వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
493. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కధనం :-
శుక్రవారం రోజు ఎవరు జనాబత్ గుస్ల్ (పూర్తి స్థాయి స్నానం) చేసి (పెందలాడే) జుమా నమాజు చేయడానికి వెళ్తాడో, అతను ఒక ఒంటెను బలి ఇచ్చిన వాడవుతాడు. (తర్వాత) రెండవ వేళలో ఇలా వెళ్ళిన వ్యక్తికి ఒక ఆవును బలి ఇచ్చిన పుణ్యం లభిస్తుంది. మూడవ వేళలో వెళ్ళే వాడికి ఒక పోట్టేలును బలిచ్చిన పుణ్యం, నాల్గవ వేళలో వెళ్ళే వాడికి ఒక కోడిని బలిచ్చిన పుణ్యం లభిస్తుంది. అయిదవ వేళలో వెళ్ళేవాడు దైవమార్గంలో ఒక కోడిగ్రుడ్డును దానం చేసిన వాడవుతాడు. ఆ తరువాత ఇమామ్ మస్జిదులో ప్రవేశించగానే దైవదూతలు కూడా అతని ప్రసంగం వినడానికి వస్తారు. (ఆ తరువాత వచ్చే వారికి దైవదూతలు హాజరు వేయరు).
[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 4 వ అధ్యాయం -ఫజ్లిల్ జూముఆ]
జుమా ప్రకరణం – 2 వ అధ్యాయం – శుక్రవారం రోజు సువాసనలు పూసుకోవడం, మిస్వాక్ చేయటం మంచిది.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
ఇతరములు:
జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
ఈ ప్రసంగం శుక్రవారం ఖుత్బా (ప్రసంగం) సమయంలో నిశ్శబ్దం పాటించడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఖుత్బా జరుగుతున్నప్పుడు ఇతరులను నిశ్శబ్దంగా ఉండమని చెప్పడం కూడా నిషేధించబడినదని, అలా చేయడం శుక్రవారం నమాజ్ యొక్క పుణ్యాన్ని కోల్పోయేలా చేస్తుందని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది. శుక్రవారం నాడు త్వరగా వచ్చి, స్నానం చేసి, నఫిల్ నమాజ్ చేసి, మౌనంగా ఖుత్బా విన్నవారికి పది రోజుల పాపాలు క్షమించబడతాయని చెప్పబడింది. ఖుత్బా వినడం అనేది అజాన్కు సమాధానం ఇవ్వడం కంటే ముఖ్యమైనదని, ఆలస్యంగా వచ్చినవారు కూడా సంక్షిప్తంగా రెండు రకాతుల నమాజ్ చేసి ఖుత్బా వినడంలో నిమగ్నం కావాలని ఈ ప్రసంగం బోధిస్తుంది.
السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الله، أما بعد. (అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్.) (అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీపై వర్షించుగాక. సర్వస్తోత్రాలు అల్లాహ్కే శోభాయమానం. అల్లాహ్ యొక్క ప్రవక్తపై శాంతి మరియు శుభాలు కలుగుగాక.)
باب الإنصات للخطبة يوم الجمعة (బాబుల్ ఇన్సాతి లిల్ ఖుత్బతి యౌమల్ జుమా) (శుక్రవారం రోజు ఖుత్బాకు మౌనంగా వినడం అనే అధ్యాయం.)
జుమా రోజు ఖుత్బా జరుగుతున్న సమయంలో మౌనం వహించడం, గమ్మున ఉండడం.
عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: إذا قلت لصاحبك يوم الجمعة أنصت والإمام يخطب، فقد لغوت (అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల్: ఇదా ఖుల్త లిసాహిబిక యౌమల్ జుముఅతి అన్సిత్ వల్ ఇమాము యఖ్తుబు, ఫఖద్ లగౌత)
అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “జుమా రోజు ఇమామ్ ఖుత్బా ఇస్తున్న సందర్భంలో నీవు నీ పక్కన ఉన్న సోదరునితో ‘మౌనం వహించు’ అని అంటే, నీవు ఒక లగ్వ్ (వ్యర్థమైన) పని చేసినవానివి అవుతావు.”
ఈ హదీస్ ద్వారా మనకు బోధపడే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒకటి, ఇమామ్ ఖుత్బా ఇస్తున్న సందర్భంలో, జుమా రోజు, మనం సైలెంట్గా ఉండాలి, మౌనం వహించాలి. ఏ కార్యకలాపాలు చేయకూడదు, ఏ మాట మాట్లాడకూడదు.
రెండో బోధ మనకిందులో, మన పక్కన ఎవరినైనా మనం చూస్తున్నాము, కొందరు మాట్లాడుకుంటున్నారు, ఏదైనా వృధా కార్యకలాపాల్లో ఉన్నారు, వారికి కూడా మనం చెప్పకూడదు. “అరే ఇలా చేయకు,” “ఓ బాయ్, ఖామోష్ రహో,” “మౌనం వహించు,” “ప్లీజ్ సైలెంట్గా ఉండు” అని మనం చెప్పకూడదు. ఇది ఇమామ్ యొక్క బాధ్యత, ఇమామ్ చెప్పాలి.
ఇక అతి ముఖ్యమైన విషయం ఇందులో మనకు తెలిసింది మరొకటి ఏమిటంటే, ఒకవేళ మనం ఇమామ్ ఖుత్బా ఇస్తున్న సందర్భంలో వేరే ఎవరితోనైనా, “మీరు గమ్మున ఉండండి,” “మాట్లాడకండి,” “ప్లీజ్ సైలెంట్” అని మనం చెప్పామంటే, మనం లగ్వ్ చేసిన వాళ్ళం అయ్యాము అని ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు.
లగ్వ్ అంటే ఇక్కడ ఏంటి? లగ్వ్ అంటే ఇక్కడ పనికిమాలిన, వృధా మాట. అయితే, చూడటానికి ఇక్కడ గమనించండి, గమనించండి, చూడటానికి మనం ఒక మంచి పని చేశామని అనిపిస్తుంది కదా? ఒక ఇద్దరు మాట్లాడుకుంటే, “ష్, సైలెంట్ ప్లీజ్” ఈ విధంగా మెల్లగా చెప్పేశాము. మనం ఒక మంచి పని చేశాము అనే భావన మనకు ఏర్పడింది. కానీ ప్రవక్త ఏమంటున్నారు? فقد لغوت (ఫఖద్ లగౌత) – “నీవు ఒక లగ్వ్ పని చేశావు” అని. మరియు ఇక్కడ లగ్వ్ అన్నదానికి భావం, ఇమామ్ హాఫిజ్ ఇబ్నె హజర్ అస్కలానీ రహ్మతుల్లా అలై తెలిపినట్లు,
خبت من الأجر (ఖిబ్త మినల్ అజ్ర్) నీవు జుమా యొక్క పుణ్యాన్ని కోల్పోయావు.
