలో కూడా మంచిని కోరుచున్నాము. ఓ అల్లాహ్ ! మేము ఈ గాలిలోని చెడు నుండి నీ శరణు కోరుచున్నాము. ఈ గాలికి ఆజ్ఞాపించ బడిన చెడు నుండి కూడా నీ శరణు కోరుచున్నాము.” (తిర్మిజీ సహీ) 

                      దీనిలో 4 ప్రకరణములు కలవు

                      1) గాలిని తిట్టుట నివారించబడెను.

                      2) ఏదైనా అయిష్టమైనది కనపడినప్పుడు, అల్లాహు కు ఇష్టమైనది కోరుకోవలెను. 

                      3) గాలి తనంతట తాను వీయదు. అల్లాహ్ ఆజ్ఞ మేరకే వీయును. 

                      4) గాలి ఒక్కోసారి మంచి చేయుటకు ఆజ్ఞాపించబడును. ఒక్కోసారి చెడు చేయుటకు ఆజ్ఞాపించబడును.

                      పాఠము – 59 : అల్లాహ్ ను శంకించుట నిషిద్ధం 

                      అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా సంబోధించెను: 

                      “వారు అల్లాహ్ పట్ల అసత్య, అజ్ఞాన, అశుద్ధమైన అనుమానాలు వ్యక్తం చేయసాగారు. (వారితో) ఇలా పలుకుము: “ఈ విషయంలో (ఎవ్వరికీ అధికారము లేదు. సమస్త అధికారములు అల్లాహ్ అధీనంలో ఉన్నవి. వాస్తవానికి వారు తమ హృదయములలో దాచుకున్న వాటిని మీకు వ్యక్తం చేయడం లేదు. మేము స్వతంత్రాధికారములు కలిగి ఉంటే, మేము ఇచట చంపబడి ఉండే వారము కాదు అని పలుకుచున్నారు. వారితో ఇలా పలకండి, మీరు మీ ఇళ్ళల్లోనే ఉండినప్పటికీ మృత్యువు లిఖించబడి ఉన్నవారు స్వయంగా తమ ప్రాణాంతక స్థానాలకు తరలివచ్చి ఉండేవారు (ఈ వృత్తాంతము ఎందుకు జరిగిందంటే) అల్లాహ్ మీ హృదయాలలో దాగివున్న దానిని పరీక్షించుటకు, మీ మనస్సులలో ఉన్నదానిని స్వచ్చపరచుటకు. నిశ్చయముగా అల్లాహు కు ఆంతరంగిక స్థితి బాగా తెలుసును. వాస్తవానికి అల్లాహ్ ను శంకించువారిపైనే కష్టములు వచ్చిపడును.”

                      పై వాక్యములను గురించి ఇబ్నె ఖయ్యిం (రహమతుల్లాహ్ అలై) ఈ విధముగా విశదీకరించెను: 

                      “పవిత్రుడైన అల్లాహ్ తన ప్రవక్తకు సహాయపడడు, ఆయన ధర్మము వైపునకు ఆహ్వానించుచున్న కార్యము సమసిపోవును” అని వారు శంకించిరి. ముస్లిములపై వాటిల్లిన ఆపద అల్లాహ్ విధి కాదని అనుమానపడిరి. అల్లాహ్ యొక్క విధి, నేర్పు, ప్రవక్త యొక్క సఫలతను వీరు శంకించిరి. ఇస్లాం అన్ని మతాలపై సఫలత పొందజాలదని అనుమానపడిరి. కపటుల, బహుదైవారాధకుల ఈ శంక వాక్యము (48:6)లో తెలుపబడినది. ఇటువంటి కుశంక అల్లాహ్ యొక్క గొప్పతనమునకు విరుద్ధము. ఎందుకంటే ఇది అల్లాహ్ యొక్క జ్ఞానము, ముక్తి, గుణము, గౌరవాధిక్యతకు విరుద్ధము. 

                      ఇబ్నె ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ఈ ఆయత్ యొక్క తాత్పర్యము ఈ విధముగా చేయుచున్నారు: కపట విశ్వాసము గలవారు ఉహద్ యుద్ధము తర్వాత ఈ విధముగా అనుమానించసాగారు. అది ఏమిటంటే, అల్లాహ్ తన ప్రవక్తకు సహాయము చేయడు. అప్పుడు ప్రవక్త ప్రచార ఆర్భాటం అంతరించిపోతుంది. మరో తాత్పర్యము ఈ విధముగా ఉంది: ప్రవక్తకు, విశ్వాసులకు, కలిగించిన ఇబ్బందుల ద్వారా కపటులు ఇలా శంకించేవారు, విధి అనేది అల్లాహ్ యొక్క వివేకం కాదు. 

                      అందుచే, “అల్లాహ్ అసత్యమును సత్యముపై ఆధిక్యత కలిగించునని యదార్థము సమసిపోవునని ఎవరయితే భావించెదరో లేదా అల్లాహ్ నిర్ణయించిన విధికి అనుగుణముగా జరిగెనని విశ్వసించరో లేదా అల్లాహ్ నిర్ణయించిన విధి నమ్మశక్యము కాదని భావించెదరో, ఇది కేవలం అతని ఇచ్చ అనుకొనెదరో” ఈ విధమైన కుశంక కలిగివుండుట తిరస్కారుల విధానము. తిరస్కారుల కొరకు నరకము స్థిర నివాసము. చాలా మంది తమ పనులలో శంకిస్తుంటారు. కాని అల్లాహ్ ను విశ్వసించేవారు, ఆయన స్వభావములను విశ్వసించేవారు, ఆయన ద్వారా ముక్తి మరియు గౌరవాధిక్యతను విశ్వసించేవారు ఈ శంకల నుండి సురక్షితముగా ఉండగలరు. 

                      జ్ఞానోదయము కలిగిన ప్రతి వ్యక్తీ తన మేలు కోరుకొని అల్లాహ్ ను శంకించక అటువంటి కుశంకములు కలిగినప్పుడు అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవలెను. 

                      ప్రజలు అల్లాహ్ నిర్ణయించిన విధిని శంకిస్తుంటారు. ఇలాగై ఉంటే బాగుండేది అని పలుకుదురు. తమకు ప్రసాదించబడిన దానిని అల్పముగా భావించెదరు. అందుచే మనము కూడా కుశంక నుండి దూరముగా ఉన్నామా? లేదా? అని పరిశీలించు కోవలెను. ఒక అరబీ లోకోక్తి: “నీవు దాని నుండి దూరముగా ఉన్న ఎడల పెద్ద సాఫల్యము పొందిన వాడవు, కాని దూరముగా ఉన్నావని నేను తలచుటలేదు.” 

                      దీనిలో 4 ప్రకరణములు కలవు 

                      1) వాక్యము (3:154) యొక్క భావము (కుళంకుల గురించి) తెలుపబడెను. 

                      2) వాక్యము (48:6) యొక్క భావము (శంకించువారికి చెడు జరుగును అని) తెలుపబడెను.

                      3) లెక్కలేనన్ని విధములుగా జనులు శంకించుదురు. 

                      4) ఈ కుశంక నుండి అల్లాహ్ యొక్క స్వభావములను గుర్తించి, తన మనస్సు యొక్క పరీక్ష చేసుకోగలిగిన వారు మాత్రమే సురక్షితముగా ఉండగలరు. 

                      పాఠము 60 : అల్లాహ్ నిర్ణయించిన విధిని తిరస్కరించే వారు 

                      హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉద్బోధించారు: 

                      నా ప్రాణము ఎవరి చేతిలో ఉన్నదో ఆయనపై ప్రమాణము, ఒకవేళ ఎవరి వద్దయినా కొండంత బంగారమున్నచో అతడు అల్లాహ్ మార్గములో దానము చేసినా అతని ఈ అమలు (దానము) అతడు విధిపై విశ్వసించనంత వరకూ స్వీకరించబడదు. 

                      తన బోధనకు ఆధారముగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ ఉపదేశమును ఉల్లేఖించెను. “విశ్వసించుట అనగా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, ప్రళయదినమును, అల్లాహ్ నిర్ణయించిన విధిని విశ్వసించుట”. (ముస్లిం, హజరత్ ఉబాదాబిన్) 

                      ఉబాద్ బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) తన కుమారునికి ఈ విధముగా బోధించిరి: 

                      “ప్రియమైన కుమారుడా! నీకు సంభవించబోవు కష్టము నుండి నీవు రక్షించబడలేవు, నీకు సంభవించబోని కష్టము ఎప్పటికీ నీ వద్దకు రాదు అని విశ్వసించనంత వరకు విశ్వాసపు రుచిని నీవు పొందజాలవు. నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం నుంచి ఈ ఉపదేశమును వింటిని: అల్లాహ్ అన్నిటికంటే ముందు కలమును సృష్టించి, దానిని వ్రాయమని ఆజ్ఞాపించెను. అది, ఓ నా ప్రభూ! ఏమి వ్రాయవలెను? అని అడిగెను. “ప్రళయ దినం వరకూ వచ్చు ప్రతి ప్రాణి విధిని వ్రాయుము” అని అల్లాహ్ సమాధాన మిచ్చెను: కుమారా, నేను ప్రవక్తను ఆయన ఈ విధముగా ఉపదేశిస్తుండగా విన్నాను: “ఎవరైతే ఈ విశ్వాసము కాక వేరే విశ్వాసముపై మరణిస్తాడో అతడు నా అనుచరులలోని వాడు కాదు.” (అబూ దావూద్, ముస్నదె అహ్మద్) 

                      “అల్లాహ్ అన్నిటికంటే ముందు కలమును సృష్టించి దానితో ప్రళయ దినం వరకు సంభవించు నటువంటి వన్నీ వ్రాయించివేసెను.” (ముస్నదె అహ్మద్) 

                      ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఉపదేశమును ఇబ్నె వహబ్ ఈ విధముగా ఉల్లేఖించిరి: 

                      “ఎవరైతే మంచి లేదా చెడు విధిపై విశ్వసించరో, వారిని అల్లాహ్ నరకములో కాల్చును.” 

                      ఇబ్నె అద్ దైలమి ఈ విధముగా ఉల్లేఖించెను: 

                      నేను హజరత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) వద్దకు పోయి నా మనస్సులో విధి గురించి కొంత అనుమానము కలదు, మీరు ఏదైనా హదీసు బోధించండి, అల్లాహ్ నా మనస్సులో నుంచి అనుమానమును తీసివేయుటకు” అని విన్నవించుకున్నారు. 

