https://youtu.be/3JH_CVAHqrs [14 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *
ఋతుకాలం – సందేహాలు & సమాధానాలు
మూల రచయిత (అరబీ): షేఖ్ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్ ఉసైమీన్ (రహిమహుల్లాహ్)
తెలుగు అనువాదం: హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి హఫిజహుల్లాహ్
మర్కజ్ దారుల్ బిర్ర్ పబ్లికేషన్స్
[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[81 పేజీలు] [14 MB] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]
శుచి శుభ్రతల పట్ల ఇతర మతాల కంటే ప్రత్యేకత కల్గియున్నది పవిత్ర ఇస్లామే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించింది నిక్కము. అది ఏమిటంటే : “శుచి శుభ్రత సగవిశ్వాసం”. శుచి(శుద్ధి) అంటే దేహము నుండి సమస్త మలినాలను శుభ్రము చేయుట. అది రెండు విధాలుగా విభజించబడింది.
1.స్వల్ప శుద్ధి.
2. సంపూర్ణ శుద్ధి.
స్వల్ప శుద్ధి : ఇందులో స్త్రీ పురుషులు సమానమే. ఎప్పుడైతే మలమూత్ర ద్వారాల నుండి ఏదైన వెలువడినప్పుడు ముస్లిం అన్న ప్రతి వ్యక్తి శుద్ధిని ఆశ్రయించడం తప్పనిసరి.అదేమిటంటే నమాజ్, ‘తవ్వాఫ్’, మరి పవిత్ర ఖుర్ఆన్ గ్రంధాన్ని తాకటానికి ముందు“వజు” చేయుట, అనగా నిర్దేశించిన అవయవాలను ధర్మాదేశాల ప్రకారం కడుగుట.
సంపూర్ణ శుద్ది : అనేది స్త్రీ పురుషులకు సమానమైనది కాదు. పురుషులకైతేసంభోగానంతరం ఇంకా వీర్యస్ఖలనం జరిగినప్పుడు, స్త్రీలకైతే సంభోగానంతరం, వీర్యస్ఖలనం జరిగినప్పుడు, ఇంకా ఋతుస్రావం, రక్తస్రావం జరిగినప్పుడు, ప్రతి వ్యక్తి స్నానం చేసుకోవాలి(తలంటు పోసుకోవాలి) నమాజుకంటే, ఉపవాసం కంటే, తవ్వాఫ్ కంటే ముందు, మరి పవిత్ర ఖుర్ఆన్ గ్రంథాన్ని తాకటానికి ముందు.
అయితే ఋతుస్రావం, రక్తస్రావం గురించి పరిశుద్ధత పట్ల ప్రత్యేకమైన ఆదేశాలున్నాయి. ఖుర్ఆన్, మరి ప్రవక్త హదీసు (సున్నత్) లో దీని నిమిత్తం సవివరంగా తెల్పబడింది. ధార్మిక విద్వాంసులు, ఇస్లామియా జ్ఞానులు ఈ సందేశాన్ని పూర్తి బాధ్యతతో ప్రజలకు వివరించారు. సమీప కాలంలో గొప్ప ధార్మికజ్ఞానిగా పేరు గాంచిన ప్రముఖ పండితులు ‘ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్-ఉసైమీన్ (రహిమహుల్లాహ్) పాఠాల్లో, ప్రసంగాల్లో మరి వ్యాసాల్లో వీటిని ప్రకటించారు. ఆయా స్త్రీల నుండి ప్రశ్నలు, సందేహాలు ఎదురైనప్పుడు ఆయన సంతృప్తి పరంగా సమాధానాలు ఇచ్చారు. ఇక్కడ ఎన్నుకున్నవి ఇటువంటి 60 ప్రశ్నలే. అవి ఋతుస్రావం, రక్తస్రావం అనే అంశాల్లో అన్ని కోణాలతో కూడుకున్నవి. చిత్తశుద్ధితో తన శుద్ధిని కోరుకునే ప్రతి స్త్రీకి సంతృప్తిగల జ్ఞానము మరిఅవగాహన కోసం రచించబడినవి.
దీనిని ప్రముఖ ధార్మిక తెలుగు అనువాదకులు హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమరి (హఫిజహుల్లాహ్) తెలుగు భాషలో తెలుగువారికై అనువదించారు. ఆయన ద్విభాష (అరబిక్, తెలుగు)ల్లో ప్రావిణ్యంగల వ్యక్తి. ఈ అనువాదం ‘అరబి’ రచనకు సమీకరిస్తూ, తెలుగు వారి సరళంలో సులువైన రీతిలో వ్యాకరణ చేస్తుంది. ప్రముఖ ధార్మిక తెలుగు మాస పత్రిక “వెలుగు కిరణాలు“లో దశలవారిగా దీనిని ప్రచురించటం కూడ జరిగింది. అయితే ఇప్పుడు “డిస్కవర్ ఇస్లాం సెంటర్- బహ్రెయిన్” లో గల తెలుగు విభాగం దీనిని ఒక పుస్తక రూపంలో “మర్కజ్ దారుల్ బిర్-పెడన, ఇండియా” ఆధ్వర్యంలో ప్రచురిస్తుంది. ఈ పుస్తకం ప్రతి ఒక్కరికి పరిపూర్ణంగా ఉపయోగపడాలని అల్లాహ్ ప్రార్ధన(దుఆ) చేయుచున్నాను. ఆమీన్.! ఈ పుస్తకాన్ని కూర్పు చేసిన, మరి అనువదించిన మరి ప్రచురించటంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ఇహపరలోకాల్లో మంచి సత్ఫలితాన్ని ప్రసాదించుగాక.. ఆమీన్!
డా॥ సయీద్ అహ్మద్ ఉమరి మదని.
విద్యా బోధన విభాగ కర్త, అరబి కాలేజి,
మర్కజ్ దారుల్ బిర్-పెడన, ఇండియా
మానవ సమాజములో కీడుగా భావించే కొన్ని విషయాలలో స్త్రీ కూడా ఒకటి. అందులోనూ ప్రత్యేకించి ఆమె జీవితంలోని ఋతుకాలాన్ని. పూర్వపరాలను ఆశ్రయిస్తే ప్రతి కాలంలోనూ అవలంభించిన విధానం ఇదే. ఋతుకాలాన్ని మైలుగాను, కీడు గాను, చెడుగాను భావించి ప్రతి మంచి, ప్రతి శుభ కార్యాలకు ఆమెని కీడుగానే చూసేవారు
వాస్తవాలు వెలికి తీసినప్పుడు వ్యక్తమౌతున్న విషయం ఏమిటంటే సృష్టికర్త అయిన అల్లాహ్ స్త్రీ (తత్వాన్ని) జాతిని ఈ సహజ గుణము (ఋతుకాలం) తోనే సృష్టించాడు. దీనికి సంబంధించి అనేక ఉపయోగాలు కూడ సూచించాడు.
ఉదా : బాల్యంనుండి యవ్వనంలో అడుగు పెట్టిందని చెప్పటానికి ఇదే గుర్తు, నెలతప్పి గర్భవతిగా మారిందని కూడ ఇదే తొలి గుర్తు, వివాహ సంబంధాలు విడాకుల రూపంలో పురివిప్పినప్పుడు సమస్యనుపరిష్కరించటానికి కేంద్రబిందువుగా ఉపయోగపడేది కూడ ఇదే గుర్తు, కాలధర్మం చెందిన భర్త నుండి విముక్తి పొందటానికి నిర్దేశించబడేది కూడ ఇదే గుర్తు, గర్భంలో పసికందుడు నిరాకారంలో ఉన్నప్పుడు పోషక లవణాలను సేవించటానికి కూడ ఇదే గుర్తు, స్త్రీ స్థితిని శుభ్రం అపరిశుభ్రం అని నిర్ధారించటానికి కూడ ఇదే గుర్తు. మరో అడుగు ముందుకేసినట్లైతే ఆరోగ్యానికి అనారోగ్యానికి కూడ ఇదే గుర్తు. అంతేకాక (అల్లాహ్) సందర్భాను సారం నడుచుకునే విధానాలను కూడా దీని ఆధారంగానే ఉపదేశించాడు.
అయితె చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ ఋతుకాలం మానవ జీవనానికి ఎటువంటి కీడు కాదు, మరి అపశకనము కాదు.
కొందరైతే ఈ సందర్భములో స్త్రీని ఏ కోణం నుంచైన మంచిగా భావించే వారు కాదు, మరి కొందరైతే సేవలతో సరిపెట్టుకొని శుభకార్యాలు పై నీడ పడకుండ చూసేవారు. ‘ఆలోచనలు ఎన్నైతె అపోహాలు అన్ని’ అన్నట్టుగా కాలం సాగిపోసాగింది.
మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వీటన్నిటిని తొలగించి నవశైలిక నందించారు. తమ నడవడికలతో స్త్రీ యొక్క విలువలను కాపాడి ఉన్నత స్థానంలో అమర్చారు. కనుక ప్రతి ఒక్కరు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఆదర్శముగా తీసుకొని తమ ఆధీనములో ఉన్న స్త్రీ జాతిని కీడుగా భావించ కుండ సత్ప్రవర్తనలతో జీవనాన్ని సాగించగలరని కోరుకుంటున్నాము.
అయితె నాడు అల్లుకున్న అపోహాల సాంప్రదాయాల్లో నేడు ముస్లిం సమాజం అజ్ఞాన కారణంగాను, సాంప్రదాయ కారణంగాను ప్రభావితం అయింది. ఇస్లాం ధర్మం ఋతుకాలాన్ని ఎంతో ప్రత్యేకతనిస్తుంది. దేనికంటే దైవారాధనులు చేయటానికి దీనిపై పూర్తిగా పట్టుత్వం కల్గివుండాలి. ఋతుకాలం ఏక్షణంలో తొలగిపోతుందో అదే క్షణంలో ఆరాధన విధులు కూడ విధించబడుతాయి ఉదా: ఋతుకాలంలో వున్నప్పుడు ఉపవాసం వుండటం, నమాజు చదవటం, కాబా గృహానికి తవ్వాఫ్ చేయటం, సంభోగానికి సమీపించటం వంటివి చేయకూడదు, అదే ఏ క్షణంలో ఈ కాలం తొలగిపోతుందో వెంటనే స్నానం చేసి క్రమం ప్రకారంగా అన్నీ చేయవలసి వుంటుంది.
ఇక్కడ ఒక్క ముఖ్యవిషయం ఏమంటే ఇంత సున్నితమైన విషయాన్ని ఇండ్లలో కేవలం ఒక మాట “ఆరోగ్యం సరిగా లేదు” అని చెప్పి అన్నింటి నుండి తప్పించుకుంటారు అంతేకాక రేయింబవళ్లలో ఏ క్షణంలో ఇది తొలిగిపోయినా దానిని సరిగ్గా లెక్కించుకోరు, ఇది మహా పాపం. అల్లాహ్ తన పవిత్ర గ్రంధము ఖుర్ఆన్లో దీని నిమిత్తం క్లుప్తంగా ఆదేశాలిచ్చినప్పటికీ, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీ పరిపూర్ణంగా తెలిపినప్పటికీ కూడ మనము దాని పట్ల జ్ఞానవగాహన పొందకుండా ఇరుగు పొరుగు సాంప్రదాయాలకు లోబడి మన పిల్లలకు కూడ సరైన జ్ఞానం ఇవ్వలేక పోతున్నాము. దీని గురించి ప్రళయంనాడు ప్రశ్నించబోతాము. సాంప్రదాయాలకు తావివ్వకుండ ప్రవక్త గారి ఆదేశాలను పాటించాలి. అవసరపు మెరకు ఇక్కడ కొన్ని హదీసులు ప్రస్తావించడం జరిగింది. (ఇంకా క్లుప్తంగా తెలుసుకోవాలంటే ఆయా హదీసు గ్రంధాలను సంప్రదించ వలసివుంటుంది) .
ఇస్లామియా ధార్మిక పరిణితి చెందిన విద్యావంతులు షేక్ సాలెహ్ బిన్ ఉసైమీన్ రహిమహుల్లాహ్ తో చర్చించదగిన 60 ప్రశ్నలు సమాధానాలు ఎంతో విలువైనవి కాబట్టి దీనిని తెలుగు వారి ఉపయోగం కోసం అనువదించటంజరిగింది.
అల్లాహ్ మనందరికి వాస్తవాలను తెలుసుకొని పరలోక సాఫల్యం కొరకు తగు ప్రయత్నంచేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక….
ఆమీన్…!
ఇట్లు ..
ధార్మిక సేవకుడు : హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమరి
ప్రశ్న-1: ఒక వేళ స్త్రీ ఫజర్ పిమ్మటే (తరువాత) పరిశుద్ధురాలైతే అన్నపానియాలు మరి ఇతరాత్రా ఆహార వస్తువులు తినకుండా ఆ రోజు ఉపవాసం వుండాలా? మరి ఆమె పాటించే ఆ రోజు ఉపవాసాన్ని లెక్కించబడడం జరుగుతుందా? లేక ఆమె దానికి బదులుగా మరలా ఉపవాసం పాటించవలసి వుంటుందా?
జవాబు : ఒక వేళ స్త్రీ ఫజర్ పిమ్మటే పరిశుద్ధురాలైతే ఆ రోజు అన్న పానియాలు మరి ఇతరాత్రా ఆహార వస్తువులు తినకుండా వుండటం గురించి ఇస్లామీయ ధార్మిక విద్వాంసుల్లో రెండు అభిప్రాయాలు వున్నాయి.
1-ఆ రోజు ఆమె ఏమి తినకుండా ఆగిపోవాలి. కాని ఆ రోజు ఉపవాసం లెక్కింపబడదు. దానికి బదులు ఉపవాసం ఉండ వలసి ఉంటుంది. (ఇమాం అహ్మద్-రహిమహుల్లాహ్ వెల్లడించిన ప్రఖ్యాత అభిప్రాయం)
2-ఆమెకు ఆ రోజు ఏమి తినకుండా ఉండవలసిన అవసరం లేదు. ఆమె ఆ రోజు ఉపవాసం పాటించడం సరికాదు. ఎందుకంటే ఆ రోజు ఉపవాస ప్రారంభ దశలో ఆమె ఋతుకాలం (సమయం ) లోనే వుంది. అలాంటప్పుడు ఉపవాసం పాటించడం సరికాదు. ఉపవాసమే సరికానప్పుడు అన్న పానియాలకు దూరంగా ఉండటంలో ఎలాంటి ప్రయోజనం లేదు. మరియు ఆ ఆ సమయంలో దాని పవిత్రత, గౌరవాన్ని పాటించవలసిన నిబంధన ఆమెపై లేదు. ఎందుకంటే ఆ రోజు ప్రారంభ దశలో ఆమె ఉపవాసానికి అనర్హురాలు. అంతే కాకుండా ఆ పరిస్థితుల్లో ఆమెపై ఉపవాసం నిషేధించ బడింది. షరీఅత్ ప్రకారం ఉపవాసం గురించి మాకు తెలిసిన విషయం ఏమంటే అల్లాహ్ ఆరాధన సంకల్పంతో ‘ఫజర్’ నుండి సూర్యస్తమయం (మగ్రిబ్) వరకు అన్నపానియాలు, ఇతరాత్రా తినే, త్రాగే వస్తూవుల నుండి ఆగిపోవాలి.
దీనిలో రెండో అభిప్రాయం మొదటి కంటే ఉత్తమమైనది. ఏదేమైన ఈ రెండు అభిప్రాయాల వెలుగులో ఆ రోజు ఉపవాసానికి బదులు (ఖజా) పాటించవలసి వుంటుంది.
ప్రశ్న-2 : నెలసరిలో ఉన్న స్త్రీ (ఫజర్ కంటే ముందు) పరిశుద్దురాలైంది. ఫజర్ తరువాత స్నానము చేసి నమాజ్ కూడా చేసింది. ఆ రోజు ఉపవాసాన్ని కూడా పూర్తి చేసింది. అయితే ఆమె ఆ రోజు పాటించిన ఉపవాసానికి బదులుగా మరలా ఉపవాసం పాటించాలనే విధి వుందా?’. ఒక సోదరి.
‘ఫజర్’ కంటే ఒక్క నిమిషం ముందు నెలసరిలో ఉన్న స్త్రీ పరిశుద్ధురాలైనా తన పరిశుద్ధత గురించి పూర్తిగా నమ్మకం కలిగివుంటే మరింకా అది రమజాన్ మాసమే అయితే ఆమె పై ఆరోజు ఉపవాసాన్ని పాటించడం విధిగా పరిగణించబడుతుంది. కనుక అమె ఆరోజు పాటించే ఉపవాసం శ్రేయస్కరంగానే భావించబడుతుంది. దానికి బదులు (ఖజా) ఉపవాసం పాటించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆమె పరిశుభ్రతలోనే ఉపవాసం (‘సహరి’ చేసింది) పాటించింది. ఆమె ఒకవేళ ‘ఫజర్’ తరువాత స్నానం చేసినా సరే. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు.
దీనికి ఉదాహరణ ఏమిటంటే పురుషుడు కామక్రియల వల్ల లేదా వీర్యస్ఖలనానికి గురై (‘సహ్రి’ చేసుకుని) ఫజర్ తరువాత స్నానము చేసినా అతని ఉపవాసం శ్రేయస్కరంగానే పరిగణించ బడుతుంది.
దీనికి సంబంధించిన మరొక విషయయాన్ని ప్రస్తావించ దలచుచున్నాను : అదేమిటంటే, ‘ఆమె ఉపవాసం పూర్తి చేసుకుని ఇఫ్తార్ చేసిన తరువాత, ఇషా కంటే ముందు ఋతుస్రావానికి గురైతే ఆమె ఆ రోజు ఉపవాసం వృధా అయిపోతుందని’ కొందరు స్త్రీలు భావిస్తున్నారు. ఇది ఎంత మాత్రం సరి కాదు. అంతే కాకుండా ఒక వేళ సూర్యాస్తమయం తరువాత ఒక క్షణం తరువాత ఋతస్రావం ప్రారంభమైనా కూడ ఆమె ఉపవాసం పరిపూర్ణమవుతుంది.
ప్ర-3: పచ్చబాలింతరాలు ఒకవేళ నలభై రోజులకు ముందే పరిశుద్ధురాలైతే ఆమెపై ఉపవాసం పాటించడం, నమాజ్ చదవటం విధిగా వుంటుందా?
జ : ఔను.! పచ్చబాలింతరాలు నలభై రోజులకు ముందే పరిశుద్ధురాలైతే అది కూడా రమజాన్ మాసంలో వుంటే ఆమెపై ఉపవాసం, నమాజ్ పాటించడం విధిగా పరిగణించబడతాయి. ఆమె భర్త ఆమెతో లైంగికంగా పాల్గొనుట కూడా సరైనదే. ఎందుకంటే ఆమె ఇప్పుడు పరిశుద్ధ స్థితిలోనే వుంది. కనుక ఉపవాసం, నమాజ్ ఆమెపై విధిగా పరిగణించబడతాయి. ఆమె తన భర్తతో లైంగికంగా పాల్గొనటానికి ఎలాంటి ఆటంకం లేదు.
ప్ర -4 : సాధారణంగా స్త్రీ ఋతుస్రావానికి ఏడు లేక ఎనిమిది రోజులుంటాయి. ఒకోక్క సారి సాధారణ రోజుల కంటే ఒకటి రెండు రోజులు ఎక్కువగా వుంటుంది. వాటి గురించి ధార్మిక ఆదేశం ఎలా వుంది?
సాధారణంగా స్త్రీకి ఋతుస్రావం ఏడు లేక ఎనిమిది రోజులు ఉంటుంది. కాని అప్పుడప్పుడు ఈ కాలం పైబడి (పొడిగి) ఎనిమిది తొమ్మిది లేక పది పదకొండు రోజుల వరకు వుంటే అప్పుడామె ఆస్థితి నుండి పరిశుద్దురాలు కానంత వరకు నమాజ్ చేయరాదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఋతుస్రావానికి ప్రత్యేకించి ఒక పరిమిత కాలాన్ని నిర్ణయించలేదు. పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
وَيَسْأَلُونَكَ عَنِ الْمَحِيضِ قُلْ هُوَ أَذًى
“వారు మిమ్మల్ని ఋతుస్రావం గురించి ప్రశ్నిస్తున్నారు. (ప్రవక్తా!) మీరు చెప్పండి.! అది అశుద్ధి” (అపరిశుభ్రత). – అల్- బఖర (2: 222)
కనుక ఎప్పటి వరకు ఋతుస్రావపు రక్తం వుంటుందో ఆ స్త్రీ అదే స్థితిలో వుంటుంది. కాబట్టి ఆమె ప్రరిశుద్ధురాలై స్నానం చేసిన తరువాత నమాజు పాటించవలెను. తరువాత నెలలో ఒక వేళ గత నెల కంటే పరిమిత కాలంతగ్గితే పరిశుద్ధురాలైన వెంటనే స్నానం చేయాలి. ఒక వేళ ఈ నెలలో నెలసరి కాలం గత కాలం కంటే తగ్గివున్నా సరె. సంక్షిప్తం ఏమంటే స్త్రీ నెలసరిలో వున్నంత వరకు నమాజు చదవకూడదు. ఎప్పుడైతే నెలసరి నుండి పరిశుద్ధురాలవుతుందో అప్పుడు నమాజు చదవాలి.
ప్రశ్న-5 బాలింతురాలు నలభై రోజుల వరకు నమాజ్, ఉపవాసం పాటించకుండా వుండాలా? లేదా దీని గురించి బాలింతురాలి రక్తస్రావం ఆగిపోవటాన్ని పరిగణించటం జరుగుతుందా? అంటే రక్తస్రావం ఆగిన వెంటనే స్నానము చేసి నమాజు మొదలు పెట్టాలా? బాలింతురాలు పరిశుద్దురాలవటానికి (బాలింతురాలి) రక్తస్రావపు కనీస పరిమిత కాలం ఎంత?
బాలింతరాలి రక్తస్రావానికి నిర్ణీత కాలం అంటు లేదు. రక్తస్రావం జరుగుతున్నంత వరకు ఆమె నమాజ్, ఉపవాసం పాటించకూడదు. ఆమె భర్తకు కూడ లైంగికంగా దగ్గర కాకూడదు. మరియు ఆమె పరిశుద్ధతను గ్రహించినప్పుడు నమాజ్ని, ఉపవాసాన్ని పాటించాలి. మరియు ఆమె తన భర్తకు కూడ లైంగికంగా దగ్గరకావచ్చు. ఒకవేళ నలభై రోజులు పూర్తి కాకున్న సరె. అంతే కాకుండా ఒక వేళ ఆమె బాలింతురాలిగా రక్తస్రావంలో పది లేక ఐదు రోజులు గడిపివున్నా సరే.
ఏదేమైన ‘బాలింతురాలి రక్తస్రావం’ ఎలాంటి విషయమంటే దానికి సంబంధించిన ఆదేశాలు రక్తస్రావం అవుతుందా లేదా అనే దానిపై ఆధార పడివుంటుంది. కనుక రక్తస్రావం అవుతున్నట్లైతే ఆదేశాలు అమలవుతాయి (విధిగా వుంటాయి). ఎప్పుడైతే ఆమె పరిశుద్ధురాలు అవుతుందో రక్తస్రావానికి సంబంధించిన ఆదేశాలు కూడా తొలగిపోతాయి. కాకపోతే ‘బాలింతురాలి రక్తస్రావం 60 రోజుల తరువాత కూడ అవుతున్న పక్షంలో ఆమెని రక్తస్రావం (నెలసరి) గల స్త్రీ అని పరిగణించటం జరుగుతుంది. కాబట్టి అప్పుడామె కేవలం సాధారణ నెలసరి కాలం ఎంతో అంత వరకు నిరీక్షించిన తరువాత ఆమె స్నానం చేసి నమాజు చేయటం జరుగుతుంది.
ప్రశ్న-6 స్త్రీకి రమజాన్ మాసంలో పగటి సమయములో కొద్దిపాటి మామూలు రక్తపు చుక్కలు వచ్చాయి. మరి ఈ రక్తపు చుక్కలు మాసమంతా వస్తూనే వున్నాయి. అయినా ఆమె ఉపవాసం కొనసాగిస్తునే ఉంది. అయితే ఆమె ఉపవాసం కొనసాగించడం సరైనదేనా?
ఔను! ఆమె ఉపవాసం సరైనదె! మరి ఆ రక్తపు చుక్కలు పరిగణించబడవు. ఎందుకంటే అవి నరాల నుండి వస్తాయి. హజ్రత్ అలీ రజియల్లాహు అన్హుతో ఇలా ఉల్లేఖనం ఉంది: ‘అంటే ఈ రక్తపు చుక్కలు (ముక్కు నుండి రక్తం కారి నట్టు చిమ్ముతూ వుంటాయి, కాని అది) నెలసరి కాదు.
ప్రశ్న-7: నెలసరిగల స్త్రీ, బాలింతురాలు ఒకవేళ ఫజర్ కంటె ముందు పరిశుద్ధురాలైంది. కాని ఫజర్ తరువాత స్నానం చేసింది. అయితే మరి ఆమె ఉపవాసం సరైనదేనా?