بطلت فضيلة جمعتك (బతలత్ ఫజీలతు జుముఅతిక్) జుమాకు సంబంధించిన ఏ ఘనత, ఏ గొప్పతనం అయితే ఉందో దాన్ని నీవు కోల్పోయావు అని భావం. అల్లాహు అక్బర్.
حرم فضيلة الجمعة (హురిమ ఫజీలతల్ జుమా) జుమా యొక్క ఫజీలత్ ఏదైతే ఉందో దాని నుండి అతడు మహ్రూమ్ అయిపోయాడు
అందుకొరకు సోదర మహాశయులారా, కొన్ని ప్రాంతాల్లో మనం ఏం చూస్తూ ఉన్నాము, ప్రత్యేకంగా అరబ్ ప్రాంతాల్లో, అనేకమంది మన సోదరులు, మిత్రులు ఖుత్బా అరబీలో జరుగుతుంది, మనకేం అర్థమవుతుంది అది అని చిన్నపాటిగా గుంపులుగా చేసుకొని ఇద్దరు, ముగ్గురు, నలుగురు వెనుక కూర్చుండి పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటారు. అల్లాహు అక్బర్, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఇది ఇంకా మహా ఘోరమైన విషయం.
గమనించండి ఇక్కడ. ఇద్దరు మాట్లాడుకునే వారిని, “మీరు సైలెంట్గా ఉండండి” అని చెప్పడంలోనే పాపం ఉన్నది, జుమా యొక్క సవాబ్ (పుణ్యం) కోల్పోతున్నారంటే, ఇక ఎవరైతే మాట్లాడుతున్నారో వారు ఎంత ఘోరమైన పాపంలో ఉన్నారో గమనించండి. ఈ హదీస్ ఏదైతే మీకు వినిపించానో, సహీ బుఖారీలో ఉంది, హదీస్ నంబర్ 934, అలాగే సహీ ముస్లిం, హదీస్ నంబర్ 851.
ఇక సంక్షిప్తంగా మరొక హదీస్ కూడా మనం విందాము.
عن أبي هريرة رضي الله عنه أن النبي صلى الله عليه وسلم قال: من اغتسل ثم أتى الجمعة، فصلى ما قدر له، ثم أنصت حتى يفرغ من خطبته، ثم يصلي معه، غفر له ما بينه وبين الجمعة الأخرى، وفضل ثلاثة أيام
(అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు అన్న నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల్: మనిగ్తసల సుమ్మ అతల్ జుముఅత, ఫసల్లా మా ఖుద్దిర లహు, సుమ్మ అన్సత హత్తా యఫ్రుగ మిన్ ఖుత్బతిహి, సుమ్మ యుసల్లీ మఅహు, గుఫిర లహు మా బైనహు వ బైనల్ జుముఅతిల్ ఉఖ్రా, వ ఫద్లు సలాసతి అయ్యామ్)
ఎవరైతే మంచి రీతిలో స్నానం చేశారో, జుమా నమాజు కొరకు హాజరయ్యారో మరియు ఖుత్బా కంటే ముందు వచ్చి అల్లాహ్ అతని అదృష్టంలో రాసినన్ని రకాతులు చేశాడో (ఇది జుమా ఖుత్బా కంటే ముందు, సామాన్యంగా వీటిని మనం నఫిల్ అంటాము. జుమా కంటే ముందు ఇన్ని రకాతులు అని ఫిక్స్ లేదు. కనీసం రెండు రకాతులు, కానీ అంతకంటే ఎక్కువగా ఎన్నైనా చదవవచ్చు. ఇమామ్ ఖుత్బా స్టార్ట్ చేసేకి ముందు వరకు), ఆ తర్వాత, ఎప్పుడైతే ఇమామ్ ఖుత్బా మొదలు పెడతాడో అప్పటి నుండి ఖుత్బా పూర్తి అయ్యే వరకు అన్సత (أنصت) – సైలెంట్గా ఉన్నాడు, మౌనం వహించాడు, గమ్మున ఉండిపోయాడు. ఆ తర్వాత ఇమామ్తో నమాజ్ చేశాడు. ఇలాంటి వ్యక్తికి ఈ జుమా నుండి మళ్ళీ వచ్చే జుమా వరకు, అంతకంటే మూడు రోజులు ఇంకా అదనంగా, అంటే మొత్తం పది రోజుల పాపాలు అల్లాహ్తాలా మన్నిస్తాడు. అల్లాహు అక్బర్.
గమనించండి, పది రోజుల పాపాలు జుమా రోజు నమాజుకు హాజరై, త్వరగా వచ్చి ఎన్ని రకాతులు అంటే అన్ని చేసుకొని, ఇమామ్తో ఖుత్బా వినడంలో శ్రద్ధ వహించడం, మౌనం వహించడం, అలాంటి వారి కొరకు ఈ గొప్ప ఘనత ఉంది. అంటే దీని ద్వారా తెలిసింది ఏమిటి? ఒకవేళ ఎవరైనా మాట్లాడారో, మధ్యలో ఏదైనా వృధా కార్యకలాపాలు చేశారో అంటే వారు జుమా యొక్క సవాబును కోల్పోయారు.
ఇక కొందరు ఒక ప్రశ్న అడుగుతారు. వచ్చేసరికి ఏదైనా ఆలస్యం అయిపోయింది, మేము మస్జిద్లోకి వచ్చాము, ఇమామ్ అజాన్ ఇస్తున్నాడు. ఆ సందర్భంలో ఏం చేయాలి? రెండు రకాతులు సున్నతులు చేసుకోవాలా? లేకుంటే అజాన్ అయ్యేవరకు మేము వేచి ఉండాలా, అజాన్ యొక్క జవాబు ఇవ్వడానికి? అయితే సోదర మహాశయులారా, అజాన్ యొక్క జవాబు ఇవ్వడం చాలా పుణ్యకార్యం, కానీ ఇమామ్ యొక్క ఖుత్బా వినడం అనేది అజాన్ యొక్క జవాబు కంటే ఎక్కువ ప్రాముఖ్యత గలది గనక, సంక్షిప్తంగా రెండు రకాతులు చేసుకొని కూర్చోవాలి, ఇమామ్ యొక్క ఖుత్బా శ్రద్ధగా వినాలి.
అల్లాహ్ మనందరికీ మన జీవితంలోని ప్రతీ సమస్యలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపినటువంటి పరిష్కారాన్ని స్వీకరించి ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక.
—
494. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-
“శుక్రవారం రోజు ఇమామ్ జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు, మీరు గనక మీ (ప్రక్కన కూర్చున్న) సహచరునితో ‘నిశ్శబ్దంగా’ ఉండు అని అంటే మీరొక పనికిమాలిన పనికి పాల్పడినవారవుతారు.”
[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 36 వ అధ్యాయం – అల్ ఇన్సాతి యౌముల్ జుమా వల్ ఇమాము యఖ్తుబ్]
జుమా ప్రకరణం – 3 వ అధ్యాయం – జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1 సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
ఇతరములు:
జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
أَسْتَغْفِرُ الله أَسْتَغْفِرُ الله أَسْتَغْفِرُ الله. اَللهُمَّ أَنْتَ السَّلامُ ومِنْكَ السَّلامُ تَبَارَكْتَ يَا ذَا الجَلالِ وَ الإكْرَام.
అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుచున్నాను, అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుచున్నాను, అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుచున్నాను. ఓ అల్లాహ్ నీవు ఏలాంటి లోపాలు లేనివాడవు. నీవే రక్షణ నొసంగువాడవు. ఓ ఘనుడవు, పరమదాతయువు నీవు శుభములు గలవాడవు.
లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅతైత వలా ముఅతియ లిమా మనఅత వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్ కల్ జద్ద్. (బుఖారీ 844, ముస్లం 593).
అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన అద్వితీయుడు. ఆయనకు భాగస్వామి ఎవడూ లేడు. ఆయనకే అధికారము చెల్లును. ఆయనకే సర్వ స్తోత్రములు గలవు. ఆయనే సర్వశక్తుడు. ఓ అల్లాహ్ నీవు నొసంగిన వరాలను ఎవడు అడ్డగింపజాలడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వజాలడు. ధనికుడు తన ధనముతో నీ శిక్షల నుండి తప్పించుకు- పోజాలడు.
అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన అద్వితీయుడు. ఆయనకు భాగస్వామి ఎవడూ లేడు. ఆయనకే అధికారము చెల్లును. ఆయనకే సర్వ స్తోత్రములు గలవు. ఆయనే సర్వశక్తుడు. పాపాములను వదులుకొనుట మరియు పుణ్యాలు చేయుట అల్లాహ్ దయవలననే కలుగును. అల్లాహ్ దప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన్నే మేము ఆరాధించుచున్నాము. ఆయనే సర్వ అనుగ్రహాలు దయ చేయువాడు. ఆయనకే ఘనత, మంచి స్తోత్రములు గలవు. అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. చిత్తశుద్ధితో మేము ఆయన్నే ఆరాధించుచున్నాము. ఈ విషయము సత్య తిరస్కారులకు నచ్చకున్నా సరే. (ముస్లిం 591, 593, 594, బుఖారి 844).
తరువాత సుబ్ హానల్లాహ్ 33, అల్ హందులిల్లాహ్ 33, అల్లాహు అక్బర్ 33 సార్లు చదివి, లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ తో 100 పూర్తి చేయాలి. (ముస్లిం 597).
జమాతుతో ఒకటి లేదా ఎక్కువ రకాతులు తప్పిపోయిన వ్యక్తిని మస్బాఖ్ అంటారు.
ఇమాం రెండవ సలాం త్రిప్పిన తర్వాత ఈ వ్యక్తి సలాం త్రిప్పకుండా తప్పిపోయిన రకాతులు వెరవేర్చాలి.
అతను ఇమాంతో ఏ రకాతులో కలిసాడో అదే అతనిది మొదటి రకాతు.
ఇమాంను రుకూ స్థితిలో పొందినవాని ఆ రకాతు అయినట్లే. ఇమాంను రుకూలో పొందకుంటే ఆ రకాత్ తప్పిపోయినట్లే లెక్క.
జమాతు నిలబడిన తర్వాత వచ్చేవారు జమాతును ఏ స్థితిలో చూసినా అదే స్థితిలో కలవాలి. వారు రుకూ, లేదా సజ్దా ఇంకే స్థితిలో ఉన్నా సరే. వారు మరో రకాతు కొరకు నిలబడే వరకు నిరీక్షించవద్దు.
నిలబడి తక్బీరె తహ్రీమ అల్లాహు అక్బర్ అనాలి. రోగి లాంటి ఏదైనా ఆటంకం ఉన్నవారు కూర్చుండి అల్లాహు అక్బర్ అంటే ఏమీ తప్పు లేదు.
నమాజును భంగపరుచు కార్యాలు:
1- తెలిసి, కావాలని మాట్లడడం, అది కొంచమైనా సరే.
2- పూర్తి శరీరముతో ఖిబ్లా దిశ నుండి పక్కకు మరలడం.
3- వుజూను భంగపరిచే కారణాల్లో ఏ ఒకటైనా సంభవించడం.
4- అనవసరంగా ఎడతెగకుండా ఎక్కువ చలనము చేయడం.
5- కొంచం నవ్వినా నమాజు వ్యర్థమవుతుంది.
6- తెలిసి కూడా ఎక్కువ రుకూ, సజ్దాలు, ఖియాం, జుల్సాలు చేయడం.
7- తెలిసి కూడా (రుకూ, సజ్దా వగైరా) ఇమాంకు ముందు చేయడం.
నమాజులు చేయరాని వేళలు:
కొన్ని సమయాల్లో నమాజు చేయుట యోగ్యం లేదు. అవి:
1- ఫజ్ర్ నమాజు తర్వాత నుండి సూర్యోదయం తర్వాత సూర్యుడు బారెడంత పైకి వచ్చే వరకు.
2- మిట్ట మధ్యానం, సూర్యుడు నడి ఆకాశంలో, తలకు సమానంగా ఉన్నప్పుడు. అది పశ్చిమాన వాలే వరకు.
3- అస్ర్ నమాజు తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు.
కాని ఈ సందర్భాల్లో కొన్ని నమాజులు చేయవచ్చు. ఉదాః తహియ్యతుల్ మస్జిద్ (మస్జిదులో ప్రవేశించిన వెంటనే చేయు నమాజ్). జనాజా నమాజ్. సూర్య గ్రహణ నమాజ్. తవాఫ్ సున్నతులు. తహియ్యతుల్ వుజూ లాంటివి.
అలాగే తప్పిపోయిన నమాజులు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసు ఆధారంగా:
دروس الصلاة -2- صفة الصلاة
నమాజ్ పాఠాలు: 2 వ పాఠం: నమాజు విధానం
వ్యవధి: 15 నిముషాలు
11:21 నిమిషాలు నమాజు విధానం తెలుపడం జరిగింది. తర్వాత 3:36 నిమిషాలు నమాజు చేసి చూపించడం జరిగింది. శ్రద్ధగా విని, చూసి నమాజు విధానం నేర్చుకోండి ఎక్కడ ఏ దుఆ చదవాలో కూడా నేర్చుకోండి
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
నమాజ్ చేస్తున్నప్పుడు నియ్యత్ తప్పనిసరి, అలాగే ప్రతి ఆరాధనలో కూడా. అయితే నియ్యత్ మనుస్సులో చేయాలి. నోటితో కాదు.