                      అప్పుడు హజరత్ ఉబై బిన్ కాబ్ అబీ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా బోధించారు: 

                      “నీవు ధనమును దానము చేసినా, నీ ఈ అమలు (దానము) నీవు విధిపై విశ్వసించనంతవరకూ, నీకు ఏ కష్టము వాటిల్లబోతుందో అది వాటిల్లు తుందని, నీకు వాటిల్లబోని కష్టము వాటిల్లబోదని విశ్వసించనంత వరకూ స్వీకరించబడదు. నీ విశ్వాసము దీనికి భిన్నముగా ఉండి నీవు మరణించిన యెడల నీవు నరకమున చేరెదవు.” తరువాత నేను హజరత్ అబ్దులా బిన్ మసీద్, హజరత్ హుజేఫా బిన్ యమాన్, హజరత్ జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు)ల వద్దకు వెళ్ళినప్పుడు వారు కూడా ప్రవక్త యొక్క ఇదే హదీసును బోధించిరి. (హాకిం దీనిని తన సహీలో పొందు పరచెను. ఇది సహీ హదీసు). 

                      దీనిలో 9 ప్రకరణములు కలవు 

                      1) అల్లాహ్ నిర్ణయించిన విధిని విశ్వసించుట తప్పనిసరి. 

                      2) విధిని ఏ విధముగా విశ్వసించవలెనో విశదీకరించబడెను. 

                      3) విధిని విశ్వసించనివారి కార్యములు స్వీకరించబడవు.
                      4) విధిని విశ్వసించనివాడు ‘ఈమాన్’ మాధుర్యాన్ని పొందజాలడు.
                      5) అల్లాహ్ అన్నిటికంటే ముందు సృష్టించిన దానిని తెలుపబడెను.
                      6) కలము ప్రళయదినం వరకు సంభవించునటువంటివన్నీ వ్రాసివేసెను. 

                      7) విధిని విశ్వసించని వారికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో సంబంధము లేదు. 

                      8) ‘సలఫీలు’ అనుమానము కలిగినప్పుడు ఖుర్ఆన్, హదీసులు బాగా తెలిసిన వారిని సంప్రదించేవారు. 

                      9) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసుల ద్వారా విధి గురించి స్పష్టముగా విశదీకరించబడెను. 

                      పాఠము 61 : చిత్రాలు, శిల్పాలను చిత్రించుట ఒక దుష్టమైన పని 

                      హజరత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) హదీసు ఖుద్సీని ఈ విధంగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెనని సంబోధించెను: 

                      “నా సృష్టిలాంటి సృష్టిని తయారు చేయుటకు ప్రయత్నించిన వారికి మించిన దుష్టులెవరూ లేరు. వీరిని ఒక రవ్వంతటి వస్తువును చేసి చూపెట్ట మనండి.” (సహీ ముస్లిం, సహీ బుఖారి) 

                      హజరత్ ఆయిషా(రదియల్లాహు అన్హ) ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించెను. 

                      “సృష్టించుటలో అల్లాహ్ యొక్క సృష్టి ప్రతిరూపమును చేయువారు ప్రళయ దినాన అందరినీ మించి శిక్షించబడుదురు.’ (సహీ ముస్లిం) 

                      హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రబోధించిరి: 

                      ప్రతి శిల్పి, చిత్రకారుడు నరకములో ప్రవేశించును. అతడు తాను చేసిన ప్రతి చిత్రమునకు బదులుగా ఒక ప్రాణము చేసి, దాని ద్వారా ఆ చిత్రకారుడు నరకంలో శిక్షింపబడును. (బుఖారి, ముస్లిం) 

                      హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు; ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించిరి: 

                      “ఇహలోకంలో చిత్రము చేసిన వారిని ప్రళయ దినం నాడు ఆ చిత్రములో ప్రాణము పోయమని ఆజ్ఞాపించబడును. కాని అతడు ఎప్పటికీ చేయలేక పోవును.” 

                      అబూ హయ్యాజ్ కథనం: అలీ (రదియల్లాహు అన్హు) నాతో ఇలా అన్నారు. “నన్ను ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పంపిన పనిపై నిన్ను పంపనా? అది ఏమనగా ఏ శిల్పమునైనా లేదా ఎత్తుగా ఉన్న ఏ సమాధినా కూల్చకుండా వదలవద్దు.” (సహీ ముస్లిం) 

                      దీనిలో 7 ప్రకరణములు కలవు 

                      1) శిల్పములు, చిత్రపటములు చేసేవారిని హెచ్చరించబడెను. 

                      2) చిత్రించుటను నిషేధించటానికి కారణము, ఇది కూడా షిర్క్ జాతికి చెందినదే. 

                      3) అల్లాహ్ సృష్టికర్త. సృష్టి బలహీనమైనది. సృష్టిని అల్లాహ్ సృష్టించెను. సృష్టి దేన్నీ సృష్టించజాలదు. 

                      4) చిత్రకారుడు అందరికంటే ఎక్కువగా శిక్షించబడును. 

                      5) అల్లాహ్ ప్రతి చిత్రమునకు బదులు ఒక ప్రాణము సృష్టించి దాని ద్వారా చిత్రకారుణ్ణి నరకంలో శిక్షించును. 

                      6) చిత్రకారునికి అతడు వేసిన చిత్రములన్నింటిలో ప్రాణము పోయమని ఆజ్ఞాపించబడును. కాని, అతడు చేయలేడు. 

                      7) విగ్రహాలు, ఎత్తయిన సమాధులు నిర్మూలించుటకు ఆజ్ఞాపించబడును. 

                      పాఠము 62 : ఎక్కువగా ప్రమాణములు చేయుట 

                      ఖుర్ఆన్ అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను: 

                      وَاحْفَظُوا اَيْمَانَكُمْ . 

                      మీరు మీ ప్రమాణాలను పదిలము చేసుకోండి.” (5:89) 

                      హజరత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: (బుఖారి, ముస్లిం) 

                      ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించిరి: 

                      “(అసత్య) ప్రమాణము సరుకులను అమ్ముటకు పనికొచ్చునుగాని అది సమృద్ధిని హరించును.” 

                      హజరత్ సల్మాన్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి : (తిబ్రాని, సహీ) 

                      ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించిరి: 

                      “మూడు రకాల జనులను అల్లాహ్ (ప్రళయ దినం) పలకరించడు. వారి పాపములను దూరము చేయడు, వారికి భయంకర శిక్ష విధించబడును.
                      1. వ్యభిచారము చేయు వృద్ధుడు.
                      2. గర్వము, అహంకారము గల బిచ్చగాడు.
                      3. అల్లాహ్ ను తన వ్యాపారముగా చేసుకొన్నవాడు. అల్లాహ్ పై ప్రమాణము చేసి సరుకును విక్రయించేవాడు, ప్రమాణము చేసి సరుకు అమ్మేవాడు. 

                      హజరత్ ఇమ్రాన్ బిన్ హుస్సేన్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించిరి: “అన్నింటికంటే ఉత్తమమైన కాలము నా తరువాత వచ్చునది. ఆ పిమ్మట వచ్చునది” హజరత్ ఇమ్రాన్ (రదియల్లాహు అన్హు)  “ప్రవక్త తన తరువాత రెండు కాలములు పలికారో లేక మూడు కాలములు పలకెనో నాకు గుర్తులేదు” అని తెలిపిరి. తరువాత ప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా తెలిపెను. “మీ తర్వాత కొందరు వస్తారు. వారు తమను సాక్ష్యానికి పిలవక ముందే సాక్ష్యం ఇస్తారు. నమ్మకద్రోహానికి పాల్పడతారు. నిజాయితీగా ఉండరు. మొక్కుబడులు చేస్తారు. కాని వాటిని పూర్తిచేయరు. వారిలో లావుతనం కనిపిస్తుంది” (సహీ ముస్లిం) 

                      అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త బోధనను ఈ విధముగా ఉల్లేఖించారు: 

                      “అందరికంటే ఉత్తమ ప్రజలు నా కాలపు ప్రజలు. పిమ్మట నా తరువాత వచ్చువారు. ఆ పిమ్మట తరువాత వచ్చువారు. తరువాత వచ్చువారు తమ ప్రమాణమునకు ముందే సాక్ష్యము పలుకుదురు. సాక్ష్యము ముందు ప్రమాణము చేయుదురు. (అంటే తమ ప్రమాణము చేయుటలోగాని, సాక్ష్యము పలుకుటలోగాని నిజాన్ని ఖాతరు చేయరు). ” 

                      హజరత్ ఇబ్రాహీం నఖయీ (రహమతుల్లాహ్ అలై) ఇలా తెలిపిరి: “మా చిన్న వయస్సులో మా పెద్దలు మమ్మల్ని వాగ్దానానికి, సాక్ష్యములకు కట్టుబడి ఉండవలెనని దండించెడివారు. 

                      దీనిలో 8 ప్రకరణములు కలవు 

                      1) ప్రమాణాలను పదిలము చేయుటకు ఆజ్ఞాపించబడినది. 

                      2) ప్రమాణము చేసి సరుకు అమ్ముటవలన దానిలోని సమృద్ధిని కోల్పోతారు. 

                      3) సరుకును కొన్నప్పుడు, అమ్మినప్పుడు అనవసర ప్రమాణములు చేయువారిని హెచ్చరించబడెను.

                      4) నేరములకు కారణములు చిన్నవి అయినప్పటికీ అభిముఖము చూపుట వలన అవి పెద్దవి అగును. 

                      5) కోరక ముందు ప్రమాణము చేయువారిని నివారించబడెను. 

                      6) ప్రవక్త మూడు, నాలుగు కాలముల పరిమితుల ప్రాముఖ్యతను తెలిపి తరువాత జరుగునది తెలిపెను. 

                      7) సాక్ష్యము కొరకు ముందే సాక్ష్యము ఇచ్చుటకు సిద్ధమగువారిని వారించబడెను. 

                      8) సలఫె సాలిహీన్ పిల్లలను వాగ్దానానికి, సాక్ష్యానికి కట్టుబడి ఉండనిచో దండించెడివారు. 

                      పాఠము – 63 : అల్లాహ్ ప్రవక్త పేర పూచీ ఇచ్చినప్పుడు కట్టుబడి ఉండుట 

                      ఖుర్ఆన్ అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను: 

                      وَأَوْفُوا بِعَهْدِ اللَّهِ إِذَا عَاهَدتُّمْ وَلَا تَنقُضُوا الْأَيْمَانَ بَعْدَ تَوْكِيدِهَا وَقَدْ جَعَلْتُمُ اللَّهَ عَلَيْكُمْ كَفِيلًا ۚ إِنَّ اللَّهَ يَعْلَمُ مَا تَفْعَلُونَ

                      “మీరు అల్లాహ్ వాగ్దానము చేసినప్పుడు దానిని నెరవేర్చండి. అల్లాహ్ సాక్షిగా చేసిన ప్రమాణాలను భంగపరచకండి. ఎందుకంటే మీరు అల్లాహ్ ను  తమపై పూచీ చేసుకున్నారు. అల్లాహ్ కు మీ పనులన్నీ తెలుసును.” (16:91) 


                      2. వారు ఏకదైవారాధనకు వ్యతిరేకిస్తే రక్షణ రుసుము కట్టమని అడగండి. వారు అంగీకరిస్తే మీరు కూడా ఆమోదము తెలుపండి. 

