ప్రవక్త ﷺ గారి జీవిత చరిత్ర (సీరత్) పాఠాలు 11: ప్రవక్త ﷺ వారి జుహ్ద్, వస్త్రాధారణ, న్యాయం [వీడియో]

బిస్మిల్లాహ్

[20:33 నిముషాలు]

ప్రవక్త ﷺ వారి జుహ్ద్, వస్త్రాధారణ, న్యాయం సహనాలు

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [20:33 నిముషాలు]

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం] నుండి :

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుహ్ద్

జుహ్ద్ అన్న పదం ఏదైనా వస్తువును త్యజించడం అన్న భావంలో వస్తుంది. ఈ నిర్వచనం వాస్తవ రూపంలో ఎవరిపై ఫిట్ అవుతుందంటే; ఐహిక సుఖాలనూ, భోగభాగ్యాలనూ పొంది, అయిష్టతతో వాటిని వదులుకొనుట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికన్నా ఎక్కువ జుహ్ద్ గలవారు. ప్రపంచం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ఉన్నప్పటికీ, ఆయన సర్వ సృష్టిలో అల్లాహ్ కు అతి ప్రియులు అయినప్పటికీ, అల్లాహ్ తలిచితే ఆయన కోరుకున్నంత ధనం, వరాలు ఆయనకు ప్రసాదిం- చేవాడు. అయినప్పటికీ ఆయన అందరికన్నా తక్కువ ప్రపంచ వ్యామోహం గలవారు. ఎంత లభించిందో అంతలోనే సరిపుచ్చుకొని, శ్రమతో కూడిన జీవితం పట్ల సంతృప్తి పడేవారు.

ఇమాం ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ తన తఫ్సీరులో ఖైసమ ఉల్లేఖనం ప్రస్తావించారు: “నీవు కోరితే ఇంతకు ముందు ఏ ప్రవక్తకు లభించనంత భూకోశాలు, వాటి బీగములు ప్రసాదిస్తాము. ఇవన్నీ నీ తర్వాత ఎవరికీ దొరకవు. ఇవన్నీ నీకు లభించినప్పుడు అల్లాహ్ వద్ద నీకు గల గౌరవ స్థానాల్లో ఏ కొరతా కలగదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చెప్పబడింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఇవన్నియూ నా కొరకు పరలోకంలో ఉండనీవండి“. (సూర అల్ ఫుర్ఖాన్ 25:10).

ఇక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం, ఆయన ఆర్థిక విషయం మరీ విచిత్రమైనది. అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు: మదీనలో ఒకసారి నేను ప్రవక్త వెంట రాతినేల మీద నడుస్తూ ఉండగా మాకు ఎదురుగా ఉహుద్ పర్వతం వచ్చింది. అప్పుడు ప్రవక్త చెప్పారుః “అబూ జర్ర్! నా దగ్గర ఉహుద్ పర్వతమంత బంగారం ఉండి, మూడు రాత్రులు గడిచినంత కాలంలో అప్పు తీర్చడానికి ఉంచుకునే కొంత బంగారం తప్ప అది నా దగ్గర ఉండిపోవడం నాకిష్టం లేదు. నేనా సంపదను అల్లాహ్ దాసుల కోసం ఇలా అలా ఖర్చు చేస్తాను అని కుడి, ఎడమ, వెనకా సైగ చేశారు”. మరో సందర్భంలో ఇలా అన్నారు: “నాకు ఈ ప్రపంచంతో ఏమిటి ప్రేమ/ సంబంధం? నేను ఈ లోకంలో ఒక బాటసారి లాంటి వాడిని, ప్రయాణిస్తూ, ఓ చెట్టు క్రింద మజిలి చేసి కొంత సేపట్లో అలసట దూరమయ్యాక ఆ స్థలాన్ని వదలి వెళ్ళిపోతాడు“.

ప్రవక్త తిండి మరియు వస్త్రాధారణ

తిండి విషయం: నెల, రెండు నెలలు ఒక్కోసారి మూడు నెలలు గడిసేవి, అయినా ఇంటి పోయిలో మంటనే ఉండకపోయేది. అప్పుడు వారి ఆహార పదార్థం ఖర్జూరం మరియు నీళ్ళు మాత్రమే ఉండేవి. ఒక్కోసారి దినమంతా తిండి లేక మెలికలు పడేవారు. అయినా కడుపు నింపుకోటానికి ఏమీ దొరక్క పోయేది. అధిక శాతం ఆయన యవధాన్యాల రొట్టె తినేవారు. ఆయన ఎప్పుడైనా పలచని రొట్టెలు తిన్న ప్రస్తావనే రాలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సేవకుడైన అనస్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు: ప్రవక్త గారు అతిథులున్న సందర్భంలో తప్ప పగలు, సాయంకాలం రెండు పూటల భోజనం రొట్టె మరియు మాంసంతో ఎప్పుడూ తినలేదు.

ఆయన దుస్తుల విషయం కూడా పైన పేర్కొనబడిన స్థితికి భిన్నంగా ఏమీ లేకుండింది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం బట్టల విషయంలో ఆడంబరం కనబరచేవారు కారు. ఇందులో కూడా జుహ్ద్ పాటించేవారని స్వయంగా సహచరులు సాక్ష్యం పలికారు. ఎక్కువ దరగల బట్టలు ధరించే శక్తి ఉన్నప్పటికీ అలా ధరించలేదు. ఆయన వస్త్రాల గురించి ప్రస్తావిస్తూ ఒక సహచరుడు ఇలా చెప్పాడుః నేనో విషయం మాట్లాడుటకు ప్రవక్త వద్దకు వచ్చాను. ఆయన కూర్చుండి ఉన్నారు. ఆయన మందమైన కాటన్ లుంగీ కట్టుకొని ఉన్నారు.

అబూ బుర్దా రజియల్లాహు అన్హు ఒకసారి విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు అన్హా వద్దకు వెళ్ళారు. ఆమె మాసిక వేసియున్న, మందమైన ఓ గుడ్డ మరియు లుంగీ చూపిస్తూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోకం వీడిపోయేటప్పుడు ఈ రెండు బట్టలు ధరించి ఉండిరి అని చెప్పారు. అనస్ రజియల్లాహు అన్హు చెప్పారు: నేను ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో నడుస్తూ ఉండగా ఆయనపై నజ్రాన్ లో తయారైనా మందపు అంచుల శాలువ ఉండినది.

ప్రపంచాన్ని వీడి పోయేటప్పుడు ఏ డబ్బు (దిర్హమ్, దినార్), బానిస, బానిసరాళు మరే వస్తువూ విడిచిపోలేదు. కేవలం ఒక తెల్లటి కంచర గాడిద, ఆయుధం మరియు ఒక భూమి తప్ప, అది కూడా దానం చేశారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయిన రోజు నా అల్మారాలో ఏదైనా ప్రాణి తినగల ఓ వస్తువు అంటూ లేకుండింది. కేవలం కొన్ని బార్లీ గింజలు (యవ ధాన్యాలు) తప్ప. ప్రవక్త చనిపోయినప్పుడు ఆయన ఒక కవచం యవధాన్యాలకు బదులుగా ఒక యూదుని వద్ద కుదువకు ఉండినది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం న్యాయం

న్యాయం విషయానికొస్తే, ఆయన తమ ప్రభువు పట్ల న్యాయంగా వ్యవహరించేవారు. తమ ఆత్మ పట్ల న్యాయంగా ప్రవర్తించేవారు. తమ సతీమణులతో న్యాయంగా జీవించేవారు. దగ్గరివారు, దూరపువారు, స్నేహితులు, తన వాళ్ళు, విరోధులు చివరికి గర్వంగల శత్రువులతో కూడా ఆయన న్యాయాన్ని పాటించేవారు. ఎవరైనా ఆయన్ను ఉపేక్షించినా, ఆయన హక్కును కొందరు అర్థం చేసుకోకున్నంత మాత్రానా ఆయన న్యాయాన్ని వదులుకునేవారు కారు. ఆయన ఎక్కడా, ఏ స్థితిలో ఉన్నా న్యాయం ఆయనకు తోడుగా ఉండేది. ఆయన సహచరుల మధ్య తారతమ్యాలను అసహ్యించుకునేవారు. అందరి పట్ల సమానత్వం, న్యాయాన్ని కోరేవారు. ఆయన స్వయంగా వారిలాగా కష్టాన్ని భరించే వారు. అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు: బద్ర్ యుధ్ధం రోజున ఒంటెలు తక్కువ ఉండడం వల్ల ప్రతి ముగ్రురికి ఒక ఒంటె వచ్చింది. అయితే అబూ లుబాబ మరియు అలీ బిన్ అబీ తాలిబ్ తో మూడువారో ప్రవక్త ఉండిరి. నడిచే వంతు ప్రవక్తది వచ్చినప్పుడు ప్రవక్తా! మీరు స్వారీ చేయండి మేము నడిచి వెళ్తాము అంటే ప్రవక్త వినిపించుకునేవారు కారు. ఆయన ఇలా చెప్పేవారు: “మీరు నా కంటే ఎక్కువ శక్తి గలవారు కారు. నేను కూడా మీలాగ పుణ్యం సంపాదించుకోవాలని కోరేవాణ్ణి“.

ఒకసారి ఉసైద్ బిన్ హూజైర్ రజియల్లాహు అన్హు తన జాతివారితో జోకులేసుకుంటూ నవ్వుతుండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన నడుములో పుల్ల గుచ్చారు, వెంటనే ఉసైద్ అన్నాడు: ప్రవక్తా! మీరు నాకు నొప్పి కలిగించారు. నేను మీతో ప్రతీకారం తీర్చుకోదలుచుకున్నాను. ప్రవక్త చెప్పారు: సరే తీర్చుకో, ఉసైద్ అన్నాడు: ఇప్పుడు మీ శరీరంపై చొక్కా ఉంది, మీరు నాకు పుల్ల గుచ్చినప్పుడు నాపై చొక్కా లేకుండింది, అప్పుడు ప్రవక్త తమ నడుము నుండి చొక్కా లేపారు, ఇదే అదృష్టం అనుకున్న ఉసైద్ నడుము మరియు పక్కల మధ్య చుంబించుకోసాగాడు. మళ్ళీ చెప్పాడు: ప్రవక్తా! నేను కోరింది ఇదే.

అల్లాహ్ యొక్క హద్దులను అతిక్రమించుట, లేదా న్యాయంగా ప్రజల్లో వాటిని అమలు పరుచుటలో ఏ మాత్రం జాప్యం చేయుట ఇష్టపడేవారు కారు. అపరాధి ఆయన దగ్గరివాడు, బంధువుడైన సరే. మఖ్జూమియ వంశానికి చెందిన ఒక స్త్రీ దొంగతనం చేసినప్పుడు ఆమెపై అల్లాహ్ విధించిన హద్దు చెల్లవద్దని ఉసామా రజియల్లాహు అన్హుని సిఫారసు కొరకు ప్రవక్త వద్దకు పంపారు. ప్రవక్త అతని సిఫారసు అంగీకరించలేదు. అప్పుడు ఈ ప్రఖ్యాతిగాంచిన నుడివి పలికారు: “ఓ ప్రజలారా! మీకంటే ముందు గతించిన వారు వినాశనానికి గురి అయ్యే కారణం ఏమిటంటే వారిలో దొంగతనం చేసే వ్యక్తి ఉన్నత వంశీయడయితే అతన్ని శిక్షించకుండానే వదిలేసేవారు. అదే బడుగు వర్గం వాడయితే శిక్షించేవారు. అల్లాహ్ సాక్షిగా! “ముహమ్మద్ కూతురు ఫాతిమ గనక దొంగతనం చేస్తే నేను ఆమె చేతుల్ని నరికేవాన్ని“.

సీరత్ ముందు పాఠాలు :

ఇతరములు: 

ప్రవక్త ﷺ గారి జీవిత చరిత్ర (సీరత్) పాఠాలు 10: ప్రవక్త ﷺ వారి ఓపిక, సహనాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[18:05 నిముషాలు]

ప్రవక్త ﷺ వారి ఓపిక సహనాలు

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [18:05 నిముషాలు]

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం] నుండి :

ప్రవక్త ﷺ ఓపిక, సహనం

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓపిక గురించి ఏమి చెప్పగలం?!! వాస్తవానికి ఆయన పూర్తి జీవితమే ఓపిక, సహనాలతో, శ్రమ, కష్టాలతో కూడియుంది. ఆయనపై తొలి వహీ (దివ్యవాణి) అవతరించినప్పటి నుండి (ఇస్లాం ప్రచార) మార్గంలో ఆయన ఏమేమి ఏదురుకోబోతున్నారో ప్రవక్త అయిన మొదటి క్షణం, మొదటిసారి దైవదూతను కలుసుకున్న తర్వాత నుండే స్వభావికంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేయబడింది. అప్పుడు ఖదీజా (రదియల్లాహు అన్హా) ఆయన్ను వరఖా బిన్ నౌఫల్ వద్దకు తీసుకెళ్ళింది. వరఖా చెప్పాడు: “నీ జాతి వారు నిన్ను నీ దేశం నుండి బహిష్కరించినప్పుడు నేను బ్రతికుంటే ఎంత బావుండేది”. అప్పుడు ప్రవక్త ఆశ్చర్యంగా అడిగారు: “ఏమీ నా జాతివారు నన్ను దేశం నుండి బహిష్కరిస్తారా”. అతడన్నాడు: “అవును. నీవు తెచ్చినటువంటి సందేశం తెచ్చిన ప్రతీవారూ తరిమివేయబడ్డారు”. అయితే ఇలా ముందు నుండే కష్టాలను, బాధలను, కుట్రలను మరియు శత్రుత్వాన్ని భరించే అలవాటు తనకు తాను అలవర్చుకున్నారు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఓపిక, సహనాలు స్పష్టంగా ఏర్పడే చిత్రాల్లో; ఎల్లప్పుడూ ఆయనతో ఎగితాళి చేయడం, ఆయనను పరిహసించడం. ఆయన అల్లాహ్ సందేశం ప్రజలకు అందజేస్తున్నప్పుడు, మక్కాలో తమ జాతి, వంశం వారి వైపున భరించిన శారీరక చిత్రహింసలు.

అందులో ఒక సంఘటన సహీ బుఖారిలో ఇలా వచ్చి ఉంది: ప్రవక్తపై ముష్రికులు పెట్టిన చిత్రహింసల్లో ఘోరాతిఘోరమైనదేమిటి? అని ఉర్వా బిన్ జుబైర్, అబ్దుల్లాహ్ బిన్ అమ్ర బిన్ ఆస్ ని అడిగాడు. అతడు చెప్పాడు: ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హిజ్ర్ [1] లో నమాజు చేస్తుండగా ఉఖ్బా బిన్ అబూ ముఈత్ వచ్చాడు. తన వద్ద ఉన్న దుప్పటిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మెడలో వేసి గొంతును మెలివేశాడు. అందువల్ల ఆయన గొంతు బాగా బిగుసుకు పోయింది. అంతలో అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) పరుగెత్తుకుంటూ వచ్చి ఉఖ్బా భుజాన్ని పట్టి తోసేసారు. మళ్ళీ ఖుర్ఆనులోని ఈ ఆయతు చదివారు:

(ఒక వ్యక్తి తన ప్రభువు అల్లాహ్ అని అన్నంత మాత్రాన మీరు అతణ్ణి హతమారుస్తారా?). (ఘాఫిర్ 28)

[1] అది కాబా గృహానికి ఆనుకొనియున్న స్థలం. సుమారు ఏడు ఫిట్ల గోడ ఎత్తి యుంటుంది. ఖురైషుల వద్ద హలాల్ సంపద సరిపోనందుకు దాన్ని కాబా గృహంలో కలుపుకో లేకపోయారు. అయితే అది కాబాలోని భాగమే.

ఒక రోజు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాబా వద్ద నమాజు చేస్తున్నారు. అబూ జహల్ , వాని మిత్రులు కాబా ప్రాంగణంలో కూర్చొని యున్నారు. అబూ జహల్ మాట్లాడుతూ: ఫలానా ఇంట్లో ఈ రోజు ఒంటెను కోశారు, ఎవరు పోయి దాని పొట్ట, జీర్ణాశయం మరియు ప్రేగులను తీసుకువచ్చి, ముహమ్మద్ సజ్దాలో పోయినప్పుడు అతని వీపు మీద వేస్తాడు అని పురిగొల్పాడు. వారిలోని పరమ దుర్మార్గుడొకడు (ఉఖ్బా బిన్ అబూ ముఈత్) దిగ్గున లేచాడు. దాన్ని తీసుకొచ్చి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దాలో పోగానే ఆయన భుజాల మధ్య వీపుపై పెట్టేశాడు. ఇక అవిశ్వాసులు ఒకరిపై ఒకరు పడిపోతూ విరగబడి నవ్వసాగారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దాలోనే ఉండిపోయారు. తల పైకి లేపలేక పోయారు. చివరికి ఆయన కూతురు ఫాతిమా (రజియల్లాహు అన్హా) వచ్చింది. వీపుపై నుండి దాన్ని తొలగించింది.

వీటి కంటే మరీ ఘోరమైనది మానసిక బాధ. ఇందుకు కూడా వారు వెనక ఉండలేదు. అందుకే ఆయన ఇచ్చే సందేశాన్ని నిరాకరిస్తూ, తిరస్కరిస్తూ ఆయన పై అపనిందలు మోపేవారు, ఆయన జ్యోతిష్యుడు, పిచ్చివాడు, మాంత్రికుడు అని పేర్లు పెట్టేవారు, ఆయన తీసుకువచ్చిన ఆయతులు పూర్వకాలపు కట్టుకథలు అని అనేవారు. ఒకసారి అబూ జహల్ ఇలా అన్నాడు: “ఓ అల్లాహ్! నీ వద్ద నుండి వచ్చిన సత్యం, ధర్మం ఇదేనయితే ఆకాశం నుండి మాపై రాళ్ళ వర్షం కురిపించు. లేదా బాధకర మైన శిక్ష పంపించు.”

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజల్ని ఇస్లాం వైపునకు ఆహ్వానించుటకు వారి సమూహాల్లో, బజారుల్లో వెళ్ళినప్పుడు పినతండ్రి అబూ లహబ్ వెనకనే వచ్చి, ఇతను అబద్ధికుడు. ఇతని మాటను మీరు నిజపరచవద్దు అని చెప్పేవాడు. అతని భార్య ఉమ్మె జమీల్ ముళ్ళ కంప ఏరుకొచ్చి ప్రవక్త నడిచే దారిలో వేస్తుండేది.

బాధాలు, కష్టాలు పరా కాష్ఠకు చేరిన వేళ ఒకటుంది. అది ప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం మరియు ఆయన్ను విశ్వసించినవారు మూడు సంవత్సరాల వరకు షిఅబె అబూ తాలిబ్ లో బంధీలుగా అయిన వేళ. ఆ రోజుల్లో ఆకలిని భరించలేక ఆకులు తిన వలసి వచ్చేది. ఇంకా ఆయన తమ పవిత్ర సతీమణి ఖదీజ రజియల్లాహు అన్హాను కోల్పోయిన సందర్భంలో మరింత బాధకు గురి అయ్యారు. ఆమె కష్ట రోజుల్లో తృప్తినిస్తూ, తగిన సహాయసహకారాలు అందించేది.

ఆ తర్వాత ఆయనకు అండదండగా నిలిచిన, ఆయన్ను పోషించిన పినతండ్రి మరణం, అతను అవిశ్వాస స్థితిలో చనిపోవడం ప్రవక్తను మరింత కుదిపి వేసింది. ఆయన్ను సంహరించే ఖురైషుల యత్నాలు విఫలమయ్యాయి. ప్రవక్త స్వదేశం వదిలేసి పరదేశానికి వలసపోయారు. మదీనాలో ఓపిక, సహనాల మరో క్రొత్త కాలం, శ్రమ, ప్రయాస, కష్టాలతో కూడిన జీవితం మొదలయింది. చివరికి ఆకలిగొన్నారు. బీదవారయ్యారు. తమ కడుపుపై రాళ్ళు కట్టు కొన్నారు. ఒకసారి ప్రవక్త — ఇలా చెప్పారు: “అల్లాహ్ విషయంలో నేను బెదిరింపబడినంత మరెవరూ బెదిరింప బడలేదు. అల్లాహ్ విషయంలో నేను గురి అయిన చిత్రహింసలకు మరెవరూ గురికాలేదు. 30 రేయింబవళ్ళు గడిసినా మా పరిస్థితి ఎలా ఉండిందంటే నా వద్ద, మరియు బిలాల్ (రదియల్లాహు అన్హు) వద్ద ఒక ప్రాణి తినగల ఏ వస్తువూ లేకుండింది. కేవలం బిలాల్ చంకలో దాచిపెట్టినంత ఓ వస్తువు మాత్రం“.

ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మానవ గౌరవాల్లో కూడా శత్రువులు జోక్యం చేసుకున్నారు. మునాఫిఖుల మరియు అజ్ఞాన అరబ్బుల తరఫున ఎన్నో రకాల బాధలకు గురి అయ్యారు. సహీ బుఖారిలో అబ్దుల్లాహ్ బిన్ మఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విజయ ధనం పంపిణీ చేశారు. అన్సారులోని ఒక వ్యక్తి “అల్లాహ్ సాక్షిగా! ముహమ్మద్ ఈ రకమైన పంపిణి ద్వారా అల్లాహ్ సంతృష్టి కోరలేదు” అని అన్నాడు. ఇబ్ను మఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విషయం ప్రవక్తకు తెలిపారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “అల్లాహ్, ప్రవక్త మూసాను కరుగించుగాకా! ఆయన ఇంతకంటే ఎక్కువ బాధలకు గురయ్యారు. అయినా ఓపిక వహించారు“.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓరిమి కనబరచిన సందర్భాల్లో ఒకటి ఆయన సంతానం చనిపోయిన రోజు. ఆయనకు ఏడుగురు సంతానం. కొద్ది సంవత్సరాల్లో ఒకరెనుకొకరు మరణించారు. కేవలం ఫాతిమ (రజియల్లాహు అన్హా) మిగిలారు. అయినా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనస్తాపం చెందలేదు. అలసటకు గురి కాలేదు, కాని ఓరిమి కనబరచారు. ఆయన కుమారులైన ఇబ్రాహీం చనిపోయిన రోజు ఆయన ఇలా తెలిపారు: “కళ్ళు తప్పకుండా అశ్రుపూరితలవుతాయి. మనస్సు కూడా బాధపడుతుంది. అయితే మా ప్రభువుకు ప్రీతికరమైన మాటలే నా నోట వెలువడుతాయి. ఇబ్రాహీమా! నీ ఎడబాటు మమ్మల్ని శోకసముద్రంలో ముంచేసింది“.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓర్పు, సహనం కేవలం కష్టాల, ఆపదల పైనే కాదు, అల్లాహ్ ఆయనకు ఇచ్చే ఆదేశాల విధేయతలో కూడా ఉండింది. అల్లాహ్ ఆరాధన, విధేయతలో ఆయన కఠోరమైన శ్రమపడేవారు. ఎక్కువ సేపు నమాజులో నిలబడినందుకు ఒక్కోసారి కాళ్ళు వాచిపోయేవి. ఉపవాసాలు, అల్లాహ్ స్మరణలు ఇతర ఆరాధనలు చాలా చేసేవారు. మీరెందుకు ఇంత శ్రమ పడుతున్నారని అడిగినప్పుడు, “నేను అల్లాహ్ కృతజ్ఞత చేసే దాసుణ్ణి కాకూడదా” అని అనేవారు.