1- పూర్తి శరీరము మరియు పూర్తి శ్రద్ధాభక్తులతో ఖిబ్లా దిశలో నిలబడాలి. చూపులు, శరీరము అటూ ఇటూ ఉండకూడదు. (చూపులు సజ్దా చేసే చోట కేంద్రికరించాలి).
2- ‘తక్బీరె తహ్రీమ’ అల్లాహు అక్బర్ అంటూ రెండు చేతులు భుజాల వరకు లేదా చెవుల వరకు ఎత్తాలి.
3- కుడి అర చెయ్యిని ఎడమ అర చెయ్యిపై పెట్టి ఛాతిపై కట్టుకోవాలి.
4- దుఆయె ఇస్తిఫ్ తాహ్ చదవాలి:
అల్ హందులిల్లాహి హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్. (ముస్లిం 600).
(ఓ అల్లాహ్ నీవు పరమ పవిత్రునివి, నీకే సర్వ స్తోత్రములు, నీ నామము శుభం గలది. నీ మహిమ చాలా ఘనమయినది. నీవు తప్ప సత్య ఆరాధ్యుడెవడూ లేడు.)
ఇవి రెండే గాకుండా ఇతర దుఆలు కూడా చదవవచ్చును. ఎల్లప్పుడూ ఒకే దుఆ కాకుండా వేరు వేరు సమయాల్లో వేరు వేరు దుఆలు చదవడం ఉత్తమం. ఇలా నమాజులో నమ్రత, శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది.
(అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో * ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు, * అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు. * ప్రతిఫల దినానికి (అంటే ప్రళయ దినానికి) యజమాని. * మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము. * మాకు రుజుమార్గం (సన్మార్గం) చూపించు. * నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోనుకాని వారి మార్గం).
7- కంఠస్తం చేసి ఉన్న ఖుర్ఆనులోని ఏదైనా సూరా లేదా కొన్ని ఆయతులు పఠించాలి.
8- చేతులు భుజాల వరకు ఎత్తి, అల్లాహు అక్బర్ అంటూ రుకూ చేయాలి. రుకూలో అరచేతులతో మోకాళ్ళను పట్టుకోవాలి. వ్రేళ్ళు దగ్గరదగ్గరగా కాకుండా విడిగా ఉండాలి. సుబ్ హాన రబ్బియల్ అజీం మూడు సార్లు చదువుట సున్నత్. అంతకంటే ఎక్కువ చదవవచ్చు. ఒక్కసారి చదివినా సరిపోవును.
9- ఒంటరి నమాజు చేయు వ్యక్తి మరియు ఇమాం రుకూ నుండి తల లేపుతూ సమిఅల్లాహు లిమన్ హమిద అంటూ భుజాల వరకు చేతులెత్తాలి. నిలబడిన తర్వాత ముఖ్తదీ, ఒంటరి వ్యక్తి సమిఅల్లాహు లిమన్ హమిదహ్ కు బదులుగా రబ్బనా వలకల్ హమ్ ద్ అనాలి.
10- రుకూ తర్వాత నిలబడి ఉన్నప్పుడు ఈ దుఆ కూడా చదవవచ్చును:
అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్ దు మిల్ఉస్ సమావాతి వ మిల్ఉల్ అర్జి వ మిల్ఉ మాషిఅత మిన్ షైఇమ్ బఅదు.
(ఓ అల్లాహ్, మా ప్రభువా! నీకే ఆకాశముల నిండుగాను, భూమి నిండుగాను, అవి గాకా నీవు కోరిన వస్తువుల నిండుగాను స్తుతి గలదు. (ముస్లిం 476).)
11- అల్లాహు అక్బర్ అంటూ మొదటి సజ్దాలో వెళ్ళాలి. ఏడు అంగములపై సజ్దా చేయాలిః (1) నొసటి, ముక్కు. (2,3) రెండు అరచేతులు. (4,5) రెండు మోకాళ్ళు. (6,7) రెండు పాదముల వ్రేళ్ళు. చేతులను పక్కల నుండి దూరముంచాలి. కాళ్ళ వ్రేళ్ళను ఖిబ్లా దిశలో ఉంచి, సజ్దాలో సుబ్ హాన రబ్బియల్ అఅలా మూడు సార్లు పలుకుట సున్నత్. ఎక్కువ పలుకుట మంచిదే. ఒక్క సారి చదివినా సరిపోతుంది. ఈ స్థితిలో ఎక్కువ దుఆ చేయాలి. ఎందుకనగా ఇది దుఆ అంగీకార స్థితుల్లో ఒకటి.
12- అల్లాహు అక్బర్ అంటూ సజ్దా నుండి తలెత్తి ఎడమ పాదముపై కూర్చోవాలి. కుడి కాలు పాదమును నిలబెట్టాలి. కుడి చెయ్యి కుడి మోకాలుకు దగ్గరగా తోడపై, ఎడమ చెయ్యి ఎడమ మోకాలుకు దగ్గరగా తోడపై పెట్టాలి. చేతి వ్రేళ్ళను విడిగా పరచి ఉంచాలి. రబ్బిగ్ ఫిర్లీ రబ్బిగ్ ఫిర్లీ అని చదవాలి.
13- రెండవ సజ్దా మొదటి సజ్దా మాదిరిగా చేసి, సజ్దాలో అదే దుఆ చదవాలి.
14- అల్లాహు అక్బర్ అంటూ రెండవ సజ్దా నుండి లేస్తూ నిటారుగా నిలబడాలి.
15- రెండవ రకాత్ మొదటి రకాత్ మాదిరిగా చేయాలి. అందులో చదివిన దుఆలే ఇందులో చదవాలి. దుఆయె ఇస్తిఫ్ తాహ్ మరియు అఊజు బిల్లాహి…. తప్ప. ఈ రెండవ రకాత్ లోని రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అంటూ లేచి రెండు సజ్దాల మధ్యలో కూర్చున్న విధంగా కూర్చోని, కుడి చెయి వ్రేళ్ళను ముడుచుకొని నడిమి వ్రేళిని బొటన వ్రేళి మధ్యలో పెట్టి, చూపుడు వ్రేళితో సైగా చేస్తూ, కదలిస్తూ తషహ్హుద్ చదవాలి:
(నా వాక్కు, దేహా, ధన సంబంధమైన ఆరాధనలన్నియూ అల్లాహ్ కొరకే ఉన్నవి. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆయన శుభాలు కురువుగాకా. అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవరడూ లేడని సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు, ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను).