                      హజరత్ బురైదా(రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఏ అధికారినైనా నియమించి నప్పుడు అల్లాహ్ కు భయపడమని, తోటి ప్రజలతో సత్ప్రవర్తన పాటించమని అతనికి ఉపదేశించి ఈ విధముగా ప్రబోధించెడివారు: ‘అల్లాహ్ మార్గములో అల్లాహ్ పేరున యుద్ధము చేయుము. అల్లాహ్ ని తిరస్కరించిన వారిపై యుద్ధము చేయుము. యుద్ధము చేయుముగాని అన్యాయము చేయవద్దు, మాట తప్పవద్దు, ఎవరి అవయవములూ కోయవద్దు. పిల్లలను హతమార్చవద్దు. తిరస్కారులను మూడు విషయముల వైపునకు పిలవండి. 

                      1. ఒక్క అల్లాహ్ ఆరాధించమని కోరండి. వారు అంగీకరించిన పక్షంలో ఇస్లాం స్వీకరించి మదీనాకు వలస వెళ్ళమని వారిని కోరండి. వారు అంగీకరిస్తే వారందరికీ వలస వెళ్ళిన వాళ్ళ హక్కులన్నీ లభించునని తెలుపండి. వలస వెళ్ళని ఎడల ఆ హక్కులు లభ్యము కావని తెలపండి. 

                      3. వారు రక్షణ రుసుము కట్టుటకు నిరాకరిస్తే అల్లాహ్ సహాయమును యాచించి వారితో యుద్ధము చేయండి. మీరు కోటలోని శత్రువులను ముట్టడించినప్పుడు, శత్రువులు మిమ్మల్ని అల్లాహ్ తరువాత ప్రవక్త నామముల పూచీ కొరినచో మీరు వారికి అటువంటి పూచీలను ఇవ్వకండి. కాని మీరు మీ యొక్క సొంత పూచీ ఇవ్వండి. మీరు మీ పూచీని ఖాతరు చేయని యెడల అది అల్లాహ్ ఆ తరువాత ప్రవక్తల పేర ఇచ్చిన పూచీకంటే స్వల్పమైన పూచీ. మీరు కోటను ముట్టడించినప్పుడు వారు అల్లాహ్ పేర సంధి చేసుకొందురు అంటే మీరు సంధి చేయకండి. ఎందుకంటే మీరు చేయు సంధిలో అల్లాహ్ పరిష్కార మార్గము ఉన్నదో లేదో మీకు తెలియదు.’ 

                      దీనిలో 7 ప్రకరణములు కలవు. 

                      1) అల్లాహ్ నామమున ఇచ్చిన పూచీ, ప్రవక్త నామమున ఇచ్చిన పూచీ, ఇతరులు పూచీలో వ్యత్యాసము కలదు. 

                      2) రెండు కష్ట సమస్యలు ఎదురైనప్పుడు వాటిలోని సులభమైన దానిని స్వీకరించవలెను. 

                      3) అల్లాహ్ మార్గములో అల్లాహ్ కొరకు యుద్దము చేయవలెను.
                      4) అల్లాహ్ ను తిరస్కరించినవారిపై యుద్ధము చేయవలెను. 

                      5) అల్లాహ్ యొక్క సహాయము యాచించి యుద్ధము చేయవలెను.

                      6) అల్లాహ్ నిర్ణయము, ఇతరుల నిర్ణయములో వ్యత్యాసము కలదు. 

                      7) అనుచరులు తీసుకున్న నిర్ణయం అల్లాహ్ అంగీకార యోగ్యమైనదని అనుకొనుట సరికాదని స్పష్టమగును. 

                      పాఠము – 64 : అల్లాహ్ నామమున ప్రమాణము చేయుట 

                      హజరత్ జందుబ్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధనను ఈ విధముగా ఉల్లేఖించిరి: 

                      ఒక వ్యక్తి అల్లాహ్ యొక్క ప్రమాణము చేసి “అల్లాహ్ ఫలానా వ్యక్తిని క్షమించడు” అని పలికినప్పుడు అల్లాహ్ ఇలా తెలిపెను: అతడెవడు నా నామమున ప్రమాణము చేయువాడు, నేను ఫలానా వ్యక్తిని క్షమించనని. నేను అతనిని క్షమించితిని, ప్రమాణము చేసిన వ్యక్తి అమలు (కార్యములు) వృధా చేసితిని. (ముస్లిం) 

                      హజరత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) పై హదీసును ఈ విధముగా విశదీకరించిరి: 

                      “ఆ వ్యక్తి ఒక మంచి భక్తుడని, అతను పలికిన పలుకులు అతనిని ఇహపర లోకాలని నాశనము చేసివేసెను.’ 

                      దీనిలో 5 ప్రకరణములు కలవు 

                      1) అల్లాహ్ ను పూచీ పెట్టి ప్రమాణము చేయుట నిషిద్దము. 

                      2) నరకము ప్రతి ఒక్కని సమీపములో ఉన్నది. 

                      3) స్వర్గము కూడా అదే విధముగా సమీపములో ఉన్నది. 

                      4) పై హదీసుతో ప్రవక్త ఈ హదీసు ధృవపరచబడెను: “కొన్ని సమయము లలో మానవుడు తన ఇహపర లోకములను నాశనము చేయుట (అగుట) కు కారణమైన పలుకులు పలుకును.” 

                      5) అల్లాహ్ మనలను కొన్ని సమయములలో మనము ఊహించని రీతిలో అ క్షమించును. 

                      పాఠము 65 : సృష్టిరాశులను సంతోషపెట్టటానికి అల్లాహ్ ను సిఫారసుదారుగా చేయరాదు 

                      హజరత్ జుబైర్ బిన్ ముత్యమ్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ఒక అజ్ఞాని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తో ఈ విధముగా పలికెను: 

                      “ఓ అల్లాహ్ ప్రవక్తా! ప్రాణములు పోవుచున్నవి, పిల్లలు ఆకలితో అలమటించిరి, పంట నాశనమగుచున్నది. మీరు దయచేసి అల్లాహ్ ను వర్షము కొరకు ప్రార్థించండి. మేము అల్లాహ్ ను  మీ వద్ద, మిమ్ములను అల్లాహ్ వద్ద సిఫారసులుగా చేయుచున్నాము.” 

                      ప్రవక్త అతని మాటలు విని, “అల్లాహ్ పరిశుద్ధుడు, అల్లాహ్ పరిశుద్ధుడు అని చాలా సేపటి వరకు ఉచ్ఛరించుచుండిరి. సహచరులు దానిని గ్రహించిరి. చివరికి ప్రవక్త ఇలా ఉద్బోధించారు. “నీకై పశ్చాత్తాపము, అల్లాహ్ ఎవరో నీకు తెలియునా? అల్లాహ్ అతి ఉత్తముడు, ఆయనను ఎవరి ముందు సిఫారసు చేయువానిగా పలకరాదు.” 

                      దీనిలో 5 ప్రకరణములు కలవు 

                      1) ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘మేము అల్లాహ్ ని మీ వద్ద సిఫారసు చేయువానిగా అనుదుము’ అనిన వారి కొరకు పశ్చా త్తాపము కోరిరి. 

                      2) అజ్ఞాని పలికిన పైపలుకులకు ప్రవక్త ముఖకవళికలు మార్పు చెందు టను సహచరులు గ్రహించారు. 

                      3) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అజ్ఞాని పలికిన (మిమ్ములను అల్లాహ్ వద్ద సిఫారసుగా చేయుచున్నాము) దానికి ఏమీ ప్రస్తావించలేదు

                      4) సుబహానల్లాహ్ (అల్లాహ్ పరిశుద్ధుడు)కు విశ్లేషణము తెలుపబడెను. 

                      5) విశ్వసించినవారు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చి వర్షము కొరకు ప్రార్థన చేయించేవారని స్పష్టమగును. 

                      పాఠము 66 : ప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం)  తౌహీదు పరిరక్షించారు షిర్క్ మార్గాలకు కళ్ళెం వేశారు 

                      హజరత్ అబ్దుల్లా బిన్ షిఖియ్యిర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: నేను ఒకసారి బనూ ఆమిర్ ప్రతినిధి సంఘముతో పాటు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వెళ్ళి, “మీరు మా సర్దారు” అని పలికితిమి. అప్పుడు ప్రవక్త, “సర్దారు అల్లాహ్ ఒక్కడే” అని పలికిరి. అప్పుడు మరల మేము, “మీరు మాకంటే ఉత్తములు, మాకంటే ఎక్కువ దయగలవారు’ అని పలికితిమి. అప్పుడు ప్రవక్త, “ఇటువంటి అర్హత గల పలుకులనే పలకండి. షైతాను మిమ్మల్ని పెడత్రోవ పట్టించగలడు. జాగ్రత్త వహించండి” అని పలికిరి. (అబూ దావూద్) 

                      హజరత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: కొంతమంది ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను “ఓ అల్లాహ్ ప్రవక్తా! మాలో అందరికంటే ఉత్తముడా!, అందరికంటే ఉత్తముని కుమారుడా! ఓ సర్దార్, సర్దారు కుమారుడా” అని మేము పిలిచితిమి. ప్రవక్త ఈ విధముగా జవాబు పలికిరి. “ఓ ప్రజలారా! మీరు అర్హమైన మాటలే పలకండి, షైతాను మిమ్ములను పెడత్రోవ పట్టించగలడు. నేను ముహమ్మద్ ను  అల్లాహ్ దాసుడను, అల్లాహ్ ప్రవక్తను. మీరు నన్ను అల్లాహ్ నాకు ప్రసాదించిన నా స్థానము నుండి పెంచకండని నేను మిమ్మల్ని వారించుచున్నాను. (ఉత్తమసనద్ నసాయి పొందుపరచెను. ) 

                      దీనిలో 4 ప్రకరణములు కలవు 

                      1) హద్దు మీరి మాట్లాడువారు హెచ్చరించబడెను. 

                      2) “మీరు మా సర్దార్” అని అంటే చెప్పవలసిన జవాబు తెలుపబడెను. 

                      3) వారు మామూలు మాటలు పలికినప్పటికీ, షైతాను మిమ్మల్ని పెడత్రోవ పట్టించగలడు జాగ్రత్త” అని హెచ్చరించిరి. 

                      4) “అల్లాహ్ నాకు ప్రసాదించిన స్థానము నుండి నన్ను పెంచవద్దు” అని ప్రవక్త పలకటంతో మనము కూడా దానిని స్పష్టంగా అర్థం చేసుకోవలెను. 