సీరత్ ముందు పాఠాలు :

ఇతరములు: 

ప్రవక్త గారి జీవిత చరిత్ర (సీరత్) పాఠాలు 9: ప్రవక్త గారి పరిహాసం, బాలలతో అనురాగం, ఇంటి వారితో ప్రవక్త గారి వ్యవహారం, ప్రవక్త గారి కారుణ్యం [వీడియో]

బిస్మిల్లాహ్

[17:38 నిముషాలు]

ప్రవక్త గారి జీవిత చరిత్ర (సీరత్) పాఠాలు 9: ప్రవక్త చరిత్రలోని నేర్చుకోదగ్గ విషయాలు (1)
ప్రవక్త గారి పరిహాసం, బాలలతో అనురాగం, ఇంటి వారితో ప్రవక్తగారి వ్యవహారం, ప్రవక్త గారి కారుణ్యం

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [17:38 నిముషాలు]

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం] నుండి :

ప్రవక్త చరిత్రలోని నేర్చు కోదగ్గ విషయాలు

పరిహాసం (Joke)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరులతో పరిహసించే వారు, తమ ఇల్లాలితో వినోదంగా, ఉల్లాసంగా గడిపేవారు. చిన్నారులతో ఆనందంగా ఉండేవారు. వారి కొరకు సమయం కేటాయించేవారు. వారి వయసు, బుద్ధిజానాలకు తగిన రీతిలో వారితో ప్రవర్తించేవారు. తమ సేవకుడైన అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్షుతో కూడా ఒకప్పుడు పరిహసిస్తూ “ఓ రెండు చెవులవాడా” అని అనేవారు.

ఒక వ్యక్తి వచ్చి ప్రవక్తా! నాకొక సవారి ఇవ్వండని అడిగాడు. ప్రవక్త పరిహాసంగా “మేము నీకు ఒంటె పిల్లనిస్తాము” అని అన్నారు. నేను ఒంటె పిల్లను తీసుకొని ఏమి చేయాలి? అని ఆశ్చర్యంగా అడిగాడతను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ప్రతి ఒంటె, పిల్లనే కంటుంది కదా” అని నగుమోహంతో అన్నారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల ముందు ఎల్లప్పుడూ మంద హాసంతో, నగుమోహంతో ఉండేవారు. వారి నుండి మంచి మాటే వినేవారు. జరీర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్షు ఉల్లేఖనం ప్రకారం: నేను ఇస్లాం స్వీకరించినప్పటి నుండీ, ప్రవక్త వద్దకు ఎప్పుడు వచ్చినా ఆయన రావద్దని చెప్పలేదు. నేను ఎప్పుడు చూసినా చిరునవ్వే ఉండేది. ఒకసారి “ప్రవక్తా! నేను గుఱ్ఱంపై స్థిరంగా కూర్చోలేకపోతాను అని” విన్నవించు కున్నాను. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా రొమ్ము మీద కొట్టాడు. మళ్ళీ ఇలా దుఆ చేశారు: “అల్లాహ్ ఇతన్ని స్థిరంగా కూర్చోబెట్టు. ఇతడ్ని మార్గదర్శిగా, సన్మార్గగామిగా చెయ్యి”. ఆ తర్వాత నేను ఎప్పుడూ గుఱ్ఱం మీది నుంచి పడలేదు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ బంధువులతో కూడా పరిహసించే వారు. ఒకసారి ప్రవక్త తమ కూతురు ఫాతిమా రజియల్లాహు అన్హా ఇంటికి వెళ్ళారు. అక్కడ హజ్రత్ అలీ రజియలాహు అను కన్పించక పోవడంతో. ఆయన ఎక్కడి వెళ్ళాడమ్మా! అని కూతుర్ని అడిగారు. దానికి ఫాతిమ రజియల్లాహు అన్హా సమాధానమిస్తూ “మా ఇద్దరి మధ్య చిన్న తగాద ఏర్పడింది. అందుకు ఆయన నాపై కోపగించుకొని, అలిగి వెళ్ళిపోయారు” అని అంది. ప్రవక్త అక్కడి నుండి మస్తిదుకు వచ్చారు. అతను అందులో పడుకొని ఉన్నారు. ఆయన మీది నుండి దుప్పటి తొలిగి పోయింది. ఆయన శరీరానికి మట్టి అంటుకొని ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన శరీరానికి అంటుకొని ఉన్న మట్టిని తూడుస్తూ “అబూ తురాబ్ (మట్టివాడా)! లే అబూ తురాబ్! లే” అని అన్నారు.

ప్రవక్త బాలలతో

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణులకు, కూతుళ్ళకు ప్రవక్త ఉత్తమ సద్గుణాల్లో ఓ గొప్ప వంతు ఉండింది. ఒక్కోసారి ప్రవక్త తమ సతీమణి ఆయిషా రజియల్లాహు అన్హా తో పరుగు పందెం పెట్టేవారు. ఆమె తన స్నేహితురాళ్ళతో ఆడుకుంటే వద్దనేవారు కాదు. స్వయంగా ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించారు: “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎదుట నా స్నేహితురాళ్ళతో కలసి ఆడుకునేదాన్ని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లోకి రాగానే ఆ బాలికలు భయపడి దాక్కునేవారు. అయితే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నా దగ్గరకు పంపేవారు. నేను వారితో మళ్ళీ ఆడుకునేదాన్ని”. “

బాలలతో అనురాగంగా కలిగి యుండి, వారిని ప్రేమగా చూసుకుంటూ ఒక్కోసారి వారితో ఆటలాడేవారు. షధాద్ రజియల్లాహు అను ఉల్లేఖనం ప్రకారం: ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇషా నమాజులో తమ వెంట హసన్ లేదా హుసైన్ ను తీసుకొచ్చారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ముందుకు వెళ్ళి అబ్బాయిని కూర్చోబెట్టారు. అల్లాహు అక్బర్ అని నమాజునారంభించారు. సజ్జాలో వెళ్ళి, చాలా ఆలస్యం అయినప్పటికీ లేవలేదు. నాకు అనుమానం కలిగి కొంచం తల లేపి చూశాను. ఆ అబ్బాయి ఆయన వీపుపై ఉన్నాడు. నేను మళ్ళీ సలో ఉండిపోయాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు ముగించిన తర్వాత సహచరులు: ‘ప్రవక్తా! మీరు దీర్ఘంగా స చేసినందుకు ఏదైనా సంఘటన జరిగిందా లేదా మీపై దివ్యవాణి (వక్త) అవతరణ జరుగుతుందా అని భావించాము’ అని అడిగారు. అందుకు ప్రవక్త చెప్పారుః “ఇవన్నీ ఏమి కాదు, విషయం ఏమిటంటేః అబ్బాయి నా వీపుపై ఎక్కాడు. అతను కోరిక తీరక ముందే తొందరగా లేవడం నాకు బావ్యమనిపించలేదు.

అనసు రజియల్లాహు అన్షు ఉల్లేఖనంలో ఉందిః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలందరిలోకెల్లా ఉత్తమ గుణం గలవారు. నాకో చిన్న తమ్ముడు ఉండేవాడు. అతని పేరు ఉమైర్. ప్రవక్త ప్రేమతో, అతని తృప్తి కొరకు ఇలా అనేవారు: “ఉమైర్ నీ నుఫైర్ ఎలా ఉంది”. నుషైర్ అంటే బుర్ర పిట్ట. అతను దానితో ఆడుకునేవాడు.

ప్రవక్త ఇల్లాలితో

ఇంటివారితో ప్రవక్త వ్యవహారంలో సర్వ సద్గుణాలు ఏకమయ్యాయి. ఆయన చాలా వినయనమ్రతతో మెదిలేవారు. తమ చెపులు స్వయంగా కుట్టుకునేవారు. అవసరమున్న చోట బట్టలకు మాసికలేసుకునేవారు. ఎప్పుడూ భోజనానికి వంకలు పెట్టేవారు కారు. ఇష్టముంటే తినే, లేదా వదిలేసేవారు. స్త్రీ జాతిని ఒక మనిషి గా గౌరవించేవారు. అంతే కాదు, తల్లి, భార్య, కూతురు, చెల్లి రూపాల్లో వివిధ గౌరవాలు ప్రసాదించేవారు. ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడుః నా సేవా సద్వర్తనలకు అందరికన్నా ఎక్కువ అర్హులేవరు అని. దానికి ఆయన “నీ తల్లి” అని చెప్పారు. మళ్ళీ ఎవరు అన్న ప్రశ్నకు “నీ తల్లి” అని చెప్పారు. మళ్ళీ ఎవరు అన్న ప్రశ్నకు “నీ తల్లి” అనే జవాబిచ్చారు. నాల్గవ సారి అడిగినప్పుడు “నీ తండ్రి” అని చెప్పారు. మరొసారి ఇలా చెప్పారు: “ఏ వ్యక్తి తన తల్లిదండ్రిలో ఒకరిని లేదా ఇద్దరిని పొంది, వారి సేవా చేసుకోకుండా నరకంలో ప్రవేశిస్తాడో అల్లాహ్ అతన్ని తన కరుణకు దూరమే ఉంచుగాకా!”.

ఆయన సతీమణి ఏదైనా పాత్ర నుండి త్రాగినప్పుడు, ఆయన ఆ పాత్ర తీసుకొని ఆమె ఎక్కడ తన మూతి పెట్టిందో అక్కడే తమ మూతి పెట్టి త్రాగేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారు: “మీలో మంచివారు తమ ఇల్లాలి పట్ల మంచి విధంగా మెలిగేవారు. నేను నా ఇల్లాలి పట్ల మీ అందరికన్నా మంచి విధంగా వ్యవహరించేవాణ్ణి”.

(ఈనాడు మనం మన భార్యలతో ఉత్తమ రీతిలో వ్యవహరించి ఉంటే మరియు మన ఇల్లాలులు ప్రవక్త సతీమణుల లాంటి సద్గుణాలు అవలంబించి ఉంటే మన జీవితాలు సుఖశాంతులతో నిండి ఉండేవి. మనందరికి అల్లాహ్ ఈ భాగ్యం ప్రసాదించుగాక! ఆమీన్).

ప్రవక్త కారుణ్యం

ఇక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి కరుణ గుణం: ఆయన ఇలా ప్రవచించారు: “కరుణించేవారిని కరుణామయుడైన అలాహ్ కరుణిస్తాడు. మీరు భువిలో ఉన్నవారిపై కరుణ చూపండి. దివిలో ఉన్నవాడు మీపై కరుణ చూపుతాడు”. ప్రవక్తలో ఈ గొప్ప గుణం అధిక భాగంలో ఉండింది. చిన్నలు, పెద్దలు, దగ్గరివారు, దూరపువారు అందరితో గల ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వ్యవహారాల్లో ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆయన కరుణ, వాత్సల్యపు నిదర్శనం ఒకటి: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చిన్న పిలవాళ్ళ ఏడుపు విని సామూహిక నమాజు దీర్ఘంగా కాకుండా, సంక్షిప్తముగా చేయించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారని అబూ ఖతాదా రజియల్లాహు అను ఉల్లేఖించారు: “నేను నమాజు కొరకు నిలబడినప్పుడు దీర్ఘంగా చేయించాలని అనుకుంటాను, కాని పసి పిల్లవాని ఏడుపు విని నేను సంక్షిప్తంగా చేయిస్తాను. తన తల్లికి అతని వల్ల ఇబ్బంది కలగ కూడదని”.

తమ అనుచర సంఘం పట్ల ఆయన కరుణ, మరియు వారు అల్లాహ్ ధర్మంలో చేరాలన్న కాంక్ష యొక్క నిదర్శనం: ఒక యూద పిల్లవాడు వ్యాదిగ్రస్తుడయ్యాడు. అతడు ప్రవక్త సేవ చేసేవాడు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని పరామర్శ కొరకు బయలుదేరి, అతని తలకడన కూర్చున్నారు. కొంత సేపటికి, “అబ్బాయీ! ఇస్లాం స్వీకరించు” అని చెప్పారు? అతడు తన తలాపునే నిలుచున్న తండ్రి వైపు చూశాడు. అబుల్ ఖాసిం (ప్రవక్త విశేషనామం, కునియత్) మాట విను అని అతని తండ్రి చెప్పాడు. ఆ అబ్బాయి అప్పుడే ఇస్లాం స్వీకరించాడు. మరి కొంత సేపటికే చనిపోయాడు. ప్రవక్త అతని వద్ద నుండి వెళ్తూ ఇలా అన్నారు: “ఇతన్ని అగ్ని నుండి కాపాడిన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు”.

సీరత్ ముందు పాఠాలు :

ఇతరములు: 

ప్రవక్త గారి జీవిత చరిత్ర (సీరత్) పాఠాలు 8: సహజ గుణాలు, సద్గుణాలు, మహిమలు [వీడియో]

బిస్మిల్లాహ్

[17:49 నిముషాలు]

ప్రవక్త గారి జీవిత చరిత్ర (సీరత్) పాఠాలు 8: సహజ గుణాలు, సద్గుణాలు, మహిమలు

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

 ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [17:49 నిముషాలు]

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం] నుండి :

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహజ గుణాలు

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పొట్టిగా గాని లేదా పొడుగ్గా గాని కాకుండా మధ్యరకమైన ఎత్తులో ఉండిరి. విస్తరించిన భుజాలు. సరితూగిన అవయవాలు. విశాలవక్షస్తుడు. చంద్రబింబం లాంటి అందమైన ముఖం. సుర్మా పెట్టుకున్నటువంటి కళ్ళు. సన్నటి ముక్కు. అందమైన మూతి. సాంద్రమైన గడ్డం.

అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అను కథనం, అంబర్ గ్రిస్ (ambergris) మరియు కస్తూరి లేదా ఇంకేదైనా సువాసనగల పదార్థం, ద్రవ్యాల సువాసన ప్రవక్త సువాసన కంటే ఎక్కవ ఉన్నది నేను ఎన్నడూ చూడలేదు/ ఆఘ్రాణించేలదు. ప్రవక్త చెయ్యి కంటే ఎక్కువ సున్నితమైన వస్తవును ఎప్పుడూ నేను ముట్టుకోలేదు.

ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా, మందహాసంగా ఉండేవారు. తక్కువ సంభాషించేవారు. మధుర స్వరం గలవారు. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్షు ఆయన గురించి ఇలా చెప్పాడుః ఆయన అందరిలో అందమైన వారు. అందరికన్నా ఎక్కువ దాతృత్వ గుణం గలవారు, మరియు అందరి కన్నా గొప్ప శూరుడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సద్గుణాలు

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికన్నా శూరులు, బలశాలి. అలీ బిన్ అబూ తాలిబ్ రజియల్లాహు అన్షు ఉల్లేఖించారు: యుద్ధం చెలరేగి ఒకరిపై ఒకరు విరుచుకుపడేటప్పుడు మేము ప్రవక్త వెనక ఉండేవారము.

ఆయన అందరికన్నా ఎక్కువ ఉదారులు, ఔదార్యము ఉన్నవారు. ఆయన్ను ఏదైనా అడుగుతే ఎప్పుడూ లేదు, కాదు అనలేదు.

అందరికన్నా ఎక్కువ ఓర్పు, సహనం గలవారు. ఎప్పుడూ తమ స్వంత విషయంలో ఎవరితో ప్రతీకారం కోరలేదు. ఎవరినీ కోపగించలేదు. కాని అల్లాహ్ నిషిద్ధతాల పట్ల జోక్యం చేసుకున్నవాడిని అల్లాహ్ కొరకు శిక్షించేవారు.

ఆయన దృష్టిలో దూరపు – దగ్గరివారు, బలహీనులు – బలలవంతులు అనే తారతమ్యము లేదు. హక్కులో అందరూ సమానం. మరింత తాకీదు చేస్తూ ఇలా చెప్పారు: “ఏ ఒకరికి మరొకరిపై ఆధిక్యత, ఘనత లేదు. కేవలం తఖ్వా (అల్లాహ్ భయభీతి) తప్ప. మానవులందరూ సమానులే. గత కాలల్లో గతించిన జాతుల్లో దొంగతనం చేసే వ్యక్తి ఉన్నత వంశీయు డవుతే శిక్షించకుండానే వదిలేసేవారు. అదే బడుగు వర్గం వాడయితే శిక్షించేవారు. అందుకే వారు నాశనం అయ్యారు. వినండి!
“ముహమ్మద్ కూతురు ఫాతిమ గనక దొంగతనం చేస్తే నేను ఆమె చేతుల్ని నరికేసేవాన్ని”.

ఎప్పుడూ ఏ భోజనానికి వంక పెట్ట లేదు. ఇష్టముంటే తినేవారు. లేదా వదిలేవారు. ఒక్కోసారి నెల రెండు నెలల వరకు ఇంటి పొయ్యిలో మంటే ఉండకపోయేది. ఆ రోజుల్లో ఖర్జూరం మరియు నీళ్ళే వారి ఆహారంగా ఉండేది. ఒక్కోసారి ఆకలితో కడుపుపై రాళ్ళు కట్టుకునేవారు.

చెప్పుల మరమ్మతు చేసుకునేవారు. దుస్తులు చినిగిన చోట కుట్లు వేసుకునేవారు. ఇంటి పనుల్లో ఇల్లాలికి సహకరించేవారు. వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించేవారు.

పేదరికం వల్ల పేదలను చిన్న చూపు చూసేవారు కారు. రాజ్యాధికారం వల్ల రాజులతో భయపడేవారు కారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గుఱ్ఱం, ఒంటె, గాడిద మరియు కంచర గాడిదలపై ప్రయాణం చేసేవారు.

ఎన్ని బాధలు, కష్టాలు వచ్చినా అందరికన్నా ఎక్కువ మందహాసంతో ఉండేవారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపేవారు. సువాసనను ప్రేమించే వారు. దుర్వాసనను అసహ్యించుకునేవారు. సర్వ సద్గుణాలను, ఉత్తమ చేష్టలను అల్లాహ్ ఆయనలో సమకూర్చాడు.

అల్లాహ్ ఆయనకు నొసంగిన విద్యా జ్ఞానం ముందువారిలో, వెనుక వారిలో ఎవ్వరికీ నొసంగ లేదు. ఆయన నిరక్షరాస్యులు. చదవలేరు, వ్రాయ లేరు. మానవుల్లో ఎవరూ ఆయనకు గురువు కారు. దివ్యగ్రంథం ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి వచ్చినది. దాని గురించి అల్లాహ్ ఇలా ఆదేశించాడు:

{ఇలా అను ఓ ప్రవక్తా! ఒకవేళ మానవులూ జిన్నాతులూ అందరూ కలసి ఈ ఖుర్ ఆను వంటిదానిని దేనినయినా తీసుకువచ్చే ప్రయత్నం చేసినప్పటికీ తీసుకురాలేరు. వారందరూ ఒకరికొకరు సహాయులు అయినప్పటికినీ. (బనీ ఇస్రా ఈల్ 7: 88).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిన్నపటి నుండి చదవడం, వ్రాయడం నేర్చుకోకుండా నిరక్షరాస్యులవడం తిరస్కారుల అపోహాలకు ఒక అడ్డు కట్టుగా నిలిచింది. ఈ గ్రంథాన్ని ముహమ్మద్ – సల్లల్లాహు అలైహి వసల్లం- స్వయంగా వ్రాసారు, లేదా ఇతరులతో నేర్చుకున్నారు, లేదా పూర్వ గ్రంథాల నుండి చదివి వినిపిస్తున్నాడన్న అపోహాలు వారు లేపుతూ ఉంటారు. నిరక్షరాస్య మనిషి ఎలా ఇలా చేయగలడు? అందుకని వాస్తవంగా ఇది అల్లాహ్ వైపు నుండి అవతరించినదే.

మహిమలు (MIRACLES)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు లభించిన మహిమల్లో అతి గొప్పది దివ్య గ్రంథం ఖుర్ఆన్. ఇది ప్రళయం వరకూ మహిమగా నిలిచి ఉంది. అది భాషా ప్రావీణులను, వాక్పుతులను అశక్తతకు గురి చేసింది. ఖుర్ఆన్ లో ఉన్నటువంటి పది సూరాలు, లేదా ఒక సూరా, లేదా కనీసం ఒక్క ఆయతెనా తేగలరా అని అలాహ్ అందరితో ఛాలెంజ్ చేశాడు. ముషీకులు స్వయంగా తమ అసమర్థత, అశక్తతను ఒప్పుకున్నారు.

ఆయన మహిమల్లో ఒకసారి ముఫ్రికులు మహత్యము చూపించమని కోరారు. ప్రవక్త అల్లాహ్ తో దుఆ చేశారు. చంద్రుణ్ణి రెండు వేరు వేరు ముక్కల్లో వారికి చూపించబడింది. (దీని వివరం పైన చదివారు).

కంకర రాళ్ళు ఆయన చేతులో సుబ్ హానల్లాహ్ పఠించాయి. అవే రాళ్ళు అబూ బక్ర్ చేతులో, తర్వాత ఉమర్ చేతులో, ఆ తర్వాత ఉస్మాన్ — చేతులో పెట్టారు. అప్పుడు కూడా అవి తస్బీహ్ పఠించాయి.

ఎన్నో సార్లు ఆయన వ్రేళ్ళ నుండి నీళ్ళ ఊటలు ప్రవహించాయి.

ప్రవక్త భోజనం చేసేటప్పుడు ఆ భోజనం కూడా తస్బీహ్ పఠిస్తున్నది సహచరులు వినేవారు.

రాళ్ళు, చెట్లు ఆయనకు సలాం చేసేవి.

ఒక యూదురాళు ప్రవక్తను చంపే ఉద్దేశ్యంతో మేక మాంసంలోని దండచెయి భాగంలో విషం కలిపి బహుమానంగా పంపింది. ఆ మాంసపు దండచెయి మాట్లాడింది.

