వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
లాఇలాహ ఇల్లల్లాహ్ యొక్క నిబంధనలు:
ఈ పవిత్ర వచనం యొక్క నిబంధనలు ఏడున్నాయి. ఏ కొరత లేకుండా వాటన్నిటినీ పాటిస్తేనే వాస్తవంగా లాఇలాహ ఇల్లల్లాహ్ పఠించినట్లు.
1- ఇల్మ్ (జ్ఞానం):పవిత్ర వచనము యొక్క వాస్తవ భావ జ్ఞానం. అనగా (పైన తెలిపిన ప్రకారం) అనంగీకారం, అంగీకారం మరియు దాని ప్రకారం ఆచరించుట. ‘అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు, ఇతరుల ఆరాధన వ్యర్థము, తుచ్చము‘ అని తెలుసుకొని దాని ప్రకారంగా ఆచరించిన మానవుడే వాస్తవంగా దాని భావాన్ని తెలుసుకున్న జ్ఞాని.
అల్లాహ్ ఆదేశం:
(తెలుసుకో! అల్లాహ్ తప్ప వేరు ఆరాధింపదగిన వాడెవడు లేడు అని)
(ముహమ్మద్ 47: 19).
ఇంకా ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారుః
‘వాస్తవ ఆరాధ్యుడు ఎవడూ లేడు, కేవలం ఒక్క అల్లాహ్ తప్ప’ అని తెలుసుకొని మరణించిన వారు స్వర్గములో చేరుదురు“. (ముస్లిం 26).
2- యఖీన్ (నమ్మకం): మనశ్శాంతి కలిగే పూర్తి నమ్మకము మరియు మనుష్యులలో, జిన్నాతులలోగల షైతానులు కలుగ జేసే అనుమానాల్లో పడకుండా గాఢ విశ్వాసముతో ఈ పవిత్ర వచనం పఠించాలి.
(ఎవరు అల్లాహ్ యందు ఆయన ప్రవక్తల యందు విశ్వాసము కలిగిన పిదప సందేహములు వహింపరో వారే విశ్వాసులు).
ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవడూ లేడని మరియు నేను అల్లాహ్ ప్రవక్తనని సాక్ష్యమిచ్చుచున్నాను. ఎవరు ఏలాంటి సందేహం లేకుండా ఈ రెండు విషయాలతో (సాక్ష్యాలతో) అల్లాహ్ ను కలుసుకుంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు“. (ముస్లిం 27).
3- ఖుబూల్ (సమ్మతించుట): ఈ పవిత్ర వచనం ద్వారా రుజువయ్యే విషయాలన్నిటినీ మనసావాచా సమ్మతించాలి. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తెలిపిన విషయాల్ని సత్యంగా నమ్మాలి. ఆయన తెచ్చిన ప్రతి దానిని విశ్వసించాలి, సమ్మతించాలి. అందులో ఏ ఒక్క దానిని విస్మరించకూడదు.
[ప్రవక్త తన ప్రభువు నుండి తనకు నొసంగబడిన గ్రంథమును విశ్వసించారు. విశ్వాసులు కూడా విశ్వసించారు. అందరు అల్లాహ్ను, అతని దూతలను, గ్రంథములను, ప్రవక్తలను విశ్వసిస్తూ ‘మేము ఆయన ప్రవక్తల మధ్య వ్యత్యాసము పాటించము, మేము వింటిమి విధేయులైతిమి, మా ప్రభువా! నీ మన్నింవును వేడుకొను చున్నాము, నీ వద్దకే మరలి వచ్చువారలము’ అని అంటారు]. (బఖర 2: 285).
ధర్మ శాసనాలను, హద్దులను ఆక్షేపించుట, లేక వాటిని నమ్మకపోవుట సమ్మతమునకు వ్యతిరేకం. ఉదాహరణకు: కొందరు దొంగ మరియు వ్యబిచారునిపై విధించిన హద్దులను లేక బహుభార్యత్వం, ఆస్తుల పంపకం లాంటి తదితర విషయాలను ఆక్షేపిస్తారు. (అయితే ఇలాంటి వారు అల్లాహ్ యొక్క ఈ ఆదేశం వినలేదా, చదవలేదా?)
(అల్లాహ్, ఆయన ప్రవక్త ఏ విషయములోనైనా ఒక తీర్పు చేసినప్పుడు విశ్వాసి అయిన ఏ పురుషునికి, విశ్వాసురాలైన ఏ స్త్రీకి, తరువాత తమ యొక్క ఆ విషయంలో స్వయంగా మళ్ళీ ఒక నిర్ణయం తీనుకునే హక్కు లేదు). (అహ్ జాబ్ 33: 36).
4- ఇన్ఖియాద్ (లొంగిపోవుట, శిరసావహించుట):పవిత్ర వచనం యొక్క అర్థభావాల పట్ల శిరసావహించాలి. ఇన్ ఖియాద్ మరియు ఖబూల్ లో తేడా ఏమనగా? ఖబూల్ అంటే నోటితో దాని భావాన్ని సమ్మతించుట. ఇన్ఖియాద్ అంటే సమ్మతంతో పాటు దాన్ని ఆచరణ రూపంలో తీసుకు వచ్చుట. ఒక వ్యక్తి లాఇలాహ ఇల్లల్లాహ్ అర్థభావాన్ని తెలుసుకొని, దాన్ని మనస్ఫూర్తిగా నమ్మి, దాన్ని సమ్మతించినప్పటికీ దానికి లొంగిపోయి, శిరసావహించి, దాని ప్రకారం ఆచరించకపోయినట్లైతే అతను ఇన్ఖియాద్ యొక్క నిబంధన పాటించనట్లే.
అల్లాహ్ ఇలా సంభోదించాడు:
وَأَنِيبُوا إِلَىٰ رَبِّكُمْ وَأَسْلِمُوا لَهُ
మీరు మీ ప్రభువు వైెవునుకు మరలి ఆయనకే విధేయత చూపండి. (జుమర్ 39: 54).
(నీ ప్రభువు సాక్షిగా! వారు తమలోని జగడముల తీర్పునకై నిన్ను న్యాయ నిర్ణేతగా మరియు నీవు చేయు తీర్పును గూర్చి వారుతమ మనున్సులో సంకట పడక సంతోషముతో అంగీకరించనంత వరకు వారు విశ్వాసులు కారు).
5- సిద్ఖ్ : (సత్యత):మనిషి తన విశ్వాసములో సత్యవంతుడై యుండాలి.
ఎవరైనా ఈ పవిత్ర వచనం కేవలం నోటితో పలికి, దాని భావర్ధాలను మనస్ఫూర్తిగా నమ్మకుండా ఉన్నట్లయితే అతనికి ముక్తి ప్రాప్తించదు. అతడు కపట విశ్వాసులలో పరిగణించబడుతాడు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తీసుకువచ్చిన వాటన్నిటిని లేదా కొన్నిటిని తిరస్కరించడం కూడా సత్యతకు వ్యతిరేకంలోనే వస్తుంది. ఎందుకనగా మనము ఆయన (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం)కు విధేయులై ఉండాలని, ఆయన మాటల్ని సత్యంగా నమ్మాలని అల్లాహ్ ఆదేశించాడు, అంతే కాదు, ఆయన విధేయతను తన విధేయతతో కలిపి చెప్పాడు.
సూర నూర్ (24: 54)లో ఉంది:
أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ
(అల్లాహ్ కు విధేయులు కండి, అల్లాహ్ ప్రవక్తకు విధేయులు కండి).
6- ఇఖ్లాస్:మనిషి తను చేసే ప్రతి పనిని సంకల్పపరంగా షిర్క్ దరిదాపులకు అతీతంగా ఉంచుటయే ఇఖ్లాస్, అంటే సర్వ పనులు, మాటలు కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకు, ఆయన ప్రసన్నత పొందుటకే చేయాలి. అందులో ఏ మాత్రం ప్రదర్శనా బుద్ధి, పేరు ప్రఖ్యాతుల కాంక్ష, ప్రాపంచిక లాభోద్దేశ్యం, స్వార్థం ఉండకూడదు. ఇంకా ఆ పని అల్లాహ్ యేతరుని ప్రేమలో, అల్లాహ్ మార్గానికి విరుద్ధంగా ధార్మిక లేదా తర వర్గాల పక్షంలో ఉండకూడదు. కేవలం అల్లాహ్ అభిష్టాన్ని మరియు పరలోక సాఫల్యాన్ని పొందుట కొరకే చేయాలి. ఎవరి నుండైనా ప్రతిఫలాన్నిగానీ, కృతజ్ఞతలనుగానీ ఆశిస్తూ వారి వైపునకు మనుసు మరలకూడదు.
సూర జుమర్ (39: ౩)లో ఉంది:
أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ
(నిస్సందేహంగా, ధర్మం ప్రత్యేకంగా అల్లాహ్ కు చెందిన హక్కు మాత్రమే)
(ఓ విశ్వాసులారా! మీలో ఎవరైనా తమ ధర్మం నుండి వైదొలిగిపోతే, అల్లాహ్ ఇంకా ఎంతో మందిని సృష్టిస్తాడు. అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు. వారు అల్లాహ్ను ప్రేమిస్తారు. వారు విశ్వాసుల పట్ల మృదువుగానూ, అవిశ్వాసుల పట్ల కఠినంగానూ ప్రవర్తిస్తారు. అల్లాహ్ మార్గంలో యుద్దం చేస్తారు. నిందించే వారి నిందలకు వారు భయపడరు). (మాఇద 5: 54).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వుజూ చేయడమే కాదు, దాని ఘనతలను తెలుసుకొని మరీ వుజూ చేయడం ద్వారా పుణ్యాలు పెరుగుతాయి. అందుకే ఇందులో వాటి ఘనతలతో పాటు ఏ విషయాలు వుజూ భంగమగుటకు కారణం అవుతాయో కూడా తెలుసుకుంటారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్లాం ధర్మం యొక్క మానవజాతిపై ఉన్న అనేకానేక వరాల్లో, కారుణ్యాల్లో ఒక్క గొప్ప వరం, కారుణ్యం మేజోళ్ళ (సాక్స్ లు, బూట్లు )పై మసహ్ (తుడవడం) చేయుటకు అనుమతివ్వడం. అయితే ఎవరు ఏ సందర్భంలో చేయాలో ఇందులో మీరు తెలుసుకోగలరు.
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
మేజోళ్ళ పై ‘మసహ్ ‘
ఇస్లాం ధర్మం యొక్క సులువైన, ఉత్తమ విషయం ఒకటి: మేజోళ్ళపై ‘మసహ్’ చేసే అనుమతివ్వడం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా ‘మసహ్’ చేసేవారని రుజువైనది.
అమ్ర్ బిన్ ఉమయ్య చెప్పారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ తలపాగ మరియు మేజోళ్ళపై ‘మసహ్’ “చేస్తున్నది నేను చూశాను. (బుఖారి 205).
ముగీరా బిన్ షాఅబ చెప్పారు: ఒక రాత్రి నేను ప్రవక్తతో ఉండగా, ఆయన ఒక చోట మజిలీ చేసి (ఓ చాటున) కాలకృత్యాలు తీర్చుకొని వచ్చారు, అప్పుడు నా వద్ద ఉన్న చెంబుతో నీళ్ళు పోశాను ఆయన వుజూ చేశారు. చివరిలో తమ మేజోళ్ళపై ‘మసహ్’ చేశారు. (బుఖారి 203, ముస్లిం 274)
వాటి పై ‘మసహ్’ చేయుటకు ఒక నిబంధనఏమిటంటే అవి వుజూ చేసిన తర్వాత తొడిగి యుండాలి. పై భాగాన ‘మసహ్’ చేయాలి, క్రింది భాగాన కాదు.
ఇక ‘మసహ్ ‘ గడువు విషయానికి వస్తే; స్థానికులు ఒక పగలు ఒక రాత్రి, ప్రయాణికులు (ఏ ప్రయాణంలో నమాజ్ ఖస్ర్ చేయవచ్చునో ఆ ప్రయాణంలో) మూడు రేయింబవళ్ళు మేజోళ్ళపై ‘మసహ్’ చేయవచ్చును. (వుజూ చేసి తొడిగన తరువాత వుజూ భంగమయిన క్షణం నుంచీ గడువు మొదలవుతుంది).
‘మసహ్’ భంగమయ్యే కారణాలు: గడువు ముగిసిన మరుక్షణం నుంచే ‘మసహ్’ భంగమైపోతుంది. ‘మసహ్’ చేసిన తరువాత కనీసం ఒకసారైనా తీసినట్లయితే ‘మసహ్’ భంగమవుతుంది. లేదా మనిషి (స్వప్నస్ఖలనం లేదా భార్యభర్తల సంభోగం కారణంగా) అశుద్ధతకు లోనైతే ‘మసహ్’ భంగమవుతుంది. స్నానం చేయుటకై అవి తీయడం కూడా తప్పనిసరి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్లాం మానవ జీవితంలోని ప్రతి కోణానికి సంబంధించిన ప్రతి విషయం గురించి సన్మార్గం చూపుతుంది. చివరికి మల మూత్ర విసర్జన పద్ధతులను కూడా తెలిపింది, అయితే వీటి వివరాలు ఇందులో తెలుసుకోండి.
ఈ ప్రసంగంలో, వక్త మలమూత్ర విసర్జన చేసేటప్పుడు పాటించవలసిన ఇస్లామీయ పద్ధతులను హదీసుల ఆధారంగా వివరించారు. ప్రధాన అంశాలు: ఏకాంతాన్ని పాటించడం, ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించుకోవడంలో తప్పులేదని చెప్పడం, భూమికి దగ్గరైన తర్వాతే బట్టలు పైకి తీయడం, మరుగుదొడ్డిలోకి ప్రవేశించే ముందు మరియు బయటకు వచ్చిన తర్వాత దువాలు చదవడం, ఆ సమయంలో మాట్లాడకూడదని చెప్పడం, అల్లాహ్ పేరు ఉన్న వస్తువులను లోపలికి తీసుకువెళ్లకపోవడం, ఖిబ్లా వైపు ముఖం లేదా వీపు పెట్టకపోవడం (కట్టడాలలో మినహాయింపు ఉంది), శపించబడిన ప్రదేశాలలో (దారి, నీడ, నీటి వనరులు) విసర్జన చేయకపోవడం, శరీరం లేదా దుస్తులపై తుంపరలు పడకుండా జాగ్రత్తపడటం, శుభ్రత కోసం నీటిని (మరియు రాళ్లను) ఉపయోగించడం, ఎడమ చేతిని మాత్రమే వాడటం, కనీసం మూడుసార్లు శుభ్రపరచడం, ఎముక మరియు పేడతో శుభ్రపరచకపోవడం, ఆ సమయంలో సలాంకు జవాబు ఇవ్వకపోవడం, మరియు అవసరమైతే నిలబడి మూత్రవిసర్జన చేయడం అనుమతించబడినప్పటికీ, తుంపరల పట్ల చాలా జాగ్రత్తగా ఉండటం.
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వఆలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్.
మహాశయులారా! అల్లాహ్ యొక్క దయవల్ల ఈ రోజు మనం మలమూత్ర విసర్జన ఇస్లామీయ పద్ధతులు ఏమిటో తెలుసుకుందాము.
1. ఏకాంతం మరియు గోప్యత
మొదటి విషయం, మలమూత్ర విసర్జన కొరకు నాలుగు గోడల మధ్యలో లేదా ఎడారి ప్రాంతంలో పోయే అవసరం ఉన్నప్పుడు కానీ ప్రజల చూపులకు, వారి దృష్టికి దూరంగా వెళ్ళాల్సిన ఆదేశం ఇస్లాం ఇస్తుంది. ఎందుకనగా ప్రతి మనిషి తన మర్మ అవయవాలను ఇతర చూపులకు దూరంగా ఉంచడం తప్పనిసరి విషయం.
దీనికి సంబంధించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల్లో ఒక హదీస్, సహీ బుఖారీ హదీస్ నెంబర్ 148. ఇంకా అలాగే సహీ బుఖారీలోని హదీస్ నెంబర్ 363 లో కూడా ఈ ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ముగైరా బిన్ షోబా రదియల్లాహు త’ఆలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సేవలో ఉండేవారు. ఆయన తెలుపుతున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైనా కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు,
فَانْطَلَقَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم حَتَّى تَوَارَى عَنِّي فَقَضَى حَاجَتَهُ (ఫన్తలఖ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం హత్తా తవారా అన్నీ ఫఖదా హాజతహు) “నాకు కనబడనంత దూరంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళారు, తమ అవసరాన్ని తీర్చుకొని తిరిగి వచ్చేశారు.”
సామాన్యంగా కొన్ని పల్లెటూర్లలో ఇప్పుడు అంతగా లేదు కావచ్చు, కానీ అయినా గాని కొన్ని ప్రాంతాల్లో ఉండవచ్చు, ఇళ్లల్లో మరుగుదొడ్లను నిర్మించుకోవడం మంచిగా భావించరు. కానీ ఇందులో ఎలాంటి అభ్యంతరం ఇస్లామీయ ధర్మ ప్రకారంగా గానీ, ఇందులో ఎలాంటి పాపం అనేది లేదు. స్వయంగా ఆ కాలంలో కూడా మహనీయ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తమ ఇంటి మీద ఇలాంటి ఒక సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయం కూడా సహీ బుఖారీలో ఉంది. అందుగురించి ఇమామ్ బుఖారీ రహమతుల్లా అలై ఒక చాప్టర్ పేరేమి పెట్టారు? ఇళ్లల్లో కాలకృత్యాలు తీర్చుకోవడం.
2. బట్టలు పైకి ఎత్తే విధానం
రెండో విషయం, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు, నాలుగు గోడల మధ్యలో ఉన్నప్పుడు ఎలాంటి సందేహం లేదు, లోపలికి వెళ్లి తలుపేసుకున్న తర్వాతే బట్టలు విప్పుతాము. కానీ ఎడారి ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఎక్కడైతే ఒక పరదా లాంటి స్థలం, ప్రజల చూపులకు మనం కనబడకుండా ఉన్నాము అన్నటువంటి నమ్మకం అయిన తర్వాత, ఏ స్థలంలో మనం కూర్చోవాలి అని అనుకుంటున్నామో అక్కడ కూర్చోవడానికి సిద్ధమవుతూ, కిందికి వంగుతూ బట్టలను ఎత్తుకోవాలి.
హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు:
أَنَّ النَّبِيَّ صلى الله عليه وسلم كَانَ إِذَا أَرَادَ حَاجَةً لاَ يَرْفَعُ ثَوْبَهُ حَتَّى يَدْنُوَ مِنَ الأَرْضِ (అన్నన్ నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లం కాన ఇదా అరాద హాజతన్ లా యర్ఫవు సౌబహు హత్తా యద్నువ మినల్ అర్ద్) “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకోవడానికి, తమ అవసరాన్ని తీర్చుకోవడానికి ఉద్దేశించినప్పుడు భూమికి దగ్గరగా అయ్యేంతవరకు తమ వస్త్రాలు, తమ బట్టలు తీసేవారు కాదు.” (సునన్ అబీ దావూద్: 14)
అయితే ఎంతగా మనం మన మర్మావయవాలను ఇతర చూపుల నుండి దాచి ఉంచవలసిన అవసరం ఉందో, దీని గురించి ఎంత మంచి శిక్షణ స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ ఆచరణ ద్వారా మనకు చూపుతున్నారో గమనించండి. ఈ హదీస్ సునన్ అబీ దావూద్ లో హదీస్ నెంబర్ 14.
3. ప్రవేశించే ముందు దుఆ
మరుగుదొడ్డిలో ప్రవేశిస్తూ లేదా ఎడారి ప్రాంతంలో వెళ్ళినప్పుడు అక్కడ సామాన్యంగా ప్రజలకు తెలిసి ఉంటుంది, అర కిలోమీటర్, పావు కిలోమీటర్, కిలోమీటర్ నడిచి వెళ్తారు, కానీ ఇక్కడి నుండి కాలకృత్యాలు తీర్చుకునే ఈ ప్రాంతం అన్నటువంటి ఒక ఏర్పాటు అనేది అందరికీ తెలిసి ఉంటుంది. ఆ ప్రాంతంలో ప్రవేశించిన తర్వాతనే దుఆ చదువుకోవాలి. ఇక మరుగుదొడ్డి ఏదైతే ఉంటే, నాలుగు గోడల మధ్యలో ఏదైతే ఉంటే, బాత్రూంలో, టాయిలెట్లో ప్రవేశించేకి ముందే దాన్ని చదువుకోవాలి.
బిస్మిల్లాహ్ అనాలి, ఆ తర్వాత,
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْخُبُثِ وَالْخَبَائِثِ “అల్లాహుమ్మ ఇన్నీ అవూదుబిక మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్“ ఓ అల్లాహ్, నేను నీ శరణులో జొచ్చుచున్నాను, స్త్రీ, పురుషుల జిన్నాతుల నుండి
ఇది సహీ బుఖారీలో ఉంది హదీస్ నెంబర్ 142. కానీ బిస్మిల్లాహ్ గురించి ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంత గొప్ప విషయం చెప్పారో గమనించండి. కాలకృత్యాలు తీర్చుకునే సందర్భంలో మనిషి తన మర్మ అవయవాలను దాచి ఉంచలేకపోతాడు గనుక, ఆ సందర్భంలో జిన్నాతులు కూడా చూసే అవకాశం ఉంటుందా లేదా? అందుగురించి మీరు బిస్మిల్లాహ్ అని ఆ సందర్భంలో ముందే అనేది ఉంటే మీకు మరియు జిన్నాతులకు మధ్యలో ఒక పరదా ఏర్పడుతుంది, వారు మీ మర్మ అవయవాలను చూడలేరు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు.
కాలకృత్యాలు తీర్చుకొని పరిశుభ్రత, పరిశుభ్రం చేసుకున్న తర్వాత తిరిగి ఎప్పుడైతే వస్తారో, బయటికి వచ్చిన తర్వాత “గుఫ్రానక” అని అనాలి. బిస్మిల్లా – అల్లాహ్ యొక్క పేరుతో నేను ఈ నా అవసరాన్ని తీర్చుకోవడానికి వెళ్తున్నాను అన్న భావం. అల్లాహుమ్మ ఇన్నీ అవూదుబిక – ఓ అల్లాహ్, నేను నీ శరణులో జొచ్చుచున్నాను, మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్ – స్త్రీ, పురుషుల జిన్నాతుల నుండి. తిరిగి వచ్చిన తర్వాత ఏమనాలి? గుఫ్రానక – అంటే ఓ దేవా, నీవు నన్ను క్షమించు.
4. మాట్లాడరాదు
నాలుగవ విషయం, కాలకృత్యాలు తీర్చుకునే సందర్భంలో మాట్లాడవద్దు. ఏ మాత్రం మాట్లాడవద్దు. మరీ ఏదైనా అత్యవసర విషయం ఉండి సంక్షిప్తంగా ఏదైనా మాట్లాడితే అది వేరే విషయం అని కొందరు పండితులు చెప్పారు. కానీ ఒక సామాన్య పద్ధతి ఏమిటి? మన కాలకృత్యాలు తీర్చుకునే సందర్భంలో మాట్లాడవద్దు. సహీహాలో ఈ హదీస్ ఉంది, షేక్ అల్బానీ రహిమహుల్లాహ్ గారు సహీ అని చెప్పారు.
إِذَا تَغَوَّطَ الرَّجُلَانِ فَلْيَتَوَارَ كُلُّ وَاحِدٍ مِنْهُمَا عَنْ صَاحِبِهِ وَلَا يَتَحَدَّثَانِ عَلَى طَوْفِهِمَا فَإِنَّ اللَّهَ يَمْقُتُ عَلَى ذَلِكَ “ఇద్దరు మనుషులు కలిసి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కడూ తన స్నేహితుని చూపులకు దూరంగా ఉండే అటువంటి ప్రదేశాల్లోకి వెళ్ళిపోవాలి. మరి తమ అవసరం తీర్చుకున్న సందర్భంలో ఏ మాత్రం మాట్లాడవద్దు. ఇందువల్ల అల్లాహ్ త’ఆలా వారిపై చాలా ఆగ్రహపడతాడు.”
5. తీసుకువెళ్ళకూడని వస్తువులు
ఐదవ విషయం, కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు సామాన్యంగా అల్లాహ్ యొక్క పేరు గల ఏ వస్తువు కూడా వెంట తీసుకెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఈ విషయంలో వచ్చిన ఒక హదీస్ బలహీనంగా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉంగరం మీద “ముహమ్మద్ రసూల్ అల్లాహ్” అంటే ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త అన్న భావం, ఈ మూడు పదాలు ఉండేవి. అయితే అల్లాహ్ యొక్క పేరు కూడా వచ్చింది గనుక దాన్ని తీసి బయట పెట్టి వెళ్ళేవారు అని. కానీ హదీస్ దయీఫ్ ఉంది. అయినా గానీ సర్వసామాన్యంగా పండితులందరూ కూడా ఏకీభవించారు, అల్లాహ్ పేరు గల ఏ వస్తువు కూడా ఎంబడి తీసుకొని వెళ్ళకూడదు.
కానీ కొన్ని వస్తువులు దాన్ని బయట పెట్టి వెళ్ళడం ద్వారా ఏదైనా మనకు నష్టం ఉంది, దాన్ని కాపాడలేకపోతాము, అలాంటి సందర్భంలో మరికొందరు పండితులు ఏం ఫత్వా ఇచ్చారంటే దానిని బహిరంగంగా ఉండకుండా జేబు లోపల గానీ, దస్తీ లోపల గానీ, ఇలాంటివన్నీ దాచిపెట్టి పోయే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనిషి ఖురాన్ కంఠస్థం చేసి ఉంటాడు, దాన్ని బయటికి తీసి వెళ్ళలేడు కదా. అయితే దాని యొక్క పోలిక అని కొందరు పండితులు చెప్పారు. అలాగే జవ్వాలల్లో ఉదాహరణకు ఖురాన్ ఉంటుంది, లేదా ఏదైనా కాయితం ఉంది, ఏదైనా దువాల పుస్తకం ఉంది, అలాంటివి బయట పెట్టి వెళ్ళడం వల్ల, బయట పెట్టి వెళ్ళడం వల్ల ఏదైనా నష్టం అన్నటువంటి భయం ఉండేది ఉంటే లోపల పెట్టి వెళ్ళవచ్చు అని చెప్పారు.
6. ఖిబ్లా దిశ
ఆరో విషయం, ప్రత్యేకంగా ఎడారి ప్రాంతంలో, ఓపెన్ ప్లేస్ లో కాలకృత్యాలు తీర్చుకునే సందర్భంలో ఖిబ్లా దిశలో ముఖము గానీ వీపు గానీ ఉండకూడదు. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 394 లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు అన్హు ఉల్లేఖకులు:
కానీ నాలుగు గోడల మధ్యలో ఉండేది ఉంటే అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అలా కూడా ఉండకుండా ముందు నుండే జాగ్రత్తపడటం మరీ మంచిది. ఎందుకనగా అబూ దావూద్ లో హదీస్ నెంబర్ 11 లో, ఇంకా సహీ బుఖారీ వేరే చోట కూడా ఈ హదీస్ ఉంది ఈ భావంలో, సహీ బుఖారీలో ఉంది 148, ఇబ్నె ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఒకసారి ఏదో అవసరం పడి తమ సోదరి అయిన హఫ్సా రదియల్లాహు త’ఆలా అన్హా గారి ఇంటి కప్పు మీదికి వెళ్ళడానికి పైన ఎక్కుతున్నారు. ఆ సందర్భంలో ప్రవక్త గారు ఖిబ్లా దిశలో, ఖిబ్లా దిశలో వీపు పెట్టి తమ కాలకృత్యాలు తీర్చుకున్నట్టు కనబడింది, తర్వాత బహుశా ఆ విషయంలో అడిగారు. అయితే ఈ హదీస్ ద్వారా ధర్మవేత్తలు ఏమన్నారంటే నాలుగు గోడల మధ్యలో ఉండేది ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదు. అదే కాకుండా ఒక సందర్భంలో ఇబ్ను ఉమర్ స్వయంగా ప్రయాణంలో ఉన్నారు, అప్పుడు తమ ఒంటెను నిలిపారు, ఖిబ్లా దిశలో మూత్రం పోశారు. ఆ సందర్భంలో మర్వానల్ అస్ఫర్ అనే ఒక వ్యక్తి ఈ సంఘటనను చూసి వెంటనే ప్రశ్నించారు: “యా అబా అబ్దిర్రహ్మాన్, అలైస ఖద్ నుహియ అన్ హాదా? ఖిబ్లా దిశలో ఉండి, ఖిబ్లా దిశలో ముఖం గానీ వీపు గానీ చేసి కాలకృత్యాలు తీర్చుకోవద్దు, మూత్ర మలమూత్రానికి వెళ్ళవద్దు అని మనకు నిషేధించబడలేదా?“అయితే అబ్దుల్లా బిన్ ఉమర్ ఏమన్నారు?
نُهِيَ عَنْ ذَلِكَ فِي الْفَضَاءِ “ఎడారి ప్రాంతంలో, ఓపెన్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఇలా చేయకూడదు అని నిషేధించబడింది.”
فَإِذَا كَانَ بَيْنَكَ وَبَيْنَ الْقِبْلَةِ شَيْءٌ يَسْتُرُكَ فَلاَ بَأْسَ “ఒకవేళ నీ మధ్యలో మరియు ఖిబ్లా మధ్యలో ఏదైనా అడ్డు ఉండి దాని వెనుక నీవు నీ అవసరాన్ని తీర్చుకుంటే అందులో ఎలాంటి అభ్యంతరం లేదు” అని అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు చెప్పారు.
నాలుగు గోడల మధ్యలో ఖిబ్లా దిశలో ఉన్నా గానీ మన టాయిలెట్, ఎలాంటి అభ్యంతరం లేదు అని హదీసుల ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయినా గానీ ఎవరైనా ముందు నుండే దాన్ని కట్టేటప్పుడు ఖిబ్లాకు వ్యతిరేక దిశలో కట్టేది ఉంటే మరీ మంచిది.
7. శపించబడిన స్థలాలు
ఏడవ విషయం, శాపనకు గురి కావలసిన స్థలాల్లో మలమూత్రం చేయకూడదు. శాపనకు గురి కావలసిన స్థలాల్లో అంటే ఏంటి? హదీస్ లో ఇలాగే ఉంది. ముస్లిం షరీఫ్ 269 లో హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు:
اتَّقُوا اللَّعَّانَيْنِ (ఇత్తఖుల్ లఅనైన్) “అధికంగా శాపం ఇచ్చే రెండు విషయాల నుండి మీరు జాగ్రత్త పడండి.”
ప్రవక్తను అడిగారు, వమల్ లఅనాని యా రసూలల్లాహ్? ప్రవక్తా, ఆ రెండు అధికంగా శాపనానికి గురి అయ్యే ఆ విషయాలు ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు:
الَّذِي يَتَخَلَّى فِي طَرِيقِ النَّاسِ أَوْ فِي ظِلِّهِمْ (అల్లది యతఖల్లా ఫీ తరీఖిన్నాసి అవ్ ఫీ దిల్లిహిమ్) “ప్రజల దారి మధ్యలో లేదా నీడలో మలమూత్ర విసర్జన చేసేవాడు.”
అంటే ఆ మలమూత్ర విసర్జన అనేది ఆ ప్రాంతంలో చేయడం ద్వారా ప్రజలు అసహ్యించుకుంటారు, ప్రజలు శపిస్తారు, ఆ శాపనకు అలాంటి వారు గురి అవుతారు.
సునన్ అబీ దావూద్ లో హదీస్ నెంబర్ 26 లో ఉంది, ముఆద్ ఇబ్ను జబల్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు:
اتَّقُوا الْمَلَاعِنِ الثَّلَاثَةَ (ఇత్తఖుల్ మలాయినిస్ సలాస) “మూడు శాపనానికి గురి అయ్యే విషయాల నుండి మీరు దూరం ఉండండి: అల్ బరాజ్ ఫిల్ మవారిద్, వఖారిఅతిత్ తరీఖ్, వ దిల్ల్. నీళ్ళు త్రాగేచోట మల విసర్జన చేయడం, లేదా దారి మధ్యలో దారి పక్కన, ఇంకా నీడ ఉన్నచోట.”
8. తుంపరల పట్ల జాగ్రత్త
ఎనిమిదవ విషయం, శరీరం లేక మన దుస్తులపై ఎలాంటి మలమూత్ర తుంపరలు పడకుండా జాగ్రత్త పడాలి. ఇందులో ఎలాంటి అలసత్వం చేయకపోవడం చాలా మంచిది. ఎందుకనగా ఇది చాలా భయంకరమైన విషయం, ఇది చాలా పెద్ద పాపంలో లెక్కించబడుతుంది. ఘోర పాపంలో. అందుగురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు సునన్ ఇబ్నె మాజా హదీస్ నెంబర్ 348 లో,
أَكْثَرُ عَذَابِ الْقَبْرِ مِنَ الْبَوْلِ (అక్సరు అదాబిల్ ఖబ్రి మినల్ బౌల్) “సమాధిలో ఎక్కువగా శిక్ష దేని గురించి అయితే జరుగుతుందో, అది మూత్ర విసర్జనలో అశ్రద్ధ చేయడం, లేక మూత్ర తుంపరల నుండి జాగ్రత్త పడకపోవడం, లేదా మూత్రం పోసిన తర్వాత పరిశుభ్రత విషయంలో అశ్రద్ధకు గురి కావడం.” ఇవన్నీ భావాలు కూడా అందులో వస్తాయి.
ఇంకా సహీ బుఖారీ హదీస్ నెంబర్ 216 లో ఉంది. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్తూ ఉంటే రెండు సమాధులు కనబడ్డాయి. అందులో ఉన్న ఆ ఇద్దరు మనుషులకు, శవాలకు చాలా శిక్ష అవుతుంది అని చెప్పారు. అయితే ప్రవక్తలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అందులో ఒకరి గురించి చెప్పారు,
كَانَ أَحَدُهُمَا لَا يَسْتَتِرُ مِنْ بَوْلِهِ (కాన అహదుహుమా లా యస్తతిరు మిన్ బౌలిహి) “ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి తన మూత్రం నుండి జాగ్రత్త పడేవాడు కాడు, మూత్ర తుంపరలు మీద పడకుండా తనను తాను కాపాడుకునేవాడు కాడు, ఇంకా మూత్రం పోసిన తర్వాత శుభ్రం చేసుకునేవాడు కాడు, శుభ్రం చేసుకున్నా అందులో కూడా అశ్రద్ధతనం పాటించేవాడు.” ఇవన్నీ భావాలు కూడా ఈ హదీస్ లో వస్తాయి. రెండో వ్యక్తి ఎవరు? చాడీలు చెప్పేవాడు.
9. శుభ్రత పద్ధతులు (నీళ్ళు, రాళ్ళు)
తొమ్మిదవ విషయం, మలమూత్ర విసర్జన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. నీళ్లు ఉపయోగించాలి. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 150 లో ఉంది, “ఇదా ఖరజ లిహాజతిహి అజీవు అన వగులామున్ మఅనా ఇదావతున్ మిమ్మాఇన్ యఅనీ యస్తంజీ బిహి.” హజరత్ అనస్ రదియల్లాహు అన్హు గారు ఈ విషయం తెలుపుతున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మలమూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు నేను మరియు ఇంకో నాలాంటి యువకుడు, మేము ఇద్దరము ప్రవక్త గారి వెంట వెళ్ళేవాళ్ళము, మా వెంట మేము నీళ్ళు తీసుకొని వెళ్ళేవాళ్ళము. అయితే ఎక్కడి వరకైతే వెళ్ళేవారో అక్కడికి వెళ్లి, ఆ తర్వాత ఎక్కడనైతే ప్రజల చూపులకు కనబడకుండా వెళ్ళేది ఉందో, అక్కడి నుండి ప్రవక్త ఆ నీళ్లు తమ వెంట తీసుకొని వెళ్ళేవారు. అయితే నీళ్ళతో పరిశుభ్రత అనేది పాటించాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పాటించేవారు అన్న విషయం మనకి ఈ హదీస్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది.