                      పాఠము 67 : అల్లాహ్ ఘనత, గౌరవము (ఔన్నత్యము) 

                      ఖుర్ఆన్ లో అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను; 

                      وَمَا قَدَرُوا اللَّهَ حَقَّ قَدْرِهِ وَالْأَرْضُ جَمِيعًا قَبْضَتُهُ يَوْمَ الْقِيَامَةِ وَالسَّمَاوَاتُ مَطْوِيَّاتٌ بِيَمِينِهِ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ

                      “వారు అల్లాహ్ కనుగుణంగా అల్లాహు గౌరవించలేదు. ప్రళయ దినం నాడు యావత్తు భూమండలం ఆయన పిడికిలిలో ఉండును. సమస్తాకాశములు ఆయన కుడిచేతిలో చుట్టబడి ఉండును. వారు చేస్తున్న బహుదైవారాధనకు అల్లాహ్ అతీతుడు, పరిశుద్ధుడు.” (39:67) 

                      హజరత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ఒక యూద పండితుడు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చి ఈ విధముగా పలికెను: “ఓ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)! మా పుస్తకాలలో ఈ విధముగా ఉన్నది: అల్లాహ్ ప్రళయ దినం నాడు సకలాకాశాలను ఒక వేలిపై, భూమండలమును ఒక వేలిపై, సకల వృక్షములను ఒక వేలిపై, ఒక వేలిపై బురదను, మిగిలిన సకల సృష్టిరాశుల్ని ఒక వేలిపై ఉంచి, తరువాత ‘నేనే మీ రాజును’ అని సెలవిచ్చును కదా!” అతని మాటలు విని ప్రవక్త చిరునవ్వు నవ్వి ఈ వాక్యమును పఠించెను: 

                      వారసలు అల్లాహ్ ను గౌరవించ వలసిన విధంగా గౌరవించలేదు. ప్రళయదినాన భూమి అంతా ఆయన గుప్పెట్లో ఉంటుంది. ఆకాశాలన్నీ ఆయన కుడిచేతిలో చుట్టబడి ఉంటాయి. ఆయన పవిత్రుడు. వీళ్లు కల్పించే భాగస్వామ్యాలకు అతీతుడు – ఎంతో ఉన్నతుడు. (39:67) 

                      (దీనిని సహీ ముస్లిం, సహీ బుఖారి, సునన్ తిర్మిజీ, సునన్ నసాయి, ముస్నదె అహ్మద్ పొందుపరచెను.) 

                      మరో హదీసులో ఈ విధముగా తెలుపబడినది: “అల్లాహ్ ప్రళయ దినం నాడు సమస్త కొండలను, వృక్షములను ఒక వేలుపై ఉంచి, వాటిని ఊపి ‘నేనే రాజును, నేనే అల్లాహ్ ను’ అని పలుకును.” 

                      (సహీ ముస్లిం) మరో హదీసులో ఈ విధముగా తెలుపబడినది: “అల్లాహ్ సమస్త ఆకాశాలను ఒక వేలిపై, నీటిని, బురదను ఒక వేలిపై, మిగిలిన సకల సృష్టిరాశిని ఒక వేలిపై ఉంచును.’ (బుఖారి) 

                      హజరత్ అబ్దులా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: అల్లాహ్ ప్రళయదినం నాడు ఆకాశాన్ని చుట్టి తన చేతిలో తీసుకొని నేనే రాజును (భూమిపై) అహంకారులు ఎక్కడ ఉన్నారు? అని పలుకును. సమస్త భూమండలాలను చుట్టి తన ఎడమ చేతిలో తీసుకొని “నేనే రాజును! అహంకారము, గర్వము కలవారు (ఈ వేళ) ఎక్కడ ఉన్నారు?” అని పలుకును.  (సహీ ముస్లిం) 

                      హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా తెలిపిరి: “మీ చేతిలో రాగి గింజ ఎలా ఉండునో ఆ విధముగా అలాహ్ చేతిలో సప్త భూమ్యాకాశాలుండును.’ 

                      ఇబ్నె జరీర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా తెలిపెను: నాకు యూనుస్ ఒక హదీసు తెలిపెను. ఆయన ఇబ్నె వహబ్ నుంచి వినెను, ఆయన ఇబ్నె జైద్ నుంచి వినెను. ఆయన తండ్రితో వినెను. ఆయన తండ్రి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధనను ఈ విధముగా ఉల్లేఖించిరి: “సప్త ఆకాశాలు, కుర్చీతో పోల్చి చూసినచో, ఒక పెద్ద ప్రదేశములో సప్తనాణెములు వేసినట్లుండును. 

                      అబూజర్ గిఫారీ (రదియల్లాహు అన్హు) ప్రవక్త యొక్క బోధనను ఈ విధముగా ఉల్లేఖించిరి: “అల్లాహ్ యొక్క కుర్చీని ఆయన అర్హ్ను పోల్చి చూసినప్పుడు, ఒక పెద్ద ప్రదేశము (మైదానము)లో ఒక ఇనుప ఉంగరము వేసినట్లుండును.” 

                      హజరత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా తెలిపెను: మొదటి మరియు రెండవ ఆకాశముల మధ్య వేగవంతమైన గుర్రము ఐదువందల సంవత్సరముల ప్రయాణము చేయు (వ్యత్యాసము) దూరము కలదు. ఇదే విధముగా ప్రతి రెండు ఆకాశముల మధ్య ఇంతే దూరము కలదు. ఏడవ ఆకాశము మరియు కుర్చీకి మధ్య అంతే దూరము. కుర్చీ మరియు నీటికి మధ్య అంతే దూరము కలదు. నీటిపై అర్ష్ కలదు. అర్ష్ప అల్లాహ్ ఉన్నాడు. మీ ప్రతి కార్యము అల్లాహ్ కు తెలుసును.” (ఈ హదీసును ఇబ్నె మెహదీ హమద్ బిన్ సలమా నుంచి, ఆయన ఆసిం నుంచి, ఆయన జర్ నుంచి, ఆయన అబ్దుల్లా బిన్ మస్ ఊద్ నుంచి తెలిపెను. దీనిని మసూదీ ఆసిం నుంచి, ఆయన అబూ వాయల్ నుంచి, ఆయన అబ్దుల్లా నుంచి, ఆయన ప్రవక్త నుండి ఉల్లేఖించెను. హాఫిజ్ అద్ దహబి కూడా ఈ హదీసును పొందుపరచెను: హజరత్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముతల్లిబ్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు: 

                      ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: (భూమి మరియు ఆకాశానికి మధ్య ఎంత దూరమున్నదో తెలుసునా?” అని ప్రవక్త అడిగినప్పుడు, “అల్లాహ్ మరియు ప్రవక్తకే తెలుసును” అని పలికితిమి. అప్పుడు ప్రవక్త “వాటి మధ్య ఐదు వందల సంవత్సరాల ప్రయాణము చేయునంత దూరము కలదు. ప్రతి ఆకాశమునకు వేరే ఆకాశము నకు మధ్య అంతే దూరము కలదు. ఆకాశము యొక్క మందము కూడా అంతే. ఏడవ ఆకాశము మరియు అర్ష్ మధ్య సముద్రము కలదు. దాని క్రింద మరియు పైభాగము మధ్య ఇంతే దూరము. అల్లాహ్ దానిపై ఉన్నాడు. ఆదం సంతతి యొక్క ప్రతి కార్యము ఆయనకు తెలుసును.’ అని వివరించెను.(అబూదావూద్ పొందుపరచెను) 

                      దీనిలో 19 ప్రకరణములు కలవు 

                      1) వాక్యము (39:67) యొక్క భావము విశ్లేషించబడినది. 

                      2) హదీసులో తెలుపబడిన మాటలు యూదుల పుస్తకములలో కూడా కలవు. 

                      3) యూద పండితుని మాటలను ప్రవక్త స్వీకరించెను. ఖుర్ఆన్ వాక్యము కూడా అవతరించబడెను

                      4) యూద పండితుని స్వచ్ఛవచనములు విని ప్రవక్త నవ్వటం, ఆయన సంతోషానికి చిహ్నం.

                      5) అల్లాహ్ కు చేతులు ఉన్నవని స్పష్టమగుచున్నది. ఒక చేతిలో ఆకాశం, వేరొక చేతిలో భూమి ఉండును 

                      6) అల్లాహ్ కు ఎడమ చేయి అనునది ఉన్నట్టు అర్థమగును. 

                      7) మన చేతిలో రాగి గింజ ఉన్నట్లు, అల్లాహ్ చేతిలో భూమ్యాకాశాలు ఉండును. 

                      8) అల్లాహ్ ప్రళయదినం నాడు పొగరు మరియు అహంకారము చూపిన వారిని పిలుచును. 

                      9) అల్లాహ్ యొక్క కుర్చీ ఆకాశము కంటే పెద్దది.

                      10) అల్లాహ్ యొక్క అర్ష్  కుర్చీకంటే పెద్దది

                      11) అర్ష్, కుర్చీ, నీరు వేరు వేరు. 

                      12) ప్రతి రెండు ఆకాశముల మధ్య ఒక చురుకైన గుర్రము ఐదువందల సంవత్సరములు ప్రయాణించు దూరము కలదు. 

                      13. ఏడవ ఆకాశము మరియు కుర్చీ మధ్య దూరము తెలుపబడెను

                      14. కుర్చీ మరియు నీటికి మధ్య దూరము తెలుపబడెను.

                      15) అల్లాహ్ యొక్క అర్ష్ నీటిపై ఉన్నది. 

                      16) అల్లాహ్ అర్ష్ పై ఉన్నాడు. 

                      17) భూమ్యాకాశాల మధ్య దూరము తెలుపబడెను. 

                      18) ప్రతి ఆకాశము యొక్క మందము ఐదు వందల సంవత్సరములు ప్రయాణించినంత ఉన్నది. 

                      19) ఏడవ ఆకాశముపై ఉన్న సముద్రము యొక్క క్రింది మరియు పై భాగముల మధ్య కూడా ఐదువందల సంవత్సరములు ప్రయాణించి నంత దూరము కలదు. 

                      సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ యే స్తుతింపబడుటకు అర్హుడు. ప్రవక్తపై, తమ అనుచరులపై, విశ్వసించిన వారందరిపై అల్లాహ్ యొక్క శాంతి చేకూరును. 