ఒక గ్రామీణుడు ఏదైనా మహిమ చూపించండి అని కోరినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చెట్టును ఆదేశించగా అది దగ్గరికి వచ్చింది. మరోసారి ఆదేశించగా తన మొదటి స్థానానికి తిరిగి వెళ్ళింది.

ఏ మాత్రం పాలు లేని మేక పొదుగును చెయితో తాకగానే పాలు వచ్చేశాయి. దాని పాలు పితికి స్వయంగా త్రాగి, అబూ బక్రకు త్రాపించారు.

అలీ బిన్ అబూ తాలిబ్ రజియల్లాహు అను కళ్ళల్లో అవస్త ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఉమ్మిని అతని కళ్ళల్లో పెట్టగా అప్పడికప్పుడే సంపూర్ణ స్వస్థత కలిగింది.

ఒక సహచరుని కాలు గాయపడంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని కాలును చెయితో తుడిస్తారు. వెంటనే అది నయం అయ్యింది.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అను కొరకు దీర్ఘాయుష్మంతుడుగను, అధిక ధన సంతానం గలవాడవాడిగను మరియు అల్లాహ్ వారికి శుభం (బర్కత్) ప్రసాదించాలని దుఆ చేశారు. అలాగే ఆయనకు 120 మంది సంతానం కలిగారు. ఖర్జూరపు తోటలన్నీ ఏడాదికి ఒక్కసారే ఫలిస్తాయి. కాని ఆయన ఖర్జూరపు తోట ఏడాదికి రెండు సార్లు పండేది. ఇంకా ఆయన 120 సంవత్సరాలు జీవించారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా రోజు మెంబర్ పై ఖుత్బా ఇస్తుండగా ఒక వ్యక్తి వచ్చి, అనావృష్టి దాపురించింది మీరు వర్షం కొరకు దుఆ చేయండని కోరగా, రెండు చేతులెత్తి దుఆ చేశారు. ఎక్కడా లేని మేఘాలన్నీ పర్వతాల మాదిరిగా ఒక చోట చేరి, వారం రోజుల పాటు కుండ పోత వర్షం కురిసింది. మరో జుమా రోజు ఖుత్బా సందర్భంలో వర్షం వల్ల నష్టం చేకూరుతుందని విన్నవించుకోగా రెండు చేతులెత్తి దుఆ చేశారు. అప్పటికప్పుడే వర్షం నిలిచింది. ప్రజలందరూ ఎండలో నడచి వెళ్ళారు.

ఖందక యుద్ధంలో పాల్గొన్న వెయ్యి మంది వీరులందరికీ సుమారు మూడు కిలోల యవధాన్యాల రొట్టెలు మరియు ఒక చిన్న మేక మాంసం తో ప్రవక్త వడ్డించారు. అందరూ కడుపు నిండా తృప్తికరంగా తిని వెళ్ళారు. అయినా రొట్టెలు మరియు మాంసంలో ఏ కొదవ ఏర్పడలేదు.

అదే యద్దంలో బషీర్ బిన్ సఅద్ కూతురు తన తండ్రి మరియు మామ కొరకు తీసుకొచ్చిన కొన్ని ఖర్జూరపు పండ్లు వీరులందరికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తినిపించారు.

అబూ హురైరా రజియల్లాహు అన్షు వద్ద ఉన్న ఒకరి భోజనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పూర్తి సైన్యానికి తినిపించారు.

హిజ్రత్ కు వెళ్ళే రాత్రి ఆయన్ను (సల్లల్లాహు అలైహి వసల్లం) హత్య చేయుటకు వేచిస్తున్న వంద మంది ఖురైషుల పై దుమ్ము విసురుతూ వారి ముందు నుండి వెళ్ళి పోయారు. వారు ఆయన్ని చూడలేకపోయారు.

హిజ్రత్ ప్రయాణంలో సురాఖా బిన్ మాలిక్ ఆయన్ను చంపడానికి వెంటాడుతూ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని శపించారు. అందుకు అతని గుఱ్ఱం కాళ్ళు మోకాళ్ళ వరకు భూమిలో దిగిపోయాయి.

సీరత్ ముందు పాఠాలు :

ఇతరములు: 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారిపై ఒక సారి దరూద్ పఠిస్తే కలిగే లాభాలు ఏమిటి? [ఆడియో]

బిస్మిల్లాహ్

[3:37 నిముషాలు]
Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 16
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

1) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారిపై ఒక సారి దరూద్ పఠిస్తే కలిగే లాభాలు ఏమిటి?

A) ‘అల్లాహ్’ 10 కారుణ్యాలు కురిపిస్తాడు
B) 10 పాపాలు మన్నిస్తాడు
C) 10 గౌరవ స్థానాలను పెంచుతాడు
D) పైవన్నీ లభిస్తాయి

దరూద్

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్జతుల్ విదా (చివరి హజ్) – “అర్రహీఖుల్‌ మఖ్ తూమ్” పుస్తకం నుండి

బిస్మిల్లాహ్
మహాప్రవక్త ﷺ జీవిత చరిత్ర – అంతిమ హజ్ – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/IrogXl0z-uY [42నిముషాలు]

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్జతుల్ విదా (చివరి హజ్)

దైవసందేశం అందించే కార్యం పరిపూర్తి అయింది. అల్లాహ్ ఏకత్వం, ఆయన తప్ప మరే ఆరాధ్యుడు లేడన్న సత్యాన్ని ధృవీకరించడం మరియు దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి దైవదౌత్యం పునాదులపై ఓ క్రొత్త సమాజ నిర్మాణ, రూపకల్పన అమల్లోనికి వచ్చేసింది. అంటే, ఇప్పుడు ఆ మహత్కార్యం పూర్తి అయిపోయింది కాబట్టి ఓ అదృశ్యవాణి మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి మనోఫలకంపై ఆయన ఈ ప్రపంచంలో జీవించి ఉండే కాలం దగ్గరపడుతుందనే సూచనలు ప్రస్ఫుటం చేయనారంభించింది. అందుకేనేమో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు)ను హిజ్రీ శకం 10లో యమన్ కు గవర్నరుగా చేసి పంపిస్తూ ఆ పదవికి సంబంధించిన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలకు తోడు హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు)తో, “ఓ ముఆజ్! బహుశా నీవు నన్ను ఈ సంవత్సరం తరువాత మళ్ళీ కలుసుకోలేవు అని అనిపిస్తోంది! నా ఈ మస్జిద్ (మస్జిదె నబవీ) మరియు నా సమాధిని మాత్రమే చూడగలవేమో!” అని చెప్పారు, హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు), దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఈ పలుకులు విన్నంతనే దుఃఖాన్ని ఆపుకోలేక పెద్దగా రోదించడం కూడా జరిగింది.

అసలు యదార్థం ఏమిటంటే, అల్లాహ్ తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఈ అదృశ్య వాణి ద్వారా ఇస్లామ్ ధర్మసందేశం వలన ఒనగూడిన సత్ఫలితాలేమిటో చూయించదలిచాడు. ఏ దైవసందేశ ప్రచారం కోసమైతే ఆయన అహర్నిశలు ఇరవై సంవత్సరాలకు పైన్నే కష్టాలను, కడగండ్లను అనుభవిస్తూ వచ్చారో దాని ఫలితం ఎంత మహోజ్వలంగా ఉందో కళ్ళారా చూసే భాగ్యాన్ని ప్రసాదించాడన్నమాట. ఇందుకు అల్లాహ్ ఓ సుముహూర్తాన్ని కూడా నిర్ణయించి, తద్వారా హజ్ సందర్భంలో మక్కా పరిసరాల్లో నివసించే అరబ్బు తెగల ప్రతినిధి వర్గాలను ఓ చోట సమావేశపరిచి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధించిన ధార్మిక విషయాల జ్ఞానాన్ని వారు సముపార్జించడానికి, ఏ అమానతు భారమైతే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) భుజస్కంధాలపై వేయబడిందో దాన్ని ఇప్పుడు వీరు మోయవలసి ఉంటుందని చెప్పడానికి, దైవసందేశాన్ని అందించడం, ముస్లిం సమాజానికి మేలు చేకూర్చే హక్కును సజావుగా నిర్వర్తించడంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎలాంటి లోటు రానివ్వకుండా ఆ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించారని వారి నోటే సాక్ష్యం ఇప్పించవలసి ఉంది. ఈ దైవ నిర్ణయం ప్రకారమే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ చారిత్రాత్మకమైన ‘హజ్జె మబ్రూర్’ (దైవం మెచ్చిన హజ్) చేయవలసి ఉందని ప్రకటించగానే అరేబియా ద్వీపానికి చెందిన ముస్లిం జనసందోహం తండోపతండాలుగా వచ్చి ఆయన చుట్టూ చేరనారంభించింది. ప్రతి వ్యక్తీ, తాను మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెంట వెళ్ళి ఆయన నాయకత్వంలో హజ్ చేయాలని పరితపించిపోతున్నాడు.[1] జిల్-ఖాదా నెల ఇంకా నాల్గు రోజులకు ముగుస్తుందనగా శనివారం రోజున దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్ కోసం బయలుదేరారు.[2]

[1]. ఇది సహీహ్ ముస్లిం గ్రంథంలో ఉన్న హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి ఉల్లేఖనం. చూడండి, ప్రవక్త హజ్ అధ్యాయం – 1/394.

[2]. హాఫిజ్ ఇబ్నె హజర్ పరిశోధించి చెప్పిన విషయం ఇది. కొన్ని ఉల్లేఖనాల్లో జిల్ ఖాదా నెల ఇంకా అయిదు రోజులకు ముగుస్తుందనగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) బయలుదేరారనే అని వచ్చిన వివరాలను ఆయన సరిదిద్దారు. చూడండి, ఫత్ హుల్ బారి – 8/104.

తలపై నూనె వేసి మర్ధించుకొని దువ్వుకున్నారు. ‘తహ్బంద్’ (లుంగీ) కట్టుకొని మేనిపై దుప్పటి కట్టుకున్నారు. ఖుర్బానీ పశువుల మెడలలో పట్టెడలు వేసి జొహ్ర్ నమాజు చేసి హజ్ కోసం బయలుదేరారు. అస్ర్ నమాజుకు ముందే ‘జుల్ హులైఫా’ వాదీ (లోయ)లోనికి చేరుకుని అక్కడాగి రెండు రకాతుల ‘అస్ర్’ నమాజు చేశారు. గుడారాలు వేసుకొని రాత్రంతా అక్కడనే గడిపారు. తెల్లవారిన తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహాబా (రదియల్లాహు అన్హుమ్) (అనుచరగణం) ను సంబోధిస్తూ, “రాత్రి నా ప్రభువు వద్ద నుండి వచ్చేవాడు ఒకడొచ్చి నాతో, ఈ శుభమైన లోయలో నమాజు చేయమని, హజ్ లో ‘ఉమ్రా’ కూడా ఉందని ప్రకటించు అని చెప్పి వెళ్ళాడు” అని తెలిపారు.[3]

[3] ఇది హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారు ఉల్లేఖించినట్లు బుఖారీ గ్రంథంలో ఉంది. 1/207.

జొహ్ర్ నమాజుకు ముందే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘ఇహ్రామ్’ కోసం ‘గుస్ల్’ చేశారు. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా), ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) శరీరం మీదా, తలపైనా తన చేతులతో ‘జరీరా’తో కలిపిన కస్తూరి సువాసన గల పదార్థాన్ని, దాని తళుకు, గుబాళింపు ఆయన తల పాపిటలో, గెడ్డంలో కానవచ్చేటట్లు పులిమారు. అయితే ఆ సువాసనా పదార్థాన్ని ఆయన కడిగివేయకుండా అలాగే ఉంచేసుకున్నారు. ఆ తరువాత తహ్బంద్ కట్టుకొని, శరీరం పై ఓ దుప్పటిని కట్టుకొని “లబ్బైక్’ వాక్యాలను బిగ్గరగా పలికారు. బయటకు వచ్చి తన ‘కస్వా’ అనే ఆడ ఒంటె పై ఎక్కి కూర్చున్నారు. అప్పుడు కూడా మరోసారి లబ్బైక్ పదాలను బిగ్గరగా పలికారు. అలా ఒంటెనెక్కి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మైదానం వైపునకు వెళ్ళి అక్కడ కూడా లబ్బైక్ వాక్యాల్ని అందరికీ వినబడేటట్లు పలికారు.

ఆ తరువాత పయనమై ఓ వారం తరువాత ప్రొద్దుగ్రుంకే సమయానికి మక్కా దాపుకు చేరుకున్నారు. అక్కడ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘జీతువా’లో మకాం వేశారు. రాత్రి అక్కడనే గడిపి ఫజ్ర్ నమాజు తరువాత ‘గుస్ల్’ (స్నానం) చేసి ఉదయాన్నే మక్కాలో ప్రవేశించారు. అది హిజ్రి శక సంవత్సరం 10, జిల్ హిజ్జా మాసం 4వ తేది, ఆదివారం రోజు. ప్రయాణ కాలంలో మొత్తం ఎనిమిది రాత్రిళ్ళు గడిచాయి- సరాసరి ప్రయాణానికి పట్టేకాలం అదే- నేరుగా మస్జిదె హరామ్ (కాబా మస్జిద్)కు చేరి ఆయన మొదట దైవగృహం కాబా తవాఫ్ చేశారు. ఆ తరువాత సఫా మర్వా కొండల నడుమ ‘సయీ’ చేశారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్ మరియు ఉమ్రాలు రెంటికి సంబంధించిన ఇహ్రామ్ ఒకేసారి కట్టుకోవడం ‘హదీ’ (ఖుర్బానీ) పశువులను వెంట తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇహ్రామ్ వస్త్రాలను మాత్రం తీసివేయక అలానే ఉంచేసుకున్నారు. తవాఫ్ మరియు సయీ రెంటిని ముగించుకొని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎగువ మక్కాలో హజూన్ అనే ప్రదేశంలో విడిది చేశారు. అయితే, హజ్ తవాఫ్ తప్ప మరే తవాఫ్ ఆయన చేయలేదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెంట వచ్చిన ఏ సహాబాలైతే తమ వెంట ‘హదీ’ తీసుకురాలేకపోయారో, వారికి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తమ ఇహ్రామ్ ను ఉమ్రా ఇహ్రామ్ గా మార్చుకొమ్మని, కాబా గృహం తవాఫ్ మరియు సఫా మర్వాల నడుమ ‘సయీ’ చేసిన తరువాత వాటిని తీసేసి పూర్తిగా ‘హలాల్ కమ్మని ఆదేశం ఇచ్చారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్వయంగా ఇహ్రామ్ దుస్తులను తీసివేసి హలాల్ కానందున సహాబాలు కొంత ఇరుకునబడ్డారు. అది చూసిన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారితో, “నాకు ఇప్పుడు తెలిసిన విషయం ముందే తెలిసి ఉంటే నేనసలు హదీ తెచ్చేవాడినే కాదు. మీతోపాటే హలాల్ అయి ఉండేవాణ్ణి” అని అనగా సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) ఆయన ఆదేశాలను శిరసావహించారు. అంటే ఎవరి వద్ద హదీ పశువు లేదో వారు హలాల్ అయిపోయారు. (హలాల్ కావడం అంటే, ఇహ్రామ్ కట్టుకున్న తరువాత కొన్ని ధర్మసమ్మతమైన విషయాలు ఇహ్రామ్ వదలనంతవరకు హరామ్ అవుతాయి. ఇహ్రామ్ వదిలిన తరువాత తిరిగి అవి ధర్మసమ్మతం అయిపోతాయి అని అర్థం.)

ఎనిమిది జిల్ హిజ్జా తేదీన – తర్వియా రోజున – మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘మినా’కు వెళ్ళారు. అక్కడ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జిల్ హిజ్జా తొమ్మిదవ తేదీ ఉదయం వరకు విడిది చేశారు. జొహ్ర్,అస్ర్, మగ్రిబ్, ఇషా మరియు ఫజ్ర్ నమాజులు (అయిదు పూటలు) అక్కడనే చేశారు. సూర్యోదయం అయిన వరకు ఆగి ‘అరఫా’కు బయలుదేరారు. అక్కడికి చేరేటప్పటికే ఆయన కోసం ‘వాదియె నిమ్రా’లో గుడారం సిద్ధపరచబడి ఉంది. పగలంతా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ గుడారం లోనే ఉండిపోయారు. సూర్యుడు పడమటి దిక్కుకు వాలిన తరువాత ఆయన ఆదేశం మేరకు కస్వా పై కజావా కట్టబడింది. దాని పైనెక్కి ‘బత్న్’ లోయలోనికి అరుదెంచారు. అప్పుడు ఆయన చుట్టూ ఒక లక్షా ఇరవై నాల్గు వేలు లేదా లక్షా నలభై నాల్గు వేల మంది చేరారు.

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి నడుమన నిలుచొని ఓ సమగ్రమైన ప్రసంగం చేస్తూ ఇలా సెలవిచ్చారు:

“ప్రజలారా! నా మాటలను ఆలకించండి! ఎందుకంటే ఈ సంవత్సరం తరువాత ఈ ప్రదేశంలో మీరు నన్ను ఇంకెన్నడూ కలుసుకోలేరు.[4]

ఈ గడుస్తున్న నెల మరియు ఈ నగరం యొక్క పవిత్రతలా, మీ ప్రాణం, మీ సంపద కూడా పరస్పరం ఒకరిపై ఒకరికి అంతే పవిత్రమైనది, నిషిద్ధమైనది. బాగా వినండి! అజ్ఞాన కాలంనాటి ప్రతిదీ నా కాళ్ళ క్రింద నలిపివేయబడింది. అజ్ఞానకాలంలో జరిగిన హత్యల రక్తపరిహారం కూడా అంతం చేయబడింది. మనలో మొట్టమొదటి వ్యక్తి రక్తపరిహారం దేన్నయితే నేను అంతమొందిస్తున్నానో అది రబీయా బిన్ హారిస్ కుమారునిది – ఈ పిల్లవాణ్ణి బనూ సఅద్ పాలు త్రాగడానికి వదలినప్పుడు హుజైల్ వంశానికి చెందినవారు అతణ్ణి హతమార్చారు – అజ్ఞాన కాలం నాటి వడ్డీని కూడా అంతం చేసేస్తున్నాను. మన వడ్డీలో మొదటి ఏ వడ్డీనైతే నేను అంతం చేస్తున్నానో అది అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ గారి వడ్డీ. ఇప్పుడు ఈ వడ్డీ అంతా లేనట్లే.

అయితే, స్త్రీల విషయంలో అల్లాహ్ కు భయపడండి. ఎందుకంటే వారిని మీరు అల్లాహ్ అమానతుగా పొందినవారు. అల్లాహ్ వచనం ద్వారా మీ కోసం వారు ధర్మసమ్మతం అయినవారు. మీకు ఇష్టం కాని వారినెవరినీ వారు మీ పడకల పైకి రాకుండా ఉంచాలి. అది మీ హక్కు. వారే గనక అలా చేస్తే మీరు వారిని దండించవచ్చు. అయితే వారిని తీవ్రమైన దండనకు గురి చేయకూడదు. ప్రసిద్ధ రీతిలో వారికి తిండీ బట్టా అందించడం అనేది మీపై వారికి ఉన్న హక్కు.

ఇంకా, మీ కోసం దేన్నయితే వదిలి వెళుతున్నానో దాన్ని మీరు గనక దృఢంగా పట్టుకొని ఉంటే ఇక మీదట మీరు ఏమాత్రం మార్గాన్ని తప్పలేరు. అది అల్లాహ్ గ్రంథం.

ప్రజలారా! గుర్తుంచుకోండి! నా తరువాత మరే ప్రవక్త ఉండడు. అలాగే నా తరువాత మరే సమాజమూ లేదు. కాబట్టి మీరు మీ ప్రభువును ఆరాధించండి. అయిదు పూటలా నమాజు చేయండి. రమజాన్ మాసంలో రోజా వ్రతాన్ని పాటించండి. మనస్పూర్తిగా జకాత్ చెల్లించండి. మీ ప్రభువు గృహ (కాబా) హజ్ చేయండి మరియు మీ పాలకులను విధేయించండి. అలా చేస్తే మీ ప్రభువు యొక్క స్వర్గంలో ప్రవేశిస్తారు. [6]

ఇంకా, నా గురించి మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు మీరు ఏమంటారు? దానికి సహాబా (రదియల్లాహు అన్హుమ్), “మీరు ధర్మాన్ని మాకు అందించారు, సందేశ ప్రచారం చేశారు. ఎంత మేలు చేయాలో అంత మేలు చేసి దాని హక్కును నిర్వర్తించారు” అన్నారు. ఇది విన్న మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), తన చూపుడు వ్రేలిని ఆకాశం వైపునకు ఎత్తి దాన్ని ప్రజల వైపునకు వంచుతూ ‘ఓ అల్లాహ్ దీనికి నీవే సాక్షివి’ అని మూడు మార్లు పలికారు.[7]

[4] ఇబ్నె హిషామ్ -2/603
[5] సహీహ్ ముస్లిమ్ – ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)గారి హజ్ అధ్యాయం – 1/397.
[6] ఇబ్ను మాజా; ఇబ్ను అసాకర్; రహ్మతుల్ లిల్ ఆలమిన్-1/263.

[7] సహీహ్ ముస్లిమ్ – 1/397

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి పలుకుల్ని రబీయా బిన్ ఉమయ్యా బిన్ ఖల్ఫ్ ఉచ్ఛస్వరంతో ప్రజలకు వినిపించనారంభించారు.[8] ప్రసంగం పూర్తి చేసిన తరువాత అల్లాహ్ ఈ వాక్యాన్ని అవతరింపజేశాడు.

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا

అల్ యౌమ అక్-మల్తు లకుం దీనుకుమ్. వ అత్-మంతు అలైకుం నిఇమతీ వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా.”(5 : 3)

(ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను. నాపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు ఇస్లామ్ ను మీ ధర్మంగా అంగీకరించాను.)