జ: ఆమె ఉపవాసం సమ్మతమైనదే (సరైనదే). నెలసరి స్త్రీ, బాలింతురాలు ఒకవేళ ఫజర్ కంటే ముందు పరిశుద్ధురాలై ఫజర్ తరువాత స్నానం చేస్తుంది. అయితే ఆమె ఉపవాసం సమ్మతమైనదే. ఎందుకంటే ఆమె పరిశుద్ధురాలైన సమయములో ఉపవాసం వుండటానికి అర్హురాలు అయివున్నది. ఆమె ఆ వ్యక్తిలా ఫజర్ సమయంలో వీర్యస్ఖలనానికి గురై ఉపవాసం ఉన్నాడు. కాని పజర్ తరువాత పరిశుద్ధుడయ్యాడు. కాబట్టి ఆమె ఉపవాసం సరైనదె. ఎందుకంటే పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
الْآنَ بَاشِرُوهُنَّ وَابْتَغُوا مَا كَتَبَ اللَّهُ لَكُمْ ۚ وَكُلُوا وَاشْرَبُوا حَتَّىٰ يَتَبَيَّنَ لَكُمُ الْخَيْطُ الْأَبْيَضُ مِنَ الْخَيْطِ الْأَسْوَدِ مِنَ الْفَجْرِ
“అయితే ఇప్పుడు మీరు మీ (దాంపత్య సుఖాన్ని) అనుభవించండి, మరియు అన్వేషించండి అల్లాహ్ మీకోసం విధిగా వ్రాసియున్న వాటిని. మరి తినండి, త్రాగండి, ఎప్పటి వరకంటే వేకువ జామున పొద్దుటి తెలుపు దారం (రేఖ) నల్లటి దారం (రేఖ)తో (విడిగా) బహిర్గతం అయ్యేవరకు”. (అల్- బఖరహ్ 2:187)
అయితే వేకువజాము వరకు దాంపత్య సుఖానికి అనుమతించినప్పుడు దానికి తగిన ఉద్దేశం ఏమిటంటే స్నానం ఫజర్ తరువాతే అవుతుంది.
మరియు హజ్రత్ ఆయిషా రజి అల్లాహు అన్హా హదీసులో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన పవిత్ర భార్యలతో సంభోగించి అపరిశుద్ధ స్థితిలోనే తెల్లవారు జామున లేచినప్పుడు ఉపవాసంతో ఉండేవారు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ తరువాత పరిశుద్ధతకై స్నానం చేసేవారు.
ప్రశ్న-8: స్త్రీ రక్తాన్ని లేక నెలసరి బాధను గ్రహించింది. కాని సూర్యస్తమయం కంటె ముందు రక్తం రాలేదు. అలాంటప్పుడు ఉపవాసాన్ని పూర్తి చేయవచ్చా? లేదా దానికి బదులుగా (ఖజా) వుండవలసి వుంటుందా?
ఒకవేళ పరిశుద్ధ స్త్రీ ఉపవాస స్థితిలో నెలసరి రావటాన్ని గమనించింది లేదా దాని బాధని గమనించింది. కాని సూర్యస్తమయం తరువాత నెలసరి వచ్చింది. అలాంటప్పుడు ఆమె పాటించిన ఆ రోజు ఉపవాసం సరైనదే. దానిని మరలా పూర్తి చేయవలసిన అవసరం లేదు. కనుక ఆమె పాటించిన ఆ ఉపవాసం ఫర్జ్ ఉపవాసం అయితే తిరిగి పాటించదు. ఒక వేళ అది నఫిల్ ఉపవాసం అయితే దాని పుణ్యఫలానికి భంగం వాటిల్లదు. ఇన్షా అల్లాహ్.
ప్రశ్న-9 : ఒక స్త్రీ రక్తాన్ని గ్రహించింది. కాని అది నెలసరా? కాదా? అన్నది పూర్తిగా నిర్ధారించలేక పోయింది. అలాంటప్పుడు ఆరోజు పాటిస్తున్న ఉపవాసం గురించి ఆదేశం ఏమిటి?
పై పేర్కొనబడిన స్త్రీ పాటిస్తున్న ఆ రోజు ఉపవాసం సరైనది. ఎందుకంటే నెలసరి వుండక పోవటమే అసలు విషయం. ఇది ఎప్పటి వరకంటే ఆమెకు నెలసరి వచ్చిందని పూర్తిగా నమ్మకం కలిగేంత వరకు.
ప్ర-10 : కొన్ని సందర్భాల్లో స్త్రీ పగటి సమయంలో రక్తపు అసాధారణమైన ప్రభావాన్ని లేదా రక్తపు అసాధారణమైన బిందువుల్ని గ్రహిస్తుంది. మరికొన్నిసార్లు ఇలాగే నెలసరి కాలంలో చూస్తుంది. కాని అప్పుడు ఋతుస్రావం ప్రారంభమై ఉండదు. మరి కొన్నిసార్లు నెలసరి కాలం తరువాత రోజుల్లో గ్రహిస్తుంది. అయితే సందేహమేమిటంటే పై పేర్కొన్న రెండు సందర్భాల్లో ఆమె ఉపవాసం గురించి ఆదేశం ఏమిటి?
దాదాపు ఇలాంటిదే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది. అయితే ఆ ప్రశ్నలో ఒక అంశం ప్రస్తావించబడలేదు. అదేమిటంటే రక్తపు చుక్కలు ఒకవేళ నెలసరి కాలంలో గమనిస్తే, మరియు ఆమె దానిని ఋతుస్రావం అని భావిస్తే అవి ఆమెకు తెలిసిన రోజులైతే అప్పుడు అది ఋతుస్రావం పరిధిలోనే వస్తుంది. స్థితి రెండు
ప్ర-11 : నెలసరి స్త్రీ, బాలింతురాలు పవిత్ర రమజాన్ మాసంలో పగటి సమయాల్లో (అన్న, పానియాలు) తీసుకోవచ్చా?
అన్నపానియాలు తీసుకోవచ్చు. నెలసరి స్త్రీ, బాలింతురాలు పవిత్ర రంజాన్ మాసంలో పగటి సమయములో (అన్నపానియాలు) తినవచ్చు. కాకపోతె ఇంట్లో పిల్లలుంటే వారికి కనబడకుండా తినటం ఉత్తమం. ఎందు కంటే దాని వల్ల పిల్లలకు ఎలాంటి సందేహాలు రావు.
ప్ర-12 నెలసరి స్త్రీ, లేదా బాలింతరాలు ఒకవేళ అసర్ సమయంలో పరిశుద్ధురాలు అయితే వారికి ‘అసర్’ నమాజుతో పాటు జొహర్’ నమాజు కూడ పాటించాలా? లేదా అసర్ నమాజ్ మాత్రం పాటించాలా?
జ : ఈ విషయములో ప్రఖ్యాత అభిప్రాయం ఏమిటంటే పై పేర్కొనబడిన స్త్రీ అసర్ నమాజు మాత్రమే పాటించాలి. ఎందుకంటే అలాంటి స్థితిలో జొహర్ నమాజు తప్పనిసరిగా చదవాలి అని చెప్పడానికి ఎటువంటి ఆధారం లేదు. ఫిఖాహ్ సూత్రాల ప్రకారం ఆధారం లేకపోవడమే అసలు (ఆధారం) విషయం.
రెండో విషయం ఏమిటంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు :
“ఎవరైతే సూర్యస్తమయానికి ముందు ‘అసర్’ నమాజ్ లోని ఒక్క రకాత్ పొందినా అతను అసర్ నమాజు పొందినట్లే”..
పై హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తి ‘జొహర్’ నమాజ్ కూడా పొందినట్లే అని చెప్పలేదు. ఒకవేళ జొహర్ నమాజు కూడ స్థితిలో విధియై వుంటే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) తప్పకుండా ప్రస్తావించి ఉండేవారు.
పై పేర్కొనబడిన స్థితిలో స్త్రీ పై ‘జొహర్’ నమాజు విధిగా కాకపోవటానికి మరో కారణం కూడా వుంది.
అదేమిటంటే ఒకవేళ స్త్రీ ‘జొహర్’ సమయం మించిపోయిన తరువాత నెలసరికి గురైతే దానికి జోహర్ నమాజు మాత్రమే తరువాత (ఖజా) చేయవలసి వుంటంది, అసర్ నమాజు కాదు.
కొన్ని సందర్భాల్లో ‘జొహర్’, ‘అసర్’ రెండింటిని కలిపి పాటిస్తారు. మరి అలాంటి సమయంలోనూ, ప్రశ్నలో పేర్కొనబడిన సందర్భములో అంతగా వ్యత్యాసం కనబడదు. కనుక కొన్ని హదీసుల ‘ఖియాస్’ (అంచనా)ల దృష్ట్యా పై పేర్కొనబడిన స్త్రీ పై అసర్ నమాజు పాటించడం తప్పని సరి.
మరి ఇదే విధంగా ఒక వేళ ఆమె’ఇషా’ నమాజ్ సమయం పూర్తికాక ముందే పరిశుద్ధురాలైతే ఆమెకి ‘ఇషా’ నమాజు మాత్రమే చదవవలసి వుంటుంది ‘మగ్రిబ్ నమాజు కాదు.
ప్ర -13 : గర్భము కోల్పోయిన స్త్రీల స్థితి రెండు విధాలుగా వుంటుంది. గర్భము కోల్పోవటం అనేది పిండము ఏర్పడక ముందు జరుగుతుంది లేదా పిండము ఏర్పడి అందులో రూపు రేఖలు దిద్దుకున్న తరువాత జరుగుతుంది. అయితే సమస్య ఏమిటంటే ఏ రోజైతే ఆమే గర్భము కోల్పోయిందో ఆ రోజుఉపవాసం గురించి ఆదేశం ఏమిటి? మరింకా అటువంటి రోజుల ఉపవాసము సంగతి ఏమిటి? దేనిలోనైతే ఆమె రక్తాన్ని గమనిస్తుందో?
జ: గర్భములో పిండము ఏర్పడక పోయినట్లైతే ఆ రక్తం బాలింత దశకు సంబంధించిన రక్తం కాదు. కనుక ఆ స్త్రీ నమాజు, ఉపవాసం పాటించాలి. ఆమె ఉపవాసం సరైనదే. ఒకవేళ గర్భములో పిండము ఏర్పడనట్లైతే ఆ రక్తం బాలింతదశానికి సంబంధించిన రక్తమే. కనుక ఆ స్థితిలో నమాజు చదవకూడదు, ఉపవాసం వుండ కూడదు. ఈ విషయంలో విధానం ఏమిటంటే గర్భాశయంలో పిండం ఏర్పడిన తదనంతరం తొలగించటం జరిగితే దాని తరువాత వచ్చే రక్తం బాలింతదశానికి సంబంధించిన రక్తమే. కనుక ఆ సందర్భములో ఆమెకి ఆ అన్ని విషయాలు నిషిద్దంగానే వర్తిస్తాయి ఏవైతే బాలింతురాలికి నిషిద్ధంగా వుంటాయో. ఒకవేళ గర్భాశయంలో పిండం ఏర్పడని సందర్భములో ఆ రక్తం బాలింత దశానికి సంబంధించిన రక్తం కాదు. కాబట్టి ఏవైతే బాలింతురాలికి నిషిద్ధంగా వుంటాయో అవి ఆమె పై నిషిద్ధం కావు.
ప్ర-14 : గర్భవతికి పవిత్ర రమజాన్ మాసంలో పగటి పూట రక్తం వస్తే దాని ద్వారా ఆమె పాటిస్తున్న ఉపవాసానికి ఏమైన భంగం వాటిల్లుతుందా?
సాధారణ స్త్రీ ఒక వేళ ఉపవాసం పాటిస్తున్నప్పుడు ఆమెకు ఋతుస్రావపు రక్తం ప్రారంభమైతే ఆమె ఉపవాసానికి భంగం వాటిల్లుతుంది. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిస్తున్నారు : “స్త్రీ నెలసరిలో ఉన్నప్పుడు నమాజు, ఉపవాసం పాటించటం లేదు కదా“.
అందుకే నెలసరిని ఉపవాసాన్ని భంగము కల్గించే అంశాల్లో ఒకటిగా భావించబడుతుంది. మరి బాలింతురాలి దశలో వచ్చే రక్తం కూడా ఈ ఆదేశానికి సంబంధించినదే. కనుక నెలసరి లేక బాలింతురాలి దశలో వచ్చే రక్తం వల్ల ఉపవాసానికి భంగం వాటిల్లుతుంది.
ఇక గర్భవతికి పవిత్ర రమజాన్ మాసంలో పగటి పూట రక్తం వచ్చే విషయంలోనైతే అది (రక్తం) ఒక వేళ నెలసరికి సంబంధించిందైతే దాని ఆదేశం సాధారణ స్త్రీ (బాలింతురాలు కాదు) నెలసరిగా పరిగణించ బడుతుంది. అంటే దాని ద్వారా ఉపవాసానికి భంగము ఏర్పడుతుంది. ఒక వేళ నెలసరికి సంబంధించింది కాకపోతే దాని వల్ల ఉపవాసానికి ఎలాంటి ఆటంకం ఏర్పడదు. గర్భవతికి ఏ రక్తస్రావం అవుతుందంటే – ఆమె నెలతప్పి గర్భవతి అయిన కూడ నెలసరి ఆగక క్రమం ప్రకారం నెలసరవుతున్నప్పుడు ప్రఖ్యాత అభిప్రాయం ప్రకారం – అది నెలసరిగానే పరిగణించి దానిపై నెలసరికి సంబంధించిన ఆదేశాలే పాటించబడతాయి. కాగా ఒకవేళ ఆమె రక్తస్రావం ఆగిపోయివుండి మళ్ళీ దాని తరువాత ఆమె రక్తం గమనిస్తే, అది నెలసరికి సంబంధం కానటువంటిదైతే అప్పుడు దాని ద్వారా ఉపవాసం ప్రభావితం కాదు ఎందుకంటే ఆ రక్తం నెలసరిది కాదు.
ప్ర-1 5 : స్త్రీ ఒకవేళ నెలసరి కాలంలో ఒక రోజు రక్తాన్ని గమనించింది. మరుసటి రోజు పూర్తిగా రక్తం చూడకపోతే అప్పుడు ఆమె ఏమి చేయాలి?
జ: ఈ సమస్యలో ఉన్న విషయం ఏమిటంటే ఆ స్త్రీ తన నెలసరి కాలంలో చూసిన పరిశుద్ధత గాని (రక్తం) ఆగిపోవటం గాని అది నెలసరి పరిగణంలోకే వస్తుంది. కనుక దానిని పరిశుద్ధతలో పరిగణించటం జరగదు. అందుకే ఆమె ఆ విషయాలకు దూరంగానే వుండాలి, ఏ విషయాలతో నెలసరిగల స్త్రీ దూరంగా ఉంటుందో. కాని కొందరు ధార్మిక విద్వాంసులు తమ అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు :
‘ఎవరైనా స్త్రీ ఒక రోజు రక్తం చూసి మరో రోజు రక్తం చూడక పోతే అప్పుడు ఆ రక్తం నెలసరిగానే పరిగణింపబడుతుంది. మరి ఏ రోజైతె రక్తం రాలేదో ఆరోజు పరిశుద్దురాలుగా వుంటుంది. ఇలా 15 రోజులు గడిచే వరకు. 15 రోజుల తరువాత అది ఋతుస్రావం క్రింద పరిగణించ బడుతుంది’. ఇదే ఇమాం అహ్మద్ బిన్ హంబల్ (రహిమహు- ల్లాహ్) ప్రఖ్యాత అభిప్రాయం.
గమనిక: ఒకరోజు రక్తం చూసి మరుసటి రోజు రక్తం చూడనటువంటి స్త్రీ ఋతుకాలాన్ని 15 రోజులుగా నిర్ణయించటం జరుగుతుంది. తరువాత ఏ రోజు రక్తం వస్తుందో ఆ రోజు అపరిశుద్దురాలుగాను మరి ఏ రోజు రక్తం రాదో ఆ రోజు పరిశుద్ధురాలుగాను పరిగణించడం జరుగుతుంది. ఇలా 15 రోజుల వరకు వుంటుంది. ఆ తరువాత కూడ నెలసరి అవుతున్నట్లైతే అది రక్తస్రావంగానే పరిగణించ బడుతుంది.
రక్తస్రావం : అంటే నెలసరి కాలాన్ని మించి వచ్చే దానిని, మరి బాలింత దశను మించి వచ్చే దానిని రక్తసావ్రం అంటారు.
ప్ర-16 :నెలసరి చివరి రోజుల్లో పరిశుద్ధతకు ముందు స్త్రీకి రక్తపు మరకలు కానరానప్పుడు ఆమె ఆరోజు ఉపవాసం పాటించవచ్చా? ఎందుకంటే ఇంకా ఆమె తెలుపు నీళ్ళు చూడనే లేదు. అప్పుడు ఆమె ఏమిచేయాలి?
జ : పై పేర్కొనబడిన స్త్రీకి సాధారణంగా నెలసరి తరువాత తెల్లటి నీళ్ళు కానవచ్చేది కాదు. కొందరు స్త్రీల్లో ఇటువంటి లక్షణం వుండదు. కాబట్టి అలాంటప్పుడు ఆమె ఉపవాసం వుంటుంది. ఒక వేళ ఆమెకు నెలసరి తరువాత తెలుపు నీళ్ళు చూసే అలవాటు వుంటే అప్పడు తెలుపు నీళ్ళు చూసేంత వరకు ఆమె ఉపవాసం వుండరాదు.
ప్ర- 17 : ఋతుస్రావంలో ఉన్న స్త్రీ, బాలింత దశలో రక్తస్రావం గల స్త్రీ అవసర నిమిత్తం ఉదాహరణకు: విద్యార్థిని లేక ఉపాధ్యాయురాలైనప్పుడు చూసి లేదా చూడకుండా పవిత్ర ఖుర్ఆన్ పారాయణం చేయవచ్చా?
ఋతుస్రావంలో ఉన్న స్త్రీ, బాలింత దశలో రక్తస్రావం గల అవసర నిమిత్తం ఉదాహరణకు : విధ్యార్ధిని లేక ఉపాధ్యాయురాలైనప్పుడు రాత్రి లేదా పగలు ఏ సమయంలోనైన ఖుర్ఆన్ పారాయణం చేయటం లేదా పదేపదే చదవటంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ పుణ్య సంకల్పముతో ఈ స్థితిలో ఖుర్ఆన్ పారాయణం చేయకపోవటమే మంచిది. ఋతుస్రావం గల స్త్రీ ఖుర్ఆన్ పారాయణం చేయకూడదనేది అనేక ఇస్లామియా ధార్మిక విద్యాసంసులు అభిప్రాయం.
గమనిక: అంటే ఎవరికైనా ఖుర్ఆన్ చదివించటం లేదా ఎవరైనా పారాయణం చేసినప్పుడు వినటం అవసరాన్ని బట్టి చేయవచ్చు. కానీ పుణ్య సంకల్పంతో స్వయంగా పారాయణం చేయరాదు.
ప్ర -18 : ఋతుస్రావం గల స్త్రీ పరిశుద్దురాలైన తరువాత వస్త్రాలు (దుస్తులు) తప్పకుండా మార్చాలా? (ఉన్నదుస్తుల్లో) రక్తంగాని అపరిశుభ్రత గా గాని లేనప్పుడు కూడా దుస్తులు మార్చవలసి వుంటుందా?
జ: లేదు. అవసరం లేదు. ఎందుకంటే ఋతుస్రావంతో దేహం పరిశుభ్రత కాదు కేవలం ఆ ప్రదేశం మాత్రమే అపరిశుభ్రమవుతుంది దేనినైతే రక్తం తాకుతుందో. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలకు ఇలా ఆదేశించారు :
“దుస్తుల్లో ఋతుస్రావపు రక్తం అంటుకున్నప్పుడు వారు దానిని పరిశుభ్రం చేసుకుని అందులోనే నమాజు చేసుకోవచ్చు”.
ప్ర -19 : ఒకరు ఇలా ప్రశ్నిస్తున్నారు : ‘ఒక స్త్రీ రక్తస్రావం కారణంగా పవిత్ర రమజాన్ మాసంలో ఏడు రోజుల ఉపవాసాలు పాటించలేదు. రెండవ రమజాన్ వచ్చెవరకు ఆమె ఆ ఉపవాసాల ఖజా (బదులు) కూడ వుండలేదు. అలాగే మళ్ళీ రెండవ రమజాన్లో కూడ ఏడు రోజుల ఉపవాసాలు పాటించలేక పోయింది. ఎందుకంటే ఆమె తన బిడ్డకు పాలు పట్టేది. అనారోగ్యం కారణంగా ఆ ఉపవాసాల ఖజా(బదులు) కూడ వుండలేదు. అయితే ఇప్పుడు మూడవ రమజాన్ సమీపించింది. ఆస్త్రీ ఏమి చేయాలి? జవాబు చెప్పగలరు. అల్లాహు తఆలా మీకు పుణ్యఫలాలు ఇవ్వుగాక!
జ: పై పేర్కొనబడిన స్త్రీ నిజంగానే అనారోగ్యవంతురాలైతే, ఆమె ఆ ఉపవాసాల ఖజా (బదులు) వుండగలదు. ఎందుకంటే ఆమె సమ్మతమైన కారణం కలిగివుంది. కనుక ఆమె తనలో స్థోమత పొందినప్పుడు ఉపవాసాల ఖజా చేయవలెను. ఒక వేళ రెండవ రమజాన్ దాపరించినా సరే. కాని అకారణం లేక కుంటి సాకులతో బద్దకము చేస్తే అది మంచిది కాదు.
ఒక రమజాన్ మాసంలో వదిలేసిన ఉపవాసాలకు ‘ఖజా’ రెండవ రమజాన్ వరకు ఆలస్యము చేయరాదు. (అలా చేయటం ఏమాత్రం మంచిది కాదు). హ॥ ఆయషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు: “నా ఉపవాసాలు మిగిలిపోయేవి. అయితే నేను ‘షాబాన్’ మాసంలోనే వాటి ‘ఖజా’ను పూర్తిచేసేదాన్ని”.
అయితే ఆ స్త్రీ తన గురించి ఆలోచించుకోవలసిందేమిటంటే ఒక వేళ తన వద్ద సరైన కారణం లేనప్పుడు ఆమె పాపాత్మురాల వుతుంది. అల్లాహ్ మన్నింపుకై వేడుకుని తనపై మిగిలి వున్న ఉపవాసాల ‘ఖజా’ పాటించడంలో త్వరపడాలి. ఒకవేళ నిజంగానే ఆమెకు సమ్మత కారణం వుంటే అప్పుడు ఆమె ‘ఖజా’ చేయటంలో సంవత్సరము గాని రెండు సంవత్సరాలుగాని ఆలస్యమైన పర్వాలేదు.
20: కొందరు స్త్రీల పరిస్థితి ఎలా వుంటుందంటే రెండవ రమజాన్ మాసం వచ్చేస్తుంది కాని వారు ఇంత వరకూ గత రమజాన్ – మాసంలో వదిలివేసిన ఉపవాసాల ‘ఖజా’ (బదులు) పూర్తి చేసి వుండరు. ఇలాంటి స్త్రీలపై ఏమి విధిగా వుంటుంది?
ఇలాంటి స్త్రీల పై విధి ఏమిటంటే వారు ఇలాంటి పొరపాట్లకు అల్లాహ్ మనస్ఫూర్తిగా క్షమాపణ కోరాలి. (రెండవ రమజాన్ అయిన వెంటనే ఉపవాసాల ‘ఖజా పూర్తి చేయాలి). ఎందుకంటే ఏ కారణం లేకుండా ఒక రమజాన్ వదిలేసిన ఉపవాసాలకు ‘ఖజా’ రెండవ రమజాన్ వరకు ఆలస్యము చేయరాదు. విశ్వాసుల మాత హ॥ ఆయషా (రజియల్లాహు అనా) హదీసు ప్రకారం :
“నా ఉపవాసాలు మిగిలిపోయేవి అయితే నేను ‘షాబాన్ మాసం’లో వాటి ‘ఖజా’ను పూర్తి చేసేదాన్ని”.
(పై హదీసు ద్వారా ఒక రమజాన్ ఉపవాసాల ‘ఖజా’ రెండవ రమజాన్ తరువాత వరకు ఆలస్యం చేయటం తగదని మనకు బోధ పడుతుంది. కనుక ఇలాంటి స్త్రీలు తమ కర్మ నిమిత్తం అల్లాహ్ సన్నిధిలో మనసారా మన్నింపుకై వేడుకోవాలి. అంతే కాక రెండవ రమజాన్ తరువాత వదిలేసిన ఉపవాసాల ‘ఖజా’ కూడా పూర్తిచేయాలి.
ప్ర- 21 : ఒక వేళ స్త్రీ మధ్యాహ్నం తరువాత అనగా ఒంటి గంట తరువాత ఋతుస్రావానికి గురైంది. ఇంకా ఆమె ఇంతవరకు ‘జొహర్’ నమాజు పాటించలేదు. అయితే ఆమె పరిశుద్ధురాలైన తరువాత
ఆ (జొహర్) నమాజు ‘ఖజా’ చేయవలసి వుంటుందా?
జ : ఈ సమస్యలో ఇస్లామీయా విద్వాంసుల్లో భేదాభిప్రాయాలున్నాయి. కొందరు ఇలా అంటున్నారు:
పై పేర్కొన్న స్త్రీ పై ఆ నమాజు ‘ఖజా’ తప్పనిసరి (‘వాజిబ్) కాదు. ఎందుకంటే ఆమె ఎటువంటి ఆటంకాలు చేయలేదు. మరి పాపానికీ పాల్పడలేదు. ఎందుకంటే ఆమె ఆ నమాజును దాని చివరి సమయం వరకు ఆలస్యంగా చదవవచ్చు.
కానీ మరి కొందరు విద్వాంసులైతే ఇలా అంటున్నారు: ఆమె పై ఆ నమాజు ‘ఖజా’ పూర్తి చేయవలసి వుంటుంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించిన ఈ హదీసు అపరిమితమైనది.
“ఎవరైతే నమాజులోని ఒక రకాతు పొందాడో అతను(పూర్తి) నమాజు పొందాడు (పొందినట్లే)”.
అయినా జాగ్రత్త గల విషయం ఏమిటంటే ఆమె ఆ నమాజు ‘ఖజా’ పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఒక నమాజు మాత్రమే కదా! దాని ‘ఖజా’ చదువుకోవటానికి స్త్రీకి పెద్దగా ఇబ్బంది గాని కష్టం గాని వుండదు.
22: గర్భవతి ఒక వేళ ప్రసవించటానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు రక్తాన్ని చూసినట్లైతే దాని కారణంగా ఆమె నమాజు, ఉపవాసం వదిలివేయాలా? (విరమించుకోవాలా?)
జ: గర్భవతి ఒక వేళ ప్రసవించటానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు రక్తాన్ని చూసింది. పురిటినొప్పులు కూడా గ్రహించింది. అయితే అది బాలింత దశానికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. కనుక దాని కారణంగా ఆమె నమాజు, ఉపవాసం వదిలివేయాలి. కాకపోతే రక్తస్రావంతో పాటు పురిటినొప్పులు రానప్పుడు అది చెడు రక్తంగా నిర్ధారించబడుతుంది. దానికి ఎటువంటి విలువ లేదు. ఇంకా ఈ రక్తం నమాజు మరియు ఉపవాసానికి ఆటంకం కాదు.
ప్ర-23: అందరితో పాటు ఉపవాసం వుండాలనే నేపంతో నెలసరిని నిర్మూలించె (అరికట్టే) మందులు వాడటం పట్ల మీ అభిప్రాయం ఏమిటి?
జ: నేనైతే దీనిని గట్టిగా వారిస్తున్నాను. ఎందుకంటే డాక్టర్ల ద్వారా విశ్వసనీయంగా తెలిసిన విషయమేమిటంటే ఈ మందుల వల్ల ఎన్నో దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. కనుక స్త్రీలకు హితబోధన చేసేదేమిటంటే ఇది అల్లాహ్ వారిపై నిర్ణయించిన విధిరాత (గుణం). అందుకే అల్లాహ్ నియమించిన విధిపై స్థిరముగా వుండండి. ధార్మికంగా ఎలాంటి ఆటంకాలు లేనప్పుడు ఉపవాసం వుండండి. మరియు ధర్మపరమైన అటంకాలు ఎదురైనప్పుడు అల్లాహ్ నిర్ణయించిన విధిపై అంగీకార నేపంతో ఉపవాసం వదిలివేయండి.
ప్ర- 24 : ఒకరు ఇలా ప్రశ్నిస్తున్నారు: ఒక స్త్రీ భర్తతో సంభోగం, నెలసరితో చెయించి పరిశద్ధురాలైన రెండు మాసాల తరువాత చిన్న చిన్న రక్తపు బొట్టులను గ్రహించింది. అయితే ఈ స్థితిలో ఆమె నమాజు, ఉపవాసము పాటించాలా? లేక విడిచిపెట్టాలా?
నెలసరి మరి సంభోగానికి సంబంధించి స్త్రీలకు అనేక కష్టాలున్నాయి. దానికి ఒక కారణం నెలసరి నిరోధక, గర్భ నిరోధక మాత్రలు వాడటం కూడా వుంది. పూర్వం ఇలాంటి సందేహాలకు తావువుండేది కాదు. ఇది వాస్తవమే! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తరువాత నుంచే కాదు స్త్రీ ఉనికి ఏర్పడినప్పటి నుంచే సందేహాలు వున్నాయి. కానీ సందేహాల తీవ్రత ఎంత పెరిగిందంటే మానవుడు వాటిని పరిష్కరించుటలో అల్లాడిపోవటం అనేది ఎంతో బాధకరమైన (విచిత్రమైన) విషయం.
కాని ఈ కోవలో సాధారణమైన సూత్రం ఏమిటంటే స్త్రీ పరిశుద్ధు రాలైనప్పుడు నెలసరిలో ఖచ్చితంగా పరిశుద్ధతను గ్రహిస్తే (అంటే మహిళలు గుర్తించే ఆ తెలుపు నీళ్ళు ఆమెకు కానవస్తే) ఆ నీళ్ళు మట్టిరంగులా వున్నా, లేదా పసుపు రంగుకు దగ్గరగా వున్నా, లేదా చుక్కైనా, లేదా చెమ్మైనా ఇవన్నీ నెలసరిలో పరిగణించ బడవు. అందుకే ఆమెకు నమాజు, ఉపవాసానికి ఎలాంటి ఆటంకం లేదు. ఆమె తన భర్తతో లైంగిక వ్యవహారాల్లో కూడ ఆటంకం లేదు. ఎందుకంటే ఇవన్నీ నెలసరికి సంబంధించినవి కావు. దీనికి ఈ వాక్యాలే ఆధారం :
హ॥ ఉమ్మె అతియా (రజియల్లాహు అన్హా) కథనం “మేము పసుపు రంగుకు వున్న నీళ్ళకు ఎలాంటి దగ్గర వున్న లేదా మట్టి రంగులా ప్రాధాన్యత నిచ్చేవారము కాదు”. (సహీహ్ బుఖారి)
ఇమామ్ అబూదావూద్ (రహిమహుల్లాహ్) ప్రస్తావించిన వాక్యాల్లో “తుహుర్” (పరిశుద్ధత) అనే పదం ఎక్కువగా వుంది. (అంటే పరిశుద్ధురాలైన తరువాత మేము పసుపు రంగుకు దగ్గరలా వున్నా లేదా మట్టిరంగులా వున్న నీళ్ళకు ఎలాంటి ప్రాధాన్యత నిచ్చేవారము కాదు). ఈ హదీసు ‘సనద్’ (పరంపర) పటిష్ఠమైనది.
దీన్నిబట్టి మనం ఇలా చెప్పవచ్చు ఏమిటంటే పరిశుద్ధత గురించి నమ్మకం ఏర్పడిన తరువాత ఇలాంటిది ఏదైన వ్యక్తమైనప్పుడు అది స్త్రీకి నష్టం కల్గించదు. ఇంకా ఆమెకి నమాజు, ఉపవాసాలు, భర్తతో లైంగిక వ్యవహారాల నుండి ఎలాంటి ఆటంకం వుండదు. కానీ ఆమెపై విధిగా వున్న విషయం ఏమిటంటే ఆమె పరిశుద్ధతను గ్రహించనంత వరకు తొందర పడకూడదు. ఎందుకంటే కొందరు స్త్రీలు రక్తం నిలిచిన వెంటనే పరిశుద్ధతను గ్రహించకుండానే తొందరపాటుతో స్నానము చేసి పరిశుద్ధులైనట్లు భావిస్తారు.
ఈ కారణంగానే విశ్వాసుల మాత హ॥ ఆయిషా (రజియల్లాహు అన్హా) వద్దకు ‘సహాబియాత్’ (రజియల్లాహు అన్హుం) ‘కురు’ రక్తంతో తడిసిన దూదిని పంపించేవారు. అయితే ఆమె (ర.అ.హ) వారికి “తెలుపు చూడ నంతవరకు తొందర పడకండి” అని బదులిచ్చేవారు.
ప్ర -25 : కొందరు స్త్రీలకు ఏకదాటిగా రక్తం వస్తూనే వుంటుంది. మరి కొన్ని సారైతే ఒకటి రెండు రోజుల విరామం తరువాత మళ్ళీయధావిధిగా రావటం మొదలవుతుంది. ఇలాంటప్పుడు వారికి నమాజు, ఉపవాసాలు, ఇతరత్రా ఆరాధనల గురించి ఎలాంటి సూచనలున్నాయి?
జ : ఇస్లామీయా ధార్మిక విద్వాంసుల్లో ఒక పెద్ద వర్గం అభిప్రాయం ఏమిటంటే ఒకవేళ స్త్రీకి ఏదైన ప్రత్యేకమైన నియమం (పరిమిత కాలం) వుంటే దాన్ని పూర్తి చేసి స్నానం చేయాలి. తరువాత నమాజు, ఉపవాసాలు పాటించాలి. అయితే రెండు లేక మూడు రోజుల తరువాత రక్తం చూసినా అది నెలసరి కాదు. ఎందుకంటే ఈ ఇస్లామీయా విద్వాంసుల దృష్టిలో ‘తుహుర్’ (పరిశుద్ధత) కు కనీస వ్యవధి 13 రోజులు వుంది.
మరి కొందరి అభిప్రాయం ఏమిటంటే : “ఎప్పుడైతె ఆమె రక్తం గ్రహిస్తుందో అప్పడు అది నెలసరిగా పరిగణించబడుతుంది. గ్రహించనప్పుడు పరిశుద్దురాలుగా పరిగణించబడుతుంది. ఒకవేళ రెండు నెలసరిల కాలం మధ్యలో 13 రోజుల వ్యవధి లేకున్న సరె.
ప్ర -26 : స్త్రీలు పవిత్ర రమజాన్ మాసపు రాత్రుల్లో ఇంటిలో నమాజు చేయుట ఉత్తమమా? లేదా మసీదులో చేయుట ఉత్తమమా? ప్రత్యేకించి మసీదుల్లో హితబోధన, ధార్మిక ప్రసంగ కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్న సందర్భములో? అంతేకాక మసీదులో నమాజు పాటించే స్త్రీలకు మీరు ఏలాంటి హితబోధనలు చేయదలుచుచున్నారు?
జ: స్త్రీ తన ఇంట్లో నమాజ్ పాటించడమే ఉత్తమం. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించిన హదీసు విశాలమైనది: “స్త్రీలకు వారి ఇల్లు నమాజుకై ఎంతో మేలైనది”
అంతే కాకుండా దీనికై స్త్రీలు ఇంటి నుండి బయటకు వెళ్ళుట అనేక సందర్భాల్లో క్లిష్టపరిస్థితులతో కూడుకున్న సమస్యే. అందుకే ఆమె ఇంట్లో నమాజు పాటించడం మసీదు వెళ్ళటానికంటే మేలైనది. అయితే హితబోధన, ధార్మిక ప్రసంగాలు వినాలంటే అది కేసెట్ల ద్వారా కూడ వినవచ్చు. ఏ స్త్రీలు నమాజు కొరకు మసీదుకు వెళ్తున్నారో వారికి నా హితోపదేశం ఏమిటంటే వారు ఎలాంటి అలంకరణను వ్యక్తపరచకూడదు. సువాసనలు వెలువడే వస్తువులు (ఫర్ ఫ్యూమ్, సెంటు లాంటివి) వాడరాదు
ప్ర-27 – స్త్రీ పవిత్ర రమజాన్ మాసంలో ఉపవాసస్థితిలో వంట రుచిని పరీక్షించగలదా? వాటి పట్ల ఆదేశం ఏముంది?
జ: అత్యవసరమైనప్పుడు పరీక్షించటంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ రుచి పరీక్షించిన తరువాత దానిని ఉమ్మివేయాలి (తినరాదు).
ప్ర-28: ఒక స్త్రీ గర్భం దాల్చిన తొలిరోజుల్లో యాక్సిడెంట్ కు గురైంది. విపరీతంగా రక్తం పోవడం వల్ల గర్భం పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఉపవాసాలు పూర్తిచేయాలా? లేదా విరమించుకోవాలా? ఒక వేళ ఉపవాసం విరమించుకుంటే ఆమె పాపానికి గురికాదా?
జ: మా అభిప్రాయం ఏమిటంటే గర్భవతికి నెలసరి రాదు. ఇమామ్ అహ్మద్ (రహ్మతుల్లాహి అలైహ్) వ్యాఖ్యానం ప్రకారం : ‘స్త్రీలకు నెలసరి ఆగితేనే గర్భం గురించి అవగాహన కలుగుతుంది‘. నెలసరి గురించి విద్యావంతులు ఇలా వ్యాఖ్యానిస్తున్నారు : ‘అల్లాహ్ దానిని తల్లి గర్భములో ఉన్న శిశువుకు పోషకాహారంగా మలచాడనే విషయం బోధపడుతుంది. అందుకే గర్భం ఏర్పడినప్పుడు నెలసరి రావటం ఆగిపోతుంది‘.
కానీ కొంతమంది స్త్రీలకు గర్భం తరువాత కూడ యధా ప్రకారం నెలసరి వస్తూనే వుంటుంది. అటువంటి స్త్రీలకు ఆదేశం ఏమిటంటే వారి నెలసరి అసలైన నెలసరి కాదు. ఎందుకంటే అది గర్భప్రభావం లేకుండా వస్తుంది. ఇలాంటి నెలసరి గల స్త్రీలకు కూడ సాధారణ (గర్భమేతర) నెలసరి స్త్రీలకు వర్తించే ఆదేశాలే వర్తిస్తాయి. వారిని దేని నుండి నివారించబడిందో వాటి నుండి వీరు కూడా దూరంగా వుండాలి.
సంక్షిప్తంగా గర్భవతికి వచ్చే రక్తం రెండు రకాలు: ఒక రకమైన రక్తంపై నెలసరి ఆదేశాలు వర్తిస్తాయి. అది ఎలాంటిదంటే గర్భం దాల్చిన తరువాత కూడ మునుపటిలాగే రక్తం వస్తుంది. అంటే అది గర్భప్రభావానికి లోను కాదు. కనుక అది నెలసరిగానే పరిగణించబడుతుంది. రెండో రకం రక్తం ఎలాంటిదంటే ఏదైన యాక్సిడెంట్ కారణంగా లేదా ఏదైన బరువు ఎత్తిన కారణంగా లేదా పడిపోయిన కారణంగా అకస్మాత్తుగా వచ్చేది. అయితే ఇది నెలసరి కాదు. నరములోని రక్తం. కనుక ఇది నమాజుకి ఉపవాసానికి అటంకం కల్గించదు. అంతేకాక వీరు పరిశుద్ధులుగా పరిగణించబడతారు.
యాక్సిడెంట్ కారణంగా గర్భంలోనున్న శిశువు లేద గర్భం కోల్పోవుట జరిగినప్పుడు ధార్మిక విద్యావంతులు రెండు విధాలుగా వ్యాఖ్యానించారు: మొదటి సందర్భం ఏమిటంటే గర్భంలో వున్న శిశువు రూపురేఖలు దాల్చుకొని పడిపోయినప్పుడు దాని తరువాత వచ్చే రక్తాన్ని బాలింతదశకు సంబంధించిన రక్తస్రావంగా పరిగణించబడుతుంది. ఆ రోజుల్లో ఆమె నమాజు, ఉపవాసాలు పాటించరాదు. పరిశుద్దురాలైనంతవరకూ ఆమె భర్త కూడ ఆమెతో లైంగిక వ్యవహారాలకు దూరంగా వుండాలి. రెండవ సందర్భం : ఏమిటంటే గర్భము పడిపోయిన సమయములో లోపల వచ్చే రూపురేఖలు దాల్చుకోవటం జరగలేదు. అలాంటప్పుడు దాని తరువాత రక్తం చెడు రక్తంగా పరిగణించ బడుతుంది. దాని వల్ల నమాజు, ఉపవాసాలు ఇంకా ఇతర విషయాలకు అది ఏమి ఆటంకంకాదు.
ఇస్లామీయ ధార్మిక విద్వాంసులు ఇలా ప్రస్తావిస్తున్నారు : సృష్టి ఆకారం వ్యక్తం కావటానికి కనీస కాలం 81 రోజులవుతుంది. అబ్దుల్లా బిన్ మసూద్ (రజియల్లాహు అన్హు) కధనం : దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు : ” ప్రతి వ్యక్తి తన తల్లి గర్భములో నలభై రోజుల వరకు వీర్యముగా వుంటాడు. ఇంకా అంతే కాలం వరకు రక్తపు ముద్దగా వుంటాడు. అంతే కాలం వరకు మాసపు ముద్దలా వుంటాడు. అప్పుడు అతని వద్ద దైవదూత పంపబడతాడు. ఆ దైవదూతకు నాలుగు విషయాల గురించి సూచించడం జరుగుతుంది. కనుక ఆ దైవదూత అతని ఆహారము (ఉపాధి), అతని జీవిత కాలం, అతని కర్మము, ఇంకా అతను పుణ్యాత్ముడా లేక పాపిష్ఠుడా అనే విషయాలను వ్రాసివేస్తాడు“.
కనుక ఈ గడువు కంటే ముందు గర్భంలో శిశువుకు జీవం వ్యక్తం లేదు. అంతేకాక కొందరు జ్ఞానుల అభిప్రాయం ప్రకారం సాధారణంగా 90 రోజుల కంటే ముందు జీవం బయటపడదు.
ప్ర-29: ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది: మూడో నెలలో నా గర్భము పోయింది. పరిశుద్ధులు అయ్యేంతవరకు నేను నమాజు చదవలేదు. నా పై నమాజ్ పాటించుట తప్పనిసరి (వాజిబ్) అని కొందరు చెప్పారు. ఇప్పుడు నేను ఏమిచేయాలి? నాకైతే ఖచ్చితంగా ఆ రోజుల సంఖ్య గుర్తులేదు?
జ : ధార్మిక విద్వాంసుల అభిప్రాయం ఏమిటంటే స్త్రీ మూడు నెలల గర్భాన్ని కోల్పోయినప్పుడు ఆమె నమాజు చదవదు. ఎందుకంటే ఆమె కోల్పోయిన శిశువు రూపురేఖలు వ్యక్తమైవుంటే ఆ సందర్భములో వచ్చే రక్తం బాలింతదశానికి సంబంధించిన రక్తస్రావం. ఆ స్థితిలో స్త్రీ నమాజు పాటించకూడదు. ధార్మిక విధ్వాంసులు ప్రస్తావన ఏమిటంటే శిశువు రూపురేఖలు 81రోజులు నిండిన తరువాతే వ్యక్తమవుతాయి. అయితే ఈ కాలం మూడు మాసాలకంటే తక్కువగా ఉంది.
ఒక వేళ స్త్రీ కోల్పోయిన శిశువు మూడు నెలలు పూర్తిచేసుకుందనే నమ్మకం వుంటే అలాంటప్పుడు వచ్చే రక్తం బాలింత దశకి చెందిన రక్తస్రావం అవుతుంది. ఒక వేళ గర్భం 80 రోజుల కంటే ముందే పడిపోతే అలాంటి సందర్భములో వచ్చే రక్తం చెడు రక్తమే. కానీ దాని మూలంగా ఆమె నమాజు వదలకూడదు.
అయితే పై పేర్కొనబడిన స్త్రీ తన జ్ఞాపకంతో బాగా ఆలోచించాలి. ఒకవేళ ఆమె గర్భం 80 రోజుల పూర్తికాక ముందే పడిపోయివుంటే అప్పుడు ఆమె నమాజుల ఖజా (బదులుగా) చేయాలి. ఒకవేళ వదిలివేసిన నమాజుల సంఖ్య తెలియనప్పుడు అయినంత వరకు అంచనావేసి ఎక్కువ శాతం దేనిపై అవగాహన కుదిరితే దాని ప్రకారం నమాజుల ‘ఖజా’ (బదులుగా) చేయాలి.
ప్ర-30: ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది: తనపై ఉపవాసాలు విధి (ఫర్జ్) అయినప్పటి నుండి ఆమె రమజాన్ మాసపు ఉపవాసాలు పాటిస్తుంది. కాని వాటిలో మిగిలిపోయిన ఉపవాసాలకు ‘ఖజా’ (బదులు) వుండట్లేదు. ఎందుకంటే ఆమె వదిలిపెట్టిన ఉపవాసాల సంఖ్య ఆమెకు తెలియదు. అయితే ఈ స్థితిలో ఆమెపై ఏది తప్పనిసరి (వాజిబ్) అవుతుంది?
జ: సాక్షాత్తు ముస్లిముల నుండి ఇలాంటి వాక్యాలు వింటున్నందుకు మాకు చాలా బాధగా వుంది. (ఫర్జ్) ఉపవాసాలు ‘ఖజా’ చేయకపోవడానికి కారణం తెలియక (అవగాహన లేకపోవడం) లేక బద్దకం వలన జరుగుతుంది. అయితే ఈ రెండు కూడా ఇబ్బందికరమైన విషయాలే. తెలియని విషయాలకు వైద్యం జ్ఞానం (అవగాహన) నేర్చుకోవాలి. విద్యావంతులతో తెలుసుకోవాలి. కాని బద్దకానికి వైద్యం ఏమంటే అల్లాహ్ భయ భీతిని అలవర్చుకోవాలి, ఆయన శిక్షకు భయపడాలి, ఆయన ఆజ్ఞల వైపు ముందడుగు వేయాలి.
పై పేర్కొనబడిన స్త్రీ పై తప్పనిసరి (వాజిబ్) ఏమిటంటే ఆమె తన వల్ల జరిగిన పొరపాటుకు అల్లాహ్ సమక్షంలో మనసారా కోరుతూ పశ్చాత్తాప పడాలి. ఎన్ని రోజుల ఉపవాసాలు మిగిలిపోయాయో తన శక్తి మేరకు అంచనావేసి ‘ఖజా’ చేయాలి. అప్పుడే ఆమె తనపై వున్న విధిని పూర్తి చేసుకోగలదు. అల్లాహ్ వారి క్షమాపణను అంగీకరించుగాక… ఆమీన్
ప్ర- 31: ఒకామె ఇలా ప్రశ్నిస్తుంది …. ‘ఏమంటే నమాజు సమయం ప్రారంభం అయిన తరువాత స్త్రీకి నెలసరి వస్తే దాని గురించి ఆదేశం ఎలా వుంది? ఇంకా పరిశుద్ధురాలు అయిన తరువాత ఆమె పై ఆ నమాజు ఖజా (బదులు) చేయటం (వాజిబ్) తప్పనిసరా? మరి ఇలాగే ఆమె నమాజు చివరి సమయం దాటిపోక ముందే పరిశుద్ధురాలైతే దాని గురించి ఆదేశం ఎలా వుంది?’
జ: ఒకటి : నమాజు సమయం ప్రారంభం అయిన తరువాత స్త్రీకి నెలసరి వచ్చినప్పుడు ఆమె ఒకవేళ అప్పుడు వరకు నమాజు పాటించకుండా వుండి వుంటే ఆమె పరిశుద్దురాలైన తరువాత ఆ నమాజుని ‘ఖజా’ చేయాలి. ఎందుకంటే ఆ నమాజు సమయంలో ఆమె నెలసరి కల్గియున్నది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “ఎవరైనా నమాజులోని ఒక ‘రకాత్” పొందినా అతను నమాజు పొందినట్లే.”
కనుక స్త్రీకి ఏదైన ఒక నమాజులోని ఒక ‘రకాత్’ చదివే సమయం దొరికినప్పుడు ఆమె ఆ నమాజు చదవటానికి ముందే నెలసరికి గురైతె పరిశుద్ధురాలైన తరువాత ఆ నమాజుకి ‘ఖజా’ చేయాలి.
రెండు : నమాజు సమయం పూర్తి అవ్వక ముందే ఒకవేళ ఆమె నెలసరి నుండి పరిశుద్దురాలైతె ఆమెపై ఆ నమాజు ‘ఖజా’ చేయటం తప్పని సరవుతుంది. ఉదాహరణకు ఒకవేళ సూర్యోదయాని కంటే ముందు కేవలం ఒక రకాత్ చదవగలిగే సమయం వున్నప్పుడు ఆమె నెలసరి నుండి పరిశుద్ధురాలైతె ఫజర్ నమాజు ‘ఖజా’ చేయటం తప్పనిసరి. అలాగే సూర్యస్తమయాని కంటే ముందు కేవలం ఒక ‘రకాత్’ చదవగలిగే సమయం వున్నప్పుడు ఆమె నెలసరి నుండి పరిశుద్ధురాలైతె ‘అస్ర్’ నమాజు ‘ఖజా’ చదవటం తప్పనిసరి. అలాగే అర్థరాత్రి పూర్తి కావటాని కంటే ముందు కేవలం ఒక ‘రకాత్’ చదవగలిగే సమయం వున్నప్పుడు ఆమె నెలసరి నుండి పరిశుద్ధురాలైతె ‘ఇషా’ నమాజు ‘ఖజా’ చదవటం తప్పనిసరి. ఒకవేళ అర్ధరాత్రి తరువాత ఆ స్త్రీ పరిశుద్దురాలైతె ఆమె పై ‘ఇషా’ నమాజు ‘ఖజా’ చదవటం తప్పనిసరి కాదు (అవసరం లేదు). కాకపోతే సమయం అయిన తరువాత ‘ఫజర్’ నమాజు చదవటం ‘వాజిబ్’ (తప్పనిసరి). పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు :
فَإِذَا اطْمَأْنَنتُمْ فَأَقِيمُوا الصَّلَاةَ ۚ إِنَّ الصَّلَاةَ كَانَتْ عَلَى الْمُؤْمِنِينَ كِتَابًا مَّوْقُوتًا
“శాంతి కల్గినప్పుడు నమాజు స్థాపించండి, వాస్తవంగా నమాజు విశ్వాసుల పై నిర్ణీతసమయాల్లో విధియయై ఉంది”. (అన్-నిసా 04:103)
అంటే నమాజు నిర్ణీత సమయాల్లో విధిగా వుంది. కనుక నమాజును నిర్ణీత సమయం నుండి విడదీయటం గాని లేదా నిర్ణీత సమయం కాక ముందే నమాజు చదవటం గాని మానవునికి తగని విషయం.
32 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది: ‘నాకు నమాజు మధ్యలోనే నెలసరి వచ్చేసింది’ నేను ఏమి చేయను? నెలసరి కాలంలో వదిలిపెట్టిన నమాజుల ‘ఖజా’ చదవాలా?
జ: నమాజు సమయం మొదలైన అయిన తరువాత స్త్రీకి నెలసరి వస్తే, ఉదాహరణకు: మిట్టమధ్యాహ్నం సూర్యుడు ఒకింత వాలిన అరగంట తరువాత ఆమెకు నెలసరి వస్తే, నెలసరి నుండి పరిశుద్ధురాలైన తరువాత ఏ నమాజు సమయం ఆమెకి చేరుకుందో ఆ నమాజు ‘ఖజా’ చేయాలి. ఎందుకంటే ఆ సమయంలో ఆమె పరిశుద్ధురాలుగా ఉన్నది. పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు:
إِنَّ الصَّلَاةَ كَانَتْ عَلَى الْمُؤْمِنِينَ كِتَابًا مَوْقُوتًا
“నిస్సందేహంగా నమాజు విశ్వాసుల పై నిర్ణీత సమయాల్లో విధియయైఉంది“. (అన్-నిసా 4:103)
స్త్రీ పై నెలసరి కాలంలో వదిలిపెట్టిన నమాజుల ఖజా లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: ఇలా జరగట్లేదా? ఏమంటే స్త్రీ నెలసరిలో ఉన్నప్పుడు నమాజు చదవదు ఉపవాసం వుండదు? అంతేకాక ధార్మిక విద్వాంసులందరూ ఏకీభవిస్తున్నది ఏమంటే స్త్రీ నెలసరి కాలంలో వదిలి వేసిన నమాజుల ఖజా చేయనక్కరలేదు. కాని ఆమె నెలసరితో పరిశుద్దు రాలైనప్పుడు ఒక రకాత్ లేదా దానికంటే ఎక్కువ చదవగలిగే సమయం వుంటే, ఏ నమాజు సమయంలో ఆమె పరిశుద్ధురాలైందో నమాజు ఖజా చేయాల్సి వుంటుంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు :
“ఎవరైతే సూర్యస్తమయాని కంటే ముందు అన్రి నమాజులోని ఒక రకాత్ పొందినట్లైతే అతను అస్ర్ నమాజు పొందినట్లే”
కనుక నెలసరి గల స్త్రీ ‘అన్రి’ సమయంలో సూర్యస్తమయానికంటే ముందు ఒక రకాత్ చదవగలిగే సమయం వున్నప్పుడు ఆమె నెలసరితో పరిశుద్ధురాలైతె లేదా సూర్యోదయాని కంటే ముందు కేవలం ఒక రకాత్ చదవగలిగే సమయం వున్నప్పుడు ఆమె నెలసరితో పరిశుద్దురాలైతె, ముందు పేర్కొన్న ప్రకారం ‘అస్రో’ నమాజు, తరువాత పేర్కొన్న ప్రకారం ఫజర్ నమాజు చదవవలసి వుంటుంది.
ప్ర- 33: ఒకరు ఇలా ప్రశ్నిస్తున్నారు: మా అమ్మగారి వయసు 65 సంవత్సరాలు కావచ్చింది. 19 సంవత్సరాల నుండి వారికి ఏలాంటి సంతానం కలుగలేదు, కాని ఒక మూడు సంవత్సరాల నుండి వారికి రక్తస్రావం జరుగుతుంది. చూడటానికి ఏదో జబ్బులాగానే కనబడుతుంది. అయితే పవిత్ర రమజాన్ మాసం నెల సమీపంలో వుంది. అందుకని దయచేసి ఆమె గురించి తమరు ఎలాంటి ఆదేశాలు లేక హితబోధనలు చేయగలరో తెల్పండి? ఇంకా దయచేసి ఇది కూడ తెలుపగలరు – ఏమంటే ఇటువంటి స్త్రీలు ఏమి చేయవలెను?
జ: ఇలాంటి స్త్రీ అంటే రక్తస్రావం జరిగే స్త్రీకై ఆదేశం ఏమంటే ప్రస్తావించిన జబ్బు రాకముందు ఆమె నెలసరి కాలం ఎంత వుందో అన్నిరోజులు ఆమె నమాజు మరియు ఉపవాసం వదిలివేయాలి. ఒకవేళ ఆమెకి సాధారణంగా ప్రతి నెల మొదటి 6 రోజులు నెలసరి వస్తూవున్నట్లైతే ప్రతి నెల మొదటి 6 రోజులు ఆమె నమాజు, ఉపవాసం వదిలివేయాలి. ఆ ఆరు రోజులు పూర్తి అయిన తరువాత స్నానం చేసి నమాజు చదవాలి, ఉపవాసం వుండాలి. ఇలాంటి స్త్రీలకు నమాజు చదివే పద్ధతి ఎలాగంటే తమ మర్మాంగాన్ని శుభ్రముగా కడుక్కొని దానిపై ఏదైన గుడ్డ కట్టుకోవాలి. తరువాత ‘వజు’ చేసుకుని నమాజ్ చేయాలి. ఇలా ‘ఫర్జ్’ నమాజు సమయాల్లో ప్రవేశించిన తరువాత చేయాలి. ఇలాగే ‘ఫర్జ్’ నమాజు కాకుండా ‘నఫిల్’ చదవాలన్న కూడ ఇదే విధానాన్ని పాటించాలి.
పై పేర్కొనబడిన స్థితిలో కష్టము ఇబ్బంది కారణంగా ఇలాంటి స్త్రీ ‘జొహర్’ను ‘అస్ర్’తో, మరి ‘మఘ్రిబ్’ను ‘ఇషా’తో కలిపి చదవవచ్చు. ఎందుకంటే ఆమె ఒక సారి చేసుకున్న (‘వజు’ మరి శుచిశుభ్రతలు) రెండు నమాజులకి ఉపయోగపడాలని. అంటే ఒక సారి చేసిన వజు, శుభ్రతలు ‘జొహర్’ మరియు ‘అస్ర్’కి, ఇంకో సారి ‘మఘ్రిబ్’ మరియు ‘ఇషా’కి. అలాగే ఇంకోసారి చేసేది ‘ఫజర్’కు (ఉపయోగపడుతుంది). ఈ విధంగా ఐదు సార్లకు బదులు మూడుసార్లే సరిపోతుంది.
ఈ విషయాన్ని మరోసారి వివరిస్తున్నాను. పేర్కొనబడిన స్త్రీ తన మర్మాంగాన్ని శుభ్రముగా కడుక్కొని దానిపై ఏదైన గుడ్డతో పట్టి కట్టుకోవాలి. ఎందుకంటే వచ్చే రక్తం అదుపులో వుండటానికి. తరువాత ‘వజు’ చేసి నమాజ్ చదవాలి. ‘జోహర్’ 4 రకాతులు చదవాలి, అస్ర్ 4 రకాతులు చదవాలి, మఘ్రిబ్ 3 రకాతులు చదవాలి, ‘ఇషా’ 4 రకాతులు చదవాలి, ఇంకా 2 రకాతులు ఫజర్ చదవాలి. అంటే ఈ నమాజుల్లో ఆమె ‘ఖస్ర్’ (అంటే ప్రయాణ సమయములో చదివే సగం నమాజు) చేయకూడదు. ఎందుకంటే కొందరు ఇలాంటి భ్రమలో ఉన్నారు. కాకపోతే ఆమెకి సౌక్యరం కల్పించబడింది ఏమంటే ‘జొహర్’, ‘అన్రి’ రెండు నమాజులు కలిపి, ‘మఘ్రిబ్’, ‘ఇషా’ రెండు నమాజులు కలిపి చదవవచ్చు. అంటే ‘జొహర్’ నమాజ్తో ‘అస్ర్’ నమాజుని కలుపుకొని లేదా ‘అస్ర్’ నమాజ్తో ‘జొహర్’ని కలుపుకొని చదవవచ్చు. అలాగే ‘మఘ్రిబ్’ నమాజు’తో ‘ఇషా నమాజు’ని లేదా ‘ఇషా’తో మఘ్రిబ్’ని కలుపుకొని, ‘జమ’ చేసి చదవవచ్చు. దీనిని ‘జమ-తాఖీర్’ లేదా ‘జమ-తఖ్దీమ్’ అని అంటారు).
ఇంకా అదే ‘వజు’తో ‘నఫిల్ నమాజులు కూడా చదవవచ్చు ఎలాంటి అభ్యతరం లేదు.
ప్ర-34: ప్రసంగాలు మరియు ఖుత్బా వినటానికి నెలసరిగల స్త్రీ ‘మస్జిద్-హరాం’లో ఆగుట సరైనదేనా?
జ : నెలసరిగల స్త్రీ ‘మస్జిద్-హరాం’లో గాని లేదా వేరే ఏ మస్జిద్ లోనూ గాని అగుట సరైనది కాదు. కాకపోతే మస్జిద్ నుండి దాటుట (వెళ్ళుట), ఇంకా అవసరాన్ని బట్టి ఏదైనా వస్తువు తీసుకొనుట చేయవచ్చు. ఎలాగంటే “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హ॥ ఆయిషా (రజియల్లాహు అన్హా) ను ‘ ముసల్లా’ (జానిమాజ్: నమాజ్ చేయడానికి ఉపయెగించె చాప) అడిగారు. దానికి ఆమె ఇలా అన్నారు: ‘ముసల్లా’ మసీదులో వుంది. (అప్పుడు ఆమె నెలసరితో వున్నారు) అయితె ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు : ” నీ నెలసరి నీ చేతుల్లో (అంటుకొని) లేదు”.
కనుక నెలసరిగల స్త్రీకి మసీదులో రక్తము చిమ్మే భయం లేనప్పుడు ఆమెకి మసీదు నుండి వెళ్ళటంలో ఎటువంటి అభ్యతరం లేదు. కాని కూర్చునే ఉద్దేశంతో మసీదులో ప్రవేశించకూడదు. దీనికి ఆధారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘ఈద్’ (పండుగ) నమాజుకై పడుచువాళ్ళకు, స్త్రీలకు, నెలసరిగల స్త్రీలకు ‘ఈద్గాహ్’ వెళ్ళాలని ఆదేశించారు. కాని నెలసరిగల స్త్రీలకు ‘ఈద్గాహ్’ నుండి దూరంగా వుండాలని ఆదేశించారు. ఆ మాటే దీనికి ఆధారం. ఏమంటే, ‘ఖుత్బా’ వినటానికి లేదా ప్రసంగాలు వినటానికై నెలసరిగల స్త్రీ మసీదులో ఆగరాదు.
ప్ర-35 : స్త్రీ యోని నుండి తెల్లటి లేదా పసుపచ్చ రంగులో వెలువడే ద్రవం పరిశుభ్రమేనా? లేదా అపరిశుభ్రమా? ఒకవేళ అది నిరంతరంగా వస్తున్నప్పుడు వజు చేయటం ‘వాజిబ్’ (తప్పనిసరి) అవుతుందా? ఒక వేళ అది క్రమ క్రమంగా వస్తున్నప్పుడు దాని ఆదేశం ఏమిటి? ప్రత్యేకించి విద్యావంతులైన స్త్రీలు ఇది సహజంగా వస్తూవుండే తడి, కాబట్టి దీనికి వజు చేయనవసరం లేదు అని భావిస్తున్నారు. ఇలా భావించవచ్చా?
జ: అనేక విశ్లేషణలు, విచారణల అనంతరం నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే స్త్రీ యోని నుండి తెల్లటి లేదా పసుపచ్చ రంగులో వెలువడే ద్రవం మూత్రాశయం నుండి కాకుండా గర్భాశయం నుండి వస్తుంటే అది పరిశుభ్రమే. అది పరిశుభ్రమైనప్పటికి కూడా ‘వజు’కి భంగం వాటిల్లుతుంది. ఎందుకంటే ‘వజు’ను భంగపరిచే అంశాలపై ఈ షరతు విధించబడలేదు. అంటే వెలువడే వస్తువు అపరిశుభ్రమై వుండాలని షరతు విధించబడలేదు.
ఉదాహరణకు గాలి (మలవిసర్జన దారి) నుండి వెలువడుతుంది. అయితే ఆ గాలికి శరీరం, ఆకారం వుండవు. అయినా.. అది ‘వజు’ను భంగపర్చుతుంది. అందుకే స్త్రీ ‘వజు’తో వున్నప్పుడు ఆమె యోని నుండి ఏదైన ద్రవం వెలువడితే ఆమె ‘వజు’ భంగపడుతుంది. ఆమె మరలా ‘వజు’ చేయవలసి వుంటుంది.
ఈ ద్రవం ఒకవేళ నిరంతరం వెలువడుతుంటే అప్పుడు అది ‘వజు’ ‘కి భంగం కల్గించదు. కానీ ఇటువంటి సందర్భములో ఆ స్త్రీ ఏమిచేయాలంటే నమాజు సమయం అయినప్పుడు ఆమె నమాజు కోసం ‘వజు’ చేసుకొని ఆ ‘వజు’తో ఫర్జ్, సున్నత్, నఫిల్ నమాజులను సలపాలి. ఖుర్ఆన్ పారాయణం చేయదలుచుకుంటే చేయాలి. అలాగే పరిశుద్ధ స్థితిలో ఆమెకు ఏఏ పనులు వర్తిస్తాయో వాటిలో తలుచుకున్నవి చేయవచ్చు.
ఇస్లామీయ విద్యావంతులు మూత్ర వ్యాధిగ్రస్థుడికి సంబంధించి ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. ఇది గర్భాశయం నుండి వెలువడే ద్రవానికి ఆదేశం, ఈ తడి పరిశుభ్రమే. కాని క్రమ క్రమంగా వచ్చిన పక్షంలో వజుకి భంగం కల్గిస్తుంది. ఒకవేళ నిరంతరంగా వస్తే వజుకి భంగం కలిగించదు. కాకపోతే అలాంటి సందర్భంలో స్త్రీ తప్పనిసరిగా నమాజు సమయం ప్రారంభమైన తరువాత ‘వజు’ చేయాలి. యోనిపై గుడ్డ లేక మరేదైనా కట్టుకోవాలి. ఒకవేళ ఈ ద్రవం క్రమ క్రమంగా వస్తూవుండి నమాజు సమయంలో ఆగిపోతున్నట్లైతే అప్పుడు ఆమె అది ఆగిపోయేంత వరకు నిరీక్షించి నమాజును ఆలస్యం చేయాలి. అలస్యం అంటే నమాజు సమయం దాటిపోయే వరకు నిరీక్షించరాదు. ఒకవేళ నమాజు సమయం దాటిపోయే ప్రమాదం వున్నప్పుడు వజూ చేసుకుని ఆ ద్రవం కారకుండా గుడ్డ లేక మరేదైనా ఏర్పాటు చేసు (కట్టు) కొని నమాజు చదువుకోవాలి.
అయితే కారే ద్రవం స్వల్పమైనా లేక అధికమైనా రెండింటికి ఒకటే ఆదేశం. ఎందుకంటే యోని నుండి వెలువడే ప్రతీది ఎక్కువైనా తక్కువైనా అది వజు ని భంగపర్చుతుంది. దీనికి భిన్నంగా శరీరములోని వేరే ఏ భాగం నుండైన వెలువడేవి (రక్తం, లేక వాంతు). ఇవి వజుని భంగపరచవు. అవి ఎక్కువైనా తక్కువైనా కూడ.
అయితే కొందరు స్త్రీలు ఇది సహజమైనది కాబట్టి ‘వజు’కు భంగం వాటిల్లదు’ అనే అభిప్రాయం కలిగివున్నారు. నాకున్న జ్ఞానం మెరకు దీనికి సంబంధించి ఎటువంటి ఆధారము లేదు. కాని ఇబ్నె హజ్మ్ రహ్మతుల్లాహి అలైహి అభిప్రాయం ఒకటుంది. అదేమిటంటే దీనితో వజు భంగం కాదు. అయితే ఆయన ఈ అభిప్రాయానికి సంబంధించి ఏ ఆధారం ప్రస్తావించ లేదు. “కితాబ్ వ సున్నత్” లేదా సహాబాల (అనుచరుల) అభిప్రాయాలతో ఏమైన ఆధారం ఇచ్చివుంటే ఖచ్చితంగా అది పటిష్టమైన ఆధారంగా భావించవచ్చు.
ఏదేమైనా స్త్రీ ఈ విషయంలో అల్లాహ్ కు భయపడాలి. శుచి శుభ్రతల పట్ల ఎంతో మక్కువ కలిగి వుండాలి. ఎందుకంటే శుభ్రత లేకుండా వంద సార్లు నమాజు చదివినా అది వృధాయే. అల్లాహ్ సమక్షంలో అంగీకార యోగ్యం కాదు. ఈ విషయంలో ఇస్లామీయ విద్వాంసులు ఎంతవరకు అభిప్రాయపడ్డారంటే ఎవరైతే శుచి, శుభ్రత లేకుండా నమాజు చదువుతారో వారు కాఫిర్ (అవిశ్వాసి) అని కూడా చెప్పారు. ఎందుకంటే ఇది అల్లాహ్ పట్ల మరి ఆయన ఆయతుల పట్ల ఎగతాళి చేసినట్లే.
36 : ఒక స్త్రీకి యోని నుండి ఈ తడి నిరంతరం వస్తుంది. ఆమె ఒకవేళ ఏదైన ఫర్జ్ నమాజుకై వజు చేసిన తరువాత ఆ వజుతో మరో నమాజు సమయం వచ్చే వరకు నఫిల్ నమాజులు చదవవచ్చా? పవిత్ర ఖుర్ఆన్ పారాయణం చేయవచ్చా?
జ : పై పేర్కొనబడిన స్త్రీ ఏదైన ఫర్జ్ నమాజుకై దాని తొలి సమయంలో వజు చేసి ఆ వజుతో మరో ఫర్జ్ నమాజు సమయం వచ్చే వరకు ఎన్ని ‘నఫిల్ నమాజులైన, ఎన్ని ఫర్జ్ నమాజులైన చదువుకోవచ్చు. ఖుర్ఆన్ పారాయణమూ చేసుకోవచ్చు.
ప్ర -37 : పై పేర్కొనబడిన స్త్రీ ‘ఫజర్’ ‘వజు’తో ‘ఛాష్త్’ నమాజు పాటించుట సరైనదేనా?
జ : సరైనది కాదు. ఎందుకంటే ‘ఛాష్త్’ నమాజు సమయం ఒక నిర్ణీత సమయం. అందుకే ఆ సమయం వచ్చిన తరువాత వజూ చేయడం తప్పనిసరి. ఎందుకంటే పై పేర్కొనబడిన స్త్రీ రక్తస్రావం గల స్త్రీ ఆదేశంలో వుంది. రక్తస్రావం గల స్త్రీకి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి నమాజుకు ‘వజు’ చేయాలని ఆదేశించారు.
ఛాష్త్ నమాజ్ :సూర్యోదయం తరువాత పాటించే నమాజు
కితాబ్-వ- సున్నత్ : పవిత్ర ఖుర్ఆన్, హదీసులను అంటారు.
ప్ర -38 : పై ప్రస్తావించబడిన స్త్రీ ఇషా ‘వజు’తో అర్ధరాత్రి దాటిన తరువాత ‘తహజ్జుద్’ (రాత్రి నమాజు) నమాజు పాటించవచ్చా? తెలుపగలరు.
జ : పాటించకూడదు. ఈ విషయంలో రెండు అభిప్రాయాలున్నాయి
ఒక అభిప్రాయం : అర్ధరాత్రి దాటిన తరువాత ఆమె మరలా (కొత్తగా) ‘వజు’ చేయుట ‘వాజిబ్’ (తప్పనిసరి).
రెండవ అభిప్రాయం : కొత్తగా వజు చేయుట(వాజిబ్) కాదు కాబట్టి పాటించవచ్చు).
అయితే రెండవ అభిప్రాయమే ఉత్తమమైనది.
ప్ర -39 : ‘ఇషా’ నమాజు సమయం ఎప్పటి వరకు ఉంటుంది? దానిని ఎలా తెలుసుకోవాలి?
జ: ‘ఇషా’ నమాజ్ చివరి సమయం అర్ధరాత్రి వరకు వుంటుంది. దానిని తెలుసుకునే విధానం ఏమిటంటే సూర్యాస్తమయం నుండి ‘ఫజర్ ‘ వరకు మధ్యలోగల సమయాన్ని రెండు భాగాలు చేయాలి. తొలి భాగం పూర్తి అయిన వెంటనే ‘ఇషా’ నమాజు సమయం అయిపోతుంది. ఇంకా రెండో భాగంలో ఉన్న రాత్రి సమయం ‘ఇషా’ సమయం కాదు, ‘ఇషా’ మరియు ‘ఫజర్’ నమాజుల మధ్యలో ఒక విభజనరేఖ సమయంగా పరిగణించబడుతుంది.
ప్ర – 40: పైన ప్రస్తావించిన విషయంలో ఒక స్త్రీకి యోని నుండి ద్రవం (తడి) క్రమక్రమంగా వస్తున్న సందర్భములో ఆమె నమాజుకై ‘వజు’ చేసింది, ‘వజు’ చేసుకున్న తరువాత నమాజు చదవటం ప్రారంభించటానికి ముందే మళ్ళీ అదే పరిస్థితి పునరావృతమైంది. ఆమె ఏమి చేయాలి?
జ: ఇలాంటి పరిస్థితిలో ఆమె ఈ తడి ఆగి పోయేంతవరకు నిరీక్షించాలి. ఆ తరువాత ‘వజు’ చేసుకుని నమాజ్ సలపాలి. ఒకవేళ పరిస్థితి అర్ధం కానప్పుడు అంటే ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు ఆగిపోతుందో అర్ధం కానప్పుడు నమాజు సమయం వచ్చిన తరువాత వజు చేసి నమాజు చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితిల్లో ఆమెపై ఎలాంటి దోషముండదు. (ఇన్షా-అల్లాహ్)
ప్ర-41: పై పేర్కొనబడిన ‘తడి’ (ద్రవం) శరీరానికి లేదా వస్త్రాలకు అంటుకుంటే దాని ఆదేశం ఏమిటి?
జ: ఈ తడి ప్రరిశుభ్రమైన సందర్భములో ఏమి చేయన వసరంలేదు. అదే అపరిశుభ్రమైతే అంటే మూత్రాశయం నుండి వస్తే దానిని కడిగివేయటం తప్పనిసరి.
ప్ర -42 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది : ఒక స్త్రీ యోని నుండి తెల్లటి లేదా పసుపచ్చ ద్రవం వెలువడి నప్పుడు ఆ స్త్రీ ఎలా ‘వజూ’ చేయాలి? సాధారణంగా ‘వజూ’లో శుభ్రపరచుకునే అవయవాలనే శుభ్ర పరచు కుంటే సరిపోతుందా?
జ: సరిపోతుంది. ఆ వెలువడే ద్రవం పరిశుభ్రమైనదైతే సాధారణ ‘వజు’ అవయవాలను శుభ్ర పరచుకుంటే సరిపోతుంది. అంటే అది మూత్రాశయం నుండి కాకుండా గర్భాశయం నుండి వెలువడి వుండాలి.
43: దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ‘సహాబియాత్ ‘ లు ధార్మిక విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువ మక్కువ చూపేవారు. అయితే పైన ప్రస్తావించబడిన (తడితో వజూకు భంగం వాటిల్లుతుందనే) విషయానికి ఆధారంగా ఏ ఒక్క హదీసు ఉల్లేఖించబడలేదు, ఎందుకు?
