ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధిని సందర్శించేవారికి ముఖ్యమైన సూచనలు – షేఖ్ అబ్దుర్రజ్జాఖ్ అల్-బద్ర్

Important notices for the visitor of the grave of the Prophet ﷺ
Shaykh Abdurrazzaq al-Badr [Video|Ar-En Subtitles]
https://youtu.be/ZJp6AFAGrWU [38 minutes]
https://abdurrahman.org/?p=435632

Explanation of The book Clarification and explanation of many issues related to Hajj, Umrah, and visitation in light of the Qur’an and the Sunnah by Shaykh Abdul-Aziz bin Abdullah bin Baz rahimahullah

సర్వ స్తోత్రాలు సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), వారి కుటుంబ సభ్యులు మరియు సహచరులందరిపై అల్లాహ్ శాంతి, శుభాలు వర్షించుగాక.

(اللَّهُمَّ اغْفِرْ لَنَا وَلِشَيْخِنَا وَلِجَمِيعِ الْمُسْلِمِينَ)
ఓ అల్లాహ్! మమ్మల్ని, మా షేఖ్ ను, అలాగే ముస్లింలందరినీ క్షమించు.

సుప్రసిద్ధ పండితులు ఇమామ్ అబ్దుల్ అజీజ్ ఇబ్న్ అబ్దుల్లాహ్ ఇబ్న్ బాజ్ (అల్లాహ్ వారిని కరుణించుగాక) ‘ఖురాన్, సున్నత్‌ల వెలుగులో హజ్, ఉమ్రా మరియు జియారత్‌కు సంబంధించిన పలు సమస్యల స్పష్టీకరణ మరియు వివరణ’ అనే తమ గ్రంథంలో ఈ విధంగా పేర్కొన్నారు:

నరకంపై వంతెన (ఫుల్ సిరాత్): పార్ట్ 3 – [మరణానంతర జీవితం – పార్ట్ 53] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 3
[మరణానంతర జీవితం – పార్ట్ 53] [20 నిముషాలు]
https://www.youtube.com/watch?v=QVnrPdQraUA
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షికలో కూడా మనం నరకంపై వేయబడే వంతెన గురించే తెలుసుకుంటూ ఉన్నాము.

అయితే, ఈరోజు మనం మరికొన్ని విషయాలు ఏవైతే తెలుసుకోబోతున్నామో వాటిలో మొట్టమొదటి విషయం ఆ వంతెనను తొలిసారిగా దాటేవారు ఎవరు? దీని గురించి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పొడవైన హదీసులో పరలోకంలో సంబంధించే కొన్ని విషయాలను వివరంగా ప్రస్తావిస్తూ వంతెన విషయం వచ్చినప్పుడు ఇలా తెలిపారు:

فَأَكُونُ أَنَا وَأُمَّتِي أَوَّلُ مَنْ يُجِيزُ
(ఫ అకూను అనా వ ఉమ్మతీ అవ్వలు మన్ యుజీజ్)
“నేను మరియు నా అనుచర సంఘం అందరికంటే ముందు ఈ వంతెనను దాటుతాము.”

అల్లాహు అక్బర్. మహాశయులారా, లక్షకు పైగా ప్రవక్తలు ఈ లోకంలో వచ్చి పోయారు. చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ ప్రవక్తను, ఆ ప్రవక్తపై సంపూర్ణం చేయబడిన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడమే తప్పనిసరి. అయితే ఇక్కడ గమనించండి, ఆ ప్రవక్త, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరి ప్రవక్తల కంటే ముందు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచర సంఘం అంటే మనం, ఇతర అనుచర సంఘాల కంటే ముందు వంతెనను కూడా దాటడంలో ముందుగా ఉంటాము. ఇదే వంతెన గురించి మరీ తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: