87. తఫ్సీర్ సూర అల్ ఆలా (Tafseer Sura Al A’ala) [వీడియో & టెక్స్ట్]

తఫ్సీర్ సూర అల్ ఆలా (Tafseer Sura Al A’ala) 
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/5shT_PdxwNE [60 నిముషాలు]

ఈ ప్రసంగంలో, సూరహ్ అల్-ఆ`లా యొక్క వివరణ ఇవ్వబడింది. అల్లాహ్ యొక్క పవిత్రతను కీర్తించడం (తస్బీహ్) నాలుగు విధాలుగా ఉంటుందని వివరించబడింది: హృదయంలో, మాటలో, అల్లాహ్ నామాలు మరియు గుణాల విషయంలో, మరియు ఆచరణలో. అల్లాహ్ యే సృష్టికర్త, సృష్టిని తీర్చిదిద్ది, ప్రతిదాని విధిని నిర్ధారించి, మార్గదర్శకత్వం ఇచ్చేవాడని నొక్కి చెప్పబడింది. ప్రాపంచిక జీవితం తాత్కాలికమని, పచ్చిక బయళ్ళు ఎండిపోయినట్లు మానవ జీవితం కూడా ముగుస్తుందని, కానీ అల్లాహ్ పునరుత్థానం చేస్తాడని గుర్తుచేయబడింది. ఖుర్ఆన్ ను ప్రవక్త (స)కు అల్లాహ్ యే గుర్తుంచుకునేలా చేస్తాడని, దానిని అనుసరించడం సులభతరం చేయబడిందని చెప్పబడింది. అల్లాహ్ కు భయపడేవారే ఉపదేశాన్ని స్వీకరిస్తారని, దౌర్భాగ్యులు దానిని తిరస్కరించి ఘోరమైన నరకాగ్నిలో ప్రవేశిస్తారని హెచ్చరించబడింది. ఆత్మశుద్ధి చేసుకుని, అల్లాహ్ ను స్మరించి, నమాజ్ చేసేవారే సాఫల్యం పొందుతారని. ప్రాపంచిక జీవితం కంటే పరలోక జీవితమే శ్రేష్ఠమైనదని, శాశ్వతమైనదని, ఈ సందేశం ఇబ్రాహీం (అ.స) మరియు మూసా (అ.స) గ్రంథాలలో కూడా ఉందని సూరహ్ ముగుస్తుంది. ప్రసంగం తర్వాత, ఇషా నమాజ్ సమయం, ఉదూ లేకుండా ఖుర్ఆన్ పట్టుకోవడం, మరియు షిర్క్ కు సంబంధించిన ఆచారాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడ్డాయి.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబీయ్యినా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వసహ్బిహీ అజ్మయీన్ అమ్మా బాద్.

ప్రియ విద్యార్థులారా, ఈరోజు మనం అల్లాహ్ యొక్క దయతో సూరతుల్ ఆలా యొక్క తఫ్సీర్ ప్రారంభించబోతున్నాము. అయితే ఈ సూరకు సంబంధించి కొన్ని ప్రారంభ విషయాలు నేను ఇంతకుముందు క్లాస్ లో చెప్పి ఉన్నాను.

మొదటి ఆయతు

سَبِّحِ اسْمَ رَبِّكَ الْأَعْلَى
(సబ్బిహిస్మ రబ్బికల్ ఆ`లా)
నీ మహోన్నత ప్రభువు నామాన్ని కీర్తించు. (87:1)

సబ్బిహ్’ – పవిత్రతను కొనియాడు, ‘సుబ్ హా నల్లాహ్’ అని పలుకుతూ ఉండు. దీని యొక్క భావం ఇంతకు ముందే నేను చెప్పాను, నాలుగు రకాలుగా ఉండాలి. మనం అల్లాహ్ యొక్క తస్బీహ్ నాలుగు రకాలుగా చేయాలి.

  • (1) ఒకటి, మన మనస్సులో అల్లాహ్ అన్ని రకాల షిర్క్, అన్ని రకాల లోపాలు, అన్ని రకాల దోషాలకు అతీతుడు అని బలంగా నమ్మాలి.
  • (2) మరియు ‘సుబ్ హా నల్లాహ్’ అని నోటితో పలుకుతూ ఉండాలి.
  • (3) మూడవది, అల్లాహ్ యొక్క ఉత్తమ నామాలు, అల్లాహ్ యొక్క మంచి గుణాలు అవి అల్లాహ్ కు మాత్రమే తగును, అందులో అల్లాహు త’ఆలా ఎలాంటి లోపాలు లేనివాడు అని కూడా స్పష్టంగా నమ్మాలి.
  • (4) ఇంకా, మన ఆచరణ ద్వారా అల్లాహ్ యొక్క పవిత్రతను కొనియాడాలి. అంటే, మనం ఏ పని చేయడం ద్వారా మనం అల్లాహ్ కు ఒక దోషాన్ని అంటగట్టిన వారం అవుతామో, అలాంటి పనులు చేయకూడదు. అల్లాహ్ అన్ని రకాల దోషాలకు, లోపాలకు అతీతుడు అని స్పష్టమయ్యే అటువంటి పనులు మనం చేయాలి. అంటే అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని చాటాలి మన యొక్క ఆచరణ ద్వారా కూడా.

    ఒక చిన్న ఉదాహరణ చూడండి , మీకు విషయం అర్ధం అవుతుంది . మనం భారతీయులము గనక 15వ ఆగస్టు, 26 జనవరి ఇలాంటి సందర్భంలో మనం మన దేశ దేశానికి ఏదైతే స్వాతంత్రం లభించినదో, దానిని పురస్కరించుకొని ఒక సంబరం, ఒక సంతోషం వ్యక్తపరుస్తాము. కానీ మన తోటి భారతీయులు కొందరు ఏం చేస్తారు? ఆ సమయంలో అక్కడ నెహ్రూ గారి లేదా గాంధీ గారి యొక్క బొమ్మలు పెట్టి అక్కడ కొబ్బరికాయ కొడతారు. అయితే ఈ సందర్భంలో మనం అల్లాహ్ యొక్క పవిత్రతను కొనియాడాలి మన ఆచరణ ద్వారా. అయితే మనం, వారు అక్కడ టెంకాయ కొడుతున్నప్పుడు కేవలం ‘సుబ్ హా నల్లాహ్’ అనుకుంటే సరిపోదు. ఎప్పుడైతే ‘ఓ రండి, మీరు మా జమాత్ యొక్క పెద్ద, మీరు మా యొక్క స్కూల్ కు పెద్ద ఆర్గనైజర్, మీరు పెద్ద హెడ్ మాస్టర్’ ఈ విధంగా ఎవరైనా ఒక ముస్లింని ఆహ్వానించి ముందుకు తీసుకొచ్చి అతని చేతిలో ఓ టెంకాయ ఇచ్చి ‘కొట్టండి’ అని అంటే అక్కడ అతని యొక్క పరీక్ష. అతడు అల్లాహ్ కు కాకుండా వేరే వారికి ఈ టెంకాయ కొట్టి టెంకాయ సమర్పించినవాడు అవుతున్నాడు. అంటే అతను ‘సుబ్ హా నల్లాహ్’ నోటితో పలుకుతున్నా, ఆచరణతో వ్యతిరేకిస్తున్నాడు అని భావం. ఇప్పుడు అర్థమైందా అందరికీ క్లియర్ గా? మనం అల్లాహ్ యొక్క అల్లాహ్ యొక్క పవిత్రతను మన ఆచరణ ద్వారా మనం ఎలా కొనియాడాలి అన్న విషయం తెలిసింది కదా?

ఇక ‘రబ్బిక’ నీ ప్రభువు అన్నటువంటి పదం ఇక్కడ అల్లాహు త’ఆలా ఉపయోగించాడు. ‘సబ్బిహిల్లా’ అల్లాహ్ యొక్క పవిత్రత కొనియాడు అని అంటే కూడా మాట వస్తుంది. కానీ ‘రబ్బిక’ అనడంలో ఇక్కడ హిక్మత్, ఔచిత్యం అని కొందరు ధర్మవేత్తలు, వ్యాఖ్యానకర్తలు ఏం తెలిపారంటే, ఖుర్ఆన్ అవతరిస్తున్న సందర్భంలో ఏ ముష్రికులు అయితే ఉండేవారో చుట్టుపక్కన మొత్తం, వారు మనందరి సృష్టికర్త అయిన నిజమైన ప్రభువు అల్లాహ్ ను రబ్ అని, అల్లాహ్ ను ఖాలిఖ్ పుట్టించేవాడని, అల్లాహ్ ను రాజిఖ్ ఉపాధి ప్రదాత అని నమ్మేవారు. అయినా షిర్క్ చేసేవారు. అయితే ఇలాంటి వారికి మరీ నొక్కి చెప్పడం జరుగుతుంది. మీరు ఏ అల్లాహ్ నైతే ప్రభువు అని నమ్ముతున్నారో, ఆ ప్రభువు యొక్క పవిత్రతను కొనియాడండి. షిర్క్ కు దూరంగా ఉండిపోండి.

‘అల్-ఆలా’ అల్లాహ్ యొక్క పేరు కూడా మరియు ఇందులో అల్లాహ్ యొక్క గొప్పతనం, అల్లాహ్ ఉన్నతుడు అందుకొరకే ఇక్కడ అనువాదంలో ఉంది ‘సర్వోన్నతుడు’ అయిన. అల్లాహు త’ఆలా తన యొక్క అస్తిత్వం జాత్ కే ఏతిబార్ సే, తన యొక్క ఉత్తమ నామాలు, మంచి గుణాల విషయంలో కూడా సర్వోన్నతుడు. తన యొక్క పనులలో కూడా సర్వోన్నతుడు.

సూరహ్ అల్-ఆ`లా – 2 నుండి 5 ఆయతులు

ఈ మొదటి ఆయతులో రబ్ అంటే ఏంటి, ఆ`లా అంటే ఏంటి, తస్బీహ్ అంటే ఏంటి, ఇవన్నీ వివరాలు మనం తెలుసుకున్నాము. అయితే అల్లాహ్ యొక్క, నీ ప్రభువు యొక్క పవిత్రతను కొనియాడు. ఎందుకు పవిత్రతను కొనియాడాలి? మన యొక్క ‘సుబ్ హా నల్లాహ్’ అనడానికి తస్బీహ్ కి అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే ఎందుకు? ఇక్కడ అల్లాహు త’ఆలా ఆయతు నెంబర్ రెండు నుండి ఆయతు నెంబర్ ఐదు వరకు కొన్ని కారణాలు తెలుపుతున్నాడు. శ్రద్ధ వహించండి ఇప్పుడు.

الَّذِي خَلَقَ فَسَوَّىٰ
(అల్లదీ ఖలక ఫసవ్వా)
ఆయనే సృష్టించాడు, మరి ఆపైన తీర్చిదిద్దాడు. (87:2)

وَالَّذِي قَدَّرَ فَهَدَىٰ
(వల్లదీ ఖద్దర ఫహదా)
ఆయనే (కావలసిన వాటిని తగురీతిలో) నిర్ధారించాడు. పిదప మార్గం చూపించాడు. (87:3)

ఆయనే సృష్టించాడు. ‘ఫసవ్వా’ మరి ఆపైన తీర్చిదిద్దాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అంతేకాదు, ఆ అల్లాహు త’ఆలా, ‘వల్లదీ ఖద్దర’ ఆయనే కావలసిన వాటిని తగు రీతిలో నిర్ధారించాడు. ‘తఖ్దీర్’ విధిరాత అని ఏదైతే అంటామో, దాని యొక్క ప్రస్తావన కూడా ఈ ‘ఖద్దర’ అన్న పదంలోనే వచ్చేస్తుంది. ‘ఫహదా’ పిదప మార్గం చూపించాడు.

నాలుగు పదాలు ఇక్కడ చూస్తున్నారు కదా. ఖలక, సవ్వా, ఖద్దర, హదా. ప్రియ విద్యార్థులారా, ఈ నాలుగు పదాల యొక్క అర్థమైతే ఇక్కడ ఉన్నది. ఖలక సృష్టించాడు, సవ్వా తీర్చిదిద్దాడు, ఖద్దర నిర్ధారించాడు, తఖ్దీర్ విధిరాత రాశాడు, హదా మార్గం చూపించాడు. కానీ వ్యాఖ్యానకర్తలు దీని గురించి చెప్పిన విషయాలను గమనిస్తే, అల్లాహు అక్బర్, అల్లాహ్ యొక్క గొప్పతనం మన ముందు ఎంత స్పష్టంగా వస్తుందో, మీరు ఒకసారి గమనించాలి ఈ విషయాన్ని.

ఖుర్ఆన్ లో ఇంకా అనేక సందర్భాల్లో వీటి యొక్క కొన్ని ఉదాహరణలు కూడా తెలుపబడ్డాయి. వీటి యొక్క ఈ నాలుగు పదాలు ఇక్కడ ఏవైతే వచ్చి ఉన్నాయో, వాటి యొక్క కొన్ని ఉదాహరణలు ఖుర్ఆన్ లోని వేరే సూరత్ లో. ఇంతకు ముందు మీరు ఉదాహరణకు చదివారు కదా సూరతుల్ ఇన్ఫితార్ లో? ఆయతు నెంబర్ ఏడులో.

يَا أَيُّهَا الْإِنسَانُ مَا غَرَّكَ بِرَبِّكَ الْكَرِيمِ
(యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీమ్)
ఓ మానవుడా! ఉదాత్తుడైన నీ ప్రభువు పట్ల ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది?(82:6)

الَّذِي خَلَقَكَ فَسَوَّاكَ فَعَدَلَكَ
(అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక్)
(యదార్థానికి) ఆయనే నిన్ను పుట్టించాడు, నిన్ను చక్కగా తీర్చిదిద్దాడు, ఆపైన నిన్ను తగు రీతిలో పొందికగా మలిచాడు. (82:7)

فِي أَيِّ صُورَةٍ مَّا شَاءَ رَكَّبَكَ
(ఫీ అయి సూరతిమ్ మాషాఅ రక్కబక్)
తాను కోరిన ఆకారంలో నిన్ను కూర్చాడు.(82:8)

గుర్తొచ్చిందా? అక్కడ చూడండి, సూరతుల్ ఇన్ఫితార్ లో మనం చదివి ఉన్నాము. అలాగే మీరు గమనించారంటే, సూరత్ అత్-తీన్ అని అంటాము కదా మనం? అక్కడ, అలాగే సూరత్ అస్-సజ్దాలో కూడా అల్లాహు త’ఆలా ఈ విషయాలను వివరించాడు.

సంక్షిప్తంగా, సారాంశంగా మనం చెప్పుకోవాలంటే, ఉదాహరణకు ఒక మనిషి విషయమే చూడండి. అల్లాహు త’ఆలా ఇక్కడ పూర్తి సృష్టి విషయం గురించి చెబుతున్నాడు. ఖలక అంటే అల్లాహు త’ఆలా పూర్తి సృష్టిని సృష్టించాడు. సవ్వా, ప్రతీ సృష్టిలో వారికి ఎలాంటి చక్కబాటు, తీర్చిదిద్దడం అవసరమో ఆ రీతిలో తీర్చిదిద్దాడు. ఖద్దర, ప్రతి ఒక్కరి విధిరాత రాసి ఉంచాడు. హదా, ప్రతి ఒక్కరికీ వారికి అవసరమైనది వారికి మార్గం చూపాడు.

కానీ ఈ విషయం కొంచెం వివరంగా ఒక్క మానవుని విషయంలోనే మనం గమనించామంటే, అల్లాహు త’ఆలా మానవుని సృష్టించాడు కదా. చూడండి ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఈ కళ్ళు మనకు వెనక వైపున ఉంటే? మన ఈ మూతి, ఫేస్ అనడం లేదు నేను, మౌత్ అని ఏదైతే అంటామో మూతి, ఇందులో నుండి అయితే పళ్ళు ఉన్నాయి, పెదవులు ఉన్నాయి, ఇది మన ఏదైనా ఒక వైపున ఉండేది ఉంటే? అలా కాకుండా కేవలం మనిషి ఒక తిండి విషయం ఆలోచించండి. మనిషి తినాలి. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం, మంచి ఆరోగ్యం ద్వారా మంచి శక్తి లభిస్తుంది, మంచి శక్తి లభిస్తే మంచిగా అల్లాహ్ ను ఆరాధించగలుగుతాడు.

ఉదాహరణకు ఒకటి తీసుకోండి. తినడానికి తన చేతిలో ఒక అన్నం ముద్దనే ఎత్తాడు అనుకోండి. చేతుల ద్వారా ముందు విషయం తెలుస్తుంది. ఆ అన్నం మెత్తగా ఉన్నదా, పాసిపోయినదా, మంచిగా ఉన్నదా, గట్టిగా ఉన్నదా? బియ్యం ఏవైతే మనం వండామో, అవి మంచిగా ఉడికాయా లేవా అన్న విషయాలు మనకు మన వేళ్ళ ద్వారా తెలుస్తుంది కదా. దానితోపాటు ఏదైనా కూర కలుపుకొని ముద్ద చేసుకొని మనం పైకి ఎత్తుతాము. అందులో ఏదైనా మనకు ఇష్టం లేని మిరపకాయ వచ్చినా కళ్ళతో కనబడుతుంది, పక్కకు తీసేస్తాము. ఒకవేళ అందులో ఏదైనా మనకు ఇష్టం లేని వాసన లాంటిది ఉండేది ఉంటే, ముక్కు కాడికి వచ్చేసరికి పక్కకు జరిపేస్తాము. ముక్కుతో మనం అది పీల్చి చూస్తాము గనక. అంతా కూడా బాగానే ఉంది అని పెదవుల వరకు తెచ్చి ఇలా నోట్లో పెడతాము. అంతలోనే నాలుక నోట్లో ఇలా పెట్టిన వెంటనే నాలుక దాని యొక్క రుచి చెబుతుంది. ఓ ఛీ ఛీ, ఇంత ఎక్కువ ఉప్పు అయిపోయిందా! కదా, నేను ఎలా నా కడుపులో దించాలి? లేదా ఇంకా వేరే ఏదైనా. అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఇస్తున్నాను నేను. ఈ విధంగా మీరు గమనించండి, అల్లాహు త’ఆలా మనకు ఎన్ని రకాల ఈ తీర్చిదిద్దడం అనే విషయంలోనే ఒక కేవలం మన శరీరంలోనే చూసుకుంటే, మళ్ళీ ఆ తర్వాత ఆ అన్నం ముద్ద మన గొంతు కిందికి దిగడానికి గొంతులో ఎలాంటి ప్రక్రియ ఉన్నది? అక్కడి నుండి మళ్ళీ కిందికి ఎప్పుడైతే వస్తుందో, జీర్ణాశయంలో వెళ్ళే వరకు మధ్యలో ఇంకా ఎక్కడెక్కడ మన యొక్క ఊపిరితిత్తులకు సంబంధించినవి, మన యొక్క లివర్ కార్యానికి సంబంధించినవి, ఈ విధంగా మీరు చూసుకోండి, ప్రతి ఒక్కటి ఎలా పనిచేస్తుంది? ఒక్కసారి మనం ఒక అన్నం ముద్ద లోపటికి వేస్తే, మన శరీరంలోని ఏ లోపలి, బయటి ఏ ఏ అవయవాలు ఏ రీతిలో పనిచేస్తాయి, ఒక పొందికగా, ఒక మంచి రీతిలో? అల్లాహు అక్బర్. నిజంగా చాలా ఆశ్చర్యపోతారు. అందుకొరకే అల్లాహ్ ఖుర్ఆన్ లో ఒక చోట ఏమంటున్నాడు? ‘వఫీ అన్ఫుసికుం అఫలా తుబ్సిరూన్’ ఏమిటి మీరు మీ యొక్క స్వయం మీ శరీరంలోనే గమనించరా? అల్లాహ్ యొక్క సృష్టి ప్రక్రియను మీరు గ్రహించండి.

ఖద్దర తఖ్దీర్ విషయం కూడా ఉన్నది, మరియు మనిషికి ఏ ఏ అవసరాలు ఏ రీతిలో నిర్ధారించాడో అల్లాహు త’ఆలా నిర్ధారించాడు. మనం మనుషులము గనుక నేను మనిషి యొక్క ఉదాహరణ ముందుగా చెబుతున్నాను, వేరే ఇంకా సృష్టిరాశుల గురించి చెప్పుకుంటూ వెళ్తే మరి ఈ రెండు ఆయతుల్లోనే ఇంకా గంటల తరబడి సమయం వెళ్ళిపోతుంది.

హదా, ప్రతి ఒక్కరికీ వారి యొక్క హిదాయత్, ఇహలోకంలో వారు ఏ రీతిలో మంచిగా జీవించాలి, పరలోకంలో స్వర్గం పొందాలంటే ఏం చేయాలి, ఇవన్నీ విషయాల యొక్క మార్గదర్శకత్వం కూడా అల్లాహు త’ఆలా చేశాడు. అల్లాహ్ ఈ నాలుగు పనులు చేసిన వాడు కనుక మీరు ఈ అల్లాహ్ యొక్క తస్బీహ్ చేయాలి, ఇంకా వేరే ఎవరి తస్బీహ్ చేయకూడదు. అంతేకాదు,

وَالَّذِي أَخْرَجَ الْمَرْعَىٰ
(వల్లదీ అఖ్రజల్ మర్ఆ`)
మరియు ఆయనే పచ్చిక బయళ్ళను ఉత్పన్నం చేశాడు.

فَجَعَلَهُ غُثَاءً أَحْوَىٰ
ఆపైన వాటిని నల్లని చెత్తకుప్పగా చేసేశాడు.

ఎందుకు? మీతో పాటు మీ జంతువులు కూడా, మీరు ఎలాగైతే అల్లాహ్ యొక్క అనుగ్రహాలను అనుభవిస్తూ తింటూ త్రాగుతూ హాయిగా ఉన్నారో, మీ సేవకు ఉన్న వేరే జంతువుల కొరకు కూడా అల్లాహు త’ఆలా ఆహారాన్ని పుట్టించాడు. కానీ ఈ పచ్చిక బయళ్ళు మనం ఏవైతే చూస్తామో, స్వయం మన కొరకు ఆహారంగా ఉన్నటువంటి ఈ పంటల విషయం మీరు ఒకసారి చూడండి. బియ్యమైనా, వేరే కూరగాయలైనా, వేరే పప్పు దినుసులైనా, ఇవన్నీ ఏ పచ్చని పైర్ల ద్వారా మనకు లభిస్తాయో, వాటి నుండి మనం ఆ ధాన్యాలు తీసుకున్న వెంటనే, ఆ తర్వాత అది గడ్డిగా అయిపోతుంది కదా? ఆ తర్వాత మళ్ళీ మిగిలినది కూడా నల్లగా అయిపోయి, అక్కడ ఏమైనా ఇంతకుముందు పండిందో లేదో అన్నటువంటి పరిస్థితి ఆ భూమిది అయిపోతుంది.

అల్లాహు త’ఆలా ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు తెలుపుతున్నాడు? ఈ విషయాన్ని అల్లాహ్ ఇక్కడ ఎందుకు తెలుపుతున్నాడు అంటే, ఓ మానవులారా, ఏ రీతిలోనైతే మీరు ఈ పంటలు చూస్తారో, అలాగే మీ యొక్క పరిస్థితి. మీ ఏ నామ నిషాన్, మీ యొక్క ఏ గుర్తు లేకుండా ఉండినది, కానీ మీ తల్లిదండ్రుల ద్వారా అల్లాహ్ మిమ్మల్ని పుట్టించాడు. మీరు పెరిగారు, మళ్ళీ చనిపోతారు. చనిపోయిన తర్వాత, ఎలాగైతే ఈ భూమి మొత్తం ఎండిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని చినుకులు పడడం ద్వారా ఇక్కడ పచ్చిక బయళ్ళు మనకు కనబడుతున్నాయో, అదే రీతిలో మిమ్మల్ని కూడా అల్లాహు త’ఆలా మరోసారి తప్పకుండా పుట్టిస్తాడు. మరోసారి మిమ్మల్ని అల్లాహ్ పుట్టించడంలో ఎలాంటి సందేహం, ఎలాంటి అనుమానం లేదు. గమనిస్తున్నారా? అందుకొరకే ఈ లాంటి ఈ శక్తి గల అల్లాహ్ ను మాత్రమే మీరు ఆరాధించాలి. ఆయన యొక్క పవిత్రత మాత్రమే మీరు కొనియాడాలి. మరియు మీరు ఆ అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఎవరినీ ఆరాధించకూడదు. మరియు ఆ అల్లాహ్ తొలిసారి మిమ్మల్ని పుట్టించినట్లుగా, మలిసారి పుట్టించే శక్తి గలవాడు అని కూడా నమ్మాలి.

ఇక ఆ తర్వాత రండి. ఇహలోకంలో పుట్టించి అన్ని రకాల మార్గాలు మీకు సులభం చేసిన ఈ అల్లాహు త’ఆలా, చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ పుట్టిస్తాడు కదా? అయితే మీ హృదయాలలో విశ్వాసం యొక్క మొలక నాటడానికి, సత్కార్యాల పట్ల పుణ్యం, పుణ్యం యొక్క ప్రేమ కలిగించడానికి, అల్లాహ్ మీ హిదాయత్ కొరకు ఖుర్ఆన్ అవతరింపజేశాడు. అయితే దాని విషయం ఇప్పుడు మాట్లాడుతున్నాడు అల్లాహు త’ఆలా.

سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰ
(సనుఖ్రిఉక ఫలా తన్సా)
(ఓ ప్రవక్తా!) మేము నిన్ను చదివిస్తాము – మరి నువ్వు దానిని మరువలేవు. (87:6)

إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفَىٰ
(ఇల్లా మాషా అల్లాహ్, ఇన్నహూ యఅ`లముల్ జహ్ర వమా యఖ్ఫా)
అయితే అల్లాహ్ తలచినది మాత్రం (మరువగలవు). ఆయన బహిర్గతమయ్యే దానినీ, గోప్యంగా ఉన్నదానినీ ఎరిగినవాడు. (87:7)

وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ
(వనుయస్సిరుక లిల్ యుస్రా)
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) మేము నీకు సౌలభ్యాన్ని సమకూరుస్తాము.(87:8)

ఈ మూడు ఆయతులు గుర్తున్నాయి కదా? శ్రద్ధగా వినండి. ఈ మూడు ఆయతుల యొక్క భావాన్ని, ఈ మూడు ఆయతుల యొక్క అనువాదం, ఈ మూడు ఆయతుల యొక్క సంక్షిప్త వ్యాఖ్యానాన్ని.

