జిల్ హిజ్జా తొలి దశ ఘనత – 3 ఆయతులు & 5 హదీసులు చిన్నపాటి వివరణతో [వీడియో]

1- وَيَذْكُرُوا اسْمَ اللَّهِ فِي أَيَّامٍ مَعْلُومَاتٍ (الحج 28) عَنِ ابْنِ عَبَّاسٍ: الْأَيْامُ الْمَعْلُومَاتُ: أَيْامُ الْعَشْر

2- وَشَاهِدٍ وَمَشْهُودٍ (البروج 3) يَعْنِي الشاهدَ يومُ الْجُمُعَةِ، وَيَوْمٌ مَشْهُودٌ يَوْمُ عَرَفَةَ (الترمذي 3339 حسن)

3- وَلَيَالٍ عَشْرٍ (2) وَالشَّفْعِ وَالْوَتْرِ (الفجر 3) عَنْ جَابِرٍ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «إِنَّ الْعَشْرَ عَشْرُ الْأَضْحَى، وَالْوَتْرَ يَوْمُ عَرَفَةَ، وَالشَّفْعَ يَوْمُ النَّحْرِ» [مسند احمد 14511]

1) عن ابن عباس، عن النبي صلى الله عليه وسلم أنه قال: «ما العمل في أيام أفضل منها في هذه؟ [البخاري 969]

2) عَنْ ابْنِ عَبَّاسٍ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «مَا مِنْ أَيَّامٍ الْعَمَلُ الصَّالِحُ فِيهَا أَحَبُّ إِلَى اللَّهِ مِنْ هَذِهِ الْأَيَّامِ» [أبوداود 2438
صحيح]
3) عَنْ ابْنِ عَبَّاسٍ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «مَا مِنْ عَمَلٍ أَزْكَى عِنْدَ اللَّهِ عَزَّ وَجَلَّ وَلَا أَعْظَمَ أَجْرًا مِنْ خَيْرٍ يَعْمَلُهُ فِي عَشْرِ الْأَضْحَى» [سنن الدارمي 1815 صحيح الترغيب 1148]-

4) أَفْضَلُ أَيَّامِ الدُّنْيَا أَيَّامُ الْعَشْرِ، عَشْرِ ذِي الْحِجَّةِ [صحيح الترغيب 1150]

5) عَنِ ابْنِ عُمَرَ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: ” مَا مِنْ أَيَّامٍ أَعْظَمُ عِنْدَ اللهِ، وَلَا أَحَبُّ إِلَيْهِ مِنَ الْعَمَلِ فِيهِنَّ مِنْ هَذِهِ الْأَيَّامِ الْعَشْرِ، فَأَكْثِرُوا فِيهِنَّ مِنَ التَّهْلِيلِ، وَالتَّكْبِيرِ، وَالتَّحْمِيدِ [مسند أحمد 5446 صحيح[

[తెలుగుఇస్లాం.నెట్ వాట్సాప్ ఛానెల్] జాయిన్ కండి.
https://whatsapp.com/channel/0029VaOFSxvAu3aRxgqKKh3N

జుల్ హిజ్జ, ఉమ్రా, హజ్జ్, బక్రీద్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3__K6T_yH5Pl8xzP3FBHqf

ముష్రిక్ లను కాఫిర్లుగా నమ్మక పోవడం | ఇస్లాం నుంచి బహిష్కరించే విషయాలు  – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

إنَّ الْحَمْدَ لِلَّهِ، نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وسَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ، وَأَشْهَدُ أَنْ لَا إلـٰه إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ.

)يَا أَيُّهَا الَّذِينَ آمَنُواْ اتَّقُواْ اللّهَ حَقَّ تُقَاتِهِ وَلاَ تَمُوتُنَّ إِلاَّ وَأَنتُم مُّسْلِمُون(.

 )يَا أَيُّهَا النَّاسُ اتَّقُواْ رَبَّكُمُ الَّذِي خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالاً كَثِيراً وَنِسَاء وَاتَّقُواْ اللّهَ الَّذِي تَسَاءلُونَ بِهِ وَالأَرْحَامَ إِنَّ اللّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبا(.

)يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلاً سَدِيداً * يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَمَن يُطِعْ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزاً عَظِيما(.

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.    

ఓ అల్లాహ్ దాసులారా! అల్లాహ్ తో భయపడుతూ ఉండండి, ఆయనను గౌరవించండి, ఆయన మాటను అనుసరించండి మరియు అవిధేయతకు పాల్పడమాకండి. గుర్తుంచుకోండి ధర్మాలన్నీ ఏయే  విషయాలపై  ఏకమై ఉన్నాయో  అందులో తౌహీద్ రెండు మూల స్తంభాలపై ఆధారపడి ఉండటము కూడా ఒకటి.

మొదటిది: అల్లాహ్ యేతరుల ఆరాధన నుంచి సంబంధం లేకపోవడం.  అల్లాహ్ ను కాకుండా ఇతరులను ఆరాధించడాన్ని అల్లాహ్ వాటికి “తాగూత్ ” అని పేరు పెట్టారు.

రెండవ మూలము:  కేవలం అల్లాహ్ యే నిజ ఆరాధ్యుడు అని సాక్ష్యం పలకటం. ఇదే తౌహీద్ కనుక ఏ వ్యక్తి అయితే తౌహీద్ తో పాటు బహుదైవారాధకుల ధర్మం నుంచి సంబంధం లేదు అన్నట్టు స్పష్టంగా సాక్ష్యం ఇవ్వడో, నిరాకరించడో  అతను తాగుత్ (మిద్య దైవారాధన ) ను తిరస్కరించలేదు అన్నట్టే . అలాంటి వ్యక్తి గురించి అల్లాహ్  ఈ విధంగా సెలవిచ్చారు:

فمن يكفر بالطاغوت ويؤمن بالله فقد استمسك بالعروة الوثقى لا انفصام لها
ఎవరయితే  అల్లాహ్ ను  తప్ప  వేరేతర  ఆరాధ్యులను  (తాగూత్ లను)  తిరస్కరించి,  కేవలం అల్లాహ్ ను మాత్రమే   విశ్వసిస్తారో  వారు  దృఢమైన  కడియాన్ని  పట్టుకున్నారు.

ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే అల్లాహ్ యేతర ఆరాధ్యులను (తాగూత్ లను)  తిరస్కరించడో అతను బలమైన కడియాన్ని పట్టుకోలేదు. ఆ బలమైన కడియం ఇస్లాం ధర్మం.

ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, తమ జాతి యొక్క  ధర్మం నుంచి నాకు ఎటువంటి సంబంధం లేదు అని స్పష్టం చేస్తూ ఈ విధంగా అన్నారు:

 إِنَّنِي بَرَاءٌ مِّمَّا تَعْبُدُونَ إِلَّا الَّذِي فَطَرَنِي فَإِنَّهُ سَيَهْدِينِ وَجَعَلَهَا كَلِمَةً بَاقِيَةً فِي عَقِبِهِ لَعَلَّهُمْ يَرْجِعُونَ

“మీరు పూజించే వాటి నుంచి నేను వేరైపోయాను. నన్ను పుట్టించిన వానిని మాత్రమే (నేను ఆరాధిస్తాను). ఆయనే నాకు సన్మార్గం చూపుతాడు”. మరి ఇబ్రాహీము ఈ మాటే – తన తదనంతరం – తన సంతానంలో మిగిలి ఉండేట్లుగా చేసి వెళ్ళాడు – ప్రజలు (షిర్క్‌ నుంచి) మరలిరావటానికి.

తారీక్ బిన్ అషీమ్ అల్ అస్జయీ ఉల్లేఖనం, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఏ వ్యక్తి అయితే “లా ఇలాహ ఇల్లలాహ్” పలికి అల్లాహ్ యేతర ఆరాధ్యులను తిరస్కరించాడో అతని ప్రాణాలు మరియు ధనము క్షేమంగా ఉన్నట్టే మరియు అల్లాహ్ యే అతని లెక్క చూసుకుంటాడు”. ( సహీహ్ ముస్లిం )

ఈ హదీస్ యొక్క అర్థం ఏమిటంటే ఏ వ్యక్తి అయితే  అల్లాహ్  కాకుండా ఇతర ఆరాధ్యులను  తిరస్కరించడో, అతని ప్రాణాలు మరియు ధనము క్షేమంగా లేనట్టే. ఇది కేవలం కాఫిర్ (అవిశ్వాసి) హక్కులోనే ఇలా జరుగుతుంది.

అల్లాహ్ దాసులారా! వివరించబడిన ఖురాన్ మరియు హదీస్ వెలుగులో  అర్ధమైన విషయం ఏమిటంటే ఎవరైతే ముష్రికులను కాఫిర్ గా ప్రకటించడో లేదా అతని కుఫ్ర్ లో (అవిశ్వాసంలో) సందేహం పడినా లేదా అతని ధర్మాన్ని సరైనదిగా భావించినా అతను అవిశ్వాసానికి పాల్పడినట్టే. అతను  ఇస్లామీయ బహిష్కరణలో నుంచి ఒక బహిష్కరణకు పాల్పడినట్టే.

అల్లాహ్ దాసులారా! ఏ వ్యక్తి అయితే తప్పుడు మతాలను అవలంబిస్తున్నాడో అతనిని కాఫిర్ ప్రకటించకపోవడం కూడా కుఫ్ర్ అవుతుంది. అతను ముస్లిం కాలేడు, ఎందుకంటే ఏ వ్యక్తినైతే అల్లాహ్ మరియు ప్రవక్త కాఫిర్ అని ప్రకటిస్తున్నారో అతనికి ఈయన కాఫిర్ అని భావించడంలేదు, అతని కుఫ్ర్ లో సందేహంపడి అల్లాహ్ మరియు ప్రవక్తను  వ్యతిరేకిస్తున్నాడు . మరియు అతను ఖుర్ఆన్ యొక్క సందేశాన్ని స్వీకరించలేదు, ఖురాన్ యొక్క సత్యతను స్వీకరించలేదు, మరియు ప్రవక్త గారి ఆజ్ఞ పాలన కూడా చేయలేదు. మరి  ఎవరైతే అల్లాహ్ మరియు ప్రవక్త సందేశాన్ని  స్వీకరించలేదో అతను కాఫిరే.  అల్లాహ్ మనందరిని రక్షించుగాక.

ఇంకా ఏ వ్యక్తి అయితే ముష్రిక్కులకు కాఫిరని భావించడో, ప్రకటించడో,  అతని వద్ద విశ్వాసం మరియు అవిశ్వాసం రెండు సమానమే, వీటి మధ్య ఎటువంటి భేదం, తేడా లేనట్టే. ఇందువల్లే అతను కాఫిర్ (అవిశ్వాసి) అవుతున్నాడు. (ఇది షేఖ్ సాలెహ్ అల్ ఫౌజాన్  గారి మాట, షర్హు నవాకిజుల్ ఇస్లాం అనే పుస్తకంలో 79వ పేజీలో వివరించారు)

అల్లాహ్ దాసులారా! ఒక కాఫిర్ ని కాఫిర్ అని భావించని వ్యక్తి వాస్తవానికి అతను ఇస్లాం మరియు కుఫ్ర్ మద్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించలేదు, అతనికి తెలియదు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన స్పష్టమైన ఆజ్ఞ.  ఖుర్ఆన్ లో అనేక చోట్ల అవిశ్వాసాన్ని తిరస్కరించడం జరిగింది మరియు ఇహ పరలోకాలలో అవిశ్వాసులకు పడే శిక్షలు గురించి ప్రస్తావన కూడా చేయడం జరిగినది.  ఏ వ్యక్తి అయితే ఒక కాఫిర్ ని కాఫిరని నమ్మడో అతను ముస్లిం అని అనిపించుకునే అర్హత అతనికి లేదు, ఎంతవరకు అంటే అతను ఇస్లాం మరియు అవిశ్వాసం మధ్య ఉన్న  వ్యత్యాసాన్ని గ్రహించి హృదయపూర్వకంగా  నోటి ద్వారా పూర్తిగా అవిశ్వాసానికి నాకు సంబంధం లేదు అని ప్రకటించనంతవరకు .

ఇంకా ఏ వ్యక్తి అయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఎవరినైతే కాఫిర్ అని స్పష్టం చేశారో అతన్ని కాఫిర్ అని భావించడో అతను అల్లాహ్ నిషేధించిన షిర్క్ ను హలాల్ గా ప్రకటించినట్టే,  ఎందుకంటే అల్లాహ్ మరియు ప్రవక్త ఒక   స్పష్టమైన ముష్రిక్ నీ అవిశ్వాసిగా ఖరారు చేస్తే ఇతను అతనిని కాఫిర్ అని నమ్మలేదు కాబట్టి. ఇలా చెయడం  అల్లాహ్ ఆజ్ఞకు వ్యతిరేకము. పైగా అల్లాహ్ తో పోరాడినట్టే. అల్లాహ్ ఆజ్ఞ ఇలా ఉన్నది:

قل تعالوا أتل ما حرم ربكم عليكم ألا تشركوا به شيئا
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ”రండి, మీ ప్రభువు మీపై నిషేధించిన వస్తువులు ఏవో మీకు చదివి వినిపిస్తాను. అవేమంటే; అల్లాహ్‌కు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి

ఇబ్నే సాది రహిమహుల్లాహ్ వారు ఈ విధంగా రాస్తున్నారు: “ఏ వ్యక్తులను అయితే ఇస్లాం షరియత్ ధర్మం కాఫిర్ అని ప్రకటించిందో  అతనిని కాఫిర్ అనటం తప్పనిసరి. మరి ఎవరైతే స్పష్టమైన ఆధారాల ద్వారా ఒక వ్యక్తి కాఫిర్ అని రుజువైన తర్వాత కూడా అతనిని కాఫిర్ అని భావించడో  అతను అల్లాహ్ మరియు ప్రవక్తను తిరస్కరించినట్టే. (ఫతావా అల్ సాదియా 98)

షేక్  అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ వారు అంటున్నారు: “ఎవరైతే ఒక వ్యక్తికి సంబంధించి అతని కుఫ్ర్ విషయంలో స్పష్టమైన ఆధారాలు రుజువు అయిన తర్వాత కూడా అతను కాఫిర్  అని నమ్మడో, ప్రకటించడో అతను కూడా ఆ వ్యక్తి (కాఫిర్) మాదిరిగానే. ఉదాహరణకు:  ఒక వ్యక్తి  ఒక యూదుడ్ని  ఒక నసరాని ను ( క్రైస్తవుడ్ని) లేదా కమ్యూనిస్టుని లేదా ఇలాంటి వాళ్లను కాఫిరని భావించడం లేదు. (వీళ్ళు కాఫిర్లు అని బహుకొద్ధి ధర్మ జ్ఞానం కలిగిన వాళ్ళకు  కూడా సందేహం లేదు).”  (మజ్మూ ఫతావా వ మఖాలాత్ ముతనవ్విఅహ్ (7/418) దారుల్ ఖాసిం, రియాజ్)

షేక్ సాలెహ్ అల్ ఫాజన్ హఫిజహుల్లాహ్ వారు అంటున్నారు: “ఎవరైతే ముష్రిక్ లను కాఫిర్లు అని నమ్మడో  వాడు కూడా  కాఫిర్ మరియు ముర్తదే  (ఇస్లాం నుంచి బహిష్కరించబడినట్టే). ఎందుకంటే అతని వద్ద ఇస్లాం మరియు కుఫ్ర్ రెండు సమానమే, అతను వీటి మధ్య వ్యత్యాసం చేయట్లేదు అందువలన అతను కాఫిర్”. (షర్హు నవాకిజుల్ ఇస్లాం పేజ్ 79)

అల్లాహ్ దాసులారా! తాగుత్ ను (అల్లాహ్ ను కాకుండా ఇతరులను ఆరాధ్యుడుగా చేసుకోవటం) తిరస్కరించటం చాలా విలువైనది, ప్రయోజకరమైనది. అల్లాహ్ ను విశ్వసించడం వలన తాగూత్ నిరాకరణ సంభవిస్తుంది. దానివల్లే దాసుడు పటిష్టమైన కడియాన్ని పట్టుకోవటం అనే ఈ ప్రక్రియ సంపూర్ణమవుతుంది ఇది అల్లాహ్ ఆజ్ఞలో ఈ విధంగా ఉన్నది:

(فَمَن يَكْفُرْ بِٱلطَّٰغُوتِ وَيُؤْمِنۢ بِٱللَّهِ فَقَدِ ٱسْتَمْسَكَ بِٱلْعُرْوَةِ ٱلْوُثْقَىٰ لَا ٱنفِصَامَ لَهَا).
ఎవరయితే  అల్లాహ్  తప్ప  వేరితర  ఆరాధ్యులను (తాగూత్ను)  తిరస్కరించి  అల్లాహ్ ను  మాత్రమే   విశ్వసిస్తారో  వారు  దృఢమైన  కడియాన్ని  పట్టుకున్నారు.