[8] ఇబ్నె హిషామ్ -2/605

[9]. బుఖారి, ఇబ్నె ఉమర్ గారి ఉల్లేఖనం. చూడండి, రహ్మతుల్ లిల్ ఆలమిన్-1/265

హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ ఆయత్ ను విన్నంతనే దుఃఖించనారంభించారు. మీరెందుకు రోదిస్తున్నారని అడుగగా, “పరిపూర్ణత తరువాత మిగిలేది లోపమే కదా!” అని బదులిచ్చారు ఆయన.[9]

ప్రసంగం తరువాత హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) అజాన్ పలికి నమాజు కోసం ఇఖామత్ కూడా పలికారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జుహ్ర్ నమాజు చేయించారు. ఆ తరువాత హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) మరోసారి ఇఖామత్ పలుకగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అస్ర్ నమాజు కూడా చేయించారు. ఈ రెండు నమాజుల మధ్యకాలంలో మరే నమాజు చేయలేదు. ఆ తరువాత వాహనమెక్కి తాము విడిది చేసిన చోటికి వెళ్ళిపోయారు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). తన ఒంటె కస్వా పొట్టను బండరాళ్ళ వైపునకు మళ్ళించి కూర్చోబెట్టారు. ‘జబ్లే ముషాత్’ (కాలినడకన వెళ్ళేవారి మార్గంలో ఉన్న మట్టి తిన్నె) ను ముందు ఉండేటట్లు చూసి తన ముఖాన్ని కాబాకు అభిముఖంగా చేసి అక్కడనే ఉండిపోయారు. ప్రొద్దుగ్రుంకుతూ, బాగా ఎరుపెక్కి అస్తమించే వరకు వేచి చూశారు.

సూర్యబింబం పూర్తిగా మటుమాయమైపోగానే హజ్రత్ ఉసామా (రదియల్లాహు అన్హు)ను తన ఒంటె పై వెనుక కూర్చోబెట్టుకొని బయలుదేరి ‘ముజ్ దల్ఫా’కు వచ్చేశారు. ముజ్ దల్ఫాలో మగ్రిబ్ మరియు ఇషా నమాజులు ఒకే అజాన్ మరియు రెండు ఇఖామత్ లతో చేశారు. ఆ రెండు నమాజుల మధ్యలో ఎలాంటి నఫిల్ నమాజు చేయలేదు. ఉషోదయం వరకు అలా మేనువాల్చారు. తెల్లవారుతూ ఉండగా అజాన్ కాగానే ఇఖామత్ చెప్పి ఫజ్ర్ నమాజ్ చేశారు. పిదప కస్వాపై ఎక్కి ‘మష్ అరిల్ హరామ్’కు వెళ్ళిపోయారు. అక్కడ ఖిబ్లా దిశగా (కాబాభి ముఖంగా) నిలబడి దుఆ చేశారు. ఆయన ఏకత్వం, ఔన్నత్యం గురించి ప్రస్తుతించారు. అలా ఇక్కడా బాగా తెల్లవారిపోయిన వరకు అలా నిలబడి అల్లాహ్ ను ప్రస్తుతిస్తూనే ఉండిపోయారు. సూర్యోదయం అయ్యే ముందు ‘మినా’కు బయలుదేరారు. ఈసారి హజ్రత్ ఫజ్ల్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు)ను తన వెనుకగా ఎక్కించుకోవడం జరిగింది. ‘బత్నే ముహస్సిర్’కు చేరగా తన వాహన వేగాన్ని కొంత పెంచి పరుగెత్తించారు.

జమ్రయె కుబ్రాకు వెళ్ళే మార్గాన్ని అనుసరించి అక్కడికి చేరుకున్నారు – ఆ కాలంలో అక్కడ ఓ చెట్టు ఉండేది. ‘జమ్రయె కుబ్రా’ ఆ చెట్టు పేరుతోనే గుర్తించబడేది. ఇదే కాకుండా జమ్రయె కుబ్రాను జమ్రయె అక్బా మరియు జమ్రయె ఊలాగా కూడా పిలుస్తారు – అక్కడికి చేరిన తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జమ్రయె కుబ్రా పై ఏడు గులకరాళ్ళను విసిరారు. ఒక్కో గులకరాయి విసురుతూ తక్బీర్ (అల్లాహు అక్బర్) అని పలికారు. అవి రెండు వ్రేళ్ళతో పట్టి విసరేటంత చిన్నవి. ఈ గులకరాళ్ళను ఆయన బత్నె వాదీలో నిలబడి విసిరారు.

ఆ తరువాత బలి స్థానానికి వెళ్ళి తన చేత్తో 63 ఒంటెల్ని జిబహ్ చేశారు. తక్కిన ఒంటెలను జిబహ్ చేయమని హజ్రత్ అలి (రదియల్లాహు అన్హు)కి అప్పగించారు. ఆయన మిగిలిపోయిన 37 ఒంటెల్ని జిబహ్ చేయడం జరిగింది. ఇలా ఖుర్బానీ ఇచ్చిన ఒంటెల సంఖ్య మొత్తం నూరు అయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్రత్ అలి (రదియల్లాహు అన్హు)ను కూడా తన హదీ (ఖుర్బానీ)లో చేర్చుకున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశం మేరకు ఆ ఖుర్బానీ ఒంటెల మాంసం నుండి ఒక్కో ముక్కను కోసి వండడం జరిగింది. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు హజ్రత్ అలి (రదియల్లాహు అన్హు) ఆ వండిన మాంసాన్ని కొంత భుజించి దాని పులుసును కూడా త్రాగారు.

ఖుర్బానీ అయిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ఒంటెనెక్కి మక్కాకు బయలుదేరారు. బైతుల్లాహ్ (కాబా గృహం) తవాఫ్ (ప్రదక్షిణ) చేశారు – దీన్ని తవాఫె ఇఫదః అంటారు – మక్కాలోనే జొహ్ర్ నమాజు చేశారు. పిదప (జమ్ జమ్ చెలమ) దగ్గర ఉన్న బనూ అబ్దుల్ ముత్తలిబ్ వారి దగ్గరకు వెళ్ళారు. వారు హాజీలకు జమ్ జమ్ నీరు త్రాగిస్తున్నారప్పుడు. వారిని చూసి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), “బనూ అబ్దుల్ ముత్తలిబ్! మీరు నీళ్ళు తోడుతూనే ఉండండి. నీరు త్రాగించే ఈ కార్యంలో ప్రజలు మిమ్మల్ని మించిపోతారనే భయమే లేకపోతే నేను కూడా మీతోపాటే వచ్చి నీళ్ళు తోడేవాణ్ణి” అని సెలవిచ్చారు – అంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి అనుచరగణం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను నీళ్ళు తోడుతూ చూసి ప్రతివాడు ముందుకెళ్ళి నీటిని తోడడానికి ప్రయత్నం చేసేవాడు. ఇలా హాజీలకు నీరు త్రాగించే హోదా, గౌరవం ఏదైతే బనూ అబ్దుల్ ముత్తలిబ్ కు దక్కిందో, ఆ వ్యవస్థ కాస్తా ఛిన్నాభిన్నమైపోయేది అని అర్థం – బనూ అబ్దుల్ ముత్తలిబ్ జమ్ జమ్ బావి నుండి ఓ బొక్కెన నీటిని తోడి ఇవ్వగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అందులో నుండి తనవితీరా నీరు త్రాగారు.” [10]

ఆ రోజు యౌమున్నహ్ర్. అంటే జిల్ హిజ్జా పదవ తేది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ రోజు ప్రొద్దెక్కిన తరువాత (చాష్త్ సమయం) ఓ ఖుత్బా (ప్రసంగం) ఇచ్చారు. ప్రసంగించేటప్పుడు ఆయన కంచర గాడిద (ఖచ్చర్) నెక్కి ఉన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ప్రవచనాలను హజ్రత్ అలి (రదియల్లాహు అన్హు), సహాబా (రదియల్లాహు అన్హుమ్) లకు వినబడేటట్లు బిగ్గరగా చెబుతున్నారు. సహాబా( (రదియల్లాహు అన్హుమ్)లు ఆ సమయాన కొందరు నిలబడి, మరికొందరు కూర్చుని వింటూ ఉన్నారు.” [11] ప్రవక్త శ్రీ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ రోజు ప్రసంగం లోనూ, నిన్నటి ఎన్నో మాటలను వల్లించారు. సహీహ్ బుఖారి మరియు సహీహ్ ముస్లిమ్ గ్రంథాల్లో అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) గారి ఉల్లేఖనం ఉంది. ఆయన (రదియల్లాహు అన్హు), యౌమున్నహ్ర్ (పదవ జిల్ హిజ్జా) నాడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రసంగించారని చెప్పారు:

“కాలం పరిభ్రమిస్తూ, మళ్ళీ అల్లాహ్ భూమ్యాకాశాలు సృజించిన ఈ రోజుకు తిరిగివచ్చింది. సంవత్సరానికి పన్నెండు నెలలు. ఈ పన్నెండు నెలల్లో నాల్గు నెలలు హరామ్ నెలలు. మూడు ఒకదాని తరువాత ఒకటి వరుసగా వచ్చేవి. అంటే జిల్ ఖాదా, జిల్ హిజ్జా మరియు ముహర్రం. ఇంకొకటి రజబె ముజర్. అది జమాదిల్ ఉఖ్రా మరియు షాబాన్ నెలలకు నడుమన ఉన్న నెల.”

ఇంకా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), “ఇది ఏ మాసం?” అని అడిగారు. మేము జవాబుగా, “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కే బాగా తెలుసు” అన్నాం. ఇది విన్న మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కొంచెం సేపు మౌనం పాటించారు. మేము, ఈ నెలకు ఆయన మరేదైనా పేరు పెట్టనున్నారేమో అని అనుకున్నాం. కాని ఆ తరువాత ఆయన తిరిగి, “ఇది జిల్ హిజ్జా మాసం కాదా?” అని అడిగారు. “అవును. ఎందుకు కాదు” అన్నాం మేము. ఆయన మళ్ళీ, “ఇది ఏ నగరం?” అని ప్రశ్నించారు. మేము, “అల్లాహ్ కు, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు బాగా తెలుసు.” అని సమాధానమివ్వగా, ఆయన మళ్ళీ మౌనం వహించారు. మేము, ఆ మౌనాన్ని చూసి ఈ నగరానికి. మరే పేరేదైనా పెడతారేమో అని అనుకుంటూ ఉండగా, తమ మౌనాన్ని వీడి, “ఇది బల్దహ్ (మక్కా) కాదా?” అని ప్రశ్నిం చారు. “ఔను. తప్పకుండా” అని సమాధానమిచ్చాం మేము.

“సరే, ఈ రోజు ఏ రోజు?” అని అడిగారు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం).

“అల్లాహ్ కు, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కే బాగా తెలుసు” అన్నాం మేము.

మా సమాధానం విన్న ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తిరిగి మౌనం వహించారు. మౌనాన్ని చూసి, ఈ రోజుకు మరే పేరేదైనా పెడతారేమో అని అనుకుంటూ ఉండగానే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), “ఈ రోజు యౌమున్నహ్ర్ (ఖుర్బానీ రోజు అంటే జిల్ హిజ్జా పదవ తారీకు) కాదా?” అని అడిగారు.

“ఔను. ఎందుకు కాదు” అని అన్నాం మేము. అప్పుడాయన ఇలా సెలవిచ్చారు:

“సరే వినండి, మీ ఈ నగరం, మీ ఈ నెల మరియు మీ ఈ రోజు ఎలా నిషిద్ధం (హరాం) గావించబడిందో, అలానే మీ రక్తం, మీ సంపద, మీ మానం పరస్పరం ఒకరిపై ఒకరికి నిషిద్ధం గావించబడ్డాయి.

మీరు అతి త్వరలోనే మీ ప్రభువును చేరుకుంటారు. ఆయన మిమ్మల్ని మీ కర్మలను గురించి అడుగుతాడు. కాబట్టి చూడండి! నా తరువాత ఒకరి మెడలను మరొకరు నరుక్కునేలా ధర్మభ్రష్టులు కాకండి. నేను దైవసందేశాన్ని మీకు అందించి నా విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చుకున్నానా? చెప్పండి” అని అడిగారు.

సహాబాలందరూ ముక్తకంఠంతో ‘అవును’ అని పలికారు.

అప్పుడు ఆయన(సల్లల్లాహు అలైహి వ సల్లం), “ఓ అల్లాహ్! నీవే సాక్షి! అంటూ, ఎవరైతే ఇక్కడ హాజరుగా ఉన్నారో (ఈ మాటలను) హాజరుగా లేనివారికి అందించాలి. ఎందుకంటే, ఎవరికైతే (ఈ మాటలు) అందించడం జరుగుతుందో ప్రస్తుతం కొందరు (హాజరుగా) వినేవారికంటే నా ఈ మాటల పరమార్థాన్ని తెలుసుకోగలరు.” [12]

మరో ఉల్లేఖనంలో ఈ ఖుత్బాలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా కూడా సెలవిచ్చి నట్లుంది:

“ఏ నేరం చేసినవాడైనా తనకు తాను తప్ప మరొకరికి నేరంచేయడనే విషయాన్ని గుర్తించండి (అంటే ఆ నేరం చేసినందుకు మరొకరు కాకుండా స్వయంగా తానే ఆ నేరం క్రింద పట్టుబడతాడని అర్థం). గుర్తుంచుకోండి! ఏ నేరగాడు అయినా తన కుమారుని పైగాని లేదా ఏ కుమారుడైనా తన తండ్రి పైగాని నేరం చేయడు (అంటే, తండ్రి చేసిన నేరానికి కుమారుణ్ణిగాని, కుమారుడు చేసిన నేరానికి తండ్రినిగాని పట్టుకోవడం జరగదు అని). జ్ఞాపకముంచుకోండి! షైతాన్ ఇప్పుడు, మీ ఈ నగరంలో ఎవ్వరూ అతణ్ణి పూజించేవారు లేరు గనుక నిరాశకు లోనైపోయాడు. ఏ కర్మలనైతే మీరు తుచ్ఛమైనవిగా నీచమైనవిగా తలుస్తున్నారో ఆ కర్మలలోనే అతణ్ణి మీరు విధేయించడం జరుగుతుంది. వాటి ద్వారానే అతడు సంతుష్టుడవుతూ ఉంటాడు.” [13] (అంటే ఎలాంటి ప్రాధాన్యత లేని విషయాల్లో వారు అతణ్ణి అనుసరిస్తారు అని అర్థం.)

[10] ముస్లిమ్- అధ్యాయం , ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి హజ్ – 1/397 – 400.
[11] అబూ దావూద్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఖుత్బాల అధ్యాయం – 1/270.

[12] సహీహ్ బుఖారి- మినాలో చేసిన ఖుత్బా అధ్యాయం-1/234.
[13] తిర్మిజీ-2/38, 135; ఇబ్ను మాజా, కితాబుల్ హజ్ మిష్కాత్-1/234.

ఆ ప్రసంగం అయిన తరువాత ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) అయ్యామె తష్రీక్ (11, 12, 13 జిల్ హిజ్జా తేదీలు) లో మినాలోనే ఉండిపోయారు. ఈ మూడు రోజుల్లో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘హజ్ మనాసిక్’ను (హజ్ లో నిర్వర్తించవలసిన పనులను) కూడా ఆచరించారు. అదేకాకుండా ప్రజలకు ఇస్లాం ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలను గురించి బోధిస్తూ దైవాన్ని ప్రస్తుతించారు. ఇబ్రాహీం (అలైహిస్సలాం) నిర్వహించిన ఖుర్బానీ ఆచారాన్ని నెలకొల్పుతూ షిర్క్ కు సంబంధించిన గురుతులన్నింటినీ నామరూపాల్లేకుండా చెరిపివేశారు. ‘అయ్యామె తష్రీక్’లో ఓ రోజు ప్రసంగించారు కూడా. ‘సునన్ అబూ దావూద్’ గ్రంథంలో ఉటంకించిన ఓ ఉల్లేఖనంలో, హజ్రత్ సరాఅ బిన్తె నిభాన్ (రదియల్లాహు అన్హా) గారి కథనం ఇలా ఉంది:

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘రఊస్’[14] రోజున ఖుత్బానిస్తూ మాకు ఇలా బోధించారు: “ఈ దినం అయ్యామె తష్రీక్ లోని మధ్య రోజు” [15] అని అన్నారు.

నేటి ఖుత్బా కూడా నిన్నటి (యౌమున్నహ్ర్ ) ఖుత్బాలాంటిదే. ఇది నస్ర్ అధ్యాయం అవతరణ తరువాత ఇచ్చిన ఖుత్బా.

అయ్యామె తష్రీక్ అయిపోయిన తరువాత మరునాడు ‘యౌమున్నఫ్ర్’ అంటే 13 జిల్ హిజ్జా రోజున ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) మినా నుండి బయలు దేరారు. వాదియె అబ్తహాలో నివసించే ‘ఖైఫ్ బనీ కనానా’ వారి దగ్గర ఆగి సేద తీర్చుకున్నారు. మిగిలిన ఆ పగలు, రాత్రి కూడా అక్కడనే గడిపేశారు. అక్కడే జొహ్ర్, అస్ర్, మగ్రిబ్ , ఇషా నమాజులు చేశారు. అయితే ఇషా నమాజు తరువాత కొంచెం సేపు నిద్రించి లేచి మళ్ళీ బైతుల్లాహ్ కు బయలు దేరారు. అక్కడికి చేరి ‘తవాఫె విదా’ (కాబా గృహపు చివరి తవాఫ్) చేశారు.

ఇప్పుడిక హజ్ మనాసిక్ (హలో ఆచరించవలసిన ఆచారాలు) పూర్తి చేసుకొని తమ వాహనాన్ని మదీనా వైపునకు మరల్చి బయలుదేరారు. మదీనాకు వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకునే ఉద్దేశ్యంతో కాకుండా, ఇప్పుడు అల్లాహ్ కోసం, అల్లాహ్ మార్గంలో తిరిగి ఓ క్రొత్త కృషికి నాంది పలకడానికే ఆ ప్రస్థానం. ” [16]

[16] హజ్జతుల్ విదా వివరాల కోసం ఈ గ్రంథాలను చూడండి: సహీ బుఖారి- కితాబుల్ మనాసిక్, సంపుటి 1, సంపుటి-2/631; సహీహ్ ముస్లిమ్ – బాబుల్ హజ్జతున్నబీ (సల్లల్లాహు అలైహి వ సల్లం), ఫత్ హుల్ బారి – సంపుటం 3, షరహ్ కితాబుల్ మనాసిక్ మరియు సంపుటం-8/103 – 110; ఇబ్నె హిషామ్ 2/601 – 605; జాదుల్ ముఆద్ 1/196, 218 – 240

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

మహా ప్రవక్త జీవిత చరిత్ర: అర్రహీఖుల్‌ మఖ్ తూమ్ (పూర్తి పుస్తకం) – షేఖ్ సఫియుర్  రహ్మాన్ ముబారక్ ఫూరి [పుస్తకం]

సీరత్ పాఠాలు 7: ఉహుద్ యుద్ధం నుండి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరణం వరకు [వీడియో]

బిస్మిల్లాహ్

[19:44 నిముషాలు]

ఉహుద్ యుద్ధంనుండి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరణం వరకు

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

 ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [19:44 నిముషాలు]

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం] నుండి :

ఉహద్ యుద్ధం

బద్ర్ యుద్ధం తర్వాత ఒక సంవత్సరానికి, మస్లిముల మరియు అవిశ్వాసుల మధ్య ఈ యుద్ధం జరిగింది. బద్ర్ యుద్ధంలో ఓటమికి పాలైన అవిశ్వాసులు, ముస్లిములతో ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నారు. అందుకే ఈ సారి 3000 సైనికులతో బయలుదేరారు. వారితో పోరాడడానికి ముస్లిముల వైపు నుండి 700 మంది పాల్గొన్నారు. ప్రారంభ దశలో ముస్లిములే గెలుపొందారు. అవిశ్వాసులు మక్కా దారి పట్టారు. కాని వెంటనే మళ్ళీ తిరిగి వచ్చారు. కొండ వెనుక వైపు నుండి వచ్చి, ముస్లిములపై విరుచుకు పడ్డారు. ఇలా ఎందుకు జరిగిందంటే: అదే కొండపై ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొందరు విలుకాండ్రులను నియమించారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఆ స్థానాన్ని వదలకూడదని వారికి నొక్కి చెప్పారు. కాని వారు ముస్లిములు గెలుపొందినది, ముష్రికులు పారిపోవునది చూసి (యుద్ధం ముగిసిందన్న భ్రమలో పడి) విజయప్రాప్తి కోసం పరుగెత్తుకొచ్చారు. అందువల్ల ఆ స్థలం ఖాలీ అయిపోయింది. ఖురైషులకు మంచి అవకాశం లభించింది. కొండ వెనక నుండి తిరిగి దాని శిఖరంపై వచ్చి అక్కడి నుండి ముస్లిములపై దాడి చేశారు. అందుకే ఈ సారి ముష్రికులు గెలుపొందారు. ఈ యుద్ధంలో 70 మంది ముస్లిములు అమరవీరులయ్యారు. వారిలో ఒకరు: హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హు). ముష్రికుల వైపు నుండి 22 మంది చంపబడ్డారు.

ఖందక యుద్ధం

ఉహద్ యుద్ధం తర్వాత కొద్ది రోజులకు మదీన యూదులు మక్కా వెళ్ళి ఖురైషుల్ని కలుసుకొని మీరు గనక మదీనా పై దాడి చేసి, ముస్లిములతో యుద్ధం చేస్తే ఈ సారి మేము (లోపల నుండి) మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వాగ్దానం చేశారు. ఖురైషులు సంతోషంతో దీన్ని ఒప్పుకున్నారు. ఖురైషులు ఒప్పుకున్నాక ఇతర తెగవాళ్ళను కూడా పురికొలిపారు. వారు కూడా ఒప్పుకున్నారు. అరబ్బు దేశమంతటి నుండి యూదులు, ముష్రికులందరూ ఏకమై భారీ ఎత్తున మదీనా పై దండ యాత్రకు బయలుదేరారు. సుమారు పది వేల మంది సైనికులు మదీనా చుట్టు ప్రక్కన పోగు అయ్యారు.

శత్రువుల కదలిక గురించి ప్రవక్తకు వార్తలు అందుతున్నాయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహాబాలతో సలహా కోరారు. అప్పుడు ఈరాన్ దేశస్తుడైన సల్మాన్ ఫార్సీ (రదియల్లాహు అన్హు) ఖందకం త్రవ్వాలని సలహా ఇచ్చారు. మన రెండు వైపులా ఖర్జూరపు తోటలు, ఒక వైపు కొండ ఉండగా మరో వైపు ఏమీ అడ్డుగా లేనందు వల్ల అదే వైపు ఖందకం త్రవ్వడం ప్రారంభించారు. ముస్లిములందరూ ఇందులో పాల్గొని అతి తొందరగా దాన్ని పూర్తి చేశారు. ముష్రికులు ఖందకానికి ఆవల ఒక నెల వరకు ఉండిపోయారు. మదీనలో చొరబడటానికి ఏ సందు దొరకలేదు. ఆ కందకాన్ని దాటలేక పోయారు. అల్లాహ్ అవిశ్వాసులపై ఒకసారి తీవ్రమైన గాలి దుమారాన్ని పంపాడు. దాని వల్ల వారి గుడారాలు ఎగిరిపోయాయి. వారిలో అల్లకల్లోలం చెలరేగి భయం జనించింది. క్షణం పాటు ఆగకుండా పారిపోవడంలోనే క్షేమం ఉంది అనుకొని పరిగెత్తారు. ఈ విధంగా అల్లాహ్ ఒక్కడే దాడి చేయుటకు వచ్చిన సైన్యాలను పరాజయానికి గురి చేసి, ముస్లిములకు సహాయ పడ్డాడు.

ముష్రికుల సైన్యాలు దారి పట్టిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఈ సంవత్సరం తర్వాత ఖురైష్ మీపై దాడి చేయరు. కాని మీరు వారి మీద దాడి చేస్తారు“. వాస్తవంగా ప్రవక్త చెప్పినట్లు ఖురైషు వైపు నుండి ఇదే చివరి దాడి అయ్యింది. (ఆ తర్వాత వారు ఎప్పుడు ముస్లింపై దాడి చేయుటకు సాహసించలేదు).

కందకం త్రవ్వే సందర్భంలో ముస్లిములు ఘోరమైన ఆకలికి గురి అయ్యారు. ఆకలి భరించలేక కడుపుపై రాళ్ళు కట్టుకోవలసి వచ్చింది. అప్పుడు జాబిన్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కనీసం ప్రాణం కాపాడేంత పరిమాణంలోనైనా ప్రవక్తకు ఏదైనా తినిపించాలని కోరుకొని తన వద్ద ఉన్న ఓ చిన్న మేక పిల్లను కోశాడు. మాంసం తయారు చేసి భార్యకు ఇస్తూ దీని కూర వండి, అతితక్కవగా ఉన్న బార్లీ గింజల పిండితో రొట్టెలు చేసి పెట్టమని చెప్పాడు. వంట తయ్యారు అయ్యాక ప్రవక్త వద్దకు వెళ్ళి ‘మీకు మరో ఒక్కరికి లేదా ఇద్దరికి మాత్రమే సరిపడేంత భోజనం ఉంది’ అని తెలియజేశాడు. అప్పుడు ప్రవక్త “ఎక్కువగా ఉంది, మంచిగా ఉంది” అని కందకంలో పాల్గొన్న వారందరినీ పిలిచారు. మరియు స్వయంగా మాంసం ముక్కలు మరియు రొట్టెలు వడ్డించారు. అందరూ కడుపు నిండా తిన్నారు. అయినా ఆ భోజనం ఎవరి చేయి పెట్టినట్లుగా మిగిలింది. అప్పుడు వారు సుమారు వెయ్యి మంది ఉండిరి. ఇది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహిమల్లో ఒకటి.

హుదైబియా ఒప్పందం

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ముస్లిములు మదీనకు వలస వచ్చినప్పటి నుండి, వారిని ఎన్నటికీ తిరిగి మక్కా రానివ్వకూడదని, మస్జిదె హరాం దర్శనం చేయనివ్వద్దని దృఢంగా ముష్రికులు నిశ్చయించుకున్నారు. కాని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయన సహచరులు మక్కాకు పయనం కావాలని హిజ్రి శకం ఆరవ ఏట ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిశ్చయించారు. వెళ్ళడానికి జిల్ ఖాద నెల నిర్ణయమయింది. అది గౌరవపదమైన నెల అని, అందరూ దాన్ని గౌరవిస్తారనీ, ఉమ్రా ఉద్దేశ్యంతో బయలుదేరారు. యుద్ధ ఆదేశం ఏ మాత్రం లేకుండినది. 1400 మంది సహాబాలు ఇహ్రామ్ దుస్తులు ధరించి, బలివ్వడానికి ఒంటెలు తమ వెంట తీసుకెళ్ళారు. వాస్తవానికి వీరు కాబా దర్శనానికి, దానిని గౌరవార్ధమే బయలుదేరారన్న నమ్మకం చూసేవారికి కలగలాని, ఖురైషువారు వీరిని మక్కాలో ప్రవేశం నుండి నిరోధించుటకు ఊహించనూ వద్దని ఆయుధాలు కూడా ధరించలేదు. కేవలం ప్రయాణికులు తమ ఖడ్గ ఒరలో ఉంచుకునే ఆయుధం తప్ప.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖస్వా పేరుగల తమ ఒంటపై పయనమయ్యారు. సహచరులు ఆయన వెనక ఉన్నారు. మదీనవాసుల మీఖాత్ జుల్ హులైఫా చేరుకున్నాక, అందరూ బిగ్గరగా తల్బియా చదువుతూ ఉమ్రా యొక్క ఇహ్రామ్ సంకల్పం చేశారు. వాస్తవానికి కాబా దర్శన హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంది. దాని దర్శనం మరియు ప్రదక్షిణం నుండి నిరోధించే హక్కు అప్పటి ఆచారం (దస్తూర్, ఖానూన్) ప్రకారం కూడా ఖురైషుకు ఏ మాత్రం లేదు. వారి శత్రువైనా సరే, అతడు కాబా గౌరవ ఉద్దేశ్యంతో వస్తే అతడ్ని ఆపవద్దు.

కాని ముస్లిములు మక్కా ఉద్దేశ్యంతో బయలుదేరారని విన్న వెంటనే ముష్రికులు యుద్ధానికి సిద్ధమయ్యారు. వారికి ఎంత కష్టతరమైన సరే ప్రవక్తను మక్కాలో రానివ్వకూడదని దృఢంగా నిర్ణయించుకున్నారు. వారి ఈ చేష్ట, వారు ముస్లిముల పట్ల శత్రుత్వంగా, దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నా రనడానికి మరియు వారికి లభించవలసిన హక్కుల నుండి వారిని దూరం చేస్తున్నారు అనడానికి గొప్ప నిదర్శనం.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బిడారం నడుస్తూ నడుస్తూ మక్కాకు సమీపములో చేరుకుంది. కాని ఖురైషువారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయన సహచరుల్ని మక్కాలో ప్రవేశించకుండా, కాబా ప్రదక్షిణం చేయకుండా నిరోధిస్తునే ఉన్నారు.

ప్రవక్తతో సంధి చేసుకొని ఏదో ఓ కొలికికి రావాలని రాయబార వ్యవహారాలు మొదలయ్యాయి. ఇరు పక్షాల్లో (అంటే ముస్లిముల మరియు మక్కాలోని ముష్రికుల మధ్య) అనేక రాయబార బృందాలు వస్తూ పోయాయి. ఈ మధ్యలో ఖురైష్ యువకుల్లో నలబై మంది హఠాత్తుగా ముస్లిములపై విరుచుకుపడి వారిలో కొందరిని చంపుదాము అని అనుకున్నారు. కాని ముస్లిములు వారిని పట్టుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం వద్దకు తీసుకువచ్చారు. అయితే ప్రవక్త వారితో ఏ ప్రతికార చర్యకు పాల్పడకుండా వారిని వారి దారిన వదిలేసి వారిని మన్నించారు.

ఆ తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు)ని రాయబారిగా ఖురైష్ నాయకుల వద్దకు పంపి, మేము యుద్దానికి కాదు వచ్చింది. కేవలం అల్లాహ్ గృహ దర్శనం, దాని గౌరవార్థం వచ్చాము అని తెలియజేశారు. ఉస్మాన్ మరియు ఖురైషుల మధ్య సంధి కుదరలేదు. అంతే గాకుండా వారు ఉస్మాన్ ని పోనివ్వకుండా తమ వద్దే నిర్బంధించారు. అందువల్ల ఉస్మాన్ హత్యకు గురయ్యాడు అన్న పుకారు పుట్టింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఈ విషయం తెలిసిన వెంటనే “ఉస్మాన్ హత్యకు ప్రతీకారం తీర్చుకోకుండా ఇక్కడి నుండి కదిలేది లేదు” అని స్పష్టం చేసి, దీనికై ఎవరు సిద్ధంగా ఉన్నారని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అందరితో శపథం తీసుకున్నారు. అప్పుడు తమ ఒక చేతిని ఉస్మాన్ చేతిగా పరిగణించి తమ రెండవ చేయిని దానిపై కొట్టి శపథం చేశారు. ఈ శపథం ” బైఅతుర్ రిజ్వాన్” అన్న పేరు పొందింది. ఓ చెట్టు క్రింద జరిగింది. ప్రవక్తగారు సహచరులతో చేసిన శపథం ఇలా ఉండింది: ఉస్మాన్ కు వాస్తవంగా ఏదైనా కీడు జరిగింది అని తెలిస్తే గనక మీలో ఏ ఒక్కరూ పారిపోకుండా ముష్రికులతో పోరాడనిదే ఈ స్థలాన్ని వదలేది లేదు. తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తెలిసిన వార్త ఏమిటంటే ఉస్మాన్ క్షేమంగానే ఉన్నారు. హత్య చేయబడలేదు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిములతో యుద్ధానికి సిద్ధమన్నట్లు శపథం చేశారని తెలిసిన వెంటనే సుహైల్ బిన్ అమ్ర్ ను దౌత్యవేత్తగా పంపారు. అతను ప్రవక్తతో కూర్చుండి; ముస్లిములు ఈ సారి తిరిగి వెళ్ళిపోవాలని మరియు వచ్చే సంవత్సరం ఎప్పుడైనా రావచ్చనే విషయంపై సంధి కుదిర్చే ప్రయత్నం చేశాడు. సంధి కుదిరింది. ప్రవక్త కూడా సంధి ఒప్పంద నిబంధనలను అంగీకరించారు. ఈ నిబంధనలు బాహ్యంగా ముష్రికుల పక్షంలో వారికి మాత్రమే అనుకూలమైనవిగా ఉండెను. అందుకే ముస్లిములు మండిపడ్డారు. వారి దృష్టిలో అవి అన్యాయం, దౌర్జన్యంతో కూడి ఉన్న నిబంధనలని. ముష్రికులకు అనుకూలమైనవిగా ఉన్నాయని అనిపించింది. కాని ప్రవక్త సంధి కుదరాలనే కోరేవారు. ఎందకుంటే ఇస్లాం ప్రశాంత వాతవరణంలో వ్యాపిస్తూ ఉంటే అనేక మంది ఇస్లాంలో ప్రవేశించవచ్చు అన్న విషయం ప్రవక్తకు తెలుసు. వాస్తవానికి జరిగింది కూడా ఇదే. ఈ యుద్ధవిరమణ కాలంలో ఇస్లాం విస్తృతంగా వ్యాపించింది.

అంతే కాదు, వాస్తవానికి ముస్లిముల మరియు ఖురైష్ ల మధ్య జరిగిన ఈ యుద్ధవిరమణ సంధి ఇస్లాం మరియు ముస్లిముల పాలిట గొప్ప సహాయంగా నిలిచింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవజ్యోతితో చూస్తూ ఉన్నారని కుడా ఈ సంఘటన గొప్ప నిదర్శనంగా నిలిచింది. ఎలా అనగ నిబంధనలన్నిటీ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అంగీకరిస్తూ పోయారు. అదే సందర్భంలో కొందరి సహచరులకు అవి బాహ్యంగా ముష్రికులకు అనుకూలంగా కనబడినవి.

మక్కా విజయం

హిజ్రి శకం ఎనిమిదవ ఏట (ముష్రిక్కులు తాము చేసిన వాగ్దానానికి వ్యెతిరేకం వహించినందుకు) మక్కాపై దాడి చేసి, జయించాలని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిర్ణయించారు. రమజాన్ 10వ తారీకున 10 వేల వీరులతో బయలుదేరారు. ఏలాంటి పోరాటం, రక్తపాతం లేకుండా మక్కాలో ప్రవేశించారు. ఈ ప్రవేశం చారిత్రకమైనది. చెప్పుకోదగ్గది. ఖురైషులు తమ ఇష్టానుసారం లొంగిపోయారు. అల్లాహ్ ముస్లిములకు సహాయపడ్డాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మస్జిదె హరాం వెళ్ళి కాబా యొక్క తవాఫ్ చేసి, కాబా లోపల, వెలుపల, పైన ఉన్న విగ్రహాలన్నిటిని తొలగించి దాని లోపల రెండు రకాతుల నమాజు చేశారు. తర్వాత కాబా గడపపై వచ్చి నిలుచున్నారు. ఖురైషులు గడప ముందు నిలబడి, ప్రవక్త వారి గురించి ఏ తీర్పు ఇస్తారు అని వేచిస్తున్నారు. ప్రవక్త గంభీర స్వరంతో “ఓ ఖురైషులారా! నేను మీ పట్ల ఎలా ప్రవర్తిస్తానని భావిస్తున్నారు” అని అడిగారు. వారందరూ ఏక శబ్దమై “మేలు చేస్తారనే భావిస్తున్నాము. ఎందుకంటే మీరు మంచి సోదరులు, మంచి సోదరుని సుపుత్రులు” అని సమాధానమిచ్చారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “పోండి, మీరందరికి స్వేచ్ఛ ప్రసాదించబడుతుంది” అని ప్రకటించారు. ఈ విధంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన్ను, తన సహచరుల్ని బాధించి, నానా రకాలుగా హింసించి, స్వదేశం నుండి తరిమిన శత్రువుల్ని ఈ రోజు క్షమిస్తూ, మన్నిస్తూ ఒక గొప్ప ఉదాహరణ / ఆదర్శం నిలిపారు.

బృందాల రాక, రాజులకు ఇస్లాం సందేశం

మక్కా విజయం తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రస్తావన మరియు ఇస్లాం ధర్మ ప్రచారం నలువైపులా వ్యాపించింది. ఇక సుదూర
ప్రాంతాల నుండి బృందాలు వచ్చి ఇస్లాం స్వీకరించ సాగాయి.

అలాగే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చుట్టుప్రక్క దేశాల రాజులకు ఇస్లాం పిలుపునిస్తూ, ఉత్తరాలు వ్రాయించి పంపారు. వారిలో కొందరు ఇస్లాం స్వీకరించారు. మరి కొందరు ఇస్లాం స్వీకరించలేదు కాని ఉత్తమరీతి లో ఉత్తరాన్ని తీసుకొని మంచి విధంగా సమాధానమిచ్చారు. కాని ఈరాన్ రాజైన ఖుస్రో (Khosrau) ప్రవక్త పత్రాన్ని చూసి కోపానికి గురై దాన్ని చింపేశాడు. ప్రవక్తకు ఈ విషయం తెలిసింది. పిమ్మట ఆయన ఇలా శపించారు: “అల్లాహ్! అతని రాజ్యాన్ని కూడా నీవు చించేసెయి“. ఈ శాపనానికి ఏమంత ఎక్కువ సమయం గడువక ముందే అతని కొడుకు స్వయంగా తండ్రిని చంపేసి, రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు.

మిస్ర్ (Egypt) రాజు ముఖోఖిస్ ఇస్లాం స్వీకరించలేదు. కాని ప్రవక్త రాయబారితో ఉత్తమ రీతిలో ప్రవర్తించి, అతనితో ప్రవక్త కొరకు కానుకలు పంపాడు. అలాగే రోమన్ రాజు కూడా ప్రవక్త రాయబారికి మంచి ఆతిథ్యం ఇచ్చి మంచి విధంగా ప్రవర్తించాడు.

బహైన్ రాజు ముంజిర్ బిన్ సావీ ప్రవక్త పత్రాన్ని ప్రజలందరికీ వినిపించాడు. వారిలో కొందరు విశ్వసించారు మరి కొందరు తిరస్కరించారు.

హిజ్రి శకం 10వ ఏట ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్ చేశారు. ఆయన చేసిన ఏకైక హజ్ ఇదే. ఆయనతో పాటు లక్షకు పైగా సహచరులు హజ్ చేశారు. ఆయన హజ్ పూర్తి చేసుకొని మదీన తిరిగి వచ్చారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణం

హజ్ నుండి వచ్చాక సుమారు రెండున్నర మాసాలకు ప్రవక్తకు అస్వస్థత అలుముకొన్నది. దిన దినానికి అది పెరగ సాగింది. నమాజు కూడ చేయించడం కష్టమయిపోయింది. అప్పుడు అబూబక్ర్ ను నమాజు చేయించాలని ఆదేశించారు.

హిజ్రి పదకొండవ శకం, నెల రబీఉల్ అవ్వల్, 12వ తారీకు సోమవారం రోజున ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమోన్నతుడైన అల్లాహ్ వద్దకు చేరుకున్నారు. మొత్తం 63 సంవత్సరాలు జీవించారు. ప్రవక్త మరణ వార్త సహచరులకు అందగా వారికి సృహ తప్పినట్లయింది. నమ్మశక్యం కాక పోయింది. అప్పుడు అబూ బక్ర సిద్దీఖ్ రజియల్లాహు అను నిలబడి ప్రసం గించారు: వారిని శాంతపరుస్తూ, ప్రశాంత స్థితి నెలకొల్పుతూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అందరి లాంటి ఒక మానవుడే, అందిరికి వచ్చి నటువంటి చావు ఆయనకు వచ్చింది అని స్పష్టపరిచారు. అప్పుడు సహచరులు తేరుకొని, శాంత పడ్డారు. ఆ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)కు స్నానం చేయించి, కఫన్ దుస్తులు ధరియింపజేసి, ఆయిషా (రజియల్లాహు అన్హా) గదిలో ఖననం చేశారు.

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవక్త పదవికి ముందు 40 సం. ఆ తర్వాత 13 సం. మక్కాలో, 10 సం. మదీనలో గడిపారు.

సీరత్ ముందు పాఠాలు :

ఇతరములు: 

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad/

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం]
https://teluguislam.net/2011/03/25/muhammad-the-final-prophet/
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ 

మహా ప్రవక్త జీవిత చరిత్ర పాఠాలు [15 వీడియోలు]
https://teluguislam.net/2020/01/02/prophet-muhammad-seerah/
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
మొత్తం వీడియోల వ్యవధి: దాదాపు 70 నిముషాలు

“ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అంటే అర్ధం ఏమిటి? [వీడియో]
https://teluguislam.net/2019/08/05/the-meaning-of-muhammad-rasolullaah/
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్

‘దరూదే ఇబ్రహీం’ యొక్క అర్థము ద్వారా మనకు ఏమి తెలుస్తుంది?[ఆడియో]

బిస్మిల్లాహ్

[6 నిముషాలు]
తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 23[ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

సహీ బుఖారీ 3370, సహీ ముస్లిం 406లో ఉంది:

عَبْدُ الرَّحْمَنِ بْنَ أَبِي لَيْلَى قَالَ: لَقِيَنِي كَعْبُ بْنُ عُجْرَةَ، فَقَالَ: أَلاَ أُهْدِي لَكَ هَدِيَّةً سَمِعْتُهَا مِنَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ؟ فَقُلْتُ: بَلَى، فَأَهْدِهَا لِي، فَقَالَ: سَأَلْنَا رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقُلْنَا: يَا رَسُولَ اللَّهِ، كَيْفَ الصَّلاَةُ عَلَيْكُمْ أَهْلَ البَيْتِ، فَإِنَّ اللَّهَ قَدْ عَلَّمَنَا كَيْفَ نُسَلِّمُ عَلَيْكُمْ؟ قَالَ: ” قُولُوا: اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ، كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ، وَعَلَى آلِ إِبْرَاهِيمَ، إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ، اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ، كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ، وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ “

’అబ్దుర్రహ్మాన్ బిన్ అబీ లైలా ఉల్లేఖించారు: క’అబ్ బిన్ ’ఉజ్ర (రజియల్లాహు అన్హు) నన్ను కలిశారు. ‘ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా విషయం మీకు తెలియపరచనా!’ అని అన్నారు. దానికి నేను తప్ప కుండా వినిపించండి,’ అని అన్నాను. అప్పుడతను, ‘మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను, ఓ ప్రవక్తా! తమరిపై, తమ ఇంటి వారిపై ఎలా దరూద్ పంపాలి. ఎందుకంటే అల్లాహ్ సలామ్ పంపించే పద్ధతి మాకు నేర్పాడు,’ అని విన్నవించుకున్నాం. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పంపాలి అని అన్నారు:

అల్లాహుమ్మ ‘సల్లి ‘అలా ము’హమ్మదిన్ వ ‘అలా ‘ఆలి ము’హమ్మదిన్ కమా ‘సల్లైత ‘అలా ఇబ్రాహీమ వ’అలా ‘ఆలి ఇబ్రాహీమ ఇన్నక ‘హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ ‘అలా ము’హమ్మదిన్ వ’అలా ‘ఆలి ముహమ్మదిన్ కమా బారక్త ‘అలా ఇబ్రాహీమ వ’అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక ‘హమీదుమ్మజీద్.”

‘ఓ మా ప్రభూ! ము’హమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ము’హమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబంపై కారుణ్యాన్ని అవతరింప జేయి. ఇబ్రాహీమ్ అలైహిస్సలాం పై మరియు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం కుటుంబంపై కారుణ్యాన్ని అవతరింపజేసినట్టు. నిస్సందేహంగా నీవే ప్రశంసించదగ్గ గొప్పవాడవు. ఓ మా ప్రభూ! ము’హమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ము’హమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబంపై శుభాన్ని అవతరింప జేయి. ఇబ్రాహీమ్ అలైహిస్సలాం పై మరియు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం కుటుంబంపై శుభాన్ని అవతరింప జేసినట్టు. నిస్సందేహంగా నీవే ప్రశం సించదగ్గ గొప్ప వాడవు.’

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం)
https://teluguislam.net/muhammad/

దైవప్రవక్త (ﷺ) వారు అల్లాహ్ ను చూసారా? [ఆడియో & టెక్స్ట్]

దైవప్రవక్త (ﷺ) వారు అల్లాహ్ ను చూసారా?
https://www.youtube.com/watch?v=085GXx38_nE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూశారా? అనే ప్రశ్నకు ఈ ప్రసంగం సమాధానమిస్తుంది. ప్రవక్త అల్లాహ్‌ను చూడలేదని స్పష్టంగా చెప్పబడింది. ఈ వాదనను బలపరచడానికి, సహీహ్ ముస్లిం మరియు సహీహ్ బుఖారీ నుండి రెండు హదీసులు ఉదహరించబడ్డాయి. మొదటి హదీసులో, అబూ దర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్తను నేరుగా అడిగినప్పుడు, “అతను కాంతి (నూర్), నేను ఎలా చూడగలను?” అని ప్రవక్త సమాధానమిచ్చారు. రెండవ హదీసులో, మస్రూక్ ఇదే ప్రశ్నను ఆయిషా (రదియల్లాహు అన్హా)ను అడిగినప్పుడు, ప్రవక్త అల్లాహ్‌ను చూశారని చెప్పేవారు అబద్ధం చెప్పినట్లేనని ఆమె తీవ్రంగా స్పందించి, ఖురాన్ ఆయత్‌ను ఉదహరించారు. అయితే, ప్రళయ దినాన స్వర్గంలో విశ్వాసులందరూ అల్లాహ్‌ను చూస్తారని కూడా వివరించబడింది.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను చూశారా? సరైన సమాధానం చూడలేదు. అవును, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను చూడలేదు.కొందరు అనుకుంటారు మేరాజ్ పోయినప్పుడు చూశారు కదా అని. కానీ, ఇది సరైన మాట కాదు.