ఇందులో స్పష్టమైన మనకు అనువాదంలో కనబడుతున్న రీతిలో మనం చూస్తే, ఎలాంటి అనుమానం లేకుండా ఇక్కడ ఒక విషయం చెప్పడం జరుగుతుంది. ఏంటి? ఖుర్ఆన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరిస్తున్నప్పుడు, శ్రద్ధ వినండి, అర్థం చేసుకోండి. ఈ మూడు ఆయతుల భావాలు ఏవైతే ఉన్నాయో, అందులో రెండు మాటలు నేను తెలియజేస్తున్నాను కనుక మీరు శ్రద్ధగా వింటే మాట మంచిగా అర్థమవుతుంది. ఆయతు నెంబర్ ఆరు, ఏడు, ఎనిమిది. ఇక్కడ అరబీ ఆయతులకు తెలుగు అనువాదం ఏదైతే ఉందో, దాని ప్రకారంగా బాహ్యమైన అర్థం ఒకటి ఏమిటి?

మేము నిన్ను చదివిస్తాము మరి నువ్వు మరువలేవు. అయితే అల్లాహ్ తలచినది మాత్రం మరువగలవు. ఆయన బహిర్గతమయ్యే దానిని, గోప్యంగా ఉన్న దానిని ఎరిగిన వాడు. మేము నీకు సౌలభ్యాన్ని సమకూరుస్తాము.

దీని యొక్క బాహ్యమైన అర్థం ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఖుర్ఆన్ అవతరిస్తున్న సందర్భంలో, నాకు అల్లాహ్ ఈ ఖుర్ఆన్ ఏదైతే ప్రసాదిస్తున్నాడో, నేను మరువకూడదు, నేను ఎల్లవేళల్లో నేను బ్రతికి ఉన్నంతవరకు నాకు ఈ ఆయతులు కంఠస్థం ఉండడానికి నేను మంచిగా గుర్తు చేసుకోవాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట వెంటనే చదువుతూ ఉండేవారు. దీని ప్రస్తావన మనకు ఇక్కడ ఏదైతే సూరతుల్ ఆ`లాలో చూస్తున్నారో, అదే కాకుండా మనకు సూరతుల్ ఖియామాలో కూడా కనబడుతుంది ఈ విషయం. మరియు అలాగే ఖుర్ఆన్ లో మరొకచోట కూడా అల్లాహు త’ఆలా ఈ విషయాన్ని చాలా స్పష్టం చేశాడు, బహుశా సూరతుల్ ఇస్రా అనుకుంటా. అయితే ఓ ప్రవక్తా, ఫలా తాజల్, మీరు తొందర పడకండి. ఈ ఖుర్ఆన్ ను నీవు మరిచిపోకుండా భద్రంగా మీ మనసులో ఉండే విధంగా మేము నీకు సహాయపడతాము. ఆ విషయంలో నిన్ను మీకు మేము మీకు సులభతరం ప్రసాదిస్తాము. కనుక మీరు ఎలాంటి చింత లేకుండా మీకు ఎప్పుడైతే ఈ ఖుర్ఆన్ వహీ చేయడం జరుగుతుందో అప్పుడు కేవలం శ్రద్ధగా వినండి అంతే. తర్వాత దాన్ని కంఠస్థం మీ మనసులో, మీ హృదయంలో చేసే విషయంలో మేమే నీకు తోడు పడతాము. మరి నీవు మెల్లగా చదివినా, బహిరంగంగా చదివినా అంతా కూడా అల్లాహ్ కు చాలా మంచిగా తెలుసు.

అయితే ఇక్కడ ఏడవ ఆయతు ప్రారంభంలో ఏముంది? అయితే అల్లాహ్ తలచినది మాత్రం మరువగలవు. అంటే ఏమిటి ఇది? అల్లాహ్ తలచినప్పుడు కొన్ని ఆయతులు లేదా వాటి భావాన్ని ఏదైతే రద్దు పరుస్తాడో, దాని ప్రస్తావన సూరతుల్ బఖరాలో కూడా వచ్చి ఉంది. ఆ భావం. అది అల్లాహ్ యొక్క ఇష్టం. మనం ఎందుకు అల్లాహ్ ఇలా చేస్తాడు అని అల్లాహ్ ను అడిగే హక్కు మనకు లేదు. ఉదాహరణకు, సూరతున్నూర్ లో మనకు హదీసుల ద్వారా తెలుస్తుంది, పెళ్లి అయిన వారు వ్యభిచారానికి పాల్పడితే వారిని రాళ్లు రువ్వి చంపాలి అన్నటువంటి ఆదేశం కూడా ఉండింది. అయితే దానికి సంబంధించిన ఆ ఆయతులు కూడా ఉండినవి. అల్లాహు త’ఆలా ఆదేశాన్ని మిగిలి ఉంచాడు హదీసుల ద్వారా. కానీ ఆ ఆయతులు అల్లాహు త’ఆలా ఖుర్ఆన్ లో నుండి తీసేసాడు. అది అల్లాహ్ ఇష్టం.

ఇక సూర బఖరాలో ఉంది అల్లాహ్ తలచుకున్నప్పుడు ఆయతులలో రద్దు చేస్తాడు అన్నది విషయం, అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలోనే జరిగిపోయింది, ఆ రద్దు అన్నది ఇప్పుడు జరగదు. చూస్తున్నారా సూర బఖరా ఆయతు నెంబర్ 106.

مَا نَنسَخْ مِنْ آيَةٍ أَوْ نُنسِهَا نَأْتِ بِخَيْرٍ مِّنْهَا أَوْ مِثْلِهَا ۗ أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

(ఓ ప్రవక్తా!) ఏదేని ఒక వాక్యాన్ని మేము రద్దుపరచినా లేక మరపింపజేసినా (దాని స్థానంలో) దానికన్నా ఉత్తమమైన దానినీ లేదా కనీసం దానికి సమానమైన దానిని తీసుకువస్తాము. అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడన్న సంగతి నీకు తెలియదా? (2:106)

أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَمَا لَكُم مِّن دُونِ اللَّهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ

భూమ్యాకాశాల సార్వభౌమత్వం అల్లాహ్‌దేననీ, అల్లాహ్‌ తప్ప మరొకరెవరూ మీ రక్షకులూ, సహాయకులూ కారన్న విషయం నీకు తెలియదా? (2:107)

ఈ విధంగా అల్లాహు త’ఆలా తలచుకున్నప్పుడు రద్దు చేయగలుగుతాడు. అతన్ని ఎవరూ కూడా కాదు అనలేరు. కానీ ఈ ఆయతు యొక్క ఈ భావం, ఈ యొక్క బాహ్య భావమే కాకుండా మరొక భావం ఇందులో ఏముంది?

ఇందులో మరొక భావం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రత్యేకమైన అనుగ్రహం, ఆయన మరిచిపోకుండా ఆయన హృదయంలో ఖుర్ఆన్ ఆయతులు నాటుకుపోయి ఉండే విధంగా అల్లాహు త’ఆలా వారికి సహాయపడతాడు. కానీ మనం ఈ ఆయతులు మరిచిపోకుండా ఉండడానికి మన వంతు ప్రయత్నం, మన వంతు త్యాగం, ప్రయాసం మనం చేస్తూ ఉండాలి. ఒకవేళ ప్రయత్నం మనం చేశాము అంటే, ఆయతు నెంబర్ ఎనిమిది గమనించండి, మేము నీకు సౌలభ్యాన్ని సమకూరుస్తాము.

ఇక్కడ సౌలభ్యం అన్నది మనకు ఎప్పుడు ఏర్పడుతుంది? చిన్నపాటి కష్టం ఏదైనా మనం చేసిన తర్వాతనే సౌలభ్యం అన్నది మనకు ఏర్పడుతుంది కదా. అందుకొరకు ఖుర్ఆన్ యాద్ చేయడంలో కూడా మనం కష్టపడాలి. మన సమయాన్ని, మన నిద్రను, మన యొక్క ప్రయత్నాన్ని అందులో వెచ్చించాలి. అప్పుడు అది మనకు అల్లాహ్ యొక్క దయతో ఎంతో సులభతరం ఏర్పడుతుంది.

మరో రకంగా ఇందులో, నేను ప్రారంభంలోనే చెప్పినట్లు, శరీరపరంగా చూసుకుంటే ఇంకా వేరే రకంగా అల్లాహు త’ఆలా మనల్ని ఎంతో మంచిగా తీర్చిదిద్ది, ఎంతో మంచి రీతిలో పుట్టించిన వాడు, ‘ఫహదా’ అని చదివారు కదా, మూడవ ఆయతు చివరిలో ‘ఫహదా’. ఆ హిదాయత్ అల్లాహ్ ఎలా ఇచ్చాడు? ఖుర్ఆన్ ద్వారా, హదీస్ ద్వారా ఇచ్చాడు. కనుక మనం ఈ ఖుర్ఆన్, హదీస్ ను చదువుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటూ ఉన్న తర్వాత సరిపోతుందా? లేదు, ఇతరులకు బోధ చేస్తూ ఉండాలి.

فَذَكِّرْ إِن نَّفَعَتِ الذِّكْرَىٰ
కనుక నీవు ఉపదేశం లాభదాయకం అయితే, ఉపదేశిస్తూ ఉండు.” (87:9)

అదే విషయం గమనించండి ఆయతు నెంబర్ తొమ్మిదిలో, కనుక నీవు ఉపదేశం లాభదాయకం అయితే ఉపదేశిస్తూ ఉండు. ఈ లాభదాయకం అయితే అని ఏదైతే ఇక్కడ ఉన్నదో, లాభదాయకం లేకుంటే వదిలేయ్ అన్నటువంటి భావం కాదు. ఇక్కడ రెండు భావాలు కనీసం గుర్తుంచుకోండి.

ఒకటి, మీరు ఉపదేశం చేస్తూ ఉండండి, ఒకరికి బోధ చేస్తూ ఉండండి, ఈ బోధ అన్నది ఏదో ఒక రీతిలో లాభదాయకంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి విని అర్థం చేసుకొని ఆచరించకపోయినా, చెప్పేవారికి లాభమే కదా అందులో? చెప్పిన పుణ్యం లభిస్తుంది కదా? అవునా కాదా? మరియు రెండో భావం, ఈ ఎవరికైతే మనం చెప్పామో, విన్న వ్యక్తి, అది ఆ సమయంలో అతనికి లాభదాయకంగా ఏర్పడకపోయినా, ఒకానొక రోజు ‘అరే అవును, ఫలానా సమయంలో వాళ్ళు నాకు చెప్పారు కదా’ అన్నటువంటి ఒక సుబూత్, ఒక రుజువు అతని వద్ద ఉంటుంది. ఏదో ఒక రకంగా. కానీ గమనించండి. ఎవరైనా మనకు ఏదైనా ఉపదేశం చేస్తున్నారు, ఆ ఉపదేశం మనకు లాభదాయకం కావాలి అంటే ఏం ఉండాలి మనలో? ఆయతు నెంబర్ 10 గమనించండి.

سَيَذَّكَّرُ مَن يَخْشَىٰ
(సయజ్జక్కరు మయ్ యఖ్షా)
(అల్లాహ్ పట్ల) భయమున్నవాడు ఉపదేశాన్ని గ్రహిస్తాడు. (87:10)

చూస్తున్నారా? అందుకొరకే ఒక వ్యక్తి మనకు చెప్పాడు, ‘ఏంటయ్యా, నీవు కొంచెం నమాజ్ లో వెనక ఉన్నావు. ఏంటయ్యా, ఈ తాగుడు మానుకో. ఏంటయ్యా, ఈ పాపాన్ని వదులుకో.’ ‘అరే పోరా పో, నీది నువ్వు చూసుకో. నాకెందుకు చెబుతున్నావ్?’ ఇలా అనకూడదు. ఈ రోజుల్లో చాలా అలవాటు అయిపోయింది కదా ఎంతో మందికి ఇలా చెప్పడం. ఎందుకు? ఒక వ్యక్తి మనకు ఏదైనా ఉపదేశం చేశాడంటే, మనకు లాభం చేకూర్చడానికి ప్రయత్నం చేశాడు అతను. అంతేకాదు, అల్లాహ్ మనపై దయ తలిచాడు. మనకు సన్మార్గం చూపించడంలో ఒకరి యొక్క సహాయం అల్లాహ్ మనకు అందించాడు. ఇక నేను ఇలా అడ్డం తిరిగి, ఇలాంటి తప్పుడు సమాధానం ఇచ్చానంటే, నేను అల్లాహ్ యొక్క భయం నా మనసులో లేనట్లే కదా. అర్థమవుతుందా అవతలేదా? అందుకొరకే సూర బఖరాలో ఒక చోట ఏమున్నది? ఎవరైతే అల్లాహ్ తో భయపడండి.

وَإِذَا قِيلَ لَهُ اتَّقِ اللَّهَ أَخَذَتْهُ الْعِزَّةُ بِالْإِثْمِ ۚ فَحَسْبُهُ جَهَنَّمُ ۚ وَلَبِئْسَ الْمِهَادُ

“అల్లాహ్‌కు భయపడు” అని వాడితో అన్నప్పుడు, వాడి గర్వం, దురభిమానం వాడ్ని పాపం వైపుకే పురికొల్పుతుంది. ఇలాంటి వారికి నరకమే గతి. అది అతి చెడ్డ నివాస స్థలం. (2:206)

అల్లాహ్ తో భయపడండి అని అంటే, అతడు విర్రవీగుతాడు. అహంకారానికి గురి అవుతాడు. నాకు చెప్పే వానివి ఎవనివి నువ్వు? అని ఎదురు తిరుగుతాడు. వాస్తవానికి ఇలాంటి వ్యక్తి ఎవడు? గమనించండి ఆ తర్వాత ఆయతు నెంబర్ 11.

وَيَتَجَنَّبُهَا الْأَشْقَى
(వయతజన్నబుహల్ అష్ ఖా)
దౌర్భాగ్యుడు మాత్రమే దాన్ని దాట వేస్తాడు.” (87:11)

ఆ ఉపదేశాన్ని దౌర్భాగ్యుడు మాత్రమే దాటవేస్తాడు. అల్లాహు అక్బర్. ఏంటమ్మా, నువ్వు ఏదో పనికి బయటికి వెళ్తున్నావు కదమ్మా, కొంచెం పరదా చేసుకుంటూ వెళ్ళమ్మా. అల్లాహ్ ది ఈ ఆదేశం ఇచ్చాడు. ‘ఓ మౌల్సాబ్ మీరు మీ పని చూసుకోండి. మాకు ఇదంతా బోధ చేసే అవసరం లేదు.’ ఇలా ఉండకూడదు. ఎవరైనా ఇలా అడ్డం తిరిగారు, ఉపదేశాన్ని గ్రహించలేదు, ఉపదేశాన్ని స్వీకరించలేదు అంటే, నేను కాదండి చెప్పేది, అల్లాహ్ ఏమంటున్నాడో గమనించండి. అతడు అష్ ఖా, మహా దౌర్భాగ్యుడు అయిపోతాడు. ఇంతకుముందే నేను చెప్పాను కదా మీకు, షఖీ అంటే దౌర్భాగ్యుడు. అష్ ఖా అంటే మహా దౌర్భాగ్యుడు లేదా పెద్ద దౌర్భాగ్యుడు లేదా అత్యంత దౌర్భాగ్యుడు. ఈ విధంగా వస్తుంది భావం.

మనం ఇలాంటి ఏమైనా బోధనలు వింటేనే కదండీ మనకు అల్లాహ్ యొక్క భయం ఇంకింత ఎక్కువగా కలిగేది. మరి ఈ విషయాన్ని మనం తిరస్కరించేసాము అంటే, ఎవరైనా మనకు బోధ చేస్తున్నప్పుడు మనం అతని బోధను ఏమాత్రం గమనించకుండా, అర్థం చేసుకోకుండా ఉండేది ఉంటే, వాస్తవానికి మనకు మనం దౌర్భాగ్యాన్ని కొనుక్కున్న వాళ్ళం అయిపోతాము. ఇక ఇలా ఉపదేశాన్ని తిరస్కరించి, ఖుర్ఆన్, హదీసుల మాటలను మనం అర్థం చేసుకోకుండా, చెప్పిన వానికే అడ్డంగా తిరిగి ప్రవర్తించామంటే, దౌర్భాగ్యులైపోయాము. ఈ దౌర్భాగ్యుని పరిస్థితి ఏమవుతుంది? గమనించండి ఆయతు నెంబర్ 12 లో.

الَّذِي يَصْلَى النَّارَ الْكُبْرَىٰ
(అల్లదీ యస్లన్-నారల్ కుబ్రా)
వాడు పెద్ద (ఘోరమైన) అగ్నిలోకి ప్రవేశిస్తాడు. (87:12)

వాడు పెద్ద ఘోరమైన అగ్నిలోకి ప్రవేశిస్తాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరినీ కూడా ఇలాంటి ఈ దౌర్భాగ్యం నుండి కాపాడు గాక. అల్లాహు త’ఆలా నరక ప్రవేశం నుండి కూడా మనల్ని కాపాడు గాక. అయితే ప్రతిరోజు కనీసం మూడుసార్లు దువా చేసుకుంటూ ఉండాలి. ‘ఓ అల్లాహ్ నన్ను స్వర్గంలో ప్రవేశించు, ఓ అల్లాహ్ నన్ను నరకం నుండి కాపాడు’ అని కనీసం మూడుసార్లు మనం ఇలా దువా చేసుకుంటూ ఉండాలి. ఆ నరకం ఎలాంటిది? అక్కడ శిక్షలు భరించలేక చనిపోదామని మనిషి కోరుకుంటాడు. కానీ,

ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ
(సుమ్మ లా యమూతు ఫీహా వలా యహ్యా)
వాడందులో చావనైనా చావడు, బ్రతకనైనా బ్రతకడు. (రెంటికీ మధ్య దుర్భరస్థితిలో ఉంటాడు). (87:13)

వాడు అందులో చావనైనా చావడు. చస్తే ఏమవుతుంది? ఈ కష్టాలన్నిటినీ కూడా చూడకుండా ఉంటాము. కానీ చావు రాదు. వలా యహ్యా, బ్రతకనైనా బ్రతకడు. అంటే ఈ శిక్షలను తప్పించుకొని ఏదైనా మంచి బ్రతుకు కూడా దొరకదు. ఏ స్థితిలో ఉంటాడు? కేవలం అనువాదం చదివి ఎవరికైనా కన్ఫ్యూజ్ కాకూడదు అని బ్రాకెట్లో అక్కడ రాశారు, రెంటికీ మధ్య దుర్భర స్థితిలో ఉంటాడు. అల్లాహు అక్బర్. అల్లాహు త’ఆలా ఈ నరక శిక్షల నుండి మనందరినీ కూడా కాపాడు గాక.

ఇక్కడ చూస్తున్నారా, మనిషి నరకంలో శిక్షలను భరించలేక ఏమంటాడు? చూడండి ఇక్కడ. సూర నెంబర్ 25, ఆయతు నెంబర్ 13, 14.

وَإِذَا أُلْقُوا مِنْهَا مَكَانًا ضَيِّقًا مُّقَرَّنِينَ دَعَوْا هُنَالِكَ ثُبُورًا
నరకంలోని ఒక ఇరుకైన స్థలంలో వారిని కాళ్ళూ, చేతులూ బంధింపబడిన స్థితిలో పడవేయబడినప్పుడు వారు చావు కోసం అరుస్తారు. (25:13)

నరకంలోని ఒక ఇరుకైన స్థలంలో వారిని కాళ్లు, చేతులు బంధింపబడిన స్థితిలో పడవేయబడినప్పుడు, ద’అవ్ హునాలిక సుబూరా, వారు అక్కడ చావు కోసం అరుస్తారు. మాకు చావు రావాలని కోరుకుంటారు.

لَّا تَدْعُوا الْيَوْمَ ثُبُورًا وَاحِدًا وَادْعُوا ثُبُورًا كَثِيرًا
(లా తద్ ఉల్ యవ్మ సుబూరవ్ వాహిదవ్ వద్ ఉ సుబూరన్ కసీరా)
“ఈ రోజు ఒక్క చావు కోసం అరవకండి, అనేక చావుల కోసం అరుస్తూ ఉండండి” (అని వారితో అనబడుతుంది). (25:14)

ఈ రోజు ఒక్క చావు కోసం అరవకండి, అనేక చావుల కోసం అరుస్తూ ఉండండి అని వారితో అనబడుతుంది. అంటే ఏంటి? అనేక చావుల కోసం అరిస్తే చావు వస్తుందనా? కాదు. ఇక్కడ మీరు ఇక ఒర్రుకుంటూ ఉండాల్సిందే. ఇప్పుడు మీ మాట వినడం జరగదు. ఇహలోకంలో ఎంతమంది మంచి వాళ్ళు వచ్చి మీకు చెబుతూ ఉంటే మీరు ఇలాగే మా మాటలు తిరస్కరించారు కదా.

అలాగే మనం ఇంతకుముందు కూడా చదివి వచ్చాము సూరతుల్ ఇన్షిఖాఖ్ లో ఈ ఆయతు.

وَيَدْعُو ثُبُورًا
(వ యద్ ఉ సుబూరా)
అతను చావు కోసం కేకలు వేస్తాడు. (84:11)

మరెవరి కర్మల పత్రం అతని వీపు వెనక నుండి ఇవ్వబడుతుందో అతను చావు కోసం కేకలు వేస్తాడు.

وَيَصْلَىٰ سَعِيرًا
(వ యస్లా సఈరా)
మరి (అతను) మండే నరకాగ్నిలోకి ప్రవేశిస్తాడు. (84:12)

إِنَّهُ كَانَ فِي أَهْلِهِ مَسْرُورًا
(ఇన్నహూ కాన ఫీ అహ్లిహీ మస్రూరా)
ఈ వ్యక్తి (ఇహలోకంలో) తన వారి మధ్య తెగ సంబరపడేవాడు. (84:13)

ఈ వ్యక్తి ఇహలోకంలో తన వారి మధ్య తెగ సంబరపడేవాడు. ఈ రోజుల్లో ముస్లింలకు బాధ కలిగిస్తూ తిరిగి వెళ్లి తమ యొక్క గ్యాంగ్ లో, గ్రూప్ లో, తమ యొక్క ఇంటివారు, తమ యొక్క ఫ్రెండ్స్ వారందరికీ ఎంతో సంతోషంగా చెప్పుకుంటూ తిరుగుతారు కదా. కానీ ప్రళయ దినాన పరిస్థితి చాలా గాంభీర్యంగా ఉంటుంది.

ఇక రండి అల్లాహు త’ఆలా ఈ కొన్ని విషయాలు తెలిపిన తర్వాత మళ్ళీ ఏ రీతిలో మనకు బోధ చేస్తున్నాడో గమనించండి.

قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ
(ఖద్ అఫ్లహ మన్ తజక్కా)
పవిత్రుడైనవాడు ఖచ్చితంగా సాఫల్యం పొందాడు.(87:14)

కచ్చితంగా సాఫల్యం పొందాడు. ఎవరండి? పవిత్రుడైన వాడు. మన్ తజక్కా. ‘తజక్కాపవిత్రత అంటే ఇక్కడ, మనిషి అన్ని రకాల షిర్క్, బిద్’అత్ ల నుండి. తజక్కా, అన్ని రకాల షిర్క్, బిద్’అత్ లకు దూరంగా ఉండాలి. తజక్కా, తన మనసును పరిశుభ్ర పరచుకోవాలి. ఏ కపటము, జిగత్సు, ఎలాంటి అసూయ లాంటి చెడు గుణాలు లేకుండా ఉండాలి.

وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ
(వ-జకరస్మ రబ్బిహీ ఫసల్లా)
అతను తన ప్రభువు నామాన్ని స్మరించాడు. నమాజు ఆచరించాడు.(87:15)

అతను తన ప్రభువు నామాన్ని స్మరించాడు. ఈ విషయంలో కూడా సర్వసామాన్యంగా మన వద్ద చాలా చాలా బద్ధకం ఉన్నది. ధర్మం తెలిసిన వాళ్లలో కూడా. కూర్చుంటూ, లేస్తూ, ఎల్లవేళల్లో అల్లాహ్ యొక్క నామస్మరణ చేయడం, సుబ్ హా నల్లాహ్, అల్హందులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, ఏదైనా సందర్భంలో ఎవరితోనైనా కలిసినప్పుడు ఆ ఏదైనా మాట సందర్భంలో ఏదైనా విషయం, ఇలాంటి సందర్భాల్లో అల్హందులిల్లాహ్, సుబ్ హా నల్లాహ్, బారకల్లాహు ఫీక్, అహసనల్లాహు ఇలైక్, ఇలాంటి దువాలు ఇచ్చుకుంటూ మనం ఉండడం, అల్లాహ్ ను గుర్తు చేసుకుంటూ ఉండడం ఎల్లవేళల్లో చాలా ముఖ్య విషయం.

అలాగే నమాజ్ ఆచరించాడు. ఆరాధనల్లో కలిమ లా ఇలాహ ఇల్లల్లాహ్ తర్వాత నమాజ్ యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది గనక అందుకొరకే ఇక్కడ దాని ప్రస్తావన వచ్చింది. ఈ రెండు ఆయతులు, ఆయతు నెంబర్ 14 మరియు 15 ఏదైతే మీరు చూస్తున్నారో, ఇందులో మరొక భావం కూడా ఉంది అని ధర్మవేత్తలు అంటారు. అదేమిటి?

ఈ ఆయతులలో ఈదుల్ ఫితర్, రమజాన్ ముగింపు, సదఖతుల్ ఫితర్, ఈద్ యొక్క నమాజ్, వీటి ప్రస్తావన ఉన్నది అని. ఏ రీతిలో? ఇదే క్రమంలో. మన్ తజక్కా వ-జకరస్మ రబ్బిహీ ఫసల్లా. రమజాన్ ముగించినది, నెలవంక కనబడినది, ఇప్పుడు మనం పండుగ జరుపుకోవాలి అని తెలిసిన వెంటనే తజక్కా, జకాతుల్ ఫితర్ ఇవ్వాలి, సదఖతుల్ ఫితర్ ఇవ్వాలి, ఫిత్రానా చెల్లించాలి. అప్పటి నుండే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్ చదువుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి. ఎప్పటి వరకు? పండుగ స్థలానికి చేరుకునే వరకు. ఆ తర్వాత ఖుత్బా కంటే ముందు నమాజ్ అదా చేయాలి. సూరతుల్ ఆ`లాలోని ఆయతు నెంబర్ 14 మరియు 15లో రమజాన్ ముగింపు, నెలవంక వెంటనే జకాతుల్ ఫితర్ చెల్లించడం మరియు అప్పటి నుండే తక్బీర్ చెప్పుకుంటూ ఉండడం, మరుసటి రోజు తెల్లారిన తర్వాత సూర్యోదయం అయ్యాక 15, 20 నిమిషాల తర్వాత నుండి పండుగ నమాజ్ చేయడం ప్రారంభించడం, వీటి ప్రస్తావన ఉన్నది. మరియు సూరతుల్ కౌసర్ లో

فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ
(ఫసల్లి లిరబ్బిక వన్ హర్)
కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి, ఖుర్బానీ కూడా ఇవ్వు. (108:2)

ముందు నమాజ్ చేయాలి, ఆ తర్వాత వచ్చి ఖుర్బానీ చేయాలి అన్నటువంటి ప్రస్తావన అందులో ఈదుల్ అద్హాకు సంబంధించిన ఆదేశం ఉన్నది.