ఇది తహ్లియ(అలంకరణ) కన్నా తఖ్లియ(శుద్ధి) కు ప్రాధాన్యత ఇవ్వటం అవుతుంది. అంటే చెడును శుభ్రపరచి మంచిని అలంకరించటం.

అల్లాహ్ దాసులారా!  అబద్ధపు ధర్మాలు, మతాలను నిరాకరించటం ఐదు విషయాలను అవలంబించడం వల్ల జరుగుతుంది, సాధ్యమవుతుంది. (1) ఆ ధర్మాలు అసత్యము, అబద్ధమని విశ్వసించటము. (2) వాళ్ళను ఆరాధించకుండా ఉండటం, (3) వాటి పట్ల ద్వేషం కలిగి ఉండటం, (4) వాళ్ళను నమ్మి ఆరాధించే వాళ్ళను కాఫిర్లు గా భావించడం, (5) వాటి పట్ల శత్రుత్వం కలిగి ఉండటం. ఇవన్నీ షరతులు అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం రుజువు అవుతునాయి. అల్లాహ్ ఆదేశం:

(لقد كان لكم أسوة حسنة في إبراهيم والذين آمنوا معه إذ قالوا لقومهم إنا برءاء منكم ومما تعبدون من دون الله كفرنا بكم وبدا بيننا وبينكم العداوة والبغضاء أبدا حتى تؤمنوا بالله وحده)

ఓ ముస్లిములారా! మీకు   ఇబ్రాహీములోనూ, అతని వెంట  నున్న  వారిలోనూ   అత్యుత్తమమైన  ఆదర్శం  ఉంది.  వారంతా  తమ  జాతి  వారితో  స్పష్టంగా   ఇలా   చెప్పేశారు:  “మీతోనూ,  అల్లాహ్‌ను  వదలి  మీరు  పూజించే  వారందరితోనూ   మాకెలాంటి  సంబంధం  లేదు.  మేము  మిమ్మల్ని  (మీ  మిథ్యా  విశ్వాసాలను)   తిరస్కరిస్తు న్నాము.  ఒకే  ఒక్కడైన  అల్లాహ్‌ను  మీరు  విశ్వసించనంతవరకూ   మాకూ  –  మీకూ  మధ్య   శాశ్వతంగ  విరోధం,  వైషమ్యం  ఏర్పడినట్లే…

ఈ వాక్యం ద్వారా మూడు విషయాలు స్పష్టమవుతున్నాయి: అవిశ్వాసులతో  సంబంధం లేకపోవడం వ్యక్తం చేయడం, వాళ్ల ఆచరణ, షిర్క్ కి పాల్పడటం నుంచి సంబంధం లేదు అని వ్యక్తం చేయటము మరియు వాళ్ళ పట్ల కోపము ద్వేషము స్పష్టం చేయటము.

ఇక మిగిలిన మాట వాళ్ళ (అసత్య ధర్మాల దేవుళ్ళ) ఆరాధన అసత్యం అనే విషయం కలిగి ఉండటం అంటే ఇది ఈ వాక్యం ద్వారా స్పష్టం అవుతుంది. ఎందుకంటే అవి అసత్య ధర్మము అని మనం విశ్వసించనంతవరకు పైన పేర్కొనబడిన మూడు విషయాలు ఉనికిలోకి రావు.

ఇక అబద్ధపు ఆరాధ్యుల ఆరాధనను తిరస్కరించటము ఇంకా వాళ్లతో సంబంధం తెంచుకోవడానికి ఈ వాక్యం మనకు ఆధారము,  ఇందులో ప్రవక్త ఇబ్రాహీం తమ జాతి వారిని ఉద్దేశించి అంటున్నారు:

(وأعتزلكم وما تدعون من دون الله وأدعوا ربي عسى ألا أكون بدعاء ربي شقيا )     
నేను మిమ్మల్నీ, అల్లాహ్‌ను విడిచి  మీరు  మొరపెట్టుకునే  వారందరినీ  వదలి  పోతున్నాను. కేవలం  నా  ప్రభువును  మాత్రమే  వేడుకుంటాను. నా  ప్రభువుని  వేడుకుని  విఫలుణ్ణి   కానన్న  నమ్మకం  నాకుంది”  అని  (ఇబ్రాహీం)  చెప్పాడు.(5:15)

పై వాక్యంలో ఒక సూక్ష్మమైన విషయం దాగి ఉంది, అదేమిటంటే కుఫ్ర్ తో సంబంధం తెంచడం హృదయము, నాలుక, మరియు శరీర అవయవాల ద్వారా స్పష్టమవుతుంది. హృదయం నుంచి సంబంధం తెంచటం అంటే వాళ్లతో ద్వేషము మరియు వాళ్ళు అవిశ్వాసులు అన్న నమ్మకం కలిగి ఉండటంతోనే స్పష్టమవుతుంది , ఎలాగైతే ఖుర్ఆన్ వాక్యంలో  బోధించబడింది: ﴿كفرنا بكم﴾ .

నోటి నుంచి సంబంధం తెంచడం అనేది ప్రవక్త ఇబ్రాహీం వారి మాట ద్వారా స్పష్టమవుతుంది. ఆయన తమ జాతి వారు ముందు ఈ విధంగా ప్రకటించారు “ كفرنا بكم”

మరియు శరీర అవయవాల నుంచి సంబంధం తెంచటం ఈ వాక్యం ద్వారా మనకు స్పష్టమవుతుంది:

وَأَعْتَزِلُكُمْ وَمَا تَدْعُونَ مِن دُونِ اللَّهِ
నేను   మిమ్మల్నీ, అల్లాహ్‌ను విడిచి  మీరు  మొరపెట్టుకునే  వారందరినీ  వదలి  పోతున్నాను.

అల్లాహ్  దాసులారా: తాగూత్  నుంచి సంబంధం తెంచడం అనేది కేవలం ఆరాధన విషయంలో మాత్రం అంకితం కాదు, షిర్క్ మరియు కుఫ్ర్ లోని అన్ని రకాలలో ఇది వర్తిస్తుంది. ఉదాహరణకు : అల్లాహ్ కు లోపాలు ఆపాదించుటము లేదా ధర్మాన్ని ఎగతాళి  చేయటము లేదా సహబాలను తిట్టటం లేదా మాతృమూర్తులపై నింద మోపటము లేదా జిబ్రయిల్ వారు దౌత్య విషయంలో దగా, మోసం చేశాడని అనుమానించటము, లేదా యూద మతం క్రైస్తవ మతం బౌద్ధమతం ఇవన్నీ సత్యమే అని భావించడం, లేదా ఇలాంటి అవిశ్వాస చర్యలకు పాల్పడితే ఆ వ్యక్తి కాఫిర్ అవ్వటంలో ఎటువంటి సందేహం లేదు.

అల్లాహ్ దాసులారా!  ఇప్పటిదాకా వివరించిన విషయాల  ప్రకారం తౌహీద్ మరియు దాని వ్యతిరేకము అయిన షిర్క్ వివరణ స్పష్టం అయింది, తౌహీద్ విషయంలో పరస్పర ప్రేమ మరియు సంబంధాలు దాని యొక్క అర్థము స్పష్టమైనది , తౌహీద్ కి వ్యతిరేకమైన షిర్క్ నుంచి సంబంధం తెంచుకోవడం అనే విషయము అర్థం అయింది , దానిని తెలుసుకోవడం వల్ల హృదయము రుజుమార్గంపై నిలకడగా, స్థిరంగా ఉంటుంది, ఎందుకంటే ప్రతి వస్తువు యొక్క విలువ దాని  వ్యతిరేకం ద్వారానే  తెలుస్తోంది. ఒక కవి ఇలా అంటున్నాడు :

فالضِّد يظهر حسنه الضد   وبضِدها تتبين الأشياء
వ్యతిరేకం అనే పదానికి అందము దాని వ్యతిరేకంతోనే స్పష్టమవుతుంది,  మరియు వస్తువులు తమ వ్యతిరేకతతోనే అర్థమవుతాయి.

కనుక ఏ వ్యక్తికి అయితే షిర్క్ తెలియదో అతనికి తౌహీద్ కూడా తెలియదు, మరియు ఎవరైతే షిర్క్ నుంచి సంబంధం తెంచుకోడో అతను తౌహీద్ ని ఆచరణలోకి తీసుకురాలేదు.

అల్లాహ్ నాపై మరియు మీపై  ఖుర్ఆన్ యొక్క శుభాలను అనుగ్రహించు గాక! మనందరికీ వివేకంతో, హితోపదేశంతో కూడిన ఖురాన్ వాక్యాల నుంచి లాభం చేకూర్చు గాక! నేను ఇంతటితో నా మాటను ముగిస్తూ అల్లాహ్ తో మనందరి క్షమాపణ కొరకు ప్రార్థిస్తున్నాను, మరియు మీరు కూడా అల్లాహ్ తో క్షమాపణ కోరండి, నిస్సందేహంగా ఆయన క్షమించేవాడు మరియు అమిత దయామయుడు.

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అల్లాహ్ దాసులారా! అల్లాహ్ భీతి కలిగి ఉండండి. మరియు గుర్తుంచుకోండి! ఏ వ్యక్తి అయితే ఒక ముష్రిక్ ను కాఫిర్ గా భావించడంలో సందేహ పడతాడో అతను కూడా ఆ ముష్రిక్ మాదిరిగానే అవుతాడు. ఉదాహరణకు:  ఒక వ్యక్తి ఇలా అంటే: (నాకు తెలీదు యూదుడు కాఫీరో కాడో) లేక ఇలా అన్నా (నాకు తెలీదు క్రైస్తవులు కాపీర్లు లేక కాదో,) లేదా ఇలా అన్నా (నాకు తెలీదు అల్లాహ్ ను కాకుండా ఇతరులను మొరపెట్టుకునేవారు ముస్లిమో కాదో) లేదా ఇలా చెప్పినా  (నాకు తెలీదు ఫిరోన్ కాఫిరా కాదా అనేది) – ఇలా చెప్పిన వ్యక్తి కూడా కాఫిరే. ఇలా చెప్పటానికి కారణం ఏమిటంటే ఆ వ్యక్తి కుఫ్ర్ అనేది స్వతహాగా సత్యమా, అసత్యమా? అనే విషయంలో సందేహపడి ఉన్నాడు, కనుక అతను ఖచ్చితంగా ప్రకటించట్లేదు మరియు తాగూత్ ను  (మిద్య దైవారాధనను) కూడా తిరస్కరించట్లేదు. ఇక చూడబోతే అల్లాహ్ ఈ విషయాన్ని ఖురాన్లో స్పష్టంగా వివరించేశారు, అదేమిటంటే అవిశ్వాసం అసత్యమని, అబద్ధమని.  ఇది ఇలా స్పష్టమైనప్పటికీ కూడా దీంట్లో సందేహం కలిగి ఉంటే అతను ఖుర్ఆన్  లో వివరించబడిన ఆజ్ఞలను  విశ్వసించట్లేదు.

ఇంకో విషయం ఏమనగా ఇలా సందేహపడేవాడికి ఇస్లాంకి సంబంధించి ఏ అవగాహన లేదు. ఒకవేళ ఇస్లాం ధర్మం పట్ల అవగాహన ఉంటే అతని ముందు కుఫ్ర్ (ఇస్లాంకి వ్యతిరేకమైనది) స్పష్టమయ్యేది. మరి ఎవరికైతే ఇస్లాం పట్ల అవగాహన లేదో అతను ముస్లిం అని ఎలా అనబడతాడడు! ?.

షేక్ సులేమాన్ (*) బిన్ అబ్దుల్లా బిన్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హబ్ రహిమహుల్లాహ్ తమ పుస్తకం “ఔసఖు ఉరల్ ఇమాన్” లో అంటున్నారు: ఒకవేళ అతను వాళ్ళ కుఫ్ర్ విషయంలో సందేహపడినా లేదా వాళ్ళ కుఫ్ర్ కు సంబంధించి అవగాహన లేకపోయినా అలాంటి సమయంలో ఆ వ్యక్తి ముందు ఖుర్ఆన్ మరియు హదీస్ ఆధారాలు వివరించాలి. దానివల్ల వాళ్ళ కుఫ్ర్ (అవిశ్వాసం) స్పష్టమవుతుంది. దీని తర్వాత కూడా ఒకవేళ అతను వాళ్ళ కుఫ్ర్ విషయంలో సందేహంపడినా లేదా సంకోచంలో ఉన్నా ఆ వ్యక్తి కాఫిరే, ఎందుకంటే ఏ వ్యక్తి అయితే ఒక కాఫిర్ యొక్క కుఫ్ర్ విషయంలో సందేహం పడితే అతను కూడా కాఫిరే, ఈ విషయంలో ఉలమాలందరూ  ఏకీభవించి ఉన్నారు .

అల్లాహ్ దాసులారా!  ఎవరైతే అవిశ్వాసుల మతం సరైనదిగా  ప్రకటించాడో,  అతను వాళ్ళ కన్నా ఎక్కువగా మార్గభ్రష్టత్వానికి లోనై ఉన్నాడు.  ఎందుకంటే వాళ్ళ మతం అసత్యం అన్న విషయంలో సందేహానికి లోనై ఉన్నాడు, అతని కుఫ్ర్ (అవిశ్వాసం) అవిశ్వాసికన్నా ఎక్కువే. దీని వాస్తవం ఏమిటంటే ఎవరైతే కుఫ్ర్ ని సత్యంగా ప్రకటిస్తున్నాడో, అతడు ఇస్లాం ధర్మాన్ని అసత్యమని ప్రకటించినట్టే. అతను అసత్య ధర్మం కొరకు పోరాడినట్టే, దాని ప్రచారం చేస్తూ, దానిని సహకరించినట్టే, అవిశ్వాస ధర్మాన్ని ప్రచారం చేయటానికి విశాలమైన మైదానంలో సిద్ధమైనట్టే. (అల్లాహ్ మనందర్నీ కాపాడు గాక)

ఉదాహరణకు: ఒక వ్యక్తి ఇస్లాం కి వ్యతిరేకంగా విశ్వాసాన్ని (నమ్మకాన్ని) కలిగి ఉండి, దానిని  సరైనదిగా భావిస్తున్నాడో ఎలాగైతే యూద మతం  క్రైస్తవ మతం, సోషలిజం, సెక్యులరిజం లాంటివి, వీళ్ళందర్నీ సత్యమని భావించి లేదా ఈ ధర్మాలన్నీ ఒకటే అన్న భ్రమలో దాని వైపుకు ఆహ్వానించినా, ప్రచారం చేసినా, దావత్ ఇచ్చినా.

ఉదాహరణకు: యూద మతం, క్రైస్తవ మతం మరియు ఇస్లాం ధర్మం ఇవన్నీ ఇబ్రాహీం (అలైహిస్సలాం) వారి ధర్మమే అని ప్రచారం చేయడం, మరియు అధర్మ వాక్యాల ద్వారా ప్రజలను సందేహంలో, సంకోచంలో పడి వేయటము. ఇంకా యూదులు, క్రైస్తవులు మూసా మరియు ఈసా ప్రవక్త వారి యొక్క అనుయాయులే అని ప్రచారం చేయటం, ఇవన్నీ సత్యసత్యాలను తారుమారు చేయడమే.