                      పరలోకం [పుస్తకం & వీడియో పాఠాలు]

                      paralokam

                      అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
                      అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

                      [ఇక్కడ చదవండి డౌన్లోడ్ చేసుకోండి]
                      [PDF] [23 పేజీలు]

                      పరలోకం (పుస్తకం) – నసీరుద్దీన్ జామి’ఈ [యూట్యూబ్ ప్లే లిస్ట్] [8 వీడియోలు]
                      https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3JL2EaR6so-ViMpDU-HFzZ

                      ఈ పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిన వీడియో పాఠాలు (క్రొత్త వీడియోలు) :

                      (పాత వీడియోలు) :

                      [క్రింద పూర్తి పుస్తకాన్ని చదవండి]

                      اليوم الآخر – పరలోకం

                      సర్వ లోకాలకు పోషకుడైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు, అల్లాహ్ కరుణ మరియు శాంతి ఘనత గల ప్రవక్తపై, ఆయన కుటుంబీకులపై, ఆయన అనుచరులపై కురువుగాకా! అమీన్.

                      విశ్వాస ఆరు స్థంబాల్లో పరలోక విశ్వాసం ఒక మూల స్థంబం. మానవుడు దివ్య గ్రంథం ఖుర్ఆన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహీ హదీసుల్లో పరలోకము గురించి తెలుపబడిన రీతిలో విశ్వసించనంత వరకు విశ్వాసి కాజాలడు.

                      పరలోక విషయాలను తెలుసుకొనుట, ఎల్లపుడూ దాని జ్ఞప్తిలో ఉండుట చాలా ముఖ్యం. ఈ మూలంగా ఆత్మ శుద్ధి, దైవ భీతి మరియు ఇస్లాంపై స్థిరంగా ఉండే భాగ్యం కలుగుతుంది. ఆ నాటి కష్టాల, బాధల జ్ఞాపకం పట్ల అశ్రద్ధ కంటే కఠిన హృదయులుగా మార్చునది మరియు పాపానికి ఒడిగట్టే ధైర్యం ఇచ్చునది మరొకటి లేదు. అల్లాహ్ ఇలా తెలిపాడుః

                      [يَوْمًا يَجْعَلُ الوِلْدَانَ شِيبًا] {المزمل:17}

                      ఆ దినము బాలురను ముసలి వానిగా చేసివేయునట్టి దినము. (ముజమ్మిల్ 73: 17). మరో చోట ఇలా తెలిపాడుః

                      [يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمْ إِنَّ زَلْزَلَةَ السَّاعَةِ شَيْءٌ عَظِيمٌ، يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَى النَّاسَ سُكَارَى وَمَا هُمْ بِسُكَارَى وَلَكِنَّ عَذَابَ اللهِ شَدِيدٌ] {الحج:1، 2}

                      ఓ ప్రజలారా! మీరు మీ ప్రభువునకు భయపడండి, నిశ్చయంగా ప్రళయ కాలం నాటి భూకంపం చాలా గొప్ప విషయం. మీరు ఆ దినమును చూచునపుడు ప్రతి పాలిచ్చు స్త్రీ తన చంటిబిడ్డను మరచి పోవును. ప్రతి గర్భిణికి గర్భము జారిపడును. ప్రజలు మత్తులుగా కనబడుదురు. వాస్తవంగా వారు మత్తులో ఉండరు. కాని అల్లాహ్ శిక్ష చాలా కఠినమైనది. (హజ్ 22:1,2).

                      మరణం

                      1- ప్రతి జీవికి ఇహలోకములో అది చివరి మెట్టు. అల్లహ్ ఆదేశం:

                      ప్రతి మనిషి చావును చవి చూస్తాడు. (ఆలె ఇమ్రాన్ 3: 185).

                      భూమి పై ఉన్నవారందరూ నశింతురు. (రహ్మాన్ 55: 26).

                      [إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُمْ مَيِّتُونَ] {الزُّمر:30}

                      నీవు చావవలసి ఉన్నది. మరి వారూ చావ వలసి ఉన్నది. (జుమర్ 39: 30).

                      ఇహలోకములో ఏ మానవునికీ శాశ్వతం లేదు. అల్లాహ్ ఆదేశం:

                      పూర్వం ఏ మానవుడు శాశ్వతంగా జీవించియుండు నట్లుగా మేము చేయలేదు. (అంబియా 21: 34).

                      1- చావు ఖచ్చితమైన విషయం. అందులో సందేహానికి చోటు లేదు. అయినా అనేక మంది అశ్రద్ధగా ఉన్నారు. కాని ముస్లిం అధికంగా దాన్ని జ్ఞప్తిలో ఉంచాలి. దానికి సిద్ధమై ఉండాలి. వృధా గా సమయం దాటక ముందే ఇహలోకంలోనే పరలోక సామాగ్రి తయారు చేసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః

                      (اغْتَنِمْ خَمْسًا قَبْلَ خَمسٍ: حَياتَكَ قَبلَ مَوتِك، وَ صِحَّتَكَ قَبْلَ سَقمِكَ، وَ فَراغَكَ قَبلَ شُغلِكَ، وَ شَبَابَكَ قَبلَ هَرمِكَ، وَ غِناكَ قَبلَ فَقرِكَ)

                      “ఐదు విషయాలను మరో ఐదు విషయాలకంటే ఎంతో ఉత్తమమైనవని తెలుసుకోః జీవితాన్ని చావు రాక ముందు. ఆరోగ్యమును వ్యాది, అనా రోగ్యముకు ముందు. తీరికను పనులు మోపు కాక ముందు. యౌవనాన్ని వృద్ధాప్యముకు ముందు మరియు కలిమిని (సిరివంతమును) బీదరికంకు ముందు”. (హాకిం, బైహకీ ఫీ షొఅబిల్ ఈమాన్).

                      గమనార్హమైన విషయమేమనగాః శవం తన వెంట సమాధిలో ఇహలోక సామాగ్రి తీసుకెళ్ళదు. తన ఆచరణ మట్టుకే తనతో ఉంటుంది. అందుకు సత్కార్యాల సామాగ్రి వెంట తీసుకెళ్ళే ప్రయత్నం చేయు. దాని మూలంగానే నీవు అచ్చట సుఖాలు పొందుతావు. అల్లాహ్ కరుణతో ఆ శిక్షల నుండి రక్షణ కూడా పొందుతావు.

                      2- మనిషి చావు గుప్తముగా ఉంది. అది అల్లాహ్ కు తప్ప ఎవరికీ తెలియదు. ఎవరి చావు ఎక్కడ వచ్చునో ఎప్పుడు వచ్చునో ఎవరికీ తెలియదు. ఎందుకనగా ఇది అగోచర జ్ఞానంలో ఒకటి. అందుకే అల్లాహ్ కు మాత్రమే తెలియును.

                      3- చావు వచ్చిన తరువాత దానిని నెట్టేయడం, ఆలస్యం చేయడం మరియు చావు రాకుండా పరిగెత్తడం కాని పని. అల్లాహ్ ఆదేశం:

                      ప్రతి జాతి వారికొక గడువు నియమింపబడియున్నది. మరియు వారి గడువు వచ్చినపుడు ఒక గడియ వెనుక గాని ముందు గాని వారు కానేరరు. (ఆరాఫ్ 7: 34).

                      4- విశ్వాసుని వద్దకు ప్రాణం తీయు దూత అందమైన ముఖము, సువాసన దుస్తులతో వస్తాడు. అతనితో కరుణ దూతలు స్వర్గము యొక్క శుభవార్తలు వినిపిస్తూ హాజరవుతారు. అదే విషయాన్ని అల్లాహ్ ఇలా తెలిపాడుః

                      ఎవరైతే మా ప్రభువు అల్లాహ్ అని పలికిరో, మరల అందు స్థిరముగా ఉండిరో వారి యొద్దకు దేవదూతలు దిగివచ్చి ‘మీరు భయపడకండి. మరియు చింత పడకండి మీతో వాగ్దానం చేయబడుతున్న స్వర్గంతో సంతోషపడండి’ అని పలుకుదురు. (హామ్మీం అస్సజ్దా 41: 30).

                      అవిశ్వాసుని వద్దకు ప్రాణం తీయు దూత భయంకరమైన నల్లటి రూపములో దుర్వాసన దుస్తులతో వస్తాడు. అతనితో శిక్ష దూతలు శిక్షల శుభవార్తతో హాజరవుతారు. ఈ విషయమే అల్లాహ్ ఇలా తెలిపాడుః

                      ఈ దుర్మార్గులు మరణవేదనలో మునిగి తేలుతూ ఉండగా, దైవదూతలు తమ హస్తాలను చాచి, ఇటు తెండి, బయటకు తీయండి మీ ప్రాణాలను, అల్లాహ్ పై అపనిందను మోపి అన్యా యంగా కూసిన కూతలకూ, ఆయన ఆయతుల పట్ల తలబిరుసు తనం ప్రదర్శించినందుకూ ఫలితంగా ఈ రోజు మీకు అవమానకర మైన శిక్ష విధించబడుతుంది అని అంటూ ఉండగా ఆ దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుంటుంది!. (అన్ఆమ్ 6: 93).

                      చావు వచ్చినపుడు వాస్తవము స్పష్టమయి అసలు సంగతే మిటో ప్రతీ ఒకరికీ తెలుస్తుంది. అల్లాహ్ ఇలా తెలిపాడుః

                      తుదకు వారిలోనొకనికి చావు వచ్చునపుడు ఓ నాప్రభువా! నన్ను తిరిగి పంపి వేయుము. నేను వదలి వచ్చిన దానిలో సత్కార్యము చేయుదును అని పలుకును. అట్లు కానేరదు. అది ఒక మాట, దానిని అతడు పలుకుచున్నాడు. వారు మరల సజీవులై లేచు దినము వరకు వారి ముందర అడ్డు ఉన్నది. (మూమినూన్ 23: 99-100).

                      అవిశ్వాసులు మరియు పాపాత్ములు ఇహలోకానికి తిరిగి వచ్చి సత్కార్యములు చేయాలని కోరుదురు కాని అపుడు ఆ పశ్చాత్తాపం ఏమీ పనికి రాదు. అల్లాహ్ ఆదేశం చదవండిః

                      మరియు నీవు పాపాత్ములను చూచెదవు, వారు బాధను చూచునపుడు తాము తిరిగి పోవుటకు మార్గము గలదా? అని పలుకుదురు. (షూరా 42: 44).

                      5- తన దాసులపై అల్లాహ్ కరుణ ఒకటేమనగాః మరణానికి ముందు ఎవరి చివరి మాట “లాఇలాహ ఇల్లల్లాహ్” ఉండునో అతను స్వర్గ ప్రాప్తుడవుతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః

                      (مَنْ كَانَ آخِرُ كَلاَمِهِ ، لآ إله إلا الله دَخَلَ الْجَنَّة)

                      “ఈ ప్రపంచములో ఎవరి చివరి పలుకులు “లాఇలాహ ఇల్లల్లాహ్” ఉండునో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు”. (అబూ దావూద్ 3114). ఎందుకనగా ఈ క్లిష్ట సమయంలో మనిషి కలిమహ్ పఠించడం అసాధ్యం. అది తను మనుస్ఫూర్తిగా పఠించి దాని ప్రకారం ఆచరించినవాడయితే తప్ప. మనుస్ఫూర్తిగా పఠించని వ్యక్తి మరణ వేదనలో గల కష్టాలను భరించ లేక అది మరచిపోవును. అందుకు సక్రాత్ లో ఉన్న వ్యక్తికి దగ్గర కూర్చున్నవారు అతనికి కలిమహ్ తల్ ఖీన్ చేయడం (ఉపదేశించడం) పుణ్యకార్యం.