ఈ విధంగా అల్లాహు త’ఆలా మనకు అల్లాహ్ మనపై చేసిన అనుగ్రహాలను గుర్తు చేస్తున్నాడు. శారీరక అనుగ్రహాలే కాకుండా మన ఆధ్యాత్మిక, మన యొక్క ఆత్మీయంగా మనకు కావలసిన హిదాయత్ ఖుర్ఆన్, హదీస్ ద్వారా దొరుకుతుంది, దాని గురించి చెప్పిన తర్వాత ఎవరైతే ఈ ఖుర్ఆన్, హదీస్ బోధనలు తిరస్కరిస్తారో వారికి ఈ చెడ్డ స్థానం ఉన్నదో అది తెలిపిన తర్వాత చెడ్డవారు అని చెప్పాడు కదా అల్లాహు త’ఆలా ఇక్కడ అష్ ఖా, అతడు నరకంలో ప్రవేశిస్తాడు అని. అందుకొరకే వెంటనే అల్లాహు త’ఆలా ఇక్కడ అఫ్లహ. దౌర్భాగ్యుడు నరకంలో వెళ్తాడు. మరి ఆ దౌర్భాగ్యునికి భిన్నంగా, ఆపోజిట్ లో ఉండేవాడు ఎవడు? సౌభాగ్యవంతుడు, సాఫల్యం పొందేవాడు. వారి యొక్క గుణాలు ఏంటి? ఇలా ఉంటాయి.

కానీ ఈ రోజుల్లో అనేకమంది తమకు తాము ముస్లింలు అనుకుంటూ కూడా ఎలా ప్రవర్తిస్తున్నారు? 16వ ఆయతులో అల్లాహ్ తెలిపాడు.

بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا
(బల్ తు`సిరూనల్ హయాతద్-దున్యా)
కాని మీరు మాత్రం ప్రాపంచిక జీవితానికే ప్రాముఖ్యమిస్తున్నారు. (87:16)

కానీ మీరు మాత్రం ప్రాముఖ్యతనిస్తున్నారు ప్రాపంచిక జీవితానికి. ఈ రోజుల్లో ఇలాగే జరుగుతుంది కదా మనలో అనేకమంది. కానీ వాస్తవం ఏమిటి?

وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ
(వల్-ఆఖిరతు ఖైరువ్-వ అబ్ ఖా)
వాస్తవానికి పరలోకం ఎంతో మేలైనది, ఎప్పటికీ మిగిలి ఉండేది.(87:17)

ఈ విషయాన్ని గమనించండి ఇక్కడ. ఇహలోకం ఎప్పటికీ మిగిలి ఉండేది కాదు. ఎప్పటికీ మిగిలి ఉండేది పరలోకం. ఇహలోకం మంచిది ఎప్పుడు? దానిని నీవు పరలోకం మంచి కొరకు ఉపయోగిస్తున్నప్పుడు. ఇహలోకంలో ఉండి పరలోకం గురించి నీవు ఆలోచించకుంటే, నీ ఇహలోకం కూడా పాడే, పరలోకం కూడా పాడైపోతుంది.

إِنَّ هَٰذَا لَفِي الصُّحُفِ الْأُولَىٰ
(ఇన్న హాజా లఫిస్-సుహుఫిల్ ఊలా)
ఈ విషయాలు మునుపటి గ్రంథాలలోనూ ఉన్నాయి. (87:18)

ఈ బోధనలు, ఈ విషయాలు మునుపటి గ్రంథాలలో ఉన్నాయి. ఎవరి గ్రంథాలు?

صُحُفِ إِبْرَاهِيمَ وَمُوسَىٰ
(సుహుఫి ఇబ్రాహీమ వమూసా)
(అంటే) ఇబ్రాహీము, మూసాల గ్రంథాలలో! (87:19)

ఈ విధంగా ఇక్కడి వరకు సూరా సమాప్తమైనది. సోదర మహాశయులారా, ఈ సూరాలో మనకు ఉన్నటువంటి బోధనలు ఎంత చక్కగా అల్లాహు త’ఆలా తెలిపాడో అర్థం చేసుకొని, దాని ప్రకారంగానే మీరు ఆచరించే ప్రయత్నం చేయండి.

మీరు అడిగిన ఈ ప్రశ్నకు సంబంధించి నేను మూడు మాటలు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి మీరందరూ కూడా. అర్థం చేసుకోండి, ఇప్పుడు ఉన్నవారు, తర్వాత ఆన్లైన్ లో వినేవారు, YouTube లో వినేవారు. మొదటి విషయం, ప్రతీ నమాజ్ కొరకు ఒక ప్రారంభ సమయం, ఒక ముగింపు సమయం అనేది ఉంటుంది. ఇక మీరు ఇషా విషయంలో అడిగారు గనక, ఇషా యొక్క సమయం రాజిహ్ ఖౌల్, ప్రియారిటీ ప్రాధాన్యత లభించినటువంటి మాట ఆధారంగా, దేనికైతే ఎక్కువ హదీసులు ఆధారంగా ఉన్నాయో దాని పరంగా ఇషా ముగింపు సమయం అర్ధరాత్రి. ఇక్కడ అర్ధరాత్రి అంటే సర్వసామాన్యంగా రాత్రి 12 గంటలు మిడ్ నైట్ అని అంటారు అలా కాదు. సూర్యాస్తమయం నుండి ఫజర్ ప్రారంభ సమయం వరకు ఎన్ని గంటలు ఉంటాయో అందులో మీరు సగం చేయాలి. ఇది ఒక మొదటి మాట.

రెండో మాట ఏమిటంటే, కొన్ని హదీసుల ఆధారంగా ఫజర్ వరకు కూడా ఇషా సమయం ఉన్నది అని కొందరి అభిప్రాయం ఉన్నది. కానీ ఇంతకుముందే నేను చెప్పినట్టు మొదటి మాటలో రాజిహ్, ప్రాధాన్యత కలిగిన ప్రియారిటీ ఇవ్వబడిన ఆధారాల ప్రకారంగా, ప్రియారిటీ ఇవ్వబడినటువంటి మాట ఏమిటి? అర్ధరాత్రి మాట ఎక్కువ నిజం.

ఇక మూడో మాట, ప్రత్యేకంగా ఇషాకు సంబంధించి కానివ్వండి లేదా ఏ నమాజ్ అయినా, ఏదైనా ధర్మపరమైన కారణం వల్ల మనం ఏదైనా నమాజ్ దాని ముగింపు సమయానికంటే ముందే చేయలేకపోతే, అయ్యో ఇక సమయం అయిపోయింది కదా అని ఊరుకుండేది కాదు. ఆ నమాజ్ ను తప్పకుండా మనం చేయాలి. ఒకవేళ సమయం అయిపోయినప్పటికీ కూడా ఆ నమాజ్ తప్పకుండా చేయాలి. కానీ, సమయం దాటిన తర్వాత చేసిన నమాజ్ యొక్క పుణ్యం, దాని సమయం దాటక ముందే చేసిన నమాజ్ పుణ్యం మరియు నమాజ్ యొక్క దాని తొలి సమయంలో చేసే నమాజ్ పుణ్యం, ఈ మూడిటిలో తేడాలు ఉంటాయి. అయితే నేను ఇక్కడ మీతో అందరితో ఒక ప్రశ్న అడుగుతున్నాను, మూడు సమయాలు చెప్పాను నేను. ఒక మనిషి, ఉదాహరణకు ఒక మనిషి ఇషా నమాజ్ దాని తొలి సమయంలో చదివాడు. మరొక మనిషి దాని ఇషా నమాజ్ దాని చివరి సమయంలో చదివాడు. అంటే సమయం దాటక ముందే, ముగింపు కంటే కొంచెం ముందు. మూడో వ్యక్తి సమయం దాటిపోయిన తర్వాత చదివాడు. ఈ ముగ్గురిలో ఎవరికి ఎక్కువ పుణ్యాలు లభిస్తాయండి?

బారకల్లాహు ఫీ ఇల్మికుం. కరెక్ట్ సమాధానం. మాషాఅల్లాహ్, మాషాఅల్లాహ్. మన ఈ ఆన్లైన్ లో వింటున్న వారు ఏదో బండిపై లేదా బస్సులో లేదా వెహికల్ పై ప్రయాణం చేసుకుంటూ కూడా వింటున్నారు అన్నట్లుగా కనబడుతుంది. జజాకుముల్లాహు ఖైర్ వంట చేసుకుంటూ కూడా, ఇల్లు ఊడ్చుకుంటూ కూడా, బట్టలు ఉతుక్కుంటూ కూడా, మీ పనులు చేసుకుంటూ కూడా మాషాఅల్లాహ్ తబారకల్లాహ్ మీరు ఈ పాఠాలు వింటున్నారు అంటే అల్హందులిల్లాహ్ మంచి విషయం. మీ యొక్క సమయాన్ని ఒక పుణ్య కార్యంలో గడుపుతున్నారు. అయితే ఇషా సమయంకి నమాజ్ కి సంబంధించి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం లభించింది కదా?

మీరు అడిగిన దానికి, మీరు ఇంత మాట చెప్పిన దానికి మరొక సలహాగా నేను ఒక మాట చెబుతున్నాను, బహుశా ఇంట్లో ఉండే ప్రతీ స్త్రీకి కానివ్వండి లేదా ఏదైనా నైట్ డ్యూటీ చేసేవారు లేదా కొందరు మధ్యాహ్న డ్యూటీ చేస్తారు, వారి డ్యూటీ అయిపోయేసరికి రాత్రి 11, 12 ఇలా అవుతుంది. అయితే ఆ విషయం ఏంటంటే, ఎవరైనా ఇషా నమాజ్ విషయంలో ప్రత్యేకంగా చాలా అలసిపోవడం వల్ల, చాలా పని ఉండడం వల్ల, చాలా ఇరుకులో చిక్కుకొని ఉన్నారు, ఆ నమాజ్ కొరకు సమయం కలగడం లేదు, అలాంటి వారు ఇషా ప్రాధాన్యత ఇవ్వబడిన సమయం అర్ధరాత్రి అని ఏదైతే తెలుసుకున్నామో, ఆ సమయం దాటక ముందు కనీసం ఫర్ద్ నాలుగు రకాతులు చేసుకోండి. కనీసం ఫర్ద్ నాలుగు రకాతులు చేసుకోండి. ఆ తర్వాత దాని యొక్క సున్నత్, విత్ర్, ఇవన్నీ మీరు ఆ తహజ్జుద్ కొరకు లేచినప్పుడు, ఫజర్ కు ముందు లేచినప్పుడు చేసుకున్నా ఇబ్బంది లేదు, పాపం ఏమీ లేదు ఇన్షాఅల్లాహ్.

అయితే ఇక్కడ కొందరు ఉలమాలు ఏదైతే పట్టుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు, తీసుకోవచ్చు కానీ తెరవకూడదు అని ఏదైతే అన్నారో, తెరవకూడదు అని అంటే అక్కడ భావం, ఆయతులు అరబీలో ఏవైతే రాసి ఉన్నాయో, ఆ ఆయతులు రాసి ఉన్న చోట తమ ఆ చెయ్యి, వేలు పెట్టకుండా ఉంటే మరీ మంచిది అని అంటారు. అది అసలు విషయం. పవిత్రత, పరిశుభ్రంగా లేని సమయంలో ఖురాన్ పట్టుకోకూడదు అని అంటే, ప్రత్యేకంగా ఆయతులు రాసి ఉన్న చోట మన ఆ శరీర భాగం తగలకుండా ఉండడం మంచిది అని అంటారు. కానీ వేరే దాని బైండింగ్ లేదా అది కవర్ లో ఉన్నది, ఆ రీతిలో పట్టుకొని మనం ఎవరికైనా ఇస్తున్నాము, తీసుకుంటున్నాము ఇబ్బంది లేదు అని అంటారు.

నేను మరోసారి చెబుతున్నాను. నేను అక్కడ చెప్పిన ఉదాహరణ ఇచ్చాను నేను, ఏమి ఇచ్చాను? మనం అల్లాహ్ యొక్క పవిత్రతను మన ఆచరణ ద్వారా కూడా వ్యక్తపరచాలి. ఆచరణ ద్వారా ఎలా వ్యక్తపరచాలి? ఎన్నో సందర్భాలు ఉండవచ్చు మన జీవితంలో అలాంటివి రావచ్చు. కానీ సర్వసామాన్యంగా అందరికీ తెలుస్తది అని నేను ఒక ఉదాహరణ ఇచ్చాను. ఏంటి ఉదాహరణ అది? మీరు ఆ జెండా వందనం అని ఏదైతే అంటారో, అది కరెక్ట్ పదం ఏంటో నాకు తెలియదు. సర్వసామాన్యంగా ప్రజలు అంటూ ఉంటారు కానీ, 15th ఆగస్టు లేదా ఇలాంటి సందర్భంలో అక్కడ ఏదైతే జెండా వద్ద మన ఇందిరా గాంధీ లేకుంటే మన గాంధీజీ, నెహ్రూ గారి యొక్క ఫోటోలు ఏదైతే పెడతారో, అక్కడ ఎంతోమంది కొబ్బరికాయ కొడతారు. అయితే మన ముస్లింలలో కొందరు ఏమనుకుంటారు, నేను సుబ్ హా నల్లాహ్ అనుకుంటాను తర్వాత క్షమాపణ కోరుకుంటాను, కానీ ఒక నా టెంకాయ కొట్టేద్దాము. ఇలా టెంకాయ కొట్టడం మన ఆచరణ పరంగా మనం సుబ్ హా నల్లాహ్ కు వ్యతిరేకం చేస్తున్నట్లు. కనుక అలాంటి చోట టెంకాయ కూడా కొట్టకూడదు.

జజాకుముల్లాహు ఖైర, బారకల్లాహు ఫీకుం, కతబల్లాహు అజ్రకుం. అల్లాహు త’ఆలా ఖురాన్ ను మంచిగా అర్థం చేసుకొని, ప్రవక్త హదీసులను చదువుతూ అర్థం చేసుకొని, వాటి ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకునే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్, వ ఆఖిరు దావాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44090


నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు – 4 [మరణానంతర జీవితం – పార్ట్ 58] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు [పార్ట్ 4]
[మరణానంతర జీవితం – పార్ట్ 58] [26 నిముషాలు]
https://www.youtube.com/watch?v=rtI9WoN-uuo
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ఇస్లాంలో నరకం (జహన్నం) యొక్క తీవ్రతను, దాని అగ్ని మరియు శిక్షల గురించి వివరిస్తారు. నరకంలో మరణం అనేది ఉండదని, శిక్ష నిరంతరంగా మరియు తీవ్రంగా ఉంటుందని, అది ఎముకలను మరియు హృదయాలను తాకుతుందని స్పష్టం చేస్తారు. నరకాగ్ని, దాని నిప్పురవ్వలు, నివాసుల హింస, వారు తాగే బాధాకరమైన పానీయాలు మరియు నీడలేని నీడ గురించి ఖురాన్ ఆయతులను ఉటంకిస్తారు. కృతజ్ఞత లేకపోవడం మరియు ఇతరులను శపించడం వంటివి నరకంలో స్త్రీలు అధిక సంఖ్యలో ఉండటానికి ప్రధాన కారణాలని పేర్కొంటూ, ఈ దుర్గుణాలు ఎవరినైనా నరకానికి దారితీస్తాయని నొక్కి చెబుతారు. ఈ ప్రపంచం యొక్క తాత్కాలిక స్వభావాన్ని పరలోకం యొక్క శాశ్వత వాస్తవికతతో పోలుస్తూ, శ్రోతలను అల్లాహ్‌కు భయపడాలని, పాపాలను విడిచిపెట్టాలని, మరియు ఖురాన్ మరియు ప్రవక్త మార్గదర్శకత్వం అనుసరించి పరలోకం కోసం సిద్ధం కావాలని ప్రబోధిస్తారు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి వహ్దహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు, అమ్మా బ’అద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

మహాశయులారా, నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు. దీనికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. నరకం, దాని యొక్క వేడి ఎలా ఉంటుంది? నరకం దాని వేడితో అందులో పడే నరకవాసులను ఎలా శిక్షిస్తుంది? దానిని వివరిస్తూ అల్లాహ్ త’ఆలా ఎన్నో రకాలు దాని గురించి తెలిపాడు. ఈ రకాలు ఏదైతే తెలిపాడో, దానివల్ల మనలో భయం ఏర్పడి, మనం ఆ నరకం నుండి రక్షింపబడుటకు ప్రయత్నాలు చేయాలి.

సామాన్యంగా ఈ రోజుల్లో ఎవరినైనా అడగండి, నరకంలో వేసిన తర్వాత ఏమవుతుంది అంటే, మనిషి కాలి బూడిదైపోతాడు అని అంటారు. కానీ నరకాగ్ని అలాంటిది కాదు. అది మనిషిని కాల్చడంలో ఎంత వేగం, దాని యొక్క శిక్షలో ఎంత కఠినత్వం మరియు దానివల్ల మనిషికి కలిగే బాధ ఎంత ఘోరంగా ఉంటుందో, మరో విచిత్రకరమైన విషయం ఏంటంటే, ఆ శిక్షలో, ఆ నరకాగ్నిలో మనిషికి చావు అన్నది రాదు. అందులో మనిషి కాలి బూడిదైపోడు. అలా కావడానికి ఏ మాత్రం అవకాశం లేదు.

నరక శిక్షల గురించి అల్లాహ్ త’ఆలా ఏ ఏ ఆయతులైతే అవతరింపజేశాడో, వాటిలో కొన్ని ఆయతులు మాత్రమే మనం చదివి వాటి అర్థభావాలను తెలుసుకుందాము. వాటి ద్వారా నరక శిక్ష యొక్క వేడిని, దాని యొక్క గాంభీర్యతను తెలుసుకోవడంతో పాటు, ఏ పాపాల వల్ల అలాంటి శిక్ష ఇవ్వడం అనేది జరుగుతుందో, ఆ పాపాలకు దూరంగా ఉండే ప్రయత్నం కూడా మనం చేద్దాము.

నరకాగ్ని ఎంత శిక్షాపరమైనదంటే, కేవలం మనిషి చర్మాన్నే కాల్చివేయదు. దాని యొక్క వేడి, అగ్ని ఎముకలకు చేరుకుంటుంది. అంతేకాదు, హృదయం లోపలి భాగంలో కూడా అది చేరుకుంటుంది. అంతేకాదు, అగ్ని మనిషి యొక్క నోటి వరకు వచ్చినా, దాని మూలంగా కడుపులో దాని యొక్క బాధ, అవస్థ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇంతకుముందే మనం ఒక కార్యక్రమంలో విన్నాము, అతి తక్కువ శిక్ష ఎవరికైతే నరకంలో ఇవ్వబడుతుందో, దాని యొక్క రకం ఏమిటి? నరకపు బూట్లు ధరింపచేయడం జరుగుతుంది, దానివల్ల అతని యొక్క మెదడు ఉడుకుతున్నట్లుగా అతనికి ఏర్పడుతుంది.

ప్రపంచపు అగ్నిలో ఎప్పుడైనా అది ఎముకల వరకు చేరుతుంది, హృదయం లోపలి వరకు చేరుతుంది, కడుపు లోపలి వరకు చేరుతుంది, ఇలాంటి విషయాలు వింటామా? సోదరులారా, నరకం గురించి ఇన్ని వివరాలు అల్లాహ్ మనకు తెలిపాడు అంటే, అన్ని రకాల పాపాలను, అన్ని రకాల చెడుగులను మనం వదులుకోవాలని.

సూరె ఘాషియాలో,

وُجُوهٌ يَوْمَئِذٍ خَاشِعَةٌ
(వుజూహున్ యౌమఇజిన్ ఖాషిఅహ్)
ఆ రోజు ఎన్నో ముఖాలు అవమానంతో పాలిపోయి ఉంటాయి.(88:2)

عَامِلَةٌ نَّاصِبَةٌ
(ఆమిలతున్ నాసిబహ్)
శ్రమిస్తూ, అలసి సొలసి ఉంటాయి. (88:3)

تَصْلَىٰ نَارًا حَامِيَةً
(తస్లా నారన్ హామియహ్)
వారు మండే అగ్నికి ఆహుతి అవుతారు.(88:4)

ఎన్నో ముఖాలు, వారి ముఖాలు క్రిందికి వాలి ఉంటాయి, వంగి ఉంటాయి. వారు ఇహలోకంలో ఎంతో కష్టపడేవారు. అలసిపోయి అలసిపోయి ఎన్నో మేము పుణ్యాలు చేసుకున్నాము అని సంతోషపడేవారు. కానీ ప్రవక్త విధానంలో లేనందుకు, అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు లేనందుకు ఏం జరిగింది? తస్లా నారన్ హామియా. ఆ పుణ్యాలన్నీ కూడా వృధా అయిపోయినాయి మరియు వారు తస్లా, నరకంలో చేరారు. ఎలాంటి నరకం? హామియా, అది మండుతూ ఉంటుంది.

మరోచోట సూరతుల్ లైల్ లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్,

فَأَنذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ
(ఫ అన్-జర్తుకుమ్ నారన్ తలజ్జా)
మరి నేను మటుకు నిప్పులు చెరిగే నరకాగ్ని గురించి మిమ్మల్ని హెచ్చరించాను.(92:14)

అని తెలియపరిచాడు. ఆ నరకాగ్ని ఎలాంటిది? నారన్ తలజ్జా. నిప్పులు చెరిగే ఆ నరకాగ్ని నుండి నేను మిమ్మల్ని హెచ్చరించలేదా? ఇంకా ఆ నరకాగ్ని భగభగ మండుతూ ఉంటుంది, మంటలు లేస్తూ ఉంటాయి. దాని యొక్క జ్వాలలతోనే మనిషికి ఎంతో దూరం నుండి వాటి యొక్క వేడి తలుగుతూ ఉంటుంది.

తబ్బత్ యదా అబీ లహబివ్ వతబ్. మా అగ్నా అన్హు మాలుహు వమా కసబ్. అబూ లహబ్ అతని చేతులు విరిగిపోవు గాక, అతను సర్వనాశనమయ్యాడు. అతను సంపాదించిన సంపద మరియు అతని యొక్క డబ్బు, ధనం అతనికి ఏమీ ప్రయోజనం కలిగించలేదు.

سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ
(సయస్లా నారన్ జాత లహబ్)
త్వరలోనే వాడు భగ భగ మండే అగ్నికి ఆహుతి అవుతాడు. (111:3)

గమనించండి ఇక్కడ. నారన్ హామియా, నారన్ తలజ్జా, నారన్ జాత లహబ్. నార్, ఆ అగ్ని, నరకం దాని యొక్క గుణాలు ఈ విధంగా తెలుపబడుతున్నాయి. ఇక్కడ జాత లహబ్, అందులో భగభగ మండుతూ ఉంటుంది, దాని యొక్క మంటలు, దాని యొక్క జ్వాలలు మహా భయంకరంగా ఉంటాయి.

ఈ విధంగా మహాశయులారా, అంతటి కఠిన శిక్ష గల ఆ నరకం మరియు ఆ నరకాగ్ని యొక్క ఇలాంటి రకరకాల గుణాలు వాటితో రక్షణ పొందడానికి ఏముంది మన వద్ద?

الَّتِي تَطَّلِعُ عَلَى الْأَفْئِدَةِ
(అల్లతీ తత్తలివు అలల్ అఫ్-ఇద)
అది హృదయాల వరకూ చొచ్చుకు పోయేటటువంటిది. (104:7)

అని ఒకచోట తెలపడం జరిగింది. ఆ నరకం, నరకాగ్ని మనిషి యొక్క హృదయాల వరకు చేరుతుంది. మరియు ఆ నరకాగ్ని అందులో ఏ నిప్పులైతే లేస్తాయో, అగ్ని యొక్క నిప్పులు ఏవైతే లేసి వేరేచోట పడతాయో, వాటి గురించి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఆ నిప్పులు ఎంత పెద్దగా ఉంటాయో, దాని యొక్క వివరణ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సూరతుల్ ముర్సలాత్‌లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు,

إِنَّهَا تَرْمِي بِشَرَرٍ كَالْقَصْرِ
(ఇన్నహా తర్మీ బిషరరిన్ కల్-ఖస్ర్)
నిశ్చయంగా నరకం మేడలు, మిద్దెలంతటి నిప్పు రవ్వలను విసురుతుంది. (77:32)

ఆ నరకం ఎలాంటి నిప్పులను పడవేస్తుందంటే, ఆ నిప్పులు పెద్ద పెద్ద బిల్డింగుల మాదిరిగా, మహా గొప్ప కోటల మాదిరిగా, అంత పెద్దగా ఒక్కొక్క నిప్పు ఉంటుంది. అల్లాహు అక్బర్! ఆ నిప్పు అంత భయంకరమైన, ఘోరమైన, అంత పెద్దగా ఉంటుంది అంటే, ఇక ఆ నరకాగ్ని ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి.

ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

నారుకుమ్ హాజిహిల్లాతీ యూఖిదు ఇబ్ను ఆదమ్, జుజ్‌ఉమ్ మిన్ సబ్ఈన జుజ్‌ఇన్ మిన్ హర్రి జహన్నమ్”.
ఇహలోకంలో మనిషి ఏ అగ్నినైతే కాలుస్తున్నాడో, అది నరకపు అగ్నిలో 70 భాగాలు చేస్తే, అందులోని ఒక భాగం.

సహాబాలకు చాలా ఆశ్చర్యం కలిగింది. సహాబాలు చెప్పారు, “ప్రవక్తా, మనిషిని కాల్చడానికి ఈ ఇహలోకపు అగ్నియే చాలు కదా?” ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఆ నరకాగ్ని ఇహలోకపు అగ్ని కంటే “ఫుద్విలత్ బి తిస్ఇన్ వసిత్తీన జుజ్ఆ”, 69 రేట్లు ఎక్కువగా అది ఇంకా వేడిగా ఉంటుంది. మరి గమనించండి, ఈ ఇహలోకపు అగ్నియే మనిషిని కాల్చడానికి సరిపోతుంది అని అనుకునే వాళ్ళం మనం, ఇంతకంటే 69 రేట్లు ఎక్కువగా వేడి ఉన్న ఆ నరకాగ్ని నుండి రక్షింపబడడానికి ఏం చేస్తున్నాము?