ఎందుకంటే అల్లాహ్  ఇస్లాం ద్వారా మిగతా ధర్మాలన్నిటిని రద్దు చేశారు. ఒకవేళ మూసా మరియు ఈసా ప్రవక్తలు బ్రతికి ఉన్నా, వాళ్లు సత్య ధర్మంపై స్థిరంగా ఉన్నప్పటికీ  వాళ్లు కూడా ఇస్లాం ధర్మాన్నే అవలంబిస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే వాళ్ళు తెచ్చిన ధర్మాన్ని తారుమారు చేశారు, మార్పిడి చేశారు. అవి తమ అసలైన రూపంలో లేవు,  కనుక   తౌరాత్ ను కోల్పోయిన తర్వాత మూసా వారి ధర్మంలో వక్రీకరణ జరిగింది. మరియు యూదులు ఉజెర్ ప్రవక్తను ఆరాధించడం మొదలుపెట్టారు, ఇంకా ఆయన అల్లాహ్ కుమారుడని చెప్పటం మొదలుపెట్టారు. ప్రవక్త ఈసా వారిని అల్లాహ్ ఆకాశం వైపుకు ఆరోహణ చేసుకున్న తర్వాత ఆయన తీసుకొచ్చిన ధర్మంలో కూడా వక్రీకరణ మొదలై ఆయన అనుయాయులు శిలువను ఆరాధించడం మొదలుపెట్టారు. ఇక ఆయన అల్లాహ్ కుమారుడని, అల్లాహ్ ముగ్గురు దేవుళ్లలో ఒక్కడు  అని చెప్పటం మొదలెట్టారు. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా యూద మతం క్రైస్తవ మతం ఇస్లాం ధర్మం మూడు ఒకటే అని చెప్పటం సమంజసమేనా? ఆ ధర్మాల ద్వారా అల్లాహ్ ను ఆరాధించడం అనేది సమంజసమేనా?  కాదు ! ఎన్నటికీ సరైనది కాదు. అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నారు :

يَا أَهْلَ الْكِتَابِ قَدْ جَاءَكُمْ رَسُولُنَا يُبَيِّنُ لَكُمْ كَثِيرًا مِّمَّا كُنتُمْ تُخْفُونَ مِنَ الْكِتَابِ وَيَعْفُو عَن كَثِيرٍ ۚ قَدْ جَاءَكُم مِّنَ اللَّهِ نُورٌ وَكِتَابٌ مُّبِينٌ

ఓ గ్రంథవహులారా! మీ వద్దకు మా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చేశాడు. మీరు కప్పిపుచ్చుతూ ఉండిన గ్రంథంలోని ఎన్నో విషయాలను అతను మీ ముందు విపులీకరిస్తున్నాడు. మరెన్నో విషయాలను ఉపేక్షిస్తున్నాడు. అల్లాహ్‌ తరఫు నుంచి మీ వద్దకు జ్యోతి వచ్చేసింది. అంటే, స్పష్టమైన గ్రంథం వచ్చేసింది. (అల్ మాయిదా 5: 15)

మరో చోట ఇలా సెలెవిచ్చారు :

يَا أَهْلَ الْكِتَابِ قَدْ جَاءَكُمْ رَسُولُنَا يُبَيِّنُ لَكُمْ عَلَىٰ فَتْرَةٍ مِّنَ الرُّسُلِ أَن تَقُولُوا مَا جَاءَنَا مِن بَشِيرٍ وَلَا نَذِيرٍ ۖ فَقَدْ جَاءَكُم بَشِيرٌ وَنَذِيرٌ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

గ్రంథవహులారా! ప్రవక్తల ఆగమన క్రమంలో విరామం తర్వాత మా ప్రవక్త మీ వద్దకు వచ్చేశాడు. అతను మీకు స్పష్టంగా విడమరచి చెబుతున్నాడు. మా వద్దకు శుభవార్త అందించేవాడు, భయపెట్టేవాడు ఎవరూ రాలేదన్న మాట మీరు అనకుండా ఉండేందుకుగాను (ఈ ఏర్పాటు జరిగింది). అందుకే ఇప్పుడు నిజంగా శుభవార్త వినిపించేవాడు, భయపెట్టేవాడు మీ వద్దకు వచ్చేశాడు. అల్లాహ్‌ అన్నింటిపై అధికారం కలవాడు. (అల్ మాయిదా 5: 19)

ఇంకో చోట ఇలా ఆజ్ఞాపించారు :

وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ

ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు. ( ఆలే ఇమ్రాన్ 3: 85)

చివరిగా సారాంశం ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే అవిశ్వాసుల ధర్మాన్ని (యూధ మతం, క్రైస్తవ మతం) సత్యమని ప్రకటించాడో  అతను కూడా కాఫిరే.  అల్లాహ్ శరణం.

ఇదే విధంగా రవాఫిజ్ ల విశ్వాసం వైపుకు ఆహ్వానించడం కూడా వాళ్ల మాదిరిగా అయినట్టే, వాళ్లలో చేరిపోయినట్టే.

రవాఫిజ్ ల మతం: సమాధుల ఆరాధన, ఆహ్లె బైత్ (ప్రవక్త  గారి ఇంటి వాళ్ళను) ఆరాధించటం, ప్రవక్త గారి సున్నత్ ను తిరస్కరించటం, సహాబాలను కాఫిర్లు గా ప్రకటించటం, దైవదూతల నాయకుడైన జిబ్రయిల్ అమీన్ ను మరియు ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని అవమానించడం,  ఖుర్ఆన్ మరియు ప్రవక్త గారి దౌత్యాన్ని అవమానించడం.

ఇలాంటి విశ్వాసాలు కలిగి ఉన్న రవాఫిజ్ ల వైపుకు దావత్ ఇవ్వటము, వాళ్ళ విశ్వాసాలను అందంగా అలంకరించి ప్రకటించేవాళ్లు వీళ్ళలోనే తప్ప మరెవరో  కాదు. అందుకే అతను వాళ్ల మతం స్వీకరించ పోయినప్పటికీ కూడా వాళ్ళలాగా అవిశ్వాసియే, ఎందుకంటే అతను కుఫ్ర్ మరియు కపటాన్ని సత్యమే అని, సరైనదే అని భావించాడు కాబట్టి. అల్లాహ్ మనందరినీ దాన్నుంచి కాపాడుగాక

అల్లాహ్  దాసులారా!  తౌహీద్ మరియు దాని వ్యతిరేకాన్ని ( షిర్క్ ను) అర్థం చేసుకోవడానికి, దానికి పాల్పడకుండా  జాగ్రత్త పడడానికి ఇది చాలా ఉత్తమమైన సందర్భం. ముస్లింలు ముష్రిక్ లను అవిశ్వాసులని (కాఫిర్లు అని) భావించి, వాళ్ళ కుఫ్ర్ లో సందేహం పడకుండా, వాళ్ల  మతాన్ని సరైనదిగా భావించకుండా జాగ్రత్త పడటం తప్పనిసరి. ఈ మూడు విషయాలు ఇస్లాం నుంచి బహిష్కరించేవి. ప్రతి ముస్లిం పై తప్పనిసరి ఏమిటంటే ఎవరినైతే అయితే అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాఫిర్లు అని నిర్ధారించారో వారి కుఫ్ర్ గురుంచి  నమ్మకం కలిగి,  హృదయంలో ఎటువంటి సంకోచము సందేహం లేకుండా నమ్మాలి. (ఇది ప్రతి ముస్లిం పై తప్పనిసరి)

అల్లాహ్ ప్రజలందరికీ తౌహీద్ పై జీవితాంతం స్థిరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక, ఎందుకంటే ఏ వ్యక్తి అయితే షరియత్ ప్రకారం జీవితాన్ని గడుపుతాడో, స్థిరంగా  ఉంటాడో అతనికి తౌహీద్ పైనే మరణం లభిస్తుంది. అలాంటి వ్యక్తి ఎటువంటి ప్రశ్నోత్తరాలు లెక్క లేకుండా స్వర్గంలో ప్రవేశిస్తాడు .

మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అల్లాహ్ మిమల్ని గొప్ప సత్కార్యాన్ని గురుంచి ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశం:

إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما

నిశ్చయంగా   అల్లాహ్‌,  ఆయన  దూతలు  కూడా  దైవప్రవక్తపై  కారుణ్యాన్ని   పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా!  మీరు  కూడా  అతనిపై  దరూద్‌   పంపండి.  అత్యధికంగా  అతనికి  ‘సలాములు’  పంపుతూ  ఉండండి (33: 56)

اللهم صل وسلم على عبدك ورسولك محمد، وارض عن أصحابه الخلفاء، الأئمة الحنفاء، وارض عن التابعين ومن تبعهم بإحسان إلى يوم الدين.

ఓ అల్లాహ్! మాకు  ప్రపంచంలో మేలును, పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు. మరియు  నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.

للهم صل على نبينا محمد وآله وصحبه وسلِّم تسليما كثيرا

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

దైవ గ్రంధాల పై విశ్వాసం – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖుత్బా అంశము: దైవ గ్రంధాల పై విశ్వాసం  

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.     

ఓ ముస్లింలారా! నేను మీకు మరియు స్వయాన నాకు అల్లాహ్ యొక్క దైవభీతి కలిగి ఉండాలని ఉపదేశిస్తున్నాను. అల్లాహ్ తఆలా మన ముందు తరాల వారి కొరకు మరియు మన తర్వాత తరాల వారి కొరకు కూడా ఇదే ఉపదేశం చేయడం జరిగింది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.

 وَلَقَدۡ وَصَّيۡنَا ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ مِن قَبۡلِكُمۡ وَإِيَّاكُمۡ أَنِ ٱتَّقُواْ ٱللَّهَۚ

వాస్తవానికి మేము అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండమని, పూర్వం గ్రంథం ఇచ్చిన వారికీ మరియు మీకూ ఆజ్ఞాపించాము. (అల్ నిసా :131)

కనుక అల్లాహ్ తో భయపడండి, ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుండి దూరంగా ఉండండి.

తెలుసుకోండి! ఇస్లాం ధర్మంలో దైవ గ్రంథాలపై విశ్వాసం యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. ఇది విశ్వాస మూల స్థంభాలలో మూడవది. అల్లాహ్ తన దాసులపై కనుకరిస్తూ వారి సన్మార్గమునకై ప్రవక్త ద్వారా ఒక గ్రంథాన్ని కూడా పంపించాడు, కారణం ఇహపరాల సాఫల్యం.

అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:

[لَقَدۡ أَرۡسَلۡنَا رُسُلَنَا بِٱلۡبَيِّنَٰتِ وَأَنزَلۡنَا مَعَهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡمِيزَانَ]

నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వారితో పాటు గ్రంథాన్ని, ధర్మకాటాను కూడా అవతరింపజేశాము. (అల్ హదీద్ 57:25)

నిశ్చయంగా అల్లాహ్ తఆలా ఆయన అవతరింపజేసిన గ్రంథాలన్నిటిపై విశ్వాసం తేవడం విధిగా చేశాడు.

అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:

[قُولُوٓاْ ءَامَنَّا بِٱللَّهِ وَمَآ أُنزِلَ إِلَيۡنَا وَمَآ أُنزِلَ إِلَىٰٓ إِبۡرَٰهِ‍ۧمَ وَإِسۡمَٰعِيلَ وَإِسۡحَٰقَ وَيَعۡقُوبَ وَٱلۡأَسۡبَاطِ وَمَآ أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَمَآ أُوتِيَ ٱلنَّبِيُّونَ مِن رَّبِّهِمۡ لَا نُفَرِّقُ بَيۡنَ أَحَدٖ مِّنۡهُمۡ وَنَحۡنُ لَهُۥ مُسۡلِمُونَ]

(ముస్లిములారా!) మీరు ఇలా ప్రకటించండి: ”మేము అల్లాహ్‌ను విశ్వసించాము. మాపై అవతరింపజేయబడిన దానినీ, ఇబ్రాహీం, ఇస్మాయీల్‌, ఇస్‌హాఖ్‌, యాఖూబ్‌ మరియు వారి సంతతిపై అవతరింపజేయబడిన దానినీ, మూసా, ఈసా ప్రవక్తలకు వారి ప్రభువు తరఫున వొసగబడిన దానిని కూడా మేము విశ్వసించాము. మేము వారిలో ఎవరిమధ్య కూడా ఎలాంటి విచక్షణ (వివక్ష)ను పాటించము. మేము ఆయనకే విధేయులము.” (అల్ బఖర 2:136)

ఒకటి : అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాలు నిజమైనవి అని విశ్వాసం ఉంచాలి. ఉదాహరణకు అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు.

 [ءَامَنَ ٱلرَّسُولُ بِمَآ أُنزِلَ إِلَيۡهِ مِن رَّبِّهِۦ وَٱلۡمُؤۡمِنُونَۚ كُلٌّ ءَامَنَ بِٱللَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَكُتُبِهِۦ وَرُسُلِهِۦ]

తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా (సత్యమని నమ్మారు). వారంతా అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు (అల్ బఖర: 285)

గ్రంథ అవతరణ వహీ ద్వారా జరిగింది. వాస్తవంగా అల్లాహ్ తఆలా ఆకాశం నుండి భూమి పైకి వహీ తీసుకురావడానికి దైవదూతలను నియమించాడు. ఆ దూత పేరు జిబ్రయిల్ (అలైహిస్సలాం). ఈయన ప్రవక్తకు తన ప్రత్యేక గ్రంథాన్ని వెల్లడించాడు.

రెండో విషయం: ఏ గ్రంథాల గురించే అయితే మనకు తెలుసో వాటిని విశ్వసించడం. అవి ఆరు ఉన్నాయి. ఇబ్రహీం మరియు మూసా సహీఫాలు. తౌరాత్ మూసా (అలైహిస్సలాం) వారిపై అవతరింప చేయబడిన గ్రంథం, ఇంజీల్ ఈసా (అలైహిస్సలాం) వారిపై అవతరింప చేయబడిన గ్రంథం. జబూర్ దావూద్ (అలైహిస్సలాం) వారిపై అవతరింప చేయబడిన గ్రంథం మరియు ఖుర్ఆన్  మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై అవతరింప చేయడం జరిగింది.  కొంతమంది పండితుల అభిప్రాయం ఏమిటంటే మూసా సహీఫాలు మరియు తౌరాత్ ఒక్కటే అయితే ఈ విధంగా ఐదు పేర్లు అవుతాయి. మరియు అదే విధంగా ఏ గ్రంధాల గురించైతే మనకు తెలియదో వాటిపై కూడా మనం పరిపూర్ణంగా విశ్వాసం తీసుకురావాలి.

మూడో విషయం: దైవ ప్రవక్తలపై ఏ గ్రంథాలు అయితే అవతరించాయో వాటిపై మాత్రమే విశ్వాసముంచాలి. ఏ గ్రంధాలలోనైతే మార్పు చేర్పులు జరిగాయో వాటి పై విశ్వాసం ఉంచరాదు. ఉదాహరణకు మూసా ప్రవక్తపై అవతరింప చేయబడిన తౌరాత్ ను విశ్వసించాలి మరియు ఈసా ప్రవక్త పై అవతరించబడిన ఇంజీల్ గ్రంథం పై విశ్వాసం ఉంచాలి. ఇవి అసలు గ్రంథాలు. కానీ ఇప్పుడు ఏ గ్రంధాలైతే యూదులు చేతుల్లో మరియు క్రైస్తవుల చేతుల్లో ఉన్నాయో అవి మార్పులకు లోనయ్యాయి. గ్రంథాలకు అవే పేర్లు పెట్టినప్పటికీ వారు తమ పూర్వీకులు చెప్పినటువంటి విషయాలను అందులో చేర్చారు మరియు ఇవే అసలు గ్రంథాలని ప్రకటించారు. మరియు సంవత్సరాల తరబడి  ప్రజలు ఆ కల్పిత కథనాలను పాటించుకుంటూ వారు మార్గభష్టత్వానికి లోనయ్యారు మరియు ప్రజలను కూడా మార్గభష్టత్వానికి లోను చేశారు. కనుక గతించిన ప్రవక్తలపై అవతరింపజేసిన గ్రంథాలు మార్పు చేర్పులకు లోనవడం వలన అల్లాహ్ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపచేయబడినటువంటి దివ్య ఖుర్ఆన్ యొక్క రక్షణ బాధ్యతను స్వయంగా అల్లాహ్ నే తీసుకున్నాడు. అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు.