సహీహ్ ముస్లిం షరీఫ్ లో హదీస్ నెంబర్ 178, అబూ దర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు.

سَأَلْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، هَلْ رَأَيْتَ رَبَّكَ؟ قَالَ: نُورٌ أَنَّى أَرَاهُ
(స’అల్తు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, హల్ ర’అయిత రబ్బక్? ఖాల్: నూరున్ అన్నా అరాహు)

“నేను స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించాను. ‘ప్రవక్తా, మీరు మీ ప్రభువును చూశారా?’ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ‘అతను సర్వమూ నూర్ (కాంతి). నేను ఎలా చూడగలుగుతాను?'”

అతను సర్వమూ నూర్, కాంతి, ప్రకాశం. నేను ఎలా చూడగలుగుతాను? అబూ దర్ రదియల్లాహు అన్హు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగితే ప్రవక్త ఇలా సమాధానం ఇచ్చారు.

అయితే మరొక హదీస్ చూడండి సహీహ్ బుఖారీలో వచ్చింది. హదీస్ నెంబర్ 4855. ఇంతకుముందు దీనిలోని ఒక భాగం మనం విని ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ టాపిక్‌కు సంబంధించిన విషయం వినండి.

మస్రూక్ రహిమహుల్లాహ్, ఆయిషా రదియల్లాహు అన్హాతో ప్రశ్నించారు, “ఓ మాతృమూర్తి!,

هَلْ رَأَى مُحَمَّدٌ صلى الله عليه وسلم رَبَّهُ
(హల్ ర’ఆ ముహమ్మదున్ సల్లల్లాహు అలైహి వసల్లం రబ్బహు)
‘ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుని చూశారా?'”

فَقَالَتْ لَقَدْ قَفَّ شَعْرِي مِمَّا قُلْتَ
(ఫఖాలత్ లఖద్ ఖఫ్ఫ ష’రీ మిమ్మా ఖుల్త్)
వినండి, ఆయిషా రదియల్లాహు అన్హా ఏమంటున్నారు, మస్రూక్ అంటున్నారు, ఫఖాలత్ (ఆయిషా రదియల్లాహు అన్హా చెప్పారు),

“నీవు చెప్పిన ఈ మాటతో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.ఈ మూడు మాటల నుండి, విషయాల నుండి నువ్వు ఎక్కడున్నావు? తెలియకుండా ఇంకా ఎందుకున్నావు? ఎవరైతే నీతో చెబుతాడో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుని చూశారని, فَقَدْ كَذَبَ (ఫఖద్ కదబ్) “అతడు అబద్ధం పలికాడు.” అసత్యం మాట్లాడాడు.

మళ్ళీ ఆయిషా రదియల్లాహు తా’ఆలా అన్హా ఈ ఆయత్ ను పఠించారు:

لَا تُدْرِكُهُ الْأَبْصَارُ وَهُوَ يُدْرِكُ الْأَبْصَارَ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ
(లా తుద్రికుహుల్ అబ్సారు వహువ యుద్రికుల్ అబ్సార వహువల్లతీఫుల్ ఖబీర్)

“ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మ దృష్టి కలవాడు, సర్వమూ తెలిసినవాడు.”

ఈ విధంగా ఈ రెండు హదీసులు మరియు ఖురాన్ ఆయత్ ద్వారా మనకు తెలిసిన బోధ ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్‌కు వెళ్ళినప్పుడు గానీ, ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలం గానీ, ఎప్పుడూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూడలేదు.

అయితే ప్రళయ దినాన స్వర్గంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అల్లాహ్‌ను చూస్తారు మరియు ఇన్ షా అల్లాహ్ విశ్వాసులందరూ కూడా తప్పకుండా చూస్తారు.

وُجُوهٌ يَوْمَئِذٍ نَاضِرَةٌ * إِلَى رَبِّهَا نَاظِرَةٌ
(వుజూహున్ యవ్‌మఇదిన్ నాదిరహ్, ఇలా రబ్బిహా నాదిరహ్)
“ఆ రోజు కొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి. తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటాయి.”

ఇంకా వేరే ఎన్నో ఆయతులు, హదీసులు కూడా దీనికి దలీలుగా ఉన్నాయి.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ : https://teluguislam.net/?p=11473

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క మస్జిదు సందర్శనం – షేఖ్ బిన్ బాజ్

ఈ వ్యాసం క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

హజ్, ఉమ్రహ్ & జియారహ్ – ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో
షేఖ్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్).
అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్, పునర్విమర్శ : షేక్ నజీర్ అహ్మద్

ఏడవ అధ్యాయం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిదు సందర్శనం

హజ్ ప్రారంభం గాక ముందు లేదా హజ్ పూర్తయిన తర్వాత, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క మస్జిదును సందర్శించడం సున్నతు. బుఖారీ మరియు ముస్లిం హదీథు గ్రంథాలలో నమోదు చేయబడిన అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:

صَلاَةٌ فـِي مَسْجِـدِي هَذَا خَيْـرٌ مِنْ أَلـْفِ صَلاَةٍ فِـيْمـاَ سِـوَاهُ إِلاَّ الـْمَسْجِـدَ الْـحَرَامَ

సలాతున్ ఫీ మస్జిదీ హదా ఖైరున్ మిన్ అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు ఇల్లల్ మస్జిదల్ హరామ

మస్జిదె హరమ్ (కాబా) లో తప్ప, ఇతర మస్జిదులలో చేసే ఒక నమాజు కంటే నా మస్జిదులో చేసే ఒక నమాజు వెయ్యి రెట్లు ఉత్తమమైనది.

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించిన హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:

صَلاَةٌ فِـي مَسْجِدِي هَذَا أَفْضَلُ مِنْ أَلْفِ صَلاَةٍ فِـيْمـاَ سِوَاهُ إِلاَّ الْـمَسْجِدَ الْـحَرَامَ

సలాతున్ ఫీ మస్జిదీ హదా అఫ్జలు  మిన్ అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు ఇల్లల్ మస్జిదిల్ హరామ  

నా ఈ మస్జిదులో నమాజు చేయడమనేది, మస్జిదె హరమ్ లో తప్ప, ఇతర మస్జిదులలో నమాజు చేయడం కంటే వెయ్యి రెట్లు ఉత్తమమైనది. (ముస్లిం హదీథు గ్రంథం)

అబ్దుల్లాహు బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించిన హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:

صَلاَةٌ فِـي مَسْجِـدِي هَذَا أَفْـضَلُ مِنْ أَلْـفِ صَلاَةٍ فِـيْمـاَ سِوَاهُ إِلاَّ الْـمَسْجِـدِ الْـحَـرَامَ، وَصَلاَةٌ فِـي الْـمَسْجِـدِ الْـحَـرَامِ أَفْـضَلُ مِنْ مِائَـةٍ صَلاَةٍ فِـي مَسْجِـدِي هَـذَا

సలాతున్ ఫీ మస్జిదీ హదా అఫ్జలు మిన్ అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు ఇల్లల్ మస్జిదిల్ హరామ వ సలాతున్ ఫిల్ మస్జిదిల్ హరామి అఫ్జలు మిన్ మిఅతిన్ సలాతిన్ ఫీ మస్జిదీహదా

నా మస్జిదులో నమాజు చేయడమనేది, మస్జిదె హరమ్ లో తప్ప ఇతర మస్జిదులలో చేసే నమాజు కంటే వెయ్యి రెట్లు ఉత్తమమైనది. మరియు మస్జిదె హరమ్ చేసే నమాజు నా మస్జిదులో చేసే నమాజు కంటే వంద రెట్లు ఉత్తమమైనది.

జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:

صَلاَةٌ فِـي مَسْجِدِي هَذَا أَفْضَلُ مِنْ أَلْفِ صَلاَةٍ فِـيْمـاَ سِوَاهُ إِلاَّ الْـمَسْجِدَ الْـحَرَامَ، وَصَلاَةٌ فِـي الْـمَسْجِدِ الْـحَرَامِ أَفْضَلُ مِنْ مِائَةِ أَلْفِ صَلاَةٍ فِـيْمـاَ سِوَاهُ

సలాతున్ ఫీ మస్జిదీ హదా అఫ్జలు మిన్ అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు ఇల్లల్ మస్జిదల్ హరామ వ సలాతున్ ఫిల్ మస్జిదిల్ హరామి అఫ్జలు మిన్ మిఅతి అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు 

నా మస్జిదులో నమాజు చేయడమనేది, మస్జిదె హరమ్ లో తప్ప ఇతర మస్జిదులలో చేసే నమాజు కంటే వెయ్యి రెట్లు ఉత్తమమైనది. మరియు మస్జిదె హరమ్ చేసే నమాజు ఇతర మస్జిదులలో చేసే నమాజు కంటే లక్ష రెట్లు ఉత్తమమైనది. (అహ్మద్ &ఇబ్నె మాజహ్)

దీని గురించి అనేక హదీథులు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదును సందర్శించే యాత్రికులు ముందుగా తమ కుడికాలు మస్జిదుల లోపల పెట్టి, ఈ దుఆ చేసుకుంటూ మస్జిదులోనికి ప్రవేశించాలి:

بِسْمِ اللهِ وَالصَّلاَةُ وَالسَّلاَمُ عَلَى رَسُولِ اللهِ، أَعُوْذُ بِاللهِ الْعَظِيْمِ وَبِوَجْهِهِ الْكَرِيْمِ وَسُلْطَانِهِ الْقَدِيْمِ مِنْ الشَّيْطاَنِ الرَّجِيْمِ، اَللَّهُمَّ افْتَحْ لـِي أَبْوَابَ رَحْمَتِكَ

బిస్మిల్లాహి, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి, అఊదు బిల్లాహిల్ అజీమి వబి వజ్హిహిల్ కరీమి, వ సుల్తానిహిల్ ఖదీమి, మినష్షయితా నిర్రజీమి, అల్లాహుమ్మఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక.

అల్లాహ్ పేరుతో, అల్లాహ్ యొక్క ప్రవక్త పై శాంతి మరియు దీవెనలు కురుయుగాక. నన్ను షైతాను బారి నుండి కాపాడమని, అత్యంత పవిత్రమైన ముఖం, అత్యంత పురాతనమైన పరిపాలన మరియు అధికారం కలిగి ఉన్న అల్లాహ్ యొక్క శరణు కోరుకుంటున్నాను. ఓ అల్లాహ్! నీ కరుణాకటాక్షాల ద్వారాలు నా కొరకు తెరుచు.

ఇతర మస్జిదులలో ప్రవేశించేటపుడు దుఆ చేసే విధంగానే ఇక్కడ కూడా దుఆ చేయాలి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహ అలైహి వసల్లం) మస్జిదులో ప్రవేశించేటపుడు చేయవలసిన ప్రత్యేక దుఆ ఏమీ లేదు.

మస్జిదులో ప్రవేశించిన తర్వాత, రెండు రకాతుల తహయ్యతుల్ మస్జిదు నమాజు చేయాలి. ఇహపరలోకాలలో మేలైన విషయాలు ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకోవలెను. ఒకవేళ ఈ రెండు రకాతుల నమాజును మస్జిదులోని రౌధతుల్ జన్నహ్ (స్వర్గవనం) అనే ప్రాంతంలో చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ఇలా తెలిపారు:

مَا بَـيـْنَ بَـيـْتِـي وَمِـنْـبَـرِي رَوْضَـةٌ مِـنْ رِيَـاضِ الْـجَـنَّـةِ
మా బైన బైతీ వ మిన్బరీ రౌదతున్ మిన్ రియాదిల్ జన్నతి
నా ఇంటికీ మరియు నా ప్రసంగ స్థానానికీ మధ్య స్వర్గంలోని ఒక ఉద్యానవనం ఉంది.

నమాజు చేసిన తర్వాత, ప్రవక్త (సల్లల్లాహు అలైహ వసల్లం) కు మరియు ఆయన యొక్క ఇద్దరు సహచరులు అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మరియు ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు)లకు సలాము చేయవలెను. గౌరవ పూర్వకంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి వైపు తిరిగి నిలబడి, తక్కువ స్వరంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఇలా అభివాదం చేయవలెను.        

أَلسَّلاَمُ عَلَيـْكَ يَا رَسُولُ اللهِ وَرَحْـمَـةُ اللهِ وَبَـرَكَاتَـهُ
అస్సలము అలైక యా రసూలుల్లాహ్, వ రహ్మతుల్లాహి వ బరకాతహు
ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! మీ పై శాంతి కురుయుగాక, మరియు అల్లాహ్ యొక్క దయాదాక్షిణ్యాలు  మరియు శుభాశీస్సులూను.

అబూ దావూద్ హదీథు గ్రంథంలో నమోదు చేయబడిన ఒక హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పలుకులను అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు:

مَا مِنْ أَحَدٍ يُسَلِّمُ عَلَـيَّ إِلاَّ رَدَّ اللهُ عَلَـَّي رُوْحِـي حَـتَّـى أَرُدَّ عَـلَيْـهِ السَّلاَمَ
మామిన్ అహదిన్ యుసల్లిము అలయ్య ఇల్లా రద్దల్లాహు అలయ్య రూహీ హత్త అరుద్ద అలైహి స్సలామ
ఎవరైనా నా పై సలాములు పంపినపుడు, అతని సలాముకు జవాబిచ్చేవరకు అల్లాహ్ నా ఆత్మను నా శరీరంలోనికి పంపుతాడు.

తన సలాములో ఎవరైనా క్రింది పదాలను పలికితే ఎలాంటి దోషమూ లేదు:

أَلسَّلاَمُ عَلَيْكَ يَا نَبِيَ الله، أَلسَّلاَمُ عَلَيْكَ يَا خِيْـرَةَ اللهِ مِنْ خَلْـقِـهِ، أَلسَّلاَمُ عَلَيـْكَ يَا سَيِّـدَ الْـمُرْسَلِيْـنْ وَإِمَامَ الْـمُتَّـقِيْنْ، أَشْهَدُ أَنَّـكَ قَدْ بَلَّغْتِ الرَّسَالَـةَ وَأَدَّيْتَ الْأَمَانَـةَ، وَنَـصَحَتَ الْأُمَّـةَ، وَجَاهَدْتَ فِي اللهِ حَقَّ جِهَادِهِ

అస్సలాము అలైక యా నబీయల్లాహ్, అస్సలాము అలైక యా ఖీరతల్లాహి మిన్ ఖల్ఖిహి , అస్సలాము అలైక యా సయ్యదల్ ముర్సలీన్ వ ఇమామల్ ముత్తఖీన్, అష్హదు అన్నక ఖద్ బలగతిర్రసాలత, వ అద్దయితల్ అమానత, వ నసహతల్ ఉమ్మత, వ జాహదత ఫీ అల్లాహి హఖ్ఖ జిహాదిహి.

మీ పై శాంతి కురుయుగాక, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! మీ పై శాంతి కురుయుగాక, ఓ అల్లాహ్ యొక్క సృష్టిలోని ఉత్తముడా! నీపై శాంతి కురుయుగాక, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తల మరియు సజ్జనుల  నాయకుడా! మీరు మీ సందేశాన్ని అందజేసారని, మీకు అప్పజెప్పబడిన బాధ్యతను పూర్తిగా నెరవేర్చారని, సమాజానికి మార్గదర్శకత్వం వహించారని, అల్లాహ్ మార్గంలో పూర్తిగా ప్రయాస పడినారని మరియు శ్రమించారని  నేను సాక్ష్యమిస్తున్నాను.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రవర్తనలో, నడతలో ఈ ఉత్తమ గుణగణాలన్నీ ఉండినాయి. ప్రతి ఒక్కరూ ఆయనపై దీవెనలు పంపటాన్ని, ఆయన కొరకు దుఆ చేయటాన్ని షరిఅహ్ పూర్తిగా సమర్ధించింది. అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఇలా ఉంది:

يَا أَ يُّـهَا الَّذِيـْنَ آمَـنـُوا صَلُّوا عَلَيْـهِ وَسَلِّـمُـوا تَـسْلِـيـمـًا
యా అయ్యుహలాదీన ఆమనూ సల్లూ అలైహి వసల్లిమూ తస్లీమన్
ఓ విశ్వాసులారా! ఆయనపై దీవెనలు పంపండి మరియు ఆయనపై ఇస్లామీయ పద్ధతిలో సలాములు పంపండి. 33:56

ఆ తర్వాత అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మరియు ఉమర్ (రదియల్లాహు అన్హు)లపై సలాములు పంపి, అక్కడి నుండి ముందుకు కదల వలెను.

 لَعَـنَ رَسُولُ اللهِ صَلَّى الله عَلَيْـهِ وَ سَلَّمَ زُوَّارَاتِ الْـقُـبُـوْرِ مِنَ النِّساَءِ، وَالْـمُـتَّـخِـذِيْـنَ عَلَيْـهاَ الْـمسَاجِدَ وَالسُّرُجَ

లఅన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వ సల్లమ జువ్వరాతిల్ ఖుబూరి మిన్నన్నిసాయి వల్ ముత్తఖిదీన అలైహాల్ మసాజిద  వస్సురుజ  

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధిని సందర్శించే అనుమతిని షరిఅహ్ పురుషులకు మాత్రమే ఇచ్చింది. సమాధుల సందర్శించే అనుమతి మహిళలకు ఇవ్వబడలేదు. అలా షరిఅహ్ కు వ్యతిరేకంగా తమ ఇష్టానుసారం సమాధులను సందర్శించే మహిళలను, సమాధులపై మస్జిదులు నిర్మించేవారిని మరియు అక్కడ దీపాలు వెలిగించేవారిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శపించి ఉన్నారు.

ఒకవేళ ఎవరైనా మస్జిదె నబవీ లోపల నమాజు చేయాలని, దుఆలు చేయాలనే సంకల్పంతో మదీనా సందర్శిస్తే, షరిఅహ్ సమర్ధించి ఉండటం వలన అలా చేయడం పూర్తిగా సరైనదే. పై హదీథులో కూడా మేము దీనిని గుర్తించాము. సందర్శకుడు ఐదు పూటలా మస్జిదె నబవీలోనే నమాజులు చేయవలెను మరియు వీలయినంత ఎక్కువగా అల్లాహ్ ను స్మరించవలెను, దుఆలు చేయవలెను మరియు నఫిల్ నమాజులు చేయవలెను. ఈ క్రింది హదీథును మేము ఇంతకు ముందు ఉదహరించి ఉన్నాము,

مَا بَـيـْنَ بَـيـْتِـي وَمِـنْـبَـرِي رَوْضَـةٌ مِـنْ رِيَـاضِ الْـجَـنَّـةِ

మా బైన బైతీ వ మిన్బరీ రౌదతున్ మిన్ రియాదిల్ జన్నతి

నా ఇంటికీ మరియు నా ప్రసంగ స్థానానికీ మధ్య స్వర్గంలోని ఒక ఉద్యానవనం ఉంది.

తప్పనిసరి ఐదు ఫర్ద్ చేసేటపుడు, మీరు వీలయినంత వరకు ముందు వరుసలో నిలబడటానికి ప్రయత్నించవలెను, ముందు పంక్తిని పొడిగింపులో మీకు చోటు దొరికినా దానిని వదలకూడదు. ముందు వరుసలో నమాజు చేయటం గురించి క్రింది ప్రామాణిక హదీథు సూచిస్తున్నది.

لَوْ يَعْلَمُ النَّاسَ مَا فِـي النِّدَاءِ وَالصَّفِّ الْأَوَّلِ ثُمَّ لَـمْ يَـجِدُوْا إِلاَّ أَنْ يَسْتَـهِمُـوْا عَلَيْهِ لاَسْتَهَمُوْا عَلَيْـهِ

లౌ యఅలమున్నాస మాఫీ న్నిదాయి వ సఫ్ఫిల్ అవ్వలి థుమ్మ లమ్ యజిదూ ఇల్లా అన్ యస్తహిమూ అలైహి అస్తహమూ అలైహి 

ఒకవేళ అదాన్ పిలుపునివ్వడంలో మరియు ముందు వరుసలో నిలబడి నమాజు చేయడంలో ఉన్న పుణ్యాల గురించి తెలిసి ఉండి, వారికి గనక వాటిలో స్థానం లభించకపోతే, వాటిని పొందుట కొరకు ప్రజలు లాటరీ వేయవలసి వచ్చినా, తప్పకుండా వారు లాటరీ వేస్తారు.

మరో హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు:

تَـقَـدِّمُـوْا فَأْتَـمُّـوا بـِي وَلْـيَـأْتَـمَّ بِكـُمْ مَنْ بَعْدَكُمْ، وَلاَ يَزَالُ الرَّجُلَ يَـتَـأَخَّـرُّ عَنِ الصَّلاَةِ حَتَّى يُـؤَخِّـرَهُ الله

తఖద్దిమూ ఫఅతమ్మూబీ వల్ యఅతమ్మ బికుమ్ మన్ బఅదకుమ్ వలా యజాలుర్రజుల యతఅఖ్ఖర్రు అనిస్సలాతి హత్త యుఅఖ్ఖిరహుల్లాహ్

ముందుకు కదలండి మరియు నన్ను అనుసరించండి. మరియు ఎవరైతే మీ వెనుక ఉన్నారో, వారు మిమ్ముల్ని అనుసరించాలి. అల్లాహ్ అతనిని వెనుక వదిలి వేయునంత వరకు ఆ వ్యక్తి నమాజును అందుకోవటంలో వెనుకబడి ఉంటాడు. ముస్లిం హదీథు గ్రంథం.

అబూ దావూద్ హదీథు గ్రంథంలో నమోదు చేయబడిన ఆయెషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:

لاَ يَزَالُ الرَّجُلُ يَتَأَخَّرْ عَنِ الصَّفِّ الْـمُقَدِّمِ حَتـَّى يُؤَخِّرَهُ اللهََ فِي النَّارِ

లా యజాలుర్రజులు యతఅఖ్ఖర్ అనిస్సఫ్ఫిల్ ముఖద్దమి హత్త యుఅఖ్ఖిరహుల్లాహ ఫిన్నారి 

అల్లాహ్ ఆ వ్యక్తిని నరకానికి  పంపే వరకు, (ఫర్ద్ నమాజులో) ముందు వరుస అందుకోవటంలో అతను వెనుకబడే ఉంటాడు.