జ: ఈ విషయంపై ఒక హదీసు కూడా ఉండకపోవడానికి కారణం ఏమిటంటే ఈ పరిస్థితి (తడి రావడం) ప్రతి స్త్రీకి సంబంధించినదికాదు. ప్రతి స్త్రీకి రాదు.
ప్ర -44: ఏ స్త్రీ అయినా పై ప్రస్తావించబడిన సమస్యకు ధార్మిక ఆదేశం తెలియక ‘వజు’ చేయడం లేదు. అలాంటి స్త్రీ ఏమి చేయాలి?
జ: స్త్రీ తప్పనిసరిగా అల్లాహ్ మన్నింపుకై వేడుకోవాలి. మరియు ఇస్లామియ ధార్మిక విద్వాంసులతో ఈ సమస్యను చర్చించి పరిష్కారాన్ని పొందాలి.
ప్ర-45: పై పేర్కొనబడిన సమస్యలో ‘వజు’ చేయవలసిన అవసరం లేదనే అభిప్రాయాన్ని కొందరు మీ (షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్-ఉసైమిన్) అభిప్రాయంగా చెబుతున్నారు. ఇది సత్యమా?
జ: ఎవరైతే ఈ అభిప్రాయాన్ని నాపై మొపుతున్నారో వారు సత్యవంతులు కాదు. వారు నా అభిప్రాయం “ప్రస్తావించబడిన ‘తడి’ పరిశుభ్రమైనది” అనే దానితో అలా భావించి అది ‘వజు’ని భంగపరిచేది కాదు అని తెలుపుతున్నారు. (వాస్తవానికి అది ‘వజు’ను భంగపరిచేదే)
ప్ర – 46 : సాధారణంగా స్త్రీకి నెలసరి రావటానికి దాదాపు ఒక రోజు ముందు మాసిన నీళ్ళు వెలువడతాయి. అయితే దాని ఆదేశం ఏమిటి? ఈ నీళ్ళు అప్పుడప్పుడు సన్నదారం రూపంలో నలుపు లేదా దట్టమైన ఎరుపు రంగులో వుంటాయి. ఒకవేళ ఈ నీళ్ళు నెలసరి తరువాత వస్తే దాని ఆదేశం ఏమిటి?
జ : ఈ నీళ్ళు నెలసరికి తొలి సంకేతాలుగా వుంటే అవి కూడా నెలసరి గానే పరిగణించబడతాయి. దాన్ని ఎలా తెలుసుకోవాలంటే.. సాధారణంగా బహిష్టు సమయంలో స్త్రీలు లోనయ్యే ఆ బాధ, కుదుపు ద్వారా తెలుసుకోవచ్చు.
బహిష్టు తరువాత మాసిన నీళ్ళు వచ్చినప్పుడు స్త్రీకి పరిశుభ్రత కొరకు వేచి చూడవలసి వుంటుంది. ఎందుకంటే నెలసరితో వెంటనే కలిసి వచ్చే నీళ్ళు కూడ నెలసరె అవుతుంది. హ॥ ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపేవారు :
“ మీరు తొందర పడకండి! తెలుపు చూసేంతవరకు నిరీక్షించండి“.
ప్ర-47: బహిష్టు స్త్రీ ‘ఇహ్రామ్’ కట్టుకున్న తరువాత రెండు రకాతులు నమాజు ఎలా చదవాలి? బహిష్టు స్త్రీ మెల్లగా ఖుర్ఆన్ ఆయతుల పారాయణం చేయవచ్చా?
జ : ముందు మనం రెండు విషయాలు తెలుసుకుందాం.
ఒకటి: ‘ఇహ్రామ్’ కు సంబంధించి ప్రత్యేక నమాజ్ అంటూ లేదు. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ కు ప్రత్యేక ‘ఇహ్రామ్’ నమాజు గురించి ఆదేశంగా లేక చేసినట్లు లేక దృవీకరించినట్లు ఆధారాలు లేవు.
రెండు: ఏ స్త్రీ అయితే ఇహ్రం కట్టుకోవటానికి ముందే ఋతుస్రావానికి గురువుతుందో ఆమె అదే స్థితిలో ‘ఇహ్రామ్’ కట్టుకోవచ్చు.
హ॥ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) సతీమణి అస్మా బిన్తె ఉమైస్ (రజియల్లాహు అన్హా) మక్కా మార్గంలో ‘జుల్ హులైఫా’ ప్రదేశంలో రక్తస్రావానికి గురైయ్యారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెని “స్నానం చేసి తన యోనిపై గుడ్డ కట్టుకుని ‘ఇహ్రామ్’ కట్టుకోవాలని” ఆదేశించారు.
అయితే ఋతుస్రావంగల స్త్రీకి కూడా ఆదేశం ఇదే. ఇక వారు పరిశుభ్రమయ్యేంత వరకు ‘ఇహ్రామ్’ నిబంధనల్లోనే ఉండాలి. పరిశుద్ధులైన తరువాత కాబా గృహాన్ని (తవాఫ్ చేయాలి) దర్శించాలి. అలాగే ‘సఫా’, ‘మర్వా’ నడుమ ‘సయీ’ (వేగంగా నడవటం) చేయాలి.
ఇక ఋతుస్రావంగల స్త్రీ ఖుర్ఆన్ పారాయణం చేయవచ్చా..? అనే ప్రశ్నకు సమాధానం ఏమిటంటే అవసరం మేరకు, ముఖ్య కారణంతో పారాయణం చేయవచ్చు. కానీ కేవలం అల్లాహ్ ఆరాధన నిమిత్తం లేక అల్లాహ్ సన్నిధిలో పుణ్యాలు పొందటానికైతే ఆ స్థితిలో చదవకపోవటమే మంచిది.
గమనిక: అవసరం మేరకు, ముఖ్యకారణం అంటే పిల్లలకు బోధించేటప్పుడు, ఎవరైన చదువుతుంటే తప్పులు దిద్దటం, అలాగే రోజువారి ఖుర్ఆన్ ఆయతులు వస్తే దుఆ పరంగా చదవటంలో ఎలాంటి దోషం లేదు.
ప్ర-48 : ఒక స్త్రీ హజ్ కొరకు ప్రయాణించింది. ప్రయాణంలో 5వ రోజు ఆమె ఋతుస్రావానికి గురైంది. ‘మీఖాత్’ వద్దకు చేరి ఆమె స్నానం చేసి ‘ఇహ్రామ్’ కట్టుకుంది. ఆమె ఇంకా ఋతుస్రావ స్థితి నుండి పరిశుద్దురాలు కాలేదు. మక్కా చేరుకున్న తరువాత ఆమె ‘హరం” బయటే నిలిచింది (వెలుపలే ఆగింది). ‘హజ్’, ‘ఉమ్రాహ్’కు సంబంధించి ఆమె ఏ ఒక్క పని కూడ చేయలేదు. రెండు రోజులు ఆమె “మినా” (ప్రదేశం)లో కూడ గడిపింది. తరువాత ఆమె నెలసరి నుండి పరిశుద్ధురాలై స్నానం చేసింది. పరిశుద్ధ స్థితిలో ‘ఉమ్రాహ్ ‘కు సంబంధించి అన్ని కార్యాలు, నియమాలు పూర్తి చేసింది. దాని తరువాత మళ్ళీ ఆమె ‘హజ్’ కొరకు ‘తవాఫ్ – ఇఫాజా’ చేస్తుండగా ఆమెకు మళ్ళీ రక్తస్రావం జరిగింది. సిగ్గుతో ఆమె తమ సంరక్షకులకు చెప్పలేదు. అదే స్థితిలో హజ్ విధానాలను పూర్తిచేసి, స్వస్థలానికి చేరుకున్న తరువాత ఆ విషయాన్ని తన సంరక్షకులకు తెలియపరిచింది. అయితే ఇప్పుడు ఆమెకు ఎలాంటి ఆదేశం వర్తిస్తుంది? .
జ: పై పేర్కొన్న సమస్యకి పరిష్కారం ఏమిటంటే ఆమె తవాఫె – ఇఫాజా’ (తవాఫ్) చేస్తుండగా వచ్చిన రక్తం ఒకవేళ నెలసరి రక్తమైతే (దాన్ని ఆమె రక్తపు స్థితి, బాధతో పసిగట్టగలుగుతుంది) అప్పుడు ఆమె చేసిన ‘తవాఫె ఇఫాజా’ సరైనది కాదు. ఆమె తప్పకుండా మరలా మక్కా వెళ్ళి ‘తవాఫె-ఇఫాజా’ పూర్తి చేయాలి. ‘మీఖాత్’ నుండి ‘ఉమ్రాహ్’ ‘ఇహ్రాం’ కట్టి ‘తవాఫ్ ‘, ‘సయీ’తో సహా ‘ఉమ్రాహ్’ చేయాలి. ‘ఖస్ర్ ‘ చేసి దాని తరువాత ‘తవాఫె ఇఫాజా’ చేయాలి.
అయితే ఒక వేళ ‘తవాఫె-ఇఫాజా’ చేస్తున్న మధ్యలో వచ్చే రక్తం సహజంగా నెలసరిది కాకుండా జన ప్రవాహం కారణంగా లేదా భయం కారణంగా లేదా మరే కారణంగా ఉన్నప్పుడు ఆమె ‘తవాఫె – ఇఫాజా’ ‘తవాఫ్ ‘కు పరిశుద్ధత షరతుగా భావించని వారి పద్ధతి ప్రకారం సరైనదే.
మొదటి విషయంలో : ఆమెకు రెండో సారి మక్కా రావటం అసాధ్యమైనప్పుడు, అంటే ఇతర దేశస్థురాలైనప్పుడు ఆమె ‘హజ్’ సరైనదె. ఎందుకంటే ఆమె ఏదైతే చేసిందో అంతకు మించి చేసే శక్తి, అవకాశం ఆమెకు లేదు.
ప్ర-49 : ఒక స్త్రీ ఉమ్రాహ్ ఇహ్రాం కట్టుకుంది. ‘మక్కా’ చేరే సరికి ఆమెకు నెలసరి మొదలైంది. ఆమెతో పాటు వున్న ‘మహ్రమ్’ కి వెంటనే తిరుగు ప్రయాణం చేయవలసి వుంది. అక్కడ కొన్ని రోజులు ఉండే సౌకర్యం లేదు. పైగా ఆమె అక్కడ ఉండటానికి మక్కా నగరంలో ఆమెకు బంధువు లెవరూ లేరు. ఇలాంటి సందర్భంలో ఆమె ఏమి చేయాలి?
జ.) పై పేర్కొనబడిన స్త్రీ ఒక వేళ అదే ప్రాంతానికి (సౌది అరేబియా) కి చెందినదైతే ఆమె తన ‘మహ్రమ్ ‘ (సంరక్షకుడి) తో తిరిగి వెళ్ళిపోవాలి. ‘ఇహ్రాం’ స్థితిలోనే వుండి, పరిశుద్ధురాలైన తరువాత రెండవ సారి మక్కా నగరానికి రావాలి. ఎందుకంటే ఆమెకు రెండవ సారి రావటం సులువైనదే. ఇందులో ఆమెకు ఎలాంటి అడ్డంకులు లేవు. పాస్పోర్టు కూడ అవసరంలేదు.
కాని ఒకవేళ ఇతర దేశాల నుండి వచ్చివున్నవారైతే ఆమెకు రెండోసారి ప్రయాణం కష్టమైనప్పుడు ఆమె గుడ్డ కట్టుకోవాలి. మరి ‘తవాఫ్ , సయీ’ చేసి ‘ఖస్ర్’ చేసుకొని అదే ప్రయాణంలో తన ‘ఉమ్రాహ్’ పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ‘తవాఫ్’ చేయుట ఒక అత్యవసరమైన ఆదేశంగా భావించబడుతుంది. కనుక అవసరాన్ని బట్టి కొన్ని నిషేధిత అంశాలు కూడా ‘ముబాహ్’ (అనివార్యం) గా పరిగణించ బడతాయి.
ప్ర – 50 :ఒక స్త్రీకి నిర్దేశించబడిన హజ్ రోజుల్లో నెలసరి ప్రారంభమైంది. ఆమె గురించి ఆదేశం ఏమిటి? ఈ హజ్ ఆమెకై పరిపూర్ణమవుతుందా?
జ : ఆమె ఎప్పుడు నెలసరికి గురైందనేది తెలియకుండానే ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వటం అసాధ్యం. ఎందుకంటే హజ్ లో కొన్ని కార్యాలు వున్నాయి. వాటికి నెలసరి ఎలాంటి ఆటంకం కల్గించదు. మరి కొన్ని ఉన్నాయి వాటిని నెలసరిలో చేయకూడదు. కనుక ‘తవాఫ్’ పరిశుభ్రత లేనిదే అసాధ్యం (చేయరాదు). ఇది కాకుండా ఇతరత్రా హజ్ కార్యాలు ఋతుస్రావంలో ఉండి కూడా చేసుకోవచ్చు.
ప్ర- 51 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది: ‘నేను గత సంవత్సరం హజ్ చేశాను. అయితే హజ్ కి సంబంధించి అన్ని కార్యాలు చేశాను. కాని ‘ధార్మిక ఆటంకం’ వల్ల “తవాఫ్ – ఇఫాజా”, “తవాఫె-విదాత్” చేయలేకపోయాను. ఆ తరువాత ఏదో ఒక రోజు మక్కాకు వచ్చి “తవాఫె-ఇఫాజా”, “తవాఫె-విదాత్” చేసుకోవాలనుకుని నా స్వస్థలం మదీనాకు తిరిగి వెళ్ళిపోయాను. దాని గురించి సరైన ధార్మిక అవగాహన లేనందువల్ల అన్నింటి నుండి ‘హలాల్’ కూడా అయిపోయాను. ‘ఇస్లామ్’ స్థితిలో ఏ ఏ విషయాలకు దూరంగా (‘హరాం’ అవుతాయో) ఉండాలో వాటికి దూరంగా ఉండలేదు. ఈ విషయమై (మక్కా తిరిగి రావటం, తవాఫ్ చేయటం గురించి)కొందరిని సంప్రదించినప్పుడు వారు ఇలా సమాధానమిచ్చారు: ‘మీరు చేసిన ‘తవాఫ్ ‘ సరైనది కాదు. ఎందుకంటే మీరు మీ ‘హజ్’ను వృధా చేసుకున్నారు. కనుక వచ్చే సంవత్సరము మరో సారి ‘హజ్’ చేయాలి. అంతే కాకుండా దానితో పాటు ఒక ఆవు, లేదా ఒక ఒంటే ఫిద్యహ్’ (పరిహారం)గా ‘జిబహ్’ చేయవలసి వుంటుంది’. సందేహం ఏమిటంటే పై ప్రస్తావించబడిన సమాధానం వ్యాధి సరైనదేనా? లేదా నా సమస్యకు వేరే పరిష్కారం ఏమైనా వుందా? నిజంగా నా ‘హజ్’ వృధాయిపోయిందా? నా పై రెండో సారి హజ్ చేయటం ‘వాజిబ్’ (తప్పని సరా)? ఇప్పుడు నేను ఏమి చేయాలో తెల్పండి. అల్లాహ్ మీకు శుభాలు కలుగ చేయుగాక.!
జ :నేడు మన సమాజంలో ఇది కూడా ఒక సమస్యగా మారిపోయింది. ప్రజలు జ్ఞానం లేకుండా ‘ఫత్వా’ ఇస్తున్నారు. పై పేర్కొనబడిన విధంగానైతే మీరు మక్కా వెళ్ళి కేవలం ‘తవాఫ్-ఇఫాజా’ మాత్రం చేయటం వాజిబ్ (తప్పనిసరి) అవుతుంది.
మక్కా నుండి బయలుదేరినప్పుడు మీరు నెలసరితో వున్నారు. కాబట్టి మీపై తవాఫ్-విదాత్ వాజిబ్ (తప్పనిసరి) కాదు. ఎందుకంటే ఋతుస్రావం గల స్త్రీ పై తవాఫ్-విదాత్ లేదు.
హ॥ ఇబ్నె అబ్బాస్ (రజియల్లాహు అన్ను) ఉల్లేఖించిన ఒక హదీసులో ఇలా ఉంది :
“ప్రజలకు ఈ ఆజ్ఞ ఇవ్వబడింది ఏమంటే బైతుల్లా (కాబా గృహము) తవాఫ్(కాబా ప్రదక్షిణం) వారి చివరి కార్యం కావాలని, అయితే నెలసరిగల స్త్రీ నుండి అది తప్పించబడింది“.
అబుదావూద్ హదీసు గ్రంథంలో ఇలా ఉల్లేఖించబడి వుంది:
“బైతుల్లాహ్ లో ప్రజల (యాత్రికుల) చివరి కార్యం తవాఫ్ కావాలి”.
హ॥ ‘సుఫియా’ (రజియల్లాహు అన్హా ) తవాఫె -ఇఫాజా చేసుకున్నారు (దాని తర్వాతే ఆమెకు నెలసరి ప్రారంభమైంది) అనే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిసినప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు : “అయితే బయలుదేరండి!”
ఈ హదీసు ఆధారం ఏమంటే నెలసరి గల స్త్రీ పై ‘తవాఫె -విదాత్’ లేదు. కాని ‘తవాఫె -ఇఫాజా’ తప్పని సరి.
ఇక మీరు అన్నింటి నుండి ‘హలాల్’ అయిపోయినదాని గురించి ఏమిటంటే ఇది (ధార్మిక జ్ఞానము లేనందున) తెలియనందున జరిగిన విషయం. కనుక ఇది మీకు ఎలాంటి నష్టం కల్గించదు. ఎందుకంటే ఎవరైనా తెలియకుండా ‘ఇహ్రాం’ స్థితిలో నివారించబడిన ఏదైన కార్యానికి పాల్పడితే దానికి ఎలాంటి పరిహారం లేదు. పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
رَبَّنَا لَا تُؤَاخِذْنَا إِنْ نَسِينَا أَوْ أَخْطَأْنَا
“ ఓ మా ప్రభువా! మేము మరచిపోయినా, లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు”.(బఖరా 2:286)
దాసుడు ఇలా అడిగినప్పుడు అల్లాహ్ దానిని అంగీకరించి సమాధానంగా ఇలా సెలవిచ్చాడు:
وَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ فِيمَا أَخْطَأْتُمْ بِهِ وَلَكِنْ مَا تَعَمَّدَتْ قُلُوبُكُمْ
“మరుపు వల్ల మీ చేత ఏదైన (తప్పు) జరిగిపోతే దాని పాపం మీపై ఉండదు. అయితే హృదయ పూర్వకంగా చేసిన పక్షంలో అది పాపమే“. (33: అల్ అహ్ జాబ్ :5)
కనుక జాగ్రత్త పడవలసినవన్నీ దేనినైతే అల్లాహ్ మహ్రమ్ కై వారించాడో ఒకవేళ తెలియకుండా లేదా మరచిపోయి వాటిని చేస్తే లేదా మరో దారి లేని పరిస్థితిలో పాల్పడితే అలాంటి పరిస్థితుల్లో అతని పై ఎలాంటి దోషం లేదు. కానీ ఆ స్థితి మారిపోయినప్పుడు దాని నుండి దూరమవ్వట తప్పనిసరవుతుంది.
ప్ర-52 : బాలింతదశకు చెందిన రక్తస్రావం గల స్త్రీకి ఒక వేళ ‘తర్వియహ్’ రోజు (జిల్ హిజ్జ 8వ తేది) రక్తస్రావం మొదలైయింది. కాని ఆమె ‘తవాఫ్’, ‘సయీ’ తప్ప ‘హజ్’కు సంబంధించిన అన్నీ పనులు పూర్తిచేసుకుంది. అయితే పది రోజుల తరువాత ఆమె తొలిదశగా పరిశుద్ధురాలైనట్లు భావించింది. అప్పుడు ఆమె స్వయంగా పరిశుద్ధురాలుగా నిర్ధారించుకుని మిగిలిన పనులు అంటే ‘తవాఫె ఇఫాజా’ చేసుకోవచ్చా?
జ: పై పేర్కొనబడిన స్త్రీకి పరిశుద్ధతపై పూర్తిగా విశ్వాసము కలగనంత వరకు ఆమె స్నానము చేసి తవాఫ్ చేయరాదు. ఎందుకంటే ప్రశ్నలో ప్రస్తావించిన తీరులో ‘తొలిదశ’తో ఆమె ఇంకా పూర్తిగా పరిశుద్ధతకు నోచుకోలేదన్న విషయం వ్యక్తమవుతుంది. కనుక ఆమె పూర్తిగా పరిశుద్ధతను గ్రహించిన తరువాతే స్నానము చేసి ‘తవాఫ్’, ‘సయీ’ చేయాలి. ఒక వే ‘తవాఫ్ ‘ కంటే ముందు ‘సయీ’ చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ‘హజ్జతుల్-వదాత్’ సందర్భములో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ‘ఎవరైన ముందు ‘సయీ’ చేసుకుంటే? అని సంప్రదించినప్పుడు .. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఎలాంటి దోషం లేదు” అని సమాధానమిచ్చారు.
ప్ర- 53 : ఒక స్త్రీ నెలసరి స్థితిలో “సైల్” ప్రదేశం నుండి హజ్ ‘ఇహ్రాం” కట్టుకుంది. మక్కా వెళ్ళిన తరువాత ఏదో అవసరం పై ‘జిద్దాహ్’ ‘వెళ్ళింది. ‘జిద్దాహ్’ లోనే నెలసరి నుండి పరిశుద్దురాలైంది. స్నానం చేసి తలదువ్వుకుని తరువాత తన ‘హజ్’ను పూర్తిచేసుకుంది. అయితే ఆమె ‘హజ్’ సరైనదేనా? ఆమెపై ఇంకేమైన బాధ్యత వుంటుందా?
జ : పై ప్రస్తావించబడిన స్త్రీ ‘హజ్’ సరైనదే. ఆమె పై ఎలాంటి బాధ్యత లేదు.
ప్ర – 54 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది: ‘నేను ఉమ్రాహ్ చేయటానికి బయలుదేరాను. ‘మీఖాత్’ చేరుకున్నప్పుడు నేను నెలసరితో వున్నాను కనుక నేను ‘ఇహ్రామ్’ కట్టుకోలేదు. పరిశుద్ధురాలైనంత వరకు మక్కాలోనే ఉన్నాను. తరువాత మక్కానుండి ‘ఇహ్రామ్’ కట్టుకున్నాను. అయితే ఇది సరైనదేనా? నా పై ఏమి వాజిబ్ వుంది?
జ : పై పేర్కొనబడిన పద్ధతి సరైనది కాదు. ఏ స్త్రీ అయితే ఉమ్రాహ్ సంకల్పం కలిగివుందో ఆమెకు ‘ఇహ్రామ్’ లేకుండా ‘మీఖాత్’ నుండి ముందుకు వెళ్ళటం సరైనది కాదు. ఒకవేళ ఆమె నెలసరితో వున్నా సరే. నెలసరి స్థితిలోనే ఆమె ‘ఇహ్రామ్’ కట్టుకోవాలి. ఆమె కట్టుకునే ఈ ఇహ్రామ్ సరైనదే.
దీనికి ఆధారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘హజ్జతుల్-వదా (అంతిమ హజ్) సంకల్పంతో ‘జుల్ హులైఫా’ ప్రాంతములో వున్నప్పుడు హ॥ అబూ-బక్ర్ సిద్దీఖ్ (రజియల్లాహు అన్హు) సతీమణి ‘అస్మా బిన్తె ఉమైస్’ (రజియల్లాహు అన్హా) కు ఒక శిశువు జన్మించింది. అప్పుడు ‘అస్మా’ (రజియల్లాహు అన్హా) ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియపరచి ఈ పరిస్థితిలో తాను ఏమి చేయాలి? అని కబురు పంపారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు :
“స్నానం చేసి (యోనిపై) గుడ్డ కట్టుకోవాలి. తరువాత ‘ఇహ్రామ్’ వేసుకోవాలి”.
నెలసరి రక్తం కూడ రక్తస్రావం (బాలింతదశ) ఆదేశాల పరిధిలోనే వస్తుంది. కనుక నెలసరిగల స్త్రీకి మా సూచనేమిటంటే ‘ఆమె ‘హజ్’ లేదా ‘ఉమ్రాహ్’ సంకల్పముతో ‘మీఖాత్’ ప్రదేశము నుండి వెళ్ళినప్పుడు స్నానము చేసి యోని పై గుడ్డ కట్టుకోవాలి. తరువాత ‘హజ్’ లేదా ‘ఉమ్రాహ్’ ‘ఇహ్రామ్’ కట్టుకోవాలి. కాకపోతే ‘ఇహ్రామ్’ కట్టుకొని పవిత్ర మక్కా చేరుకున్న తరువాత పరిశుద్ధురాలైనంత వరకు ‘మస్జిదే-హరామ్’లో ప్రవేశించ కూడదు. కాబా గృహానికి ప్రదక్షిణం చేయరాదు. ఎందుకంటే హ॥ ఆయిషా (రజియల్లాహు అన్హా)కు ‘ఉమ్రాహ్’ మధ్యలోనే ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు (నెలసరి వచ్చినప్పుడు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు ఇలా సూచించారు:
“హాజీలు చేసినట్టే నీవు కూడ చేయ్యి. కాకపోతే పరిశుద్ధురాలైనంత వరకు కాబా గృహాన్ని ‘తవాఫ్ ‘ చేయకు”. (సహీహ్ బుఖారి, సహీహ్ ముస్లిం)
‘సహీహ్ బుఖారి’లోని మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది : హ॥ ఆయిషా (రజియల్లాహు అన్హా ) ఇలా తెలిపారు :
“ఆమె పరిశుద్ధు రాలైనప్పుడు కాబా గృహానికి ప్రదక్షిణం చేశారు. ‘సఫా-మర్వా’ మధ్య ‘సయీ’ కూడా చేశారు”.