[إِنَّا نَحۡنُ نَزَّلۡنَا ٱلذِّكۡرَ وَإِنَّا لَهُۥ لَحَٰفِظُونَ]

మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము (అల్ హిజ్ర్ :9)

ఈ వాక్యంలో జిక్ర్ అనగా ఖురాన్ అనే భావం

నాల్గొవ విషయం: ఏ విషయాలు అయితే ఆ గ్రంథాల ద్వారా వెల్లడించబడ్డాయో వాటిని సత్యమని నమ్మడం. ఉదాహరణకు ఖుర్ఆన్  మరియు ఖుర్ఆన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలు, వాటిలో మార్పు చేర్పులకు గురికాకుండా ఉన్నటువంటి సంఘటనలు. అదేవిధంగా ఖుర్ఆన్ తెలియచేయనటువంటి విషయాలను మేము ధ్రువీకరించము మరియు తిరస్కరించం, ఎందుకంటే మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసులో ఇలా వచ్చింది – ఏదైతే గ్రంథ ప్రజలు మీకు తెలియ పరుస్తారో దానిని మీరు సత్యం లేక అసత్యం అని అనకండి,  ఈ విధంగా అనండి – “మేము అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పై విశ్వాసం తెచ్చాము“. ఎందుకంటే ఒకవేళ వారి మాట సత్యం అయితే ధ్రువీకరించినట్లు అవుతుంది మరియు అసత్యం అయితే దానిని తిరస్కరించినట్లు అవుతుంది (అబూ దావూద్-3644)

ఐదొవ విషయం: ఆ గ్రంథాలలో ఉన్నటువంటి ఆదేశాలు ఏవైతే రద్దు కాలేదో వాటిపై ఆచరించడం. ఉదాహరణకు: అల్లాహ్ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు.

[يُرِيدُ ٱللَّهُ لِيُبَيِّنَ لَكُمۡ وَيَهۡدِيَكُمۡ سُنَنَ ٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ وَيَتُوبَ عَلَيۡكُمۡۗ]

అల్లాహ్‌ మీకు (ధర్మాధర్మాలను) విడమరచి చెప్పాలనీ, మీ పూర్వీకుల్లోని (సజ్జనుల) మార్గంపై మిమ్మల్ని నడిపించాలనీ, మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాలని అభిలషిస్తున్నాడు (అల్ నిసా :26)

మరోచోట ఇలా తెలియజేస్తున్నాడు.

 [أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ هَدَى ٱللَّهُۖ فَبِهُدَىٰهُمُ ٱقۡتَدِهۡۗ]

అల్లాహ్‌ సన్మార్గం చూపించినటువంటివారు వీరే. కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు కూడా వారి మార్గాన్నే అనుసరించు (అల్ అన్ ఆమ్ :90)

ఆ ఆదేశాలలో ఖిసాస్ (ప్రతీకారం) కు సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఉన్నాయి. అల్లాహ్ తఆలా తౌరాత్ గురించి ప్రస్తావిస్తూ ఇలా తెలియజేశాడు.

وَكَتَبْنَا عَلَيْهِمْ فِيهَا أَنَّ النَّفْسَ بِالنَّفْسِ وَالْعَيْنَ بِالْعَيْنِ وَالْأَنفَ بِالْأَنفِ وَالْأُذُنَ بِالْأُذُنِ وَالسِّنَّ بِالسِّنِّ وَالْجُرُوحَ قِصَاصٌ ۚ فَمَن تَصَدَّقَ بِهِ فَهُوَ كَفَّارَةٌ لَّهُ ۚ وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ

(మేము తౌరాతు గ్రంథంలో యూదుల కోసం ఒక శాసనాన్ని లిఖించాము: (దీని ప్రకారం) ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పంటికి బదులు పన్ను. అలాగే కొన్ని ప్రత్యేక గాయాల కోసం కూడా (సరిసమానంగా) ప్రతీకారం ఉంది. కాని ఎవరయినా క్షమాభిక్ష పెడితే అది అతని పాలిట పరిహారం (కప్ఫారా) అవుతుంది. అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగా తీర్పు ఇవ్వనివారే దుర్మార్గులు.) (అల్ మాయిదా : 45)

మరియు ఈ ఆజ్ఞ మన షరీఅత్ (చట్టం)లో కూడా భాగమై ఉంది. దీనిపై ఆచరించడం కూడా జరుగుతుంది అని విశ్వసించాలి. మన ధర్మం దీనికి విరుద్ధం కాదు మరియు ఈ ఆజ్ఞ రద్దు చేయబడలేదు.

ఆరవ విషయం: ఈ గ్రంథాలు మానవులందరినీ ఒకే ధర్మం వైపునకు ఆహ్వానిస్తాయి అని విశ్వసించడం. దీనినే తౌహీద్ అంటారు. తౌహీద్  మూడు రకాలు. 1. తౌహీదె ఉలూహియత్  2. తౌహీదె రుబూబియత్ 3. తౌహీదె అస్మా వసిఫాత్.

ఏడవ విషయం: ఖురాన్ గ్రంథం పూర్వ గ్రంథాలను ధ్రువీకరిస్తుంది. మరియు వాటిపై ఆధిపత్యం కలిగినటువంటిది. మరియు పూర్వ గ్రంథాలను పరిరక్షిస్తుంది. పూర్వ గ్రంథాలన్నీ కూడా ఈ దివ్య ఖురాన్ ద్వారానే రద్దు చేయబడ్డాయి. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

[وَأَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ مُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ مِنَ ٱلۡكِتَٰبِ وَمُهَيۡمِنًا عَلَيۡهِۖ]

ఇంకా (ఓ ప్రవక్తా!) మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్య సమేతంగా అవతరింపజేశాము. అది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరిస్తుంది, వాటిని పరిరక్షిస్తుంది. (అల్ మాయిదా :48)

ఇబ్న్ తైమియా (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు : “ఖురాన్ లో ఇలానే ఉంది, అల్లాహ్ మరియు అంతిమ దినం గురించి పూర్వ గ్రంథాలలో వచ్చిన వార్తలు ధృవీకరించబడ్డాయి మరియు మరింత వివరంగా  పేర్కొనబడ్డాయి. ఈ విషయాలపై. స్పష్టమైన రుజువులు మరియు వాదనలు సమర్పించబడ్డాయి. అదేవిధంగా, ప్రవక్తలందరి ప్రవక్త పదవులు మరియు సందేశహరుల సందేశం అంగీకరించబడింది. మరియు అదే విధంగా ప్రవక్తల ద్వారా పంపబడిన అన్ని చట్టాలను అంగీకరించడం జరిగింది, మరియు వివిధ ఆధారాల ద్వారా మరియు స్పష్టమైన రుజువుల ద్వారా ప్రవక్తలను మరియు గ్రంథాలను తిరస్కరించిన వారితో చర్చలు వాదన చేయటం. అదేవిధంగా అల్లాహ్ వారికి విధించిన శిక్షలను గురించి మరియు గ్రంథాలను అనుసరించే వారికి అల్లాహ్ చేసే సహాయాన్ని గురించి మరియు గ్రంథవహులు మునుపటి గ్రంధాలలో  జరిపిన మార్పుల గురించి  మరియు వక్రీకరణల గురించి  అల్లాహ్ ప్రస్తావించాడు. గ్రంథాలలో వారు చేసిన పనులను, అలాగే వారు దాచిన అల్లాహ్ ఆజ్ఞలను కూడా పేర్కొన్నాడు. మరియు ప్రతి ప్రవక్త తీసుకువచ్చిన షరీఅత్ చట్టం గురించి తెలియజేయడం జరిగింది. మరియు అలానే పవిత్ర ఖుర్ఆన్ గురించి తెలియపరచడం జరిగింది. అందువల్ల, పవిత్ర ఖురాన్ అనేక విధాలుగా మునుపటి గ్రంథాల కంటే ఆధిక్యతను  ప్రాధాన్యత పొందింది. ఈ ఖుర్ఆన్ గ్రంథాల ప్రామాణికతకు సాక్షి మరియు ఈ గ్రంథాలలోని వక్రీకరణల అబద్ధానికి సాక్షి.” (మజ్ మూఅల్ ఫతావా17/44)

ఆయన ఇంకా ఇలా తెలియజేశారు “ఖుర్ఆన్ విషయానికొస్తే, ఇది స్వతంత్ర గ్రంథం. దానిని విశ్వసించిన వారికి మరే ఇతర గ్రంథం అవసరం లేదు. ఈ ఖుర్ఆన్ మునుపటి అన్ని గ్రంధాల లక్షణాల కలయిక మరియు ఇతర గ్రంథాలలో ఉన్న అనేక లక్షణాలను కలిగి ఉంది. అందుకే ఈ గ్రంధం మునుపటి గ్రంధాలన్నింటిని ధృవీకరిస్తుంది మరియు అన్నింటికంటే శ్రేష్ఠమైనది. ఇది మునుపటి పుస్తకాలలోని సత్యాన్ని రుజువు చేస్తుంది మరియు వాటిలోని తిరోగమనాలను తిరస్కరిస్తుంది. మరియు అల్లాహ్ ఏ ఆజ్ఞలను రద్దు చేశాడో, ఇది వాటిని రద్దు చేస్తుంది, కాబట్టి ఈ ధర్మం సత్యాన్ని రుజువు చేస్తుంది, ఇది మునుపటి గ్రంథాలలో బలమైన భాగం, మరియు ఈ గ్రంధాలు మారిన మతాన్ని చెల్లుబాటు చేయవు, ఈ గ్రంథాలలో రద్దు చేయబడిన విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి“. (మజ్ మూఅల్ ఫతావా 19/184-185)

[1] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో మొదటిది:- కేవలం అల్లాహ్ ని మాత్రమే ఆరాధించాలి. ఆయన ఆరాధనలో ఎవరిని సాటి కల్పించకూడదు, వారు ఎవరైనా సరే, విగ్రహం అయినా, మనుషులైనా ప్రవక్తలైనా, రాళ్ళు అయినా, ఇక వేరే ఇతర ఏ వస్తువులైనా సరే సాటి కల్పించరాదు. దీన్నిబట్టి అర్థం అవుతున్నటువంటి విషయం దైవ ప్రవక్తలందరి ధర్మం ఒక్కటే, వాళ్ళు కేవలం అల్లాహ్ ని మాత్రమే ఆరాధించేవారు.

[2] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో రెండవది:- విశ్వాస ప్రాథమిక విషయాలపై విశ్వాసం ఉంచడం. అవేమిటంటే అల్లాహ్ పై, దైవదూతలపై, దైవ గ్రంథాలపై, దైవ ప్రవక్తలపై,  ప్రళయ దినంపై, విధిరాత మంచి చెడు అవడంపై విశ్వాసం ఉంచాలి.

[3] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో మూడవది:- ప్రత్యేక ఆరాధనలను కేవలం అల్లాహ్ కొరకు విధిగా చేయడం. ఉదాహరణకు నమాజ్, జకాత్, రోజా మొదలైనవి. కానీ ప్రవక్తల రాకడ ప్రకారంగా ఆరాధనలు నిర్వహించబడే విధానములు విభిన్నంగా ఉన్నాయి. ఉదాహరణకు తౌరాత్ గ్రంథం కూడా నమాజ్ చదవమని ఆజ్ఞాపిస్తుంది మరియు ఇంజీల్ గ్రంథం కూడా నమాజ్ నమాజ్ చదవమని ఆజ్ఞాపిస్తుంది. అదే విధంగా ఖురాన్ గ్రంథం కూడా నమాజ్ గురించి ఆజ్ఞాపిస్తుంది. కానీ నమాజ్ విధానము, నమాజ్ ఆచరించే సమయము ఈ మూడు మతాలలో వేరువేరుగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఉపవాసం యొక్క ఆజ్ఞ కూడా అంతే.

షరియత్ యొక్క వివరణాత్మక తీర్పులకు సంబంధించినంతవరకు, సాధారణ పరంగా అన్ని గ్రంధాలు ఈ విషయాన్ని అంగీకరిస్తాయి, అయితే కొన్నిసార్లు అవి అల్లాహ్ యొక్క జ్ఞానం మరియు అతని ఆధిపత్యానికి అనుగుణంగా ఉంటాయి  ఎందుకంటే అల్లాహ్ కు తన దాసులకు ఏది మేలో తెలుసు కాబట్టి ఆయన దానికి తగినటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు. అల్లాహ్  ఇలా అంటున్నాడు :

[وَرَبُّكَ يَخۡلُقُ مَا يَشَآءُ وَيَخۡتَارُۗ مَا كَانَ لَهُمُ ٱلۡخِيَرَةُۚ]

(నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు.)(అల్ ఖసస్ :68)

మరోచోట ఇలా అంటున్నాడు:

[لِكُلّٖ جَعَلۡنَا مِنكُمۡ شِرۡعَةٗ وَمِنۡهَاجٗاۚ]

(మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ఒక విధానాన్ని, మార్గాన్నీ నిర్ధారించాము.)(అల్ మాయిదా:48)

ఉదాహరణకు అల్లాహ్ తఆలా వేటినైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్ కొరకు హలాల్ అనగా ధర్మ సమ్మతం చేశాడో వాటిలో కొన్నింటిని తన జ్ఞానము మరియు వివేకంతో బనీ ఇస్రాయీల సమాజంపై వాటిని నిషిద్ధం చేశాడు. అవి వారి కంటే ముందు ధర్మసమ్మతం గావించబడినవి.

 అల్లాహ్ ఇలా అంటున్నాడు:

[فَبِظُلۡمٖ مِّنَ ٱلَّذِينَ هَادُواْ حَرَّمۡنَا عَلَيۡهِمۡ طَيِّبَٰتٍ أُحِلَّتۡ لَهُمۡ وَبِصَدِّهِمۡ عَن سَبِيلِ ٱللَّهِ كَثِيرٗ]

యూదుల దుర్మార్గం వల్ల వారికి ధర్మసమ్మతంగా ఉన్న అనేక పరిశుద్ధ వస్తువులను మేము వారికోసం నిషేధించాము. వారు ఎంతో మందిని దైవమార్గం నుంచి అడ్డుకోవటం వల్లనూ (అల్ నిసా:160)

[4] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో నాల్గవది:- న్యాయం యొక్క ఆజ్ఞ. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

[لَقَدۡ أَرۡسَلۡنَا رُسُلَنَا بِٱلۡبَيِّنَٰتِ وَأَنزَلۡنَا مَعَهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡمِيزَانَ لِيَقُومَ ٱلنَّاسُ بِٱلۡقِسۡطِۖ]

నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వారితో పాటు గ్రంథాన్ని, ధర్మకాటాను కూడా అవతరింపజేశాము  ప్రజలు న్యాయంపై నిలిచి ఉండటానికి! (అల్ హదీద్ :25)

[5] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో ఐదొవది:- ఐదు విషయాలను తప్పక కాపాడుకోవాలి అనే ఆజ్ఞాపించబడింది. అవి ఏమిటంటే ధర్మం, విశ్వాసం, ధనము, గౌరవము మరియు ప్రాణం.

[6] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో ఆరవది:- మంచి నైతికత గురించి ఆజ్ఞాపించడం జరిగింది మరియు చెడు నడవడిక నుండి వారించడం జరిగింది. ఉదాహరణకు: గ్రంథాలన్నీటిలో తల్లిదండ్రులకు విధేయత చూపాలని మరియు బంధువులతో బాంధవ్యాలు కలుపుకోవాలని,  అతిధులకు గౌరవ మర్యాదలు చేయాలని, నిరుపేదలను ఆదుకోవాలని అనేటువంటి ఆజ్ఞలను జారీ చేయడం జరిగింది. అదే విధంగా చెడును వారించడం ఉదాహరణకు: దౌర్జన్యం, తిరుగుబాటు, తల్లిదండ్రుల అవిధేయత, ఒకరి గౌరవ మర్యాదలతో ఆడుకోవడం, అబద్ధం, దొంగతనం, చాడీలు చెప్పడం, గీబత్  మొదలైనవి.

దైవ గ్రంథాలపై విశ్వాసం గురించి కొన్ని లాభదాయకమైనటువంటి విషయాలు మీ ముందు ఉంచడం జరిగింది. అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక. ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరిని క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాతాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.   

