షైతాను కలతలు, దురాలోచనలు | తఖ్వియతుల్ ఈమాన్

إِن يَدْعُونَ مِن دُونِهِ إِلَّا إِنَاثًا وَإِن يَدْعُونَ إِلَّا شَيْطَانًا مَّرِيدًا
لَّعَنَهُ اللَّهُ ۘ وَقَالَ لَأَتَّخِذَنَّ مِنْ عِبَادِكَ نَصِيبًا مَّفْرُوضًا
وَلَأُضِلَّنَّهُمْ وَلَأُمَنِّيَنَّهُمْ وَلَآمُرَنَّهُمْ فَلَيُبَتِّكُنَّ آذَانَ الْأَنْعَامِ وَلَآمُرَنَّهُمْ فَلَيُغَيِّرُنَّ خَلْقَ اللَّهِ ۚ وَمَن يَتَّخِذِ الشَّيْطَانَ وَلِيًّا مِّن دُونِ اللَّهِ فَقَدْ خَسِرَ خُسْرَانًا مُّبِينًا
يَعِدُهُمْ وَيُمَنِّيهِمْ ۖ وَمَا يَعِدُهُمُ الشَّيْطَانُ إِلَّا غُرُورًا
أُولَٰئِكَ مَأْوَاهُمْ جَهَنَّمُ وَلَا يَجِدُونَ عَنْهَا مَحِيصًا

వారు అల్లాహ్‌ను వదలి స్త్రీలను మొరపెట్టు కుంటున్నారు. వాస్తవానికి వారసలు పొగరుబోతు షైతానును మొరపెట్టు కుంటున్నారు.అల్లాహ్‌ వాణ్ణి శపించాడు. షైతాను ఇలా అన్నాడు: “నీ దాసుల నుండి నేను నిర్ణీత భాగాన్ని పొంది తీర్తాను. వారిని దారి నుంచి తప్పిస్తూ ఉంటాను. వారికి ఉత్తుత్తి ఆశలు చూపిస్తూ ఉంటాను. పశువుల చెవులు చీల్చమని వారికి పురమాయిస్తాను. అల్లాహ్‌ సృష్టిని మార్చమని వారిని ఆదేశిస్తాను.” వినండి! అల్లాహ్‌ను వదలి షైతానును తన స్నేహితునిగా చేసుకున్నవాడు స్పష్టంగా నష్టపోయినట్లే.వాడు వారికి వట్టి వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. ఆశలు కలిగిస్తూ ఉంటాడు. కాని షైతాను వారితో చేసే వాగ్దానాలన్నీ మోసపూరితమైనవే.ఇటువంటి వారు చేరుకోవలసిన స్థలం నరకం. ఇక వారికి దాన్నుంచి తప్పించుకునే మార్గం ఏదీ ఉండదు. (దివ్యఖుర్ఆన్ 4: 117–121)

దైవేతరులను మొరపెట్టుకునేవారు వాస్తవానికి స్త్రీల పూజారులు. కొందరు నూకాలమ్మ, మర్యమ్మ, పోచమ్మ, ఉప్పలమ్మ, మైసమ్మ, కోటసత్తమ్మ, బషీరమ్మ, బతుకమ్మ, నంగాలమ్మ, సమక్క, సారలమ్మ ఇంకా ఎందరో దేవతలను, అమ్మవారిని మరియు కాళీని పూజిస్తుంటారు. ఇవన్నీ కేవలం కల్పితాలు మాత్రమే. వారికి ఎటువంటి వాస్తవం లేదు. అవన్నీ షైతాన్ కల్పించిన దురాలోచనలు మాత్రమే. వాటినే వారు దైవాలుగా భావిస్తున్నారు. ఈ కల్పిత దైవాలు చూపించేవి, చెప్పేవి అంతా షైతాన్ ఆడుతున్న నాటకం.