ఇక్కడి వరకు చదివిన తరువాత, చేతులు భుజాల వరకు ఎత్తుతూ అల్లాహు అక్బర్ అంటూ నిలబడాలి, ఒక వేళ మగ్రిబ్ లాంటి మూడు రకాతుల నమాజు లేదా జొహ్ర్, అస్ర్ మరియు ఇషా లాంటి నాలుగు రకాతుల నమాజు చేస్తుంటే, రెండవ రకాతు మాదిరిగా మిగిత నమాజు పూర్తి చేయాలి. అయితే ఖియామ్ (నిలబడి ఉన్న స్థితి)లో కేవలం సూరె ఫాతిహ చదువుతే సరిపోతుంది.
చివరి రకాతు రెండవ సజ్దా నుండి లేచి కూర్చోని తషహ్హుద్, దరూద్ ఇబ్రాహీమ్ మరియు ప్రవక్త నేర్పిన తనికిష్టమైన దుఆలు అధికంగా చదవడం మంచిది. (ఇది కూడా దుఆ అంగీకార సందర్భాల్లో ఒకటి). క్రింద దరూద్ మరియు ఒక దుఆ ఇవ్వబడుతుంది.
(ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీంను, వారి కుటుంబీకులను కరుణించినట్లు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు వారి కుటుంబీకులను కరుణించు. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి, ఘనుడివి. ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేసినట్లు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), వారి కుటుంబీకులకు శుభాలు దయ చేయుము. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి, ఘనుడివి. ఓ అల్లాహ్ నేను సమాధి శిక్షల నుండి, నరక యాతన నుండి, జీవన్మరణ పరీక్షల నుండి మరియు దజ్జాల్ మాయ నుండి రక్షణకై నీ శరణు కోరుతున్నాను).
16- అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అంటూ కుడి వైపున మెడ త్రిప్పాలి. అలాగే అంటూ ఎడమ వైపున మెడ త్రిప్పాలి.
17- జొహ్ర్, అస్ర్, మగ్రిబ్, ఇషా నమాజుల్లోని చివరి తషహ్హుద్ లో కూర్చుండే పద్ధతి ఇలా ఉండాలి. కుడి పాదాన్ని నిలబెట్టి ఎడమ పాదాన్ని కుడి కాలి పిక్క క్రింది నుంచి బైటికి తీయాలి. ఎడమ పిరుదును భూమిపై ఆనించాలి. కుడి చెయ్యి కుడి తోడపై, ఎడమ చెయ్యి ఎడమ తోడపై మోకాలుకు దగ్గరగా పెట్టాలి.
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
అబ్దుర్-రెహ్మాన్ బిన్` ఔఫ్ (రదియల్లాహు అన్ హు) వారు ఇలా అన్నారు: మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా బోధించారు:
“ఒక దేశంలో ప్లేగు వ్యాధి వ్యాపించిందని మీరు విన్నట్లయితే, అక్కడికి వెళ్లవద్దు. కానీ మీరు ఉన్న దేశంలో అది విచ్ఛిన్నమైతే దాని నుండి తప్పించుకొని బయటకు వెళ్లవద్దు.” (సహీహ్ బుఖారి 5730)
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రార్థించేవారు:
اللهم إني أعوذ بك من البرص والجنون، والجذام، وسيئ الأسقام
వస్త్రధారణ ఆదేశాలు [పుస్తకం & వీడియో పాఠాలు] https://youtu.be/7zmusYcXwMA [22 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
ఇస్లాం ధర్మం పరిశుభ్రత మరియు సౌందర్యాలను ప్రేమించు, ప్రోత్సహించు ధర్మం. ప్రతి ముస్లింకి (హద్దు లోపల ఉండి) అంద సౌందర్యాలను ప్రదర్శించే వస్త్రాలు ధరించే అనుమతిచ్చింది, ప్రోత్సహించింది. మర్మావయవాలను కప్పి ఉంచడానికి, అలంకరణగా ఉపయోగించుకోడానికి అల్లాహ్ వస్త్రాలను (తయారు చేసుకునే సాధానాలను) సృష్టించాడు. ఆయన ఆదేశం ఇలా వుంది:
“ఓ ఆదము సంతానమా! మేము మీపై దుస్తులను అవతరింపజేశాము. అవి మీరు సిగ్గుపడే మీ శరీర భాగాలను కప్పుతాయి. మీ శరీర రక్షణకు, శోభకు సాధనంగా ఉంటాయి.” (ఆరాఫ్ 7: 26).
వస్త్రధారణ విషయంలో ఏవి నిషిద్ధం అని స్పష్టమైన ఆధారం గలదో అవి తప్ప మిగతా వన్నియూ ధర్మసమ్మతమే. అలాగే ఇస్లాం వస్త్రధారణకు సంబంధించిన ఏదైనా ఒక ప్రత్యేక విధానాన్ని పరిమితం చేయలేదు. అయితే కొన్ని నియమ నిబంధనలు మాత్రం తెలిపింది. ప్రతీ ముస్లిం వస్త్రాలు ధరించినప్పుడు వాటిని ఆచరణలో ఉంచడం తప్పనిసరి. అవి ఈ విధంగా ఉన్నాయి:
1- శరీరంలో తప్పనిసరిగా దాచి ఉంచవలసిన భాగం మొత్తంపై వస్త్రం ఉండాలి. ధరించినప్పటికీ శరీరం కనబడునటువంటి పలచగా ఉండకూడదు. శరీరావయవాల పరిమాణాన్ని తెలుపునటువంటి ఇరుకుగా ఉండకూడదు.
2- ముస్లిమేతరుల ప్రత్యేక వస్త్రాల మాదిరిగా ఉండకూడదు. అలాగే సమాజంలో చెడు కార్యాలకు పాల్పడే వారికి ప్రత్యేక చిహ్నంగా ఉండే దుస్తుల మాదిరిగా కూడా ఉండకూడదు. (వారు హీరో, హీరోయిన్ల పేరుతో పిలువబడేవారయినా, వేశ్యావృత్తి అవలంభించువారైనా, మరెవరైనా సరే).
3- వృధా ఖర్చులతో కూడినవై ఉండకూడదు.