స్తోత్రం మరియు దరూద్ తరువాత

తెలుసుకోండి! అల్లాహ్ మీపై కరుణించు గాక. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు – ఆకాశం నుంచి అవతరింప చేయబడిన గ్రంథాలలో గొప్ప గ్రంధాలు రెండు ఉన్నాయి. అవి తౌరాత్ మరియు ఖుర్ఆన్. దివ్య ఖురాన్ లో అనేకచోట్ల ఈ రెండు గ్రంథాల ప్రస్తావన ఒకేసారి వచ్చింది. ఎందుకంటే ఈ రెండు గ్రంథాలు ఉన్నతమైనవి మరియు ఈ రెండు గ్రంథాల లో ఉన్నటువంటి చట్టము పరిపూర్ణం గావించబడినది.

ఓ అల్లాహ్ దాసులారా! నిశ్చయంగా ఖుర్ఆన్ అన్ని గ్రంథాల కంటే ఎంతో ఉన్నతమైనది. అందుకే అల్లాహ్ ఈ ఖురాన్ కు పూర్వ గ్రంథాలన్నీటిపై ఆధిక్యతను ప్రసాదించాడు. ఈ గ్రంథంలో ఇతర గ్రంథాలలో లేని అద్భుతాలు మరియు జ్ఞానానికి సంబంధించినటువంటి ఎన్నో మేలైన విషయాలు ఉన్నాయి.

ఖురాన్ అనగా ఇది అల్లాహ్ యొక్క వాక్యము. దీని ద్వారా అల్లాహ్ మాట్లాడాడు. అల్లాహ్ మాట్లాడినటువంటి వాక్యాలను జిబ్రాయిల్ దూత ద్వారా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి వరకు చేరవేయబడ్డాయి తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు ఆ వాక్యాలను తన అనుచరులు వరకు చేర్చారు. వారు  ఖుర్ఆన్ ను తమ హృదయాలలో భద్రపరుచుకున్నారు. వాటిని ఆకులపై లేక కాగితాలపై లిఖించి భద్రపరిచారు. ఆ తర్వాత మూడవ ఖలీఫా ఉస్మాన్ (రదియల్లాహు అన్హు ) గారి పరిపాలనలో ఒక పుస్తక రూపంలో సంకలనం చేశారు. ఆ తర్వాత దాని నుంచి అనేక  కాపీలను చేసి ప్రచురించడం జరిగింది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

[إِنَّا نَحۡنُ نَزَّلۡنَا ٱلذِّكۡرَ وَإِنَّا لَهُۥ لَحَٰفِظُونَ]

మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము (అల్ హిజ్ర్ :9)

[1] ఈ ఖుర్ఆన్ అవతరణకు గల ఒక వివేకం ఏమిటంటే: ఆ ఖుర్ఆన్ యొక్క వాక్యాల పై యోచన చేసి బుద్ధిమంతులు ఉపదేశం పొందాలి అని మరియు వారిలో దైవభీతి జనించాలని. అల్లాహ్ ఇలా అంటున్నాడు :

[كِتَٰبٌ أَنزَلۡنَٰهُ إِلَيۡكَ مُبَٰرَكٞ لِّيَدَّبَّرُوٓاْ ءَايَٰتِهِۦ وَلِيَتَذَكَّرَ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ]

ఇదొక శుభప్రదమైన గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటందుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చుకునేందుకు మేము దీనిని నీ వైపుకు పంపాము. (సాద్ : 29)

ఒకచోట ఇలా సెలవిస్తున్నాడు:

 [وَكَذَٰلِكَ أَنزَلۡنَٰهُ قُرۡءَانًا عَرَبِيّٗا وَصَرَّفۡنَا فِيهِ مِنَ ٱلۡوَعِيدِ لَعَلَّهُمۡ يَتَّقُونَ أَوۡ يُحۡدِثُ لَهُمۡ ذِكۡرٗا]

ఇదే విధంగా (ఓ ప్రవక్తా!) మేము దీనిని నీపై అరబ్బీ ఖుర్‌ఆన్‌గా అవతరింపజేశాము. ప్రజలు భయభక్తులు కలిగి ఉండగలందులకు, లేదా వారిలో ధర్మచింతన రేకెత్తేందుకు పలు విధాలుగా ఇందులో భయబోధ చేశాము. (తహా :113)

[2] మరొక వివేకవంతమైన విషయం ఏమిటంటే: దైవభీతిపరులకు ప్రతిఫలం ప్రసాదించుటకు మరియు తిరస్కారుల కొరకు శిక్ష ఉందని హెచ్చరించుటకు.

ఇలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

[ فَإِنَّمَا يَسَّرۡنَٰهُ بِلِسَانِكَ لِتُبَشِّرَ بِهِ ٱلۡمُتَّقِينَ وَتُنذِرَ بِهِۦ قَوۡمٗا لُّدّٗا]

నువ్వు ఈ గ్రంథం ఆధారంగా భయభక్తులు గలవారికి శుభవార్తను వినిపించటానికీ, తగవులమారులను హెచ్చరించ టానికీ దీనిని నీ భాషలో చాలా సులభతరం చేశాము. (మర్యమ్ :97)

[3] మరొక వివేకవంతమైన విషయం ఏమిటంటే: ధర్మ ఆదేశాలను ప్రజలకు తెలియజేయడానికి అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు.

[وَأَنزَلۡنَآ إِلَيۡكَ ٱلذِّكۡرَ لِتُبَيِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ إِلَيۡهِمۡ وَلَعَلَّهُمۡ يَتَفَكَّرُونَ]

(అలాగే) ప్రజల వద్దకు పంపబడిన దానిని నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పేందుకు, తద్వారా వారు యోచన చేసేందుకుగాను మేము నీపై ఈ జ్ఞాపిక (గ్రంథము)ను అవతరింపజేశాము (అల్ నహ్ల్ :44)

మరొకచోట ఇలా అంటున్నాడు.

 [وَمَآ أَنزَلۡنَا عَلَيۡكَ ٱلۡكِتَٰبَ إِلَّا لِتُبَيِّنَ لَهُمُ ٱلَّذِي ٱخۡتَلَفُواْ فِيهِ]

వారు విభేదించుకునే ప్రతి విషయాన్నీ నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పాలని మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. (అల్ నహ్ల్ :64)

[4] మరోక వివేకవంతమైన విషయమేమిటంటే: విశ్వాసులు తమ విశ్వాసంపై స్థిరంగా ఉండాలని.

అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు

[قُلۡ نَزَّلَهُۥ رُوحُ ٱلۡقُدُسِ مِن رَّبِّكَ بِٱلۡحَقِّ لِيُثَبِّتَ ٱلَّذِينَ ءَامَنُواْ وَهُدٗى وَبُشۡرَىٰ لِلۡمُسۡلِمِينَ]

ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “విశ్వసించిన వారికి నిలకడను వొసగటానికి, ముస్లింలకు సన్మార్గం చూపటానికీ, వారికి శుభవార్తను వినిపించటానికీ నీ ప్రభువు వద్ద నుంచి పరిశుద్ధాత్మ (జిబ్రయీల్‌) దీన్ని సత్యసమేతంగా అవతరింపజేశాడు.” (అల్ నహ్ల్ :64)

[5] మరొక వివేకవంతమైన విషయం ఏమిటంటే : ప్రజల మధ్య ఖుర్ఆన్ ద్వారా తీర్పు జరగాలని.

అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.

 [إِنَّآ أَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ لِتَحۡكُمَ بَيۡنَ ٱلنَّاسِ بِمَآ أَرَىٰكَ ٱللَّهُۚ]

(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ నీకు చూపిన విధంగా నీవు ప్రజల మధ్య తీర్పు చెయ్యటానికిగాను మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్యంతోపాటు పంపాము.) (అల్ నిసా : 105)

ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి. అల్లాహ్ మీపై కరుణించుగాక . అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యానికై  అజ్ఞాపించి ఉన్నాడాని మీరు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ ఇలా అన్నాడు.

 [إِنَّ ٱللَّهَ وَمَلَٰٓئِكَتَهُۥ يُصَلُّونَ عَلَى ٱلنَّبِىِّۚ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ صَلُّوا۟ عَلَيْهِ وَسَلِّمُوا۟ تَسْلِيمًا] 

నిశ్చయంగా అల్లాహ్‌, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింప చేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు.

ఓ అల్లాహ్! ఇస్లాం, ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు. ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు, మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారిగా చేయి. ఓ అల్లాహ్ మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని, పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు. ఆమీన్

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

దైవ గ్రంధాలపై విశ్వాసం (మెయిన్ పేజీ ):
https://teluguislam.net/belief-in-books/

జాదు (చేతబడి) – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

[డౌన్లోడ్ తెలుగు PDF] – [డౌన్లోడ్ అరబిక్ PDF]

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ [آل عمران 102]. يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا [النساء 102]. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا * يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَمَنْ يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا [الأحزاب 70، 71].

స్తోత్రములు మరియు దరూద్ తరువాత:

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.      

అల్లాహ్ దాసులారా!  చేతబడి అంటే తాయత్తులపై, ముడులపై, మందులపై మంత్రాలు చదివి ఊదటం. దాని ద్వారా శరీరాలు, హృదయాలు ప్రభావితమవుతాయి. దానివల్ల వ్యక్తి వ్యాధి బారిన పడతాడు లేదా మరణిస్తాడు, లేదా మనిషి ఆలోచనలను, ఊహలను ప్రభావితం చేస్తుంది, లేదా భార్య భర్తలను వేరు చేయటము లేదా కలిసి వ్యాపారం చేస్తున్న ఇద్దరు స్నేహితులను వేరు చేయటము జరుగుతుంది. (అల్ ముగ్ని కితాబుల్ ముర్తద్)

అల్లాహ్ దాసులారా! చేతబడిలో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి: హఖీఖి (వాస్తవమైనది). రెండవది: తఖయ్యులాతి (ఊహలు మరియు అంచనాలు).

హాఖీఖిలో మూడు రకాలు ఉన్నాయి: 

మొదటిది శరీరం పై ప్రభావం చూపిస్తుంది, దానివల్ల వ్యక్తి వ్యాధి బారిన పడతాడు లేదా మరణిస్తాడు. 

రెండవ రకములో  మానవ హృదయం పై ప్రేమ లేదా ద్వేషము ద్వారా  ప్రభావం చూపిస్తుంది, ఉదాహరణకు: భార్యను ద్వేషిస్తున్న భర్త మనసులో భార్య ప్రేమను సృష్టించడం, లేదా దానికి విరుద్ధము. దీని వల్లనే భర్త భార్యకు లేదా భార్య భర్తకు అందంగా కనిపించడం జరుగుతుంది (దీనినీ అరబిలో “అత్ ఫ్ ” అనే పేరుతో గుర్తిస్తారు) లేదా ప్రేమిస్తున్న భార్యకు భర్త దృష్టిలో శత్రువు లాగా చూపిస్తారు, దీని వల్ల భార్య భర్తకు, భర్త భార్యకు శత్రువు లాగా కనిపిస్తూ ఉంటారు (దీనినీ అరబీలో “సర్ ఫ్” అంటారు).

మూడో రకం ద్వారా మనిషి భ్రమ పడుతూ ఉంటాడు: నేను ఆ పని చేశాను, వాస్తవానికి ఆ పని అతను చేసి ఉండడు.  ఈ చేతబడి యొక్క ఉదాహరణ: లబీద్ బిన్ ఆసిం అనే యూదుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారికి చేతబడి చేసాడు. దాని వల్ల ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) వారు ఏదైనా పని చేశారని అనుకునేవారు కానీ వాస్తవానికి ఆ పని చేసి ఉండరు. ఈ విధంగా ఎన్నో నెలల వరకు ప్రవక్త వారిపై ఆ చేతబడి ప్రభావం ఉండేది (ఈ సంఘటన బుఖారి, ముస్లిమ్లలో వివరించబడినది)

అల్లాహ్ దాసులారా!  చేతబడి చేసేవాడు  మంత్రాల ద్వారా షైతాన్ నుండి సహయం తీసుకుంటాడు, అది ఎలా అంటే: మాంత్రికుడు అతి చెడ్డదైన మురికి  పరిస్థితిలో చేరి ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేస్తాడు,  దీని కోసం అతను చెడ్డ జిన్నాతులను ఆశ్రయిస్తాడు, మరి కొన్ని ముడులను మంత్రించి  దానిపై ఊదుతాడు,  (దీనిని అరబీ భాషలో నఫస్ అంటారు) దీని గురించి అల్లాహ్ ఖురాన్ లో ఇలా తెలియజేశాడు:

وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي العُقَد
(మంత్రించి) ముడులలో ఊదే వారి కీడు నుండి (113: 04) 

ఊదేవాళ్లు అంటే: చెడు జిన్నాత్తులు. వారు ముడులపై ఊదుతారు ఎందుకంటే చేతబడి యొక్క ప్రభావము జిన్నాతులు ఊదటం ద్వారానే అవుతుంది. కనుక వాళ్ళ శరీరాల నుంచి ఒక రకమైన ఊపిరి విడుదలవుతుంది, అందులో వాళ్ల ఉమ్మి కలిసి ఉంటుంది, దాని వల్ల ఎదురుగా ఉన్న వ్యక్తికి కీడు, హాని జరుగుతూ ఉంటుంది. ఈ జిన్నాతుల, షైతాన్ల ద్వారా ఎదుటి వ్యక్తి చేతబడికి గురవుతాడు, తఖ్దీర్ (విధివ్రాత) లోని ఒక రకం“కౌని” (జరగడం) మరియు “ఇజ్నీ” (ఆజ్ఞ) ద్వారానే చేతబడి సంభవిస్తుంది. అల్లాహ్ ఆదేశంపై శ్రద్ధ వహించండే:

وَمَا هُم بِضَارِّينَ بِهِ مِنْ أَحَدٍ إِلاَّ بِإِذْنِ اللَّه

ఎంత చేసినా వారు అల్లాహ్ అనుమతి లేకుండా ఆ చేతబడి ద్వారా ఎవరికీ ఎలిం కీడు కలిగించలేరు సుమా. (బఖర 2:102)

అల్లాహ్ దాసులారా!  కొంతమంది మాంత్రికుల వద్దకు వెళ్లి తనను కొంత కాలం వరకూ తన భార్య పిల్లల నుంచి వేరు చేయాలనుకొని చేతబడి జరిపిస్తారు. దాని ద్వారా వారు కొంత కాలం వరకు భార్య పిల్లల నుంచి నిశ్చింతమై ఉంటారు, ఈ విధంగా వాళ్ళు ప్రయాణాలను , పనులన్నీ ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు ఆ చేతబడిని భంగం చేస్తారు.

అల్లాహ్ దాసులారా! మాంత్రికులు, చేతబడి చేసే వాళ్ళు మనుషులను మోసం చేస్తూ ఉంటారు. కనుక ఎవరైనా వాళ్ల వద్దకు వెళ్తే, వాళ్ల ముందు ఖురాన్ పారాయణం చేస్తారు. దాని ద్వారా వచ్చిన వ్యక్తి  ఇతను అల్లాహ్ యొక్క వలి అని మంచి ఉద్దేశం కలిగి ఉంటారు. ఈ విధంగా మనుషులను మోసం చేస్తూ ఉంటారు. ఇలాంటి మాంత్రికులు తమ చేతబడిని కరామత్ (అల్లాహ్ తరఫు నుంచి మహిమ) అని ప్రదర్శిస్తూ ఉంటారు. వాస్తవానికి అది మంత్ర తంత్రాలు, చేతబడి. దానిని నేర్చుకోవటము మరియు అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్లడం కూడా నిషిద్ధము. దాని నుండి దూరం ఉండటం మరియు దానిని నివారించడము తప్పనిసరి (వాజిబ్).

అల్లాహ్ దాసులారా! తఖయ్యులాతి చేతబడి ప్రభావం అవ్వడానికి ఒకే మార్గం ఉన్నది – కంటి చూపులను ప్రభావితం చేయటము. శరీరము, హృదయము, ఆలోచనపై కాదు. కనుక ఎవరిపై అయితే చేతబడి చేస్తారో ఆ వ్యక్తి ప్రతి వస్తువు రూపాన్ని దానిని అవాస్తమైన వేరే రూపంలో చూస్తాడు. వాస్తవంగా ఆ వస్తువు ఉండదు.  ఈ చేతబడి ఫిర్ఔన్ దర్బారులో ఉన్న మాంత్రికులు మూసా ప్రవక్త వారిపై ప్రయోగం చేశారు, ఇదొక రకమైన షైతాన్ పని.