అంతే కాదు, సునన్ తిర్మిదీలో, సునన్ తిర్మిదీలో హదీస్ నెంబర్ 19, హజరత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా స్త్రీలతో చెప్పారు. “ముర్న అజ్వాజకున్న అన్ యస్తతీబూ బిల్ మాఇ ఫఇన్నీ అస్తహ్యీహిమ్, ఫఇన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కాన యఫ్అలు.” “మీరు మీ భర్తలకు, మీ పురుషులకు నీళ్ళతో శుభ్రపరుచుకోవాలని, మలమూత్ర విసర్జన తర్వాత నీళ్లు ఉపయోగించాలని, నీళ్లతో శుభ్రపరుచుకోవాలని మీరు ఆదేశించండి. వారికి నేను చెప్పడంలో సిగ్గుపడుతున్నాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే చేసేవారు.”
ఒకవేళ నీళ్ళు లేని సందర్భంలో లేదా నీళ్లతో పాటు కూడా ఇటిక పెడ్డలను, నీళ్ళు పీల్చే రాయిని లేక టిష్యూ పేపర్, ఇలాంటి వాటిని కూడా ఉపయోగించడం మరీ మంచిది. మరీ మంచిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో వచ్చిన తర్వాత సూరె తౌబాలో ఆయత్ నెంబర్ 108 లో,
ఈ మదీనా వాసుల్లో అన్సార్ లో కొందరు, ప్రత్యేకంగా ఖుబా వాసులు, ఖుబా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్నవారు, వారిని ప్రశంసిస్తూ ఈ ఆయత్ అవతరించింది. ఏంటి? అక్కడి వాసుల్లో కొందరు పరిశుభ్రంగా ఉండడాన్ని చాలా ప్రేమిస్తారు, మరియు అల్లాహ్ పరిశుభ్రత పాటించే వారిని కూడా ప్రేమిస్తాడు. ఆ మనుషులు ఎవరు? పరిశుభ్రతను చాలా ఇష్టపడతారు. అయితే వారిని ప్రశంసిస్తూ అల్లాహ్ ఏమన్నాడు? వల్లాహు యుహిబ్బుల్ ముత్తహిరిన్ – అల్లాహ్ పరిశుభ్రత పాటించే వారిని ప్రేమిస్తాడు.
అయితే హజరత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు గారు అంటున్నారు, ఇబ్నె ఖుజైమాలో ఈ హదీస్ ఉంది, సహీ హదీస్, వారు నీళ్ళను ఉపయోగించేవారు. అందుగురించి వారి యొక్క ప్రశంసలో అల్లాహ్ త’ఆలా ఈ ఆయత్ ను అవతరింపజేశాడు. అయితే అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు తఫ్సీర్ గ్రంథాల్లో ఈ విషయం ఉంది, వారు నీళ్లతో పాటు మట్టి పెడ్డలను, ఇటికలను ఇలాంటి వాటిని, నీళ్లు పీల్చే అలాంటి వస్తువులను ఉపయోగించేవారు, రెండిటి ద్వారా వారు పరిశుభ్రతను పాటించేవారు గనుక వారిని ప్రశంసిస్తూ అల్లాహ్ త’ఆలా ఈ ఆయత్ ని అవతరింపజేశాడు. అంటే విషయం ఏంటి ఇక్కడ? నీళ్ళు అయితే కంపల్సరీ వాడాలి, నీళ్ళు లేని సందర్భంలో లేక నీళ్లతో పాటు కూడా ఈ వస్తువులు వాడడం కూడా మరీ మంచిది అన్న విషయం ఈ ఆయత్ మరియు దీనికి సంబంధించిన తఫ్సీర్ల ద్వారా మనకు తెలుస్తుంది.
10. గమనించవలసిన మరికొన్ని విషయాలు
అయితే పరిశుభ్రత కొరకు ఎడమ చెయ్యి మాత్రమే ఉపయోగించాలి, కుడి చెయ్యి ఉపయోగించకూడదు. సహీ బుఖారీలో హదీస్ ఉంది, అబూ ఖతాదా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు:
إِذَا بَالَ أَحَدُكُمْ فَلَا يَأْخُذَنَّ ذَكَرَهُ بِيَمِينِهِ وَلَا يَسْتَنْجِ بِيَمِينِهِ “మీలో ఎవరైనా మూత్రం పోయినప్పుడు తన మూత్రాంగాన్ని కుడి చేత్తో పట్టుకోకూడదు. కుడి చేతితో పరిశుభ్రత కూడా చేయకూడదు.”
అలాగే పరిశుభ్రత సందర్భంలో నీళ్లతో మనం పరిశుభ్రం చేసినా గానీ, పెడ్డలతో చేసినా, టిష్యూ పేపర్ తో చేసినా గానీ, మూడేసి సార్లు చేయాలి. కానీ కనీసం. అంతకంటే ఎక్కువ చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. ఏదైనా ఎక్కడికైనా వెళ్లారు, నీళ్ళు లేవు, పెడ్డలు ఉపయోగిస్తాము, మూడు పెడ్డలు తీసుకోవాలి. లేదా ఒక పెద్ద రాయి తీసుకొని మూడు దిక్కుల్లో, మూడు సార్లు… ఈ విషయాన్ని వివరంగా చెప్పడంలో చాలా సిగ్గుపడుతూ ఉంటాము, కానీ అర్థం కావడానికి, ఒక పెడ్డ తీసుకున్నాము, మూత్రం పోసిన తర్వాత తొందరపాటు పడవద్దు. మధ్యలో ఆగి ఉన్న చుక్కలన్నీ పడిపోయేంతవరకు వేచి ఉండాలి. ఆ తర్వాత పెడ్డ తీసుకొని ఒక వైపున తుడువాలి, దాన్ని తిప్పేసి రెండోసారి తుడువాలి, మళ్ళీ తింపేసి మూడోసారి తుడువాలి. లేదా మూడు వేరేవేరే రాళ్లు పెడ్డలు తీసుకోవాలి. అంటే కనీసం మూడుసార్లు ఈ కడగడం అనేది, తుడువడం అనేది జరగాలి.
ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే ఆదేశించారో, ఇబ్నె మాజాలో ఈ హదీస్ ఉన్నది, హదీస్ నెంబర్ 350. కానీ దీని యొక్క లాభాన్ని హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఎలా చెబుతున్నారో శ్రద్ధ వహించండి. ఈ ప్రవక్త గారి ఆదేశం వచ్చిన తర్వాత మేము మూడేసి సార్లు కడిగేవాళ్ళం,
فَوَجَدْنَاهُ دَوَاءً وَطَهُورًا (ఫవజద్నాహు దవాఅన్ వతహూరా) “దాని మూలంగా దానివల్ల పరిశుభ్రత కూడా పొందినాము, ఎన్నో రోగాలకు చికిత్స కూడా మేము పొందాము.”
అలాగే పరిశుభ్రత కొరకు ఎముక, బొక్క, లేదా పేడ లేదా ఎండిన పిడిక, పెండను పిడికగా చేస్తారు కదా, ఆ పిడికలను గానీ ఏ మాత్రం ఉపయోగించకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ సహీ బుఖారీలో 3571 లో ఉంది. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సహాబీకి ఆదేశించారు రాళ్లు తీసుకురమ్మని, కానీ ఏం చెప్పారు?
وَلاَ تَأْتِنِي بِعَظْمٍ وَلاَ بِرَوْثَةٍ (వలా తఅతినీ బిఅద్మిన్ వలా బిరౌసతిన్) “ఎముక గానీ లేదా పేడ గానీ తీసుకురాకు.”
కాలకృత్యాలు తీర్చుకున్నారు, అన్నీ పరిశుభ్రతలు అయిపోయినాయి, తర్వాత ఆ సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగారు, “మీరు ఎందుకు ఈ రెండిటినీ తీసుకురావద్దని చెప్పారు?” అని. అవి మీ సోదరులైన జిన్నాతులకు ఆహారంగా పనిచేస్తాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు.
మలమూత్ర విసర్జన సందర్భంలో సలాం కూడా చేయరాదు, ఎవరైనా సలాం చేస్తే సమాధానం కూడా, జవాబు కూడా ఇవ్వకూడదు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మూత్రం పోస్తున్నారు. కొంచెం దూరంగా ఒక వ్యక్తి వెళ్తూ వెళ్తూ సలాం చేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమాధానం చెప్పలేదు. తర్వాత అతనితో కలిసి చెప్పారు, ఇలాంటి సందర్భంలో మీరు సలాం చేయకండి. ఒకవేళ మీరు సలాం చేసినా నేను మీకు సమాధానం పలుకను. ఈ హదీస్ ఇబ్నె మాజాలో ఉంది 346.
ఇంతవరకు అల్లాహ్ యొక్క దయవల్ల మనం మలమూత్ర విసర్జనకు సంబంధించిన ఇంచుమించు 14, 13 పద్ధతులను, విషయాలను ఆధారాలతో సహా విన్నాము.
చివరి విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో నిలబడి మూత్రం పోసే అవసరం పడవచ్చు. అది ఇస్లాంలో ధర్మమేనా లేదా? అందులో ఎలాంటి అనుమానం లేదు, అది యోగ్యమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఒక సందర్భంలో ఇలాంటి అవసరం పడింది, నిలబడి మూత్రం పోశారు అన్న విషయం సహీ బుఖారీలో హదీస్ నెంబర్ 224 లో ఉంది.
కానీ అవసరం ఉండి నిలబడి పోసినా లేదా సామాన్యంగా కూర్చుండి మూత్రం పోసినా, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే తుంపరలు, మూత్రపు చుక్కలు మీద పడకుండా చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే సమాధిలో ఎక్కువగా శిక్ష దీని గురించే జరుగుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు.
ఈరోజు అల్లాహ్ యొక్క దయవల్ల ఈ విషయాలు ఏదైతే మనం తెలుసుకున్నామో, ఇలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సరైన పద్ధతిలో ఈ అవసరాలు ఇంకా మన సర్వ జీవితం గడిపే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరన్ వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వబరకాతుహ్.
కొన్ని మలమూత్ర విసర్జన పద్దతులు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
1- మరుగుదొడ్డిలో ఎడమ కాలుతో ప్రవేశిస్తూ, ప్రవేశముకు ముందే చదవాలిః
اللَّهُمَّ إِنِّي أَعُوْذُ بِكَ مِنَ الْخُبُثِ وَالْخَبَائِثِ బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్ . (అల్లాహ్ పేరుతో, ఓ అల్లాహ్ నేను దుష్ట జిన్నాతు స్త్రీ పురుషుల నుండి నీ శరణు జొచ్చుచున్నాను). (బుఖారి 142, ముస్లిం 375).
మరుగుదొడ్డి నుండి కుడి కాలు ముందు వేస్తూ బయటకు వచ్చి చదవాలి:
2- అల్లాహ్ పేరుగల ఏ వస్తువూ మరుగుదొడ్డిలోకి తీసుకెళ్ళకూడదు. కాని దాన్ని తీసి పెట్టడంలో ఏదైనా నష్టం ఉంటే వెంట తీసుకెళ్ళవచ్చును.
3- ఎడారి ప్రదేశంలో కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఖిబ్లా వైపున ముఖము, వీపు గానీ పెట్టి కూర్చోకూడదు. నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు ఏలాంటి అభ్యంతరము లేదు.
4- సతర్ పరిధిలోకి వచ్చే శరీర భాగాన్ని ప్రజల చూపులకు మరుగు పరచాలి. ఇందులో ఏ కొంచమైనా అశ్రద్ధ వహించకూడదు. పురుషుల సతర్ నాభి నుండి మోకాళ్ళ వరకు. స్తీ యొక్క పూర్తి శరీరం, నమాజులో కేవలం ముఖము తప్ప. స్తీ నమాజులో ఉన్నప్పుడు పరపురుషులు ఎదురౌవుతే ముఖముపై ముసుగు వేసుకోవాలి.
5- శరీరం లేక దుస్తులపై మలమూత్ర తుంపరులు పడకుండా జాగ్రత్త వహించాలి.
6- మలమూత్ర విసర్దన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. నీళ్ళు లేనప్పుడు నజాసత్ మరకలను దూరము చేయుటకు రాళ్ళు, కాగితము లాంటివి ఉపయోగించవచ్చును. పరిశుభ్రత కొరకు ఎడమ చెయ్యి మాత్రమే ఉపయోగించాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
తయమ్ముం, దాని విధానం మరియు సందర్భాలు [https://youtu.be/1saC1XDHDgo [30 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
తయమ్ముమ్:
క్రింద తెలుపబడే కారణాలు సంభవించినప్పుడు ప్రయాణికులు, స్థానికులు ఎవరైనా సరే వుజూ మరియు గుస్ల్ కు బదులుగా తయమ్ముమ్ చేయవచ్చును.
1- అతికష్టంగా వెతికినప్పటికీ నీళ్ళు దొరకనప్పుడు, లేదా ఉండికూడా వుజూకు సరిపడనప్పుడు తయమ్ముమ్ చేయవచ్చును. కొంత దూరములో నీళ్ళు ఉన్నా అక్కడికి వెళ్ళి తీసుకోవడంలో అతనికి ధన, ప్రాణ నష్టమున్నప్పుడు కూడా తయమ్ముమ్ చేయవచ్చును.
2- వుజూ అవయవాల్లో ఏ ఒకదానికైనా గాయమయితే దాన్ని కడిగే ప్రయత్నం చేయాలి. కడగడం వల్ల నష్టం ఉంటే మసహ్ చేయాలి, అంటే చేయి తడి చేసి దాని మీద తుడువాలి. మసహ్ వల్ల కూడా హాని కలిగే భయం ఉంటే తయమ్ముమ్ చేయవచ్చును.
3- ఏ నీళ్ళు లేదా వాతవరణం మరీ చల్లగా ఉండి నీళ్ళ ఉపయోగం హానికరంగా ఉంటే తయమ్ముమ్ చేయవచ్చును.
4- నీళ్ళు కేవలం త్రాగడానికి మాత్రమే ఉన్నప్పుడు కూడా తయమ్ముమ్ చేయవచ్చును.
తయమ్ముమ్ విధానం:
మనుసులో నియ్యత్ /సంకల్పం చేసుకొని రెండు అరచేతులు ఒక సారి భూమిపై తట్టి ముఖముపై మళ్ళీ మణికట్ల వరకు రెండు చేతులపై మసహ్ చేయాలి. (కొందరు వుజూ చేసినట్టుగా మోచేతుల వరకు, కాళ్ళు సయితం మసహ్ చేస్తారు ఇది ప్రవక్త పద్దతి ఎంతమాత్రం కాదు). వుజూను భంగపరిచే విషయాలే తయమ్ముమ్ ను భంగపరుస్తాయి. నమాజుకు ముందు లేదా నమాజు మధ్యలో నీళ్ళు లభిస్తే తయమ్ముమ్ భంగమవుతుంది. నమాజు పూర్తి చేసుకున్న తరువాత నీళ్ళు లభిస్తే ఆ నమాజు అయినట్లే. తిరిగి మళ్ళీ చేయవలసిన అవసరం లేదు.
ఈ ఆడియోలో, ప్రవక్త తయమ్ముమ్ (నీరు లేనప్పుడు చేసే శుద్ధి) గురించి వివరిస్తున్నారు. తయమ్ముమ్ అంటే అల్లాహ్ ఆరాధన ఉద్దేశంతో పరిశుభ్రమైన మట్టిపై రెండు చేతులు కొట్టి ముఖాన్ని మరియు రెండు అరచేతులను తుడుచుకోవడం. నీరు అందుబాటులో లేనప్పుడు లేదా దాని వాడకం హానికరమైనప్పుడు తయమ్ముమ్ చేయడం విధిగా చెప్పబడింది. ఇది ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఉమ్మత్కు మాత్రమే ఇవ్వబడిన ఒక గొప్ప వరం మరియు సౌకర్యం అని, గత ప్రవక్తల అనుచరులకు ఈ సౌలభ్యం లేదని హదీసుల ద్వారా వివరించబడింది. తయమ్ముమ్ యొక్క షరతులు – నియ్యత్ (ఉద్దేశం), నీరు లేకపోవడం, మరియు పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించడం. చిన్న అశుద్ధి (హదసె అస్గర్) మరియు పెద్ద అశుద్ధి (హదసె అక్బర్) రెండింటికీ తయమ్ముమ్ సరిపోతుంది. అయితే, నీరు అందుబాటులోకి వచ్చిన వెంటనే, తయమ్ముమ్ చెల్లదు మరియు స్నానం లేదా వుదూ చేయడం తప్పనిసరి అవుతుంది.
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ సహ్బిహీ అజ్మయీన్, అమ్మా బాద్.
తయమ్ముమ్ అంటే ఏమిటి?
తయమ్ముమ్ అంటే అల్లాహ్ యొక్క ఆరాధన ఉద్దేశంతో పరిశుభ్రమైన మట్టి మీద రెండు అరచేతులను కొట్టి ముందు ముఖం మీద తర్వాత రెండు అరచేతుల మీద ఇలా తుడుచుకోవడం.
నీళ్లు లేని సందర్భంలో లేదా నీళ్లు ఉండి దాని ఉపయోగం హానికరంగా ఉన్నందువల్ల ఈ తయమ్ముమ్ చేయటం విధిగా ఉంది. అల్లాహుతాలా దీని గురించి చాలా స్పష్టంగా ఆదేశించాడు. సూరె మాయిదా సూర నెంబర్ ఐదు ఆయత్ నెంబర్ ఆరులో అల్లాహ్ ఆదేశం ఉంది.
فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا ఫలమ్ తజిదూ మాఅన్ ఫతయమ్మమూ సయీదన్ తయ్యిబా మీరు నీళ్లు పొందని స్థితిలో పరిశుభ్రమైన మట్టితో తయమ్ముమ్ చేసుకోండి.
فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ مِنْهُ ఫమ్సహూ బివుజూహికుమ్ వ ఐదీకుమ్ మిన్హ్ మీ ముఖాలను తుడుచుకోండి. మీ చేతులను కూడా తుడుచుకోండి.
అయితే దీని ఆదేశం ఏంటి? విధిగా ఉంది. నీళ్లు లేని సందర్భంలో లేక నీళ్లు ఉండి మన కొరకు హానికరంగా ఉన్న సందర్భంలో తయమ్ముమ్ తప్పనిసరిగా చేయాలి.
తయమ్ముమ్ యొక్క ప్రాముఖ్యత మరియు ప్రత్యేకత
అయితే ఇక్కడ ఇంకో విషయం మనకు తెలిసి ఉండటం చాలా మంచిది. అందువల్ల మనం అల్లాహ్ యొక్క కృతజ్ఞత అనేది ఇంకా ఎంతో గొప్పగా చెల్లించుకోవచ్చు. అదేమిటి?
ఈ తయమ్ముమ్ యొక్క సౌకర్యం ఇది అల్లాహ్ వైపు నుండి కేవలం మన కొరకు ఒక గొప్ప వరం. ఎందుకంటే ఇంతకుముందు ప్రవక్తల అనుసరులకు, ఇంతకుముందు ప్రవక్తలను విశ్వసించిన వారికి ఇలాంటి సౌకర్యం అల్లాహ్ ప్రసాదించలేదు. ఈ సౌకర్యం అల్లాహ్ తాలా ఎవరికి ఇచ్చాడు ప్రత్యేకంగా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుసరులకు, ఆయనను విశ్వసించిన వారికి ప్రసాదించాడు.
ఈ విషయం బుఖారీ ముస్లింలో ఒక చాలా స్పష్టమైన హదీస్ ఉంది. జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తాలా అన్హు గారు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు: “ఐదు విషయాలు ఉన్నాయి, నాకంటే ముందు ఏ ప్రవక్తకు అవి ఇవ్వబడలేదు.” గమనించండి. అంటే ఈ ఐదు విషయాల ప్రత్యేకత అనేది కేవలం మన ప్రవక్తకే ప్రసాదించబడినది. ఒకటి, నా శత్రువులు నా నుండి ఒక నెల దూర ప్రయాణంలో ఉంటారు కానీ వారి హృదయాల్లో అల్లాహ్ నా యొక్క భయం వేస్తాడు. రెండవది, అది మన టాపిక్ కు సంబంధించింది.
وَجُعِلَتْ لِيَ الْأَرْضُ مَسْجِدًا وَطَهُورًا వ జుఇలత్ లియల్ అర్దు మస్జిదవ్ వతహూరా సర్వభూమిని అల్లాహ్ నా కొరకు నమాజు చేయుటకు స్థలంగా, పరిశుభ్రత పొందుటకు సాధనంగా చేశాడు.
فَأَيُّمَا رَجُلٍ مِنْ أُمَّتِي أَدْرَكَتْهُ الصَّلَاةُ فَلْيُصَلِّ ఫఅయ్యుమా రజులిమ్ మిన్ ఉమ్మతీ అద్రకత్ హుస్సలా ఫల్ యుసల్లీ. ఈ భూమిలో మీరు ఎక్కడ సంచరిస్తున్నా సరే, ఎక్కడా ఉన్నా సరే నమాజ్ టైం అయిన వెంటనే నమాజ్ చేసుకోవాలి. నీళ్లు లేవు, తహారత్ లేదు ఇలాంటి ఏ సాకులు చెప్పుకోరాదు.
మూడో విషయం,
وَأُحِلَّتْ لِيَ الْغَنَائِمُ وَلَمْ تَحِلَّ لِأَحَدٍ قَبْلِي వ ఉహిల్లత్ లియల్ గనాయిమ్ వలమ్ తహిల్ల లిఅహదిన్ ఖబ్లీ. యుద్ధ ఫలం నా కొరకు హలాల్, ధర్మసమ్మతంగా చేయబడింది. నాకంటే ముందు ఎవరి కొరకు కూడా అది ధర్మసమ్మతంగా లేకుండింది.
మాలె గనీమత్, యుద్ధ ఫలం, యుద్ధ ధనం, యుద్ధం జరిగినప్పుడు ఇస్లాం మరియు కుఫ్ర్ మధ్యలో ఇస్లాం పై ఉన్నవారు గెలిచిన తర్వాత అవిశ్వాసుల ధనం ఏదైతే పొండేవారో దానిని మాలె గనీమత్ అని అనబడుతుంది.
నాలుగో విషయం, وَأُعْطِيتُ الشَّفَاعَةَ వ ఉ’తీతుష్షఫాఆ. ప్రళయ దినాన సిఫారసు చేసే ఈ గొప్ప భాగ్యం అల్లాహ్ నాకు ప్రసాదించనున్నాడు.
ఐదో విషయం,
وَكَانَ النَّبِيُّ يُبْعَثُ إِلَى قَوْمِهِ خَاصَّةً وَبُعِثْتُ إِلَى النَّاسِ عَامَّةً వ కానన్నబియ్యు యుబ్అసు ఇలా కౌమిహీ ఖాస్సతన్ వ బుఇస్తు ఇలన్నాసి ఆమ్మహ్. ఇంతకుముందు ప్రవక్తలు ప్రత్యేకంగా తమ జాతి వారి వైపునకు పంపబడేవారు. కానీ నేను సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా పంపబడ్డాను.
ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు, చనిపోయారు కూడా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ప్రళయం వచ్చే వరకు ప్రతి మనిషి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించడం తప్పనిసరి. లేకుంటే అతని అంతిమ గతి ఏమవుతుంది? నరకమే అవుతుంది. అయితే మన టాపిక్ కు సంబంధించిన విషయం ఏంటి ఇక్కడ? భూమి మస్జిద్ గా కూడా ఉంది, అది తహూర్, పరిశుభ్రతకు సాధనంగా కూడా అల్లాహ్ తాలా దానిని చేశాడు.
మూడు విషయాలు మనం విన్నాము. తయమ్ముమ్ అంటే ఏమిటి, దాని ఆదేశం ఏంటి అంటే అది విధిగా ఉంది, మూడో విషయం అది అల్లాహ్ వైపు నుండి ఒక గొప్ప వరం.
నాలుగో విషయం, ఖురాన్లో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల్లో దీని గురించి చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి గనక, ఎవరికీ ఏ సందేహం అనేది ఉండకూడదు. తయమ్ముమ్ చేసే విషయంలో, ఎక్కడ ముస్లిం, ఒక విశ్వాసుడు ఏ ప్రాంతంలో ఉన్నా గానీ, అక్కడ అతనికి నైట్ ఫెయిల్ అయింది అని, భార్య భర్తలు ఉండేది ఉంటే వారిద్దరూ మధ్యలో సంబంధాలు జరిగాయి గనక వారిపై ఇప్పుడు స్నానం చేయడం విధిగా ఉంది, నీళ్లు లేవు అని, ఇంకా వేరే ఏ సాకులు కూడా చెప్పకుండా, నమాజ్ టైం అయిన వెంటనే నీళ్లు లేనప్పుడు తయమ్ముమ్ చేసి లేక నీళ్లు ఉండి మన ఆరోగ్యానికి, మన శరీరానికి హానికరంగా ఉంటే నీళ్లు వాడకుండా తయమ్ముమ్ చేసి వెంటనే నమాజ్ చేయాలి. ఈ రోజుల్లో అనేక మంది యువకులు ప్రత్యేకంగా బజారుల్లో తిరగడం, ఇంకా వేరే పనుల్లో ఉండి, నమాజ్ టైంలో ఏదైనా మస్జిద్ దగ్గర ఉన్నప్పటికీ కూడా నమాజ్ కు రారు. సాకు ఏం చెప్తారు ఎక్కువ శాతం? “నాకు తహారత్ లేదు”. ఇది చాలా ఘోరమైన పాపం.
హదసె అక్బర్ మరియు హదసె అస్గర్ (పెద్ద మరియు చిన్న అశుద్ధి)
తయమ్ముమ్ హదసె అక్బర్ (పెద్ద అశుద్ధి), హదసె అస్గర్ (చిన్న అశుద్ధి) రెండిటికీ పనిచేస్తుంది. హదసె అక్బర్ అంటే ఏంటి? స్వప్న స్కలనం కావడం (నైట్ ఫెయిల్ కావడం), లేక భార్య భర్తలు కలుసుకోవడం. ఇందువల్ల ఏదైతే స్నానం చేయడం విధిగా ఉంటుందో దానిని హదసె అక్బర్ అంటారు. సామాన్యంగా మలమూత్ర విసర్జన తర్వాత, ఏదైనా అపాన వాయువు (గాలి) వెళితే, ఇలాంటి స్థితులు ఏవైతే ఉంటాయో వాటిని హదసె అస్గర్ అంటారు.
ఈ రెండిటికీ కూడా తయమ్ముమ్ సరిపోతుంది. దానికి దలీల్ (ఆధారం) ఏమిటి? సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలో ఒక చాలా పెద్ద హదీస్ ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రయాణ విషయంలో. అందులో ఒక తయమ్ముమ్ కు సంబంధించిన విషయం ఏంటంటే, ఒకచోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ చేసి,
فَلَمَّا انْفَتَلَ مِنْ صَلَاتِهِ إِذَا هُوَ بِرَجُلٍ مُعْتَزِلٍ لَمْ يُصَلِّ مَعَ الْقَوْمِ ఫలమ్మన్ ఫలత మిన్ సలాతిహీ ఇదా హువ బిరజులిమ్ ముఅతజిలిల్ లమ్ యుసల్లి మఅల్ కౌమ్ నమాజ్ చేసి తిరిగిన తర్వాత ఒక వ్యక్తిని చూశారు ప్రవక్త గారు. అతను ఒక పక్కకు ఉన్నాడు, అందరితో కలిసి నమాజ్ చేయలేదు.
مَا مَنَعَكَ يَا فُلَانُ أَنْ تُصَلِّيَ مَعَ الْقَوْمِ మా మనఅక యా ఫులాన్ అన్ తుసల్లి మఅల్ కౌమ్ అందరితో జమాఅత్ తో సహా, సామూహికంగా నమాజ్ ఎందుకు చేయలేదు నీవు అని ప్రవక్త వారు అతన్ని అడిగారు.
అప్పుడు అతడు ఏం చెప్పాడు?
أَصَابَتْنِي جَنَابَةٌ وَلَا مَاءَ అసాబత్నీ జనాబతున్ వలా మా నేను అశుద్ధావస్థకు గురయ్యాను, స్నానం చేయడం నాకు విధిగా అయిపోయింది. నీళ్లు లేవు.
అందు గురించి ఇంతవరకు నేను స్నానం చేయలేకపోయాను గనక, మీతో పాటు నేను నమాజ్ చేయలేదు. అప్పుడు ప్రవక్త ఏమన్నారు?
عَلَيْكَ بِالصَّعِيدِ فَإِنَّهُ يَكْفِيكَ అలైక బిస్సయీద్ ఫఇన్నహూ యక్ఫీక్ పరిశుభ్రమైన మట్టి ఉంది కదా, అది నీకు సరిపోతుంది.
అలాగే సహీహ్ బుఖారీలోనే అమ్మార్ బిన్ యాసిర్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క సంఘటన ఉంది. అప్పటి వరకు ఆయనకు తయమ్ముమ్ విషయం తెలియదు. నమాజ్ టైం అయిపోయింది, స్నానం చేయడం విధిగా ఉంది. ఆయన ఏం చేశాడు? గాడిద మట్టిలో ఎలా పొర్లుతుందో చూశారా ఎప్పుడైనా? అతను స్వయంగా అంటున్నాడు, గాడిద ఎలా మట్టిలో పొర్లుతుందో అలా నేను మట్టిలో మొత్తం స్నానం చేసినట్టుగా లేచి నమాజ్ చేసుకొని ప్రవక్త వద్దకు వచ్చాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఈ విషయం అడిగాను. ప్రవక్త గారు చెప్పారు, “అంతగా చేసే అవసరం లేదే నీకు. కేవలం రెండు చేతులు పరిశుభ్రమైన మట్టి మీద కొట్టి, మట్టి అంటి ఉంటుంది గనక అని ఒక్కసారి ఊదుకొని ముఖముపై, కుడి చేయి అరచేతితో ఎడమ చేయి అరచేతి మీద, ఈ ఎడమ చేయి యొక్క అరచేతి లోపలి భాగంతో కుడి చేయి అరచేతి పై భాగం మీద మసాజ్ చేస్తే ఒక్కసారి సరిపోతుంది.”
ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల ద్వారా మనకు ఏం తెలుస్తుంది? స్నానం చేయడం విధిగా అయిన సందర్భంలో గానీ, లేక వుదూ చేయడం విధిగా ఉన్న సందర్భంలో గానీ, ఈ రెండు సందర్భాల్లో కూడా నీళ్లు లేనప్పుడు తయమ్ముమ్ సరిపోతుంది.
స్నానం అంటే తెలుసు, వుదూలో మనం కొన్ని ప్రత్యేక అవయవాలు కడుగుతాము. స్నానం చేయడం విధిగా ఉంటే ఏం చేస్తాము? గోరంత కూడా ఎక్కడా పొడితనం ఉండకుండా మంచిగా స్నానం చేస్తాము. కానీ నీళ్లు లేని సందర్భంలో ఒకే ఒక తయమ్ముమ్ రెండిటికీ సరిపోతుంది. ఒకసారి స్నానానికి ఇంకొకసారి వుదూకు అని రెండు రెండు సార్లు తయమ్ముమ్ చేసే అవసరం లేదు. ఒక్కసారి తయమ్ముమ్ చేసి నమాజ్ చేసుకుంటే స్నానానికి బదులుగా మరియు వుదూకు బదులుగా సరిపోతుంది.
తయమ్ముమ్ యొక్క షరతులు (నిబంధనలు)
తయమ్ముమ్ కూడా ఒక ఇబాదత్. నమాజుకు వుదూ చేయడం షరత్ కదా. వుదూ దేనితో చేస్తాము? నీళ్లతోని. నీళ్లు లేని సందర్భంలో అల్లాహ్ మనకు ఈ సౌకర్యం కలుగజేశాడు. అందు గురించి ఇది కూడా ఒక ఇబాదత్ గనక ఇందులో కొన్ని షరతులు ఉన్నాయి.
మొదటి షరత్, మొదటిది నియ్యత్. నియ్యత్ అంటే తెలుసు కదా ఇంతకు ముందు ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాము. ఏదో పెద్ద మంత్రం అలా చదవడం కాదు నోటితోని. ఏ కార్యం చేస్తున్నామో, ఏ సత్కార్యం, ఏ మంచి కార్యం, ఏ ఇబాదత్, దాని యొక్క సంకల్పం మనసులో చేసుకోవాలి. ఏమని? ఈ నా యొక్క సత్కార్యం ద్వారా అల్లాహ్ యే సంతృప్తి పడాలి, అల్లాహ్ యే నాకు దీని యొక్క ప్రతిఫలం ఇవ్వాలి అన్నటువంటి నమ్మకం ఉండాలి, అన్నటువంటి సంకల్పం, నియ్యత్ అనేది ఉండాలి. వేరే ప్రజలకు చూపడానికి గాని, ముతవల్లాకు చూపడం గాని, ఇంకా మన సంతానానికి చూపించడానికి గాని, నేను ఒక ముస్లింగా అన్నటువంటి భావన ఇతరులకు కలిగించడం కొరకు ఇలాంటి ఏ ప్రాపంచిక ఉద్దేశాలు ఉండకూడదు.
రెండవ నిబంధన, రెండవ షరత్, నీళ్లు లేకపోవడం లేదా ఉండి దానిని వాడడం మనకు నష్టకరంగా ఉండడం. అందుగురించి అల్లాహుతాలా సూరె మాయిదాలో ఏదైతే చెప్పాడో, అది కూడా మనకు ఒక ఆధారంగా ఉంది:
وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ వ ఇన్ కున్తుమ్ మర్దా అవ్ అలా సఫరిన్ ఒకవేళ మీరు రోగులై ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా…
హానికరంగా ఉండడం అనేదేదైతే చెప్తున్నామో, అది మనకు కొన్ని హదీసుల ద్వారా కూడా వివరంగా తెలుస్తుంది. అంతే కాకుండా ఖురాన్లో అల్లాహ్ ఏం చెప్పాడు? సూరె నిసా, ఆయత్ నెంబర్ 29లో ఉంది:
وَلَا تَقْتُلُوا أَنفُسَكُمْ వలా తఖ్తులూ అన్ఫుసకుమ్ మీకు మీరు (లేదా ఒకరినొకరు) చంపుకోకండి.
ఆత్మహత్యలు చేసుకోకండి, పరస్పరం ఒకరు మరొకరిని హత్య చేయకండి. ఇవన్నీ భావాలు దీంట్లో వస్తాయి.
إِنَّ اللَّهَ كَانَ بِكُمْ رَحِيمًا ఇన్నల్లాహ కాన బికమ్ రహీమా నిశ్చయంగా అల్లాహ్ మీ పట్ల చాలా కనికరం కలవాడు.
ఈ విధంగా ఈ షరతులు మనకు తెలిసినాయి, అర్థమైనాయి.
మూడో షరత్ ఏంటంటే, తయమ్ముమ్ చేయడానికి పరిశుభ్రమైన మట్టితో చేయాలి. ఈ మూడు షరతులు తయమ్ముమ్ కు సంబంధించినవి.
ఇందులో రెండు ఫర్దులు ఉన్నాయి. ఒకటి ఏమిటి? ముఖాన్ని తుడవడం. మరొకటి? రెండు అరచేతులను.
తయమ్ముమ్ ఎప్పుడు చేయాలి?
అయితే ఏ సందర్భాల్లో తయమ్ముమ్ చేయవచ్చు అన్న విషయం మనకు ఇంతకు ముందే సంక్షిప్తంగా వచ్చింది. నీళ్లు లేనప్పుడు లేక ఉండి కూడా వాడడం నష్టంగా ఉన్నప్పుడు. దానినే మరికొంచెం వివరంగా తెలుసుకుందాం.
నీళ్లు లేకపోవడం అంటే ఏమిటి? నీళ్లు లేకపోవడం అంటే మనం ఎక్కడ ఉన్నామో ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో ఎక్కడా నీళ్లు వుదూ చేయడానికి దొరకకపోవడం. మనం అక్కడి వరకు మన వద్ద బండి ఉంటే బండి ద్వారా వెళ్లడం గానీ, లేక కాలి నడకతో వెళ్లడం గానీ సాధ్యం ఉండి కొన్ని అడుగులు వెళ్తే అక్కడ దొరుకుతాయి అన్నటువంటి ఛాన్స్ ఉండేది ఉంటే, నీళ్లు లేని కింద లెక్కించబడదు. ఉదాహరణకు, ఇప్పుడు ఇక్కడ మనం సౌదియాలో ఉన్నాం గనక ఇక్కడి నుండి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో నీళ్లు ఉన్నాయి అనుకోండి. మనకు ఇక్కడ దగ్గరలో లేవు, అయితే నమాజ్ టైం అయినప్పుడు మన దగ్గర ఏదైనా బండి ఉంది లేక కార్ ఉంది, లేక మన మిత్రుని దగ్గర బండి ఉంది, వేరే ఎన్నో అవసరాలకు మనం తీసుకుంటూ ఉంటాం, వాడుకుంటూ ఉంటాము. ఆ రెండు కిలోమీటర్ల దూరానికి వెళ్లి ఆ నీళ్లు తీసుకురావడం మనకు కష్టంగా ఉంటుందా? ఉండదు. అయితే దాన్ని నీళ్లు లేవు అన్న విషయం అక్కడ వర్తించదు. మనం ఎక్కడి వరకు వెళ్లి నీళ్లు తీసుకోవడం సాధ్యం ఉన్నదో అక్కడి వరకు వెళ్లి తీసుకోవాలి. ఇక ఎక్కడైతే సాధ్యం కాదో అది నీళ్లు లేవు అన్న దానికి కింద లెక్కించబడుతుంది.
రెండో విషయం, మన దగ్గర నీళ్లు ఉన్నాయి కానీ త్రాగడానికి ఉన్నాయి. ఆ నీళ్లతో మనం స్నానం చేస్తే లేక వుదూ చేయడం మొదలు పెడితే త్రాగడానికి మనకు నీళ్లు దొరకవు. కొన్ని కొన్ని సందర్భాల్లో కరువు ఏర్పడుతుంది, వర్షాలు ఉండవు, మన దగ్గర కూడా అలాంటి ప్రాంతం అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది కదా. నీళ్లు త్రాగడానికి మాత్రమే ఉన్నాయి. వాడుకోవడానికి లేవు. అలాంటి సందర్భంలో కూడా అది నీళ్లు లేని కిందనే లెక్కించబడుతుంది. ఎందుకంటే ఇస్లాం మనల్ని మనం నష్టపరుచుకోవడానికి ఆదేశించదు. ఇదే ఆయత్లో, ఎక్కడైతే మనం ఇంతకు ముందు సూరె మాయిదా ఆయత్ చదివామో అందులోనే అల్లాహుతాలా ముందు ఏం చెప్తున్నాడు?
مَا يُرِيدُ اللَّهُ لِيَجْعَلَ عَلَيْكُم مِّنْ حَرَجٍ మా యురీదుల్లాహు లియజ్అల అలైకుమ్ మిన్ హరజ్ అల్లాహుతాలా మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికి గురి చేయదల్చుకోలేదు.
وَلِيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكُمْ వ లియుతిమ్మ నిఅమతహూ అలైకుమ్ తన యొక్క కారుణ్యాన్ని మీపై సంపూర్ణం చేయడం.
ఎందుకు?
لَعَلَّكُمْ تَشْكُرُونَ లఅల్లకుమ్ తష్కురూన్ మీరు కృతజ్ఞత చెల్లించే వాళ్ళు కావాలి అని.
గమనించండి. నీళ్లు త్రాగడానికి కూడా మనకు లేకుంటే మన జీవితమే చాలా నష్టంలో పడిపోవచ్చు. అందుగురించి వాడుకోవడానికి ఉన్న నీళ్లు మొత్తానికి అయిపోయి, కేవలం త్రాగడానికి మాత్రమే ఉన్నాయి, దానిని వాడితే ఇక మనకు చాలా ఇబ్బందికి గురవుతాము, అలాంటప్పుడు కూడా నీళ్లు లేవు అన్న విషయంలోనే వర్తిస్తుంది.
మూడో రకం, నీళ్లు ఉన్నాయి చాలా. కానీ కొనాల్సి వస్తుంది. కొనాల్సి వస్తుంది. అయితే పిసినారితనం చేసి డబ్బు పెట్టి ఎందుకు కొనాలి? ఎక్కడైనా ఫ్రీగా దొరికితే చూసుకుందాము. అన్నటువంటి భావన ఉంచుకొని, శక్తి ఉండి కూడా మనం కొనకుంటే అది పాపంలో పడిపోతాము. కానీ మన దగ్గర నీళ్లు కొనేంత శక్తి లేదు. ఉన్నాయి నీళ్లు కానీ కొనాల్సి వస్తుంది. కొనేంత శక్తి కూడా మన దగ్గర లేదు. కొన్నే కొన్ని డబ్బులు ఉన్నాయి, అవి మన ఈ రోజుకు గాని, లేకుంటే ఇంకా కొన్ని రోజుల వరకు మన అతి ముఖ్యమైన తిండి ఏదైతే ఉందో దాని గురించి గడవాలి. ఇలాంటి ఇబ్బందికరమైన జీవితం ఉన్నప్పుడు కొనడం కష్టతరంగా ఉన్నప్పుడు, కడుపు నిండా భోజనం చేసుకొని డ్రింకులు తాగవచ్చు కానీ ఇక్కడ వుదూ చేసుకోవడానికి ఒక నీళ్లు, ఒక అర లీటర్ నీళ్లు కొనలేము? ఆ డ్రింకులు ఏంటి, పెప్సీలు ఏంటి అవి మన జీవనానికి అత్యవసరమైన తిండి కింద లెక్కించబడుతుందా? లెక్కించబడదు.
విషయం అర్థమవుతుంది కదా. నీళ్లు లేవు అన్న ఈ పదం అనేది ఎన్ని రకాలుగా వస్తుంది, దాని యొక్క రూపాలు ఏంటున్నాయో అవన్నీ నేను వివరిస్తున్నాను.
రెండో విషయం, నీళ్లు ఉన్నాయి కానీ దాని ఉపయోగం మనకు నష్టకరంగా ఉంది. అంటే చలి వల్ల కావచ్చు. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. వేడి చేసుకోవడానికి ఎలాంటి సౌకర్యం లేదు ఇప్పుడు. ఒకవేళ ఉన్నది సౌకర్యం కానీ ఎంత సేపు పడుతుందంటే, మన ఈ నమాజ్ టైం అనేది దాటిపోతుంది. అలాంటప్పుడు ఆ నీళ్లు ఉపయోగించడం వల్ల మనకు నష్టం కలుగుతుంది అన్న భయం ఉండేది ఉంటే తయమ్ముమ్ చేయవచ్చు. ప్రవక్త సల్లల్లాహు వసల్లం కాలంలో ఒకసారి ఏం జరిగింది? ఒక వ్యక్తికి నెత్తిలో గాయమైంది. ప్రయాణంలో ఉన్నాడు, నెత్తిలో గాయమైంది. చాలా చల్లని రాత్రి, అతనికి స్నానం చేయడం కూడా విధి అయిపోయింది. దగ్గర ఉన్న స్నేహితులను అడిగాడు, ఏం చేయాలి నేను? ఫజర్ నమాజ్ టైం. “లేదు లేదు నీకేంటి, తప్పకుండా నువ్వు స్నానం చేసి నమాజ్ చేయాల్సిందే” అని అన్నారు అతని స్నేహితులు. అల్లాహ్ కరుణించు గాక వారిని. ఆయన స్నానం చేశాడు కానీ అందువల్ల అతని ప్రాణం పోయింది. తర్వాత ప్రవక్త సల్లల్లాహు వసల్లం వారి వద్దకు వచ్చిన తర్వాత, “మీరు మీ సోదరుని చంపేశారు. ధర్మజ్ఞానం లేనప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేదు? ఎందుకు అడగలేదు? అతను అలాంటి సందర్భంలో కేవలం తయమ్ముమ్ చేస్తే సరిపోయేది కదా” అని ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు బోధ చేశారు.
అయితే చలి వల్ల గాని, లేక మన శరీరంలో వుదూ చేసే అవయవాలకు ఏదైనా గాయమై ఉంది, అందువల్ల కూడా మనకు నీళ్లు వాడడం, ఉపయోగించడం నష్టకరంగా, హానికరంగా, ప్రాణం పోయేటువంటి భయం, లేక రోగం ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువ పెరిగే భయం, ఖురాన్లో అల్లాహ్ ఏం చెప్పాడు? “వ ఇన్ కున్తుమ్ మర్దా.” మీరు ఒకవేళ అనారోగ్యానికి గురియై మీకు నీళ్లు దొరకకుంటే తయమ్ముమ్ చేయవచ్చును. చూడండి, గమనించండి, ఇన్ని సౌకర్యాలు అల్లాహ్ ఇచ్చిన తర్వాత అరే జాన్దేలేరే క్యా ముస్లిం థండీ అయినా క్యా నమాజ్ పడతా? సామాన్యంగా అనుకుంటూ ఉంటాం కదా మనం. ఏంటి ఈ ముతవల్లాలు, ఈ మౌల్వీ సాబులు వీళ్లకు ఏం పని పాటలు ఉండయి, కేవలం అల్లాహ్ అల్లాహ్ అంటూ నమాజులు చేసుకుంటూ ఉంటారు, మన లెక్కలో ఎక్కడ పని చేస్తారు? కానీ అదే ఈ తిండి కొరకు, కూడు కొరకు, పని గురించి ఇంతటి చల్లని వాతావరణంలో కూడా ఎవరైనా డ్యూటీ వదులుకుంటాడా? చల్లగా ఉంది ఈ రోజు డ్యూటీకి వెళ్లకూడదు అని. ఏమీ దొరకకుంటే కప్పుకునే బ్లాంకెట్ అయినా వేసుకొని డ్యూటీకి వెళ్తాడు కానీ నమాజ్ విషయం వచ్చేది ఉంటే, అల్లాహ్ యొక్క దయ అని నమాజు ఎగ్గొడతాడు. ఇంకా సౌదియాలో ఇంటి నుండి మనం మస్జిద్ కి వెళ్ళడానికి కిలోమీటర్లు నడిచిపోయే అవసరమే పడదు. అవునా కాదా? వెనకా, ముంగట, కుడి పక్కన, ఎడమ పక్కన, ఎటు చూసినా అల్లాహ్ యొక్క దయ వల్ల మస్జిద్లే మస్జిద్లు. చాలా దగ్గరలో. అయినా గానీ మనం చలి కాలంలో ఇలాంటి సాకులు చెప్పి నమాజులను వదిలేస్తే, మనం ఇంకెవరికో కాదు నష్టంలో పడేసేది. మనకు మనం నరకానికి దారి సులభం చేసుకుంటున్నాము. అందు గురించి సోదరులారా, అల్లాహ్ మనందరికీ భయపడే మరియు ఇలాంటి సౌకర్యాలు ఏదైతే అల్లాహ్ ఇచ్చాడో వాటిని ఉపయోగించుకొని అల్లాహ్ యొక్క ఆరాధన సరైన పద్ధతిలో చేసే భాగ్యం కలిగించు గాక.
అయితే ఒక విషయం ఇక్కడ గుర్తించాలి, అదేమిటి? ఎప్పుడైతే నీళ్లు దొరుకుతాయో అప్పుడు తయమ్ముమ్ చేయడం అనేది మానేసేయాలి. నీళ్లు వచ్చిన వెంటనే. చివరికి కొందరు ఆలిములు ఏమంటున్నారో తెలుసా? నీళ్ల గురించి అన్ని రకాల ప్రయత్నం నువ్వు చేశావు, నీళ్లు దొరకలేదు, తయమ్ముమ్ చేసుకుని నమాజ్ మొదలు పెట్టావు, నీళ్లు వచ్చాయి. నమాజ్ ను తెంపేసేయ్, వుదూ చేసుకొని నమాజ్ చెయ్. అర్థమైందా?
మరో విషయం ఇక్కడ, తయమ్ముమ్ ద్వారా కూడా ఒక్కటి కంటే ఎక్కువ నమాజులు కూడా చేయవచ్చు. ఉదాహరణకు మీరు అసర్ లో తయమ్ముమ్ చేశారు. ఆ వుదూను, అంటే తయమ్ముమ్ తో ఏదైతే మీకు వుదూ అయిందో దాన్ని మీరు కాపాడుకున్నారు. మూత్రానికి వెళ్ళలేదు, ఇంకా వుదూ భంగమయ్యే ఏవైతే కారణాలు మనం ఇంతకు ముందు విన్నామో అలాంటివి ఏవీ సంభవించలేదు. అయితే మగ్రిబ్, ఇషా అన్నీ చేసుకుంటూ వచ్చినా గానీ కానీ నీళ్లు వచ్చేస్తే అరె నేను అప్పుడు తయమ్ముమ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు మగ్రిబ్ నమాజ్ కంటే ముందు నీళ్లు వచ్చేసాయి, అసర్ టైంలో నీళ్లు లేవు. మగ్రిబ్ వరకు నీళ్లు వచ్చేసినాయి. నా అప్పటి వుదూ ఉంది కదా, దానితోనే నేను మగ్రిబ్ చేసుకుంటాను. తప్పు విషయం. నీళ్లు వచ్చేసాయి ఇప్పుడు తయమ్ముమ్ నీది చెల్లదు, తయమ్ముమ్ నీది నడవదు, అది expire అయిపోయినట్లు. అర్థమవుతుంది కదా. మళ్లీ కొత్తగా వుదూ చేసుకొని మీరు మగ్రిబ్ నమాజ్ అనేది చేయాలి. అంటే నీళ్లు వచ్చిన వెంటనే తయమ్ముమ్ సమాప్తం అయిపోతుంది. దాని యొక్క ఆదేశం అనేది ఇక ఉండదు. ఎందుకు? అల్లాహ్ ఏమంటున్నాడు?
فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا ఫలమ్ తజిదూ మాఅన్ ఫతయమ్మమూ నీళ్లు పొందని సందర్భంలో మీరు తయమ్ముమ్ చేయండి.
నీళ్లు వచ్చిన తర్వాత? ఇక ఉండదు.
ఇంకో విషయం. స్నానం చేసే విషయంలో, అంటే స్నానం విధి అయింది, నీళ్లు లేవు. నమాజ్ టైం అయింది. ఏం చేసినాం మనం? తయమ్ముమ్ చేసుకొని నమాజ్ చేశాం. ఓకే? తర్వాత నీళ్లు వచ్చాయి. స్నానం చేయాలా చేయవద్దా? చేయాలి. ప్రశ్న అర్థమైందా? ఉదాహరణకు ఫజర్ నమాజే అనుకోండి. రాత్రి నైట్ ఫెయిల్ అయింది. నీళ్లు దొరకలేదు. లేక ఫజర్ నమాజ్ టైం గనక ఎక్ దమ్ మైనస్ డిగ్రీ వాతావరణం ఉండి, నీళ్లు వాడితే మనకు జ్వరం వచ్చేస్తుంది, నీళ్లు వాడేది ఉంటే మనకు ఇంకా ఏదైనా అనారోగ్యానికి గురి అయ్యే సూచనలు ఉన్నాయి. నీళ్లు వాడలేదు, తయమ్ముమ్ చేసుకున్నాము. పొద్దెక్కేసరికి మనకు ఆరోగ్యం బాగైపోయింది, ఇప్పుడు నీళ్లు వాడడంలో నష్టం లేదు. అప్పుడు స్నానం చేయాలా, చేయవద్దా? చేయాలి.
చాలా పెద్దగా ఉంది హదీస్ అని నేను ఇంతకు ముందు ఒక ఇమ్రాన్ బిన్ హుసైన్ రదియల్లాహు అన్హు గారి హదీస్ ఏదైతే చెప్పానో, అందులో ఆ వ్యక్తి నువ్వు ఎందుకు మాతో నమాజ్ చేయలేదు అని ప్రవక్త గారు అడిగారు కదా, అతను ఏమన్నాడు? నా దగ్గర నీళ్లు లేవు, నేను జునుబీ అయిపోయాను, అశుద్ధావస్థకు గురయ్యాను. ప్రవక్త చెప్పారు, నీకు తయమ్ముమ్ సరిపోయేది. ఆ తర్వాత కొంతసేపటికి, అయితే ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు అప్పటికే పంపి ఉన్నారు కొందరిని నీళ్ల గురించి. పోండి మీరు నీళ్ల గురించి వెతకండి అని. ఆ హదీస్ అంతా పొడుగ్గా ఉన్నది అంటే అందులో ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారి గొప్ప మహిమ కూడా ఉన్నది. మరి ఎప్పుడైనా గుర్తు చేయండి చెప్తాను దాని గురించి. కానీ సంక్షిప్తం ఏంటంటే నీళ్లు దొరుకుతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందులో తమ చేతులు పెడతారు, అల్లాహ్ బరకత్ ప్రసాదిస్తాడు, అందరూ తమ తమ దగ్గర ఉన్న పాత్రలన్నీ నింపుకుంటూ ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు చూడండి, ఏ విషయం ఎంత ముఖ్యమైనది, అవసరమైనది ఉంటుందో దాని విషయంలో అశ్రద్ధ వహించరు. ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు ప్రయాణంలో ఉన్నారు, ఎందరో సహచరులు ఉన్నారు, ఎందరియో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ నీళ్లు వచ్చిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు ఆ వ్యక్తిని గుర్తు చేసి, అతన్ని పిలవండి, హా నీళ్లు తీసుకెళ్ళు, తీసుకెళ్లి నువ్వు స్నానం చెయ్యి అని ఆదేశించారు.
సహీహ్ బుఖారీలో ఆ హదీస్ ఉంది, 344 హదీస్ నెంబర్. అయితే విషయం ఏం తెలిసింది మనకు? స్నానం విధిగా ఉన్నప్పుడు నీళ్లు లేవు లేక ఉండి దానిని వాడడం మనకు నష్టకరంగా ఉంటే నమాజ్ చేసుకున్నాము తయమ్ముమ్ తోని. కానీ తర్వాత ఆ నష్టం తొలిగిపోయింది లేదా నీళ్లు మనకు దొరికినాయి, అలాంటప్పుడు ఏం చేయాలి? స్నానం అనేది చేయాలి.