పై నియమాలను పాటిస్తూ మనిషి తనకిష్టమైన తనకు అవసరమైన, తన సమాజంలో వాడుకలో ఉన్న ఏ దుస్తులు ధరించినా మంచిదే. దుస్తుల విషయంలో వచ్చిన నివారణలు, నిషిద్ధతలకు సంబంధించిన వివరాలు క్రింద తెలుపబడుతున్నవి:
1- పురుషుల కొరకు బంగారం, పట్టు వస్త్రాలు నిషిద్ధం. అయితే అవి స్త్రీల కొరకు ధర్మసమ్మతమే. అలీ బిన్ అబూ తాలిబ్ (రజియల్లాహు అన్హు) హదీసులో ఉంది:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్టు వస్త్రాన్ని తమ కుడి చెయిలో, బంగారాన్ని తమ ఎడమ చెయిలో తీసుకొని ఇలా చెప్పారు:
“ఇవి రెండూ నా అనుచర సమాజంలోని పురుషుల కొరకు నిషేధించబడ్డాయి” అని చెప్పారు. (అబూ దావూద్/ ఫిల్ హరీరి లిన్నిసా 4057, నసాయి/ తహ్రీముజ్జహబి అలర్రిజాల్ 5053).
కాని పురుషులు వెండితో లేదా వెండి కలిపి మరేదానితోనైనా చేయబడిన ఉంగరం తమ అలవాటు ప్రకారం తొడగడంలో అభ్యంతరం లేదు.
2- ప్రాణం గల చిత్రం ఉన్న వస్త్రాలు: అంటే మనుషులు, జంతువుల చిత్రాలు గల వస్తువులు ధరించడం యోగ్యం కాదు. అవి దుస్తులయినా, నగలయినా మరేవైనా సరే.
ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం, ఆమె బొమ్మలు గీసి యున్న ఒక దిండు కొన్నది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బయటి నుండి వచ్చి దానిని చూడగానే తలుపు దగ్గరే ఆగిపోయారు. లోపలికి ప్రవేశించలేదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముఖంలో ఏదో ఇష్టం లేని చిహ్నాలు చూసి, ప్రవక్తా! నేను అల్లాహ్ వైపునకు తర్వాత ఆయన ప్రవక్త వైపునకు మరలుతున్నాను (క్షమాపణ కోరుకుంటున్నాను). నాతో జరిగిన తప్పేమిటో సెలవియ్యండి అని అన్నాను. అందుకు ఆయన “ఈ దిండు సంగతేమిటి?” అని మందలించారు. దీనికి మీరు ఆనుకొని కూర్చుంటారనే ఉద్దేశంతో నేను కొన్నాను అని చెప్పాను. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
“ఈ బొమ్మలు, చిత్రాలు చిత్రించేవారు ప్రళయదినాన శిక్షించబడుతారు. మీరు సృష్టించిన వాటిలో ప్రాణం పోయండి అని వారితో అనబడుతుంది”.
మళ్ళీ చెప్పారు:
“ఏ ఇంట్లో బొమ్మలు, చిత్రాలు ఫోటోలు ఉంటాయో ఆ ఇంట్లో దైవదూతలు ప్రవేశించరు”.
3- పురుషులపై నిషిద్ధమున్న మరో విషయం వారు తమ వస్త్రాలను చీలమండలం క్రిందికి తొడగుట.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారని అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“చీలమండలానికి క్రింద ఉన్న లుంగి (వస్త్రం) వారి ఆ భాగం నరకంలో ఉండును”. (బుఖారి/మా అస్ఫల మినల్ కాబైని… 5787).
అది పైజామా, పైంటు, దుప్పటి తదితర ఏ వస్త్రం అయినా సరే. కొందరి భ్రమ ప్రకారం ‘గర్వంతో తొడిగే వారికి ఈ శిక్ష’ అన్న మాట సరికాదు. గర్వం లేకుండా తొడిగే వారికే ఈ శిక్ష. గర్వంతో తొడిగే వారికి ఇంతకంటే మరీ ఘోరమైన శిక్ష గలదు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు:
“అహంకారంతో తన వస్త్రాన్ని (లుంగి, పైంటు వగైరాలు) ఈడుస్తూ నడిచే వ్యక్తిని అల్లాహ్ పరలోకంలో కన్నెత్తి కూడా చూడడు”.
కాని స్త్రీలు తమ వస్త్రాలను క్రింది వరకు వ్రేలాడదీయాలి. పాదాలు కూడా కనబడకుండా ఉండాలి.
4- తొడిగి కూడా నగ్నంగా కన్పించేటటువంటి పలచని, సన్నటి వస్త్రాలు యోగ్యం కావు. అలాగే శరీరావయవాల పరిమాణాన్ని వర్ణించే విధంగా ఇరుకుగా తొడుగుట యోగ్యం కాదు. ఈ ఆదేశం స్త్రీ పురుషులందరికీ వర్తిస్తుంది.ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
“ధరించికూడా నగ్నంగా కన్పించే దుస్తులు ధరించే స్త్రీలు స్వర్గంలో ప్రవేశించరు, దాని సువాసన కూడా పొందరు”. (ముస్లిం 2128).
5-. పురుషులు స్త్రీల లాంటి మరియు స్త్రీలు పురుషుల్లాంటి బట్టలు తొడుగుట నిషేధం.
ఇబ్ను అబ్బాస్ (రజియల్లాహు అన్హు) ఇలా చెప్పారు:
“స్త్రీల వేషాధారణ వేసుకునే పురుషులను, పురుషుల వేషాధారణ వేసుకునే స్త్రీలను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శపించారు”. (బుఖారి/అల్ ముతషబ్బిహూన బిన్నిసా… 5885).
6- అవిశ్వాసులు తమ ధార్మిక చిహ్నంగా ప్రత్యేకించుకున్న వేషాధారణ ముస్లిం ధరించడం నిషిద్ధం.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా ఒంటిపై కాషాయ రంగుతో కూడిన రెండు బట్టలు చూసి, “ఇవి అవిశ్వాసులు ధరించే బట్టల్లో ఒక రకమైనవి, నీవు వీటిని ధరించకు” అని చెప్పారు. (ముస్లిం/ అన్నహ్ యు అన్ లుబ్బిర్రజులి… 2077).
వస్త్రధారణ ధర్మములు
1- ముస్లిం పాటించవలసిన ధర్మాల్లో ఒకటి, కొత్త బట్టలు ధరించేటప్పుడు ఈ దుఆ చదవడం.
అబూ సఈద్ ఖుద్రీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొత్త బట్టలు ధరించేటప్పుడు చొక్కా, తలపాగ మరేదైనా దాని పేరు చెప్పి ఈ దుఆ చదివేవారు:
అల్లాహుమ్మ లకల్ హందు అంత కసౌతనీహి అస్అలుక మిన్ ఖైరిహీ వ ఖైరి మా సునిఅ లహూ వఅఊజు బిక మిన్ షర్రిహీ వషర్రి మా సునిఅ లహూ(*).