ప్రజలారా!  ఈ రకమైన “తఖయ్యులాతీ” చేతబడి వాస్తవాన్ని ప్రభావితం చేస్తుంది. కనుక చూసేవాని కంట్లో దాని వాస్తవ  ప్రభావం జరుగుతుంది, కానీ చూస్తున్న వస్తువుపై దీని ప్రభావం ఉండదు. చూస్తున్న వస్తువు ఎక్కడ ఉన్నది అక్కడే వాస్తవంగా అలాగే ఉంటుంది,  కానీ చూసే వ్యక్తి కంట్లో మాత్రం చేతబడి ప్రభావం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఏ వస్తువు యొక్క రూపాన్ని మార్చటము తీర్చిదిద్దటము ఇది అల్లాహ్ కు మాత్రమే సాధ్యము, ఆయనకు ఎవరూ సాటి లేరు.

నేటి కాలంలో సర్కస్ పేరుమీద లేదా రెజ్లింగ్ గేమ్ అని చెప్పే ఆటలు కూడా తఖైయ్యులాతి చేతబడిలోనే భాగము. దాని ద్వారా మాంత్రికులు ప్రజల ఊహలను  ప్రభావితం చేస్తూ ఉంటారు. కనుక వస్తువులు తమ అసలైన రూపానికి విరుద్ధంగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్లు తమ చేసే ఈ పనిని చేతబడి అని చెప్పరు.  ఎందుకంటే ప్రజలు భయాందోళనకి గురికాకూడదని,  దానిని రెజ్లింగ్ ఆటలు ఇంకా వేరే ఆటల పేర్లు ఇస్తూ ఉంటారు. కానీ పేర్లు మారటం వలన వాస్తవం మారదు, ఎందుకంటే  వాస్తవాలను బట్టి నిర్ణయాలు ఉంటాయి. ఆ చేతబడి ఉదాహరణ ఏమిటంటే: ఒక వ్యక్తి తన తల వెంట్రుకల నుంచి కారు తీయడం, ఇంకో వ్యక్తి నిప్పులు తినటము, ఒక వ్యక్తి ఇనుపుతో తనకు తాను దాడి చేసుకోవడం లేదా నాలుకను కోసుకోవడం లేదా ఒక జంతువు నోటిలో ప్రవేశించి మల మార్గం ద్వారా  బయటకు రావడం, ఇంకా తమ వస్త్రాల నుంచి పావురాన్ని వెలికి తీయటము లేదా ప్రజల ముందు ఒక వ్యక్తి ఛాతీపై కారు నడిపించుట ఇలాంటి మొదలైనవి  ఎన్నో మానవుడి అధికారంలో లేనివి అన్ని షైతాన్ సహాయంతో జరుగుతూ ఉంటుంది.  షైతాన్ దాని తీవ్రతను భరిస్తూ ఉంటాడు,  లేదా ప్రజల కంటిపై చేతబడి ప్రభావం.

అల్లాహ్ దాసులారా!  చేతబడి చేసే మాంత్రికుల గురించి ఖురాన్ లో కూడా ఖండించడం జరిగినది. అల్లాహ్ ఆజ్ఞ:

وَلَا يُفْلِحُ السَّاحِرُ حَيْثُ أَتَىٰ
మాంత్రికుడు ఏ విధంగా (ఎంత అట్టహాసంగా) వచ్చినా సఫలీకృతుడు కాలేడు. (తాహా 20:69)

ఇంకా ఇలా ఆదేశించాడు:

 وَلَا يُفْلِحُ السَّاحِرُونَ
మాంత్రికులు సఫలీకృతులు కాలేరు. (యూనుస్ 10:77).

ఈ రెండు వాక్యాల ద్వారా మాంత్రికుడు ఏ విధంగానైనా సఫలికృతుడు కాలేడు, విజయం సాధించలేడని నిరూపించడం జరుగుతుంది (ఇది చేతబడి నేర్చుకొని అవిశ్వాసానికి పాల్పడిన వ్యక్తి హక్కులు) (అల్లామా షింఖీతి రహిమహుల్లాహ్ వారు ఖుర్ఆన్ వాక్యం వివరణలో మాంత్రికుడు కాఫిర్ (అవిశ్వాసి) అని నిరూపించారు)

ప్రవక్త మూసా అలైహిస్సలాం నోటి ద్వారా కూడా అల్లాహ్ మాంత్రికులను ఖండించాడు, ఖురాన్ వాక్యం ఈ విధంగా ఉన్నది:

مَا جِئْتُم بِهِ السِّحْرُ ۖ إِنَّ اللَّهَ سَيُبْطِلُهُ ۖ إِنَّ اللَّهَ لَا يُصْلِحُ عَمَلَ الْمُفْسِدِينَ

మీరు తెచ్చినది మంత్రజాలం, అల్లాహ్ ఇప్పుడే దానిని మిథ్యగా చేసి చూపిస్తాడు, అల్లాహ్ ఇలాంటి కల్లోల జనుల పనిని చక్కబడనివ్వడు. (యూనుస్ 10:81).

ఈ వాక్యం ద్వారా అర్థం అవుతున్న స్పష్టమవుతున్న విషయం ఏంటంటే ఈ భూమండలంపై మాంత్రికులు చేతబడి చేసేవాళ్లే  కల్లోల్లాన్ని, ఉపద్రవాలను, సృష్టించేవాళ్ళు.

పైన వివరించబడిన ఆయతుల ద్వారా స్పష్టమవుతున్నది ఏమిటంటే: మాంత్రికుడు, చేతబడి చేసేవాడు కాఫిర్ (అవిశ్వాసి). చేతబడి చేపించడం నిషిద్ధం మరియు ఈ భూమండలవాసులపై దాని చెడు ప్రభావం, హాని కలుగుతుందని, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ పనిని మరణాంతరం మానవుడిని సర్వనాశనం చేసే పనులలో లెక్కించారు. హజ్రత్ అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

اجْتَنِبُوا السَّبْعَ الْمُوبِقَاتِ

“వినాశనానికి గురి చేసే ఏడు విషయాలకు దూరంగా ఉండండి”. దానికి సహచరులు “ప్రవక్తా! అవి ఏమిటి?” అని అడిగారు. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు:

الشِّرْكُ بِاللهِ، وَالسِّحْرُ…
“అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించడం, చేతబడి చేయటం….” (బుఖారి 2766/ ముస్లిం 89).

హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు:

لَيْسَ مِنَّا مَنْ تَطَيَّرَ أَوْ تُطُيِّرَ لَهُ، أَوْ تَكَهَّنَ أَوْ تُكُهِّنَ لَهُ، أَوْ سَحَرَ أَوْ سُحِرَ لَهُ… وَمَنْ أَتَى كَاهِنًا فَصَدَّقَهُ بِمَا يَقُولُ فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ ﷺ

“శకునం తీయువాడు, తీయించువాడు, జ్యోతిష్యం చేయువాడు, చేయించు వాడు, చేతబడి చేయువాడు, చేయించువాడు మాలోని వారు కారు. ఏ వ్యక్తి అయినా జ్యోతిష్యం చేయువాని వద్దకు వెళ్ళి అతడు చెప్పిన మాటలను ధృవీకరించినచో అతడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లలాహు  అలైహి వసల్లంపై అవతరించిన దానిని తిరస్కరించినవాడవుతాడు.” (*)

(*) ఈ హదీస్ ని ఇమామ్ బజ్జార్ 3578 ఉల్లేఖించారు. అయితే ముఅజం కబీర్ 355లోని పదాలు ఇలా ఉన్నాయి: హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ రజియల్లాహు అన్హు ఒక వ్యక్తి  చేతిలో ఇత్తడి కడియాన్ని చూసి, ఇదేమిటి అని ప్రశ్నించగా అతను చెప్పాడు: నాకు ‘వాహిన’ అను ఒక రోగం ఉంది, ఇది వేసుకుంటే అది దూరమవుతుందని నాకు చెప్పడం జరిగింది. ఈ మాట విన్న ఇమ్రాన్ రజియల్లాహు  అన్హు  చెప్పారు: أَمَا إِنْ مُتَّ وَهِيَ عَلَيْكَ وُكِلْتَ إِلَيْهَا నీవు ఇది వేసుకొని ఉండగానే చనిపోయావంటే నీవు దానికే అప్పగించబడిన వానివి అవుతావు. మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పై హదీస్ తెలిపారు: “శకునం తీయువాడు, తీయించువాడు …. మాలోనివారు కారు”. (దీనిని అల్లమా అల్బానీ రహిమహుల్లాహ్ వారు సహీ అన్నారు. సహీహుల్ జామి 5435, సహీహా 2195).

ఇమామ్ బైహఖి హజ్రత్ ఖతాదాహ్ వారితో ఉల్లేఖించారు, కఅబ్ అన్నారు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “చేతబడి చేయువాడు, చేయించువాడు, జ్యోతిష్యం చేయువాడు, చేయించువాడు, శకునం చేయువాడు, చేయించువాడు నా నిజదాసులు కారు. నా నిజమైన దాసులు: నన్ను విశ్వసించి నాపై పూర్తి నమ్మకం కలిగినవారే”. (షుఅబుల్ ఈమాన్ 1176).

అల్లాహ్ దాసులారా!  చేతబడి చేయించడం కొరకు మాంత్రికుని (జాదూగర్) వద్దకు వెళ్లడం అవిశ్వాసం. అది కుఫ్ర్ (అవిశ్వాసం) అవ్వడానికి కారణం ఏమిటంటే: అతను ఆ చేతబడి(జాదు) ను ఇష్టపడ్డాడు, తమపై లేదా ప్రజలపై  చేయించడాన్ని సమ్మతించాడు.

జాదు (చేతబడి)కి పాల్పడక పోయినా దానిని ఇష్టపడటం కూడా అవిశ్వాసమే (కుఫ్ర్). ఎందుకనగా కుఫ్ర్ ను ఇష్టపడటం కూడా కుఫ్ర్ (అవిశ్వాసమే) అవుతుంది.  ఇది ఎలాంటిదంటే: ఒక వ్యక్తి విగ్రహారాధనను లేదా శిలువకు సాష్టాంగం చేయడాన్ని ఇష్టపడుతున్నట్లు. ఇలాంటి వ్యక్తి ఒకవేళ అతను సాష్టాంగం చేయకపోయినప్పటికీ,  విగ్రహారాధన చేయకపోయినా అతను కాఫిరే. ఉదాహరణకు:  ఒక వ్యక్తి ఇలా అంటున్నాడు “నేను చేతబడి చెయ్యను, చేయమని ఆజ్ఞాపించను, చేతబడి నేర్చుకోను, నేర్చుకోమని ఆజ్ఞాపించను, కానీ నా ఇంట్లో, సమాజంలో చేతబడి జరగటం నాకు ఇష్టం, నేను దానిని నిరాకరించను”. ఇలాంటి వ్యక్తి కూడా కాఫిరే. ఎందుకంటే కుఫ్ర్ పట్ల రాజీ పడి ఉండడం కూడా కుఫ్ర్ యే గనక. కనీసం తన మనస్సుతో కుఫ్ర్ ను ఖండించనివాని హృదయంలో విశ్వాసం లేనట్లే. (అల్లాహ్ మనల్ని రక్షించుగాక)

అల్లాహ్ దాసులారా! ఈ తఖయ్యులాతీ  చేతబడి చేసేవాడు, వాస్తవాలను మార్చే శక్తి ఉందని ఆరోపిస్తాడు. మరి ఇలాంటి వాళ్ళు తమ ఈ దుష్చేష్ట వల్ల ఈ విశ్వంలో నియంత్రణ అధికారం కలిగి ఉన్నారని,  మరియు అల్లాహ్ ను కాకుండా వేరే వాళ్ళతో సహాయం ఆర్థిస్తారు.  ఈ రెండిటికి పాల్పడతారు, మొదటిది తౌహీదే రుబూబియత్ లో షిర్క్, రెండోది తౌహీదే ఉలూహియత్ లో షిర్క్ అవుతుంది. ఒక వ్యక్తి ముష్రిక్ మరియు మార్గ భ్రష్టుడు అవ్వడానికి ఈ రెండు ఆచరణలు సరిపోతాయి.  తౌహీదే రుబూబియత్ లో షిర్క్ అవ్వటానికి కారణం ఏమిటంటే అతను వాస్తవాలను మార్చే శక్తి కలిగి ఉన్నాడని ఆరోపించటం. కానీ ఈ విశ్వంలో వాస్తవాలను మార్చే శక్తి  అల్లాహ్ కు తప్ప మరెవరికీ లేదు, ఆయనే విశ్వాన్ని నడిపిస్తున్నాడు. ఆయనే సృష్టికర్త. ఆయనే ఒక వస్తువుని మరో వస్తువులో (రూపములో) మార్చే అధికారం కలిగి ఉన్నవాడు. కానీ ఇలాంటి అధికారము ఒక చేతబడి చేసేవాడు నేను కలిగి ఉన్నానని ఆరోపిస్తాడు,  ఈ విషయంలో అతను షిర్క్ కి పాల్పడుతున్నాడు, ఈ విషయంలో అతను అబద్ధం చెప్తున్నాడు. ఎందుకంటే అతను చేసే జాదు (చేతబడి)ని బట్టి అతను నేను అధికారం కలిగి ఉన్నాను అని ఆరోపిస్తున్నాడు, కానీ కళ్ళ పై ఆ చేతబడి ప్రభావం ఉన్నంతవరకు ఎదుటి వ్యక్తి భ్రమలో పడి ఉంటాడు. ఎప్పుడైతే దాని ప్రభావం తగ్గుతుందో వాస్తవం ప్రజల ముందు స్పష్టమవుతుంది మరియు వస్తువులు తమ అసలైన రూపంలో కనిపిస్తాయి

తౌహీదే ఉలూహియత్ లో షిర్క్ అవ్వడానికి కారణం ఏమిటంటే అతను షైతాన్ నుంచి సహాయం తీసుకుంటాడు మరియు షైతాన్ కి సాష్టాంగం చేసి, షైతాన్ని ఆరాధిస్తాడు,  షైతాన్ పేరు మీద జంతువులను జిబహ్ చేస్తాడు. మరి కొన్ని సందర్భాల్లో షైతాన్ ప్రసన్నత పొందటానికి ఖుర్ఆన్ని అవమానిస్తాడు. ఎందుకంటే షైతాన్ అతడి నుంచి ఎటువంటి ప్రతీకారము కోరడు, కేవలం అతను కుఫ్ర్ కి పాల్పడి, ఈ భూమండలంలో కల్లోలాన్ని వ్యాపించడం తప్ప. కనుక మాంత్రికుడు (చేతబడి చేసేవాడు) తనకు సహాయపడే షైతాన్ ను ఆరాధిస్తాడు, ఇదే అతని కుఫ్ర్ కి కారణం. మరియు ఆ మాంత్రికుడు అతన్ని ఆరాధించడం ద్వారా షైతాన్ లాభం పొందినట్లు గ్రహిస్తాడు. అదే షైతాన్ యొక్క అసలుద్దేశ్యం, అతడు ఆదం సంతతి నుండి కోరేది అదే. ఇదే విషయం అల్లాహ్ ఇలా తెలిపాడు:

أَلَمْ أَعْهَدْ إِلَيْكُمْ يَا بَنِي آدَمَ أَن لاَّ تَعْبُدُوا الشَّيْطَانَ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِين * وأنِ اعْبُدونِي هَذَا صِرَاطٌ مُسْتَقِيم

“ఓ ఆదం సంతతివారలారా! మీరు షైతాన్‌ను పూజించకండి, వాడు మీ బహిరంగ శత్రువు” అని నేను మీ నుండి వాగ్దానం తీసుకోలేదా? “మీరు నన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం” అని కూడా. (యాసీన్ 36:60,61).