కొంచెం ఈ విషయాలు ఎక్కువ శాతం చలి కాలంలో, ఇంకా వేరే ప్రయాణంలో ఉన్న సందర్భంలో, వేరే సందర్భాల్లో కూడా మనకు అవసరం పడతాయి గనక కొంచెం వివరంగా చెప్పడం జరిగింది. అయితే, మేజోళ్లపై మసాహ్ విషయం అనేది అల్లాహ్ యొక్క దయతో మనం వచ్చే నెక్స్ట్ పాఠంలో తెలుసుకుందాము. దీని గురించి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతాయి. అయితే తప్పకుండా ఉలమాలతో, ధర్మవేత్తలతో మనం మంచి సంబంధాలు ఉంచుకొని అలాంటి ప్రశ్నలను మనం వారితో తెలుసుకోవాలి. షరీయత్ యొక్క సమాధానం, ధర్మపరమైన సమాధానం ఏముంటుందో తెలుసుకొని దాని ప్రకారంగా అల్లాహ్ యొక్క ఆరాధన చేసే ప్రయత్నం చేయండి. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, వక్త దుఆ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత మరియు దానిని సరైన పద్ధతిలో ఎలా చేయాలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివరిస్తున్నారు. దుఆ కేవలం అల్లాహ్ కే చెందాలని, ఆయనను కాకుండా ఇతరులను ప్రార్థించడం షిర్క్ (బహుదైవారాధన) మరియు కుఫ్ర్ (అవిశ్వాసం) అవుతుందని స్పష్టం చేస్తున్నారు. దుఆయే అసలైన ఇబాదత్ (ఆరాధన) అని, ఇతరులతో దుఆ చేయడం మహా అన్యాయం మరియు దౌర్జన్యం అని నొక్కిచెప్పారు. అల్లాహ్ ను వదిలి ప్రార్థించబడే వారికి ఎలాంటి శక్తి లేదని, వారు మన మొరలు వినలేరని, సహాయం చేయలేరని మరియు ప్రళయ దినాన మనకు శత్రువులుగా మారిపోతారని ఖురాన్ ఆయతుల ద్వారా హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ప్రతి ఒక్కరూ తమ కష్టసుఖాలలో కేవలం ఏకైక అల్లాహ్ ను మాత్రమే వేడుకోవాలని ఈ ప్రసంగం యొక్క సారాంశం.
సోదర సోదరీమణులారా! దుఆ అల్లాహ్ యేతరులతో చేయడం ఎంత నష్టమో ఎప్పుడైనా మనం గమనించామా? ఈరోజు ఈ అతి ముఖ్యమైన శీర్షికకు సంబంధించిన కొన్ని ఆయతులు దివ్య ఖురాన్ ద్వారా మరియు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక రెండు హదీసులు కూడా మనం విందాము.
మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఎందరు ప్రవక్తలు గతించారో, వారందరి జాతి వారు ఏ రకమైన షిర్క్ కు పాల్పడ్డారో అందులో అతి భయంకరమైనది, వారిని నరకంలో పడవేసినది అది దుఆ మిన్ దూనిల్లాహ్. అల్లాహ్ తప్ప ఇతరులతో దుఆ చేయడం. ఉదాహరణకు ఎవరైనా అనారోగ్యానికి గురవుతారు, ఎవరిపైనా ఏదైనా కష్టాలు ఆపదలు వస్తాయి, ఎవరికైనా సంతానం కలగదు. ఈ రోజు మనం సమాజంలో చూస్తున్నాము, వారు అల్లాహ్ ను కాకుండా ఇతరులను అర్ధిస్తారు, ఇతరులను ప్రార్థిస్తారు, ఇతరులతో దుఆ చేస్తారు. వారికి సంతానం కలగాలని, వారికి ఆరోగ్యం ప్రాప్తించాలని, వారి కష్టాలు దూరమైపోవాలని. ఇది ఎంత ఘోరమైన పాపమో ఎప్పుడైనా మనం ఆలోచించామా? అయితే నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఖురాన్ ఆయతుల ఆధారంగా కొన్ని ముఖ్య విషయాలు చెబుతున్నాను, ఈ ముఖ్యమైన శీర్షికకు సంబంధించినది. మీరు శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను.
దుఆ హక్కు కేవలం అల్లాహ్ కే
ఇందులో మొదటి విషయం, అసలు దుఆ ఎవరి హక్కు? అంటే మనం దాసులము, ఎవరితో దుఆ చేయాలి? దీని గురించి ఖురాన్ చాలా స్పష్టంగా మనకు తెలియజేసింది.
సూరతుర్ రాద్, సూర నెంబర్ 13, ఆయత్ నెంబర్ 14 లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు:
لَهُ دَعْوَةُ الْحَقِّ (లహు ద’వతుల్ హఖ్) “దుఆ యొక్క హక్కు కేవలం అల్లాహ్ ది మాత్రమే.” (13:14)
ఆయన తప్ప ఇంకా ఎవరితో దుఆ చేయడం ఇది న్యాయం, ధర్మం ఎంత మాత్రం కాదు.
ఇంకా, సూరె లుఖ్మాన్, ఆయత్ నెంబర్ 30 లో అల్లాహ్ తెలిపాడు:
وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ الْبَاطِلُ (వ అన్న మా యద్ఊన మిన్ దూనిహిల్ బాతిల్) “అల్లాహ్ తప్ప వారు ఎవరెవరితో దుఆ చేస్తున్నారో ఇదంతా కూడా వ్యర్థం, వృధా, అసత్యం.” (31:30)
అల్లాహు అక్బర్, గమనించారా? స్వయంగా మన సృష్టికర్త అయిన అల్లాహ్, మనం ఎవరితో దుఆ చేయాలని మనకు ఆదేశించాడు? ఈ విషయానికి వస్తే, ఖురాన్ లో ఒక సందర్భంలో కాదు, ఎన్నో చోట్ల. ఉదాహరణకు, సూరతు గాఫిర్, దాని యొక్క మరొక పేరు సూరతుల్ మూమిన్, ఆయత్ నెంబర్ 60 లో తెలిపాడు:
وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ (వ ఖాల రబ్బుకుముద్ ఊనీ అస్తజిబ్ లకుమ్) “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను” (40:60)
వ ఖాల రబ్బుకుమ్, మీ ప్రభువు మీకు ఈ ఆదేశం ఇస్తున్నాడు, ఉద్’ఊనీ, మీరు నాతో మాత్రమే దుఆ చేయండి, అస్తజిబ్ లకుమ్, నేను మీ దుఆలను అంగీకరిస్తాను. అల్లాహు అక్బర్, గమనించారా? నేను మీ దుఆలను అంగీకరిస్తాను అంటున్నాడు అల్లాహ్ త’ఆలా.
దుఆ అసలైన ఇబాదత్ (ఆరాధన)
ఇంకా సోదర మహాశయులారా, దుఆ ఇది అసలైన ఇబాదత్, అసలైన ఆరాధన, అసలైన ప్రార్థన, దుఆ. ఇదే సూరత్, సూరత్ గాఫిర్, సూరతుల్ మూమిన్ ఆయత్ నెంబర్ 60 లో, అల్లాహ్ ఇలా తెలియజేశాడు:
“మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే, “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా దాస్యం పట్ల గర్వాహంకారం ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించటం తథ్యం.”( 40:60)
దుఆ యొక్క ఆదేశం ఇచ్చిన వెంటనే, నా ఆరాధన పట్ల ఎవరైతే అహంకారానికి గురి అవుతాడో అని అంటున్నాడు అల్లాహ్ త’ఆలా, దుఆను ఆరాధన, దుఆ అసలైన ఇబాదత్ అని తెలిపాడు. ఎవరైతే దుఆ చేయరో అల్లాహ్ త’ఆలా తో, ఏం జరుగుతుంది? సయద్ ఖులూన జహన్నమ దాఖిరీన్. అవమానకరంగా వారు నరకంలో ప్రవేశిస్తారు. అల్లాహు అక్బర్. ఇంకా సోదర మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,
الدُّعَاءُ هُوَ الْعِبَادَةُ (అద్దుఆఉ హువల్ ఇబాదహ్) దుఆ అసలైన ఇబాదత్.
మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే సూర గాఫిర్ యొక్క ఆయత్ పారాయణం చేశారు.
ఇతరులతో దుఆ చేయడం నిషేధం
అంతేకాదు సోదరులారా, ఒకవైపున అల్లాహ్ త’ఆలా నాతోనే దుఆ చేయండి అని ఏదైతే ఆదేశించాడో, ఇతరుల ఎవరితోనీ దుఆ చేయకండి అని కూడా చెప్పాడు. ఇతరులతో దుఆ చేయడం నిషేధించాడు, వారించాడు. ఉదాహరణకు, సూరత్ యూనుస్ ఆయత్ నెంబర్ 106 లో తెలిపాడు:
وَلَا تَدْعُ مِن دُونِ اللَّهِ (వలా తద్’ఉ మిన్ దూనిల్లాహ్) “అల్లాహ్ ను వదిలి మీరు ఎవరినీ అర్ధించకండి, ఎవరితో దుఆ చేయకండి.” (10:106)
సూరతుల్ ఖసస్ ఆయత్ నెంబర్ 88 లో చెప్పాడు:
وَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ (వలా తద్’ఉ మ’అల్లాహి ఇలాహన్ ఆఖర్) అల్లాహ్తో పాటు మరే దేవుణ్ణీ మొరపెట్టుకోకు. (28:88)
అల్లాహ్ తో పాటు ఇంకా ఎవరితోనీ కూడా, అల్లాహ్ తో పాటు వేరే ఏ దైవమైనా ఉన్నాడు అని భావించి వారితో మీరు దుఆ చేయకండి. సోదర మహాశయులారా, సూరత్ యూనుస్ మరియు సూరతుల్ ఖసస్ లోని ఈ రెండు ఆయతుల ద్వారా మనకు విషయం ఏం తెలిసింది? అల్లాహ్ తో దుఆ చేయడంతో పాటు ఇతరులతో చేయడం ఇది కూడా నిషేధం. అల్లాహ్ ను వదిలి వేరే ఎవరితోనైనా చేయడం ఇది కూడా నిషిద్ధం. మరి చేయవలసింది ఏంటిది? సూర గాఫిర్ లో మనం తెలుసుకున్నాము, కేవలం అల్లాహ్ తో మాత్రమే దుఆ చేయాలి.
అల్లాహ్ ను వదిలి ఇతరులను ప్రార్థించడం వల్ల కలిగే నష్టాలు
అయితే, అల్లాహ్ తప్ప ఇతరులతో దుఆ చేయడం వల్ల మనకు నష్టం ఏమిటి? మహా భయంకరమైన నష్టం. అల్లాహ్ తో పాటు ఇతరులతో దుఆ చేయడం గాని, అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేయడం గాని, ఇది షిర్క్ మరియు కుఫ్ర్ లోకి వస్తుంది. బహుదైవారాధనలో లెక్కించడం జరుగుతుంది. సత్య తిరస్కారంలో లెక్కించడం జరుగుతుంది.
సూరతున్ నహల్ ఆయత్ నెంబర్ 86 గమనించండి.
وَإِذَا رَأَى الَّذِينَ أَشْرَكُوا شُرَكَاءَهُمْ (వ ఇదా ర అల్లజీన అష్రకూ షురకాఅహుమ్) “ఈ ముష్రిక్కులు తాము (అల్లాహ్కు) భాగస్వాములుగా నిలబెట్టే వారిని చూడగానే..”
షిర్క్ చేసినటువంటి వారు, అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వాములుగా కల్పించిన వారు తమ భాగస్వాములను చూస్తారు. ఎప్పుడు ఇది? ప్రళయ దినాన. చూసి ఏమంటారు?
قَالُوا رَبَّنَا هَٰؤُلَاءِ شُرَكَاؤُنَا الَّذِينَ كُنَّا نَدْعُو مِن دُونِكَ (ఖాలూ రబ్బనా హాఉలాఇ షురకాఉనల్లజీన కున్నా నద్’ఊ మిన్ దూనిక్) “ఓ మా ప్రభూ! మేము నిన్ను వదిలేసి మొరపెట్టుకున్న మా భాగస్వాములు వీరే” అని అంటారు” (16:86)
గమనిస్తున్నారా సోదరులారా? చదవండి మీరు సూరతున్ నహల్, సూర నెంబర్ 16, ఆయత్ నెంబర్ 86. ప్రళయ దినాన అందరూ హాజరవుతారు కదా, దుఆ చేసిన వారు ఎవరితోనైతే దుఆ చేయడం జరిగిందో. ఎప్పుడైతే వారిని చూస్తారో, “ఓ మా ప్రభువా, నిన్ను వదిలి మేము వారితో దుఆ చేసాము, వారిని మేము నీకు భాగస్వామిగా చేసాము. ఈరోజు వారు మాకు ఏమీ లాభం చేయడం లేదు” అని మొరపెట్టుకుంటారు. అయితే ఈ ఆయత్ లో మనకు చాలా స్పష్టంగా తెలిసింది, వారు స్వయంగా ఒప్పుకుంటున్నారు మేము ఈ షిర్క్ పని చేసాము అని.
అయితే, సూరతుల్ ఆరాఫ్, సూర నెంబర్ 7, ఆయత్ నెంబర్ 37 కూడా మీరు గమనించండి. మీరు కూడా స్వయంగా తెలుగు ఖురాన్ అనువాదాలు తీసి చదవండి, చూడండి, పరిశీలించండి. ఒక విషయం.. క్షమించండి, నేను నా టాపిక్ కు కొంచెం దూరమై ఒక విషయం మీకు అర్థం కావడానికి తెలియజేస్తున్నాను. మనం జానెడు కడుపులో పోయే కూడు తినడానికి మార్కెట్ లోకి వెళ్లి బియ్యం ఏ రకమైనది, ఈ టమాటాలు పాడు అయినాయా, మంచియా, ఉల్లిగడ్డ మంచిగుందా లేదా, ఈ కూరగాయలు మంచియా లేవా, ఒక్కొక్కటి ఏరుకొని మంచి మంచివి తీసుకొని వస్తాము కదా. మన స్వర్గం విషయానికి, ఏ ధర్మ జ్ఞానం మనం నేర్చుకోవాల్సి ఉందో దానిని కూడా మనం వెతకాలి, పరిశీలించాలి, సత్యం ఏదో తెలుసుకోవాలి. సూరతుల్ ఆరాఫ్ ఆయత్ నెంబర్ 37:
ఆఖరికి మా దూతలు వారి ప్రాణాలు స్వాధీనం చేసుకోవటానికి వారివద్దకు వచ్చినప్పుడు “అల్లాహ్ను వదలి మీరు ఆరాధిస్తూ ఉన్నవారు ఇప్పుడెక్కడున్నారు?” అని అడుగుతారు. “వారంతా మా వద్ద నుంచి మటుమాయమై పోయారు” అని వాళ్ళు చెబుతారు. తాము అవిశ్వాసులుగా ఉండేవారన్న విషయాన్ని గురించి వారు స్వయంగా సాక్ష్యమిస్తారు.. (7:37)
అప్పుడు వారు తమకు తాము సాక్ష్యం పలుకుతారు, “అయ్యో, మేము ఎంత కుఫ్ర్ పని చేసాము, ఎంత అవిశ్వాసానికి పాల్పడే పని చేసాము, సత్య తిరస్కారంలో మేము పడి ఉన్నాము“. అయితే ఏం తెలిసింది? అల్లాహ్ తో కాకుండా లేదా అల్లాహ్ తో పాటు ఇతరులతో దుఆ చేయడం షిర్క్, కుఫ్ర్ లో వస్తుంది మరియు వారు ఏమీ వారికి లాభం చేకూర్చలేదు. వారు ఏమీ లాభం చేకూర్చరు అన్న విషయం ఇంకా ఎన్నో ఆయతుల ద్వారా ఇన్ షా అల్లాహ్ నేను తెలియజేస్తున్నాను.
దుఆలో షిర్క్ చేయడం మహా దౌర్జన్యం
అంతేకాదు సోదర మహాశయులారా, అల్లాహ్ ను వదిలి లేదా అల్లాహ్ తో పాటు ఇంకా వేరే వారితో కూడా దుఆ చేయడం ఇది మహా అన్యాయం, మహా దౌర్జన్యం. ఏ కొందరు యువకులు తమ జాతి వారిని ఎదిరించి, జాతి వారందరూ కూడా షిర్క్ పనులు చేస్తున్నారు, తౌహీద్ కు దూరమై ఉన్నారు, వారు కేవలం అల్లాహ్ ను మాత్రమే, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి అన్న తపనతో తమ గ్రామం నుండి కూడా దూరమయ్యారు. ఆ సందర్భంలో వారు ఏమంటారు, సూరతుల్ కహఫ్ ఆయత్ నెంబర్ 14:
لَّن نَّدْعُوَ مِن دُونِهِ إِلَٰهًا ۖ لَّقَدْ قُلْنَا إِذًا شَطَطًا (లన్ నద్’ఉవ మిన్ దూనిహి ఇలాహన్, లఖద్ ఖుల్నా ఇదన్ షతతా) “మేము ఆయన్ని తప్ప వేరొక ఆరాధ్య దైవాన్ని పిలవటమన్నది జరగని పని. ఒకవేళ మేము గనక అలా చేస్తే ఎంతో దుర్మార్గపు మాటను పలికిన వారమవుతాము.” (18:14)
లన్ నద్’ఉవ మిన్ దూనిహీ ఇలాహా. మేము అల్లాహ్ ను వదిలి వేరే ఏ భూటకపు దైవాలను మేము ఆరాధించము. అల్లాహ్ ను వదిలి వేరే ఏ దైవంతో మేము దుఆ చేయము. ప్రజలు ఎవరెవరినైతే దైవాలుగా భావిస్తున్నారో, వారి దృష్టిలో, వారి యొక్క అభిప్రాయం ప్రకారం వారు దేవుళ్ళు కావచ్చు, కానీ సత్యమైన దేవుడు కేవలం అల్లాహ్. సత్యమైన ఆరాధ్యుడు కేవలం అల్లాహ్. ఆయన్ని తప్ప మేము ఇంకా ఎవరితో దుఆ చేయము. లఖద్ ఖుల్నా ఇజన్ షతతా. ఒకవేళ మేము ఇలా చేసి ఉంటే ఇది మహా దౌర్జన్యం అయిపోతుంది. గమనించారా?