మహాశయులారా, మనిషి వేడిలో, ఎండకాలంలో ఏదైనా ప్రశాంతత పొందడానికి, నీడ పొందడానికి, చల్లదనం పొందడానికి ఎక్కడికి వెళ్తాడు? ఏదైనా చెట్టు కింద నీడ పొందాలని, అక్కడ హాయిగా గాలి వీస్తూ ఉండాలని, త్రాగడానికి చల్లటి నీళ్లు అతనికి లభించాలని కోరుకుంటాడు. అవునా కాదా? మనందరి పరిస్థితి ఇదే కదా?

కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. అందులో అతనికి ఎండలో పని చేస్తూ చేస్తూ చెమటలు కారుతూ, శక్తి క్షీణించిపోయినట్లుగా ఏర్పడుతుంది. కొంతసేపటి గురించైనా నీడలోకి వెళ్లి, గాలి వీస్తున్నచోట కూర్చుండి, ప్రశాంతత తీసుకొని అక్కడ త్రాగడానికి చల్లటి నీరు లభించిందంటే, అతనికి ఓ స్వర్గం లభించింది అన్నట్టుగా భావిస్తాడు.

కానీ నరకంలో ఉన్నవారు నరక శిక్షను భరిస్తూ భరిస్తూ సహించలేక, ఓపిక వహించలేక, చావు వచ్చి చనిపోతే బాగుండు అని కోరుతూ ఉంటారు. అయినా అక్కడ చావు రావడానికి ఏ మాత్రం అవకాశం లేదు. అప్పుడు వారికి ఒక నీడ లాంటిది కనబడుతుంది.

انطَلِقُوا إِلَىٰ ظِلٍّ ذِي ثَلَاثِ شُعَبٍ
(ఇన్-తలిఖూ ఇలా జిల్లిన్ జీ సలాసి షుఅబ్)
“మూడు పాయలుగా చీలిన ఆ నీడ వైపు పదండి!!” (77:30)

لَّا ظَلِيلٍ وَلَا يُغْنِي مِنَ اللَّهَبِ
(లా జలీలిన్ వలా యుగ్నీ మినల్ లహబ్)
నిజానికి అది మీకు నీడనూ ఇవ్వదు, అగ్ని జ్వాలల నుండి మీకు రక్షణనూ ఇవ్వదు. (77:31)

అక్కడ వారికి ఒక నీడ లాంటిది కనబడుతుంది. ఆ నీడలో వెళ్దాము అని వారు అక్కడికి వెళ్తారు. అల్లాహు అక్బర్! ఆ నీడ కూడా ఎలాంటిది? ఆ నీడ నరకాగ్ని యొక్క నీడ. మనిషి కొంతపాటు విశ్రాంతి తీసుకుందామని ఆ నీడలోకి వెళ్ళినప్పుడు, నరకం నుండి పెద్ద పెద్ద నిప్పులు వచ్చి పడతాయి. ఒక్కొక్క నిప్పు ఒక పెద్ద పర్వతం మాదిరిగా, పెద్ద కోట మాదిరిగా, ఓ మహా పెద్ద ప్యాలెస్ మాదిరిగా ఉంటుంది.

ఇక ఆ నీడతో అతనికి ఏం ప్రయోజనం కలిగింది? చల్లని గాలి వస్తుందేమో అని అక్కడ ఆశిస్తూ ఉంటాడు. అప్పుడు ఏం జరుగుద్ది? సూరె వాఖిఆలో అల్లాహ్ త’ఆలా దాని గురించి ప్రస్తావించాడు. నరకం, నరకపు అగ్ని, దాని యొక్క వేడి, దాని యొక్క రకాలు, గుణాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుంటున్నాము. నరకాగ్ని శిక్షను మనిషి భరించలేక నీడ చూస్తాడు, ఆ నీడలో కొంత విశ్రాంతి తీసుకుందామని వస్తాడు, కానీ ఆ నీడ నరకపు అగ్ని యొక్క నీడ. అందులో ఎలాంటి ప్రశాంతత అనేది ఉండదు. పైగా నరకపు నిప్పులు వచ్చి పడుతూ ఉంటాయి. ఒక్కొక్క నిప్పు ఎంతో పెద్ద ప్యాలెస్ గా, పెద్ద కోట మాదిరిగా ఉంటుంది.

ఏమైనా గాలి వీస్తుందో ఏమో, ఆ గాలి ద్వారా కొంచెం ఏదైనా లాభం పొందుదాము అని కోరుతాడు. కానీ అది ఎలాంటిది? మీ యహ్మూమ్ అని అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తెలిపాడు. గాలి వీస్తుంది, కానీ ఆ గాలి ఎలాంటిది? అందులో కూడా విపరీతమైన వేడి, పొగ మరియు ఆ దానిని మనిషి ఏ మాత్రం భరించలేడు. ఎందుకైతే నేను ఆ నరకం నుండి బయటికి వచ్చాను, ఇక్కడి కంటే అక్కడే బాగుండే కదా అని అప్పుడు మనిషి భావిస్తాడు. ఈ విధంగా స్థలాలు మార్చినా, ఒక స్థితి నుండి మరో స్థితికి వచ్చినా, నరకపు అగ్ని అనేది, నరకపు శిక్ష అనేది తగ్గదు.

ఇక ఏదైనా నీరు త్రాగాలి అని అనిపిస్తుంది. అప్పుడు అతనికి మరీ దాహం కలిగి త్రాగడానికి ఏ నీరైతే ఇవ్వబడుతుందో, లా బారిదిన్ వలా కరీమ్. అది చల్లగా ఉండదు మరియు అతిథికి గౌరవ మర్యాదలు ఇస్తూ ఎలాగైతే ఒక వస్తువు త్రాగడానికి, తినడానికి ఇవ్వడం జరుగుతుందో అలా జరగదు. సూరె కహఫ్ లో చదవండి.

وَإِن يَسْتَغِيثُوا يُغَاثُوا بِمَاءٍ كَالْمُهْلِ يَشْوِي الْوُجُوهَ ۚ بِئْسَ الشَّرَابُ وَسَاءَتْ مُرْتَفَقًا

ఒకవేళ వారు సహాయం (ఉపశమనం, నీళ్లు) అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో వారికి సహాయం అందజేయబడుతుంది. అది ముఖాలను మాడ్చివేస్తుంది. అత్యంత అసహ్యకరమైన నీరు అది! అత్యంత దుర్భరమైన నివాసం (నరకం) అది!!. (18:29)

దాహం కలుగుతుంది, మాకు నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి అని వారు కోరుతారు. అప్పుడు వారికి త్రాగడానికి ఏ నీరైతే ఇవ్వడం జరుగుతుందో, దానిని దగ్గరికి తీసుకుంటే యష్విల్ వుజూహ్, త్రాగకముందే కేవలం దగ్గరికి తీసుకున్నంత మాత్రాన ముఖమంతా కాలిపోతుంది. అల్లాహు అక్బర్! దాన్ని చూసి ఏమంటాడు? బిఅసష్షరాబ్! ఇది ఎంత చెడ్డ నీరు, త్రాగడానికి ఇవ్వబడిన ఈ పదార్థం ఎంత చెడ్డది అని అక్కడ భావిస్తాడు. అల్లాహు అక్బర్! కానీ ఈ రోజుల్లో ఆ నరకం నుండి రక్షణ పొందడానికి ఏ పాపాల నుండి అయితే మనం దూరం ఉండాలో, ఆ పాపాలలో ఎంతో ఆనందిస్తున్నాడు. అల్లాహు అక్బర్! ఇలాంటి జీవితం మనిషిది గమనించండి. అందుగురించి అల్లాహ్ త’ఆలా ఖురాన్ లాంటి దివ్య గ్రంథాన్ని మనకు ప్రసాదించి, దీన్ని చదవడం ద్వారా, దీనిని మనం గ్రహించడం ద్వారా ఇలాంటి పాపాల నుండి దూరం ఉండి రేపటి రోజు ఆ నరక శిక్షల నుండి కూడా మనం రక్షింపబడగలుగుతాము.

మహాశయులారా, నరకం, అందులో అతి ఎక్కువ సంఖ్య ఎవరిది ఉంటుంది? నరకం ఎవరి స్థానం అవుతుంది? దీని గురించి హదీసుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా స్పష్టంగా తెలిపారు. పురుషుల కంటే ఎక్కువ సంఖ్య నరకంలో స్త్రీలది ఉంటుంది అని తెలిపారు. అయితే ఇక్కడ స్త్రీలను అగౌరవపరచడం కాదు, కొన్ని రకాల గుణాలు తెలపడం జరిగింది. వారిలో ఆ చెడు గుణాలు ఎక్కువ ఉన్నందుకు వారు ఎక్కువగా నరకంలో ఉంటారు అని తెలపడం జరిగింది. ఒకవేళ అలాంటి గుణాలు పురుషుల్లో ఉంటే, వారు కూడా నరకంలో ఉంటారు.

ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “ఇన్నీ రఐతు అక్సర అహ్లిన్నారి అన్నిసా”. నేను నరకంలో అధిక సంఖ్య స్త్రీలది చూశాను అని చెప్పారు. స్త్రీలలో నుండి ఒక స్త్రీ నిలబడి, “ప్రవక్తా, ఎందుకు, కారణం చెప్పగలుగుతారా?” ఉద్దేశం ఏమిటి? కారణం తెలిస్తే అలాంటి కారణాలు మా ద్వారా సంభవించకుండా మేము జాగ్రత్త పడగలము. ఆనాటి కాలంలో సహాబాలు గాని, సహాబాల యొక్క భార్యలు, సహాబియాత్ కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా శిక్ష గురించి హెచ్చరిస్తున్నారు అంటే, ఇలా ఎందుకు అని వారు కారణం అడిగితే వారి ఉద్దేశం ఏముండేది? అలాంటి పాపాల నుండి దూరం ఉండాలి అని.

ఎక్కడైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త తెలుపుతున్నారు, “అలా అదుల్లుకుమ్ అలా మా యమ్హుల్లాహు బిహిల్ ఖతాయా”, మీ పాపాలు ఎలా మన్నించబడాలి, మీ స్థానాలు ఎలా రెట్టింపు చేయబడాలి అని ఇలాంటి శుభవార్తలు ఏదైనా ఇస్తున్నప్పుడు, “తప్పక తెలపండి, ఆ విషయాలు ఏమిటి?” అని అడిగేవారు. ఎందుకు? అలాంటి సత్కార్యాలు చేసుకోవాలని. అల్లాహ్ మనలోని ప్రతి ఒక్కరిని క్షమించు గాక, ఈ రోజుల్లో మనలో అనేకమంది అలవాటు ఏమైంది? చెడు గుణం గురించి ఏదైనా, శిక్ష గురించి ఏదైనా హెచ్చరిక ఇవ్వబడుతున్నప్పుడు, అడ్డ ప్రశ్నలు వేసి, ఆ శిక్షకు కారణమయ్యే పాపాల నుండి దూరం ఉందాము అన్నటువంటి ఆలోచన లేకుండా, ఇంత పాపానికి ఇంత పెద్ద శిక్షనా? ఇలాంటి పాపాలు మన్నించబడవా? ఇలాంటి పాపాలు చేసిన తర్వాత ఏదైనా .. ప్రశ్నలు వేస్తూ ఉంటారు కానీ, వాటి నుండి మనం దూరం ఉందాము మరియు దానికి సబబు ఏదైతే శిక్ష అవుతుందో, ఆ శిక్ష నుండి మనం తప్పించుకునే ప్రయత్నం చేద్దాము అన్నటువంటి ఆలోచన కలగటం లేదు.

మరోవైపు పుణ్యకార్యాల గురించి శుభవార్త ఇవ్వడం జరిగినప్పుడు, ఇది కూడా చేయడం తప్పనిసరియా? చేయకుంటే నడవదా? అన్నటువంటి ప్రశ్నలు అక్కడ. అల్లాహ్‌తో భయపడాలి మనం. ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మీకంటే ముందు గతించిన జాతి వారు వినాశనానికి గురి అయ్యే కారణాల్లో ఒక కారణం, ప్రవక్తలు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉండడం మరియు అధికంగా అనవసరమైన ప్రశ్నలు ప్రశ్నిస్తూ ఉండడం.

అందుగురించి మహాశయులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే తెలిపారో, నేను నరకంలో అధిక సంఖ్యలో స్త్రీలను చూశాను అని, ఒక స్త్రీ నిలబడి, “ప్రవక్తా, కారణాలు ఏంటి?” అని అడిగితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “యక్సుర్నల్ లఅన్, వ యక్ఫుర్నల్ అషీర్”. వారి నోట మాటిమాటికి శాపనార్థాలు వెళ్తూ ఉంటాయి. వారు ఎక్కువగా శపిస్తూ ఉంటారు మరియు తమ భర్తలకు వారు కృతజ్ఞత చెల్లించడం అనేది చాలా తక్కువగా ఉంటుంది.

భర్తలకు ఆదేశం ఇవ్వడం జరిగింది, “ఖియారుకుమ్ ఖియారుకుమ్ లి అహ్లిహి, వ అన ఖైరుకుం లి అహ్లీ”. మీలో అందరికంటే మేలైన వాడు తమ ఇల్లాలి పట్ల, తమ ఇంటి వారి పట్ల అతి ఉత్తమంగా మెలిగేవాడు అని. మరియు నేను మీ అందరిలోకెల్లా ఉత్తమమైన వాడిని, నేను నా ఇల్లాలి పట్ల, ఇంటి వారి పట్ల ఉత్తమ వైఖరి అవలంబిస్తాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. అటువైపున భర్తలకు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. అలాగే భార్యలకు కూడా భర్త హక్కు ఏమిటో, భర్త జీవితాంతం మేలు చేసుకుంటూ వస్తాడు, కానీ ఒక్కసారి భార్య యొక్క కోరిక ఏదైనా నెరవేర్చక పోవడంలో, “జీవితంలో ఎప్పుడూ కూడా నీతో సుఖం పొందలేదు నేను” అని భార్య అంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వివరణ ఇచ్చారు. అయితే, ఇలాంటి చెడు గుణం కొందరి భర్తల్లో కూడా ఉంది. వారు కూడా తమ చెడు గుణాన్ని దూరం చేసుకోవాలి. భార్యతో ఎంత ఆనందం పొందినా, ఎంత సుఖం పొందినా, ఒక్కసారి కూడా నీతో నేను సుఖం పొందలేదు అన్నటువంటి మాటలు కూడా మాట్లాడతారు.

మహాశయులారా, నరకానికి కారణమయ్యే ఇలాంటి దుర్గుణాల నుండి, దురలవాట్ల నుండి, చెడు కార్యాల నుండి మనం దూరం ఉండే ప్రయత్నం చేయాలి.

ఇక్కడ ఒక విషయం తెలుసుకోవడం చాలా ఉత్తమం. అదేమిటంటే, నరకవాసుల సంఖ్య స్వర్గవాసుల సంఖ్య కంటే ఎక్కువగా ఉంటుంది అని. అయితే, ఇలా ఎందుకు జరుగుతుంది అని వచ్చిన ప్రశ్నకు ధర్మవేత్తలు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ప్రజలు ప్రపంచపు వ్యామోహంలో కూరుకుపోయి ప్రవక్తలు ఇచ్చిన సందేశాన్ని స్వీకరించరు గనక వారు నరకంలో పడిపోతారు.

మరి ఏ జాతి వారి వద్దకు కూడా అల్లాహ్ త’ఆలా తన ప్రవక్తని లేదా ప్రవక్త కాలం అంతమైపోయిన తర్వాత, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోకంలో నుండి చివరి ప్రవక్తగా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, వారి స్థానంలో, అంటే వారి లాంటి దావా కార్యక్రమం చేస్తూ ఉన్న వారిని ఎవరినొకరినైనా అల్లాహ్ త’ఆలా ఏదైనా సమాజంలో పంపి ఉంటాడు. ఆ తర్వాతనే వారిపై శిక్ష విధిస్తాడు.

وَمَا كُنَّا مُعَذِّبِينَ حَتَّىٰ نَبْعَثَ رَسُولًا
(వమా కున్నా ముఅజ్జిబీన హత్తా నబ్-అస రసూలా)
ఒక ప్రవక్తను పంపనంతవరకూ ఎవరినయినా శిక్షించటం మా సంప్రదాయం కాదు. (17:15)

ఏ ప్రవక్తను పంపనిది మేము ఏ జాతిని శిక్షించము అని అల్లాహ్ త’ఆలా అంటున్నాడు. ఇక ఏ జాతి పైనైనా ఏదైనా శిక్ష వచ్చి పడుతుంది అంటే, ఆ జాతి వారికి హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ఏదో ఒక రకంగా. కానీ దానిని వారు పెడచెవిన పెట్టారు, దానిని స్వీకరించలేదు, దానిని అర్థం చేసుకోలేకపోయారు. అందుగురించి వారు శిక్షను అనుభవించాల్సి వచ్చింది.

మహాశయులారా, మనిషిలో ఉన్నటువంటి ఒక చెడు గుణం ఏమిటంటే, అతను దూరపు ఆలోచన తక్కువ, ప్రవక్తల ద్వారా లేక అల్లాహ్ మార్గం వైపునకు పిలిచే అటువంటి ప్రచారకులు ఎవరైతే ఉన్నారో, వారు ఖురాన్ ఆధారంగా ఏ సత్య బోధన చేస్తున్నారో, ఆ సత్య బోధనలో ఉన్నటువంటి లాభాలను గ్రహించరు. తొందరపాటు పడి, ప్రపంచ వ్యామోహంలో పడి, ప్రస్తుత లాభాన్ని పొందడంలో వారు నిమగ్నులై ఉంటారు. దాని మూలంగా పరలోక జీవితాన్ని మరిచిపోతూ ఉంటారు. అందుగురించి ఎన్నో సందర్భాల్లో అల్లాహ్ త’ఆలా ఖురాన్‌లో స్పష్టంగా తెలిపాడు,

كَلَّا بَلْ تُحِبُّونَ الْعَاجِلَةَ
(కల్లా బల్ తుహిబ్బూనల్ ఆజిల)
ఎన్నటికీ కాదు. మీరసలు తొందరగా లభించే దాని (ప్రపంచం)పై మోజు పడుతున్నారు.(75:20)

وَتَذَرُونَ الْآخِرَةَ
(వ తజరూనల్ ఆఖిర)
పరలోకాన్ని మాత్రం వదలిపెడుతున్నారు.(75:21)

మీరు ప్రపంచాన్ని అధికంగా ప్రేమిస్తున్నారు, మరియు మీ వెనక ఉన్నటువంటి ఆ పరలోకాన్ని మరిచిపోతున్నారు. ఇలా ప్రపంచ వ్యామోహంలో పడి, తాత్కాలికపు లాభాలు, ప్రయోజనాల గురించి ఎక్కువగా ఆలోచించి, దూరమున ఉన్న ఆ పరలోకం మహా దూరం ఉంది కదా అని భావించి, దాని విషయంలో ఏ సంసిద్ధత ముందు నుండే ఉండాలో, దానిని పాటించనందుకు, అధిక సంఖ్యలో ప్రజలు నరకంలో పోవడానికి కారణమవుతుంది.

ఇప్పటికైనా అల్లాహ్ మనకు అవకాశం ఇచ్చాడు. మన ప్రాణం పోకముందే ఇలాంటి మంచి బోధనలు వినడానికి మనకు అవకాశం కలుగజేస్తున్నాడు. ఇకనైనా నరకంతో మనం భయపడాలి, దానికి కారణమయ్యే పాపాల నుండి మనం దూరం ఉండాలి, మరియు ఎల్లవేళల్లో అల్లాహ్‌తో భయపడుతూ, అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూ జీవితం గడిపే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం నరకం నుండి రక్షింపబడతాము.

సూరె జుఖ్రుఫ్, ఆయత్ నంబర్ 23, 24 లో అల్లాహ్ త’ఆలా ఎంత స్పష్టంగా ప్రజల యొక్క ఈ చెడు భావాన్ని తెలిపి వారికి గుణపాఠం వచ్చే విధంగా చేశాడు, గమనించండి.

మా అర్సల్నా మిన్ ఖబ్లిక ఫీ ఖర్యతిన్ మిన్ నజీరిన్ ఇల్లా ఖాల ముత్రఫూహా.
మేము మీకంటే ముందు, అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు, మీకంటే ముందు ఏ బస్తీలో, ఏ హెచ్చరిక చేసేవానిని మేము పంపినా, ఆ బస్తీలో, ఆ నగరంలో ఉన్నటువంటి సిరివంతులు, ఆనందంలో జీవితం గడుపుతున్న వారు ప్రవక్తలతో ఏమన్నారు?

إِنَّا وَجَدْنَا آبَاءَنَا عَلَىٰ أُمَّةٍ وَإِنَّا عَلَىٰ آثَارِهِم مُّهْتَدُونَ

అది కాదు, “మా తాతముత్తాతలు ఒకానొక పద్ధతిపై ఉండటం మేము చూశాము. మేము వాళ్ల అడుగుజాడలలోనే నడుచుకుని సన్మార్గం పొందాము” అని వారు బుకాయిస్తారు.. (43:22)

అప్పుడు ఆ ప్రవక్తలు వారితో చెప్పారు,

قَالَ أَوَلَوْ جِئْتُكُم بِأَهْدَىٰ مِمَّا وَجَدتُّمْ عَلَيْهِ آبَاءَكُمْ

“మీ తాతముత్తాతలు అనుసరిస్తుండగా మీరు చూసిన మార్గం కంటే చాలా మంచి మార్గాన్ని (గమ్యానికి చేర్చే మార్గాన్ని) నేను మీ వద్దకు తీసుకువచ్చాను” అని (దైవప్రవక్త) అన్నప్పుడు, (43:24)

మీ తాతముత్తాతల కంటే ఎక్కువ సన్మార్గం, ఉత్తమ మార్గం నేను మీకు చూపినా మీరు తిరస్కరిస్తారా? అంటే వారు స్పష్టంగా ఏం చెప్పారు?

قَالُوا إِنَّا بِمَا أُرْسِلْتُم بِهِ كَافِرُونَ

దానికి వారు, “మీకిచ్చి పంపబడిన పద్ధతిని మేము తిరస్కరిస్తున్నాం” అని వాళ్లు (తెగేసి) చెప్పారు. (43:24)

మీరు ఏ ధర్మమైతే తీసుకొచ్చారో, ఏ సత్యమైతే తీసుకొచ్చారో, వాటిని మేము తిరస్కరిస్తున్నాము. అల్లాహు అక్బర్! ఈ విధంగా ప్రజలు పెడమార్గంలో పడిపోతారు. అల్లాహ్ త’ఆలా నరకంలోకి తీసుకెళ్లే ప్రతి చెడు కార్యం నుండి మనల్ని దూరం ఉంచు గాక. నరకం నుండి అల్లాహ్ మనందరికీ రక్షణ కలిగించు గాక. వా ఆఖిరు ద’అవాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44015

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (5) – మరణానంతర జీవితం : పార్ట్ 46 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు [5] – [మరణానంతర జీవితం – పార్ట్ 46]
https://www.youtube.com/watch?v=wYTBaAwO2oE [24 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి వివరించబడింది. వీటిలో ముఖ్యంగా జ్యోతిష్కులను సంప్రదించడం, వారు చెప్పినది నమ్మడం, మరియు అలా చేయడం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలు (40 రోజుల నమాజ్ స్వీకరించబడకపోవడం, ఇస్లాంను తిరస్కరించినట్లు అవ్వడం) వంటివి హదీసుల ఆధారంగా చర్చించబడ్డాయి. అలాగే, మత్తుపానీయం సేవించడం యొక్క పాపం, దాని పర్యవసానాలు, మరియు పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. ఇతరుల హక్కులను కాలరాయడం, వారి ఆస్తులను అన్యాయంగా తీసుకోవడం, మరియు ప్రళయ దినాన “దివాలా తీసిన వ్యక్తి”గా నిలబడటం గురించి హెచ్చరించబడింది. చివరగా, దుష్ప్రవర్తన సత్కార్యాలను ఎలా నాశనం చేస్తుందో, మరియు ఒక ముస్లిం పరువుకు భంగం కలిగించడం ఎంత పెద్ద పాపమో స్పష్టం చేయబడింది.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. అల్ హందులిల్లాహి వహ్ద వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బా’ద అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. మనం త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము.

అందులో ఎనిమిదవ విషయం, జ్యోతిషునితో ఏదైనా ప్రశ్న అడగడం.

మహాశయులారా! ఈ రోజుల్లో మన సమాజంలో స్వయంగా వారి భవిష్యత్తు ఏమిటో వారికి తెలియకుండానే ప్రజల భవిష్యత్తు చెప్పడానికి ఫుట్‌పాత్‌ల మీద, వేరే కొన్ని ప్రదేశాలలో, మరి కొందరు హై-ఫై ఇంకా సౌకర్యాలతో కూడి ఉన్న స్థలాల్లో ఉన్నవారు ఫలానా రోజు అలా జరుగుతుంది, ఫలానా రోజు అలా జరుగుతుంది, నీ వివాహం తర్వాత ఇలా నీకు లాభం ఉంటుంది, నీ వివాహం తర్వాత నీకు ఇలా నష్టం ఉంటుంది, ఈ వ్యాపారం నీవు ప్రారంభిస్తే నీకు ఇందులో లాభం ఉంటుంది, నీకు ఇందులో నష్టం ఉంటుంది, ఈ విధంగా కొన్ని భవిష్య సూచనలు, కొన్ని విషయాలు చెప్పడం మనం అడపాదడపా వింటూనే ఉన్నాము.

వాటిలో అనేక విషయాలు అబద్ధం, అసత్యం అన్న విషయం మనలోని చాలా మందికి తెలుసు. కానీ అనేకమంది కొన్ని మూఢనమ్మకాలు, మూఢవిశ్వాసాలకు గురియై ఉంటారు. వారిపై ఏదైనా ఆపద, ఏదైనా పరీక్ష వచ్చిపడినప్పుడు, ఇలాంటి వారిని నమ్ముకొని, వారి వద్దకు వెళ్ళి తమ భవిష్యత్తు గురించి వారితో తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఇలా భవిష్యత్తు గురించి వారిని ఏదైనా ప్రశ్నించడం, ఇది మహా పాప కార్యం. ఎంతటి పాప కార్యం అంటే దీనివల్ల మన ఇతర సత్కార్యాలు, ఇతర మంచి విషయాలు అన్నీ నశించిపోతాయి.

వినండి ఈ హదీథ్.