ఇప్పటి వరకు వివరించబడిన విషయాల యొక్క సారాంశం ఏమిటంటే ఖురాన్, హదీసుల ఆధారంగా మరియు ఇజ్మాఎ ఉమ్మత్ ప్రకారంగా “చేతబడి నిషిద్ధము“. (మజ్మూఉల్ ఫతావా లిబ్ని తైమియహ్ 35/171)

షైతాన్   నుంచి సహాయం పొందటం వలన మాంత్రికుడికి ఏం లాభం? మరియు ఆ  మాంత్రికుడికి ప్రజల నుంచి  ఏమి లాభం?

అల్లాహ్ దాసులారా!  చేతబడి చేసేవాడు (మాంత్రికుడు) షైతాన్ నుంచి అనేక లాభాలు పొందుతాడు. ఉదాహరణకు:

షైతాన్ అతనికి దూర ప్రదేశాల ప్రయాణం అతి వేగంగా చేపిస్తాడు, ఇలాంటివి మొదలైనవి.

మాంత్రికుడు ప్రజల బలహీనతల నుంచి లబ్ధి పొందుతాడు , దాని ద్వారా ఆర్థికంగా లాభం పొందుతూ ఉంటాడు.  ఈ ముగ్గురు – షైతాన్ ,చేతబడి చేసేవాడు, చేయించేవాడు – తమ ప్రపంచాన్ని, పరలోకాన్ని నాశనం చేసుకుంటారు.

అల్లాహ్  దాసులారా!  చేతబడి చేయుట మరియు వాళ్ళ వద్దకు వెళ్లుట నుండి దూరంగా ఉండటం తప్పనిసరి. అయితే మాంత్రికుల వద్దకు పోకుండా ఉండటమే సరిపోదు, ఇస్లామీయ చట్ట ప్రకారం పరిపాలిస్తున్న దేశం అయితే, బాధ్యులకు మాంత్రికుల గురించి, వారి కార్యకలాపాల గురించి తెలియజేయాలి. వాళ్ళ సభలకు వెళ్లి, వాళ్ళ సంఖ్యను పెంచి, వాళ్లకు సహాయం చేయడం లాంటివన్నీ యోగ్యం లేలదు; అది టెలివిజన్ ద్వారానైనా, అనేక ఛానల్స్ మరియు అప్లికేషన్ల ద్వారా అయినా, అది కాలక్షేపం కొరకైనా, దాని అవగాహన కొరకైనా, లేదా దాన్ని తెలుసుకునే ప్రయత్నానికైనా  సరే,  ఏ ఉద్దేశంతో నైనా సరే వాళ్ళ వైపుకు వెళ్లకుండా ఉండాలి.

అల్లాహ్ దాసులారా! మాంత్రికులు, చేతబడి చేసేవాళ్లు మరియు ఇలాంటి అనేక ప్రక్రియలు అవిశ్వాస పూరితమైనవి. ఈ పనులు చేసే వాళ్ళపై అల్లాహ్ విధించిన శిక్షలను అమలు చేయడం ఉత్తమమైన ఆరాధన మరియు అల్లాహ్ సామిప్యాన్ని పొందే ఉత్తమైన ఆరాధనలలో ఒకటి. ఎందుకంటే వీళ్లు భూమండలంపై కల్లోల్లాన్నీ, ఉపద్రవాలను వ్యాపింప చేస్తారు, కనుక అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) వారి ఉల్లేఖనం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు ఇలా తెలియజేశారు: భూమిపై ఒక్క అపరాధికి అల్లాహ్ నియమించిన శిక్షను విధించడం వలన భూవాసులపై 40 రోజులు వర్షం కురవటం  కన్నా ఉత్తమైనది. (ఇబ్ను మాజహ్, అల్లామా ఆల్బాని వారు ప్రామాణికంగా ఖరారు చేశారు)

ఇబ్ను తైమియహ్ రహిమహుల్లాహ్ వారు ఇలా చెప్పారు: (మాంత్రికులను హతమార్చడం) దీనితోపాటు వాళ్ళ ఆచరణ, చేతబడికి సహాయపడే ప్రతి దానిని నాశనం చేయాలి, వృధా చేయాలి, అంతం చేయాలి, వీళ్లను సామాన్య రహదారులపై కూర్చోవడానికి నివారించాలి, మరియు ఇలాంటివాళ్లకు ఇల్లు అద్దెకి ఇవ్వరాదు. ఇవన్నీ అల్లాహ్ మార్గంలో జిహాద్ యొక్క ఉత్తమమైన రూపము, మార్గము.( మజ్మూ ఫతావా లి ఇబ్న్ తైమీయహ్)

చేతబడి ప్రక్రియలో పడకుండా జాగ్రత్త పడడానికి తెలుసుకోవలసిన ఖచ్చితమైన విషయాలు మరియు చేతబడి చేసేవాడు మరియు అతని వద్ద  పోయే వాళ్ల  కుఫ్ర్ ను తెలుసుకొనుటకు ఈ ఖుత్బా చాలా ప్రయోజనం చేకూర్చి ఉండాలి.

బారకల్లాహు లీ వలకుం ఫిల్ ఖుర్ఆనిల్ అజీం, వనఫఅనీ వఇయ్యాకుం బిమా ఫీహి మినల్ ఆయాతి వజ్జిక్రిల్ హకీం, అఖూలు ఖౌలీ హాజా, వఅస్తగ్ ఫిరుల్లాహ లీ వలకుం ఫస్తగ్ఫిరూహ్, ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీం.

(అల్లాహ్ నాపై, మీ పై ఖుర్ఆన్ శుభాలను అవతరింపజేయుగాకా! నాకూ, మీకూ అందులో ఉన్న వివేకము, లాభము ద్వారా ప్రయోజనం చేకూర్చుగాక! నేను నా మాటను ముగిస్తాను. మరియు నా కొరకు, మీ కొరకు క్షమాపణ కోరుతున్నాను మీరు కూడా కోరండి. నిస్సందేహంగా అల్లాహ్ చాలా క్షమించేవాడూ మరియు కరుణించేవాడూ.

చేతబడి నుండి రక్షణ మార్గాలు

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత …

అల్లాహ్ దాసులారా!  అల్లాహ్  భీతి కలిగి ఉండండి. మరి గుర్తుంచుకోండి. చేతబడి ప్రభావం కలగకుండా జాగ్రత్తగా ఉండడానికి: అజ్కార్ సబాహ్, మసా (ఉదయం, సాయంత్రం దుఆలు) చదువుతూ ఉండాలి.

చేతబడి సంభవించిన తర్వాత స్వస్థత పొందటానికి మూడు పద్ధతులు అవలంభించాలి:

మొదటి పద్ధతి మరియు చాలా ముఖ్యమైనది: అజ్కార్ సబాహ్, మసా (ఉదయం, సాయంత్రం దుఆలు) చదువుతూ ఉండాలి.

రెండవది పద్ధతి మరియు చాలా లాభదాయకమైనది: చేతబడి చేసిన ఆ వస్తువునీ,  దాచిన  ప్రదేశాన్ని తెలుసుకోవడం.  అది నేల లోపల ఉన్నా, లేదా కొండపై ఉన్నా, లేదా వేరే ఎక్కడున్నా సరే చేతబడి చేసి దాచిన ఆ వస్తువును తెలుసుకుంటే, దాన్ని అక్కడ నుంచి వెలికి తీసి నాశనం చేస్తే, తొలగిస్తే చేతబడి ప్రభావం దూరం అవుతుంది.

మూడవ పద్ధతి: ఇది ఏ వ్యక్తికి అయితే తన భార్యతో సంభోగ విషయంలో ఇబ్బందిగా ఉందో,  అలాంటి వ్యక్తికి చేయబడ్డ చేతబడి కి చాలా లాభకరమైనది.  ఏడు (7 ) పచ్చటి రేగి  ఆకులను తీసుకోవాలి, దానిని రాయితో దంచి, రుబ్బి, సన్నగా పేస్ట్ చేసి దానిని ఒక గిన్నెలో వేసి దానిపై స్నానం చేసేంత నీటిని వేసి, అందులో ఆయతుల్ కుర్సీ మరియు ఖుల్ యొక్క నాలుగు సూరాలు చదివి మరియు సూరతుల్ ఆరాఫ్, సూరతుల్ యూనుస్ మరియు సూరతుత్ తాహా లో చేతబడికి సంబంధించిన ఆయతులు పఠించాలి. దాని తర్వాత ఆ నీటిలోని కొద్ది భాగాన్ని మూడు సార్లు చేసి త్రాగాలి, మిగిలిన నీళ్లతో స్నానం చేయాలి. ఈ విధంగా చేతబడి యొక్క ప్రభావము ఇన్ షా అల్లాహ్  తొలగిపోతుంది. ఈ విధంగా రెండు మూడు సార్లు వ్యాధి నయం అయ్యే వరకు చేసినా పర్వాలేదు.

అల్లాహ్ మీపై కరుణించుగాకా, తెలుసుకోండి! అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యం గురించి సూర అహ్ జాబ్:56లో ఆజ్ఞాపించాడు:

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا (56)

అల్లాహుమ్మ సల్లి వసల్లిమ్ వబారిక్ అలా అబ్దిక వరసూలిక ముహమ్మద్, వర్ జ అన్ అస్ హాబిహిల్ ఖులఫా, వమన్ తబిఅహుమ్ బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్. అల్లాహుమ్మ అఇజ్జల్ ఇస్లామ వల్ ముస్లిమీన్, వఅజిల్లష్ షిర్క వల్ ముష్రికీన్, వదమ్మిర్ అఅదాఅక అఅదాఅద్దీన్, వన్సుర్ ఇబాదకల్ మువహ్హిదీన్.

ఓ అల్లాహ్ మా దేశాలలో భద్రతను ప్రసాదించు, మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గంపై నడిచే వారీగా చేయు.

ఓ అల్లాహ్ మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్ మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు.

ఓ అల్లాహ్ మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్మల్ని కాపాడు.

سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُون وَسَلَامٌ عَلَى الْمُرْسَلِين وَالْحَمْدُ للهِ رَبِّ الْعَالَمِين

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

అజాన్ – మానవతకు మహత్తర సందేశం [పుస్తకం]

అజాన్ – మానవతకు మహత్తర సందేశం [పుస్తకం]
మూలం: మౌలానా ముహమ్మద్ తఖీయుద్దీన్
తెలుగు అనువాదం: ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
అల హఖ్ తెలుగు పబ్లికేషన్స్

[డౌన్లోడ్ PDF]

కరుణామయుడు కనికరించేవాడు అయిన అల్లాహ్ పేరుతో

మహాశయులారా !

ఇస్లాంలో దైవ గృహాన్ని మస్జిద్ అనంటారు. మస్జిద్ లో అల్లాహ్ ఆరాధన జరుగుతుంది. ఇతర ధార్మిక కార్యక్రమాలు కూడా మస్జిద్ లో జరుగుతాయి. మస్జిద్ ల అన్నింటి దిశ మక్కాలో ఉన్న అల్లాహ్ కేంద్ర ఆరాధనా స్థలమైన కాబా గృహం వైపుకు మరలి ఉంటుంది. ఏ విధంగానయితే ఒక ముస్లిం పై ప్రతి రోజూ అయిదు పూటల నమాజ్ విధిగా చేయబడిందో అదే విధంగా అది సవ్యంగా నెరవేరేందుకుగాను జమాఅత్ తో కలసి, అంటే సామూహికంగా నమాజ్ చేయమని కూడా ఆదేశించటం జరిగింది. సామూహికంగా చేసే నమాజ్ లో అపారమయిన, అసంఖ్యాకమైన ప్రాపంచిక, పరలోక శుభాలు ఇమిడి ఉన్నాయి.

అయితే ప్రతి సామూహిక నమాజ్ కోసం వేళకు చేసే ప్రకటననే ‘అజాన్‘ అంటారు. ఈ ‘అజాన్’లో యావత్తు ఇస్లామీయ బోధనల సారాంశం పొందుపరచబడి ఉంది. అందుకే అజాన్ ను ‘దావతితామ్మ‘ అన్నారు. అంటే అది పరిపూర్ణమైన పిలుపు అన్నమాట. ఈ పిలుపులో గొప్ప ఆకర్షణ ఉంది. అదెంతో ప్రభావవంతమైంది. వేళకు అయ్యే ‘అజాన్’ పనిలో వున్న వారిని, ఖాళీగా ఉన్న వారిని, నిద్రించేవారిని అందరినీ కదిలిస్తుంది. అజాన్ పిలుపు ద్వారా, అల్లాహ్ – దైవదాసుని వాస్తవం ప్రస్ఫుటం చెయ్యబడుతుంది. ఈ పిలుపులో ఇహపర సాఫల్యాల సందేశం ఉంది. ఈ పిలుపు దాసుడ్ని అతని స్వంత పనులన్నింటి నుండి, కోర్కెల నుండి వేరు చేసి అతన్ని అల్లాహ్ తో, అల్లాహ్ నామ స్మరణతో, అల్లాహ్ ఆరాధనతో సంబంధం ఏర్పరుస్తుంది. మహత్తరమైన ఈ పిలుపు దాసుని హృదయాంతరాళాల్లో ఓ విధమైన ప్రకంపనం పుట్టిస్తుంది. అల్లాహ్ ఆరాధనకై అతన్ని సమాయత్తం చేస్తుంది. అంతేకాదు, ఈ గొప్ప పిలుపు, అల్లాహ్ పట్ల నిజమైన ప్రేమ కలిగి ఉన్న వారెవరో, బూటకపు ప్రేమ కలిగి ఉన్న వారెవరో కొద్ది సేపట్లోనే తేల్చి వేస్తుంది. సర్వోన్నతుడయిన అల్లాహ్ పట్ల, దైవ ప్రవక్త పట్ల, దైవ ధర్మం పట్ల నిజమయిన, నిష్కల్మషమైన ప్రేమ, విశ్వాసం ఉన్నవారు ఈ పిలుపు వినగానే అల్లాహ్ గృహం వైపుకు మరలి వస్తారు. మనో వాక్కాయ కర్మలచేత వారు ఈ పిలుపుకు బదులు ఇస్తారు. అంటే, వారు అల్లాహ్ ఆరాధనలో నిమగ్నులవుతారు.

అజాన్ పిలుపు విన్న తరువాత అల్లాహ్ గృహం వైపుకు మరలటం ముస్లిం పురుషులకు తప్పనిసరి అయిపోతుంది. ఇది శక్తిమంతుడయిన అల్లాహ్ యొక్క తిరుగులేని ఆదేశం. అజాన్ ఎవరి పిలుపు అనుకున్నారు ?! అజాన్ అల్లాహ్ తరఫున దాసుని పేరిట పంపబడే ఓ గొప్ప ట్రంకాల్, ఆ ట్రంకాల్ ను అందుకుని దానికి బదులు ఇవ్వటం దాసులు విధి. ‘ఒక విశ్వాసి అజాన్ పిలుపు ఇస్తే ఆ పదాలకు మీరు బదులు పలకండి’ అని మానవ మహోపకారి (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉద్బోధించారు. ఉదాహరణకు, ముఅజ్జిన్ ‘అల్లాహు అక్బర్’ అనంటే మనమూ ఆ పదాన్ని పలకాలి. ఆ విధంగా చేస్తే మన ప్రక్కనున్న వారు కూడా దాన్ని అనుసరిస్తారు. ఆ వాతావరణం చూస్తుంటే దాసులు తన ప్రభువుతో సంభాషిస్తున్నారా! అన్నట్లే ఉంటుంది. అందుకే అజాన్ అల్లాహ్ తరఫున దాసుని పేర వచ్చిన ట్రంకాల్ అని అనటం ఎంతో సమంజసం.

అల్లాహ్ స్వయంగా తన దాసుడ్ని ‘అజాన్’ ద్వారా తన దర్బారుకు పిలుచుకున్నాడంటే ఎంత దయగలవాడాయన! ఆ పిలుపును, ఆయన ఆహ్వానాన్ని అందుకుని ఆయన దర్బారుకు వెళ్ళిన దాసుడు ధన్యుడు. ఇక్కడ అతిధేయుడు అల్లాహ్ అయితే అతిథి దాసుడు. అడిగేవాడు దాసుడయితే ఇచ్చేవాడు అల్లాహ్. అతిథి అయిన దాసునికి అతిథేయుడు అయిన అల్లాహ్ ఇచ్చే వరాలకు, అనుగ్రహాలకు హద్దే లేదు.