ఒక ప్రామాణిక హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సహచరులకు ఇలా బోధించారు:

أَلاَ تَصُفُّوْنَ كَمـَا تَـصُفُّ الْـمَلَائِكَـةُ عِـنْدَ رَبِّـهَا قَالُوْا يَا رَسُولُ الله وَكَـيْفَ تَـصُفُّ الْـمَلاَئِكَـةُ عِـنْـدَ رَبِّـهاَ؟ قَالَ يُـتِـمُّوْنَ الصُّفُوْفَ الْأَوَّلَ وَيَـتَـرَاصُّوْنَ فِـي الصَّفِّ

అలా తసుఫ్ఫూన కమా తసుఫ్ఫుల్ మలాయికతు ఇంద  రబ్బిహా ఖాలూ యా రసూలుల్లాహ్ వ కైఫ తసుఫ్ఫుల్ మలాయికతు ఇంద రబ్బిహా ఖాల యుతిమ్మూనస్సుఫూఫల్ అవ్వల వ యతరస్సూన ఫీస్సఫ్ఫి

తమ ప్రభువు ఎదురుగా దైవదూతలు పంక్తులలో నిలబడినట్లు, మీరు ఎందుకని పంక్తులలో నిలబడరు. దైవదూతలు ఎలాంటి పంక్తులను ఏర్పరుచుకున్నారని సహచరులు ప్రశ్నించగా, ఆయనిలా జవాబిచ్చారు: వారు ముందుగా మొదటి పంక్తిని పూర్తి చేసారు మరియు పంక్తులలో వారు ఒకరిని ఆనుకొని మరొకరు నిలబడినారు.  (ముస్లిం హదీథు గ్రంథం).

మస్జిదె నబవీ మరియు ఇతర మస్జిదులకు వెళ్ళడం గురించి మామూలుగా అనేక హదీథులు ఉన్నాయి. కుడివైపు పంక్తిలో నిలబడిమని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతి ఒక్కరికీ చెప్పేవారు. అప్పటి మస్జిదె నబవీలోని కుడి వైపు పంక్తి, రౌధతుల్ జన్నహ్ ప్రాంతానికి బయట ఉండేదనే విషయం అందరికీ తెలిసినదే. కాబట్టి సామూహిక నమాజును ముందు వరుసలో, పంక్తి యొక్క కుడివైపున నిలబడి చేయటమనేది రౌధతుల్ జన్నహ్ ప్రాంతంలో నిలబడి నమాజు చేయడం కంటే ఉత్తమమైనదనే ఇక్కడ ముఖ్యంగా గ్రహించదగినది. ఎవరైనా ఇలాంటి ఇతర హదీథులను కూడా పరిశీలిస్తే, పై విషయాన్ని సులభంగా తెలుసుకుంటారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి యొక్క గ్రిల్ ను స్పర్శించడం లేదా ముద్దాడటం లేదా దాని చుట్టూ తవాఫ్ చేయడం లాంటివి అనుమతించబడలేదు. ఇలాంటి ఆచారం గురించి ముందు తరం సజ్జనులలో నుండి ఎవ్వరూ తెలుపలేదు. ఇలా చేయడమనేది ఒక హీనమైన కల్పితాచారం. తమ అవసరాలు పూర్తి చేయమని లేదా తమ కష్టాలు తొలగించమని లేదా తమ అనారోగ్యాన్ని నయం చేయమని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఎవరైనా వేడుకోవడమనేది ధర్మబద్ధం కాదు. అయితే వీటన్నింటి కోసం తప్పనిసరిగా వారు కేవలం అల్లాహ్ ను మాత్రమే వేడుకోవలసి ఉంది. మృతులను వేడుకోవడమనేది అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించడం మరియు ఇతరులను ఆరాధించడమే అవుతుంది. ఈ క్రింది రెండు ముఖ్య అంశాలపై ఇస్లాం ఆధారపడి ఉంది:

  1. అల్లాహ్ ఏకైకుడు, ఆయనకెవ్వరూ భాగస్వాములు లేరు మరియు ఆయనకెవ్వరూ సాటి లేరు. కేవలం ఆయన మాత్రమే ఆరాధింపబడాలి.
  2. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పద్ధతిని అనుసరించి ఆరాధనలు జరగాలి.

ఇస్లామీయ ధర్మం యొక్క క్రింది మూలవచనపు అసలు అర్థం ఇదే.

شَهَادَةً أَنْ لاَّ إِلَهَ إِلاَّ اللهِ وَأَنَّ مُـحَمَّداً رَسُوْلُ الله

షహాదతన్ అల్లా ఇలాహ ఇల్లల్లాహి  వ అన్న ముహమ్మదన్ రసూలుల్లాహ్

ఆరాధింపబడే వారెవ్వరూ లేరు – ఒక్క అల్లాహ్ తప్ప అని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్, అల్లాహ్ యొక్క సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను.

అలాగే, అల్లాహ్ వద్ద సిఫారసు చేయమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంనే నేరుగా వేడుకోవడమనేది ఇస్లాంలో అనుమతింపబడలేదు. ఎందుకంటే ప్రార్థింపబడే హక్కు కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందుతుంది. ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రకటన ఇలా ఉంది.

قُـلْ ِلِله الشَّـفَـاعَـةُ جَـمِـيـعًا
ఖుల్ లిల్లాహిష్షఫాఅతు  జమీఅన్
(ఓ ప్రవక్తా) చెప్పు, సిఫారసులన్నీ అల్లాహ్ కే చెందుతాయి. 39:44

అయితే, క్రింది విధంగా వేడుకోవచ్చు.

أَللَّهُمَّ شَفَّعِ فِـي نَـبِـيُّكَ، أَللَّهُمَّ شَفَّعِ فِـي مَلاَئِكَـتِـكَ وَعِبَادِكَ الْـمُؤمِـنِـيْـنَ، أَللَّهُمَّ شَفَّعِ فِـي أَفَرَاطِـي

అల్లాహుమ్మ షఫ్ఫఇ ఫీ నబియ్యుక, అల్లాహుమ్మ షఫ్ఫఇ ఫీ మలాయికతిక, వ ఇబాదతికల్ మోమినీన. అల్లాహుమ్మ షఫ్ఫఇ ఫీ అఫరాతీ.

ఓ అల్లాహ్! నీ ప్రవక్త నా కొరకు సిఫారసు చేసేలా చేయి. ఓ అల్లాహ్! నీ దైవదూతలు మరియు నిన్ను విశ్వసించినవారు నా కొరకు సిఫారసు చేసేలా చేయి. ఓ అల్లాహ్! చనిపోయిన నా సంతానం నా కొరకు సిఫారసు చేసేలా చేయి.

అయితే, మృతులను సిఫారసు చేయుట కొరకు లేదా వారినే నేరుగా వేడుకోకూడదు – వారు అల్లాహ్ యొక్క సందేశహరులైనా, ప్రవక్తలైనా లేదా పుణ్యపురుషులైన అవులియాలైనా సరే. ఇలా చేయటానికి షరిఅహ్ అనుమతి లేదు. మృతుని గురించిన వాస్తవం ఏమిటంటే, షరిఅహ్ లో మినహాయించబడిన ఆచరణులు తప్ప, అతని ఇతర ఆచరణలన్నీ సమాప్తమై పోతాయి. సహీహ్ ముస్లింలో నమోదు చేయబడిన అబూ హురైరహ్ రదియల్లాహు ఉల్లేఖన:

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికారు,

إِذَا مَاتَ ابْنَ آدَمَ أَنْقَطَعَ عَمَلَهُ إِلاَّ مِنْ ثَلاَثٍ: صَدْقَةٍ جَارِيَـةٍ، أَوْ عِلْمٍ يُـنـْتَـفَـعُ بِـهِ،  أَوْ وَلَـدٍ صَالِـحٍ يَـدْعُـوْ لَـهُ

ఇదా మాతబ్న ఆదమ అంఖతఅ అమలహు ఇల్లా మిన్ థలాతిన్  సదఖతిన్ జారియతిన్ అవ్ ఇల్మిన్ యుంతఫఉ బిహి అవ్ వలదిన్ సాలిహిన్ యద్ఊ లహు 

ఎపుడైతే ఆదం సంతానంలో ఎవరైనా చనిపోతారో, ఈ మూడు తప్ప అతని ఇతర ఆచరణలు సమాప్తమైపోతాయి: నిరంతరాయంగా కొనసాగుతున్న అతని దానం, ఇతరులకు ప్రయోజనం కలిగిస్తున్న అతని జ్ఞానం, దైవభీతిపరులైన సంతానం చేసే అతని కొరకు చేసే దుఆలు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత కాలంలో తన కొరకు అల్లాహ్ ను ప్రార్థించమని ఆయనను వేడుకోవడం అన్ని విధాలా సరైన మంచి పనే. అలాగే అంతిమ దినాన కూడా ఆయనను నేరుగా వేడుకోవడం సరైన పనే, ఎందుకంటే ఆనాడు సిఫారసు చేయడానికి ఆయనకు అనుమతి ఇవ్వబడుతుంది. ఆనాడు తనను సిఫారసు చేయమని అడిగిన వారి కొరకు ఆయన అల్లాహ్ ను ప్రార్థించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రపంచంలో మరణించిన తర్వాత ఆయనకు ఆ శక్తి లేదు. ఇది కేవలం ఆయన కొరకు మాత్రమే ప్రత్యేకం కాదు. మీతో పాటు సర్వసామాన్యంగా ప్రతి ఒక్కరికిది వర్తిస్తుంది. ప్రాణంతో ఉన్న తన తోటి సోదరులతో తన కొరకు అల్లాహ్ వద్ద సిఫారసు చేయమని అంటే అల్లాహ్ ను ప్రార్థించమని అడగటం ధర్మసమ్మతమైనదే. తీర్పుదినం నాడు ఎవ్వరూ అల్లాహ్ అనుమతి లేకుండా సిఫారసు చేయలేరు. దీని గురించి అల్లాహ్ యొక్క స్పష్టమైన ప్రకటన ఇలా ఉంది.        

مَـنْ ذَا الَّـذِي يَـشْـفَـعُ عِـنْـدَهُ إِلاَّ بِـإِذْنِـهِ
మందల్లదీ యష్ఫఉ ఇందహు ఇల్లా బిఇద్నిహి
ఆయన అనుమతి లేకుండా ఆయన వద్ద సిఫారసు చేయగలిగేది ఎవరు?

ఇక ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క స్థితి గురించి మనం ఒక వాస్తవాన్ని గుర్తించాలి. ఆయన యొక్క ప్రస్తుత స్థితి ఒక ప్రత్యేకమైన స్థితి. అది ఈ ప్రపంచంలో ఆయన సజీవంగా ఉన్నప్పటి స్థితికి మరియు అంతిమ దినం నాటి స్థితికి భిన్నమైనది. చనిపోయిన వ్యక్తి ఏ పనీ చేయలేడు. ఈ ప్రపంచంలో జీవించి ఉన్నపుడు అతను చేసిన పనులే అతనికి ప్రతిఫలాన్ని అందజేస్తాయి – షరిఅహ్ లో మినహాయించబడిన ప్రత్యేక పనులు తప్ప. మృతులను వేడుకోవడమనేది షరిఅహ్ మినహాయించిన పనులలో లేదు. కాబట్టి దానిని ఈ ప్రత్యేక తరగతికి చెందిన పనిగా పరిగణించలేము. నిస్సందేహంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన బరజఖ్ జీవితంలో సజీవంగా ఉన్నారు. ఆయన ఉన్న స్థితి ఒక షహీద్ యొక్క మరణానంతర స్థితి కంటే ఎంతో ఘనమైనది. అయితే ఇది చనిపోయే ముందు జీవించే ఈ ప్రాపంచిక జీవితం కంటే మరియు తీర్పుదినం తర్వాత రాబోయే జీవితం కంటే భిన్నమైనది. బరజఖ్ అంటే సమాధి జీవితం యొక్క స్వభావం అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ తెలియదు. దీని గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికారు,   

مَا مِنْ أَحَدٍ يُسَلِّمُ عَلَـيَّ إِلاَّ رَدَّ اللهُ عَلَـَّي رُوْحِـي حَـتَّـى أَرُدَّ عَـلَيْـهِ السَّلاَمَ

మా మిన్ అహదిన్ యుసల్లిమూ అలయ్య ఇల్లా రద్దల్లాహు అలయ్య రూహీ హత్త అరుద్దఅలైహిస్సల్లామ

ఎవరైనా నా పై సలాములు పంపినపుడు, అతని సలాముకు బదులిచ్చే వరకు అల్లాహ్ నా శరీరంలోనికి నా ఆత్మను పునః ప్రవేశింపజేస్తాడు.

పై హదీథు ఆధారంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చనిపోయారని, ఆయన ఆత్మ ఆయన శరీరం నుండి విడిగా ఉంటుంది మరియు సలాము చేయబడినపుడు మాత్రమే అది ఆయన శరీరంలోనికి ప్రవేశింపజేయబడుతుందనేది స్పష్టమవుతున్నది. ఆయన మరణం గురించి ఖుర్ఆన్ మరియు సున్నతులలో తెలుపబడిన వాదనలు అందరికీ తెలిసినవే. ఉలేమాల వద్ద ఇది ఎలాంటి అనుమానాలు లేని విషయం. అయితే ఆయన యొక్క బరజఖ్ జీవితానికి మరణమనేది ఆటంకం కాదు. షహీదుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఖుర్ఆన్ లో దీని గురించి ఇలా స్పష్టం చేయబడింది:

وَلا تَـحْسَـبَنَّ الَّـذِيـنَ قُـتِـلُوا فِي سَبِـيـلِ اللهِ أَمْـوَاتًا بَلْ أَحْيَاءٌ عِـنْـدَ رَبِّـهِمْ يُـرْزَقُـونَ

వలా తహ్సబన్నల్లదీన ఖుతిలూ ఫీ సబీలిల్లాహి అంవాతన్ బల్ అహ్యాఉన్ ఇంద రబ్బిహిం యుర్జఖూన

మరియు ఎవరైతే అల్లాహ్ మార్గంలో చంపబడినారో, వారిని ఎప్పుడూ మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు సజీవులే. వారికి తమ ప్రభువు వద్ద  ఆహారం ఇవ్వబడుతున్నది. 3:169

ఇది షిర్క్ (అల్లాహ్ కు సాటి కల్పించడం) వైపు పిలిచే వారు, అల్లాహ్ ను వదిలి మృతులను ఆరాధించేవారు తికమకపెట్టే ఒక ముఖ్యమైన విషయం కావటం వలన దీనిని మేము వివరంగా చర్చించినాము. షరిఅహ్ కు వ్యతిరేకమైన వాటన్నింటి నుండి అల్లాహ్ మనల్ని కాపాడుగాక.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి వద్ద తమ స్వరం పెంచే వారి చర్యలు మరియు చాలా ఎక్కువ సేపు వరకు అక్కడే నిలిచిపోయే వారి చర్యలు షరిఅహ్ కు విరుద్ధమైనవి. ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్ద ఆయన కంటే హెచ్చు స్వరంతో మాట్లాడవద్దని అల్లాహ్ ప్రజలకు ఆదేశించినాడు. అలాగే తమలో తాము మాట్లాడుకునే విధంగా ఆయనతో హెచ్చు స్వరంలో మాట్లాడకూడదని కూడా అల్లాహ్  ఆజ్ఞాపించినాడు. అంతేగాక, ఆయనతో ప్రజలు తక్కువ స్వరంలో మాట్లాడాలని ఆదేశించబడింది. ఖుర్ఆన్ లోని అల్లాహ్ ఆదేశం ఇలా ఉంది:   

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ أَنْ تَحْبَطَ أَعْمَالُكُمْ وَأَنْتُمْ لا تَشْعُرُونَ * إِنَّ الَّذِينَ يَغُضُّونَ أَصْوَاتَهُمْ عِنْدَ رَسُولِ اللَّهِ أُولَئِكَ الَّذِينَ امْتَحَنَ اللَّهُ قُلُوبَهُمْ لِلتَّقْوَى لَهُمْ مَغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ

యాఅయ్యుహల్లదీన్ ఆమనూ లా తర్ఫఊ అస్వాతకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి వలా తజ్ హరూ లహు బిల్ఖౌలి కజహ్రి బఅదికుమ్ లిబఅదిన్ అన్ తహ్బత అమాలుకుమ్ వ అంతుమ్ లా తష్ఉరూన  ఇన్నల్లదీన యగుద్దూన అస్వాతహుమ్ ఇంద రసూలిల్లాహి ఉలాయికల్లదీన అంతహనల్లాహ ఖులూబహుమ్ లిత్తఖ్వా లహుమ్మగ్ఫిరతున్ వ అజ్రున్ అజీమున్

ఓ విశ్వసించిన ప్రజలారా! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వరం కంటే ఎక్కువగా మీ స్వరాన్ని పెంచి గానీ, మీలో మీరు బిగ్గరగా మాట్లాడుకునేటట్లుగా ఆయనతో బిగ్గరగా గానీ మాట్లాడవద్దు. అలా చేస్తే మీరు గ్రహించకుండానే, మీ ఆచరణలకు ప్రతిఫలం ఏమీ లేకుండా పోతుంది. నిశ్చయంగా, అల్లాహ్ యొక్క ప్రవక్త సమక్షంలో తక్కువ స్వరంతో మాట్లాడే వారి హృదయాలు, అల్లాహ్ యొక్క ధర్మనిష్ఠ పరీక్షలో నిగ్గుతేలుతాయి. అలాంటి వారి కొరకే మన్నింపు మరియు ఘనమైన ప్రతిఫలం ఉంది. 49:2,3.

అంతేగాక, ఆయన సమాధి వద్ద ఎక్కువ సేపు నిలబడటం వలన, రద్దీ మరియు సందడి బాగా పెరిగి పోతుంది. పైగా ఇలా చేయడం పై ఖుర్ఆన్ వచనాలకు విరుద్ధంగా చేసినట్లవుతుంది కూడా. ఒక ముస్లిం కొరకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అత్యంత ఆదరణీయులు. ఆయన సన్నిధిలో షరిఅహ్ కు వ్యతిరేకమైన అలాంటి చర్యలు చేయడమనేది గర్హణీయమైన విషయం. అలాగే, ఆయన సమాధి వద్ద నిలబడినపుడు లేదా సమాధికి ఎదురుగా నిలబడినపుడు రెండు చేతులు పైకెత్తి దుఆలు చేయడమనేది కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరుల, తాబయీన్ ల మరియు పూర్వం గతించిన పుణ్యపురుషుల ఆచారానికి వ్యతిరేకం. అలా చేయడం ఒక కల్పితాచారం మాత్రమే. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు,

عَلَيْكُمْ بِسُنَّـتِـي وَسُنَّـةِ الْـخُلَفاَءِ الرَّاشِدِيْنَ الْـمَهْدِيِيِّنَ مِنْ بَعَدِي، تَـمَسَّكُوْا بِـهَا وَعَضُّوْا عَلَيْهَا بِالنَّوَاجِذِ، وَإِيَّاكُمْ وَمُـحْدَثَاتِ الْأُمُوْرِ، فَإِنَّ كُلَّ مُـحْدَثَـةٍ بِدْعَـةٌ وَكُلَّ بِدْعَـةٌ ضَلاَلَـةٌ

అలైకుమ్ బిసున్నతీ వ సున్నతిల్ ఖుల్ఫాఇర్రాషిదీనల్మహ్దియ్యిన మిన్ బఅదీ తమస్సకూ బిహా వ అద్దూ అలైహా బిన్నవాజిది వ ఇయ్యాకుమ్ వ ముహ్దథాతిల్ ఉమూరి ఫ ఇన్న కుల్లి ముహ్దథతిన్ బిద్అతున్ వ కుల్ల బిద్అతున్ దలాలతున్ 

నా మార్గాన్ని గట్టిగా పట్టుకోండి. నా తర్వాత సన్మార్గంలో నడిచే ఖలీఫాల మార్గాన్ని గట్టిగా పట్టుకోండి. దానినే అంటిపెట్టుకుని ఉండండి మరియు మీ దవడ పళ్ళతో గట్టిగా కరిచి పట్టుకోండి. నూతన కల్పితాలకు దూరంగా ఉండండి. కొత్తగా కనిపెట్టబడిన ఏ విషయమైనా నూతన కల్పితమే అవుతుంది మరియు అది మార్గభ్రష్టత్వానికి దారి తీస్తుంది.

ఇంకా ఆయనిలా అన్నారు,

مَنْ أَحْدَثَ فِـي أَمْرِنَا هَذَا مَا لَـيْـسَ مِـنْـهُ فَـهُـوَ رَدٌّ

మన్ అహ్దథ ఫీ అమ్రినా హదా మాలైస మిన్హు ఫహువ రద్దున్  

మా విషయంలో లేని విషయాన్ని ఎవరైనా కొత్తగా కల్పిస్తే, అది తిరస్కరించబడుతుంది.

ఒకసారి అలీ బిన్ హుసైన్ జైనుల్ ఆబిదీన్ ఎవరో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి వద్ద నిలబడి ప్రార్థించడాన్ని చూసారు. వెంటనే ఆయన అతడిని ఆపి, దానిని ఆయన తన తండ్రి నుండి నేర్చుకున్నానని, మరియు ఆయన తండ్రి దానిని తాత అయిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా నేర్చుకున్నారని పలికారు,

لاَ تَـتَّـخِذُوْا قَبَرِي عِيْداً وَلاَ بُـيُـوتَـكُمْ قُـبُـوْرًا، وَصَلُّوْا عَلَـيَّ فَإِنَّ تَسْلِيْمَكُمْ يَـبْلُغُـنِـيْ أَيْـنَمـَا كُنْـتُـمْ

లాతత్తఖిదూ ఖబరీ ఇయ్ దన్ వలా బుయూతకుమ్ ఖుబూరన్ వ సల్లూ అలయ్య ఫఇన్న తస్లీమకుమ్ యబ్లుగునీ  అయ్ నమా కుంతుమ్    

నా సమాధిని సందర్శనా స్థలంగా చేయవద్దు. మీ ఇళ్ళను స్మశాన స్థలంగా మార్చవద్దు (ఇళ్ళలో నమాజు చేయకుండా ఉండవద్దు). మరియు నాపై దరూద్ పంపుతూ ఉండండి. ఎందుకంటే మీరెక్కడ నుండి పంపినా, మీ సలాము నాకు చేరుతుంది.