مَنْ أَتَى عَرَّافًا فَسَأَلَهُ عَنْ شَيْءٍ لَمْ تُقْبَلْ لَهُ صَلَاةُ أَرْبَعِينَ لَيْلَةً
(మన్ అతా అర్రాఫన్ ఫస’అలహు అన్ షై’ఇన్ లమ్ తుఖ్బల్ లహు సలాతు అర్బ’ఈన లైలా)

“ఎవరైనా జ్యోతిష్కుని వద్దకు వచ్చి వారిని ఏదైనా విషయం అడిగారంటే వారి యొక్క నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు.”

నలభై రోజుల నమాజ్. వారి యొక్క నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు అంటే ఎంత నష్టంలో ఆ మనిషి పడి ఉంటాడో గమనించవచ్చు.

అలాగే, తొమ్మిదవ విషయం, ఇలాంటి జ్యోతిషుల వద్దకు వచ్చి వారు చెప్పిన విషయాన్ని సత్యంగా నమ్మడం మరీ భయంకరమైన విషయం. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

مَنْ أَتَى كَاهِنًا أَوْ عَرَّافًا فَصَدَّقَهُ بِمَا يَقُولُ فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ
(మన్ అతా కాహినన్ అవ్ అర్రాఫన్ ఫసద్దఖహు బిమా యఖూల్ ఫఖద్ కఫర బిమా ఉన్జిల అలా ముహమ్మద్)

“ఎవరైతే ఇలాంటి జ్యోతిషుల వద్దకు, భవిష్యత్తు గురించి కొన్ని విషయాలు తెలుపుతాము అని అంటారో, వారి వద్దకు వచ్చి వారు ఏదైనా ఒక మాటను వారు సత్యంగా నమ్మితే, అలాంటి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ యే ధర్మాన్ని అవతరింపజేశాడో దానిని తిరస్కరించినట్లు, దాని పట్ల అవిశ్వాసానికి పాల్పడినట్లు.”

అందుకు మహాశయులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. కేవలం ప్రశ్నించడం ద్వారా నలభై రోజుల నమాజు స్వీకరించబడదు. ఇక వారు చెప్పిన సమాధానాన్ని సత్యంగా భావిస్తే అవిశ్వాసానికి పాల్పడినట్లు అవుతుంది. ఇక అవిశ్వాసం వల్ల మన సత్కార్యాలు ఏ ఒక్కటి కూడా మిగలకుండా ఉండిపోతుంది కదా? చివరికి మన త్రాసు తేలికగా ఉండిపోతుంది.

ఇంకా మహాశయులారా, అలాంటి పాప కార్యాల్లో పదవ విషయం, మత్తు సేవించడం. ఈ రోజుల్లో ఎంతమంది మత్తు సేవిస్తూ ఉన్నారు. దీనివల్ల ఎంత పాపాన్ని ఒడిగట్టుకుంటున్నారు. అల్లాహ్ తో భయపడండి. ఆ సృష్టికర్తతో భయపడండి. ప్రళయ దినాన మనకు ఆయన ఇహలోకంలో ఏ ఆరోగ్యం ఇచ్చాడో, ఏ డబ్బు ధనం ఇచ్చాడో వీటన్నిటి గురించి ప్రశ్నిస్తాడు. అప్పుడు మనం ఏం సమాధానం చెప్పుకుందాం?

మన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో ఒకటి, పదవది, మత్తు సేవించడం. దీనికి సంబంధించిన హదీథ్ ఈ విధంగా ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

“ఎవరైతే మత్తు సేవిస్తారో వారి యొక్క నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. అతను తౌబా చేస్తే అల్లాహ్ తౌబా అంగీకరిస్తాడు.”

తౌబా అంటే తెలుసు కదా, అల్లాహ్ తో క్షమాపణ కోరడం, ఇక ఎన్నడూ అలాంటి పాపానికి ఒడిగట్టను అని శపధం చేసుకోవడం మరియు తిరిగి ఆ పాపాన్ని చేయకపోవడం. ఎవరైతే ఇలా మత్తు సేవిస్తారో వారి నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. ఇక ఎవరైతే తౌబా చేస్తారో అల్లాహ్ అతని తౌబాను స్వీకరిస్తాడు.

మళ్ళీ ఎవరు రెండవసారి మత్తు సేవిస్తాడో, ఇక ఆ తర్వాత తౌబా చేసుకుంటాడో, అల్లాహ్ అతని తౌబా స్వీకరిస్తాడు. మళ్ళీ ఎవరైతే మూడోసారి మత్తు సేవిస్తాడో మరియు మళ్ళీ తౌబా చేస్తాడో, అల్లాహ్ అతని తౌబా మూడవసారి కూడా స్వీకరిస్తాడు. కానీ అతను మళ్ళీ నాలుగోసారి అదే అలవాటుకు పాల్పడ్డాడు, ఆ తర్వాత మళ్ళీ అతను తౌబా చేస్తే, ఇక నాలుగోసారి అల్లాహ్ అతని తౌబాను స్వీకరించడు.

మొదటిసారి అతను మత్తు సేవిస్తే నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. తౌబా చేస్తే తౌబా స్వీకరించబడుతుంది. రెండవసారి మత్తు సేవిస్తే, రెండవసారి నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. తౌబా చేస్తే తౌబా స్వీకరించబడుతుంది. మళ్ళీ మూడవసారి మత్తు సేవిస్తే నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. మూడవసారి తౌబా చేస్తే అల్లాహ్ తౌబా స్వీకరిస్తాడు. కానీ మళ్ళీ నాలుగోసారి, మళ్ళీ నాలుగోసారి అదే మత్తు సేవించడానికి అలవాటు పడితే, ఇక ఆ తర్వాత తౌబా చేస్తే అల్లాహ్ అతని తౌబా స్వీకరించడు.

నాలుగోసారి మత్తు సేవించడానికి పాల్పడ్డాడు అంటే మళ్ళీ నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు. ఇక ఆ తర్వాత తౌబా చేస్తే తౌబా కూడా స్వీకరించబడదు. అంటే మూడుసార్లు అల్లాహ్ మనకు, అలాంటి పాపం చేసిన వారికి అవకాశం ఇచ్చాడు. నాలుగోసారి ఆ పాపానికి ఒడిగడితే అల్లాహ్ ఇక అతని తౌబా కూడా స్వీకరించడు.

ఏం జరుగుద్ది? అతను అదే స్థితిలో చనిపోయాడు అంటే అల్లాహ్ ప్రళయ దినాన అతనికి ఏమిస్తాడు? మహాశయులారా, భయపడండి అల్లాహ్ తో. నాలుగోసారి మళ్ళీ అతడు అలవాటు పడ్డాడు అంటే నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు, తౌబా చేస్తే తౌబా కూడా స్వీకరించబడదు. అల్లాహ్ అతనికి నహరుల్ ఖబాల్, అల్-ఖబాల్ అన్న నది నుండి వచ్చే ద్రవం త్రాగిపిస్తాడు. ఆ ఖబాల్ నది నుండి వచ్చే ద్రవం ఏంటిది, ఎలా ఉంటుంది, ఏమిటి అని అడిగినప్పుడు, అది నరకవాసుల పుండ్ల నుండి కారుతూ వచ్చిన చీము అని చెప్పడం జరిగింది.

ఎప్పుడైనా గమనించారా? మన శరీరంలో ఎక్కడైనా ఏదైనా పుండు ఉంది అంటే స్వయంగా మనం మన శరీరంలోని పుండు నుండి వచ్చే చీమును చూడడం, దాని యొక్క దుర్వాసనను మనం భరించలేం. ఇక నరకవాసుల వారి యొక్క పుండ్ల నుండి కారుతున్న చీము వారికి త్రాగడానికి ఇవ్వడం జరుగుతుంది అంటే ఇకనైనా మత్తు సేవించడాన్ని మానుకుంటారు అని నేను ఆశిస్తున్నాను. ఇలా మానుకునే సద్భాగ్యం అల్లాహ్ ఈ త్రాగే వారందరికీ, మత్తు సేవించే వారందరికీ అల్లాహ్ తౌబా చేసుకునే సద్భాగ్యం ప్రసాదించాలి అని అల్లాహ్ తో వేడుకుంటున్నాను.

మహాశయులారా, ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాపాల్లో 11వ విషయం, ప్రజల సొమ్మును కాజేసుకోవడం, ప్రజల సొమ్ము తినివేయడం. ఇది కూడా మహా పాపం.

మహాశయులారా, త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో 11వ విషయం, ఇతరుల సొమ్మును కాజేయడం, వారిపై దౌర్జన్యం చేయడం. దీనికి సంబంధించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీథ్ ఏమిటంటే, ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించారు:

أَتَدْرُونَ مَنِ الْمُفْلِسُ
(అతద్రూన మనిల్ ముఫ్లిస్)
“ముఫ్లిస్ (దివాలా తీసినవాడు) అంటే ఎవరో మీకు తెలుసా?”

అప్పుడు సహచరులు అన్నారు:

الْمُفْلِسُ فِينَا مَنْ لاَ دِرْهَمَ لَهُ وَلاَ مَتَاعَ
(అల్-ముఫ్లిసు ఫీనా మన్ లా దిర్హమ లహు వలా మతా’అ)
“ప్రవక్తా, మాలోని బీదవాడు ఎవరంటే ఎవరి వద్దనైతే ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, ప్రపంచ సామాగ్రి ఏమీ లేదో అలాంటి వారు”

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

నా అనుచర సంఘంలోని బీదవారు ఎవరంటే, ప్రళయ దినాన నమాజ్, జకాత్, ఉపవాసాలు, నమాజ్, జకాత్ (విధిదానాలు), రోజా (ఉపవాసాలు), వీటన్నిటినీ తీసుకుని వస్తాడు.

وَيَأْتِي قَدْ شَتَمَ هَذَا وَقَذَفَ هَذَا وَأَكَلَ مَالَ هَذَا وَسَفَكَ دَمَ هَذَا وَضَرَبَ هَذَا
(వ య’తీ ఖద్ షతమ హాదా, వ ఖదఫ హాదా, వ అకల మాల హాదా, వ సఫక దమ హాదా, వ దరబ హాదా)

ఇంకా ప్రళయ దినాన ఆ వ్యక్తి ఎలా వస్తాడు అంటే, ఎవరినైనా దూషించి, ఎవరిపైనైనా అపనింద వేసి, ఎవరి సొమ్ము అపహరించి, ఎవరినైనా హత్య చేసి, ఎవరినైనా కొట్టి…

ఈ విధంగా ప్రజలలో ఎందరి పట్ల ఎన్నో రకాల అన్యాయాలకు గురియై ప్రళయ దినాన హాజరవుతాడు. అతని వెంట నమాజ్, విధిదానాలు, ఉపవాసాలు ఉన్నాయి, కానీ ఇలాంటి పాపాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఏం జరుగుద్ది? వారందరూ, ఇతని నుండి ఎవరెవరికి ఏయే అన్యాయం జరిగిందో, వారందరూ హాజరవుతారు మరియు అల్లాహ్ వద్ద ఇతని గురించి షికాయత్ చేసినప్పుడు, ఇతని గురించి అల్లాహ్ వద్ద అడిగినప్పుడు, అల్లాహు త’ఆలా అతని యొక్క సత్కార్యాలన్నీ కూడా వారి వారిపై జరిగిన అన్యాయానికి సమానంగా వారికి ఇచ్చేస్తాడు.

ఆ తర్వాత, ఇతని వద్ద సత్కార్యాలన్నీ కూడా మిగలకుండా అయిపోయినప్పుడు, ఇంకా ఎన్నో కేసులు మిగిలి ఉన్నప్పుడు, వారిపై జరిగిన అన్యాయానికి సమానంగా వారి పాపాలు తీసుకుని ఇతనిపై వేయడం జరుగుతుంది మరియు ఇతన్ని నరకంలో పంపడం జరుగుతుంది. గమనించారా? నమాజులు ఉన్నాయి, ఉపవాసాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో రకాల విధిదానాలు, దానధర్మాలు ఉన్నాయి. కానీ కొట్టడం, తిట్టడం, అపనింద వేయడం, ఈ రకంగా ఎన్నో పాపాలకు గురి అయినందుకు వారందరూ కూడా వచ్చి ఇతనికి వ్యతిరేకంగా అల్లాహ్ వద్ద కేసు పెట్టినప్పుడు, ఇతని సత్కార్యాలన్నీ వారికి ఇవ్వడం జరుగుతుంది. సత్కార్యాలన్నీ ఇచ్చినప్పటికీ ఇంకా కొన్ని కేసులు మిగిలి ఉంటే, వారి యొక్క పాపాలు ఇతనిపై వేయబడి, ఇతన్ని నరకంలో పంపడం జరుగుతుంది. ఎంత నష్టం అవుతుందో కదా? అల్లాహ్ యొక్క ఎంత గొప్ప అనుగ్రహం, ఇలాంటి పరిస్థితులు రానున్నాయి, అందు గురించి ఇహలోకంలోనే జాగ్రత్త పడి అక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి అని మనకు చెప్పడం జరుగుతుంది.

ఈ విధంగా మహాశయులారా, ఎవరైతే ఇలాంటి అన్యాయాలకు పాల్పడతారో, ఇహలోకంలోనే వారి యొక్క ఆ హక్కు చెల్లించేసేయాలి. మన వద్ద చెల్లించడానికి ఏమీ లేకుంటే, కనీసం వారితో కలిసి, వారితో మాఫీ చేయించుకోవాలి. లేదా అంటే ప్రళయ దినాన ఇలాంటి ఘోరమైన శిక్షకు గురి కావలసి వస్తుంది, ప్రళయ దినాన మన యొక్క త్రాసు అనేది తేలికగా అయిపోతుంది.

తిర్మిజీలోని ఒక హదీథ్ లో ఉంది, ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు:

“అల్లాహ్ ఆ మనిషిని కరుణించు గాక, అతని ద్వారా ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగింది అంటే అతను వారితో క్షమాపణ కోరి లేదా వారికి ఏదైనా ఇచ్చే హక్కు ఉండేది ఉంటే ఇచ్చేసి ఇహలోకంలోనే ఎలాంటి బరువు లేకుండా, ఎలాంటి ఒకరిపై అన్యాయం లేకుండా ఉంటాడో, ఈ విధంగా ప్రళయ దినాన అతను కలుసుకున్నప్పుడు అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలను పొందుతాడు. కానీ ఎవరైతే ఇలా కాకుండా ప్రజల పట్ల అన్యాయాలకు గురి అయి వస్తాడో, ప్రళయ దినాన అల్లాహు త’ఆలా ఇతని పుణ్యాలు ఆ బాధితులకు ఇచ్చేస్తాడు. ఇతని వద్ద పుణ్యాలు లేనిచో, బాధితుల నుండి వారిపై జరిగిన అన్యాయానికి సమానంగా పాపాలు తీసుకుని ఇతనిపై వేయడం జరుగుతుంది.”

అందుగురించి మహాశయులారా, అన్ని స్థితుల్లో అల్లాహ్ తో భయపడుతూ ఉండాలి. ఎక్కడ ఎవరు ఏమీ చూడడం లేదు అని భావించకుండా మనం అన్ని రకాల సత్కార్యాల్లో ముందుకు ఉండాలి. ఎవరిపై కూడా ఎలాంటి అన్యాయం చేయకుండా జాగ్రత్త పడాలి.

ప్రజల పట్ల ఏదైనా అన్యాయం చేయడం, ఇది ఎంత భయంకరమైన పాపమో మన యొక్క సలఫె సాలెహీన్ రహిమహుముల్లాహ్ చాలా మంచి విధంగా గ్రహించేవారు. అందుకే సుఫ్యాన్ అస్-సౌరీ రహమహుల్లాహ్ ఒక సందర్భంలో చెప్పారు:

“నా మధ్య, అల్లాహ్ మధ్య 70 పాపాలు ఉండడం, నాకు, నా మధ్య మరియు నాలాంటి మనుషుల మధ్య ఒక్క పాపం ఉండడం కంటే ఎంతో ఇష్టమైనది. ఎందుకంటే నా మధ్య నా ప్రభువు మధ్య ఉండే పాపాల గురించి నేను డైరెక్ట్ గా క్షమాపణ కోరుకుంటే అది మన్నించడం జరుగుతుంది. కానీ నా మధ్య మరియు నాలాంటి దాసుని మధ్య ఉన్న పాపం అది నేను అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటే క్షమించబడదు. వెళ్ళి అతనితో క్షమాపణ కోరుకోవాలి, లేదా అతనికి ఏదైనా హక్కు ఇచ్చేది ఉంటే తప్పకుండా ఇవ్వాలి.”

ఇక ఇక్కడ ఒక విషయం గమనించండి మీరు కూడా. ఏ ఇస్లాం ధర్మం అయితే ఇతరులకు ఏ బాధ కలిగించకుండా, ఇతరులపై ఏ అన్యాయం చేయకుండా ప్రళయ దినాన హాజరు కావాలి అని నేర్పుతుందో, ఆ ఇస్లాం ధర్మం, ఇస్లాంకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాల్లో ఏయే అభాండాలు మోపడం జరుగుతుందో వాటన్నిటి శిక్షణ ఇస్లాం ఇస్తుంది అని చెప్పగలమా? బుద్ధి జ్ఞానంతో మనం గ్రహిస్తే, సోదరులారా, సోదరీమణులారా, సామాన్య జీవితంలో మామూలీ చిన్నపాటి ఏ అన్యాయానికి కూడా ఇస్లాం మనకు అనుమతి ఇవ్వదు. ఎందుకంటే దీనివల్ల ప్రళయ దినాన మన త్రాసు బరువు తగ్గిపోతుంది అని హెచ్చరించడం జరుగుతుంది.

ఇక యుద్ధ మైదానంలో ఉన్నప్పటికీ కూడా, యుద్ధంలో శత్రువులు మన ముంగట ఉన్న ఉండి, యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా ఏ ఒక్కరి పట్ల అన్యాయంగా ప్రవర్తించకుండా ఉండడానికి కూడా ఇస్లాం మనకు శిక్షణ ఇచ్చి ఉంది.

హజ్రత్ ముఆద్ ఇబ్ను అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖనం ప్రకారం, “మేము ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఒక యుద్ధంలో ఉన్నాము. ఆ యుద్ధంలో ఒక సందర్భంలో ఒకచోట మజిలీ చేయడం అవసరం పడింది. అయితే అప్పుడు ప్రవక్తతో ఉన్న ప్రజల్లో కొంతమంది దారిలో ప్రజలు నడిచేటువంటి దారిలో సైతం తమ యొక్క గుడారాలు వేసుకొని, ప్రజలకు నడవడంలో ఇబ్బంది కలిగే అటువంటి విధంగా ప్రవర్తించడం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు.” ఏం చెప్పారు అప్పుడు?

గమనించండి. ఈ రోజుల్లో సిటీలలో ప్రజలు నడిచే దారిని కూడా ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఆ రోజుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధ మైదానంలో ఉన్నారు. ఎడారిలో. కానీ ప్రజలు అడపాదడపా వచ్చిపోయే దారిలో గుడారాలు వేసుకొని, టెంట్ వేసుకొని ప్రజలకు నడవడంలో ఇబ్బంది కలిగే విధంగా ఉండడాన్ని కూడా ఇష్టపడలేదు. అదే సందర్భంలో ఎలాంటి ఆదేశం జారీ చేశారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు: “ఎవరైతే ప్రవక్తతో యుద్ధంలో పాల్గొన్నాము, చాలా పుణ్యాలు మనం పొందుతాము అన్నటువంటి సంతోషంలో పడి ఉన్నారో కానీ దారిలో ఏదైనా గుడారం వేసి, టెంట్ వేసి ప్రజలకు నడిచే దారిలో వారికి ఇబ్బంది కలుగజేస్తున్నారో, అలాంటి వారికి ఆ యుద్ధం యొక్క ఏ పుణ్యమూ లభించదు.” ఏ పుణ్యమూ లభించదు అంటే ఏమిటి? యుద్ధం పాల్గొనే యొక్క గొప్ప పుణ్యం ఏదైతే ఉందో, దానిని ఇలాంటి చిన్నపాటి అన్యాయం అని అనుకుంటారు కావచ్చు, మరికొందరైతే దీనిని ఏ అన్యాయము అని కూడా భావించరు కావచ్చు, అలాంటి విషయాన్ని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహించడం లేదు.

అందుగురించి మహాశయులారా, మనం ప్రజల పట్ల ఉత్తమ రీతిలో ప్రవర్తించాలి. వారిపై మన నుండి ఏ ఒక్క చిన్నపాటి అన్యాయం ఉండకూడదు లేదా అంటే ప్రళయ దినాన మనం చాలా నష్టపోయే వారిలో కలుస్తాము.

ప్రళయ దినాన మన త్రాసు తేలికగా అయ్యే పాప కార్యాల్లో 12వ విషయం, దుష్ప్రవర్తన.

త్రాసును బరువుగా చేసే సత్కార్యాలలో సత్ప్రవర్తన అని విన్నాము కదా? అయితే త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల్లో దుష్ప్రవర్తన.

దుష్ప్రవర్తనకు సంబంధించిన విషయం మనం ఎప్పుడైతే సత్ప్రవర్తన గురించి విన్నామో, అక్కడ ఒక హదీసు విన్నాము. అదేమిటంటే అల్లాహ్ కు ప్రియమైన వారిలో, ఎవరైతే ప్రజల పట్ల ప్రయోజనకరంగా జీవిస్తారో మరియు అల్లాహ్ కు ఇష్టమైన ప్రియమైన కార్యాల్లో ఒక ముస్లింని సంతోషపెట్టడం, వారిపై ఏదైనా అప్పు ఉంటే అప్పు చెల్లించడంలో సహాయం చేయడం, వారికి ఏదైనా కష్టం ఉంటే ఆ కష్టం తొలగిపోవడంలో వారికి సహాయం చేయడం, ఈ విధంగా ఎన్నో విషయాలు వింటూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు అని కూడా మనం విన్నాము: “నేను నా ఈ మస్జిద్ లో ఏతెకాఫ్ చేయడం కంటే నా యొక్క సోదరుని అవసరాన్ని తీర్చడం నాకు ఎక్కువ ఇష్ట కార్యం.”

ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

وَإِنَّ سُوءَ الْخُلُقِ لَيُفْسِدُ الْعَمَلَ كَمَا يُفْسِدُ الْخَلُّ الْعَسَلَ
(వ ఇన్న సూ’అల్ ఖులుఖి లయుఫ్సిదుల్ అమల కమా యుఫ్సిదుల్ ఖల్లుల్ అసల)

వినండి, నిశ్చయంగా దుష్ప్రవర్తన మీ సర్వ సత్కార్యాలను భస్మం చేసేస్తుంది. మీ సర్వ సత్కార్యాల సత్ఫలితాన్ని నశింపజేస్తుంది, ఎలాగైతే వెనిగర్ తేనె యొక్క తీపిని నశింపజేస్తుందో.

ఒకసారి అనుభవించి చూడండి, ఎంత క్వాలిటీ గల, స్వచ్ఛమైన, ఎలాంటి కలుషితం లేకుండా తేనె మీ వద్ద ఉన్నా, అందులో మీరు వెనిగర్ కలిపారంటే, ఆ వెనిగర్ అనేది ఆ తేనెపై ఎంత దుష్ప్రభావం చూపుతుందో, అలాగే మీ దుష్ప్రవర్తన అనేది మీ సర్వ సత్కార్యాలను నశింపజేస్తుంది.

అందు గురించి మహాశయులారా, మనం ఒకరి పట్ల దుష్ప్రవర్తన ప్రవర్తించకూడదు. ప్రతి ఒక్కరితో ఉత్తమంగా ప్రవర్తించే ప్రయత్నం చేయాలి. ఇంట్లో భార్యాభర్తల్లో గాని, తల్లిదండ్రులు పిల్లలతో గాని, పిల్లలు తల్లిదండ్రులతో గాని, పరస్పరం సోదర సోదరీమణులు ఒకరి పట్ల ఒకరు, ఈ విధంగా ఇంటి బయటికి వెళ్ళిన తర్వాత ప్రజల పట్ల కూడా మన వ్యవహారం చాలా ఉత్తమంగా ఉండాలి.

ప్రళయ దినాన మన త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల్లో 13వ విషయం, ముస్లిం యొక్క, ఒక విశ్వాసునిపై ఏదైనా అపనింద వేసి అతన్ని అవమాన పాలు చేయడం.

మహాశయులారా, ఇది చూడడానికి చిన్న విషయం కానీ, మహా భయంకరమైన పాపం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:

إِنَّ مِنْ أَرْبَى الرِّبَا الاِسْتِطَالَةُ فِي عِرْضِ الْمُسْلِمِ بِغَيْرِ حَقٍّ
(ఇన్న మిన్ అర్బర్-రిబా అల్-ఇస్తితాలతు ఫీ ఇర్ దిల్ ముస్లిం బిగైరి హఖ్ఖిన్)

ఒక ముస్లింను అన్యాయంగా, అక్రమంగా అవమానించడం ఇది వడ్డీలో అతి భయంకరమైన భాగం

అంటే ఏమిటి? వడ్డీ ఎలాగైతే పుణ్యాన్ని నశింపజేస్తుందో, ఆ విధంగా ఒక ముస్లింపై మనం ఏదైనా అపనింద వేసాము, అతన్ని అవమాన పాలు చేసాము అంటే ఈ రకంగా మనకు చాలా నష్టం కలుగుతుంది. ఇది కూడా దుష్ప్రవర్తనలో వచ్చేస్తుంది, సత్ప్రవర్తనకు వ్యతిరేకంగా ఉంటుంది.

అల్లాహు త’ఆలా మనందరికీ కూడా మన త్రాసును బరువు చేసే సత్కార్యాలు చేసే భాగ్యం ప్రసాదించి, త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల నుండి దూరం ఉండే భాగ్యం ప్రసాదించు గాక. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43736

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

నరకం, నరకవాసుల రంగు, నరకాగ్ని యొక్క ఇంధనం, అపరాధులను నరకంలో పడవేసే విధానం, నరకంలో తొలిసారిగా ఎవరిని వేయడం జరుగుతుంది? [మరణానంతర జీవితం – పార్ట్ 57] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

నరకం, నరకవాసులు, వారికి ఇవ్వబడే శిక్షలు [పార్ట్ 3]
నరకం, నరకవాసుల రంగు, నరకాగ్ని యొక్క ఇంధనం, అపరాధులను నరకంలో పడవేసే విధానం, నరకంలో తొలిసారిగా ఎవరిని వేయడం జరుగుతుంది?
[మరణానంతర జీవితం – పార్ట్ 57] [21 నిముషాలు]
https://www.youtube.com/watch?v=NZqkJ0Gly10
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.అల్హమ్దులిల్లాహిల్లజీ అఅద్దల్ జన్నత లిల్ ముత్తఖీన్, వ అఅద్దన్నార లిజ్జాలిమీన్, వస్సలాతు వస్సలామ్ అలా మన్ ఉర్సిల బషీరన్ వ నజీరా, అమ్మాబాద్.

రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు “మరణానంతర జీవితం” అనే అంశంలో స్వాగతం. నరకం, నరకవాసులు, వారి యొక్క శిక్షల వివరాలు మనం తెలుసుకుంటున్నాము.

మహాశయులారా, నరకం దాని రంగు ఎలా ఉంటుంది? నరకవాసుల రంగు ఎలా ఉంటుంది? ఈ వివరాలు కూడా మనకు ఖురాన్ హదీసుల్లో తెలుపబడ్డాయి. ఈ రోజుల్లో మన పరిస్థితి ఎలా ఉంది? ఇంటి నుండి బయటికి వెళ్తున్నాము అంటే ఆఫీస్ కు ఒక రకంగా తయారయి వెళ్తాము, మార్కెట్లో వెళ్ళాలంటే ఒక రకంగా తయారయి వెళ్తాము. ఎవరైనా ఫ్రెండ్స్ తో పార్టీలలో పాల్గొనాల నుకుంటే మరో రకంగా మేకప్ చేసుకుని వెళ్తాము. ఈ విధంగా మనిషి యొక్క స్వభావంలో అందంగా ఉండాలి, నలుగురు మెచ్చుకునే రీతిలో మనం వారి ముందు ఉండాలి అని భావిస్తూ ఉంటాడు. నశించిపోయే ఈ ప్రపంచంలో ఇంతటి అలంకరణ విషయాలు మనం ప్రదర్శిస్తూ ఉంటాము. కానీ శాశ్వత జీవితం గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా?

ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఏమిటి? ఆ నరకం అంటే మీరు ఇహలోకంలో కాల్చే అగ్ని మాదిరిగా అనుకుంటున్నారా? కాదు.

أُوقِدَ عَلَى النَّارِ أَلْفَ سَنَةٍ حَتَّى احْمَرَّتْ، ثُمَّ أُوقِدَ عَلَيْهَا أَلْفَ سَنَةٍ حَتَّى ابْيَضَّتْ، ثُمَّ أُوقِدَ عَلَيْهَا أَلْفَ سَنَةٍ حَتَّى اسْوَدَّتْ، فَهِيَ سَوْدَاءُ مُظْلِمَةٌ.

వెయ్యి సంవత్సరాల వరకు నరకాగ్నిని దహించి వేయడం జరిగింది, అది ఎర్రగా ఎరుపుగా మారింది. ఆ తర్వాత మళ్లీ వెయ్యి సంవత్సరాల వరకు దానిని తేజోవంతంగా చేయడం జరిగింది, అది తెలుపుగా మారింది. ఆ తర్వాత ఇంకా వెయ్యి సంవత్సరాలు అగ్నిని కాల్చడం కాల్చడం జరిగింది. చివరికి అది నలుపుగా మారింది. ఫహియ సౌదావు ముజ్లిమతున్ కల్లైలిల్ ముజ్లిమ్ (అది అమావాస్య చిమ్మని చీకటి రాత్రి ఎలా ఉంటుందో ఆ విధంగా అది ఇప్పుడు నలుపుగా మరియు చీకటిగా ఉంది).

అల్లాహు అక్బర్. గమనించండి, మీరు ఉన్న రూమ్ లో బ్లాక్ కలర్ వేసుకొని ఉండగలుగుతారా? దానిపై ఒకవేళ ఇంకా చీకటి ఉండేది ఉంటే, ఇంత భయంకరంగా ఉంటుంది. నరకం ఆ విధంగా తయారు చేయడం జరిగింది.

మువత్తా ఇమామ్ మాలిక్ లోని ఒక హదీస్ లో ఉంది:

أَتَرَوْنَهَا حَمْرَاءَ كَنَارِكُمْ هَذِهِ؟ لَهِيَ أَسْوَدُ مِنَ الْقَارِ

మీరు నరకాగ్నిని మీ ఇహలోకపు అగ్ని మాదిరిగా ఎరుపుగా ఉంది అని భావిస్తున్నారా? అది తార్ (రోడ్డుపై వేసే డాంబర్) కంటే ఎక్కువ నలుపుగా ఉంది.

నరకంపై వంతెన (ఫుల్ సిరాత్): పార్ట్ 3 – [మరణానంతర జీవితం – పార్ట్ 53] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 3
[మరణానంతర జీవితం – పార్ట్ 53] [20 నిముషాలు]
https://www.youtube.com/watch?v=QVnrPdQraUA
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షికలో కూడా మనం నరకంపై వేయబడే వంతెన గురించే తెలుసుకుంటూ ఉన్నాము.

అయితే, ఈరోజు మనం మరికొన్ని విషయాలు ఏవైతే తెలుసుకోబోతున్నామో వాటిలో మొట్టమొదటి విషయం ఆ వంతెనను తొలిసారిగా దాటేవారు ఎవరు? దీని గురించి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పొడవైన హదీసులో పరలోకంలో సంబంధించే కొన్ని విషయాలను వివరంగా ప్రస్తావిస్తూ వంతెన విషయం వచ్చినప్పుడు ఇలా తెలిపారు:

فَأَكُونُ أَنَا وَأُمَّتِي أَوَّلُ مَنْ يُجِيزُ
(ఫ అకూను అనా వ ఉమ్మతీ అవ్వలు మన్ యుజీజ్)
“నేను మరియు నా అనుచర సంఘం అందరికంటే ముందు ఈ వంతెనను దాటుతాము.”

అల్లాహు అక్బర్. మహాశయులారా, లక్షకు పైగా ప్రవక్తలు ఈ లోకంలో వచ్చి పోయారు. చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ ప్రవక్తను, ఆ ప్రవక్తపై సంపూర్ణం చేయబడిన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడమే తప్పనిసరి. అయితే ఇక్కడ గమనించండి, ఆ ప్రవక్త, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరి ప్రవక్తల కంటే ముందు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచర సంఘం అంటే మనం, ఇతర అనుచర సంఘాల కంటే ముందు వంతెనను కూడా దాటడంలో ముందుగా ఉంటాము. ఇదే వంతెన గురించి మరీ తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

నరకంపై వంతెన (ఫుల్ సిరాత్) – [మరణానంతర జీవితం – పార్ట్ 51] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన)
[మరణానంతర జీవితం – పార్ట్ 51] [22 నిముషాలు]
https://www.youtube.com/watch?v=kjbs6O5YVHI
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి కఫా వసలామున్ అలా ఇబాదిల్లజీనస్తఫా అమ్మా బాద్.

రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు “మరణానంతర జీవితం” అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక “నరకంపై వంతెన”. అల్లాహు అక్బర్.

మహాశయులారా, ప్రళయ దినాన సంభవించే అన్ని ఘట్టాలలో అతి భయంకరమైనది, అతి క్లిష్టతరమైనది ఇది కూడా ఒకటి. ఆ రోజు అల్లాహు తఆలా నరకంపై ఒక వంతెనను ఏర్పాటు చేస్తాడు. ప్రతీ మనిషీ ఆ వంతెనపై తప్పకుండా వచ్చి ఉంటాడు.

వ ఇమ్ మిన్కుమ్ ఇల్లా వారిదుహా, కాన అలా రబ్బిక హత్మమ్ మఖ్దియ్యా.
(وَإِن مِّنكُمْ إِلَّا وَارِدُهَا ۚ كَانَ عَلَىٰ رَبِّكَ حَتْمًا مَّقْضِيًّا)
అనువాదం: మీలో ప్రతీ ఒక్కడూ దానిపై వచ్చి ఉంటాడు. ఇది నీ ప్రభువు చేసినటువంటి తిరుగులేని నిర్ణయం, ఖచ్చితమైన నిర్ణయం.

మీలో ప్రతీ ఒక్కడూ దానిపై వచ్చి ఉంటాడు. ఇది నీ ప్రభువు చేసినటువంటి తిరుగులేని నిర్ణయం, ఖచ్చితమైన నిర్ణయం. అయితే, ఆ వంతెన ఎలాంటిది? దేనిపై వేయబడుతుంది? ఆ వంతెన వెడల్పు ఎంత ఉంటుంది? దానిపై ఎవరు ఎలా వెళ్తారు, దాటుతారు? ఇవన్నీ విషయాలు కూడా చాలా తెలుసుకోవలసి ఉంది.

మహాశయులారా, ముందు విషయం మనం ఇక్కడ గమనించాల్సింది, ఆ వంతెన నరకంపై ఉంటుంది. అల్లాహు అక్బర్. అంటే భావం ఏమిటి? ఏ కొంచెం కాలు జారినా, డైరెక్ట్ నరకంలోనే పడిపోతాము. అల్లా మనందరినీ రక్షించు గాక. అయితే అది వెడల్పుగా ఉండదు. ఇది కూడా చాలా ఘోరమైన విషయం. సహీహ్ ముస్లిం షరీఫ్‌లో వచ్చి ఉంది. హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు తెలిపారు:

బలగనీ అన్నల్ జిస్ర అలా జహన్నమ్ అహద్దు మినస్ సైఫ్ వ అదఖ్ఖు మినష్ షఅర్.
(بَلَغَنِي أَنَّ الْجِسْر عَلَى جَهَنَّم أَحَدُّ مِنَ السَّيْفِ وَأَدَقُّ مِنَ الشَّعْرِ)
అనువాదం: ఆ నరకంపై ఉన్న వంతెన, కత్తి పదును కంటే ఎక్కువ పదునుగా, కుచ్చగా ఉంటుంది మరియు వెంట్రుక కంటే మరీ సన్నగా ఉంటుంది అని నాకు చేరింది.

ఆ నరకంపై ఉన్న వంతెన కత్తి పదును కంటే ఎక్కువ పదునుగా, కుచ్చగా ఉంటుంది మరియు వెంట్రుక కంటే మరీ సన్నగా ఉంటుంది. అల్లాహు అక్బర్. తాడు అని అనవచ్చా? లేదు. గమనించండి. అయితే, ఇది కత్తి పదును కంటే మరీ కుచ్చగా, పదునుగా మరియు వెంట్రుక కంటే మరీ సన్నగా ఉంటది అని ఏదైతే తెలపడం జరిగిందో, అది ఎలా కావచ్చు? మనం అనుమానానికి గురి కాకూడదు. ఎలాంటి సందేహం వహించవద్దు. ఎందుకంటే పరలోకాన సంభవించే విషయాలన్నీ కూడా మనం ఇహలోక జ్ఞానంతో అర్థం చేసుకోలేము.

అంతిమ దినం పై విశ్వాసం [4] : స్వర్గ విశేషాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్] 

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُ 

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత : 

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.

ఓ ముస్లింలారా! అల్లాహ్ తో భయపడండి, ఎల్లవేళలా ఆయన దైవ భీతిని కలిగి ఉండండి. మనసులో ఆయన భయాన్ని సజీవంగా ఉంచండి. ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుంచి దూరంగా ఉండండి. .

మరియు తెలుసుకోండి! అల్లాహ్ తన ధర్మస్థాపనలో తాను లిఖించినటువంటి విధిరాతలో మరియు శిక్షించడంలో, ప్రతిఫలం ప్రసాదించడంలో ఆయన ఎంతో వివేకవంతుడు. మరియు అల్లాహ్ తఆలా యొక్క వివేకం ఏమిటంటే ఆయన తన సృష్టి కొరకు అంతిమ దినాన్ని నియమించాడు. ఆ రోజున ఆయన సమస్త సృష్టిరాశులకు తమ ఆచరణ యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్తల ద్వారా తన దాసులకు చేరవేశాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ فَتَعَالَى اللَّهُ الْمَلِكُ الْحَقُّ

(మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా? అల్లాహ్‌యే నిజమైన సార్వభౌముడు. ఆయన మహోన్నతుడు.) (సూరా అల్ మూ ‘మినూన్ 23:115-116)

ఓ విశ్వాసులారా! గడిచిన ఖుత్బాలో మనం అంతిమ దినంపై విశ్వాసంలో భాగంగా శంఖం పూరించడం, ప్రళయ సూచనలు, సృష్టి పునరుత్థానం, ప్రజలు హష్ర్ మైదానంలో సమీకరించబడటం, లెక్కల పత్రము శిక్ష ప్రతిఫలం గురించి తెలుసుకున్నాం ఈ రోజు మనం విశ్వాసుల కొరకు సృష్టించబడిన స్వర్గం గురించి తెలుసుకుందాం. 

1. స్వర్గనరకాలను విశ్వసించడం అంతిమ దినాన్ని విశ్వసించడంలో భాగం మరియు ఇది మానవుల మరియు జిన్నాతుల శాశ్వత నివాసం. స్వర్గం అనేది అనుగ్రహాల నిలయం, దీనిని విశ్వాసులకు మరియు పవిత్రమైన దాసుల కోసం తయారు చేయబడింది. దీని కొరకు అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విశ్వసించడం, వారి ఆజ్ఞలను పాటించడం తప్పనిసరి. స్వర్గం లోపల ఏ కన్ను చూడని, ఏ చెవి వినని మరియు ఏ మనసు అలోచించ లేనటువంటి అనుగ్రహాలు ఉన్నాయి. అల్లాహ్ ఇలా అంటున్నాడు: 

إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ هُمْ خَيْرُ الْبَرِيَّةِ  جَزَاؤُهُمْ عِندَ رَبِّهِمْ جَنَّاتُ عَدْنٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ

(అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు; నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు. వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర శాశ్వతమైన స్వర్గ వనాలున్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతోషపడ్డారు.) (98:7-8)

మరో చోట అల్లాహ్ ఇలా అన్నాడు. 

فَلَا تَعْلَمُ نَفْسٌ مَّا أُخْفِيَ لَهُم مِّن قُرَّةِ أَعْيُنٍ جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ

(వారు చేసిన కర్మలకు ప్రతిఫలంగా, వారి కళ్లకు చలువనిచ్చే ఎలాంటి సామగ్రిని మేము దాచిపెట్టామో (దాని గురించి) ఏ ప్రాణికీ తెలియదు.) (32:17)

అంతిమ దినం పై విశ్వాసం యొక్క ఆవశ్యకతలు [3] – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్] 

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُ 

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత : 

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.

ఓ ముస్లింలారా! అల్లాహ్ తో భయపడండి, ఎల్లవేళలా ఆయన దైవ భీతిని కలిగి ఉండండి. మనసులో ఆయన భయాన్ని సజీవంగా ఉంచండి. ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుంచి దూరంగా ఉండండి. .

మరియు తెలుసుకోండి! అల్లాహ్ తన ధర్మస్థాపనలో తాను లిఖించినటువంటి విధిరాతలో మరియు శిక్షించడంలో, ప్రతిఫలం ప్రసాదించడంలో ఆయన ఎంతో వివేకవంతుడు. మరియు అల్లాహ్ తఆలా యొక్క వివేకం ఏమిటంటే ఆయన తన సృష్టి కొరకు అంతిమ దినాన్ని నియమించాడు. ఆ రోజున ఆయన సమస్త సృష్టిరాశులకు తమ ఆచరణ యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్తల ద్వారా తన దాసులకు చేరవేశాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ فَتَعَالَى اللَّهُ الْمَلِكُ الْحَقُّ

(“మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా? అల్లాహ్‌యే నిజమైన సార్వభౌముడు. ఆయన మహోన్నతుడు.) (సూరా అల్ మూ ‘మినూన్ 23:115-116)

ఓ విశ్వాసులారా! గడిచిన ఖుత్బాలో మనం అంతిమ దినంపై విశ్వాసంలో భాగంగా  శంఖం పూరించడం, ప్రళయ సూచనలు, సృష్టి పునరుత్థాన, ప్రజలు హష్ర్ మైదానంలో సమీకరించబడటం గురించి తెలుసుకున్నాము. ఈ రోజు మనం ఆ హష్ర్  మైదానంలో సమస్త మానవాళి సమావేశమైనప్పటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాము. ఈ రోజు మనం లెక్కల పత్రము, శిక్ష ప్రతిఫలం గురించి తెలుసుకుందాం.   

ఓ అల్లాహ్ దాసులారా! లెక్కల పత్రము మరియు శిక్ష లేక ప్రతిఫలం అనేవి సత్యం. ఖుర్ఆన్ మరియు హదీసు ద్వారా ఎన్నో ఆధారాలు మనకు లభిస్తాయి. మరియు సమస్త విశ్వాసులు ఈ విషయాన్ని ఏకీభవిస్తారు. దీని గురించి తెలియజేస్తూ అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు. 

సూరతుల్ తకాసుర్ (అధికంగా ప్రోగుచేయటం) – తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో & టెక్స్ట్]

సూరతుల్ తకాసుర్ (అధికంగా ప్రోగుచేయటం) – తఫ్సీర్ (వ్యాఖ్యానం)
https://youtu.be/UEPobrbzkmg [37 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ సూరా మక్కాకాలానికి చెందినది. ఇందులో మొత్తం 8 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా సంపద పట్ల వ్యామోహం గురించి వివరించింది. మానవులు విపరీతంగా ప్రాపంచిక సుఖభోగాల వ్యామోహం కలిగి ఉంటారు. ఎల్లప్పుడు తమ సంపదను ఇంకా పెంచుకోవాలని చూస్తుంటారు. తమ హోదాను, అధికారాన్ని పెంచుకో వాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రాపంచిక ప్రయోజనాలను సాధించడంలో పూర్తిగా నిమగ్నమైపోయి పరలోకాన్ని విస్మరిస్తారు. నిజానికి పరలోకం మనిషి భవిష్యత్తు. మృత్యువు ఆసన్నమైనప్పుడు, సమాధిలో వాస్తవాన్ని గుర్తిస్తారు. తీర్పుదినాన వారు తమ కళ్ళారా నరకాన్ని చూసుకుంటారు. అల్లాహ్ కు దూరమైనందుకు, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బాధాకరమైన శిక్షను అనుభవిస్తారు.

102:1 أَلْهَاكُمُ التَّكَاثُرُ
అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది.

102:2 حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ
ఆఖరికి మీరు (ఈ ఆశల ఆరాటంలోనే) సమాధులకు చేరుకుంటారు.

102:3 كَلَّا سَوْفَ تَعْلَمُونَ
ఎన్నటికీ కాదు, మీరు తొందరగానే తెలుసుకుంటారు.

102:4 ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ
మరెన్నటికీ కాదు…. మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.

102:5 كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ
అది కాదు. మీరు గనక నిశ్చిత జ్ఞానంతో తెలుసుకున్నట్లయితే (అసలు పరధ్యానంలోనే పడి ఉండరు).

102:6 لَتَرَوُنَّ الْجَحِيمَ
మీరు నరకాన్ని చూసి తీరుతారు.

102:7 ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِينِ
అవును! మీరు దానిని ఖచ్చితంగా కళ్ళారా చూస్తారు సుమా!

102:8 ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ
మరి ఆ రోజు (అల్లాహ్) అనుగ్రహాల గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది.


اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

اَلْحَمْدُ لِلّٰهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللّٰهِ اَمَّا بَعْدُ
అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
అఊజుబిల్లాహిస్సమీయిల్ అలీమి మినష్షైతానిర్రజీమ్.

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్.

أَلْهَاكُمُ التَّكَاثُرُ
అల్ హాకుముత్తకాసుర్
అల్ హాకుమ్ అంటే మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది, ఏమరపాటుకు గురి చేసింది, అశ్రద్ధలో పడవేసింది. అంటే ఏమిటి? మనిషి ఎప్పుడైనా ఒక ముఖ్యమైన విషయాన్ని వదిలేసి, దానికంటే తక్కువ ప్రాముఖ్యత గల విషయంలో పడ్డాడంటే అతడు దాని నుండి ఏమరుపాటులో పడి వేరే పనిలో బిజీ అయ్యాడు. التَّكَاثُرُ అత్తకాసుర్ – అధికంగా పొందాలన్న ఆశ. అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది. తఫ్సీర్‌లో, వ్యాఖ్యానంలో మరికొన్ని వివరాలు ఇన్షాఅల్లాహ్ మనం తెలుసుకుందాము.

حَتَّىٰ
హత్తా
ఆఖరికి, చివరికి మీరు

زُرْتُمُ
జుర్తుమ్
సందర్శిస్తారు, చేరుకుంటారు

الْمَقَابِرَ
అల్ మకాబిర్
సమాధులను. మీరు సమాధులకు చేరుకుంటారు, ఈ అధికంగా పొందాలన్నటువంటి ఆశలోనే ఉండిపోయి.

كَلَّا
కల్లా
ఎన్నటికీ కాదు. మీ కోరికలన్నీ నెరవేరి పూర్తి అవుతాయనుకుంటారు కానీ అలా కాదు.

سَوْفَ تَعْلَمُونَ
సౌఫ తఅలమూన్
మీరు తొందరగానే తెలుసుకుంటారు.

ثُمَّ كَلَّا
సుమ్మ కల్లా
మరెన్నటికీ కాదు,

سَوْفَ تَعْلَمُونَ
సౌఫ తఅలమూన్
మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.

كَلَّا
కల్లా
అది కాదు,

لَوْ تَعْلَمُونَ
లౌ తఅలమూన
మీరు గనక తెలుసుకున్నట్లయితే

عِلْمَ الْيَقِينِ
ఇల్మల్ యకీన్
నిశ్చిత జ్ఞానంతో, పూర్తి నమ్మకమైన జ్ఞానంతో. అంటే ఏమిటి ఇక్కడ? మీకు గనక ఇల్మె యకీన్ ఉండేది ఉంటే, మీకు పూర్తి నమ్మకమైన జ్ఞానం ఉండేది ఉంటే ఈ ఏమరుపాటులో ఏదైతే ఉన్నారో ఒకరి కంటే ఒకరు ఎక్కువగా పొందాలన్న ఆశలో పడిపోయి, ఆ ఆశల్లో ఉండరు, ఏమరుపాటుకు గురి కారు.

لَتَرَوُنَّ الْجَحِيمَ
ల తరవున్నల్ జహీమ్
మీరు తప్పకుండా చూసి తీరుతారు (ల ఇక్కడ బలంగా, గట్టిగా తాకీదుగా చెప్పడానికి ఒక ప్రమాణంతో కూడినటువంటి పదం అని వ్యాఖ్యానకర్తలు చెబుతారు)

الْجَحِيمَ
అల్ జహీమ్
నరకాన్ని.

ثُمَّ
సుమ్మ
అవును మళ్ళీ

لَتَرَوُنَّهَا
ల తరవున్నహా
మీరు దానిని తప్పకుండా చూసి తీరుతారు. హా అన్న పదం ఇక్కడ ఏదైతే వచ్చిందో హా అలిఫ్, దాని ఉద్దేశ్యం ఆ నరకం గురించి చెప్పడం. ఎలా?

عَيْنَ الْيَقِينِ
ఐనల్ యకీన్
ఖచ్చితమైన మీ కళ్ళారా మీరు ఆ నరకాగ్నిని చూసి తీరుతారు, చూసి ఉంటారు.

ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ
సుమ్మ ల తుస్ అలున్న యౌమ ఇజిన్ అనిన్నయీమ్
మరి ఆ రోజు

ثُمَّ
సుమ్మ
మళ్ళీ

لَتُسْأَلُنَّ
ల తుస్ అలున్న
మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది

يَوْمَئِذٍ
యౌమ ఇజిన్
ఆ రోజున

عَنِ النَّعِيمِ
అనిన్నయీమ్
అనుగ్రహాల గురించి. మరి ఆ రోజు అల్లాహ్ యొక్క అనుగ్రహాలు మీకు ఏవైతే ఇవ్వబడ్డాయో వాటి గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది.

సూరహ్ అత్-తకాసుర్ ఘనతలు మరియు ప్రాముఖ్యత

సోదర మహాశయులారా, సోదరీమణులారా, మీరు ఈ సూరా గురించి సర్వసామాన్యంగా ఘనతలు ఎక్కువగా విని ఉండరు. ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారు అంటే గుర్తుంచుకోండి అది ఏ సహీ హదీసుతో రుజువైన మాట కాదు. ఎలాగైతే సర్వసామాన్యంగా మనం సూరతుల్ ఫాతిహా, సూరతుల్ ఇఖ్లాస్ (قُلْ هُوَ اللَّهُ أَحَدٌ – ఖుల్ హువల్లాహు అహద్) ఇప్పుడు ఏదైతే హమ్నా బిన్తె షేఖ్ అబూ హయ్యాన్ తిలావత్ చేశారో సూరతుల్ ఇఖ్లాస్, అలాగే సూరత్ అల్-ఫలఖ్, వన్నాస్ ఇంకా కొన్ని వేరే సూరాల విషయంలో ఎన్నో సహీ హదీసులు వచ్చి ఉన్నాయి. సూరతుత్-తకాసుర్ యొక్క ఘనత విషయం అంటున్నాను నేను, ఘనత. ఘనతలో ఏ ఒక్క సహీ హదీస్ లేదు. కానీ ఏదైనా సూరాకు, ఏదైనా ఆయత్‌కు ప్రత్యేకంగా ఏదైనా ఒక ఘనత లేనందువల్ల దాని స్థానం పడిపోలేదు. ఎందుకంటే ఖురాన్ అల్లాహ్ యొక్క వాక్కు, మాట గనక అందులో తక్కువ స్థానం ఏమీ ఉండదు. ఒకదాని ఘనత ఏదైనా ఉంటే అది వేరే విషయం కానీ లేనందుకు అది ఏదైనా తక్కువ స్థానం అన్నటువంటి ఆలోచన మనకు రాకూడదు, ఒక మాట. రెండో మాట, ఈ సూరా యొక్క అవతరణ కారణం ఏదైనా ప్రత్యేకంగా చెప్పబడనప్పటికీ ఇందులో చాలా ముఖ్యమైన మరియు చాలా ప్రాముఖ్యత గల మనందరికీ, విశ్వాసులకు, అవిశ్వాసులకు, పుణ్యాత్ములకు, పాపాత్ములకు అందరికీ బోధపడే గుణపాఠాలు ఉన్నాయి.

రండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసుల ఆధారంగా ఇన్షాఅల్లాహ్ ఈ సూరా యొక్క వ్యాఖ్యానం మనం తెలుసుకుందాము. ఇందులో మీరు ఇప్పుడు చూసినట్లుగా మొట్టమొదటి ఆయత్‌ను శ్రద్ధ వహించండి: أَلْهَاكُمُ التَّكَاثُرُ – అల్ హాకుముత్తకాసుర్. అల్ హాకుమ్ అంటే సంక్షిప్తంగా చెప్పేశాను. అత్తకాసుర్ అంటే, సోదర మహాశయులారా శ్రద్ధగా వినండి, ప్రత్యేకంగా ఎవరైతే ధర్మ క్లాసులలో హాజరవుతున్నారో, ఎవరైతే దావా పనులు చేస్తున్నారో వారు కూడా వినాలి. ఇంకా ఎవరైతే పరలోకం పట్ల అశ్రద్ధగా ఉన్నారో, సత్కార్యాలలో చాలా వెనక ఉన్నారో వారైతే తప్పనిసరిగా వినాలి. చాలా విషయాలు ఈ అత్తకాసుర్ పదంలో వస్తున్నాయి. తకాసుర్ అంటారు కసరత్ ఎక్కువ కావాలి, అధికంగా కావాలి. మరియు తకాసుర్ ఇది అరబీ గ్రామర్ ప్రకారంగా ఎలాంటి సేగా (format) లో ఉంది అంటే ఒకరు మరొకరితో పోటీపడి అతని కంటే ఎక్కువ నాకు కావాలి అన్నటువంటి ఆశతో అదే ధ్యేయంతో దానినే లక్ష్యంగా పెట్టుకొని అలాగే జీవించడం, పూర్తి ప్రయత్నం చేయడం.