పై ఉల్లేఖనాల ద్వారా తెలిసేదేమిటంటే స్త్రీ నెలసరి కాలంలోనే ‘హజ్’ లేదా ‘ఉమ్రాహ్’ ‘ఇహ్రామ్ కట్టుకోవాలి. లేదా ‘తవాఫ్ ‘ చేయటానికి ముందే నెలసరి ప్రారంభమైనప్పుడు పరిశుద్ధురాలై స్నానం చేయనంత వరకు ‘తవాఫ్ ‘ మరి ‘సయీ’ చేయకూడదు. ఒకవేళ ఆమె పరిశుద్ధ స్థితిలో ‘తవాఫ్ ‘ చేసింది, దాని తరువాత ఆమెకు నెలసరి ప్రారంభమైనప్పుడు ఆమె అదే పరిస్థితిలో తన ‘ఉమ్రహ్ ను పూర్తిచేస్తుంది. ‘సయీ’ చేస్తుంది, తల వెంట్రుకలు కత్రిస్తుంది. ఎందుకంటే సఫా’, ‘మర్వా’ మధ్య ‘సయీ చేయటానికి పరిశుభ్రత అనే షరతు విధించబడలేదు.
ప్ర – 55: ఒకరు ఇలా ప్రశ్నిస్తున్నారు: ‘నేను నా భార్యతో ‘యమ్ బ’ పట్టణం నుండి ‘ఉమ్రహ్’ కొరకు వచ్చాను. జిద్దాహ్ చేరుకున్నప్పుడు నా భార్యకు ఋతుస్రావం మొదలైంది. కనుక నేను ఒకణ్ణి ‘ఉమ్రహ్’ చేసుకున్నాను. అయితే ఇప్పుడు నా భార్యకు ఎలాంటి ఆదేశాలు వుంటాయి?
జ: ఇలాంటి పరిస్థితిల్లో మీ భార్య సమస్యకు పరిష్కారం ఏమిటంటే ఆమె పరిశుద్ధురాలైనంత వరకు నిరీక్షించి ఆ తరువాత తన ‘ఉమ్రహ్’ పూర్తి చేయాలి. ఎందుకంటే విశ్వాసులు మాతృమూర్తి హ॥ సఫియ (రదియల్లాహు అన్హా) కు నెలసరి మొదలైనప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి సల్లం) ఇలా అన్నారు: “ఏమిటి మాకు ఈమె ప్రయాణం నుండి ఆపేస్తుందా?” ప్రజలు ఇలా అన్నారు : ఓ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమె ‘తవాఫె -ఇఫాజా’ అయితే చేసుకున్నది. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “అయితె బయలుదేరుదాం“.
పై హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన “ఏమిటి మాకు ఈమె ప్రయాణం నుండి ఆపేస్తుందా?” మాట ఆధారంగా స్త్రీకి ఒకవేళ ‘తవాఫె -ఇఫాజా’ కంటే ముందు నెలసరి వస్తే ఆమె పరిశుద్ధురాలైనంత వరకు నిరీక్షించి దాని తరువాత ‘తవ్వా ఫె-ఇఫాజా చేయటం తప్పనిసరి ‘వాజిబ్’గా గుర్తించబడుతుంది.
అలాగే ‘తవాఫె-ఉమ్రహ్’ కూడ ”తవాఫె-ఇఫాజా’ ఆదేశంలోనే వుంది. ఎందుకంటే అది ”ఉమ్రహ్ ‘కు మూల సూత్రం. కనుక ‘ఉమ్రహ్’ చేయదలుచుకునే స్త్రీ ఒకవేళ ‘తవాఫె-ఉమ్రహ్’ కంటే ముందే నెలసరికి గురైతే పరిశుద్ధత కలిగేవరకు నిరీక్షించి దాని తరువాత ‘తవాఫ్ ‘ చేయాలి.
ప్ర – 56 : ‘మస్ఆ’ (సయీ చేసే ప్రాంతం) ‘హరం’ (కాబా చుట్టుప్రక్కల కొంత భాగాన్ని అల్లాహ్ పవిత్ర స్థలంగా నిర్దేశించాడు. అందులో ఎలాంటి రక్తపాతాలు, అపవిత్ర కలాపాలకు పాల్పడరాదు. దానిని ‘హరం’ అంటారు) లో భాగమేనా? నెలసరిగల స్త్రీ ‘మస్ఆ’లో ప్రవేశించ గలుగుతుందా? ‘మస్ఆ’ నుండి ‘హరం’లో ప్రవేశించటానికి ‘తహియ్యతుల్ మస్జిద్’ (మసీదులో ప్రవేశించగానే చదివే నమాజు చదువుట ‘వాజిబా’ (తప్పనిసరా)?
జ: అందరికీ సుపరిచితమైన విషయం ఏమిటంటే ‘మస్ఆ’ (సయీ చేసే ప్రాంతం) ‘హరం’లో భాగం కాదు. ఈ కారణంతోనే దానికి ‘మస్జిదె హరాం’కి మధ్య ఒక చిన్న గోడ నిర్మించబడింది. మస్ఆ ‘హరం’ వెలుపల వుండటమే ప్రజలకు మేలు అని భావించడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒకవేళ దీన్ని ‘హరం’లో భాగమేనని నిర్ధారిస్తే అప్పుడు ‘తవాఫ్ ‘, ‘సయీ’ చేస్తున్న సమయంలో నెలసరికి గురైయ్యే స్త్రీని కూడా ‘సయీ’ చేయకుండా వారించడం జరిగేది.
ఈ విషయంలో నా అభిప్రాయం (‘ఫత్వా’) ఏమిటంటే ఒకవేళ స్త్రీ ‘తవాఫ్ ‘ చేసుకున్న తరువాత ‘సయీ’ చేయటానికి ముందు నెలసరికి గురైతే అప్పుడు ఆమె అదే స్థితిలో ‘సయీ’ చేయవచ్చు. ఎందుకంటే ‘మస్ ఆ’ (సయీ చేసే ప్రాంతం) ‘హరం’తో వేరుగా వుంది.
ఇక ‘తహియ్యతుల్-మస్జిద్’ విషయానికి వస్తే.. ఎవరైన ‘తవాఫ్ ‘ చేసిన తరువాత ‘సయీ’ చేసి, మళ్ళీ ‘మస్జిద్ హరాం’లో రావాలనుకున్నప్పుడు అతనికి ‘తహియ్యతుల్ మస్జిద్’ చదవవలసి వుంటుంది. ఒకవేళ చదవక పోయినా పర్వాలేదు. కాని అల్లాహ్ ప్రసాదించిన ఈ మహత్తర అవకాశాన్ని వినియోగించుకుంటూ, అక్కడ నమాజు చేయుటలో ఉన్న గొప్పతనాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు రకాతుల (తహయ్యతుల్ మస్జిద్) చదువుకోవడమే ఉత్తమమైన కార్యం.
ప్ర – 57 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది : నేను హజ్ చేశాను. హజ్ లో ఉన్నప్పుడే ఋతుస్రావం ప్రారంభమైంది. సిగ్గు, బిడియం కారణంగా ఎవరికీ చెప్పలేకపోయాను. అదే పరిస్థితిలో ‘హరం’లో కూడ ప్రవేశించాను, నమాజు చదివాను, ‘తవాఫ్ ‘, ‘సయీ’ కూడా చేశాను. అయితే ఇప్పుడు నేను ఏమిచేయాలి? ఒకమాట ఏమిటంటే (బాలింత దశ ) రక్తస్రావం తరువాత నెలసరి వచ్చింది.?
జ : నెలసరి, రక్తస్రావంగల స్త్రీ నమాజు ఆ స్థితిలో చేయరాదు. అది మక్కాలో నైనా స్వగ్రామంలో నైనా, మరెక్కడైనా సరే. ఎందుకంటే మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్త్రీ గురించి ఇలా అన్నారు: “ఏమిటి ఇలా లేదా (వాస్తవం కాదా)? ఏమంటే స్త్రీ నెలసరితో వున్నప్పుడు నమాజు చదవదు మరి ఉపవాసం పాటించదు.”
యావత్తు ముస్లిములు ఏకీభవించేది ఏమిటంటే నెలసరి గల స్త్రీ నమాజు చదవకూడదు, ఉపవాసం వుండకూడదు. కనుక పై పేర్కొనబడిన స్త్రీ అల్లాహ్ క్షమాపణ కోరుతూ తనతో జరిగిన ఈ తప్పుకి పశ్చాతాపపడాలి.
ఇక ఈ స్థితిలో ‘తవాఫ్ ‘ చేసే విషయమైతే ఇలా తవాఫ్ చేయుట కూడా సరికాదు. కాని ‘సయీ’ చేయవచ్చు. ఎందుకంటే ఈ విషయంలో ప్రఖ్యాత అభిప్రాయం ఏమిటంటే ‘హజ్’ సందర్భములో తవాఫ్ కంటే ముందు’సయీ’ చేసుకోవచ్చు. కనుక ఆమె రెండోసారి ‘తవాఫ్ ‘ చేయవలసి వుంటుంది. ఎందుకంటే ‘తవాఫ్-ఇఫాజా’ ‘హజ్’ మూల సూత్రాల్లో ఒకటి. అది లేకుండా ‘హలాల్’ కాలేరు (సమ్మత్వాన్ని పొందలేరు). అందుకని ఆ ఒకవేళ వివాహిత అయితే ‘తవాఫ్ ‘ చేయనంత వరకు తన భర్తతో లైంగికంగా దగ్గరకాకూడదు. ఒకవేళ అవివాహితురాలైతే ‘తవాఫ్ ‘ చేయనంత వరకు ‘నికాహ్’ (వివాహం చేసుకోకూడదు.
ప్ర – 58: స్త్రీకి ‘అరఫహ్’ రోజున ఋతుస్రావం మొదలైతే ఏమిచేయాలి?
జ: స్త్రీకి ‘అరఫహ్’ రోజున ఋతుస్రావం మొదలైతే ఇతర హాజీల్లా ఆమె కూడ హజ్జ్ లోని కార్యాలన్ని పూర్తి చేయాలి. కాకపోతే ‘బైతుల్లాహ్’ (కాబాగృహం) తవాఫ్ ‘ చేయరాదు. పరిశుద్ధులయ్యేంత వరకు నిరీక్షించి, పరిశుద్ధులైన తరువాత ‘బైతుల్లాహ్ ‘ (కాబా గృహం) ‘తవాఫ్ చేయాలి.
ప్ర – 59: ఒకవేళ స్త్రీ ‘జమరయె-ఉఖ్బహ్’ పై రాళ్ళు రవ్వినంతరం – ‘తవాఫ్-ఇఫాజా’ కంటే ముందు ఋతుస్రావానికి గురైంది. ఆమె, ఆ ఒక బృందముతో కలిసి ఉన్నారు. ఆమె ప్రయాణం తరువాత తిరిగి మక్కాకు రావటం కష్టం లేక అసాధ్యం. అప్పుడు ఆమె ఏమిచేయాలి?
జ: పై ప్రస్తావించబడిన స్త్రీ మళ్ళీ ‘మక్కా’కు రావటం అసాధ్యమైనప్పుడు అవసర నిమిత్తం ఆమె తన యోనిపై గుడ్డ కట్టుకుని ‘తవాఫ్’ చేసుకోవాలి. అలాగే మిగితా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితిలో ఆమెపై ఎటువంటి పరిహారం వాజిబ్ కాదు.
ప్ర – 60 : రక్తస్రావం గల స్త్రీ ఒకవేళ 40 రోజులకు ముందే పరిశుద్ధురాలైతే ఆమె ‘హజ్’ సరైనదేనా? ఒక వేళ పరిశుద్ధతను గ్రహించకపోతే ఏమిచేయాలి? గమనించవలసిన విషయం ఏమంటే ఆమె ‘హజ్’కై సంకల్పం చేసి వుంది?
జ : రక్తస్రావం గల స్త్రీ ఒకవేళ 40 రోజులకు ముందే పరిశుద్దురాలైనప్పుడు స్నానముచేసి నమాజు చదువుకోవాలి. పరిశుద్ధ స్త్రీలు చేసే కార్యాలన్నీ చేయాలి. చివరికి ‘బైతుల్లాహ్’ (కాబాగృహం) ‘తవాఫ్ ‘ కూడ చేయాలి. ఎందుకంటే రక్తస్రావం కనీస కాలానికి ఎలాంటి పరిమితం లేదు. సంకల్పం సరైనదే. కాకపోతే పరిశుద్ధురాలైనంత వరకు ఆమె ‘బైతుల్లాహ్’ పై పేర్కొనబడిన స్త్రీ పరిశుద్ధతను చూడనప్పుడు ఆమె ‘హజ్’ (కాబా గృహం) ‘తవాఫ్’ చేయకూడదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఋతుస్రావంలో గల స్త్రీని బైతుల్లాహ్ (కాబాగృహం) తవాఫ్ ‘ నుండి వారించారు.
ఈ విషయంలో రక్తస్రావం గల స్త్రీ కూడ నెలసరి గల స్త్రీ ఆదేశంలోనే వుంటుంది
—
నోట్స్:
పుస్తకం నుండి: ఋతుకాలం – సందేహాలు & సమాధానాలు
మూల రచయిత (అరబీ): షేఖ్ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్ ఉసైమీన్ (రహిమహుల్లాహ్)
తెలుగు అనువాదం: హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి హఫిజహుల్లాహ్
మర్కజ్ దారుల్ బిర్ర్ పబ్లికేషన్స్
ప్ర-47: బహిష్టు స్త్రీ ‘ఇహ్రామ్’ కట్టుకున్న తరువాత రెండు రకాతులు నమాజు ఎలా చదవాలి? బహిష్టు స్త్రీ మెల్లగా ఖుర్ఆన్ ఆయతుల పారాయణం చేయవచ్చా?
జ : ముందు మనం రెండు విషయాలు తెలుసుకుందాం.
ఒకటి: ‘ఇహ్రామ్’ కు సంబంధించి ప్రత్యేక నమాజ్ అంటూ లేదు. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ కు ప్రత్యేక ‘ఇహ్రామ్’ నమాజు గురించి ఆదేశంగా లేక చేసినట్లు లేక దృవీకరించినట్లు ఆధారాలు లేవు.
రెండు: ఏ స్త్రీ అయితే ఇహ్రం కట్టుకోవటానికి ముందే ఋతుస్రావానికి గురువుతుందో ఆమె అదే స్థితిలో ‘ఇహ్రామ్’ కట్టుకోవచ్చు.
హ॥ అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) సతీమణి అస్మా బిన్తె ఉమైస్ (రజియల్లాహు అన్హా) మక్కా మార్గంలో ‘జుల్ హులైఫా’ ప్రదేశంలో రక్తస్రావానికి గురైయ్యారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెని “స్నానం చేసి తన యోనిపై గుడ్డ కట్టుకుని ‘ఇహ్రామ్’ కట్టుకోవాలని” ఆదేశించారు.
అయితే ఋతుస్రావంగల స్త్రీకి కూడా ఆదేశం ఇదే. ఇక వారు పరిశుభ్రమయ్యేంత వరకు ‘ఇహ్రామ్’ నిబంధనల్లోనే ఉండాలి. పరిశుద్ధులైన తరువాత కాబా గృహాన్ని (తవాఫ్ చేయాలి) దర్శించాలి. అలాగే ‘సఫా’, ‘మర్వా’ నడుమ ‘సయీ’ (వేగంగా నడవటం) చేయాలి.
ఇక ఋతుస్రావంగల స్త్రీ ఖుర్ఆన్ పారాయణం చేయవచ్చా..? అనే ప్రశ్నకు సమాధానం ఏమిటంటే అవసరం మేరకు, ముఖ్య కారణంతో పారాయణం చేయవచ్చు. కానీ కేవలం అల్లాహ్ ఆరాధన నిమిత్తం లేక అల్లాహ్ సన్నిధిలో పుణ్యాలు పొందటానికైతే ఆ స్థితిలో చదవకపోవటమే మంచిది.
గమనిక: అవసరం మేరకు, ముఖ్యకారణం అంటే పిల్లలకు బోధించేటప్పుడు, ఎవరైన చదువుతుంటే తప్పులు దిద్దటం, అలాగే రోజువారి ఖుర్ఆన్ ఆయతులు వస్తే దుఆ పరంగా చదవటంలో ఎలాంటి దోషం లేదు.
ప్ర-48 : ఒక స్త్రీ హజ్ కొరకు ప్రయాణించింది. ప్రయాణంలో 5వ రోజు ఆమె ఋతుస్రావానికి గురైంది. ‘మీఖాత్’ వద్దకు చేరి ఆమె స్నానం చేసి ‘ఇహ్రామ్’ కట్టుకుంది. ఆమె ఇంకా ఋతుస్రావ స్థితి నుండి పరిశుద్దురాలు కాలేదు. మక్కా చేరుకున్న తరువాత ఆమె ‘హరం” బయటే నిలిచింది (వెలుపలే ఆగింది). ‘హజ్’, ‘ఉమ్రాహ్’కు సంబంధించి ఆమె ఏ ఒక్క పని కూడ చేయలేదు. రెండు రోజులు ఆమె “మినా” (ప్రదేశం)లో కూడ గడిపింది. తరువాత ఆమె నెలసరి నుండి పరిశుద్ధురాలై స్నానం చేసింది. పరిశుద్ధ స్థితిలో ‘ఉమ్రాహ్ ‘కు సంబంధించి అన్ని కార్యాలు, నియమాలు పూర్తి చేసింది. దాని తరువాత మళ్ళీ ఆమె ‘హజ్’ కొరకు ‘తవాఫ్ – ఇఫాజా’ చేస్తుండగా ఆమెకు మళ్ళీ రక్తస్రావం జరిగింది. సిగ్గుతో ఆమె తమ సంరక్షకులకు చెప్పలేదు. అదే స్థితిలో హజ్ విధానాలను పూర్తిచేసి, స్వస్థలానికి చేరుకున్న తరువాత ఆ విషయాన్ని తన సంరక్షకులకు తెలియపరిచింది. అయితే ఇప్పుడు ఆమెకు ఎలాంటి ఆదేశం వర్తిస్తుంది? .
జ: పై పేర్కొన్న సమస్యకి పరిష్కారం ఏమిటంటే ఆమె తవాఫె – ఇఫాజా’ (తవాఫ్) చేస్తుండగా వచ్చిన రక్తం ఒకవేళ నెలసరి రక్తమైతే (దాన్ని ఆమె రక్తపు స్థితి, బాధతో పసిగట్టగలుగుతుంది) అప్పుడు ఆమె చేసిన ‘తవాఫె ఇఫాజా’ సరైనది కాదు. ఆమె తప్పకుండా మరలా మక్కా వెళ్ళి ‘తవాఫె-ఇఫాజా’ పూర్తి చేయాలి. ‘మీఖాత్’ నుండి ‘ఉమ్రాహ్’ ‘ఇహ్రాం’ కట్టి ‘తవాఫ్ ‘, ‘సయీ’తో సహా ‘ఉమ్రాహ్’ చేయాలి. ‘ఖస్ర్ ‘ చేసి దాని తరువాత ‘తవాఫె ఇఫాజా’ చేయాలి.
అయితే ఒక వేళ ‘తవాఫె-ఇఫాజా’ చేస్తున్న మధ్యలో వచ్చే రక్తం సహజంగా నెలసరిది కాకుండా జన ప్రవాహం కారణంగా లేదా భయం కారణంగా లేదా మరే కారణంగా ఉన్నప్పుడు ఆమె ‘తవాఫె – ఇఫాజా’ ‘తవాఫ్ ‘కు పరిశుద్ధత షరతుగా భావించని వారి పద్ధతి ప్రకారం సరైనదే.
మొదటి విషయంలో : ఆమెకు రెండో సారి మక్కా రావటం అసాధ్యమైనప్పుడు, అంటే ఇతర దేశస్థురాలైనప్పుడు ఆమె ‘హజ్’ సరైనదె. ఎందుకంటే ఆమె ఏదైతే చేసిందో అంతకు మించి చేసే శక్తి, అవకాశం ఆమెకు లేదు.
ప్ర-49 : ఒక స్త్రీ ఉమ్రాహ్ ఇహ్రాం కట్టుకుంది. ‘మక్కా’ చేరే సరికి ఆమెకు నెలసరి మొదలైంది. ఆమెతో పాటు వున్న ‘మహ్రమ్’ కి వెంటనే తిరుగు ప్రయాణం చేయవలసి వుంది. అక్కడ కొన్ని రోజులు ఉండే సౌకర్యం లేదు. పైగా ఆమె అక్కడ ఉండటానికి మక్కా నగరంలో ఆమెకు బంధువు లెవరూ లేరు. ఇలాంటి సందర్భంలో ఆమె ఏమి చేయాలి?
జ.) పై పేర్కొనబడిన స్త్రీ ఒక వేళ అదే ప్రాంతానికి (సౌది అరేబియా) కి చెందినదైతే ఆమె తన ‘మహ్రమ్ ‘ (సంరక్షకుడి) తో తిరిగి వెళ్ళిపోవాలి. ‘ఇహ్రాం’ స్థితిలోనే వుండి, పరిశుద్ధురాలైన తరువాత రెండవ సారి మక్కా నగరానికి రావాలి. ఎందుకంటే ఆమెకు రెండవ సారి రావటం సులువైనదే. ఇందులో ఆమెకు ఎలాంటి అడ్డంకులు లేవు. పాస్పోర్టు కూడ అవసరంలేదు.
కాని ఒకవేళ ఇతర దేశాల నుండి వచ్చివున్నవారైతే ఆమెకు రెండోసారి ప్రయాణం కష్టమైనప్పుడు ఆమె గుడ్డ కట్టుకోవాలి. మరి ‘తవాఫ్ , సయీ’ చేసి ‘ఖస్ర్’ చేసుకొని అదే ప్రయాణంలో తన ‘ఉమ్రాహ్’ పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ‘తవాఫ్’ చేయుట ఒక అత్యవసరమైన ఆదేశంగా భావించబడుతుంది. కనుక అవసరాన్ని బట్టి కొన్ని నిషేధిత అంశాలు కూడా ‘ముబాహ్’ (అనివార్యం) గా పరిగణించ బడతాయి.
ప్ర – 50 :ఒక స్త్రీకి నిర్దేశించబడిన హజ్ రోజుల్లో నెలసరి ప్రారంభమైంది. ఆమె గురించి ఆదేశం ఏమిటి? ఈ హజ్ ఆమెకై పరిపూర్ణమవుతుందా?
జ : ఆమె ఎప్పుడు నెలసరికి గురైందనేది తెలియకుండానే ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వటం అసాధ్యం. ఎందుకంటే హజ్ లో కొన్ని కార్యాలు వున్నాయి. వాటికి నెలసరి ఎలాంటి ఆటంకం కల్గించదు. మరి కొన్ని ఉన్నాయి వాటిని నెలసరిలో చేయకూడదు. కనుక ‘తవాఫ్’ పరిశుభ్రత లేనిదే అసాధ్యం (చేయరాదు). ఇది కాకుండా ఇతరత్రా హజ్ కార్యాలు ఋతుస్రావంలో ఉండి కూడా చేసుకోవచ్చు.