                      సమాధి

                      ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః శవాన్ని సమాధిలో పెట్టి అతని బంధువులు తిరిగి పోతుండగా అతడు వారి చెప్పుల శబ్దం వింటాడు. అప్పుడు ఇద్దరు దూతలు వచ్చి అతన్ని కూర్చోబెట్టి ‘ఇతని గురించి నీ విశ్వాసం ఏమిటి’? అని ప్రశ్నిస్తారు. ‘అతను అల్లాహ్ దాసుడు మరియ అల్లాహ్ ప్రవక్త’ అని నేను సాక్ష్యమిస్తున్నానని విశ్వాసి బదులిస్తాడు. ‘ఇదిగో నరకంలో నీ ఈ స్థలాన్ని చూడు దానికి బదులుగా స్వర్గంలో ఈ స్థలం అల్లాహ్ నీకు ప్రసాదించాడు’ అని అతనికి చెప్పబడుతుంది. అతడు స్వర్గము నరకము రెండూ చూస్తాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మరియు అవిశ్వాసి లేదా వంచకున్ని ‘ఇతని గురించి నీ విశ్వాసం ఏమిటి’? అని ప్రశ్నిస్తారు. ‘నాకు తెలియదు. లోకముతీరు నేనన్నాను’ అని అతను సమాధానమిస్తాడు. ‘నీవు తెలుసుకోలేదు మరియు ఖుర్ఆన్ పఠించలేదంటూ ఇనుప గదాలతో ఒక్క సారి కొడితే అతడు దాన్ని భరించలేక అరుస్తాడు. అతని కేకను ఇరుజాతులు తప్ప సమీపములోనున్న వారందరు వింటారు’. (బుఖారి 1338, ముస్లిం 2870).

                      ఆత్మను సమాధిలో ఉన్న దేహంలో పంపడమనేది పరలోక విషయం. మనిషి ఊహలకు అందనిది. అయినా సమాధిలో శుభాలకు, వరాలకు అర్హులైన విశ్వాసులకు శుభాలు మరియు శిక్షలకు అర్హులైన అవిశ్వాసులకు శిక్షలు జరగడం వాస్తవమేనని ముస్లిములందరూ ఏకీభవించారు. అల్లాహ్ ఇలా తెలిపాడుః

                      వారు ఉదయం, సాయంత్రం నరకాగ్ని ముందు ఉంచబడుతూ ఉంటారు. ప్రళయ గడియ వచ్చినపుడు ‘ఫిర్ఔను ప్రజలను తీవ్రమైన శిక్షలో ప్రవేశింపజెయ్యండి’ అని ఆజ్ఞాపించబడుతుంది. (మోమిన్ 40: 46). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారుః 

                      (تَعَوَّذُوا بِاللهِ مِن عَذَابِ الْقَبر)

                      “సమాధి శిక్షల నుండి అల్లాహ్ శరణు కోరండి”. (ముస్లిం 2867).

                      బుద్ధీ జ్ఞానాలతో గమనిస్తే ఇది తిరస్కరించలేని విషయం. ఇలాంటి ఉదాహరణాలు మానవుడు ఎన్నో చూస్తాడు. నిద్ర పోయిన వ్యక్తి కలలో ఎంతో శిక్షించబడుతున్నట్లుగా చూస్తాడు, అరుస్తాడు, సహాయం కోరుతాడు. కాని అతని ప్రక్కనే ఉన్న వ్యక్తికి అతని గురించి ఏమీ తెలియదు. ఇహలోకములోనే ఇలా ఉన్నప్పుడు చావు బ్రతుకుల్లో ఎంతో తేడా ఉన్న ఆ మరణాంతర విషయాన్ని ఊహించ గలమా? సమాధిలో శిక్ష ఆత్మ, దేహము రెండింటికగును. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః సమాధి పరలోకము యొక్క మొదటి మెట్టు అది క్షేమంగా దాటిన వారికి ఆ తరువాత చాలా సుఖము గలదు. మరియు క్షేమంగా దాటని వారికి ఆ తర్వాత చాలా కష్టము గలదు. (తిర్మిజి 2308).

                      అందుకని విశ్వాసి అధికంగా సమాధి శిక్షల నుండి అల్లాహ్ శరణు కోరుతుండాలి. ప్రత్యేకంగా నమాజులో సలాంకు ముందు. మరియు పాపాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. పాపాలే సమాధి శిక్షలకు మరియు నరక శిక్షలకు మూల కారణం.

                      సమాధి శిక్షలు: అనేక మంది సమాధి చేయబడుతారు కాబట్టి సమాధి శిక్ష అనబడింది. నీట మునిగి పోయినవారు, కాలి పోయినవారు మరియు క్రూర జంతువులకు ఆహారముగానైన వారందరికి శిక్షలు బర్ జఖ్ (ఇహపర లోకాల మధ్య స్థానం)లో తప్పవు. సమాధి శిక్షలు అనేక రకాలుగా ఉండును. ఇనుప గదాలతో కొట్టబడును. సమాధి చీకటితో నిండిపోవును. నరక పడకలు వేయబడి నరక ద్వారములు తెరువబడును. చెడు కార్యములు దుర్వాసన, అందవికారంగా మరియు భయంకరమైన రూపములో తోడుగా ఉండును. ఈ శిక్షలు అవిశ్వాసులకు మరియు వంచకులకు శాశ్వతంగా ఉండును. కాని విశ్వాసి అయిన పాపాత్మునికి పాపాల ప్రకారంగా శిక్ష జరిగిన తర్వాత అంతమై పోవును.

                      సమాధి వరాలు:  స్వచ్ఛమైన విశ్వాసుని సమాధి విస్తీర్ణము చేయబడి నూర్ (కాంతి)తో నింపబడును. మరియు స్వర్గ ద్వారములతో సువాసన, స్వర్గము యొక్క గాలి వీస్తుండగా స్వర్గ పడకలు వేసి యుండును. మరియు సత్కార్యాలు సువాసనతో నిండి అందమైన రూపములో తోడుగానుండును.

                      ప్రళయ దినం మరియు దాని సూచనలు

                      1- శాశ్వతంగా ఉండుటకు అల్లాహ్ ఈ లోకాన్ని సృష్టించలేదు. ఒక రోజు రానుంది అంతం కానుంది. ఆ రోజే “ఖియామత్” రోజు. ఏలాంటి సందేహం లేని యదార్థం అది. అల్లాహ్ ఆదేశం:

                      పునరుత్తాన దినము రానున్నది, అందెట్టి సందేహం లేదు. (హజ్ 22: 7). మరో చోట ఇలా చెప్పాడుః

                      మాకు ప్రళయ కాలం రాదు అని అవిశ్వాసులు పలుకుదురు. నీవు చెప్పు ఎందుకు రాదు అది తప్పక మీకు వచ్చును. (సబా 34: 3). ప్రళయ దినం సమీపములోనే ఉంది. దాన్ని అల్లాహ్ ఇలా తెలిపాడుః

                      [اقْتَرَبَتِ السَّاعَةُ ] {القمر:1}

                      తీర్పు కాలం సమీపించినది. (ఖమర్ 54: 1). మరో చోటః

                      ప్రజలకు తీర్పు కాలం సమీపించినది. వారు అజాగ్రత్తలో పడి విముఖులై యున్నారు. (అంబియా 21:1)

                      ఆ సమీపం అనేది మన అంచనా ప్రకారం లేదు. మానవులు దాన్ని తెలుసుకోలేరు. కాలము గడిసిన ప్రకారం అది కేవలం అల్లాహ్ కే తెలుసు.

                      ప్రళయదిన విషయం అగోచరమైనది. అది కేవలం అల్లాహ్ కే తెలుసు. ఆ విషయాన్ని ఆయన తన సృష్టిలో ఎవరికి తెలుపలేదు. అల్లాహ్ చెప్పెనుః

                      ప్రజలు ప్రళయకాలమును గూర్చి నిన్ను అడుగుచున్నారు. దాని విషయం అల్లాహ్ కే తెలియును అని ఓ ప్రవక్తా! పలుకుము. దాని విషయం నీకేమీ తెలుసు? ప్రళయకాలం సమీపములోనే కావచ్చు. (అహ్ జాబ్ 33: 63).

                      ప్రవక్త దానికి ముందు వచ్చే సూచనలు సూచించారు. అందులో కొన్ని క్రింద తెలుపబడుచున్నవిః

                      అందులో ఒకటిః మసీహుద్దజ్జాల్ రానున్నాడు. అతని రాకతో ఘోరమైన అరాచకం ప్రభలిపోతుంది. అల్లాహ్ అతనికి ఇచ్చిన శక్తితో విచిత్ర కార్యక్రమాలు ప్రజలకు చూపిస్తాడు. అందుచేత అనేక మంది మోసబోతారు. ఆకాశానికి ఆజ్ఞ ఇస్తే అది వర్షం కురిపిస్తుంది. అతని ఆజ్ఞతో అప్పటికప్పుడే మొక్కలు మొలు స్తాయి. మృతుడ్ని జీవింపజేస్తాడు. తదితర వింతలు చూపిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః అతడు కాణుడు. అతడు స్వర్గం నరకం లాంటి రెండు విషయాలు చూపిస్తాడు అతడు స్వర్గం అని చెప్పేది నరకం, అతడు నరకం అని చెప్పేది స్వర్గం. ఒక రోజు ఒక సంవత్సరముగా, ఒక రోజు ఒక నెలగా, ఒక రోజు ఒక వారముగా ఉండును. మిగిత రోజులు సామాన్య రోజులుగా ఉండును. అతడు మక్కా, మదీనా తప్ప ప్రతి దేశం తిరుగును.

                      ప్రళయదిన సూచనల్లో రెండవదిః ఈసా దిమిష్క్ (Damascus) (ఇది ఈనాడు సీరియా దేశం యొక్క రాజధాని) తూర్పున తెల్లని స్థంబం (మీనార్) నుండి ఫజ్ర్ నమాజ్ సమయంలో దిగి వచ్చును. సామూహికంగా (జమాఅత్ తో) ఫజ్ర్ నమాజ్ చేసుకొని దజ్జాల్ ను వెతికి సంహరించుదురు.