ఇక ఇది ప్రపంచ రీత్యా చూసుకుంటే, ఎవరైతే పరలోకాన్ని త్యజించి, పరలోకం గురించి ఏ ప్రయత్నం చేయకుండా కేవలం ఇహలోక విషయాల్లోనే పూర్తిగా నిమగ్నులై ఒకరి కంటే ఒకరు ఎక్కువగా ఉండాలి, ముందుగా ఉండాలి అన్నటువంటి ఆశలో జీవితం గడుపుతూ దానికే పూర్తి సమయం వెచ్చిస్తున్నారో, సంతానం వాని కంటే నాకు ఎక్కువ కావాలని గాని, వాని కంటే ఎక్కువ పెద్ద బిజినెస్ నాది కావాలి అని, వాని కంటే ఎక్కువ పొలాలు, పంటలు నాకు కావాలి అని, ఈ లోకంలో వారి కంటే ఎక్కువ పేరు ప్రతిష్టలు, హోదా అంతస్తులు నాకు కావాలి అని, ఈ విధంగా ఏ ఏ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారో గుర్తుంచుకోవాలి, ఇవన్నీ కూడా పరలోకాన్ని మరిపింపజేస్తే, పరలోకం పట్ల అశ్రద్ధలో పడవేస్తే ఇది చాలా చాలా నష్టం.

చివరికి మనం చేసే అటువంటి నమాజులు, ఉండే అటువంటి ఉపవాసాలు, హాజరయ్యే అటువంటి ఈ ధర్మ విద్య, ధర్మ జ్ఞాన క్లాసులు, మనం ఏ దావా కార్యక్రమాలు పాటిస్తూ ఉంటామో వీటన్నిటి ద్వారా నేను ఫలానా వారి కంటే ఎక్కువ పేరు పొందాలి. ఇలాంటి దురుద్దేశాలు వచ్చేసాయి అంటే ఈ పుణ్య కార్యాలు చేస్తూ కూడా అల్లాహ్ యొక్క ప్రసన్నత, పరలోక సాఫల్యం పట్ల ఆశ కాకుండా ఇహలోకపు కొన్ని ప్రలోభాలలో, ఇహలోకపు ఆశలలో పడి నేను నా ఈ యూట్యూబ్ ఛానల్, నా ఇన్స్టా, నా యొక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాని కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ చేసే వరకు వదలను. నేను నా యొక్క ఈ ప్రయత్నంలో అతని కంటే ముందుగా ఉండాలి, నా పేరు రావాలి, ఇట్లాంటి దురుద్దేశాలు వచ్చేస్తే పుణ్య కార్యాలు కూడా నాశనం అవుతాయి, పరలోకంలో చాలా నష్టపోతాము.

అయితే ఈ సందర్భంలో మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక హదీసును తెలుసుకుంటే చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏంటి ఆ హదీస్? వాస్తవానికి మనం ఈ లోకంలో జీవిస్తున్నాము గనక అల్లాహు తఆలా సూరతుల్ కసస్‌లో చెప్పినట్లు:

وَلَا تَنسَ نَصِيبَكَ مِنَ الدُّنْيَا
వలా తన్స నసీబక మినద్దున్యా
పరలోకానికై పూర్తి ప్రయత్నంలో ఉండండి, అక్కడి సాఫల్యం కొరకు. కానీ ఈ లోకంలో, ప్రపంచంలో ఏదైతే కొంత మనం సమయం గడిపేది ఉన్నది, కొద్ది రోజులు ఉండవలసి ఉంది, దాని అవసరాన్ని బట్టి మాత్రమే మీరు కొంచెం ప్రపంచం గురించి కూడా మర్చిపోకండి.

కానీ ఇక్కడ జీవించడానికి ఏ ఇల్లు, ఏ కూడు, ఏ గూడు, ఏ గుడ్డ, ఏ ధనము, ఏ డబ్బు అవసరం ఉన్నదో అది మనకు కేవలం ఒక సాధనంగా, చిన్నపాటి అవసరంగానే ఉండాలి కానీ దాని కొరకే మనం అంతా కూడా వెచ్చించాము, సర్వము దాని కొరకే త్యజించాము అంటే ఇది మన కొరకు చాలా నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది, మనం ఇహపరాలన్నీ కూడా కోల్పోతాము.

ఏంటి ఆ హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిది? ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల మధ్యలో వచ్చారు, స్నానం చేసి. సహాబాలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్నానం చేసిన తర్వాత ఆ స్థితిలో రావడం ఎంత ఆనందంగా కనిపించిందంటే సహాబాలు అన్నారు ప్రవక్తతో:

نراك اليوم طيب النفس
నరాకల్ యౌమ తయ్యిబన్నఫ్స్
ఓ ప్రవక్తా, ఎంత మంచి మూడ్‌లో మీరు ఉన్నట్లు కనబడుతున్నారు, చాలా ఆనందంగా, మంచి మనస్సుతో ఉన్నట్లుగా మేము చూస్తున్నాము.

ప్రవక్త చెప్పారు:

أجل والحمد لله
అజల్, వల్ హందులిల్లాహ్
అవును, అల్లాహ్ యొక్క హమ్ద్, అల్లాహ్ యొక్క శుక్ర్, అల్లాహ్ కే స్తోత్రములు.

మళ్ళీ ప్రజలు కొంత సిరివంతం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, గమనించండి హదీసును:

لَا بَأْسَ بِالْغِنَى لِمَنِ اتَّقَى
లా బఅస బిల్ గినా లిమనిత్తకా
అల్లాహ్ యొక్క భయభీతి కలిగిన వానికి అల్లాహ్ సిరివంతం ప్రసాదించడం, సిరివంతం గురించి అతడు కొంచెం ప్రయత్నం చేయడం పాపం కాదు, చెడుది కాదు.

మంచిది అని అనలేదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, గమనించండి. ఏమన్నారు? లా బఅస్. ఒకవేళ అల్లాహ్ తో భయభీతి, అల్లాహ్ యొక్క భయభీతితో డబ్బు సంపాదిస్తూ, డబ్బు కొంచెం జమా చేస్తూ, అవసరం ఉన్న ప్రకారంగా ఖర్చు చేస్తూ అతడు ధనవంతుడు అవుతున్నాడంటే ఇది చెడ్డ మాట ఏమీ కాదు.

మళ్ళీ చెప్పారు:

وَالصِّحَّةُ لِمَنِ اتَّقَى خَيْرٌ مِنَ الْغِنَى
వస్సిహతు లిమనిత్తకా ఖైరుమ్ మినల్ గినా
కానీ ఆరోగ్యం భయభీతి కలిగే వారికి, అల్లాహ్ యొక్క భయంతో జీవించే వారికి ఆరోగ్యం అన్నది వారి యొక్క ధనం కంటే ఎంతో మేలైనది.

గమనిస్తున్నారా?

وَطِيبُ النَّفْسِ مِنَ النَّعِيمِ
వతీబున్నఫ్సి మినన్నయీమ్
మరియు మనిషి మంచి మనస్సుతో ఉండడం ఇది కూడా అల్లాహ్ అనుగ్రహాలలో ఒక గొప్ప అనుగ్రహం.

ఇప్పుడు ఈ సూరా మనం చదువుతున్నామో దాని యొక్క చివరి ఆయత్‌కు కూడా ఈ హదీస్ వ్యాఖ్యానంగా గొప్ప దలీల్ ఉంటుంది మరియు మొదటి ఆయత్ ఏదైతే ఉందో దానికి కూడా గొప్ప ఆధారంగా ఉంటుంది, దాని యొక్క వ్యాఖ్యానంలో. ఎందుకంటే హదీస్ యొక్క మూడు భాగాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు విషయాలు చెప్పారు కదా, భయభీతి కలిగే వారికి ధనం ఎలాంటి నష్టం లేదు లేదా చెడు కాదు. కానీ ఆరోగ్యం అన్నది భయభీతి గలవారికి వారి ధనాని కంటే చాలా ఉత్తమమైనది. ఈ రెండు విషయాలు మొదటి ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో వస్తుంది, అల్ హాకుముత్తకాసుర్.

అయితే ఇక్కడ ఉద్దేశ్యం ఏమిటి? మనిషి ఫలానా కంటే నాకు ఎక్కువ ఉండాలని కోరుతున్నాడు, ఏదైనా ప్రపంచ విషయం. కానీ అక్కడ ఉద్దేశ్యం ఏమున్నది? అతని జీవితం ఎలా ఉన్నది? అల్లాహ్ యొక్క భయభీతితో గడుస్తున్నది. అతని యొక్క ఉద్దేశ్యం ఉన్నది ఆ డబ్బు గాని, ధనం గాని, సంతానం గాని, ఇహలోకంలో ఇంకా ఏదైనా స్థానం సంపాదించి దాని ద్వారా అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రజల వరకు చేరవేయడంలో, ప్రజలకు మేలు చేకూర్చడంలో మనం ముందుకు ఉండాలి, అల్లాహ్ యొక్క ప్రసన్నత తను కోరుతున్నాడు. అలాంటప్పుడు సోదర మహాశయులారా, ఇలాంటి ఈ ధనం, ఇలాంటి ఈ ఆరోగ్యం, ఇలాంటి ఈ ప్రాపంచిక విషయాలు కోరడం తప్పు కాదు. ఒక రకంగా చూసుకుంటే అతని కొరకు పరలోకంలో ఇవి ఎంతో పెద్ద గొప్ప స్థానాన్ని తెచ్చిపెడతాయి మరియు అతడు ఈ విధంగా ఎంతో ముందుగా ఉంటాడు.

ఇంకా ఇక్కడ విషయాలు మీరు గమనిస్తే:

حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ
హత్తా జుర్తుముల్ మకాబిర్
ఆఖరికి మీరు (ఈ ఆశల ఆరాటంలోనే) సమాధులకు చేరుకుంటారు.

హత్తా జుర్తుముల్ మకాబిర్ అని చెప్పడం జరిగింది. ఈ జుర్తుముల్ మకాబిర్ అన్నటువంటి ఆయత్ ద్వారా బోధపడే విషయం ఏమిటి? గమనించండి, నేను వ్యాఖ్యానం చేస్తూ దానితో పాటే కొన్ని లాభాలు కూడా తెలియజేస్తున్నాను, మనకు వేరుగా లాభాలు చెప్పుకోవడానికి బహుశా అవకాశం ఉండకపోవచ్చు. జుర్తుముల్ మకాబిర్‌లో అఖీదాకు సంబంధించిన ఎన్నో విషయాలు మనకు కనబడుతున్నాయి. మొదటి విషయం ఏమిటి? ఈ లోకం శాశ్వతం కాదు, ఇక్కడి నుండి చనిపోయేది ఉంది.

రెండవది, మనుషులను చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టడమే సర్వ మానవులకు నాచురల్ గా, స్వాభావికంగా ఇవ్వబడినటువంటి పద్ధతి. దీనికి భిన్నంగా ఎవరైనా కాల్చేస్తున్నారంటే, ఎవరైనా మమ్మీస్‌గా తయారు చేసి పెడుతున్నారంటే, ఇంకా ఎవరైనా ఏదైనా బాడీ ఫలానా వారికి డొనేట్ చేశారు, సైంటిఫిక్ రీసెర్చ్‌ల కొరకు, ఈ విధంగా ఏదైతే సమాధి పెట్టకుండా వేరే పద్ధతులు అనుసరిస్తున్నారో ఇది ప్రకృతి పద్ధతి కాదు, అల్లాహ్ మానవుల మేలు కొరకు తెలిపినటువంటి పద్ధతి కాదు. అల్లాహు తఆలా సర్వ మానవాళి కొరకు వారు చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టడమే మొట్టమొదటి మానవుడు చనిపోయిన, అంటే మొట్టమొదటి మానవుడు ఎవరైతే చనిపోయారో ఆదం అలైహిస్సలాం యొక్క కుమారుడు, ఒక కాకి ద్వారా నేర్పడం జరిగింది, సూరహ్ మాయిదాలో దాని ప్రస్తావన ఉంది. సూరత్ అబసాలో చదవండి మీరు:

ثُمَّ أَمَاتَهُ فَأَقْبَرَهُ
సుమ్మ అమాతహు ఫ అక్బరహ్
అల్లాహ్ యే మరణింపజేశాడు మరియు మిమ్మల్ని సమాధిలో పెట్టాడు.

సూరత్ తాహాలో చదివితే:

مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ
మిన్హా ఖలక్నాకుమ్ వఫీహా నుయీదుకుమ్ వమిన్హా నుఖ్రిజుకుమ్
ఇదే మట్టి నుండి మిమ్మల్ని పుట్టించాము, తిరిగి అందులోనే మిమ్మల్ని పంపిస్తాము, తిరిగి అక్కడి నుండే మిమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తాము, లేపుతాము.

అయితే ఇదొక మాట, అఖీదాకు సంబంధించింది. మూడో మాట ఇందులో మనకు ఏం తెలుస్తుందంటే సమాధి అన్నది శాశ్వత స్థలం కాదు. అందుకొరకే ఉర్దూలో గాని, అరబీలో గాని లేదా తెలుగులో గాని అతడు తన చివరి గమ్యానికి చేరుకున్నాడు, ఎవరైనా చనిపోతే అంటారు కదా, ఈ మాట సరియైనది కాదు. మనిషి యొక్క చివరి మెట్టు, చివరి యొక్క అతని యొక్క స్థానం అది స్వర్గం లేదా నరకం. అల్లాహ్ మనందరినీ స్వర్గంలో ప్రవేశింపజేసి నరకం నుండి రక్షించుగాక.

ఈ ఆయతులో, హత్తా జుర్తుముల్ మకాబిర్, మరొక చాలా ముఖ్యమైన అఖీదాకు సంబంధించిన విషయం ఏమిటంటే ఈ ఆయతు ద్వారా సలఫె సాలెహీన్ యొక్క ఏకాభిప్రాయం, సమాధిలో విశ్వాసులకు, పుణ్యాత్ములకు అనుగ్రహాలు లభిస్తాయి మరియు అవిశ్వాసులకు, మునాఫికులకు, పాపాత్ములకు శిక్షలు లభిస్తాయి. ఇది ఏకీభవించబడిన విషయం. దీనిని చాలా కాలం వరకు తిరస్కరించే వారు ఎవరూ లేకుండిరి, కానీ తర్వాత కాలాల్లో కొందరు పుట్టారు. మరికొందరు ఏమంటారు, ముస్లింలని తమకు తాము అనుకునే అటువంటి తప్పుడు వర్గంలో, తప్పుడు మార్గంలో ఉన్నవారు కొందరు ఏమంటారు, హా, సమాధిలో శిక్ష జరుగుతుంది కానీ కేవలం ఆత్మకే జరుగుతుంది, శరీరానికి జరగదు. ఇలాంటి మాటలు చెప్పడం కూడా సహీ హదీసుతో రుజువు కావు. ఎందుకంటే అది అల్లాహ్ ఇష్టంపై ఉన్నది. మనిషి చనిపోయిన తర్వాత అనుగ్రహాలు లభించడం మరియు శిక్షలు లభించడం అన్నది ఆత్మ, శరీరం రెండింటికీ కావచ్చు, శరీరానికే కావచ్చు, ఆత్మకే కావచ్చు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహమహుల్లాహ్ తమ రచనల్లో దీని గురించి చాలా వివరాలు తీసుకొచ్చి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలిపారు. ఈ విధంగా సోదర మహాశయులారా, హత్తా జుర్తుముల్ మకాబిర్, దీని గురించి కూడా కొన్ని హదీస్ ఉల్లేఖనాల ద్వారా సమాధి శిక్ష గురించి చాలా స్పష్టంగా తెలపడం జరిగింది. అందుకొరకు ఇది లేదు అని, కేవలం ఆత్మకు అని, ఈ విధంగా చెప్పుకుంటూ ఉండడం ఇది సరియైన విషయం కాదు.

సోదర మహాశయులారా, ఇక్కడ మరొక విషయం మనకు తెలుస్తుంది. మకాబిర్ అని అల్లాహు తఆలా చెప్పాడు. సర్వసామాన్యంగా మనం ఖబ్రిస్తాన్ అని ఏదైతే అంటామో దానిని చెప్పడం జరుగుతుంది. అయితే ముస్లింల యొక్క సర్వసామాన్యంగా వ్యవహారం, వారందరి కొరకు ఏదైనా స్మశాన వాటిక అని అంటారు, ఖబ్రిస్తాన్ ఉంటుంది, అక్కడే అందరినీ సమాధి చేయాలి, దఫన్ చేయాలి. కానీ అలా కాకుండా ప్రత్యేకంగా నా భూమిలో, నా యొక్క ఈ జగాలో, నేను పుట్టిన స్థలంలో ఇక్కడే అన్నటువంటి కొన్ని వసియతులు ఎవరైతే చేస్తారో, తర్వాత అక్కడ పెద్ద పెద్ద మజార్లు, దర్గాలు కట్టడానికి తప్పుడు మార్గాలు వెళ్తాయో ఇవన్నీ కూడా సరియైన విషయాలు కావు.

జుర్తుముల్ మకాబిర్ ద్వారా ధర్మపరమైన మరొక లాభం మనకు ఏం తెలుస్తుందంటే మనము ఇహలోకంలో బ్రతికి ఉన్నంత కాలం కబ్రిస్తాన్‌కు వెళ్లి, మన ఊరిలో, మన సిటీలో, మన ప్రాంతంలో ఉన్నటువంటి కబ్రిస్తాన్‌కు వెళ్లి దర్శనం చేస్తూ ఉండాలి, జియారత్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ప్రపంచ వ్యామోహం తగ్గుతుంది, పరలోకం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఇది తప్పనిసరి విషయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ తల్లి ఆమినా గారి యొక్క సమాధిని దర్శించారు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు కూడా, فَزُورُوا الْقُبُورَ – ఫజూరుల్ కుబూర్, మీరు సమాధులను దర్శించండి, అల్లాహ్ దీని గురించి అనుమతి ఇచ్చి ఉన్నాడు.

ఇక ఆ తర్వాత ఆయతులను కొంచెం శ్రద్ధ వహించండి. అల్లాహు తఆలా ఇందులో చాలా ముఖ్య విషయాలు చెబుతున్నాడు. మూడు, రెండు సార్లు ఒకే రకమైన పదాలు వచ్చాయి, మూడోసారి ఎంత ఖచ్చితంగా చెప్పడం జరుగుతుందో గమనించండి. కల్లా, ఇంతకుముందు ఎన్నోసార్లు మనం తెలుసుకున్నాము. కల్లా అన్న పదం అవిశ్వాసులు లేదా తిరస్కారుల అభిప్రాయాలను కొట్టిపారేసి, మీరు అనుకున్నట్లు ఎంతమాత్రం జరగదు అని చెప్పడంతో పాటు, అసలు వాస్తవ విషయం ఇది అని చెప్పడానికి కూడా ఈ కల్లా అన్నటువంటి పదం ఉపయోగించడం జరుగుతుంది.

سَوْفَ تَعْلَمُونَ
సౌఫ తఅలమూన్
మీరు తొందరగానే తెలుసుకుంటారు.

ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ
సుమ్మ కల్లా సౌఫ తఅలమూన్
మరెన్నటికీ కాదు, మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.

ఈ రెండు ఆయతులు ఒకే రకంగా ఎందుకున్నాయి, ఒకే భావం వచ్చింది కదా అని ఆలోచించకండి. ఇబ్ను అబ్బాస్ రదిఅల్లాహు తఆలా అన్హు తెలుపుతున్నారు, మొదటి ఆయతు ద్వారా అంటే మొదటి సౌఫ తఅలమూన్ ద్వారా చెప్పే ఉద్దేశ్యం, మనిషి చావు సమయంలో అతనికి తెలుస్తుంది, నేను ఈ లోకంలో, ఈ ప్రపంచం గురించి, ఇక్కడి హోదా అంతస్తుల గురించి, డబ్బు ధనాల గురించి, భార్యా పిల్లల గురించి, నా యొక్క వర్గం వారి గురించి, నా యొక్క కులం, గోత్రం వారి గురించి, నా యొక్క పార్టీ వారి గురించి ఎంత శ్రమించానో, ఇదంతా వృధా అయిపోతుంది కదా అని తొలిసారిగా అతనికి అతని మరణ సమయంలో తెలిసిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే సమాధుల నుండి లేస్తారో, మైదానే మహషర్‌లో జమా అవుతారో అక్కడ కూడా అతనికి తెలుస్తుంది. ఈ రెండో ఆయతులో రెండోసారి తెలిసే విషయం చెప్పడం జరిగింది. మరియు మూడో ఆయత్ అంటే మన క్రమంలో ఆయత్ నెంబర్ ఐదు:

كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ
కల్లా లౌ తఅలమూన ఇల్మల్ యకీన్

ఇక్కడ ఏదైతే తాలమూన అని వచ్చింది, కానీ ఎలా వచ్చింది? మీకు ఖచ్చిత జ్ఞానం కలుగుతుంది. దీని యొక్క వ్యాఖ్యానంతో మనకు తెలుస్తుంది, ప్రళయ దినాన అల్లాహు తఆలా నరకాన్ని తీసుకొస్తాడు. దాని తర్వాత ఆయతులో ఉంది కదా, మీరు నరకాన్ని చూసి తీరుతారు, అవును మీరు దానిని ఖచ్చితంగా కళ్ళారా చూస్తారు సుమా. అయితే మనిషికి చనిపోయే సందర్భంలో, సమాధి నుండి లేసే సందర్భంలో ఖచ్చితంగా తెలిసిపోతుంది అతనికి. కానీ ఎప్పుడైతే ఇక అతడు కళ్ళారా నరకాన్ని చూస్తాడో, నరకం యొక్క తీర్పు అయిన తర్వాత ఎవరెవరైతే నరకంలో పోవాలో వారు పోతారు. దానిని హక్కుల్ యకీన్ అంటారు.

ఎందుకంటే ఇక్కడ గమనించండి, యకీన్ అన్న పదం ఖురాన్‌లో మూడు రకాలుగా వచ్చింది. ఒకటి ఇల్మల్ యకీన్, ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఆయత్ నెంబర్ చివరిలో. మరియు ఐనుల్ యకీన్, ఆయత్ నెంబర్ ఏడులో చూస్తున్నట్లు. మరియు హక్కుల్ యకీన్ అని వేరే ఒకచోట వచ్చి ఉంది. ఇల్ముల్ యకీన్ అంటే మీకు ఖచ్చిత జ్ఞానం తెలవడం. ఎలా తెలుస్తుంది ఇది? చెప్పే వ్యక్తి ఎవరో, ఎంతటి సత్యవంతుడో దాని ప్రకారంగా మీరు అతని మాటను సత్యంగా నమ్ముతారు, కదా? రెండవది, దాని యొక్క సాక్ష్యాధారాలతో, దాని యొక్క సాక్ష్యాధారాలతో. ఇక ఎప్పుడైతే దానిని కళ్ళారా చూసుకుంటారో దానినే ఐనుల్ యకీన్ అంటారు, ఇక మీరు దానిని కళ్ళారా చూసుకున్నారు గనక తిరస్కరించలేరు. కానీ ఎప్పుడైతే అది మీ చేతికి అందుతుందో లేదా మీరు దానికి చేరుకుంటారో, దానిని అనుభవిస్తారో, అందులో ప్రవేశిస్తారో, దానిని ఉపయోగిస్తారో అప్పుడు మీకు ఖచ్చితంగా హక్కుల్ యకీన్, ఇక సంపూర్ణ నమ్మకం, ఏ మాత్రం అనుమానం లేకుండా సంపూర్ణ నమ్మకం కలుగుతుంది. అయితే సోదర మహాశయులారా, ఇక్కడ చెప్పే ఉద్దేశ్యం ఏంటంటే, ఓ మానవులారా, మీరు పరలోకాన్ని మరిచి ఏదైతే ఇహలోక ధ్యానంలోనే పడిపోయారో, ఇది మిమ్మల్ని పరలోకం నుండి ఏమరుపాటుకు గురి చేసిందో తెలుసుకోండి, మీకు ఖచ్చితంగా, ఖచ్చిత జ్ఞానంతో తెలుస్తుంది ఆ పరలోకం సత్యం అన్నది, ఖురాన్, హదీస్ సత్యం అన్నది మరియు మీరు నరకాన్ని చూసి తీరుతారు.

ఈ నరకం గురించి హదీసులో ఏమి వచ్చి ఉంది అంటే, ప్రళయ దినాన తీర్పు జరిగే సమయంలో ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం వచ్చే వరకు ఎంతమంది మానవులైతే ఒక పెద్ద మైదానంలో జమా అయి ఉంటారో, అల్లాహు తఆలా ఒక్కసారి నరకాగ్నిని వారికి దగ్గరగా చూపించడానికి డెబ్బై వేల సంకెళ్ళతో దానిని బంధించి వారి ముందుకు తీసుకు రావడం జరుగుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, గమనించండి. డెబ్బై వేల మంది దైవదూతలు, డెబ్బై వేల సంకెళ్ళు, ఒక్కొక్క సంకెళ్ళు ఎంత పెద్దగా అంటే డెబ్బై వేల మంది దైవదూతలు దాన్ని పట్టుకొని ఉంటారు. డెబ్బై వేలను డెబ్బై వేలతో ఇంటూ చేయాలి. గమనించండి, ఎంతమంది దైవదూతలు దానిని పట్టుకొని లాగుకొని తీసుకొస్తూ ఉంటారు. ప్రజలందరూ చూసి భయకంపితలు అయిపోతారు. సోదర మహాశయులారా, అలాంటి ఆ పరిస్థితి రాకముందే మనం దాని నుండి రక్షణకై ఇహలోకంలో అల్లాహ్ యొక్క ఆదేశాలను, ప్రవక్త యొక్క విధేయతను పాటించి జీవితం గడపాలి. ఆ తర్వాత:

ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ
సుమ్మ ల తుస్ అలున్న యౌమ ఇజిన్ అనిన్నయీమ్
మీరు ఆ రోజు తప్పకుండా మీకు ఇవ్వబడుతున్నటువంటి అనుగ్రహాల గురించి ప్రశ్నించడం జరుగుతుంది.