ముష్రిక్కులు (బహుదైవారాధకులు) చేస్తున్న ఆరాధనలన్నీ షైతాన్ కోసమే. వారు దేవతలను మొక్కుకుంటున్నామని అనుకుంటున్నారు. వాస్తవానికి వారు షైతాన్ ను మొక్కుకుంటున్నారు. ఈ విషయాల వల్ల ప్రాపంచిక ప్రయోజనం ఉండదు. ధార్మిక ప్రయోజనమూ ఉండదు. ఎందుకంటే షైతాన్ బహిష్కరించబడినవాడు. ఇతని వల్ల ధార్మిక ప్రయోజనం ఏ కోశానా లేదు. ఎందుకంటే షైతాన్ మానవుడి బద్ధ శత్రువు. అలాంటివాడు మానవుడికి మేలు జరగాలని ఎలా కోరుకుంటాడు? అతను అల్లాహ్ ముందు, ‘నేను నీ దాసులను దారి మళ్ళించి నా దాసులుగా చేసుకుంటాను, నన్నే విశ్వసించేలా వారి మనసుల్ని మార్చేస్తాను, వారు నా పేర జంతువులను జిబహ్ చేస్తారు. వారిపై నా కోసం మొక్కుకున్న గుర్తులుంటాయి. ఉదాహరణకు: జంతువుల చెవులను కోస్తారు. వారి మెడలో దండలేస్తారు. వారి నొసటిపై గోరింటాకు రాస్తారు. నోట్లో డబ్బు పెడతారు. వాటి వల్ల చాలా స్పష్టంగా అది మొక్కుకోబడిన జంతువని ఇట్టే అర్థమవుతుంది. నా ప్రభావం వల్ల నీవు ఇచ్చిన రూపాన్ని కూడా మార్చుకుంటారు. దేవతల పేర కేశాలు కత్తిరించకుండా అలాగే వదలిపెడతారు. చెవులు, ముక్కులు కుట్టించు కుంటారు. గడ్డాలు తీయించుకుంటారు. కనుబొమ్మలు తీయించుకుని నిరుపేదల్లా కనబడేలా చేస్తాను’ అన్నాడు.

ఇవన్నీ షైతాన్ కార్యాలే. ఇవన్నీ ఇస్లాం ధర్మానికి విరుద్ధం. కరుణామయుడైన అల్లాహ్ ను వదలి, శత్రువైన షైతాన్ మార్గాన్ని అవలంబించినవాడు స్పష్టమైన మోసంలో పడిపోయాడు. ఎందుకంటే షైతాన్ దురాలోచనలు రేపడం తప్ప మరేమీ చేయలేడు. అబద్ధాలతో, వాగ్దానాలతో మానవుణ్ణి మోసపుచ్చుతాడు. ఫలానా పని చేస్తే ఫలానా మంచి జరుగుతుంది. ఇన్ని డబ్బులుంటే చాలు అందమైన తోటను తయారు చేసుకోవచ్చు. సుందరమైన భవనాన్ని నిర్మించుకోవచ్చు అని ఆశలు రేకెత్తిస్తాడు. కాని ఆ కోరికలు తీరవు. కనుక మానవుడు ఆందోళన చెంది అల్లాహ్ ను విస్మరించి ఇతరులను మొరపెట్టుకుంటాడు. కాని అతని అదృష్టంలో ఉన్నదే జరుగుతుంది. వారిని నమ్మడం వల్ల ఒరిగేది ఏమీలేదు. ఇవన్నీ షైతాన్ రేపే కలతలు. ఇది అతని కుట్ర. అతని మాటలు విని మానవుడు షిర్క్ లో చిక్కుకుంటాడు. ఎంత ప్రయత్నించినా షైతాన్ ఉచ్చునుండి విముక్తి పొందలేకపోతాడు. చివరికి నరకానికి పాత్రుడవుతాడు. ఈ విషయాలు తెలిసిన తరువాత స్పృహ కలిగి తప్పించుకోనే ప్రయత్నం చేసి అల్లాహ్ అనుగ్రహంతో రక్షించబడిన వాడు తప్ప.

ఈ పోస్ట్ క్రింది పుస్తకం , 7 వ అధ్యాయం నుండి తీసుకోబడింది:
విశ్వాస ప్రదాయిని(తఖ్వియతుల్‌ ఈమాన్‌)
ఉర్దూ మూలం: హదీసు వేత్త షాహ్‌ ఇస్మాయీల్‌ (రహిమహుల్లాహ్)