                      ప్రళయదిన సూచనల్లో మూడవదిః పశ్చిమ దిశ నుండి సూర్యోదయమగును. అది చూసి భయకంపితులై అనేక మంది (ఇస్లామే సత్యమని) విశ్వసించుదురు. కాని ఆ సమయాన ఏమి లాభముండదు. తదితర ఎన్నో సూచనలున్నాయి.

                      2- ఈ భూమిపై కేవలం దుర్మార్గులు, దుష్టులు మిగిలి ఉన్నపుడు ప్రళయం సంభవించును. అది ఏ విధంగనగాః ప్రళయానికి ముందు ఒక మందమారుతమైన గాలి వీస్తుంది దానితో విశ్వాసులు చనిపోతారు. ఇక అల్లాహ్ సృష్టంతటిని చంపి ప్రపంచాన్ని నశింపజేయాలనుకున్నప్పుడు “సూర్” (పెద్ద శంకు) ఊదుటకు దానికి నియమింపబడిన దూతకు ఆజ్ఞ ఇస్తాడు. దాన్ని విన్న ప్రజలందరు సొమ్మసిల్లి పోతారు. అదే విషయం అల్లాహ్ ఈ వాక్యంలో తెలిపాడుః

                      “సూరు” (శంకు) ఊదబడును. కావున ఆకాశములలోను భూమిలోనున్న వారందరు సొమ్మసిల్లి పోవుదురు. కాని అల్లాహ్ కోరినవారు సొమ్మసిల్లరు. (జుమర్ 39: 68).

                      అది శుక్రవారము రోజగును. ఆ తర్వాత దైవదూతలు కూడా చనిపోయి పరమ పవిత్రుడైన అల్లాహ్ తప్ప ఎవరూ ఉండరు.

                      3- సమాధులలో ప్రవక్తల, ధర్మయుద్ధంలో మరణించిన అమర వీరుల తప్ప అందరి దేహములను మట్టి తినేస్తుంది. కాని వెన్నె ముకలో గల ఒక బీజము అట్లే మిగిలి యుంటుంది. అల్లాహ్ ప్రజలందరికి పునఃర్జన్మ ఇవ్వాలని కోరినపుడు శంకు ఊదుటకు నిర్ణయించబడిన దూత ఇస్రాఫీల్ ను ముందు జీవింపజేయును. అతను శంకు ఊదును. మానవులందరు తొలిసారి (తల్లి గర్భం నుండి) వచ్చిన తీరు నగ్నముగా, ఖత్న (సున్నతీలు) చేయ బడకుండా సమాధుల నుండి లేచి వచ్చుదురు. అల్లాహ్ ఆదేశం:

                      సూరు ఊదబడును. అప్పుడే వారు తమ సమాధుల నుండి లేచి తమ ప్రభువు వద్దకు పరుగిడుదురు. (యాసీన్ 36: 51).

                      ఆ దినమున వారు సమాధుల నుండి లేచి ఒక గుర్తునకు పరిగెత్తి పోవునట్లు పరుగెత్తి పోవుదురు. అప్పుడు వారి కన్నులు క్రిందుగా నుండును. వారిపై అవమానము క్రమ్ముకొను చుండును. ఇదే వారితో వాగ్దానము చేయబడుచున్న దినము. (మఆరిజ్ 70: 43,44).

                      ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం ప్రకారం, అందరికన్నా ముందు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భూమి నుండి వెలికి వస్తారు. అందరూ మహ్షర్ మైదానము వైపు పరిగెత్తుతారు. అది చాలా విస్తీర్ణము మరియు విశాలమైన భూమి. అవిశ్వాసులు తలక్రిందులైన ముఖముతో వస్తారు. ఈ విషయము విన్న సహచరులు తలక్రిందులైన ముఖముతో ఎలా వస్తారు? అని ప్రశ్నించారు. “కాళ్ళతో నడిపించు శక్తి గలవాడు ముఖముతో కూడా నడిపించును” అని మహాప్రవక్త సమాధానమిచ్చారు. (ముస్లిం 2806). అల్లాహ్ మాటను తిరస్కరించిన వారు గ్రుడ్డివానిగా లేపబడుతారు. సూర్యుడు చాలా దగ్గరుంటాడు. ప్రతి ఒకరు తమ కర్మల ప్రకారం చెమటలో మునిగి యుంటారు. కొందరు చీలమండల వరకు, మరి కొందరు నడుము వరకు, కొందరు పూర్తిగా మునిగి యుంటారు. కొందరికి అల్లాహ్ ఆ నాడు తన నీడలో స్థానమిస్తాడు. ఆ నాడు తన నీడ తప్ప మరే నీడ ఉండదు. ప్రవక్త చెప్పారుః “ఏడు రకాల (గుణము గల) వారికి అల్లాహ్ ఆ నాడు తన నీడలో స్థానమిస్తాడు. ఆ నాడు తన నీడ తప్ప మరే నీడ ఉండదు. 1. న్యాయశీలుడైన పాలకునికి. 2. యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో మరియు ఆయన విధేయతలో గడిపిన యువకునికి. 3. మస్జిద్ లోనే తన మనుస్సు లగ్నం చేసుకున్న వ్యక్తికి. 4. కేవలం అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకు ప్రేమాభిమానాలు గల ఇద్దరు వ్యక్తులు వారు అల్లాహ్ కొరకే కలుసు కుంటారు. అల్లాహ్ కొరకే వేరు అవుతారు. 5. ఉన్నత వంశీయురాలైన, అందమైన స్త్రీ దుష్టక్రియకు అహ్యానిస్తే కేవలం అల్లాహ్ భయముతో తిరస్కరించిన వ్యక్తికి. 6. కుడి చెయ్యి దానం చేసినదేమిటో ఎడమ చెయ్యికి తెలియనంత రహస్యంగా దానా దర్మాలు చేసే వ్యక్తికి. 7. ఏకాంతములో అల్లాహ్ ధ్యానం చేస్తుండగా అతని కళ్ళ నుండి కన్నీరు కారినటువంటి వ్యక్తికి”. (బుఖారి 1423, మస్లిం 1031). ఇది పురుషులకే ప్రత్యేకం కాదు. స్త్రీలకు తమ కర్మల ప్రకారం లెక్క జరుగును. సత్కార్యములు గలవారికి మంచి ఫలితము, దుష్కార్యములు గలవారికి చెడు ఫలితము లభించును. మరియు వారికి పురుషులకు లభించినట్లు పూర్తి తీర్పు మరియు ప్రతిఫలము లభించును.

                      ప్రజలందరికి ఆ నాడు దాహము ఎక్కువగును. 50 వేల సంవత్సరాల ప్రమాణం గల ఒక రో జు అది. కాని విశ్వాసునికి అది ఫర్జ్ నమాజ్ చేసినంత సమయముగా అతి వేగంగా గడిసి పోవును. ఆ తరువాత విశ్వాసులు ప్రవక్తకు నొసంగబడిన “హౌజె కౌసర్” వద్దకు వచ్చి కౌసర్ నీరు త్రాగుదురు. (అది గౌరవము గల చాలా గొప్ప బహుమానము. అది అల్లాహ్ మన ప్రవక్తకే ప్రత్యేకించును. ప్రళయ దినాన ఆయన అనుచరులు అందు నుండి త్రాగుదురు. కౌసర్ నీరు పాలకన్నా తెలుపుగా, తేనేకన్నా తీపుగా మరియు కస్తూరి కన్నా ఎక్కువ సువాసన ఉండును. ఆకాశతారలకన్నా ఎక్కువ పాత్రలు అచ్చట ఉండును. ఒక్కసారి త్రాగిన వారికి మరెప్పుడూ దాహమవదు).

                      మహ్షర్ మైదానములో ప్రజలు తీర్పు కొరకు చాలా కాలము నిలుచుండి వారు తమ తీర్పు, లెక్క కొరకు ఎదురు చూచుదురు. అచ్చటి బాధలు మరియు ఎండతాపాన్ని భరించలేక దైవసన్నిధిలో తమ గురించి సిఫారసు చేయువారి కోసం వెతుకుతూ ఆదం వద్దకు వస్తే ఆయన నాతో కాదనగా నూహ్ వద్దకు వస్తారు. ఆయన కూడా మన్నించమంటారు. తర్వాత ఇబ్రాహీం, తర్వాత మూసా, తర్వాత ఈసా వద్దకు వస్తే వారు కూడా మాతో కాదని విన్నవించుకుంటారు. అప్పుడు ప్రవక్త వద్దకు వస్తే నేను దీనికి అర్హతగల వాన్నని ఆయన అల్లాహ్ అర్ష్ క్రింద సజ్దా చేసి అల్లాహ్ స్తోత్రములు పఠించి సిఫారసు చేయు అనుమతి కోరుతారు. అప్పుడు అల్లాహ్ “ఓ ముహమ్మద్ తలెత్తు నీ కోరిక తీర్చగలను అడుగు, సిఫారసు చెయ్యి స్వీకరించ బడును” అని లెక్క తీర్పు కొరకు అనుమతిస్తాడు. ముందు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతీల (అనుచరుల) తీర్పు అగును.

                      మానవుని కర్మల్లో మొదటి లెక్క నమాజ్ గురించి అగును. అందులో నెగ్గినవారి కర్మలను మాత్రమే చూడబడును. నెగ్గనివారి కర్మలు రద్దు చేయబడును. అదే విధముగా ఐదు విషయాలు గురించి ప్రశ్నించబడును. 1. నీ జీవిత కాలాన్ని ఏ కార్యాల్లో గడిపావు? 2. నీ యౌవ్వనాన్ని ఏ కార్యాల్లో కృశింపజేశావు? 3,4. ధనం ఎలా సంపాదించావు? ఎలా ఖర్చు చేశావు? 5. తెలుసుకున్న విషయాలపై ఎంత వరకు ఆచరించావు?. అతని దాసుల మధ్య జరిగే తీర్పులో మొదటిది అన్యాయంగా రక్తాలు చిందించిన వారి తీర్పు. అప్పుడు నష్టపరిహారాన్ని కట్టించుటకు సత్కర్యాలు లేక దుష్టకార్యాలు తప్ప మరేమీ ఉండవు. ఈ విధంగా పీడుతులకు అన్యాయము చేసినవాని సత్కార్యాలు పంచి పెట్టబడును. ఇతని సత్కార్యాలు అయిపోయి ఇంకా పీడితులు మిగిలి ఉంటె వారి పాపాలు అతనిపై వేయబడును.