వాస్తవానికి సోదర మహాశయులారా, సోదరీమణులారా, మనందరినీ చాలా భయకంపితులు చేసే అటువంటి ఆయత్ ఇది కూడాను. ఎందుకంటే నిజంగా మనం చాలా ఏమరుపాటుకు గురి అయ్యే ఉన్నాము, ఇంకా ఈ ఏమరుపాటు, అశ్రద్ధకు గురి అయి అల్లాహ్ యొక్క కృతజ్ఞత ఎంత ఎక్కువ మంచి రీతిలో చెల్లించాలో చెల్లించడం లేదు. మనం ఎన్ని అనుగ్రహాలు అల్లాహ్ మనకు ప్రసాదించాడు, దాన్ని మనకు మనం ఒకసారి ఏదైనా లెక్కించుకునే ప్రయత్నం చేయడం, దాని గురించి అల్లాహ్ యొక్క కృతజ్ఞత చెల్లించే ప్రయత్నం చేయడమే మర్చిపోతున్నాము.

ఒకవేళ మనం హదీసులో చూస్తే, సహీ ముస్లిం, హదీస్ నెంబర్ 2969 లో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రళయ దినాన అల్లాహు తఆలా మనిషిని అడుగుతాడు, నేను నీకు గౌరవం ప్రసాదించలేదా, నీకు నీ ఇంట్లో గాని, నీకు హోదా అంతస్తులు ఇవ్వలేదా, నీకు భార్యా పిల్లలు మరియు ఇంకా డబ్బు ధనం లాంటివి ఇవ్వలేదా, ప్రత్యేకంగా ఎవరికైతే ఈ లోకంలో ఇలాంటివి లభించాయో వారిని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది. అంతేకాదు, నీకు ఒంటెలు ఇచ్చాను, ఇంకా గుర్రాలు ఇచ్చాను, నీవు నీకు ఎంత ప్రజలలో ప్రతిష్ట ఇచ్చాను అంటే నీవు ఆదేశిస్తే ప్రజలు నీ మాటను వినేవారు. అయితే అల్లాహ్ అడుగుతాడు, ఇవన్నీ నీకు ఇచ్చానా లేదా? అప్పుడు మనిషి అబద్ధం చెప్పలేకపోతాడు. అవును ఓ అల్లాహ్ ఇవన్నీ ప్రసాదించావు. అప్పుడు అల్లాహు తఆలా అంటాడు, నీవు నన్ను కలుసుకునేవాడివవు, పరలోకం అనేది ఉన్నది, నీవు నా వద్దకు రానున్నావు అన్నటువంటి విషయం నమ్మేవాడివా? కాఫిర్ అయ్యేది ఉంటే ఏమంటాడు? లేదు అని. అప్పుడు అల్లాహ్ అంటాడు, అన్సాక కమా నసీతనీ, నీవు నన్ను ఎలా మరిచావో అలాగే నేను కూడా నిన్ను మర్చిపోతాను.

సోదర మహాశయులారా, సూరతున్నీసా మీరు కొంచెం శ్రద్ధగా చదవండి ఎప్పుడైనా అనువాదంతో. ఒకటి కంటే ఎక్కువ స్థానంలో మునాఫికుల గురించి చెప్పడం జరిగింది, వారు పరలోకాన్ని విశ్వసించే రీతిలో విశ్వసించరు అని. మన పరిస్థితి కూడా అలాగే అవుతుందా, ఒక్కసారి మనం అంచనా వేసుకోవాలి. ఒక హదీస్ పై శ్రద్ధ వహిస్తే మీకు ఈ అంశం అర్థమైపోతుంది, సమయం కూడా కాబోతుంది గనక నేను సంక్షిప్తంగా చెప్పేస్తాను.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హజరత్ అబూబకర్, హజరత్ ఉమర్, గమనించండి, ముగ్గురు ఎలాంటి వారు? ప్రవక్త విషయం చెప్పే అవసరమే లేదు, ప్రవక్తల తర్వాత ఈ లోకంలోనే అత్యంత శ్రేష్టమైన మనుషులు ఇద్దరు. అయితే సుమారు రెండు లేదా మూడు రోజుల నుండి తిండికి, తినడానికి ఏ తిండి లేక తిప్పల పడుతూ, కడుపులో కూడా ఎంతో పరిస్థితి మెలికలు పడుతూ అబూబకర్ ముందు వెళ్లారు, ఆ తర్వాత ఉమర్ వెళ్లారు, ప్రవక్తను కలుద్దామని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటికి వెళ్లారు, ముగ్గురూ బయటనే కలుసుకున్నారు. ఎటు వెళ్లారు, ఎటు వెళ్లారు అంటే కొందరు సిగ్గుతో చెప్పుకోలేకపోయారు కానీ ఏ విషయం మిమ్మల్ని బయటికి తీసిందో, నన్ను కూడా అదే విషయం బయటికి తీసింది అని ప్రవక్త చెప్పి అక్కడి నుండి ఒక అన్సారీ సహాబీ యొక్క తోటలోకి వెళ్తారు. అల్లాహు అక్బర్. పూర్తి హదీస్ అనువాదం చెప్పలేను కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం, అన్సారీ సహాబీ మంచి అప్పుడే నీళ్లు బయటి నుండి తీసుకొని వస్తారు, చల్లనివి, ప్రవక్త ముందు, అబూబకర్, ఉమర్ ముందు పెడతారు మరియు తోటలో నుండి తాజా కొన్ని ఖర్జూర్ పండ్లు తీసుకొచ్చి పెడతారు. ఈ రెండే విషయాలను చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళ నుండి కన్నీరు కారుతాయి, సహాబాలు కూడా ఏడుస్తారు ఇద్దరూ. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెబుతారో తెలుసా? ఈ అనుగ్రహాల గురించి ప్రళయ దినాన మీతో ప్రశ్నించడం జరుగుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి, మూడు రోజులు తిండి లేక తిప్పల పడిన తర్వాత దొరికిన ఈ ఖర్జూర్ మరియు నీళ్లు. వీటి గురించి ఇలా చెప్పారు అంటే ఈ రోజుల్లో మన ఇళ్లల్లో ఉన్నటువంటి ఏసీలు, మన ఇళ్లల్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్‌లు, మన ఇళ్లల్లో కొన్ని రోజుల వరకు తినేటువంటి సామాగ్రి, ఇంకా మనకు ఎన్నో జతల బట్టలు, ఇంకా ఏ ఏ అనుగ్రహాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి, మనం ఎంతగా అల్లాహ్ కు కృతజ్ఞత చెల్లించుకోవలసి ఉంది, కానీ మనం ఎంత ఏమరుపాటుకు, అశ్రద్ధకు గురి అయి ఉన్నాము?

సోదర మహాశయులారా, నిజంగా చెప్పాలంటే మనం చాలా అల్లాహ్ యొక్క అనుగ్రహాలను మరిచిపోయి ఉన్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలియజేస్తారు:

نِعْمَتَانِ مَغْبُونٌ فِيهِمَا كَثِيرٌ مِنَ النَّاسِ
నిఅమతాని మగ్బూనున్ ఫీహిమా కసీరుమ్ మినన్నాస్
(రెండు అనుగ్రహాలు ఉన్నాయి, ప్రజలు వాటి గురించి చాలా అశ్రద్ధగా ఉన్నారు).”

తిర్మిజీలోని మరో ఉల్లేఖనం ద్వారా తెలుస్తుంది, అల్లాహు తఆలా మనిషితో ప్రశ్నిస్తూ అంటాడు: “నేను నీకు చల్లని నీరు త్రాపించలేదా? నీవు వంటలో వేసుకోవడానికి నీకు ఉప్పు ఇవ్వలేదా?” ఇవి, ఇంకా ఇలాంటి ఎన్నో హదీసుల ద్వారా ఏం తెలుస్తుందంటే ప్రళయ దినాన అల్లాహు తఆలా ఎన్నో రకాల అనుగ్రహాల గురించి, మనకు ఇచ్చినటువంటి అనుగ్రహాల గురించి అడుగుతాడు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల ముందుకు వచ్చారు, ఈ ఆయత్ గురించి ప్రశ్నించడానికి. ఎప్పుడైతే ఈ ఆయత్ అవతరించిందో, సుమ్మ ల తుస్ అలున్న యౌమ ఇజిన్ అనిన్నయీమ్, ముస్నద్ అహ్మద్ లోని ఉల్లేఖనం, తిర్మిజీలో కూడా ఉంది. సహాబాలు వచ్చి అడిగారు, ప్రవక్తా, మా దగ్గర ఏమున్నది? ఈ ఖర్జూర్ ఉన్నది, ఈ నీళ్లు ఉన్నాయి, ఇంతే కదా. అంటే వీటి గురించి కూడా ప్రశ్నించడం జరుగుతుందా, మన పరిస్థితి ఎలా ఉంది, ఎల్లవేళల్లో మనం మన యొక్క ఆయుధాలు వెంట తీసుకొని వెళ్తున్నాము, ఎప్పుడు శత్రువులు మనపై దాడి చేస్తారు అన్నటువంటి భయంలో జీవిస్తున్నాము, మనపై ఏమంత ఎక్కువ అనుగ్రహాలు అన్నటువంటి ప్రశ్న ప్రశ్నిస్తే ప్రవక్త ఏం చెప్పారు?

أَمَا إِنَّ ذَلِكَ سَيَكُونُ
అమా ఇన్న జాలిక సయకూన్
అల్లాహ్ చెప్పాడు ప్రశ్నిస్తానని, అల్లాహు తఆలా తప్పకుండా ప్రశ్నించి తీరుతాడు.

సోదర మహాశయులారా, ఈ ఇంకా మరికొన్ని హదీసులు ఇలాంటివి మనం చదవాలి, తెలుసుకోవాలి, ఇలాంటి ఈ సూరాల వ్యాఖ్యానంలో మనం అల్లాహ్ తో భయపడాలి, మనకు అల్లాహ్ యొక్క అనుగ్రహాల గురించి చిన్న బేరీజు వేసుకొని, అంచనా వేసుకొని, గుర్తొచ్చినన్నివి, గుర్తురానివి చాలా ఉన్నాయి, కానీ గుర్తు వచ్చినవి కొంచెం మనం అల్లాహ్ యొక్క ప్రత్యేక కృతజ్ఞత చెల్లించుకునే ప్రయత్నం చేయాలి. మరియు కృతజ్ఞత ఎలా చెల్లించాలి? అల్లాహ్ ఆదేశాలను పాటించి, ఆ అనుగ్రహాలను అల్లాహ్ యొక్క విధేయతలో ఉపయోగించి. విన్న విషయాలను అర్థం చేసుకొని ఆచరించే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక, ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
వా ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

పరలోకం పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

పరలోకం పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ
https://youtu.be/NsqbSZr8XQI [14 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ విశ్వాసంలోని ఐదవ ముఖ్యమైన అంశమైన పరలోక జీవితంపై విశ్వాసం గురించి వివరించబడింది. పరలోకం అంటే ఏమిటి, దాని ఉనికికి ఖురాన్ మరియు హదీసుల నుండి ఆధారాలు, మరియు ప్రపంచంలో జరిగే అన్యాయాలకు అంతిమ న్యాయం జరగాల్సిన ఆవశ్యకత వంటి విషయాలు చర్చించబడ్డాయి. పరలోకంలో జరిగే ముఖ్య సంఘటనలైన హషర్ మైదానం (సమావేశ స్థలం), కర్మపత్రాల పంపిణీ, మీజాన్ (త్రాసు), జహన్నం (నరకం), మరియు జన్నత్ (స్వర్గం) గురించి కూడా ప్రస్తావించబడింది. చివరగా, పరలోకంపై విశ్వాసం ఒక వ్యక్తిని దైవభీతితో జీవించేలా, పుణ్యకార్యాల వైపు ప్రేరేపించేలా మరియు పాపాలకు దూరంగా ఉంచేలా ఎలా చేస్తుందో, తద్వారా సమాజంలో శాంతి ఎలా నెలకొంటుందో వివరించబడింది.

అల్ హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్.

అన్ని రకాల ప్రశంసలు, పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలు మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ప్రసంగంలో, విశ్వాస ముఖ్యాంశాలలోని ఐదవ ముఖ్యాంశం పరలోకం పట్ల విశ్వాసం గురించి తెలుసుకుందాం.

పరలోకం అంటే ఏమిటి? పరలోకాన్ని విశ్వసించడానికి మన వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? పరలోకంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటి? పరలోకాన్ని విశ్వసిస్తే మనిషికి కలిగే ప్రయోజనము ఏమిటి? ఇవన్నీ ఇన్ షా అల్లాహ్ ఈ ప్రసంగంలో వస్తాయి.

ఆ హదీస్ మరొక్కసారి మనము విందాం. జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్తా, ఈమాన్ అంటే ఏమిటి అని ప్రశ్నించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇస్తూ, అల్లాహ్ ను విశ్వసించటం, దూతలను విశ్వసించటం, గ్రంథాలను విశ్వసించటం, ప్రవక్తలను విశ్వసించటం, పరలోకాన్ని విశ్వసించటం, విధివ్రాతను విశ్వసించటం అని సమాధానం ఇచ్చినప్పుడు, జిబ్రీల్ అలైహిస్సలాం వారు నిజమే అని ధ్రువీకరించారు కదండీ. ఆ ప్రకారంగా ఈమాన్ (విశ్వాసం) అంటే ఆరు విషయాలను విశ్వసించవలసి ఉంది కదండీ. అందులోని ఐదవ విషయం, పరలోకం పట్ల విశ్వాసం. ఈ పరలోకం పట్ల విశ్వాసం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మీ ముందర ఉంచుతున్నాను. ఇన్ షా అల్లాహ్, శ్రద్ధగా విని ఆచరించే ప్రయత్నము చేయండి.

ముందుగా, పరలోకం అంటే ఏమిటి తెలుసుకుందాం. పరలోకం అంటే, మానవులందరూ కూడా మరణించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవులందరినీ ఒక రోజు మళ్ళీ బ్రతికిస్తాడు. ఆ రోజు వారి కర్మల లెక్కింపు జరుగుతుంది. ఎవరైతే సత్కార్యాలు ఎక్కువగా చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, వారికి బహుమానాలు ఇవ్వబడతాయి. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, వారికి శిక్షలు విధించటం జరుగుతుంది. ఇలా జరిగే దినాన్ని పరలోక దినం, లెక్కింపు దినం అని కూడా అంటూ ఉంటారు.

పరలోకం ఉంది అని నమ్మటానికి ఆధారాలు మనము ఇప్పుడు చూచినట్లయితే, ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పదేపదే పరలోకం గురించి మరియు పరలోకంలో జరగబోయే విషయాల గురించి మనకు తెలియపరిచి ఉన్నాడు. హదీసులలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలలో కూడా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట పరలోకము మరియు పరలోకంలో జరగబోయే విషయాల ప్రస్తావన మనకు కనబడుతూ ఉంటుంది. ఒక ఉదాహరణ మీ ముందర ఉంచుతున్నాను చూడండి. ఖురాన్ గ్రంథము 23వ అధ్యాయము 15, 16 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

ثُمَّ اِنَّكُمْ بَعْدَ ذٰلِكَ لَمَيِّتُوْنَ ثُمَّ اِنَّكُمْ يَوْمَ الْقِيٰمَةِ تُبْعَثُوْنَ
ఆ తరువాత మీరంతా తప్పకుండా మరణిస్తారు. మరి ప్రళయ దినాన మీరంతా నిశ్చయంగా లేపబడతారు. (23:15-16)

ఈ రెండు వాక్యాలలో ప్రళయ దినం ప్రస్తావన కూడా వచ్చి ఉంది. మనిషి మరణించిన తర్వాత మళ్ళీ బ్రతికించబడతారు అనే ప్రస్తావన కూడా వచ్చి ఉంది. ఇలా చాలా వాక్యాలు ఉన్నాయి, చాలా హదీసులు, ఉల్లేఖనాలు ఉన్నాయి. తద్వారా, పరలోకము తప్పనిసరిగా ఉంది అని గ్రంథాల ద్వారా స్పష్టమవుతూ ఉంది. ప్రతి విశ్వాసి కూడా పరలోకాన్నే విశ్వసించటం తప్పనిసరి.

ఇక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే, పరలోకం సంభవిస్తుంది అని కూడా మనకు తెలుస్తుంది. అది ఎలాగంటే, మనం చూస్తూ ఉంటాం. చాలా చోట్ల ప్రపంచంలో, బలవంతులు, దౌర్జన్యపరులు నిరుపేదలపై, బలహీనులపై దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు. హత్యలు చేస్తూ ఉంటారు, అత్యాచారాలు చేస్తూ ఉంటారు, ప్రాణాలు తీసేసి ఇది ప్రమాదము అని చిత్రీకరిస్తూ ఉంటారు, అరాచకాలు సృష్టిస్తూనే ఉంటారు, కబ్జాల మీద కబ్జాలు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉంటే, మనం చూస్తూ ఉంటాం. బలహీనులు న్యాయం కావాలి అని ఎదురు చూస్తూనే ఉంటారు, కానీ వారికి ఎక్కడ కూడా న్యాయం దొరకదు, చివరికి వారు అలాగే బాధపడుతూనే మరణించి ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. బలవంతుల్లో కొందరు, రాజకీయ నాయకుల, అధికారుల అండదండలతో, ధనముతో తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. వారు చేసిన అరాచకాలకు శిక్షలు పడవు. ఏదో ఒక రకంగా పలుకుబడి ద్వారా వారు తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. చివరికి వారు కూడా ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు.

ప్రశ్న ఏమిటంటే, మరి అన్యాయానికి గురి అయిన ఈ పీడితులకు, దేవుడు కూడా న్యాయం చేయడా? అన్యాయము చేసి, అరాచకాలు సృష్టించిన ఈ దుర్మార్గులకు, దేవుడు కూడా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కూడా శిక్షించడా? అంటే, దానికి ఇస్లాం ఇచ్చే సమాధానం ఏమిటంటే, తప్పనిసరిగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు, మరియు అతనికి న్యాయం చేస్తాడు. అలాగే ప్రతి నేరస్తునికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని నేరానికి సరిపడేటట్టుగానే శిక్షిస్తాడు. ఎంతటి నేరము ఉంటుందో అంతటి కఠినమైన శిక్ష కూడా విధిస్తాడు. దీనికి సరైన ప్రదేశము పరలోకము.

పరలోకంలో నిరుపేద, ధనికుడు, బలహీనుడు, బలవంతుడు, రాజకీయ అండదండలు, ధనము, పలుకుబడి ఇవన్నీ ఏమీ గానీ ఉండవు, పనికిరావు కూడా. అక్కడ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు మరియు ప్రతి నేరస్తునికి అతని నేరానికి తగినంత శిక్ష కూడా విధిస్తాడు. ఆ రోజు న్యాయము స్థాపించబడుతుంది. ఆ ప్రకారంగా పరలోకము తప్పనిసరిగా సంభవిస్తుంది అని మనకు స్పష్టమవుతుంది మిత్రులారా.

పరలోకంలో ఏమేమి ఉంటాయి అనే విషయాలు మనం చూచినట్లయితే, చాలా విషయాలు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియపరిచి ఉన్నారు. కొన్ని విషయాలు మాత్రమే ఈ ప్రసంగంలో చెబుతున్నాను. ఇన్ షా అల్లాహ్, పరలోకంలో ఏమి జరుగుతుంది అనే ప్రసంగం వినండి, అందులో వివరాలు ఇన్ షా అల్లాహ్ మీకు దొరుకుతాయి. ఇక రండి, కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పరలోకంలో హషర్ మైదానము ఉంది. హషర్ మైదానము అంటే ఏమిటి? ప్రళయం సంభవించిన తర్వాత, యుగాంతము సంభవించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ భూమి ఆకాశాలను సృష్టిస్తాడు. ఆ రోజు భూమి ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక చదరపు మైదానములా, పాన్పు లాగా ఉంటుంది. ఆ మైదానంలో ఒక చెట్టు గానీ, ఒక గుట్ట గానీ, ఒక భవనము గానీ ఉండదు. ఆ మైదానంలో, ఆది మానవుడైన ఆదమ్ అలైహిస్సలాం వద్ద నుండి యుగాంతం సంభవించినంత వరకు ఎంతమంది మానవులైతే జన్మించి, మరణించారో వారందరినీ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ బ్రతికించి నిలబెడతాడు.

వారందరూ కూడా ఆ మైదానంలో నిలబడినప్పుడు, వారి వారి చేతికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. ఎవరైతే సత్కార్యాలు చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, కుడిచేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు వారి కర్మలను, వారి సత్కార్యాలను చూసి, చదివి సంతోషిస్తూ ఉంటారు, వారి మొహము ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, అరాచకాలు సృష్టించి ఉంటారో, ఎడమ చేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు చేసుకున్న పాపాలన్నీ వారు ఆ రోజు చదువుకుంటూ, ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. వారి మొహం ఆ రోజు నల్లబడిపోతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే, దానిని హషర్ మైదానము అని అంటారు.

అలాగే పరలోకంలో ఏముంది అని మనం చూచినట్లయితే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మీజాన్ ఉంచి ఉన్నాడు. మీజాన్ అంటే ఏమిటి? త్రాసు అని అర్థం. ఆ త్రాసులో ఏమి తూంచబడుతుంది అంటే, ప్రజల పుణ్యాలు, పాపాలు తూచబడతాయి. ఎవరి పుణ్యాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు విజేతలుగా నిలబడతారు. ఎవరి పాపాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు దోషులుగా నిలబడతారు. ఆ రోజు తుది నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాదే. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎవరిని మన్నించాలనుకుంటాడో వారిని మన్నిస్తాడు. మరి ఎవరినైతే శిక్షించాలనుకుంటాడో వారిని శిక్షిస్తాడు. నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చేతిలోనే ఉంటుంది. కాకపోతే, విశ్వాసం ప్రామాణికమైనది అవుతుంది కాబట్టి మిత్రులారా, ఆ రోజు రానున్నది. ప్రపంచంలోనే విశ్వసించండి, సత్కార్యాలు చేయండి అని మనకు తెలపబడింది. మొత్తానికి పరలోకంలో త్రాసు ఉంది, అందులో ప్రజల కర్మలు తూచబడతాయి.

అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జహన్నం సిద్ధం చేసి ఉంచాడు. జహన్నం అంటే నరకం అని అర్థం. నరకంలో ఏముంది అంటే, అది ఒక పెద్ద బావి, దాని నిండా అగ్ని ఉంది. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కారానికి పాల్పడి ఉంటారో, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అలాంటి వారిని శిక్షించడానికి నరకంలో పడవేస్తాడు. ఎవరు ఎన్ని ఘోరమైన నేరాలు, పాపాలు చేసి ఉంటారో, వారికి నరకంలో అంత కఠినమైన శిక్ష కూడా విధించబడుతుంది. అల్లాహ్ మన అందరికీ దాని నుండి, దాని శిక్షల నుండి రక్షించుగాక, ఆమీన్.

అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జన్నహ్, ఉర్దూలో జన్నత్, తెలుగులో స్వర్గం సిద్ధం చేసి ఉన్నాడు. స్వర్గంలో ఏమున్నాయి అంటే, అందులో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అనుగ్రహాలు అన్నీ ఉంచి ఉన్నాడు. ఆ అనుగ్రహాలు ఎవరికి దక్కుతాయి అంటే, ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు, పుణ్యాలు ఎక్కువగా చేసుకుని ఉంటారో, వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆ స్వర్గము ప్రసాదిస్తాడు. ఎవరు ఎన్ని ఎక్కువ పుణ్యాలు చేసుకొని ఉంటారో, వారు స్వర్గంలో అంత ఉన్నతమైన స్థానాలలో చేరుకుంటారు. స్వర్గంలో ఉన్నవారు, ప్రశాంతంగా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి భయము లేకుండా, సంతోషంగా జీవించుకుంటూ ఉంటారు. అలాంటి స్వర్గం అల్లాహ్ మన అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.

పరలోకంలో ఇంకా ఏమి ఉంటాయి అంటే, పరలోకంలో హౌదె కౌసర్ ఉంది, పరలోకంలో పుల్ సిరాత్ ఉంది, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మీరు పరలోకంలో ఏమి జరుగుతుంది, పరలోక విశేషాలు అనే ప్రసంగాలు వినండి, ఇన్ షా అల్లాహ్ తెలుస్తుంది. సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి, ఇక చివరులో మనము…

పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి అనేది ఇన్ షా అల్లాహ్ తెలుసుకొని మాటను ముగిద్దాం. పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటట? మనిషి పరలోకాన్ని విశ్వసించటం వలన దైవభీతితో జీవిస్తాడు. పుణ్యాలు బాగా చేసి, పరలోక అనుగ్రహాలు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. పాపాలు చేస్తే పరలోకంలో శిక్షలు తప్పవు అని భయపడుతూ ఉంటాడు. మరియు అలా భయపడటం వలన, అతను అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అలా చేయటం వలన సమాజంలో శాంతి నెలకొంటుంది.

ఒకసారి ఆలోచించి చూడండి. ప్రతి వ్యక్తి పరలోకాన్ని విశ్వసించి, పరలోకంలో ఉన్న అనుగ్రహాలను విశ్వసించి, పరలోకంలో ఉన్న శిక్షలను కూడా విశ్వసించి, వాటిని దృష్టిలో పెట్టుకుని జీవిస్తున్నప్పుడు, సత్కార్యాలు చేసుకుందాం, పుణ్యాలు సంపాదించుకుని స్వర్గానికి చేరుకుందాం అనుకుంటూ ఉంటే, అలాగే పాపాలు చేయవద్దు, చేస్తే నరకానికి వెళ్లి శిక్షలు అనుభవించవలసి ఉంటుంది కాబట్టి, వద్దు అయ్యా పాపాలు, నేరాలు అని దానికి దూరంగా ఉంటూ ఉంటే, ప్రతి వ్యక్తి ఆ విధంగా విశ్వసించి జీవించుకుంటే, అలాంటి సమాజము శాంతియుతంగా ఉంటుంది అని చెప్పటానికి ఇంకేమి కావాలి మిత్రులారా.

కాబట్టి, నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మన అందరికీ సంపూర్ణ విశ్వాసులుగా జీవించే భాగ్యం ప్రసాదించుగాక. నరక శిక్షల నుండి అల్లాహ్ మమ్మల్ని కాపాడి, స్వర్గవాసులుగా మమ్మల్ని అందరినీ స్వర్గానికి చేర్చుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30634

పరలోకం (The Hereafter) – మెయిన్ పేజీ
https://teluguislam.net/hereafter/