అల్లాహ్ శిక్షకు గురిచేసే విషయం
అంతేకాదు, అల్లాహ్ ను తప్ప వేరే ఎవరితోనైనా దుఆ చేయడం, అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఎవరితోనైనా దుఆ చేయడం… మహాశయులారా, ఇది అల్లాహ్ యొక్క శిక్షకు గురి చేసే విషయం. అవును, అల్లాహ్ యొక్క శిక్షకు గురి చేసే విషయం. చదవండి ఖురాన్ లో. సూరతుష్ షుఅరా ఆయత్ నెంబర్ 213 లో అల్లాహ్ తెలిపాడు:
فَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَكُونَ مِنَ الْمُعَذَّبِينَ (ఫలా తద్’ఉ మ’అల్లాహి ఇలాహన్ ఆఖర ఫతకూన మినల్ ము’అద్దబీన్) “కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు అల్లాహ్తోపాటు మరే ఇతర దైవాన్నీ మొరపెట్టుకోకు. నువ్వుగాని అలా చేశావంటే శిక్షించబడేవారిలో చేరిపోతావు సుమా!” (26:213)
ఫలా తద్వు మఅల్లాహి ఇలాహన్ ఆఖర్. అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఏ దైవంతో మీరు దుఆ చేయకండి. ఫతకూన మినల్ ముఅజ్జబీన్. అలా చేశావంటే, అలా చేశారంటే శిక్ష ఇవ్వబడిన వారిలో ఎవరికైతే శిక్ష పడుతుందో వారిలో మీరు కలిసిపోతారు. అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరిని ఇహలోకం, పరలోకం అన్ని రకాల శిక్షల నుండి దూరం చేయుగాక, దూరం ఉంచుగాక. మరియు శిక్షలకు గురి చేసే ప్రతి పాపం నుండి కూడా అల్లాహ్ మనల్ని దూరం ఉంచుగాక.
అల్లాహ్ ను వదిలి ప్రార్థించబడే వారికి ఎలాంటి శక్తి లేదు
అంతేకాదు, చివరిలో ఒక రెండు ముఖ్యమైన విషయాలు అవేమిటంటే, అల్లాహ్ ను కాకుండా ఎవరినైతే ఆరాధిస్తారో, అల్లాహ్ ను కాకుండా లేదా అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఎవరితోనైతే దుఆ చేస్తారో, వారిలో ఏ శక్తి లేదు. మన మొరలు వినడానికి, మనం వేడుకునే వాటిని ఇవ్వడానికి, మన కష్ట దుఃఖాలు దూరం చేయడానికి, సుఖాలు ప్రసాదించడానికి, ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వడానికి వారిలో ఏ శక్తి లేదు అని అల్లాహ్ చాలా స్పష్టంగా తెలిపాడు. ఒకవేళ వాస్తవంగా అల్లాహ్ ను నమ్మేవారయ్యేది ఉంటే ఈ ఆయతులను చాలా శ్రద్ధగా మనం అర్థం చేసుకోవాలి. సూరత్ ఫాతిర్, ఆయత్ నెంబర్ 13, 14.
وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍ (వల్లదీన తద్’ఊన మిన్ దూనిహి మా యమ్లికూన మిన్ ఖిత్మీర్) “ఆయన్ని వదలి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారో వారు ఖర్జూరపు టెంకపై ఉండే పొరకు కూడా యజమానులు కారు.” (35:13)
إِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ ۚ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍ ఒకవేళ మీరు వారిని మొర పెట్టుకున్నా, వారు మీ మొరను ఆలకించరు. ఒకవేళ ఆలకించినా, మీ అక్కరను తీర్చలేరు. పైపెచ్చు ప్రళయదినాన మీరు కల్పించే భాగస్వామ్యాన్ని (షిర్క్ను) వారు (సూటిగా) త్రోసిపుచ్చుతారు. అన్నీ తెలిసిన దేవుని మాదిరిగా (సావధానపరిచే సమాచారాన్ని) నీకు తెలిపే వాడెవడూ ఉండడు సుమా! (35:14)
(వల్లజీన తద్వూన మిన్ దూనిహీ). మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే దుఆ చేస్తారో, ఎవరితోనైతే దుఆ చేస్తారో, (మా యమ్లికూన మిన్ కిత్మీర్). ఖర్జూరపు బీజము మీద ఉండేటువంటి సన్నని ఆ పొర. అంతమాత్రం కూడా వారికి ఏ శక్తి లేదు. (ఇన్ తద్వూహుం లా యస్మవూ దుఆఅకుం). మీరు వారితో దుఆ చేస్తే మీ దుఆలను వారు వినలేరు. గమనించండి. సూరత్ ఫాతిర్ ఆయత్ 13, 14. మీరు అల్లాహ్ ను వదిలి ఎవరితోనైతే దుఆ చేస్తారో, వారు ఖర్జూరపు బీజము మీద ఉండేటువంటి సన్నని ఆ పొర ఏదైతే ఉంటుందో అంత మందం కూడా శక్తి కలిగి లేరు. మీరు వారిని అడిగితే, వారితో దుఆ చేస్తే వారు వినరు. కానీ ఈ రోజుల్లో ఎంతో మంది ఉన్నారు కదా, వింటారు అన్నటువంటి మూఢనమ్మకంలో. అయితే అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి. (వలవ్ సమీవూ మస్తజాబూ లకుం). మీ మూఢనమ్మకాల ప్రకారంగా వారు వింటారు అని ఏదైతే అనుకుంటున్నారో, అలా జరిగినా ఎప్పుడైనా, ఏదైనా సందర్భంలో ఒక పరీక్షగా మేము వారికి వినిపించినా, వారు మీ దుఆలకు సమాధానం చెప్పలేరు.
(వ యౌమల్ ఖియామతి యక్ఫురూన బిషిర్కికుం). మీరు ఈ షిర్క్ ఏదైతే చేస్తున్నారో, దుఆ ఇతరులతో చేసి ఏ భాగస్వామ్యం కల్పింపజేస్తున్నారో, దీనిని వారు ప్రళయ దినాన తిరస్కరిస్తారు. (వలా యునబ్బిఉక మిస్లు ఖబీర్). సూక్ష్మ జ్ఞాని అయిన అల్లాహ్ ఆయన తెలిపినటువంటి విషయాలు మీకు తెలిపేవాడు ఇంకా వేరే ఎవడు లేడు.
అలాగే సోదర మహాశయులారా, సూరత్ సబా ఆయత్ నెంబర్ 22 ఒకసారి గమనించండి మీరు.
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : అల్లాహ్ను వదలి మీరు ఎవరెవరినయితే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవంత అధికారంగానీ, వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్కు సహాయకుడు కూడా కాడు. (34:22)
(ఖులిద్ వుల్లజీన జఅంతుం మిన్ దూనిల్లాహ్). మీ మూఢనమ్మకం ప్రకారం అల్లాహ్ ను వదిలి ఎవరెవరిని మీరు ఆరాధిస్తారో, ఎవరెవరిని పూజిస్తారో, ఎవరెవరితో దుఆ చేస్తారో, (ఉద్వూ), మీరు దుఆ చేసి చూడండి. వారిలో ఏముంది? (లా యమ్లికూన మిస్కాల జర్రతిన్ ఫిస్సమావాతి వలా ఫిల్ అర్జ్). ఆకాశాల్లో, భూమిలో రవ్వంత దానికి వారు అధికారం కలిగి లేరు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఇంతకుముందు ఏం చెప్పాడు? సూరె ఫాతిర్ లో, ఖర్జూరపు బీజం మీద ఉండేటువంటి ఒక పొర అంతటి అధికారం కూడా వారికి లేదు. ఇక్కడ జర్రహ్, అణువు. కళ్ళతో కనబడదు మనకు. అంతటి అధికారం కూడా వారిలో లేదు. ఇంకా, (వమాలహుం ఫీహిమా మిన్ షిర్క్). భూమి ఆకాశాల్లో వారికి ఏ భాగస్వామ్యం లేదు.
అల్లాహ్ క్షమించుగాక, అల్లాహ్ కు కాదు ఒక ఉదాహరణ, పోలిక, మనకు అర్థం కావడానికి ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాను. కొన్ని సందర్భంలో ఏమవుతుంది? నా వద్ద ఒక్క పైసా కూడా లేకపోవచ్చు. కానీ నేను ఒకరితో బిజినెస్ లో పార్ట్నర్ కావచ్చు కదా. ఏదైనా పనిలో నేను పొత్తు కలవవచ్చు కదా. ఈ విధంగా ప్రజలు ఏమనుకుంటారు? అరే, అతడు ఫలానా కంపెనీలో ఒక పార్ట్నర్ గా ఉన్నాడు, ఎంతటి మహానుభావుడో అని అనుకుంటాం కదా. అయితే అల్లాహ్ ఇలాంటి భావాన్ని కూడా ఎట్లా దూరం చేస్తున్నాడో గమనించండి. వారికి అణువంత అధికారం కూడా లేదు ఆకాశాల్లో గాని, భూమిలో గాని. అంతేకాదు వారు ఈ భూమి ఆకాశాల్లో అల్లాహ్ కు ఏ పార్ట్నర్ కారు, ఏ భాగస్వామి కారు. అంతెందుకు, కొందరు ఇహలోకం ప్రకారంగా చూసుకుంటే ఏ అధికారం ఉండదు, పార్ట్నర్ ఉండడు. కానీ ఒకరి కంపెనీ నడపడానికి, ఒకరి పని పూర్తి అవ్వడానికి ఏదో తన ఛాయాశక్తి కొంచెం సపోర్ట్ అయినా ఇస్తాడు కదా. అల్లాహ్ ఇలాంటి దానిని కూడా ఖండించాడు. ఏం చెప్పాడు? (వమాలహుం మిన్హుం మిన్ జహీర్). మీరు ఎవరెవరితోనైతే దుఆలు చేస్తున్నారో వారిలో ఏ ఒక్కడు కూడా అల్లాహ్ కు ఎలాంటి మద్దతునిచ్చేవాడు కాదు, ఎలాంటి సహాయం అందించేవాడు కాదు.
ఇక మీరు అలాంటి వారితో ఎందుకు దుఆ చేస్తున్నారు అని అల్లా రబ్బుల్ ఆలమీన్ హెచ్చరిస్తున్నాడు. అల్లాహు అక్బర్. గమనించండి సోదరులారా.
ప్రళయ దినాన వారు శత్రువులుగా మారిపోతారు
ప్రత్యేకంగా ఎవరైతే అల్లాహ్ ను కాకుండా వేరే ఎవరెవరినైతే ఆరాధిస్తున్నారో, పూజిస్తున్నారో, దుఆలు చేస్తున్నారో, అర్ధిస్తున్నారో, వారి యొక్క స్థితి ఏమిటి? ఇంకా, వారు ఏమైనా ప్రళయ దినాన మనకు లాభం కలగజేస్తారా? ఉపయోగపడతారా? అది కూడా జరగదు. సూరతుల్ అహ్కాఫ్ ఆయత్ నెంబర్ ఐదు, ఆరు వినండి.
وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ అల్లాహ్ ను వదలి ప్రళయదినం వరకూ తన మొరను ఆమోదించలేని వారిని, పైగా తను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని మొరపెట్టుకునేవానికన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు? (46:5)
وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ మానవులంతా సమీకరించబడినపుడు వారు వారికి (తమ భక్తులకు) శత్రువులై పోతారు. వీళ్ళ పూజాపురస్కారాలను కూడా వాళ్ళు త్రోసిపుచ్చుతారు. (46:6)
(వ మన్ అదల్లు మిమ్మన్ యద్వూ మిన్ దూనిల్లాహ్). ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేస్తున్నారో వారి కంటే మార్గభ్రష్టులు ఇంకా వేరే ఎవరు లేరు. నేననడం లేదు, ఖురాన్ తీసి చూడండి మీరు. వ మన్ అదల్లు, అతని కంటే మార్గభ్రష్టత్వంలో ఇంకా ఎవరు లేరు. ఎవరు? ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేస్తున్నాడో. ఎలాంటి వారితో దుఆ చేస్తున్నాడు? (మల్లా యస్తజీబు లహు ఇలా యౌమిల్ ఖియామ). ప్రళయ దినం వరకు అతని దుఆలను అంగీకరించడం గాని, దుఆకు సమాధానం గాని చెప్పలేని వారు. అంతేకాదు, (వహుం అన్ దుఆఇహిం గాఫిలూన్). వారు వీరు చేసే దుఆలకు ఏ సంబంధం లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. వారికి తెలియనే తెలియదు, ఎవరో వచ్చి మా సమాధుల వద్ద, ఎవరో మా పేరును తీసుకొని దుఆలు చేస్తున్నారు అని.
(వ ఇజా హుషిరన్నాస్). ప్రళయ దినాన ఎప్పుడైతే సమూహ పరచడం జరుగుతుందో, (కానూ లహుం అదాఅ). ఈ దుఆ చేసేవారు, ఎవరితోనైతే దుఆ చేయడం జరిగిందో వారందరూ పరస్పరం శత్రువులైపోతారు. (వ కానూ బి ఇబాదతిహిం కాఫిరీన్). మరియు వారి యొక్క ఆరాధనలో, వారి యొక్క దుఆలు వాటి గురించి ఇంకార్ చేస్తారు, రద్దు చేస్తారు. వీరు మమ్మల్ని ఆరాధించలేదు, మాతోని దుఆ చేయలేదు అని స్పష్టంగా తెలియజేస్తారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహ్ క్షమించుగాక, ఇహలోక ప్రకారంగా నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను, గమనించండి.
ఉదాహరణకు నీవు ఏదైనా ఆపదలో ఇరుక్కున్నావు. కోర్టులో వెళ్ళవలసి వచ్చింది. ఏం జరిగింది? ఫలానా వకీల్ చాలా పేరు గలవాడు. ఫలానా లాయర్ ఎంతో పేరు గాంచిన వాడు. అతనిని నేను పిలిపించుకుంటే నన్ను ఎట్లనైనా ఈ కేసులో నుండి బయటికి తీసేస్తాడు అని అనుకున్నావు. అతడు వచ్చాడు. వచ్చిన తర్వాత, నీవు అనుకుంటున్నావు ఈ కేసు ఈ కోర్టులో ఆ వకీల్, ఆ లాయర్ నీకు సపోర్ట్ చేసి నీ తరఫు నుండి మాట్లాడి నిన్ను జైలు పాలు కాకుండా, శిక్షకు గురి కాకుండా కాపాడుకుంటాడు అని. తీరా సమయం వచ్చే వరకు ఏం జరిగింది? నీకు వ్యతిరేకమైపోయాడు. అతడు నీకు వ్యతిరేకమైపోయాడు. నీవు ఇంకా పాపంలో ఉన్నావు, నీ పై ఈ అపరాధం అన్నట్టుగా ఎన్నో సాక్షాలు తెచ్చి ఇరికించే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఏమవుతుంది పరిస్థితి గమనించండి. ఇంతకంటే మరీ భయంకరమైన, ఘోరమైన పరిస్థితి అక్కడ రానుంది. అల్లాహ్ మనందరిని కూడా కాపాడుగాక.
ఖురాన్ లో మనం గమనిస్తే, ఆదం అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, యూనుస్ అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాం, సులేమాన్ అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం, యూసుఫ్ అలైహిస్సలాం, షుఐబ్ అలైహిస్సలాం, హూద్ అలైహిస్సలాం, జకరియా అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సుమారు 16 ప్రవక్తలు, వారు అల్లాహ్ తో ఏ దుఆ చేశారో, ఎలా ఎలా మొరపెట్టుకున్నారో ఆ దుఆల ప్రస్తావనలన్నీ కూడా ఖురాన్ లో ఉన్నాయి. ఎక్కడా కూడా వారు అల్లాహ్ తప్ప ఇతరులతో మొరపెట్టుకోలేదు. నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను? ఈ ప్రవక్తల సరైన మార్గాన్ని మనం అవలంబించినప్పుడే కదా మనకు మోక్షం లభించేది.
అంతేకాదు, అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో ఎందరో పుణ్యాత్ముల గురించి కూడా తెలిపాడు. ఉదాహరణకు, ఇమ్రాన్ యొక్క భార్య, ఫిరౌన్ యొక్క భార్య మరియు బిల్ఖీస్ రాణి మరియు ఆ గుహలో, సూర కహఫ్ లో వచ్చిన ప్రస్తావన ఉన్నవారు. ఇంకా విశ్వాసులు, ఎవరైతే ఒక తోటకు అధికారి అయ్యారో వారి యొక్క సంఘటన ఉంది. ఈ విధంగా ఇంకా ఎందరో సంఘటనలు ఖురాన్ లో ఉన్నాయి. వారందరూ కూడా వారి కష్ట సమయాల్లో కేవలం ఏకభాగస్వామ్యం లేకుండా అల్లాహ్ తోనే దుఆ చేశారు, అల్లాహ్ నే మొరపెట్టుకున్నారు.
అందు గురించి సోదరులారా, ఇదే పని మనం కూడా చేయాలి. ఒకవేళ అల్లాహ్ ను కాకుండా వేరే ఎవరినైనా మనం మొరపెట్టుకున్నామో, వేరే ఎవరితోనైనా దుఆ చేసాము అంటే షిర్క్ లో పడిపోతాము, కుఫ్ర్ లో పడిపోతాము, మహా దౌర్జన్యం చేసిన వారమవుతాము, అల్లాహ్ యొక్క శిక్షకు గురి కావలసి వస్తుంది. అంతేకాకుండా అల్లాహ్ ను కాదని మనం ఎవరెవరినీ మొరపెట్టుకుంటామో ఎవరూ కూడా మనకు ఇహలోకంలో పనికిరారు. పరలోకంలోనైతే ఏమాత్రం మనకు లాభం చేకూర్చరు.
అల్లాహ్ మనందరినీ కాపాడుగాక, రక్షించుగాక. ఎల్లవేళల్లో కేవలం అల్లాహ్ తో మాత్రమే దుఆ చేస్తూ ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తప్ప వేరే ఎవరెవరితో మనం ఇంతవరకు తెలిసి తెలియక, అజ్ఞానంలో ఉండి ఏమైతే చేసామో, అల్లాహ్ ఆ పాపాలన్నిటినీ కూడా క్షమించి, మన్నించి మనల్ని తన యొక్క పవిత్రమైన పుణ్య దాసుల్లో చేర్చుగాక.
వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సఊది అరేబియాలోని జుల్ఫీ జాలియాత్ వారు సమర్పిస్తున్న మరో నూతన వీడియో వీక్షించండి ప్రళయదినాన త్రాసును నెలకొల్పడం సత్యం, ఎవరి పుణ్యపళ్ళాలు బరువుగా ఉంటాయో వారే స్వర్గంలో చేరేవారు.
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
ప్రళయ దినాన కర్మలు బరువు వేసే త్రాసు స్థాపించబడుతుంది.