(భావం: ఓ అల్లాహ్! నీకే సర్వ స్తోత్రములు, నీవే నాకు ఈ బట్టలు ధరింపజేశావు. దీనిలోని మేలును మరియు దేని కొరకు అది నేయబడిందో దాని మేలును నీతో కోరుతున్నాను. దాని కీడు నుండి మరియు దేని కొరకు అది నేయబడిందో దాని కీడు నుండి నీ శరణు జొచ్చుచున్నాను). (అబూ దావూద్ 4020, తిర్మిజి 1767).
(*) పైన ఇవ్వబడిన దుఆ కొత్త బట్టలు ధరించేటప్పుడు చదివేది. అయితే రోజువారి బట్టలు ధరించేటప్పుడు “అల్ హందు లిల్లాహిల్లజీ కసానీ హజస్ సౌబ వరజఖనీహి మిన్ ఘైరి హౌలిమ్ మిన్నీ వలా ఖువ్వహ్” చదివే వారి పూర్వపు పాపాలన్నీ మన్నించబడతాయి. (అబూ దావూదు 4023).
2- బట్టలు తొడుక్కునేటప్పుడు కుడి వైపు నుండి తొడగడం ధర్మం.
ఆయిష (రజియల్లాహు అన్హా) చెప్పారు:
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాధ్యమైనంత వరకు మంచి కార్యాలు కుడి వైపు నుండి చేయడం మరియు మొదలు పెట్టటం ఇష్టపడేవారు. అది వుజూలోనైనా, తల దువ్వుకునేటప్పడైనా మరియు చెప్పులు తొడిగేటప్పుడైనా”. (బుఖారి 426, ముస్లిం 268).
చెప్పులు తొడిగేటప్పుడు ముందు కుడి కాలులో తొడగాలి కాని తీసేటప్పుడు ముందు ఎడమ కాలి నుండి తీయాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఆదేశించారని, అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“మీలో ఎవరయినా చెప్పులు తొడిగేటప్పుడు కుడి కాలు నుండి తొడగాలి. తీసేటప్పుడు ఎడమ కాలు నుండి తీయాలి. తొడిగితే రెండూ తొడగాలి. తీస్తే రెండూ తీయాలి”. (ముస్లిం 2097, బుఖారి 5856).
మరొక హదీసులో ఒక చెప్పు తొడిగి నడవడం నుండి నివారించబడింది. (బుఖారి 5855).
3- ప్రతీ ముస్లిం తన శరీరాన్ని, దుస్తులను పరిశుభ్రంగా, అశుద్ధతకు దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. పరిశుభ్రత ప్రతి అలంకారాణికి, అందానికి మూలం లాంటిది.ఇస్లాం పరిశుభ్రత గురించి ప్రోత్సహించడంతో పాటు శరీర, దుస్తుల శుభ్రతపై శ్రద్ధ చూపాలని కూడా చాలా ప్రోత్సహించింది.
తెల్లని బట్టలు ధరించడం మంచిది. ఇబ్ను అబ్బాస్ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖించిన హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
“మీరు తెల్లని దుస్తులు ధరించండి. మీ దుస్లులలోకెల్లా అతి ఉత్తమమైనవి ఇవే. మీ మృతులకు కూడా ఈ తెల్లని వస్త్రాలతోనే కఫన్ ఏర్పాటు చేయండి”. (అబూ దావూద్/అత్తిబ్/ ఫిల్ అమ్రి బిల్ కొహ్ లి 3878, తిర్మిజి/మా యుస్తహబ్బు మినల్ అక్సాన్ 994).
ఇతర రంగులు యోగ్యమే.
5- దుస్తులు ఇతర అలంకరణ వస్తువుల ఖరీదులో దుబార ఖర్చులు చేయకుండా, మరీ పిసినారితనం వహించకుండా మధ్యేమారాన్ని అవలంబించాలి. అల్లాహ్ ఇలా ఆదేశించాడు:
“వారు తమ సంపద వినియోగిస్తున్నప్పుడు దుబారా ఖర్చు చేయరు. ఇటు పిసినారితనం కూడా వహించరు. వారి ఖర్చు ఆ రెండు అతిచర్యలకు మధ్యస్తంగా ఉంటుంది.” (ఫుర్ఖాన్ 25: 67).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
“తినండి, త్రాగండి, ధరించండి మరియు దాన దర్మాలు చేయండి. అయితే దుబారా ఖర్చులు చేయకండి. అహంకారానికి గురికాకండి”. (బుఖారి/ కితాబుల్లిబాస్).
“తన ప్రభువుతో దాసుడు అత్యంత సమీపంలో ఉండేది సజ్దా లోనే. గనుక మీరు ఈ స్థితిలో అధికంగా దుఆ చేస్తూ ఉండండి” అని ప్రవక్త మహానీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించారని, అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (ముస్లిం).
అనస్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “అజాన్ మరియు ఇఖామత్ మధ్యలో చేసిన దుఆ రద్దుకాదు“. (తిర్మిజి).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించినట్లు సహల్ బిన్ సఅద్ ఉల్లేఖించారు:
“రెండు సమయాల్లో దుఆ తిరస్కరించబడదు. లేక తిరస్కరించబడే అవకాశం అతి తక్కువ. ఒకటి: అజాన్ వేళలో చేసే దుఆ. రెండవది: జిహాద్ లో ఒకరిపై నొకరు విరుచుకుపడినప్పుడు చేసే దుఆ”.(అబూ దావూద్).
అబూహురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనంలో, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“అల్లాహు తఆల ప్రతి రాత్రి (మూడు భాగాల్లోని) చివరి భాగంలో ఈ ప్రపంచ ఆకాశానికి దిగివచ్చి “నాతో మొరపెట్టుకునే వారెవరు, నేను వారి దుఆలను స్వీకరిస్తాను. నన్ను అర్థించే వారెవరు, నేను వారికి ప్రసాదిస్తాను. నాతో క్షమాపణ వేడుకునేదెవరు, నేను వారిని క్షమిస్తాను” అని అంటాడు. (బుఖారి: 1145. ముస్లిం: 758)
“నిశ్చయంగా రాత్రి వేళ ఓ గడియ ఉంది. అందులో ఏ ముస్లిమయితే అల్లాహ్ తో ఇహపరలోకాల మేలు కోరుకుంటాడో అల్లాహ్ అతనికి అది ప్రసాదిస్తాడు. ఇలా ప్రతి రాత్రి జరుగుతుంది” అని ప్రవక్త చెబుతుండగా నేను విన్నానని జాబిర్ (రజియల్లాహు అన్హు ) ఉల్లేఖించారు. (ముస్లిం).