ప్ర- 51 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది: ‘నేను గత సంవత్సరం హజ్ చేశాను. అయితే హజ్ కి సంబంధించి అన్ని కార్యాలు చేశాను. కాని ‘ధార్మిక ఆటంకం’ వల్ల “తవాఫ్ – ఇఫాజా”, “తవాఫె-విదాత్” చేయలేకపోయాను. ఆ తరువాత ఏదో ఒక రోజు మక్కాకు వచ్చి “తవాఫె-ఇఫాజా”, “తవాఫె-విదాత్” చేసుకోవాలనుకుని నా స్వస్థలం మదీనాకు తిరిగి వెళ్ళిపోయాను. దాని గురించి సరైన ధార్మిక అవగాహన లేనందువల్ల అన్నింటి నుండి ‘హలాల్’ కూడా అయిపోయాను. ‘ఇస్లామ్’ స్థితిలో ఏ ఏ విషయాలకు దూరంగా (‘హరాం’ అవుతాయో) ఉండాలో వాటికి దూరంగా ఉండలేదు. ఈ విషయమై (మక్కా తిరిగి రావటం, తవాఫ్ చేయటం గురించి)కొందరిని సంప్రదించినప్పుడు వారు ఇలా సమాధానమిచ్చారు: ‘మీరు చేసిన ‘తవాఫ్ ‘ సరైనది కాదు. ఎందుకంటే మీరు మీ ‘హజ్’ను వృధా చేసుకున్నారు. కనుక వచ్చే సంవత్సరము మరో సారి ‘హజ్’ చేయాలి. అంతే కాకుండా దానితో పాటు ఒక ఆవు, లేదా ఒక ఒంటే ఫిద్యహ్’ (పరిహారం)గా ‘జిబహ్’ చేయవలసి వుంటుంది’. సందేహం ఏమిటంటే పై ప్రస్తావించబడిన సమాధానం వ్యాధి సరైనదేనా? లేదా నా సమస్యకు వేరే పరిష్కారం ఏమైనా వుందా? నిజంగా నా ‘హజ్’ వృధాయిపోయిందా? నా పై రెండో సారి హజ్ చేయటం ‘వాజిబ్’ (తప్పని సరా)? ఇప్పుడు నేను ఏమి చేయాలో తెల్పండి. అల్లాహ్ మీకు శుభాలు కలుగ చేయుగాక.!
జ :నేడు మన సమాజంలో ఇది కూడా ఒక సమస్యగా మారిపోయింది. ప్రజలు జ్ఞానం లేకుండా ‘ఫత్వా’ ఇస్తున్నారు. పై పేర్కొనబడిన విధంగానైతే మీరు మక్కా వెళ్ళి కేవలం ‘తవాఫ్-ఇఫాజా’ మాత్రం చేయటం వాజిబ్ (తప్పనిసరి) అవుతుంది.
మక్కా నుండి బయలుదేరినప్పుడు మీరు నెలసరితో వున్నారు. కాబట్టి మీపై తవాఫ్-విదాత్ వాజిబ్ (తప్పనిసరి) కాదు. ఎందుకంటే ఋతుస్రావం గల స్త్రీ పై తవాఫ్-విదాత్ లేదు.
హ॥ ఇబ్నె అబ్బాస్ (రజియల్లాహు అన్ను) ఉల్లేఖించిన ఒక హదీసులో ఇలా ఉంది :
“ప్రజలకు ఈ ఆజ్ఞ ఇవ్వబడింది ఏమంటే బైతుల్లా (కాబా గృహము) తవాఫ్(కాబా ప్రదక్షిణం) వారి చివరి కార్యం కావాలని, అయితే నెలసరిగల స్త్రీ నుండి అది తప్పించబడింది“.
అబుదావూద్ హదీసు గ్రంథంలో ఇలా ఉల్లేఖించబడి వుంది:
“బైతుల్లాహ్ లో ప్రజల (యాత్రికుల) చివరి కార్యం తవాఫ్ కావాలి”.
హ॥ ‘సుఫియా’ (రజియల్లాహు అన్హా ) తవాఫె -ఇఫాజా చేసుకున్నారు (దాని తర్వాతే ఆమెకు నెలసరి ప్రారంభమైంది) అనే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిసినప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు : “అయితే బయలుదేరండి!”
ఈ హదీసు ఆధారం ఏమంటే నెలసరి గల స్త్రీ పై ‘తవాఫె -విదాత్’ లేదు. కాని ‘తవాఫె -ఇఫాజా’ తప్పని సరి.
ఇక మీరు అన్నింటి నుండి ‘హలాల్’ అయిపోయినదాని గురించి ఏమిటంటే ఇది (ధార్మిక జ్ఞానము లేనందున) తెలియనందున జరిగిన విషయం. కనుక ఇది మీకు ఎలాంటి నష్టం కల్గించదు. ఎందుకంటే ఎవరైనా తెలియకుండా ‘ఇహ్రాం’ స్థితిలో నివారించబడిన ఏదైన కార్యానికి పాల్పడితే దానికి ఎలాంటి పరిహారం లేదు. పవిత్ర ఖుర్ఆన్లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
رَبَّنَا لَا تُؤَاخِذْنَا إِنْ نَسِينَا أَوْ أَخْطَأْنَا
“ ఓ మా ప్రభువా! మేము మరచిపోయినా, లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు”.(బఖరా 2:286)
దాసుడు ఇలా అడిగినప్పుడు అల్లాహ్ దానిని అంగీకరించి సమాధానంగా ఇలా సెలవిచ్చాడు:
وَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ فِيمَا أَخْطَأْتُمْ بِهِ وَلَكِنْ مَا تَعَمَّدَتْ قُلُوبُكُمْ
“మరుపు వల్ల మీ చేత ఏదైన (తప్పు) జరిగిపోతే దాని పాపం మీపై ఉండదు. అయితే హృదయ పూర్వకంగా చేసిన పక్షంలో అది పాపమే“. (33: అల్ అహ్ జాబ్ :5)
కనుక జాగ్రత్త పడవలసినవన్నీ దేనినైతే అల్లాహ్ మహ్రమ్ కై వారించాడో ఒకవేళ తెలియకుండా లేదా మరచిపోయి వాటిని చేస్తే లేదా మరో దారి లేని పరిస్థితిలో పాల్పడితే అలాంటి పరిస్థితుల్లో అతని పై ఎలాంటి దోషం లేదు. కానీ ఆ స్థితి మారిపోయినప్పుడు దాని నుండి దూరమవ్వట తప్పనిసరవుతుంది.
ప్ర-52 : బాలింతదశకు చెందిన రక్తస్రావం గల స్త్రీకి ఒక వేళ ‘తర్వియహ్’ రోజు (జిల్ హిజ్జ 8వ తేది) రక్తస్రావం మొదలైయింది. కాని ఆమె ‘తవాఫ్’, ‘సయీ’ తప్ప ‘హజ్’కు సంబంధించిన అన్నీ పనులు పూర్తిచేసుకుంది. అయితే పది రోజుల తరువాత ఆమె తొలిదశగా పరిశుద్ధురాలైనట్లు భావించింది. అప్పుడు ఆమె స్వయంగా పరిశుద్ధురాలుగా నిర్ధారించుకుని మిగిలిన పనులు అంటే ‘తవాఫె ఇఫాజా’ చేసుకోవచ్చా?
జ: పై పేర్కొనబడిన స్త్రీకి పరిశుద్ధతపై పూర్తిగా విశ్వాసము కలగనంత వరకు ఆమె స్నానము చేసి తవాఫ్ చేయరాదు. ఎందుకంటే ప్రశ్నలో ప్రస్తావించిన తీరులో ‘తొలిదశ’తో ఆమె ఇంకా పూర్తిగా పరిశుద్ధతకు నోచుకోలేదన్న విషయం వ్యక్తమవుతుంది. కనుక ఆమె పూర్తిగా పరిశుద్ధతను గ్రహించిన తరువాతే స్నానము చేసి ‘తవాఫ్’, ‘సయీ’ చేయాలి. ఒక వే ‘తవాఫ్ ‘ కంటే ముందు ‘సయీ’ చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ‘హజ్జతుల్-వదాత్’ సందర్భములో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ‘ఎవరైన ముందు ‘సయీ’ చేసుకుంటే? అని సంప్రదించినప్పుడు .. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఎలాంటి దోషం లేదు” అని సమాధానమిచ్చారు.
ప్ర- 53 : ఒక స్త్రీ నెలసరి స్థితిలో “సైల్” ప్రదేశం నుండి హజ్ ‘ఇహ్రాం” కట్టుకుంది. మక్కా వెళ్ళిన తరువాత ఏదో అవసరం పై ‘జిద్దాహ్’ ‘వెళ్ళింది. ‘జిద్దాహ్’ లోనే నెలసరి నుండి పరిశుద్దురాలైంది. స్నానం చేసి తలదువ్వుకుని తరువాత తన ‘హజ్’ను పూర్తిచేసుకుంది. అయితే ఆమె ‘హజ్’ సరైనదేనా? ఆమెపై ఇంకేమైన బాధ్యత వుంటుందా?
జ : పై ప్రస్తావించబడిన స్త్రీ ‘హజ్’ సరైనదే. ఆమె పై ఎలాంటి బాధ్యత లేదు.
ప్ర – 54 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది: ‘నేను ఉమ్రాహ్ చేయటానికి బయలుదేరాను. ‘మీఖాత్’ చేరుకున్నప్పుడు నేను నెలసరితో వున్నాను కనుక నేను ‘ఇహ్రామ్’ కట్టుకోలేదు. పరిశుద్ధురాలైనంత వరకు మక్కాలోనే ఉన్నాను. తరువాత మక్కానుండి ‘ఇహ్రామ్’ కట్టుకున్నాను. అయితే ఇది సరైనదేనా? నా పై ఏమి వాజిబ్ వుంది?
జ : పై పేర్కొనబడిన పద్ధతి సరైనది కాదు. ఏ స్త్రీ అయితే ఉమ్రాహ్ సంకల్పం కలిగివుందో ఆమెకు ‘ఇహ్రామ్’ లేకుండా ‘మీఖాత్’ నుండి ముందుకు వెళ్ళటం సరైనది కాదు. ఒకవేళ ఆమె నెలసరితో వున్నా సరే. నెలసరి స్థితిలోనే ఆమె ‘ఇహ్రామ్’ కట్టుకోవాలి. ఆమె కట్టుకునే ఈ ఇహ్రామ్ సరైనదే.
దీనికి ఆధారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘హజ్జతుల్-వదా (అంతిమ హజ్) సంకల్పంతో ‘జుల్ హులైఫా’ ప్రాంతములో వున్నప్పుడు హ॥ అబూ-బక్ర్ సిద్దీఖ్ (రజియల్లాహు అన్హు) సతీమణి ‘అస్మా బిన్తె ఉమైస్’ (రజియల్లాహు అన్హా) కు ఒక శిశువు జన్మించింది. అప్పుడు ‘అస్మా’ (రజియల్లాహు అన్హా) ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియపరచి ఈ పరిస్థితిలో తాను ఏమి చేయాలి? అని కబురు పంపారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు :
“స్నానం చేసి (యోనిపై) గుడ్డ కట్టుకోవాలి. తరువాత ‘ఇహ్రామ్’ వేసుకోవాలి”.
నెలసరి రక్తం కూడ రక్తస్రావం (బాలింతదశ) ఆదేశాల పరిధిలోనే వస్తుంది. కనుక నెలసరిగల స్త్రీకి మా సూచనేమిటంటే ‘ఆమె ‘హజ్’ లేదా ‘ఉమ్రాహ్’ సంకల్పముతో ‘మీఖాత్’ ప్రదేశము నుండి వెళ్ళినప్పుడు స్నానము చేసి యోని పై గుడ్డ కట్టుకోవాలి. తరువాత ‘హజ్’ లేదా ‘ఉమ్రాహ్’ ‘ఇహ్రామ్’ కట్టుకోవాలి. కాకపోతే ‘ఇహ్రామ్’ కట్టుకొని పవిత్ర మక్కా చేరుకున్న తరువాత పరిశుద్ధురాలైనంత వరకు ‘మస్జిదే-హరామ్’లో ప్రవేశించ కూడదు. కాబా గృహానికి ప్రదక్షిణం చేయరాదు. ఎందుకంటే హ॥ ఆయిషా (రజియల్లాహు అన్హా)కు ‘ఉమ్రాహ్’ మధ్యలోనే ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు (నెలసరి వచ్చినప్పుడు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు ఇలా సూచించారు:
“హాజీలు చేసినట్టే నీవు కూడ చేయ్యి. కాకపోతే పరిశుద్ధురాలైనంత వరకు కాబా గృహాన్ని ‘తవాఫ్ ‘ చేయకు”. (సహీహ్ బుఖారి, సహీహ్ ముస్లిం)
‘సహీహ్ బుఖారి’లోని మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది : హ॥ ఆయిషా (రజియల్లాహు అన్హా ) ఇలా తెలిపారు :
“ఆమె పరిశుద్ధు రాలైనప్పుడు కాబా గృహానికి ప్రదక్షిణం చేశారు. ‘సఫా-మర్వా’ మధ్య ‘సయీ’ కూడా చేశారు”.
పై ఉల్లేఖనాల ద్వారా తెలిసేదేమిటంటే స్త్రీ నెలసరి కాలంలోనే ‘హజ్’ లేదా ‘ఉమ్రాహ్’ ‘ఇహ్రామ్ కట్టుకోవాలి. లేదా ‘తవాఫ్ ‘ చేయటానికి ముందే నెలసరి ప్రారంభమైనప్పుడు పరిశుద్ధురాలై స్నానం చేయనంత వరకు ‘తవాఫ్ ‘ మరి ‘సయీ’ చేయకూడదు. ఒకవేళ ఆమె పరిశుద్ధ స్థితిలో ‘తవాఫ్ ‘ చేసింది, దాని తరువాత ఆమెకు నెలసరి ప్రారంభమైనప్పుడు ఆమె అదే పరిస్థితిలో తన ‘ఉమ్రహ్ ను పూర్తిచేస్తుంది. ‘సయీ’ చేస్తుంది, తల వెంట్రుకలు కత్రిస్తుంది. ఎందుకంటే సఫా’, ‘మర్వా’ మధ్య ‘సయీ చేయటానికి పరిశుభ్రత అనే షరతు విధించబడలేదు.
ప్ర – 55: ఒకరు ఇలా ప్రశ్నిస్తున్నారు: ‘నేను నా భార్యతో ‘యమ్ బ’ పట్టణం నుండి ‘ఉమ్రహ్’ కొరకు వచ్చాను. జిద్దాహ్ చేరుకున్నప్పుడు నా భార్యకు ఋతుస్రావం మొదలైంది. కనుక నేను ఒకణ్ణి ‘ఉమ్రహ్’ చేసుకున్నాను. అయితే ఇప్పుడు నా భార్యకు ఎలాంటి ఆదేశాలు వుంటాయి?
జ: ఇలాంటి పరిస్థితిల్లో మీ భార్య సమస్యకు పరిష్కారం ఏమిటంటే ఆమె పరిశుద్ధురాలైనంత వరకు నిరీక్షించి ఆ తరువాత తన ‘ఉమ్రహ్’ పూర్తి చేయాలి. ఎందుకంటే విశ్వాసులు మాతృమూర్తి హ॥ సఫియ (రదియల్లాహు అన్హా) కు నెలసరి మొదలైనప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి సల్లం) ఇలా అన్నారు: “ఏమిటి మాకు ఈమె ప్రయాణం నుండి ఆపేస్తుందా?” ప్రజలు ఇలా అన్నారు : ఓ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమె ‘తవాఫె -ఇఫాజా’ అయితే చేసుకున్నది. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “అయితె బయలుదేరుదాం“.
పై హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన “ఏమిటి మాకు ఈమె ప్రయాణం నుండి ఆపేస్తుందా?” మాట ఆధారంగా స్త్రీకి ఒకవేళ ‘తవాఫె -ఇఫాజా’ కంటే ముందు నెలసరి వస్తే ఆమె పరిశుద్ధురాలైనంత వరకు నిరీక్షించి దాని తరువాత ‘తవ్వా ఫె-ఇఫాజా చేయటం తప్పనిసరి ‘వాజిబ్’గా గుర్తించబడుతుంది.
అలాగే ‘తవాఫె-ఉమ్రహ్’ కూడ ”తవాఫె-ఇఫాజా’ ఆదేశంలోనే వుంది. ఎందుకంటే అది ”ఉమ్రహ్ ‘కు మూల సూత్రం. కనుక ‘ఉమ్రహ్’ చేయదలుచుకునే స్త్రీ ఒకవేళ ‘తవాఫె-ఉమ్రహ్’ కంటే ముందే నెలసరికి గురైతే పరిశుద్ధత కలిగేవరకు నిరీక్షించి దాని తరువాత ‘తవాఫ్ ‘ చేయాలి.
ప్ర – 56 : ‘మస్ఆ’ (సయీ చేసే ప్రాంతం) ‘హరం’ (కాబా చుట్టుప్రక్కల కొంత భాగాన్ని అల్లాహ్ పవిత్ర స్థలంగా నిర్దేశించాడు. అందులో ఎలాంటి రక్తపాతాలు, అపవిత్ర కలాపాలకు పాల్పడరాదు. దానిని ‘హరం’ అంటారు) లో భాగమేనా? నెలసరిగల స్త్రీ ‘మస్ఆ’లో ప్రవేశించ గలుగుతుందా? ‘మస్ఆ’ నుండి ‘హరం’లో ప్రవేశించటానికి ‘తహియ్యతుల్ మస్జిద్’ (మసీదులో ప్రవేశించగానే చదివే నమాజు చదువుట ‘వాజిబా’ (తప్పనిసరా)?
జ: అందరికీ సుపరిచితమైన విషయం ఏమిటంటే ‘మస్ఆ’ (సయీ చేసే ప్రాంతం) ‘హరం’లో భాగం కాదు. ఈ కారణంతోనే దానికి ‘మస్జిదె హరాం’కి మధ్య ఒక చిన్న గోడ నిర్మించబడింది. మస్ఆ ‘హరం’ వెలుపల వుండటమే ప్రజలకు మేలు అని భావించడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒకవేళ దీన్ని ‘హరం’లో భాగమేనని నిర్ధారిస్తే అప్పుడు ‘తవాఫ్ ‘, ‘సయీ’ చేస్తున్న సమయంలో నెలసరికి గురైయ్యే స్త్రీని కూడా ‘సయీ’ చేయకుండా వారించడం జరిగేది.
ఈ విషయంలో నా అభిప్రాయం (‘ఫత్వా’) ఏమిటంటే ఒకవేళ స్త్రీ ‘తవాఫ్ ‘ చేసుకున్న తరువాత ‘సయీ’ చేయటానికి ముందు నెలసరికి గురైతే అప్పుడు ఆమె అదే స్థితిలో ‘సయీ’ చేయవచ్చు. ఎందుకంటే ‘మస్ ఆ’ (సయీ చేసే ప్రాంతం) ‘హరం’తో వేరుగా వుంది.
ఇక ‘తహియ్యతుల్-మస్జిద్’ విషయానికి వస్తే.. ఎవరైన ‘తవాఫ్ ‘ చేసిన తరువాత ‘సయీ’ చేసి, మళ్ళీ ‘మస్జిద్ హరాం’లో రావాలనుకున్నప్పుడు అతనికి ‘తహియ్యతుల్ మస్జిద్’ చదవవలసి వుంటుంది. ఒకవేళ చదవక పోయినా పర్వాలేదు. కాని అల్లాహ్ ప్రసాదించిన ఈ మహత్తర అవకాశాన్ని వినియోగించుకుంటూ, అక్కడ నమాజు చేయుటలో ఉన్న గొప్పతనాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు రకాతుల (తహయ్యతుల్ మస్జిద్) చదువుకోవడమే ఉత్తమమైన కార్యం.
ప్ర – 57 : ఒక స్త్రీ ఇలా ప్రశ్నిస్తుంది : నేను హజ్ చేశాను. హజ్ లో ఉన్నప్పుడే ఋతుస్రావం ప్రారంభమైంది. సిగ్గు, బిడియం కారణంగా ఎవరికీ చెప్పలేకపోయాను. అదే పరిస్థితిలో ‘హరం’లో కూడ ప్రవేశించాను, నమాజు చదివాను, ‘తవాఫ్ ‘, ‘సయీ’ కూడా చేశాను. అయితే ఇప్పుడు నేను ఏమిచేయాలి? ఒకమాట ఏమిటంటే (బాలింత దశ ) రక్తస్రావం తరువాత నెలసరి వచ్చింది.?
జ : నెలసరి, రక్తస్రావంగల స్త్రీ నమాజు ఆ స్థితిలో చేయరాదు. అది మక్కాలో నైనా స్వగ్రామంలో నైనా, మరెక్కడైనా సరే. ఎందుకంటే మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్త్రీ గురించి ఇలా అన్నారు: “ఏమిటి ఇలా లేదా (వాస్తవం కాదా)? ఏమంటే స్త్రీ నెలసరితో వున్నప్పుడు నమాజు చదవదు మరి ఉపవాసం పాటించదు.”
యావత్తు ముస్లిములు ఏకీభవించేది ఏమిటంటే నెలసరి గల స్త్రీ నమాజు చదవకూడదు, ఉపవాసం వుండకూడదు. కనుక పై పేర్కొనబడిన స్త్రీ అల్లాహ్ క్షమాపణ కోరుతూ తనతో జరిగిన ఈ తప్పుకి పశ్చాతాపపడాలి.
ఇక ఈ స్థితిలో ‘తవాఫ్ ‘ చేసే విషయమైతే ఇలా తవాఫ్ చేయుట కూడా సరికాదు. కాని ‘సయీ’ చేయవచ్చు. ఎందుకంటే ఈ విషయంలో ప్రఖ్యాత అభిప్రాయం ఏమిటంటే ‘హజ్’ సందర్భములో తవాఫ్ కంటే ముందు’సయీ’ చేసుకోవచ్చు. కనుక ఆమె రెండోసారి ‘తవాఫ్ ‘ చేయవలసి వుంటుంది. ఎందుకంటే ‘తవాఫ్-ఇఫాజా’ ‘హజ్’ మూల సూత్రాల్లో ఒకటి. అది లేకుండా ‘హలాల్’ కాలేరు (సమ్మత్వాన్ని పొందలేరు). అందుకని ఆ ఒకవేళ వివాహిత అయితే ‘తవాఫ్ ‘ చేయనంత వరకు తన భర్తతో లైంగికంగా దగ్గరకాకూడదు. ఒకవేళ అవివాహితురాలైతే ‘తవాఫ్ ‘ చేయనంత వరకు ‘నికాహ్’ (వివాహం చేసుకోకూడదు.
ప్ర – 58: స్త్రీకి ‘అరఫహ్’ రోజున ఋతుస్రావం మొదలైతే ఏమిచేయాలి?
జ: స్త్రీకి ‘అరఫహ్’ రోజున ఋతుస్రావం మొదలైతే ఇతర హాజీల్లా ఆమె కూడ హజ్జ్ లోని కార్యాలన్ని పూర్తి చేయాలి. కాకపోతే ‘బైతుల్లాహ్’ (కాబాగృహం) తవాఫ్ ‘ చేయరాదు. పరిశుద్ధులయ్యేంత వరకు నిరీక్షించి, పరిశుద్ధులైన తరువాత ‘బైతుల్లాహ్ ‘ (కాబా గృహం) ‘తవాఫ్ చేయాలి.
ప్ర – 59: ఒకవేళ స్త్రీ ‘జమరయె-ఉఖ్బహ్’ పై రాళ్ళు రవ్వినంతరం – ‘తవాఫ్-ఇఫాజా’ కంటే ముందు ఋతుస్రావానికి గురైంది. ఆమె, ఆ ఒక బృందముతో కలిసి ఉన్నారు. ఆమె ప్రయాణం తరువాత తిరిగి మక్కాకు రావటం కష్టం లేక అసాధ్యం. అప్పుడు ఆమె ఏమిచేయాలి?
జ: పై ప్రస్తావించబడిన స్త్రీ మళ్ళీ ‘మక్కా’కు రావటం అసాధ్యమైనప్పుడు అవసర నిమిత్తం ఆమె తన యోనిపై గుడ్డ కట్టుకుని ‘తవాఫ్’ చేసుకోవాలి. అలాగే మిగితా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితిలో ఆమెపై ఎటువంటి పరిహారం వాజిబ్ కాదు.
ప్ర – 60 : రక్తస్రావం గల స్త్రీ ఒకవేళ 40 రోజులకు ముందే పరిశుద్ధురాలైతే ఆమె ‘హజ్’ సరైనదేనా? ఒక వేళ పరిశుద్ధతను గ్రహించకపోతే ఏమిచేయాలి? గమనించవలసిన విషయం ఏమంటే ఆమె ‘హజ్’కై సంకల్పం చేసి వుంది?
జ : రక్తస్రావం గల స్త్రీ ఒకవేళ 40 రోజులకు ముందే పరిశుద్దురాలైనప్పుడు స్నానముచేసి నమాజు చదువుకోవాలి. పరిశుద్ధ స్త్రీలు చేసే కార్యాలన్నీ చేయాలి. చివరికి ‘బైతుల్లాహ్’ (కాబాగృహం) ‘తవాఫ్ ‘ కూడ చేయాలి. ఎందుకంటే రక్తస్రావం కనీస కాలానికి ఎలాంటి పరిమితం లేదు. సంకల్పం సరైనదే. కాకపోతే పరిశుద్ధురాలైనంత వరకు ఆమె ‘బైతుల్లాహ్’ పై పేర్కొనబడిన స్త్రీ పరిశుద్ధతను చూడనప్పుడు ఆమె ‘హజ్’ (కాబా గృహం) ‘తవాఫ్’ చేయకూడదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఋతుస్రావంలో గల స్త్రీని బైతుల్లాహ్ (కాబాగృహం) తవాఫ్ ‘ నుండి వారించారు.