                      నరకముపై వంతెన వేయబడును. (ఆ వంతెన వెంట్రుకకన్నా సన్నగా ఖడ్గం కన్నా వాడిగా ఉండును). ప్రతి ఒకరు తమ కర్మల ప్రకారం దానిపై దాటుదురు. కొందరు కనురెప్ప కొట్టినంతలో, కొందరు గాలి తీరు, కొందరు గుఱ్ఱపు రౌతు తీరు, కొందరు ప్రాకుచు పోవుదురు. దానికి కొండ్లుండును. అవి ప్రజలను నరకములో పడవేయును. అందులో పడువారు అవిశ్వాసులు మరియు విశ్వాసి అయినా పాపాత్ములు. అవిశ్వాసులు శాశ్వతంగా అందులో ఉందురు. కాని విశ్వాసులైన పాపాత్ములు అల్లాహ్ కోరినన్ని రోజులు శిక్ష పడిన తర్వాత స్వర్గానికి పంపబడుదురు. అల్లాహ్ తనిష్టపడిన ప్రవక్తలకు, మహాభక్తులకు తౌహీద్ సాక్ష్యమిచ్చిన పాపాత్ముల సిఫారసు చేయు అనుమతి ఇచ్చి, వీరి సిఫారసుతో వారిని నరకము నుంచి తీసి స్వర్గములో చేర్పించును. వంతెన దాటిన తర్వాత -స్వర్గానికి అర్హులైన వారు- నరకము స్వర్గము మధ్యలో ఆగి యుందురు. వారి పరస్పర అన్యాయాల తీర్పు వారు హృదయాల కల్ముషాలను దూరము చేసిన తర్వాత వారు స్వర్గములో చేరుదురు. స్వర్గస్తులు స్వర్గ ములో నరకవాసులు నరకంలో చేరిన పిదప వారి ముందు, వారు చూస్తుండగా మృత్యువును పొట్టేలు రూపంలో స్వర్గనరక ముల మధ్య జిబహ్ చేయ(కోయ) బడును. మళ్ళీ ఓ స్వర్గవాసు లారా! శాశ్వతంగా ఉండండి మరణం లేదు. ఓ నరకవాసులారా! మీకూ శాశ్వతం మరణం లేదు అని అనబడును. ఒక వేళ ఎవరైనా సంతోషంతో చనిపోతే స్వర్గవాసులు అంతులేని సంతోషంతో చనిపోతారు. మరియు ఎవరైనా బాధ, చింతతో చనిపోతే నరకవాసులు చనిపోతారు.

                      నరకము మరియు నరకశిక్షలు

                      అల్లాహ్ ఆదేశం:

                      ప్రజలు, రాళ్ళు ఇంధనం కాగల ఆ నరకాగ్ని నుండి భయ పడండి. అది అవిశ్వాసుల కొరకు సిద్ధమైయున్నది. (బఖర 2: 24).

                      ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “మీరు కాల్చే ఇహలోక అగ్ని నరకాగ్నిలో 70వ భాగం”. ఇదే చాలై పోయేది కాదు అని సహచరులు అనగా “ఈ అగ్ని కన్నా నరకాగ్ని 69 భాగములు ఎక్కువగా ఉండును. ప్రతి భాగములో ఇంతే వేడి ఉండును” అని బదులిచ్చారు. నరకములో ఏడు అంతస్తులు గలవు. ప్రతి అంతస్తు మరో అంతస్తు కన్నా ఎక్కువ శిక్ష (వేడి) గలది. ఎవరి కర్మల ప్రకారం వారు అందులో చేరుదురు. కాని వంచకులకు ఎక్కువ శిక్ష, బాధ గల క్రింది స్థానం గలదు. నరకవాసుల్లో తిరస్కారులకు శాశ్వతంగా శిక్ష జరుగును. కాలిపోయినపుడల్లా చర్మము మారును. అల్లాహ్ ఆదేశం:

                      [كُلَّمَا نَضِجَتْ جُلُودُهُمْ بَدَّلْنَاهُمْ جُلُودًا غَيْرَهَا لِيَذُوقُوا العَذَابَ] {النساء:56}

                      వారి చర్మము కాలిపోవునపుడల్లా దానికి బదులుగా వేరు చర్మమును వారు బాధ రుచి చూచుటకై కల్పించుచుందుము. (నిసా 4: 56). మరో చోట ఇలా తెలిపాడుః

                      [وَالَّذِينَ كَفَرُوا لَهُمْ نَارُ جَهَنَّمَ لَا يُقْضَى عَلَيْهِمْ فَيَمُوتُوا وَلَا يُخَفَّفُ عَنْهُمْ مِنْ عَذَابِهَا كَذَلِكَ نَجْزِي كُلَّ كَفُورٍ] {فاطر:36}

                      తిరస్కరించిన వారికి నరకాగ్నియున్నది. వారు చనిపోవుటకు వారికి చావు విధింపబడదు. దాని బాధ వారి నుండి తగ్గింప బడదు. ఇటులే ప్రతి కృతఘ్నునకు శిక్ష విధించుచున్నాము. (ఫాతిర్ 35: 36).

                      వారిని సంకెళ్ళతో కట్టి వారికి బేడీలు వేయబడునని తెలుపబడిందిః

                      [وَتَرَى المُجْرِمِينَ يَوْمَئِذٍ مُقَرَّنِينَ فِي الأَصْفَادِ ، سَرَابِيلُهُمْ مِنْ قَطِرَانٍ وَتَغْشَى وُجُوهَهُمُ النَّارُ] {إبراهيم:49، 50}

                      ఆ రోజు నీవు నేరస్థులను చూస్తావు. వారు సంకెళ్ళలో బంధించబడి ఉంటారు. గందకపు వస్త్రాలు ధరించబడి ఉంటారు. అగ్ని వారి ముఖాలను క్రమ్ముకొనును. (ఇబ్రాహీం 14: 49,50).

                      వారి తిండి విషయం ఇలా తెలిపాడుః

                      నిశ్చయంగా జెముడు వృక్షము పాపిష్టులకు ఆహరమగును. అది నూనె మడ్డి వలె ఉండును. అది కడుపులో సలసలకాగు నీళ్ళ వలె కాగును. (దుఖాన్ 44: 43-46).

                      ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం: “జఖ్ఖూం ఒక చుక్కైనా భూమిపై పడినచో భూమిపై ఉన్నవారి జీవనోపాయం చెడి పోతుంది. ఇక అది తినేవారికి ఎంత బాధ ఉండునో!”. నరక శిక్షల కఠినత్వం మరియు స్వర్గ శుభాల గొప్పతనాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా విశదీకరించారుః “ప్రపంచంలో అత్యధికంగా సుఖాలను అనుభవించిన అవిశ్వాసున్ని ఒక్కసారి నరకములో ముంచి తీసి, నీవు ఎప్పుడైనా సుఖాన్ని అనుభ వించావా? అని ప్రశ్నిస్తే, “లేదు ఎప్పుడూ లేదు” అని బదులిస్తాడు. అదే విధంగా ప్రపంచములో బీదరికాన్ని, కష్ట బాధలను అనుభ వించిన విశ్వా సున్ని ఒకసారి స్వర్గములో ప్రవేశించి ఎప్పుడైనా నీవు బీద రికాన్ని, కష్టాలను చూశావా? అని ప్రశ్నిస్తే “నేను ఎప్పుడూ చూడ లేదని బదులిస్తాడు. ఒకసారి స్వర్గంలో మునిగి లేస్తే ఇహలోక బాధలు, కష్టాలు మరచిపోయినట్లవుతుంది”. (ముస్లిం 2807).

                      స్వర్గం

                      అది సదాకాలమైన, గౌరవ నివాసం. దాన్ని మహాను భావుడైనా అల్లాహ్ తన పుణ్యదాసుల కొరకు సిద్ధ పరిచాడు. అందులోగల వరాలను ఏ కన్ను చూడలేదు. ఏ చెవి వినలేదు. ఎవరి మనుస్సు ఊహించనూ లేదు. దీని సాక్ష్యానికి ఈ ఆయత్ చదవండిః

                      వారి కర్మలకు ప్రతిఫలంగా కళ్ళకు చలువ కలిగించే ఎటువంటి సామాగ్రి వారి కొరకు దాచి పెట్టబడిందో ఆ సామాగ్రిని గురించి ఏ ప్రాణికీ తెలియదు. (సజ్దా 32: 17).

                      అల్లాహ్ మీలో విశ్వాసులైన వారికిని విద్యగల వారికి పదవులు ఉన్నతములుగా జేయును. (ముజాదల 58: 11).

                      వారు అందులో ఇష్టానుసారం తింటూ, త్రాగుతూ ఉందురు. అందులో నిర్మలమైన నీటి వాగులు, ఏ మాత్రం మారని రుచిగల పాల కాలువలు, పరిశుద్ధ తేనె కాలువలు మరియు సేవించే వారికి మధురంగా ఉండే మద్యపానాలుండును. ఇది ప్రపంచము లాంటిది కాదు. అల్లాహ్ ఆదేశం:

                      పరిశుభ్రమైన ద్రాక్ష రసములతో నిండుగిన్నెలు వారి వద్దకు తేబడును. అది తెల్లది గాను త్రాగు వారికి రుచిగా ఉండును. అందు తల తిరగదు. మరియు దాని వలన మతి చెడదు. (సాఫ్ఫాత్ 37: 45-47).

                      అక్కడి సుందరి స్త్రీల (హూరెఐన్ల)తో వివాహము జరుగును. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “స్వర్గములో ఉన్న స్త్రీ ఒక్కసారి ప్రపంచవాసులను త్రొంగి చూచినట్లయితే భూమ్యాకాశాల మధ్య కాంతితో, సువాసనతో నిండిపోతుంది”. (బుఖారి 2796).

                      విశ్వాసులకు అక్కడ లభించే అతిపెద్ద వరం అల్లాహ్ దర్శనం.

                      స్వర్గవాసులకు మలమూత్రం, ఉమ్మి లాంటివేవీ ఉండవు. వారికి బంగారపు దువ్వెనలుండును. వారి చెముటలో కస్తూరి లాంటి సువాసన గలదు. ఈ శుభాలు, వరాలు శాశ్వతంగా ఉండును. ఇవి తరగవు, నశింపవు. ప్రవక్త సలల్ల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “స్వర్గములో చేరిన వారి సుఖాలకు అంత ముండదు. వారి దుస్తులు పాతబడవు. వారి యవ్వనం అంతం కాదు”. (ముస్లిం 2836). అందులో అతితక్కువ అద్రుష్టవంతుడు నరకం నుండి వెళ్ళి స్వర్గంలో ప్రవేశించిన చివరి విశ్వాసుడు. అది అతనికి పది ప్రపంచాలకంటే అతి ఉత్తమంగా ఉండును.

                      ఓ అల్లాహ్! స్వర్గంలో చేర్పించే కార్యాలు చేసే భాగ్యం మాకు ప్రసాదించి మమ్మల్ని స్వర్గంలో ప్రవేశింపజేయుము. ఆమీన్!!