విశేషాలు:
1- కొన్ని ప్రత్యేక సమయాలున్నవి వాటిలో దుఆ స్వీకరణపు నమ్మకం ఇతర సమయాలకంటే ఎక్కువగా ఉంటుంది.
2- ఆ సమయాలను అదృష్టంగా భావించాలని ప్రోత్సహించబడింది. ఆ సమయాల్లో అధికంగా దుఆ చేయుటకు ప్రయాస పడాలి.
3- ఆ సమయాల్లో కొన్ని ఇవి: సజ్దాలో, అజాన్ ఇఖామత్ ల మధ్యలో, రాత్రి చివరి గడియలో, జీహాద్ లో శత్రువులతో భేటి జరిగినప్పుడు.
దిన చర్యల పాఠాలు పుస్తకం నుండి
ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
35 వ అధ్యాయం
విధివ్రాత పై సహనం వహించుట కూడా అల్లాహ్ పై విశ్వాసంలో ఒక భాగం అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.
అల్లాహ్ ఆదేశం: “ఎవడు అల్లాహ్ ను విశ్వసిస్తాడో, అల్లాహ్ అతని హృదయానికి మార్గదర్శకత్వం ప్రసాదిస్తాడు”(తగాబున్ 64:11).
పై ఆయతులో ప్రస్తావించబడిన వ్యక్తి ఎవరు అనేది “అల్ ఖమ” ఇలా ప్రస్తావించారు: “అతనిపై ఏదైనా ఆపద వస్తే, అది అల్లాహ్ తరఫు నుండి అని అతను తెలుసుకొని, సంతోషిస్తాడు, మనఃపూర్వకంగా ఒప్పుకుంటాడు”.
అబు హురైరా (రది అల్లాహు అన్హు) కథనం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు: “కుఫ్ర్ కు (సత్యతిరస్కారానికి) సంబంధించిన రెండు గుణాలు ప్రజల్లో ఉన్నాయి. ఒకటి: ఒకరి వంశపరంపరను నిందించుట. రెండవది: చనిపోయినవారిపై శోకము చేయుట”.
అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు: “చెంపలను బాదుకుంటూ, దుస్తులు చించుకుంటూ అజ్ఞాన కాలపు అరుపులు పలుకులు పలికేవాడు మన (సంప్రదాయము అనుసరించే) వాడుకాడు”. (బుఖారి,ముస్లిం).
అనసు (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు: “అల్లాహ్ ఏ మానవునికి మేలు చేయగోరుతాడో, అతని పాపాలకు బదులు శిక్ష ఇహలోకంలోనే తొందరగా ఇచ్చేస్తాడు. ఏ మానవునికి మేలు చేయగోరడో, అతని పాపాలకు బదులు శిక్షను ప్రళయం వరకు వేచి ఉంచి అక్కడ ఇస్తాడు”. (తిర్మిజి).
మరో సారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో ప్రతిఫలం కూడా అంతే గొప్పగా ఉంటుంది. అల్లాహ్ ఏ సమాజం, సంఘాన్ని ప్రేమస్తాడో, దానిని పరీక్షకు గురి చేస్తాడు. ఎవరు దానిని సహనంతో (సహిస్తారో), వారిని అల్లాహ్ ఇష్టపడుతాడు.ఎవరు అసహనము చూపుతారో, అల్లాహ్ వారిపై ఆగ్రహస్తాడు”. (తిర్మిజి).
ముఖ్యాంశాలు:
1. తగాబున్ ఆయతు యొక్క భావం.
2. సహనం అల్లాహ్ పై విశ్వాసంలో ఒక భాగం.
3. వంశపరంపర లోని లోపాలను ఎంచుట మంచిది కాదు.
4.చెంపలు బాదుకుంటూ, దుస్తులు చించుకుంటూ, అజ్ఞానకాలపు పలుకులు పలికేవాని గురించి కఠినంగా హెచ్చరించబడింది.
5. అల్లాహ్ మేలు కోరిన వ్యక్తి లక్షణం తెలిసింది.
6. అల్లాహ్ మేలు కోరని వ్యక్తి లక్షణం తెలిసింది.
7. అల్లాహ్ ప్రేమించిన వ్యక్తి చిహ్నం.
8. పరీక్ష ఆపదపై అసంతృప్తి వ్యక్తం చేయుట నిషిద్ధం.
9. వాటిపై సహనం వహించుట వలన పుణ్యం లభిస్తుంది.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ)
ఓపికతో అల్లాహ్ కు విధేయులగుట, పాపం నుండి దూరంగా ఉండి సహనం వహించుట – ఇవి రెండూ విశ్వాసంలో లెక్కించబడుతాయి. అంతే కాదు అవి దాని పునాది. దాని భాగాలే. అల్లాహ్ ప్రేమించేవాటిని, ఆయనకు ఇష్టమున్న, ఆయన సన్నిధిలో చేర్పించేవాటిని ఓపికతో (ఆచరించుట), ఆయన నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండి సహనం వహించుటయే విశ్వాసం.
ఇస్లాం పునాది మూడు సూత్రాల పై ఉంది.
అల్లాహ్ , ఆయన ప్రవక్త తెలిపిన వాటిని సత్యం అని నమ్ముట.
అల్లాహ్ , ఆయన ప్రవక్త ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించుట.
అల్లాహ్ , ఆయన ప్రవక్త నిషేధించినవాటి నుండి దూరంగా ఉండుట.
అల్లాహ్ వ్రాసిన విధివ్రాత బాధాకరమైనప్పటికి దానిపై ఓపిక వహించుట ఇందులోనే వస్తుంది. కాని దాన్ని తెలుసుకొనుట, ఆచరించుట చాలా అవసరం కాబట్టి దానిని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది.
ఆపద, కష్టం అల్లాహ్ తరఫు నుండియే వస్తుంది అని, అల్లాహ్ దాన్ని నిర్ణయించడంలో సంపూర్ణ వివేచణాపరుడని, దానిని మానవునిపై నిర్ణయించడం కూడా ఆయన సంపూర్ణ వరమేనని తెలుసుకున్న వ్యక్తి అల్లాహ్ వ్రాసిన విధివ్రాతతో సంతోషించి, దాన్ని మనఃపూర్వకంగా ఒప్పుకొని, అసంతృప్తికరమైన వాటిపై అల్లాహ్ సన్నిధానం కోరుతూ, పుణ్యాన్ని ఆశిస్తూ, ఆయన శిక్షతో భయపడుతూ మరియు సత్ప్రవర్తన అవలంబించే సమయం వచ్చిందని భావిస్తూ సహనం వహించాలి. అప్పుడు అతని హృదయానికి తృప్తి శాంతి కలుగుతుంది. అతని విశ్వాసం, ఏకత్వంలో బలం వస్తుంది.
You must be logged in to post a comment.