అలాగే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పంపేటపుడు కొందరు కుడి చేతిని తమ గుండెకు ఎడమవైపు ఉంచుతారు. ఆయనపై సలాము పంపేటపుడు లేదా ఎవరైనా రాజు, నాయకుడికి సలాము చేసేటపుడు ఈ భంగిమలో నిలబడటం ధర్మబద్ధం కాదు. ఎందుకంటే, ఇలా చేయడంలో చూపే వినయం, అణుకువ, నమ్రత మరియు సమర్పణలు కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందుతాయి.

ఈ విషయాన్ని గొప్ప ఉలేమాల ప్రామాణిక అభిప్రాయాల ఆధారంగా హాఫిజ్ ఇబ్నె హజర్ చర్చించారు. దీనిపై దృష్టి కేంద్రీకరించినా వారెవరికైనా ఇది స్పష్టమవుతుంది. అయితే అతను అల్లాహ్ కు అంగీకారమైన ముందుతరం పుణ్యపురుషుల మార్గాన్ని అనుసరించాలనే సంకల్పం ఉన్నవాడై ఉండాలి. పక్షపాతంలో, స్వార్థంతో కూడిన కోరికలలో మరియు గుడ్డిగా అనుకరించడంలో, సజ్జనుల మార్గానికి విరుద్ధంగా పోవడంలో మునిగిపోయిన వారి దుర్గతిని అల్లాహ్ త్వరలోనే నిర్ణయిస్తాడు. అల్లాహ్, మాకూ మరియు వారికీ సన్మార్గం చూపు గాక. ప్రతి దానిపై సత్యానికే ప్రాధాన్యత నిచ్చేటట్లు చేయుగాక. అలాగే దూరంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వైపు తిరిగి నిలబడి, సలాము కొరకు లేదా దుఆ కొరకు తమ పెదాలను కదిపే వారు కూడా మతభ్రష్ఠుల కోవలోనికే వస్తారు. ధర్మంలో ఇలాంటి నూతన పోకడలు కల్పించడం ఒక విశ్వాసికి తగదు. ఎందుకంటే అలా చేయడానికి అల్లాహ్ అనుమతి నివ్వలేదు. అలా చేయడమనేది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ప్రేమ చూపడం క్రిందికైతే రాదు గానీ, అల్లాహ్ ఆజ్ఞలను దాటి హద్దు మీరిపోవడం క్రిందికి మాత్రం తప్పక వస్తుంది. ఇలాంటి వాటిని ఖండిస్తూ, తర్వాతి తరాల సంస్కరణ కూడా ముందు తరాల సంస్కరణ మాదిరిగానే జరగాలని ఇమాం మలిక్ అన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మార్గాన్ని మరియు సన్మార్గంలో నడిచిన ఖలీఫాల మార్గాన్ని, సహాబాల మార్గాన్ని మరియు తాబయీనుల మార్గాన్ని అనుసరించే, ముందు తరాల ప్రజలు తమను తాము సంస్కరించుకున్నారు. తర్వాత తరం ప్రజలకు కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పద్ధతిని అనుసరించటంలోనే ఋజుమార్గం కనబడుతుంది. ఇలా చేయడం ద్వారా మాత్రమే వారి సంస్కరణ సరిగ్గా జరుగుతుంది. తమ సంక్షేమాన్ని పదిలం చేసుకునేందుకు మరియు ఇహపర లోకాలలో సాఫల్యం సాధించేందుకు, అలా చేసే శక్తిని అల్లాహ్ ముస్లింలకు ప్రసాదించుగాక.

మస్జిదె నబవీని సందర్శించడమనేది తప్పనిసరి హజ్ ఆచరణ క్రిందికి రాదు:

హెచ్చరిక: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని సందర్శించడమనేది ఫర్ద్ (తప్పనిసరి) కాదు మరియు హజ్ నియమాలలోనికీ రాదు. ఇది కొందరి ప్రజల అపోహ మాత్రమే. అయితే ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి సమీపానికి లేదా దాని పరిసర ప్రాంతాలకు చేరుకున్నవారు, మస్జిదె నబవీని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని సందర్శించడం ఉత్తమం. అయితే, మదీనహ్ నగరానికి దూరంగా నివసించే ప్రజలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని సందర్శించే సంకల్పంతో ప్రయాణించడం ధర్మబద్ధం కాదు. కానీ, మస్జిదె నబవీని సందర్శించే సంకల్పంతో అలా ప్రయాణించ వచ్చు. మదీనహ్ నగరంలోనికి చేరుకున్న తర్వాత వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని మరియు సహాబాల సమాధులను సందర్శించాలి. సహీహ్ బుఖారీ మరీయు ముస్లిం హదీథు గ్రంథాలు రెండింటిలోనూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినట్లుగా నమోదు చేయబడింది:

لاَ تُـشَـدُّ الرِّحَالُ إِلاَّ إِلَى ثَـلاَ ثَـةِ مَسَاجِـدَ: أَلْـمَسْجِدِ الْـحَـرَامِ، وَمَسْجِـدِي هَـذَا، وَالْـمَسْجِـدِ الْأَ قْـصَى

లాతుషద్దుర్రిహాల ఇల్లా ఇలా థలాథతి మసాజిద అల్ మస్జిదిల్ హరామి వ మస్జిదీ హదా వల్ మస్జిదిల్ అఖ్సా

ఈ మూడు మస్జిదులను సందర్శించడం కొరకు మాత్రమే ఎవరైనా ధార్మిక ప్రయాణం చేయవచ్చు: మస్జిద్ అల్ హరామ్ (కఅబహ్ మస్జిద్), నా మస్జిద్ (మస్జిదె నబవీ) మరియు మస్జిద్ అల్ అఖ్సా.

ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని లేదా ఎవరైనా ఇతరుల సమాధిని సందర్శించుట ధర్మసమ్మతమైనదైతే, తప్పకుండా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సమాజాన్ని అలా చేయమని ఆదేశించి ఉండేవారు. ఎందుకంటే వారి గురించి ఆయన చాలా సద్భావంతో ఉండేవారు, అల్లాహ్ కు ఎక్కువగా భయపడేవారు మరియు అల్లాహ్ గురించి బాగా ఎరిగిన ఉండినారు. తనకివ్వబడిన ప్రవక్త బాధ్యతను ఆయన పూర్తిగా నిర్వహించినారు. సమాజాన్ని ప్రతి మంచితనం వైపు దారి చూపినారు మరియు ప్రతి చెడు నుండి హెచ్చరించినారు. పై మూడింటిని సందర్శించడానికి చేసే ప్రయాణం తప్ప ఇతర మస్జిదులను సందర్శించడానికి చేసే ప్రయాణాన్ని ఆయన నిషేధించినారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికారు,

لاَ تَـتَّـخِذُوا قَبَرِي عِيْداً، وَلاَ بُـيُـوتَـكُمْ قُبُـوراً، وَصَلُّوا عَلَـيَّ فَإِنَّ صَلاَتِـكُمْ تَبْلُغُـنِـي حَيْثُ كُـنْـتُمْ

లాతత్తఖిదూ ఖబరీ ఇయ్ దన్ వలా బుయూతకుమ్ ఖుబూరన్ వ సల్లూ అలయ్య ఫఇన్న సలాతికుమ్  యబ్లుగునీ  హైథు  కుంతుమ్ 

నా సమాధిని తిరునాళ్ళ ప్రాంతంగా మార్చవద్దు. మీ ఇళ్ళను స్మశాన స్థలంగా మార్చవద్దు. నా పై దరూద్ పంపండి. మీరెక్కడ నుండి దరూద్ పంపినా, అది నాకు చేర్చబడుతుంది.

ఆయన సమాధిని దర్శించడమనేది షరిఅహ్ ఆచరణయే అని సమర్ధించుకోవడానికి, దానిని యాత్రా స్థలంగా మార్చడం మరియు హద్దు మీరి ఆదరించడం జరగవచ్చని ఆయన భయపడి ఉండవచ్చు. ప్రస్తుత కాలంలో ఆయన భయపడినట్లుగానే అనేక మంది ప్రజలు ఆయన సమాధిని దర్శించడమనేది షరిఅహ్ లోని భాగమేనని నమ్ముతూ, దారి తప్పిపోతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని దర్శించుట షరిఅహ్ లోని భాగమనే తమ అభిప్రాయానికి సమర్ధనగా వారు పేర్కొనే హదీథులు ఉల్లేఖకుల పరంపర విషయంలో బలహీనమైనవే గాక, అవన్నీ కల్పితమైనవి కూడా. ప్రఖ్యాత హదీథు పండితులు దర్ఖుత్నీ, బైహఖీ మరియు హాఫిద్ ఇబ్నె హజర్ మొదలైన వారు ఆ హదీథుల బలహీనత గురించి హెచ్చరించారు. కాబట్టి అలాంటి బలహీనమైన హదీథులను మూడు మస్జిదులను సందర్శించడానికి తప్ప, ఏ సంకల్పంతోనైనా సరే చేసే ఇతర సందర్శన ప్రయాణాలు నిషేధించబడినాయనే ప్రామాణిక హదీథుకు వ్యతిరేకంగా పేర్కొనడమనేది అస్సలు చేయకూడదు. అలాంటి అసత్య హదీథులను గుర్తించి, దారి తప్పిపోకుండా తమను తాము కాపాడుకొనుట కొరకు పాఠకులు వాటిని తెలుసుకొనుట అవసరమని భావిస్తూ, అలాంటి కొన్నింటిని క్రింద పేర్కొంటున్నాము.

ఎవరైతే హజ్ చేస్తారో మరియు నన్ను సందర్శించరో, అలాంటి వారు నా విషయంలో తప్పు చేసారు – అసత్య హదీథు.

నా మరణం తర్వాత ఎవరైతే నన్ను దర్శిస్తారో, వారు నా జీవితంలో నన్ను దర్శించినట్లే – అసత్య హదీథు.

ఎవరైతే నన్ను మరియు నా పూర్వీకులైన ఇబ్రాహీంను ఒకే సంవత్సరంలో దర్శిస్తారో, అల్లాహ్ ప్రమాణంగా వారికి స్వర్గం లభిస్తుందని గ్యారంటీ ఇస్తున్నాను – అసత్య హదీథు

ఎవరైతే నా సమాధిని దర్శిస్తారో, వారి పై నా సిఫారసు తప్పని సరై పోతుంది – అసత్య హదీథు.

అలాంటి హదీథులకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వరకు చేర్చే సరైన జాడ ఉండదు. హాఫిద్ ఇబ్నె హజర్ పరిశోధన ప్రకారం అలాంటి వాటి ఉల్లేఖకుల పరంపర కల్పితమైనది. హాఫిద్ ఉఖైలీ ఇలా పలికారు, “అలాంటి ఏ హదీథు ప్రామాణిక మైనది కాదు”. ఇబ్నె తైమియా అభిప్రాయం ప్రకారం అలాంటి హదీథులు అక్రమంగా కల్పించబడినవే. మీ జ్ఞానం కోసం మరియు సంరక్షణ కోసం కల్పిత హదీథుల గురించి ఇక్కడి వరకు ఇవ్వబడిన సమాచారం సరిపోతుందని భావిస్తున్నాము. ఒకవేళ పై వాటిలో ఏ హదీథైనా ప్రామాణికమైనదై ఉండినట్లయితే, మన కంటే ముందు సహాబాలు దానిని ఆచరించి ఉండేవారే మరియు అలా చేయమని సమాజానికి కూడా దారి చూపి ఉండేవారే. ఎందుకంటే ప్రవక్తల తర్వాత అంతటి ఉత్తములైన ప్రజలు సహాబాలే కదా. మరియు అల్లాహ్ విధించిన హద్దుల గురించి వారు బాగా ఎరిగినవారు. అల్లాహ్ తన దాసులకు ఆదేశించిన షరిఅహ్ గురించి వారికి చాలా బాగా తెలుసు. అల్లాహ్ గురించి మరియు అల్లాహ్ దాసుల గురించి వారు చాలా ఎక్కువ చిత్తశుద్ధి కలిగి ఉండినారు. పై వాటి గురించి వారి నుండి ఎలాంటి వ్యాఖ్యానం లేదు కాబట్టి, ఇవన్నీ అసత్యమైన హదీథులని మనం గ్రహించవచ్చు. ఒకవేళ ఏదైనా హదీథు ప్రామాణికమైనదైతే, దానికి సంబంధించిన షరిఅహ్ నియమం ఆచరణలో ఉండేది. పై హదీథులు అసత్యమైనవి లేదా కల్పితమైనవనే తుది నిర్ణయాన్ని ఇది ధృవీకరిస్తున్నది. అన్నీ ఎరిగిన అల్లాహ్ యే మహోన్నతుడు, లోపాలకు అతీతుడు, ఘనమైన వాడు.

ఖుబాఅ మస్జిదును మరియు జన్నతుల్ బఖీని దర్శించడం ఉత్తమం:

మదీనహ్ దర్శించే ప్రజలు ఖుబా మస్జిదును దర్శించడం మరియు దానిలో నమాజు చేయడం ఉత్తమం. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కోసారి కాలి నడకన, ఒక్కోసారి సవారీపై ఈ మస్జిదును దర్శించేవారు మరియు అందులో రెండు రకాతుల నమాజు చేసేవారు. బుఖారీ మరియు ముస్లిం హదీథు గ్రంథాలు

సహల్ బిన్ హనీఫ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖ: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు,

مَنْ تَـطَهَّـرَ فِـي بَـيْـتِـهِ ثُـمَّ أَتَـى مَسْجِـدَ قُـبَاءَ فَصَلَّى فِـيْـهِ صَلاَةً كَانَ لَـهُ كَـأَجْـرِ عُـمْـرَةٍ

మన్ తతహ్హర ఫీ బైతిహి థుమ్మ ఆతా మస్జిద ఖుబాఅ ఫసల్ల ఫీహి సలాతన్ కాన లహు కఅజ్రి ఉమ్రతిన్

ఎవరైతే ఇంటిలో వుదూ చేసి, తర్వాత ఖుబాఅ మస్జిదుకు వెళ్ళి, అందులో నమాజు చేస్తారో, అలాంటి వారికి ఉమ్రహ్ చేసినంత పుణ్యం లభిస్తుంది. (అహ్మద్, నసాయి, ఇబ్నె మాజా మరియు హాకిమ్)

అలాగే, జన్నతుల్ బఖీ (స్మశానం) దర్శించడం, షహీదుల సమాధులను దర్శించడం మరియు హంజా రదియల్లాహు అన్హు సమాధిని దర్శించడం కూడా సున్నతులోనివే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని దర్శించేవారు మరియు వారి కొరకు ప్రార్థించేవారు. దీని గురించిన హదీథు ఇలా ఉంది:

زُوْرُوْا الْـقُـبُـورَ فَـإِ نَّـهَا تُـذَكِّـرُكُمْ اَلْآخِـرَةَ

జూరుల్ ఖుబూర ఫఇన్నహా తుదక్కిరుకుమ్ అల్ ఆఖిరత

స్మశానాల్ని దర్శించండి. ఎందుకంటే అవి మీకు పరలోకం గురించి జ్ఞాపకం చేస్తాయి. ముస్లిం హదీథు.

సమాధులను దర్శించేటపుడు, క్రింది విధంగా పలుకమని ఆయన తన సహచరులకు బోధించారు,

أَلسَّلاَمُ عَلَيْكُمْ أَهْلٌ الدِّيَارْ مِنَ الْـمُؤمِـنِـيْـنَ وَالْـمُسْلِـمِيْنْ وَإِنَّا إِنْ شَاءَ الله بِكُمْ لاَحِقُوْنَ، نَسْأَلُ اللهَ لَنَا وَلَكُمْ الْـعَافِـيَـةٌ

అస్సలాము అలైకుమ్ అహలుద్దియార్  మినల్ మోమినీన్ వల్ ముస్లిమీన్. వ అనా ఇన్ షాఅ అల్లాహ్ బికుమ్ లాహిఖూన్. నస్అలుల్లాహ లనా వ లకుమ్ అల్ ఆఫియహ్.

మోమినుల మరియు ముస్లిముల ప్రాంతంలో ఉన్న నివాసితులారా, అస్సలాము అలైకుమ్. అల్లాహ్ తలిచినపుడు, నేను కూడా మీతో చేరబోతున్నాను. నా కొరకు మరియు మీకొరకు మేలు ప్రసాదించమని నేను అల్లాహ్ ను వేడుకుంటున్నాను. (ముస్లిం హదీథు గ్రంథం)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనహ్ లోని స్మశానం దగ్గర నుండి వెళ్తున్నపుడు, దాని వైపు తిరిగి ఇలా పలికారని అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన హదీథు అత్తిర్మిథీ హదీథు గ్రంథంలో ఇలా నమోదు చేయబడింది:

أَلسَّلاَمُ عَلَـيْكُمْ يَا أَهْلُ الْـقُـبُـورْ يَـغْـفِـرَ اللهُ لَـنَـا وَلَـكُـمْ أَنْـتُـمْ سَلَـفَـنَا وَنَـحْنُ بِالْأَ ثَـرْ

అస్సలాము అలైకుమ్ యా అహలుల్ ఖుబూర్, యగ్ఫిరల్లాహు లనా వ లకుమ్, అంతుమ్ సలఫనా వ నహ్ను బిల్అథర్

సమాధులలో ఉన్న వారలారా! అస్సలాము అలైకుమ్. మమ్ముల్ని మరియు మిమ్ముల్ని అల్లాహ్ క్షమించు గాక. మీరు మా కంటే ముందు వెళ్ళిపోయారు మరియు మేము మీ వెనుక వస్తున్నాము.

ఈ హదీథుల ద్వారా మనం నేర్చుకునేదేమిటంటే సమాధులను సందర్శించమనే షరిఅహ్ ఆదేశం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే దాని ద్వారా మనం మరణానంతర జీవితం గురించి గుర్తు చేసుకోవాలని.

మృతులతో ఉత్తమంగా వ్యవహరించే, వారిపై అల్లాహ్ యొక్క కారుణ్యం కురిపించమని వేడుకునే మరియు వారి కొరకు మరిన్ని దుఆలు చేసే అవకాశాల్ని ఈ సమాధి సందర్శనం కల్పిస్తున్నది.

అయితే, మృతులను వేడుకోవడానికి సమాధులను సందర్శించడం, అక్కడ కూర్చోవడం, తమ అవసరాలు తీర్చమని మృతులను అర్థించడం, రోగుల స్వస్థత కొరకు వారి సహాయాన్ని కోరటం, వారి ద్వారా లేదా వారి స్థాయి ద్వారా అల్లాహ్ ను వేడుకోవడం మొదలైనవి నిషేధించబడినాయి. ఎందుకంటే అలా చేయడం షిర్క్ క్రిందకి వస్తుంది. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అలా చేయడానికి అనుమతించ లేదు. అంతేగాక ముందుతరం సజ్జనులు కూడా అలా చేయలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించిన ఘోరమైన చెడు పనులలో అదొకటి. ఆయన పలుకులు:

زُوْرُوْا الْـقُـبُـورَ وَلاَ تَـقُـوْلُـوْا هُـجْـراً

జూరుల్ ఖుబూర వలా తఖూలు హుజ్ రన్

సమాధులను దర్శించండం, కానీ చెడు పలుకులు పలుకవద్దు.

ఈ పనులన్నింటిలోనూ కామన్ గా ఉన్న విషయం ఏమిటంటే ఇవి కొత్తగా కనిపెట్టబడిన నూతన కల్పితాలు. అయితే అవి వేర్వేరు స్థాయిలో ఉన్నాయి. వాటిలో కొన్ని పూర్తిగా దారి తప్పిన నూతన కల్పితాలే అయినా ఇంకా షిర్క్ స్థాయికి చేరుకోలేదు. ఉదాహరణకు, సమాధుల వద్ద నిలబడి అల్లాహ్ ను ప్రార్థించడం, మృతుల అంతస్తును పేర్కొంటూ ప్రార్థించడం మొదలైనవి. వాటిలో కొన్ని షిర్క్ అక్బర్ క్రిందికి వస్తాయి, ఉదాహరణకు – మృతులను వేడుకోవడం మరియు వారి సహాయాన్ని అర్థించడం.

ఈ విషయాల గురించి మేము ఇంతకు ముందు వివరంగా చర్చించాము. కాబట్టి వీటి గురించి మనం అప్రమత్తంగా ఉండాలి. సత్యాన్ని మాత్రమే అనుసరించే శక్తిని ప్రసాదించమని మరియు సరైన దారి చూపమని మనం అల్లాహ్ ను ప్రార్థించాలి. కేవలం అల్లాహ్ మాత్రమే మనకు సన్మార్గాన్ని అనుసరించే శక్తిని ప్రసాదించగలడు. అల్లాహ్ తప్ప, నిజమైన వేరే ఆరాధ్యుడు, ప్రభువు ఎవ్వరూ లేరు.

ఇది ఈ చిరు పుస్తకం యొక్క అంతిమ చివరి విషయం.

وَالْـحَمْـدُ للهِ أَ وَّلاً وَآخِراً، وَصَلَّى اللهُ وَسَلَّمَ عَلَى عَبْـدُهُ وَرَسُـولُـهُ وَخَـيْـرَتِـهُ مِنْ خَـلَـقَـهُ مُـحَـمَّـدٍ وَعَلَى آلِـهِ وَأَصْحَابِـهِ وَمَـنْ تَـبَـعَـهُمْ بِـإِحْـسَانِ إِلَى يَـوْمُ الـدِّيْـنَ

వల్ హందులిల్లాహి అవ్వలన్ వ ఆఖిరన్. సల్లల్లాహు అలైహి వసల్లం అలా అబ్దుహు, వ రసూలుహు, వ ఖైరతిహు మిన్ ఖలఖహు ముహమ్మదిన్ వ ఆలా ఆలిహి, వ అస్హాబిహి, వ మన్ తబఅహుమ్ బిఇహ్సాని ఇలా యౌముద్దీన్.

ఆరంభంలో మరియు అంతంలో సకల స్తోత్రములు అల్లాహ్ కే. అల్లాహ్ దాసుడు, ప్రవక్త మరియు సృష్టితాలలో అత్యుత్తములూ అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబంపై, ఆయన సహచరులపై, అంతిమ దినం వరకు మంచితనంలో వారిని అనుసరించేవారిపై అల్లాహ్ యొక్క కరుణ కురియుగాక.  

నిలకడగా ఆయన ధర్మాన్ని అనుసరించేలా అల్లాహ్ మనకు సహాయపడుగాక. ఆయనను వ్యతిరేకించడం నుండి మమ్ముల్ని కాపాడుగాక. నిశ్చయంగా ఆయన చాలా ఉదారవంతుడు మరియు మహోన్నతుడూను.