త్రాసు గురించి అల్లాహ్ ఖుర్ఆన్ గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు:
“ప్రళయ దినాన కచ్చితంగా తూచేటటువంటి త్రాసులను మేము ఏర్పాటు చేస్తాము. ఆ తర్వాత ఎవరిపై కూడా రవ్వంత అన్యాయం జరగదు. ఎవరైనా ఒక ఆవగింజకు సమానమైన ఆన్యాయం చేసి ఉన్నా దాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తాము. లెక్క తీసుకొనుటకు మేమే చాలు.”(21,సూరతుల్ అంబియా: 47)
హజ్రత్ ఇమామ్ ఖుర్తుబి (రహిమహుల్లాహ్) ఇలా ప్రవచించారు: “లెక్కలు తీసుకున్న తరువాత కర్మలను తూకం వేస్తారు. వారి పుణ్యాల బరువుకు తగ్గట్టుగా ప్రతిఫలం కూడా ఉంటుంది. అందుకనే లెక్కలు తీసుకున్న తరువాత కర్మలు తూయబడును. తరువాత వాటి ఆధారంగా మానవులకు (అంతస్తుల) ప్రతిఫలం ప్రసాదించడం జరుగుతుంది.” (తజ్కిరతుల్ ఖుర్తుబి: 309)
హజ్రత్ సల్మాన్ ఫార్సీ (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ప్రళయ దినాన త్రాసులో (కర్మలు) తూకం వేయబడును. ఆ త్రాసు భూమ్యాకాశాలను తూకం వేసేటంత విశాలంగా ఉంటుంది“. *
ఓ ప్రభూ! “దీనిలో ఎవరినీ తూకం వేస్తారు?” అని అల్లాహ్ దూతలు ప్రశ్నించారు. దానికి అల్లాహ్: “నా సృష్టిలో నేను తలచుకున్నవారందరినీ” అని అన్నాడు. అప్పుడు అల్లాహ్ దూతలు: “సుబ్ హానక్! మేము నీకు ఎంతగా ఆరాధించాలో అంతగా ఆరాధించ లేదే!” అని అంటారు.(హాకిమ్, అస్ సహీహ: 941)
*గమనిక: కొందరు త్రాసు అనగా “అల్లాహ్ న్యాయాన్ని స్థాపిస్తాడే తప్ప త్రాసు రూపాంతరము ఉండదనీ భావించారు”. అలా భావించడం సరికాదు. నిజమైన విషయం ఏమంటే! అల్లాహ్ సాక్ష్యాత్తు త్రాసును నిలబెట్టుతాడు. ఇలా మనం విశ్వసించడం వల్ల ఖుర్ఆన్, హదీసులలో ప్రచురించబడిఉన్న నిజమైన వాక్యాలకు అనుగుణమైన విశ్వాసం అవుతుంది. కనుక విశ్వాసులందరూ ఆ త్రాసును తప్పక విశ్వసించాలి. మరియు ప్రళయ దినాన దానిలో కర్మలు తూయబడుతాయనీ, దానికి రెండు తూకం వేసే పళ్ళెములు ఒక సరిసమానం చేసే ముళ్లు కూడా ఉందనీ విశ్వసించాలి. ఇంకా దానిలో కర్మలు తూకం వేస్తే పైకీ క్రిందికి ఆ పళ్ళెములు వంగుతాయనీ కూడా విన్వసించాలి. ఇదే ‘“అహ్లుస్ సున్నత్ వల్ జమాఅత్” విశ్వాసం.
ఎలాంటి కర్మలను త్రాసులో తూకం వేస్తారు?
హజ్రత్ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
“రెండు వాక్యాలు పలకటానికి చాలా తేలికైనవి, కాని అవి త్రాసులో చాలా బరువైనవి, కరుణామయునికి ఎంతో ప్రియమైనవి. అవి, “సుబ్హానల్లాహి వబిహమ్దిహి, సుబ్హానల్లాహిల్ అజీమ్.” (బుఖారీ,ముస్లిం)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ప్రళయ దినాన ప్రజలందరి ముందు నా ఉమ్మత్కు చెందిన ఒక వ్యక్తిని కేకలు పెట్టి పిలువడం జరుగుతుంది. తరువాత అతని ముందు తొంభైతొమ్మిది (కర్మల) పత్రాలను తెరిచి పరుస్తారు. ప్రతి పత్రం అతను చూడగలిగినంత దూరం వరకూ (పెద్దదిగా) ఉంటుంది.”
తరువాత అల్లాహ్ అతనితో: “దీని (పాపాల పత్రాలు)లో నీవు చేయని (విషయాలు) ఏమైనా ఉన్నాయనీ చెప్పగలవా?” అని ప్రశ్నిస్తాడు.
అతను: “లేదు నా ప్రభూ!” అని అంటాడు.
మరలా అల్లాహ్ అతనితో: “వాటిని జాగ్రత్తగా రాసేవారు (మున్కర్ నకీర్) నీపై (నీ పత్రాలలో) అన్యాయంగా ఏమైనా రాసారా!”’ అని ప్రశ్నిస్తాడు. తరువాత అతనితో: “నీ వద్ద వాటికి (ఆ పాపాల పత్రాలకు) బదులు పుణ్యాలేమైనా ఉన్నాయా?” అని అల్లాహ్ ప్రశ్నిస్తాడు.
అప్పుడు అతను: లోలోన భయపడుతూ “నా వద్ద (పుణ్యాలు) లేవు” అని అంటాడు.
ఆ తరువాత అల్లాహ్ అతనితో: “ఎందుకు లేవు మా వద్ద నీ పుణ్యం ఒకటుంది. ఈ రోజు మేము ఎవరికీ అన్యాయం చెయ్యబోము” అని అల్లాహ్ (షహాదత్) “అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు”’ పత్రాన్ని అతనికి ప్రసాదిస్తాడు. అతను: (దాన్ని చూసి) “ఓ అల్లాహ్ ఈ ఒక్క పత్రం అన్ని (పాపాల) పత్రాలకు సరిసమానమవుతుందా?” అని ఆశ్చర్యపడుతూ అంటాడు.
తరువాత అల్లాహ్: “ఈ రోజు నీకు ఎలాంటి అన్యాయం జరగదు” అని అంటాడు.
తరువాత “(అతని పాపాల) పత్రాలన్ని ఒక పళ్లెంలో వేస్తారు. మరియు ‘షహాదత్ పత్రం’ మరొక పళ్లెంలో వేస్తారు. ఆ (పాపాల) పత్రాలన్ని తేలికైపోతాయి. షహాదత్ పత్రం (అన్ని పత్రాలపై) బరువైపోతుంది. (ఎందుకంటే) అల్లాహ్ పేరు కంటే (ఎక్కువ) ఏదీ బరువు ఉండదు.”’ (తిర్మిజీ హాకిమ్, సహీహ్ ఇబ్నుమాజ: 3469)
హజ్రత్ అబూ దర్దా (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ప్రళయం రోజున త్రాసులో తూకం చేసినప్పుడు ఉత్తమ గుణాలకంటే ఎక్కువ బరువు ఏ విషయము ఉండదు.” (ఇబ్నుమాజ, తిర్మిజీ, హాకిమ్)
హజ్రత్ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ప్రళయం రోజు ఒక లావుగా బలసిన వ్యక్తి వస్తాడు. అయినా అతను (త్రాసులో) దోమ రెక్కకు సమానం కూడా బరువు ఉండడు. తరువాత ఖుర్ఆన్ సూక్తిని ఇలా పఠించారు:
فَلَا نُقِيمُ لَهُمْ يَوْمَ الْقِيَامَةِ وَزْنًا
“ప్రళయం రోజున మేము వారిని ఏ మాత్రము బరువుగా నిలబెట్టము.””(18,సూరతుల్ కహఫ్:105) (బుఖారీ)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్వూద్ (రది అల్లాహు అన్హు) కథనం; “ఒక రోజు నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు మిస్వాక్ చెట్టు నుండి మిస్వాక్ను తెంపుకొనే టప్పుడు క్రిందకు (నేలపై) పడిపోయేటట్టు గాలి వీచింది. ఆ పరిస్టితిని చూసి ప్రజలు నవ్వినారు. మీరు ఎందుకు నవ్వుతున్నారనీ? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించారు. దానికి వారందరూ: ఓ అల్లాహ్ ప్రవక్తా! “ఆయన కాళ్ళు సన్నగా ఉన్నందువలన” అని సమాధానమిచ్చారు. ఆ తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో, అతని సాక్షిగా! ప్రళయ దినాన త్రాసులో ఆయన కాళ్ళు ఉహద్ కొండకంటే ఎక్కువ బరువు ఉంటాయి.” (అహ్మద్, ఇర్వావుల్ గలీల్:65)
హజ్రత్ అబూ మాలిక్ అల్ అష్అరి (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
“పరిశుభ్రత విశ్వాసానికి ఒక షరతు. ఆల్ హమ్దులిల్లాహ్ (అనే పదాలు) త్రాసులో నిండిపోతాయి. సుబ్హానల్లాహి, వల్ హమ్దు లిల్లాహి (అనే పదాలు) భూమ్యాకాశాల మధ్యలో ఉన్న (స్థలమంతా) నిండిపోతాయి.” (ముస్లిం)
హజ్రత్ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
“ఎవరైనా అల్లాహ్ను విశ్వసిస్తూ, అతని వాగ్దానాన్ని ధృవీకరిస్తూ, తన గుర్రానికి (ధర్మ పోరాటానికై ఎల్లప్పుడు) సిద్ధంగా ఉంచినట్లయితే, ఆ గుర్రానికి అతను మేత పెట్టినందుకు, నీరు త్రాగించినందుకు, (ఆ గుర్రం) పేడ వేసినందుకు, మూత్ర విసర్జన చేసినందుకు బదులుగా, ప్రళయ దినాన ఆ వ్యక్తి కొరకు త్రాసులో పుణ్యాలు బరువు చేయ బడుతాయి.” (బుఖారి)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్లాంలో పారిశుధ్యానికి ఉన్న ప్రాముఖ్యతను కొన్ని ఖుర్ఆన్ ఆయతుల మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహీ హదీసుల ఆధారంగా తెలుపబడింది. వినండి, వినిపించండి.
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సేవకుని కంటే ఉత్తమమైన జిక్ర్ – الذكر عند النوم (Telugu – تلغو) Dhikr better than having a servant వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
3- నిద్రించునప్పుడు జిక్ర్: అలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: ఫాతిమా (రదియల్లాహు అన్హా) ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లంతో) పనిమనిషి కావాలని అడిగినప్పుడు “మీ కొరకు పనిమనిషికన్నా మేలైన విషయం తెలుపనా?” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పారు: “మీరిద్దరూ పడకపై చేరుకున్నప్పుడు 34 సార్లు అల్లాహు అక్బర్, 33 సార్లు సుబ్ హానల్లాహ్, 33 సార్లు అల్ హందులిల్లాహ్ అని పఠించండి. ఈ స్మరణ మీ కోసం సేవకుడి కంటే ఎంతో శ్రేష్టమైన సంపద“. (బుఖారీ 6318. ముస్లిం 2727). [శత సాంప్రదాయాలు (100 Sunan ) అను పుస్తకం నుండి]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Video Courtesy: Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
ఈ ఆడియో శుక్రవారం (జుమా) నమాజుకు త్వరగా హాజరు కావడం యొక్క ప్రాముఖ్యతను మరియు దానిని విడిచిపెట్టడం గురించిన తీవ్రమైన హెచ్చరికను వివరిస్తుంది. ఖురాన్ ఆయత్ (సూరా అల్-జుమా) మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసుల ఆధారంగా ఈ విషయం స్పష్టం చేయబడింది. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు ప్రకారం, జుమా నమాజుకు వేర్వేరు సమయాలలో (గడియలలో) ముందుగా వచ్చిన వారికి గొప్ప పుణ్యాలు లభిస్తాయి. మొదటి గడియలో వచ్చినవారికి ఒంటెను, రెండవ గడియలో వచ్చినవారికి ఆవును, ఆ తర్వాత గొర్రె, కోడి, మరియు కోడిగుడ్డును బలిదానం చేసినంత పుణ్యం లభిస్తుందని వివరించబడింది. ఇమామ్ ఖుత్బా (ప్రసంగం) ఇవ్వడానికి మింబర్ పైకి వచ్చిన తర్వాత, హాజరైన వారి పేర్లను నమోదు చేసే దేవదూతలు తమ గ్రంథాలను మూసివేసి ప్రసంగాన్ని వింటారని, కాబట్టి ఆలస్యంగా వచ్చేవారు ఈ ప్రత్యేక పుణ్యాన్ని కోల్పోతారని నొక్కి చెప్పబడింది. మరో హదీసులో, జుమా నమాజును నిరంతరంగా వదిలివేసే వారి హృదయాలపై అల్లాహ్ ముద్ర వేస్తాడని, దానివల్ల వారు అశ్రద్ధపరులలో చేరిపోతారని తీవ్రంగా హెచ్చరించబడింది. ముగింపులో, జుమా యొక్క ఘనతను అర్థం చేసుకుని, అజాన్కు ముందే మస్జిద్కు చేరుకోవాలని, ఈ తప్పనిసరి ప్రార్థనను విడిచిపెట్టే ఘోర పాపానికి దూరంగా ఉండాలని వక్త ఉద్బోధించారు.
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్.సోదర మహాశయులారా, జుమా నమాజ్ కు త్వరగా హాజరవటంలోని ఘనత, దాన్ని కోల్పోవటం గురించి హెచ్చరిక, ఈ అంశానికి సంబంధించి ఒక ఆయత్ మరియు రెండు హదీసులు విందాము.
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِن يَوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا إِلَىٰ ذِكْرِ اللَّهِ وَذَرُوا الْبَيْعَ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ. ఓ విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజుకు గాను పిలవబడినప్పుడు మీరు అల్లాహ్ ధికర్ వైపునకు పరుగెత్తి రండి మరియు వ్యాపారం వదిలిపెట్టండి. మీరు తెలుసుకున్నట్లయితే ఇది మీకు చాలా మేలైనది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారని హజరత్ అబూ హురైరా రదియల్లాహు తలా అన్హు ఉల్లేఖించారు: “ఎవరైతే జుమా రోజు జనాబత్ కు చేసే గుసుల్ లాంటి గుసుల్ స్నానం, అంటే సంపూర్ణ విధంగా స్నానం చేసి మస్జిద్ కు అందరికంటే ముందు వెళ్తాడో అతనికి ఒక ఒంటె బలిదానం ఖుర్బానీ చేసినంత పుణ్యం లభిస్తుంది. రెండవ వేళలో వెళ్ళిన వ్యక్తికి ఆవును బలిదానం ఇచ్చినంత పుణ్యం లభిస్తుంది. మూడవ వేళలో వచ్చిన వారికి కొమ్ములు గల గొర్రెను బలిదానం చేసినంత పుణ్యం లభిస్తుంది మరియు నాలుగవ గడియలో వెళ్ళే వారికి ఒక కోడి అల్లాహ్ మార్గంలో బలిదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఐదవ వేళలో వెళ్ళే వారికి అల్లాహ్ మార్గంలో ఒక కోడి గ్రుడ్డును దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇమాం ఖుత్బా ఇవ్వడానికి మింబర్ పైకి వస్తాడో, దేవదూతలు కూడా ప్రసంగం ఖుత్బా వినడానికి హాజరవుతారు.”
అంటే ఏం తెలిసింది? ఈ ఐదు వేళలు ఏవైతే తెలుపబడ్డాయో, అవి కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం ఫజర్ తర్వాత లేదా సూర్యోదయం తర్వాత నుండి ఇమాం మెంబర్ పైకి ఎక్కే వరకు. ఇక ఎవరైతే ఇమాం మెంబర్ పై ఎక్కిన తర్వాత మస్జిద్ లోకి ప్రవేశిస్తారో, ఈ దైవదూతలు ప్రత్యేకంగా జుమా కొరకు వచ్చే వారి గురించి తమ యొక్క దఫ్తర్ లలో, తమ యొక్క నోట్ బుక్స్ లలో ఏదైతే వారి పేర్లు రాసుకుంటూ ఉండడానికి వస్తారో వారి యొక్క జాబితాలోకి చేరకోరు. అంటే ఎంతో గొప్ప పుణ్యాన్ని, జుమాకు సంబంధించిన ప్రత్యేక ఘనతను వారు కోల్పోతున్నారు అని భావం.
لَيَنْتَهِيَنَّ أَقْوَامٌ عَنْ وَدْعِهِمُ الْجُمُعَاتِ أَوْ لَيَخْتِمَنَّ اللَّهُ عَلَى قُلُوبِهِمْ ثُمَّ لَيَكُونُنَّ مِنَ الْغَافِلِينَ “జుమా నమాజు చేయని వారు, జుమా నమాజును వదిలేవారు, వారు తమ ఈ అలవాటును మానుకోకుంటే త్యజించుకుంటే అల్లాహ్ వారి హృదయాలను మూసివేస్తాడు. వారి హృదయాలపై ముద్ర వేస్తాడు. ఏం జరుగుతుంది? ఆ తర్వాత వారు అశ్రద్ధ వహుల్లోకి చేరిపోతారు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా తాను విన్నట్లు అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు ఉల్లేఖించారు.
అయితే సోదర మహాశయులారా, పై ఆయత్ మరియు హదీసుల నుండి మనకు తెలిసిన విషయాలు ఏమిటి? జుమా నమాజ్ అజాన్ కంటే ముందే మస్జిద్ లోకి వచ్చి హాజరయ్యే, ఖుత్బా శ్రద్ధగా వినే ప్రయత్నం చేయాలి. జుమా నమాజుకు త్వరగా పోవుటలో చాలా ఘనత ఉంది, ఐదు రకాలుగా దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. జుమా నమాజ్ వదిలే వారికి భయంకరమైన హెచ్చరిక ఇవ్వబడింది. అలా చేయుట వల్ల వారి హృదయాలపై ముద్ర వేయడం జరుగుతుంది. మంచి విషయాలు, ధర్మ విషయాలు, అల్లాహ్ యొక్క బోధనలు అర్థం చేసుకోకుండా మూసివేయబడతాయి. అల్లాహు అక్బర్. ఇది ఎంత భయంకరమైన శిక్షనో గమనించండి. అల్లాహ్ తలా మనందరికీ జుమా యొక్క ఘనతను అర్థం చేసుకుని, దానిని పాటించేటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక.
వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.