అల్లాహ్ ఆరాధన కోసం దాసుడు మస్జిద్ లో అడుగు పెట్టగానే దైవ దూతలు అతని చుట్టూ అల్లుకుంటారు. నమాజ్ కోసం నిరీక్షించినంత వరకూ దూతలు అతని కోసం అల్లాహ్ ను ప్రార్థిస్తూ ఉంటారు. అల్లాహ్ కారుణ్యం అతనిపై కురవాలనీ, సుఖశాంతులు అతనికి ప్రాప్తం కావాలని వేడుకుంటారు. అతని పాపాల క్షమాభిక్షకై వేడుకుంటారు.

అల్లాహ్ చివరి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ఏమని ప్రబోధించారంటే “దాసుడు అల్లాహ్ గృహం వైపుకు మరలి అతను వేసే ఒక్కో అడుక్కీ ఒక్కో పాపం చెరిపివేయబడుతుంది. అతని ఖాతాలో ఒక్కో అడుక్కి ఒక్కో సత్కార్యం రాయబడుతుంది. అతని స్థాయి, ఒక్కో మెట్టు అల్లాహ్ సాన్నిధ్యంలో పెంచబడుతుంది.”

ఇహ పరాలలో అజాన్ ఎన్ని శుభవార్తలనిస్తుందో ఆలోచించండి !

ఇక ధర్మంలో అజాన్ ఔన్నత్యం ఏమిటో చూద్దాం. దైవ ధర్మమయిన ఇస్లాం నిదర్శనాలలో ఓ గొప్ప నిదర్శనం అజాన్. ఇది సున్నతె ముఅక్కిద. అంటే దీని ప్రాముఖ్యం ధర్మంలో ‘ఫర్జ్’కు దరిదాపుల్లో ఉంది. ఒకవేళ ముస్లింలు సామూహికంగా ‘అజాన్’ వ్యవస్థను గనక బహిష్కరిస్తే, కాలపు ఖలీఫా వారికి వ్యతిరేకంగా కఠిన చర్య తీసుకోగలడు. అందుకు కారకులయిన వారిపై మరణ దండన కూడా విధించగలడు.

సామూహిక నమాజ్ విధి – వ్యాపారం మరియు ఇతర కార్య కలాపాల వలన నిర్లక్ష్యం వహించడం నిషేదం [ఖుత్బా]

ఖుత్బా అంశము : సామూహిక నమాజ్ విధి-వ్యాపారం మరియు ఇతర కార్య కలాపాల వలన నిర్లక్ష్యం వహించడం నిషేదం         

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

మొదటి ఖుత్బా :-

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటికంటే ఉత్తమమైనమాట అల్లాహ్ మాట, మరియు అందరికంటే ఉత్తతమైన పద్దతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ వారి పద్దతి. అన్నిటికంటే నీచమైనది ఇస్లాంలో క్రొత్తగా సృష్టించబడినవి. బిద్అత్ కార్యకలాపాలు మరియు ఇస్లాంలో క్రొత్తగా సృష్టించబడిన ప్రతికార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతి మార్గభ్రష్టత్వము నరకములోకి  తీసుకువెళ్ళేదే.

ఓ ముస్లిం లారా! అల్లాహ్ యొక్క భయాన్ని ఆయన దైవభీతిని కలిగి ఉండండి. ఆయనకు విధేయత చూపండి. అవిధేయత నుంచి దూరంగా ఉండండి మరియు తెలుసుకోండి! నమాజ్ అతి ఉన్నతమైన ఆచరణలలో ఒకటి. అల్లాహ్ తఆల ముస్లింలకు జమాత్ తో అనగా (సామూహికంగా) మస్జిద్లో నమాజ్ ఆచరించమని ఆజ్ఞాపించాడు. మరియు అకారణంగా నమాజ్ నుండి దూరంగా ఉండడాన్ని వారించాడు.  మరియు మస్జిదులో జమాతుతో నమాజ్  చదవడం గురించి అనేక హదీసులలో ఆజ్ఞాపించబడింది.

1. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఈ విధంగా ప్రవచించారు:

మనిషి తన ఇంట్లో లేక వీధిలో చేసే నమాజ్ కన్నా సామూహికంగా చేసే నమాజుకు పాతిక రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. ఈ విధంగా ఎక్కువ రెట్లు పుణ్యం లభించటానికి కారణమేమిటంటే, మనిషి చక్కగా వుజూ చేసుకొని కేవలం నమాజు చేసే ఉద్దేశ్యంతో వెళ్తుంటే, ఆ సమయంలో అతను వేసే ప్రతి అడుగుకు అల్లాహ్ ఒక్కొక్కటి చొప్పున అతని అంతస్తులను పెంచుతాడు. అంతేకాదు, అతని వల్ల జరిగిన పాపాలను కూడా ఒక్కొక్కటిగా తుడిచిపెట్టేస్తాడు. అతను నమాజ్ చేస్తూ వుజూతో ఉన్నంతవరకూ దైవదూతలు అతని మీద శాంతి కురవాలని ప్రార్థిస్తూ, “అల్లాహ్! ఇతనిపై శాంతి కురిపించు. అల్లాహ్! ఇతణ్ణి కనికరించు” అని అంటూ ఉంటారు. మస్జిద్లో ప్రవేశిం చిన తర్వాత సామూహిక నమాజ్ కోసం అతను ఎంతసేపు నిరీక్షిస్తాడో అంత సేపూ అతను నమాజ్లో ఉన్నట్లుగానే పరిగణించబడతాడు. (అంటే అతనికి అంత పుణ్యం లభిస్తుందన్నమాట).(బుఖారీ-ముస్లిం)

2. హజ్రత్ ఇబ్నె మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం: రేపు (ప్రళయ దినాన) తానొక ముస్లింగా అల్లాహ్ ను కలవాలనుకునే వ్యక్తి ఈ నమాజుల కొరకు అజాన్ (ప్రకటన) ఇవ్వబడినప్పుడల్లా వాటిని పరిరక్షించుకోవాలి, (అంటే వాటిని తప్పకుండా – నెరవేర్చాలి.) ఎందుకంటే అల్లాహ్ మీ ప్రవక్త కొరకు మార్గదర్శక పద్ధతుల్ని నిర్ణయించాడు. నమాజులు కూడా ఆ మార్గదర్శక పద్ధతుల్లోనివే. ఒకవేళ మీరు కూడా ఈ వెనక ఉండేవాని మాదిరిగా ఇంట్లో నమాజ్ చేసుకుంటే మీరు మీ ప్రవక్త విధానాన్ని వదలి పెట్టినవారవుతారు. మీరు గనక మీ ప్రవక్త విధానాన్ని విడిచి పెట్టినట్లయితే తప్పకుండా భ్రష్ఠత్వానికి లోనవుతారు. ఎవరైతే ఉన్నతమైన రీతిలో వుజూ చేసి  మస్జిద్ వైపు బయలుదేరుతారో వారి ఒక అడుగు బదులుగా ఒక సత్కార్యం వారి పేరున రాయబడుతుంది మరియు వారి ఒక్క స్థానం ఉన్నతం చేయబడుతుంది మరియు ఒక పాపం మన్నించడం జరుగుతుంది. మా కాలంలో నేను గమనించేవాణ్ణి పేరెన్నికగన్న కపటులు మాత్రమే (సామూహిక నమాజ్లో పాల్గొనకుండా) వెనక ఉండిపోయేవారు. (వ్యాధి మొదలగు కారణాల చేత) నడవలేక పోతున్నవారిని ఇద్దరు మనుషుల సాయంతో తీసుకొని వచ్చి పంక్తిలో నిలబెట్టడం జరిగేది. (ముస్లిం)

1.9 ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం| మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

398 – حديث عَائِشَةَ أُمِّ الْمُؤْمِنِينَ قَالَتْ: فَرَضَ اللهُ الصَّلاَةَ حِينَ فَرَضَهَا رَكْعَتَيْنِ رَكْعَتَيْنِ فِي الْحَضَرِ وَالسَّفَرِ، فَأُقِرَّتْ صَلاَةُ السَّفَرِ، وَزِيدَ فِي صَلاَةِ الْحَضَرِ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 1 كيف فرضت الصلوات في الإسراء

398. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:-

అల్లాహ్ (ప్రారంభంలో) నమాజు విధిగా చేయాలని నిర్ణయించినప్పుడు ప్రయాణావస్థలో ఉన్నా, లేకపోయినా రెండేసి రకాతులు విధిగా చేయాలని ఆదేశించాడు. అయితే ఆ తరువాత కొన్నాళ్ళకు ప్రయాణావస్థలో రకాతుల సంఖ్యను ఇదివరకటిలాగే యథాతథంగా ఉంచి, ప్రయాణావస్థలో లేనప్పుడు నిర్వర్తించవలసిన రకాతుల సంఖ్యను పెంచడం జరిగింది.

[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 1వ అధ్యాయం – కైఫఫర్జియ తిస్సలాతు ఫిల్ ఇస్రా)

399 – حديث ابْنِ عُمَرَ عَنْ حَفْصِ بْنِ عَاصِمٍ قَالَ: حَدَّثَنَا ابْنُ عُمَرَ، فَقَالَ: صَحِبْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَلَمْ أَرَهُ يُسَبِّحُ فِي السَّفَرِ وَقَالَ اللهُ جَلَّ ذِكْرُهُ (لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللهِ أُسْوَةٌ حَسَنَةٌ)
__________
أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 11 باب من لم يتطوع في السفر دبر الصلاة وقبلها

399. హజ్రత్ హఫ్స్ బిన్ ఆసిమ్ (రహిమహుల్లాహ్) కథనం ప్రకారం హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేశారు:-

నేను (ఓసారి ప్రయాణంలో) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉన్నాను. ఆయన (ఈ) ప్రయాణంలో సున్నత్ నమాజులు చేస్తూ ఉండగా నేను చూడలేదు. కాగా; అల్లాహ్ ( ఖుర్ఆన్లో) “దైవప్రవక్త (జీవనసరళి)లో మీకొక చక్కని ఆదర్శం ఉంది” అని అన్నాడు. (33:21)

[సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఫ్సీరుస్సలాత్, 11వ అధ్యాయం – మల్లమ్ యతతవ్వు ఫిస్సఫరి దుబుర సలవాత్)

400 – حديث أَنَسٍ رضي الله عنه، قَالَ: صَلَّيْتُ الظُّهْرَ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِالْمَدِينَةِ أَرْبَعًا، وَبِذِي الْحُلَيْفَةِ رَكْعَتَيْنِ
__________
أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 5 باب يقصر إذا خرج من موضعه

400. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:-

నేను మదీనాలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక నాలుగు రకాతులు జుహర్ నమాజు చేశాను; ‘జుల్ హులైఫా’లో రెండు రకాతులు అసర్ నమాజు చేశాను.

[సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఖ్సీరుస్సలాత్, 5వ అధ్యాయం – యఖ్ సురు ఇజా ఖరజ మిమ్మవుజూ…..]

401 – حديث أَنَسٍ، قَالَ خَرَجْنَا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنَ الْمَدِينَةِ إِلَى مَكَّةَ، فَكَانَ يُصَلِّي رَكْعَتَيْنِ رَكْعَتَيْنِ حَتَّى رَجَعْنَا إِلَى الْمَدِينَة
سَأَلَهُ يَحْيَى بْنُ أَبِي إِسْحقَ قَالَ: أَقَمْتُمْ بِمَكَّةَ شَيْئًا قَالَ أَقَمْنَا بِهَا عَشْرًا
__________
أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 1 باب ما جاء في التقصير وكم يقيم حتى يقصر

401. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు)కథనం:-

మేమొకసారి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట మదీనా నుండి మక్కాకు బయలుదేరాము. ఈ ప్రయాణంలో మేము (మక్కా నుండి) తిరిగి మదీనా చేరుకునే వరకు రెండేసి రకాతులు (మాత్రమే ఫర్జ్) నమాజ్ చేశాము. హజ్రత్ యహ్యా బిన్ అబూ ఇసఖ్ (రహిమహుల్లాహ్) ఈ హదీసు విని “మరి మీరు మక్కాలో ఎన్ని రోజులు విడిది చేశారు?” అని అడిగారు. దానికి హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) “మక్కాలో మేము పది రోజులు ఉన్నాము” అని సమాధానమిచ్చారు.

(సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఖ్సీరుస్సలాత్, 1వ అధ్యాయం – మాజా అఫిత్తఖ్సీరి వకమ్ యుఖీము హత్తాయుఖస్సిర్)

మనిషి సామూహికంగా చేసే నమాజు అతను తన ఇంట్లో లేదా బజారులో చేసే నమాజుకన్నా 20 రెట్లకు పైగా ఘనమైనది, ఎందుకంటే? [ఆడియో]

మనిషి సామూహికంగా చేసే నమాజు అతను తన ఇంట్లో /బజారులో చేసే నమాజుకన్నా 20 రెట్లకు పైగా ఘనమైనది, ఎందుకంటే?
https://youtu.be/sPhvRWKKhMY [19 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

10-దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారని హజ్రత్‌ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) తెలిపారు:

“మనిషి సామూహికంగా చేసే నమాజు అతను తన ఇంట్లో లేక బజారులో చేసే నమాజుకన్నా ఇరవై రెట్లకు పైగా ఘనమైనది. ఎందుకంటే ఒక వ్యక్తి చక్కగా వుజూ చేసుకుంటాడు, తరువాత నమాజు కోసం మస్జిద్ కు వస్తాడు. నమాజు మాత్రమే అతణ్ణి మస్జిద్కు తీసుకువస్తే – అలాంటి వ్యక్తి మస్జిద్ చేరుకునేంత వరకూ అతను వేసే ఒక్కో అడుగుకు బదులుగా అతని ఒక్కో అంతస్తు పెరుగుతూ ఉంటుంది. అతని వల్ల జరిగిన ఒక్కో పాపం తొలగించబడుతూ ఉంటుంది. ఆ తరువాత మస్జిద్లో ప్రవేశించిన పిదప నమాజు అతన్ని ఆపివుంచినంతసేపూ అతను నమాజు చేస్తున్నట్టుగానే పరిగణించ బడతాడు. మీలో ఎవడైనా నమాజు చేసిన స్థానంలో కూర్చొని ఉన్నంత వరకూ దైవదూతలు అతనిపై అల్లాహ్‌ కారుణ్యం కురవాలని వేడుకుంటూనే ఉంటారు. ఆ వ్యక్తి పరులకు హాని కలిగించనంతవరకు, అతని వుజూ భంగం కానంతవరకు దైవదూతలు “ఓ అల్లాహ్‌! ఈ వ్యక్తిని కరుణించు. ఓ అల్లాహ్‌! ఇతన్ని మన్నించు. ఓ అల్లాహ్‌! ఇతన్ని కనిపెట్టుకుని ఉండు ‘ అని విన్నవించుకుంటూ ఉంటారు”

(బుఖారీ – ముస్లిం). హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి. హదీసులో వచ్చిన పదం “యన్‌హజుహూ” అంటే అతన్ని బయటికి తీసుకువస్తుంది లేక అతన్ని లేపుతుందని అర్థం.

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) – సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)
https://teluguislam.net/2019/10/19/ikhlas/

ఏదైనా ఫరజ్ నమాజు మిస్ అయితే దానికి ఖజా అనేది ఉంటుందా? ఎప్పటి లోపల చేస్తే అది ఖజా అవకుండా ఉంటుంది? [వీడియో]

బిస్మిల్లాహ్

ఏదైనా ఫరజ్ నమాజు మిస్ అయితే దానికి ఖజా అనేది ఉంటుందా? ఎప్పటి లోపల చేస్తే అది ఖజా అవకుండా ఉంటుంది?

[2:45 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఆడవారు తమ జుట్టు ముడి వేసుకొని నమాజు చేయవచ్చా? జడ ఖచ్చితంగా వేసుకోవాలా? [వీడియో]

బిస్మిల్లాహ్

https://youtu.be/pZly281Qa_E&rel=0

[32 సెకనులు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

నమాజు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/