ఈ విషయంలో రక్తస్రావం గల స్త్రీ కూడ నెలసరి గల స్త్రీ ఆదేశంలోనే వుంటుంది
—
నోట్స్:
ఈ ఖుత్బా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:-
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్
అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం: [ఇక్కడ డౌన్లోడ్ PDF]
ఇస్లామీయ షరీఅత్, ఖుర్ఆన్ హదీసుల్లో నిర్ణయించిన పద్ధతుల ద్వారానే మరణించిన వారికి పుణ్యప్రాప్తి జరుగుతుంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:
“మనిషి చనిపోగానే అతని ఆచరణల పరంపర కూడా ఆగిపోతుంది.అయితే మూడు మార్గాల ద్వారా అతనికి పుణ్యం చేరుతూ ఉంటుంది.”
ఆ మూడు మార్గాలు ఇవి :
1) సదఖయె జారియా
2) ప్రయోజనకరమైన విద్య
3) సదాచార సంపన్నులైన సంతానం చేసే దుఆలు
ఈ క్రింది హదీసుకు అనుగుణంగా కూడా తమ మృతులకు పుణ్య సమర్పణ చేయవచ్చు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:
విశ్వాసికి తను మరణించిన తర్వాత కూడా తన ఆచరణల, సత్కార్యాల పుణ్యం లభించే మార్గాలు ఇవి:
1) తాను ఇతరులకు బోధించి ప్రచారం చేసిన విద్య
2) తన సంతానాన్ని సదాచార సంపన్నులుగా, ఖుర్ఆన్కు వారసులుగా తీర్చిదిద్దటం
3) మస్జిద్ లు, సత్రాలు నిర్మించటం
4) ఆరోగ్యంగా ఉన్న కాలంలో తన ధనంలో కొంత భాగం దాన ధర్మాల కోసం ఖర్చుపెట్టడం. (ఇబ్నెమాజా)
3) చనిపోయిన వారి తరఫు నుండి ఏదయినా వస్తువు దానం చేస్తే దాని పుణ్యం కూడా మృతులకు లభిస్తుంది. బుఖారీలోని ఒక హదీసులో ఇలా ఉంది: ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) దగ్గరికి వెళ్ళి, “దైవప్రవక్తా! నా తల్లి చనిపోయింది. నేనామె తరఫున దానధర్మాలు చేస్తే దాని వల్ల ఆమెకు పుణ్యం లభిస్తుందా?” అనడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) ‘లభిస్తుంద‘ని చెప్పారు.
జలదానం అన్నింటి కంటే గొప్ప దానం!
4) ముస్నదె అహ్మద్ మరియు సునన్ గ్రంథాల్లో ఇలా ఉంది: హజ్రత్ సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) దగ్గరకు వెళ్ళి, “దైవప్రవక్తా! నా తల్లి చనిపోయింది. నేను ఆమె తరఫున ఏ వస్తువు దానం చేస్తే ఆమెకు ఎక్కువ పుణ్యం లభిస్తుంది?” అని అడిగారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) “నీళ్ళు” అని సమాధానమిచ్చారు. అప్పుడు సాద్ (రదియల్లాహు అన్హు) ఒక బావిని త్రవ్వించి, సాద్ తల్లికి పుణ్య సమర్పణ కోసం ఈ బావి త్రవ్వించ బడిందని ప్రజల మధ్య ప్రకటించారు.
పై హదీసు ద్వారా బోధపడే విషయమేమిటంటే మృతులకు వారి సంతానం తరఫున పుణ్యం చేకూరే మార్గాలలో జల దానం కూడా ఒకటి. ఈ ఆదేశం బావులు, గొట్టపు బావులు, కాలువలు, చెరువులు త్రవ్వించటానికి కూడా వర్తిస్తుంది.
5) సహీహ్ ముస్లింలోని ఒక హదీసులో ఇలా ఉంది: ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) దగ్గరకు వెళ్ళి, “నా తల్లిదండ్రులు ఆస్తి వదలి వెళ్ళారు. వారు అందులో (దానధర్మాల) గురించి ఎలాంటి వీలునామా రాసి వెళ్ళలేదు. ఇప్పుడు వారి తరఫున నేను దానం చేస్తే దాని పుణ్యం వారికి లభించగలదా?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) ‘లభిస్తుంద’ని చెప్పారు.
6) మృతుని కొరకు ముస్లిం ప్రజానీకం దుఆ చేసినా, అతని మన్నింపు కొరకు ప్రార్థించినా దానివల్ల అతనికి పుణ్యం లభిస్తుంది. దాని గురించి అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
وَالَّذِينَ جَاءُوا مِن بَعْدِهِمْ يَقُولُونَ رَبَّنَا اغْفِرْ لَنَا وَلِإِخْوَانِنَا الَّذِينَ سَبَقُونَا بِالْإِيمَانِ
“వారి తరువాత వచ్చిన వారు ఇలా ప్రార్థిస్తారు: ప్రభూ! మమ్మల్నీ, మాకు పూర్వం విశ్వసించిన మా సోదరులందరినీ క్షమించు.”(ఖుర్ఆన్ 59 : 10)
సునన్ గ్రంథాల్లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం వసల్లం) “మీరు మరణించిన వారి జనాజా నమాజ్ చేస్తే, వారి కొరకు చిత్తశుద్ధితో ప్రార్థించండి” అని ఆదేశించారని ఉంది.
బ్రతికున్న వారి తరఫు నుండి మరణించిన వారికి పుణ్యం చేకూరే మార్గాలు ఇవే. ఇవిగాక ఇతర పద్ధతులకు ఖుర్ఆన్ హదీసుల్లో ఎక్కడా రుజువు లభించదు.
Tags: Conveying Rewards to the Deceased (Dead), Isal e Sawab
—
క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది. పూర్తి పుస్తకం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇస్లామీయ ఆరాధనలు – ప్రతి ముస్లిం ఇంట్లో ఉండవలసిన పుస్తకం – శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్

ఇస్లామీయ ఆరాధనలు – ప్రతి ముస్లిం ఇంట్లో ఉండవలసిన పుస్తకం –
మూలం: ఫఖీ అబ్బాస్ ఫఖీ అబ్దుల్లాహ్ (Faqi Abbas Faqi Abdullah)
సంకలనం, అనువాదం: హాఫిజ్ ఎస్.ఎమ్. రసూల్
ప్రకాశకులు: శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్, హైదరాబాద్
[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [318 పేజీలు] [మొబైల్ ఫ్రెండ్లీ]
1వ అధ్యాయం:మూల విశ్వాసాలు [PDF] [45 పేజీలు]
ముస్లిముల ప్రాథమిక విశ్వాసాలు, ఏకదైవారాధన(తౌహీద్), అనేక దేవుళ్ళను పూజించటం (షిర్క్), షిర్క్-వివిధ రూపాలు, చిన్న షిర్క్, ఖుర్ఆన్, హదీసుల అనుసరణ…
2వ అధ్యాయం:శుచీ శుభ్రతలు [PDF] [31 పేజీలు]
శుద్ధమైనవి- అశుద్ధమైనవి, గుసుల్ నియమాలు,బహిష్టు పురిటి రక్తస్రావం, వుజూ వివరణ, వుజూలోసౌకర్యాలు-తయమ్ముమ్, మసహ్ – ఆచ్చాదన (సతర్)
3వ అధ్యాయం:నమాజు ఆరాధనలు [PDF] [96 పేజీలు]
మస్జిద్ల గురించి, నమాజ్ మేరాజ్ కానుక, ఇమామత్ ఆదేశాలు, నమాజ్ లో చేయకూడని పనులు, నమాజ్ నియమాలు, సామూహిక నమాజు, నమాజు వేళలు,అజాన్, జుమా నమాజ్, తహజ్జుద్ నమాజ్, విత్ నమాజ్,ఖునూతె నాజిలా, ప్రయాణపు నమాజ్,ఇతర నమాజులు
4వ అధ్యాయం:ప్రార్థనలు (దుఆలు) [PDF] [30 పేజీలు]
5వ అధ్యాయం: ఉపవాసాలు – రమజాన్, తరావీహ్ [PDF] [18 పేజీలు]
ఉపవాసం, జాగారం రాత్రులు, ఏతెకాఫ్ వ్రతం, ఫిత్రాదానం
6వ అధ్యాయం: జకాత్,దానధర్మాలు,వడ్డీ పిశాచం [PDF] [19 పేజీలు]
7వ అధ్యాయం: ఆస్తి వారసత్వం [PDF] [5 పేజీలు]
ఆస్తి పంపకానికి ప్రాథమిక సూత్రాలు,ఆస్తి వాటాలు, వీలునామా, మూడోవంతు కంటే ఎక్కువ ఆస్తి మీద వీలునామా చెల్లదు
8వ అధ్యాయం: హజ్ – ఉమ్రా [PDF] [7 పేజీలు]
హజ్ విశిష్టత, హజ్ విధింపుకు షరతులు, హజ్ రకాలు, హజ్ విధులు, ఉమ్రా వివరణ, చిన్న పిల్లలు చేసే హజ్
9వ అధ్యాయం: పండుగలు – ఖుర్బానీలు [PDF] [6 పేజీలు]
పండుగ రోజు నియమాలు, పండుగ రోజు పఠించ వలసిన తక్బీర్, పండుగ నమాజులకు స్త్రీలు కూడా వెళ్ళాలి, ఈదుల్ అజ, ఖుర్బానీ నియమాలు
10వ అధ్యాయం: సంతోష సమయాలు [PDF] [8 పేజీలు]
నికాహ్ ప్రసంగం, నికాహ్ ప్రసంగ పరమార్ధం,అఖీఖా, సున్తీ చేయించుకోవటం
11వ అధ్యాయం: జనాజా – అంత్యక్రియలు [PDF] [13 పేజీలు]
శవానికి స్నానం చేయించే పద్ధతి, శవానికి వస్త్ర సంస్కారం, జనాజా నమాజ్ ఆదేశాలు, ఖననం ఆదేశాలు, పుణ్య సమర్పణ (ఈసాలె సవాబ్)
12వ అధ్యాయం: ఇస్లాం జీవన విధానం [PDF] [32 పేజీలు]
సలామ్ ఆదేశాలు, తల్లిదండ్రుల హక్కులు, పిల్లల శిక్షణ, రోగుల పరామర్శ, అతిధి మర్యాద, భోజన నియమాలు
షాబాన్ నెల (The Month of Shaban) – మెయిన్ పేజీ
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) రమజాన్ మాసంలో తప్ప, ఇతర మాసాలలో మొత్తం నెల ఉపవాసాలు పాటించినట్లు నేను ఎప్పుడు చూడలేదు. మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) షాబాన్ నెలకంటే ఎక్కువగా ఉపవాసాలు ఇతర నెలల్లో పాటించినట్లు ఆయన్ని నేను చూడలేదు. (బుఖారీ:1833, ముస్లిం:1956)
హజ్రత్ ఉసామా బిన్ జైద్(రజియల్లాహు అన్హు) కధనం ప్రకారం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని నేను ఇలా అడిగాను: “ఓ అల్లాహ్ ప్రవక్తా (సల్లల్లాహు అలైహి వసల్లం) మీరు షాబాన్ మాసంలో (అధికంగా) ఉపవాసాలు పాటించినట్లు, ఏ ఇతర మాసాలలో అన్ని ఉపవాసాలను పాటించినట్లు నేను మిమ్మల్ని చూడలేదు. దానికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బదులిచ్చారు:
“రజబ్ మరియు రమజాన్ నెలకి మధ్య ఉన్న షాబాన్ నెల యొక్క వాస్తవం ప్రజలకు తెలియదు. ఈ నెలలో ప్రజలు చేసిన కార్యాలు అల్లాహ్ ముందు సమర్పించబడతాయి. కనుక నా పుణ్యకార్యాలు అల్లాహ్ యందు నేను ఉపవాస స్థితిలో ఉండగా సమర్పించబడాలని ఇష్టపడుతున్నాను.”
(నసాయి:2317, అబూ దావూద్, సహీహ్ ఇబ్ను ఖుజైమ)
సలఫ్ పద్ధతి: సహాబా, తాబిఈన్ తదితరులు అధికంగా ఉపవాసంతో పాటు ఖుర్ఆన్ కూడా ఎక్కువగా పారాయణం చేసేవారు. దీని తర్వాత రమజాను మాసం గనక, అందులో ఈ మంచి అలవాటు స్థిరపడిపోతుంది. (లతాఇఫుల్ మఆరిఫ్.)
విశ్వాసంలో మాధుర్యాన్ని, తీపిని ఆస్వాదించాలన్న కోరిక మీకు ఉందా ? అయితే తప్పనిసరిగా ఈ మంచి వీడియో చూడండి మరియు మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి., ఇన్ షా అల్లాహ్
తప్పకుండ వినాల్సిన వీడియో, డోంట్ మిస్ఏ. కాంతంలో డిస్టర్బన్స్ లేకుండా ఏకాగ్రతగా వింటే, సంపూర్ణ లాభం పొందవచ్చు
—
ఈమాన్ (విశ్వాసం) – మెయిన్ పేజీ:
https://teluguislam.net/?p=621
ఖుత్బాయందలి ముఖ్యాంశాలు :
ఇస్లామీయ సోదరులారా!
అల్లాహ్ జిన్నాతులను, మానవులను తన ఆరాధన కోసం సృష్టించాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ
“నేను జిన్నాతులను, మానవులను సృష్టించింది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే“. (జారియాత్ : 56)
కానీ, ఆరాధన కోసం జీవితంలోని ఒక ప్రత్యేక కాలాన్ని లేదా ప్రత్యేక సంవత్సరాన్ని, లేదా ప్రత్యేక మాసాన్ని లేదా ప్రత్యేక వారాన్ని లేదా ప్రత్యేక దినాన్ని లేదా ప్రత్యేక రాత్రిని నిర్ణయించుకొని మిగతా జీవితమంతా (అల్లాహ్) ఆరాధన పట్ల అశ్రద్ధ చూపడం సరికాదు.
మానవ పుట్టుక అసలు ఉద్దేశ్యమే అల్లాహ్ ను ఆరాధించడం కాబట్టి (ఆరాధనకు) యోగ్యమైన వయస్సు నుండి జీవితపు ఆఖరి క్షణాల వరకు గూడా అల్లాహ్ ను ఆరాధిస్తూ గడపాలి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَكُنْ مِنَ السَّجِدِينَ وَاعْبُدُ رَبَّكَ عَلى يَأْتِيَكَ الْمَدِيْنُ ع
“నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ అతన్ని స్తుతిస్తూ వుండు. సాష్టాంగ పడేవారిలో చేరిపో. నిశ్చయమైనది (అనగా మరణం) వచ్చే వరకు. నీ ప్రభువును ఆరాధిస్తూ వుండు”. (హిజ్ర్ : 98 – 99)
అందుకే, ఎవరైతే తన జీవిత అసలు లక్ష్యం (అల్లాహ్ ను) ఆరాధించటం అని భావిస్తాడో అతనే సఫలీకృతుడు. అలాకాక, ఎవరైతే తన జీవిత లక్ష్యాన్ని కేవలం తన కోసం, తన ఇంటి వారికోసం ఇహలోకపు తళుకుబెళుకులు సమకూర్చుకోవడంగా భావిస్తాడో అతను ఎట్టి పరిస్థితుల్లోనూ సాఫల్యం పొంద లేడు.
నేడు పరిస్థితి ఎలా వుందంటే – ఒకటేమో, ముస్లిం సమాజంలోని అధికులు అల్లాహ్ ఆరాధన పట్ల అశ్రద్ద చూపివున్నారు. దీనికితోడు, వారికి కొంత మంది – ఒక సం॥లో రెండు సార్లు రాత్రి జాగారం చేసి, మూడు నాలుగు రోజులు ఉపవాసముంటే, ఈ ఆరాధన వారి మోక్షానికి, ఇహపరలోకాల సాఫల్యానికి సరిపోతుంది అని మాయమాటలు చెప్పి వారినింకా భ్రష్టు పట్టించారు.
కాని, వాస్తవానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆరాధన కోసం ఒక రాత్రిని ప్రత్యేకించు కోవడాన్ని (గట్టిగా) వారించారు.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“రాత్రిళ్లు నిలబడడం (నమాజు చేయడం)లో కేవలం శుక్రవారం రాత్రిని మరియు ఉపవాసం వుండడానికి శుక్రవారాన్ని ప్రత్యేకించుకోకండి. ఒకవేళ ఎవరైనా ఉపవాసముంటూ, మధ్యలో శుక్రవారం వస్తే అది వేరే విషయం“. (ముస్లిం : 1144)
అందుకే, ఏదైనా రాత్రిని ఆరాధన కొరకు ప్రత్యేకించు కోవడం సరైనదైతే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) శుక్రవారం రాత్రి ఆరాధన కోసం ప్రత్యేకించుకోవడానికి అనుమతి ఇచ్చి వుండేవారు. ఎందుకంటే మొత్తం వారంలోని రాత్రిళ్ళలో శుక్రవారం రాత్రి ఉత్తమమైనది. అయినప్పటికీ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీనిని వారించారు. దీని ద్వారా తెలిసేదేమిటంటే సంవత్సరంలో కేవలం ఒకటి రెండు రాత్రులు ఆరాధనలో గడిపి మిగతా సంవత్సరమంతా దీని పట్ల అశ్రద్ద చూపడం ఎంతమాత్రం సరికాదు.
స్వయానా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అలవాటు కూడా ఇదే. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సంవత్సరంలోని ప్రతి రాత్రీ ఆరాధించేవారు. పైగా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితపు ప్రతి క్షణం ఆరాధనలోనే గడిచేది. కనుక మనం కూడా మన జీవితాన్ని ప్రతి క్షణం అల్లాహ్ ఆరాధనలో గడిపేందుకు ప్రయత్నించాలి. ఇది ఎలా సాధ్యపడుతుందంటే మనం వేసే ప్రతి అడుగు అల్లాహ్ సంకల్పాని కనుగుణంగా వుండాలి. చేసే ప్రతి కార్యం ఆయన మెప్పు కోసం వుండాలి.
ఆయెషా (రజియల్లాహు అన్హు) కథనం:
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాత్రిళ్ళు నమాజులో ఎంత (సుదీర్ఘంగా) నిలబడేవారంటే ఆయన కాళ్ళలో పగుళ్ళు ఏర్పడేవి. నేను – ఓ దైవ ప్రవక్తా! మీరు ఇలా ఎందుకు చేస్తారు (ఎందుకింతగా కష్టపడతారు)? అల్లాహ్ మీ మునుపటి మరియు రాబోయో తప్పిదాలను మన్నించేశాడుగా అని అనేదాన్ని, ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో – (అల్లాహ్ నాకు ప్రసాదించిన దానికిగాను) నేను కృతజ్ఞుడైన దాసుడు కాకూడదా! అని అనేవారు. (బుఖారీ : 4837, ముస్లిం : 2820)
ముగైరా (రజియల్లాహు అన్హు) కథనం:
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాత్రిళ్ళు (నమాజులో) ఎంత సుదీర్ఘంగా నిలబడేవారంటే ఆయన కాళ్ళు వాచిపోయేవి. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)తో ఇలా అనబడింది: అల్లాహ్ మీ మునుపటి మరియు రాబోయే తప్పిదాలను మన్నించేశాడు. అయినప్పటికీ మీరు ఇంత సుదీర్ఘంగా ఎందుకు నిలబడతారు? ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) జవాబిస్తూ “నేను కృతజ్ఞుడైన దాసుణ్ణి కాకూడదు మరి!” అని అన్నారు. నేను (బుఖారీ: 4836, ముస్లిం : 2819)
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎల్లప్పటి అలవాటేమిటంటే – ఆయన రాత్రిళ్ళు సుదీర్ఘంగా ఖియాం చేసేవారు. దీనితో ఆయన కాళ్ళలో పగుళ్ళు ఏర్పడేవి లేదా వాపు వచ్చేది. అంతేగానీ సంవత్సరంలో కేవలం రెండు మూడు రోజులు ఇలా చేసేవారు కాదు. మరి జీవితం గడపడానికి ఉత్తమ పద్దతి కేవలం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పద్ధతే.
జాబిర్ బిన్ అబ్దుల్లా (రజియల్లాహు అన్హు) కథనం:
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శుక్రవారం ఖుత్బా యందు ఇలా సెలవిచ్చేవారు – స్తోత్రం తర్వాత, (బాగా గుర్తుంచుకోండి!) అన్నిటికన్నా ఉత్తమమైన వాక్కు అల్లాహ్ గ్రంథము, అన్నిటి కన్నా ఉత్తమ పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పద్ధతి, అన్నింటి కన్నా చెడు కార్యం (ధర్మంలో) క్రొత్తగా ఆవిష్కరించబడేది మరియు ప్రతి బిద్ అత్ మార్గభ్రష్టతే. (ముస్లిం : 867)
దీని ద్వారా తెలిసిందేమిటంటే – అల్లాహ్ గ్రంథం మరియు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్ లే అసలు ధర్మం. ఇక వీటికి విరుద్ధంగా ధర్మంలో క్రొత్తగా సృష్టించబడే ప్రతి కార్యం అత్యంత చెడు కార్యమే, అది ప్రజల దృష్టిలో ఎంత గొప్పదైనా సరే. దీని ద్వారా తెలిసిన మరో విషయమేమిటంటే – అల్లాహ్ గ్రంథం మరియు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్ ద్వారా ఆధారం దొరకని కార్యం బిద్అత్ మరియు ప్రతి బిద్అత్ మార్గభ్రష్టతకు ఆనవాలు. ధర్మంలో ‘బిద్ధతే హసన‘ అన్న బిద్అత్ ఏదీ లేదు. బిద్అత్ లన్నీ మార్గభ్రష్టతే మరియు వీటిని ఆచరించే వారిని అవి మార్గభ్రష్టులుగా చేసేస్తాయి.
షాబాన్ నెలలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రమజాన్ తప్ప, ఇతర మాసాల కన్నా ఎక్కువగా ఉపవాసాలుండేవారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిస్తూ వుండేవారు:
“ఈ నెలలో సత్కార్యాలు పైకి లేపబడతాయి. మరి నా ఆచరణలు (నా) ఉపవాస స్థితిలో పైకి లేపబడటాన్ని నేను ఇష్టపడతాను.”
అయినప్పటికీ, ఈ నెలను నాలుగు నిషిద్ధ మాసాలలో చేర్చడం సరైనది కాదు. ఆ మాసాల్లో యుద్ధాలు, హత్యలు రక్తం చిందించడం నిషేధం కాబడ్డాయి, అందరు విశ్లేషకులు, హదీసు వేత్తలు మరియు విద్వాంసుల ఏకాభిప్రాయం ఏమిటంటే ఆ నాలుగు నిషిద్ధ మాసాలు – జిల్ ఖాదా, జిల్ హిజ్జ, ముహర్రమ్ మరియు రజబ్. ఏ విశ్లేషకుడు కూడా షాబాన్ నెలను నిషిద్ధ మాసాల్లో చేర్చలేదు.
ఈ యావత్ నెలలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రత్యేకంగా పాటించిన ఆరాధన ఉపవాసమే. అది కూడా పూర్తి నెల పాటించారు అంతేగాని ఏదో ఒక రోజు ప్రత్యేకంగా కాదు. ఏదో ఒక రోజు ఉపవాసపు శ్రేష్ఠత కూడా వివరించలేదు.
ఆయెషా (రజియల్లాహు అన్హు) కథనం:
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిరంతరంగా (ఏమాత్రం విడిచిపెట్టకుండా) ఉపవాసాలు వుండేవారు. ఆయన ఉపవాసాన్ని ఇక వదలరేమో అని మేము అనుకునేవాళ్ళం. అలాగే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకవేళ ఉపవాసం వదిలేస్తే చాలా రోజుల దాకా మానేసేవారు. చివరికి మాకు – ఆయన ఉపవాసం వుండరేమో అని అనిపించేది. నేను ఆయన్ని రమజాన్ తప్ప మరే నెలలోనూ పూర్తిగా ఉపవాసముండడం చూడలేదు. నేను ఆయన్ని – షాబాన్ నెల కన్నా ఎక్కువగా మరే నెలలోనూ ఉపవాసాలుండడం చూడలేదు. (బుఖారీ, ముస్లిం)
ఆయేషా (రజియల్లాహు అన్హ) ఇలా కూడా సెలవిచ్చారు:
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఉపవాసాల కోసం అన్నిటి కన్నా ప్రియమైన నెల షాబాన్ నెల, తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) రమజాన్ ఉపవాసాలు వుండేవారు. (అబూ దావూద్: 2431, సహీహ్ -అల్బానీ)
అలాగే, ఆమె ఇలా కూడా సెలవిచ్చారు:
నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను షాబాన్ నెలలో కన్నా ఎక్కువగా ఏ నెలలోనూ ఉపవాసాలుండగా చూడలేదు. ఆయన దానిలో (షాబాన్ నెలలో) కొద్ది రోజులు తప్ప అన్ని రోజులు ఉపవాసముండేవారు, పైగా ఆయన దానిలో పూర్తిగానే ఉపవాసముండేవారు. (తిర్మిజీ: 736, సహీహ్- అల్బానీ)
అంతేగాక, ఉమ్మె సలమా (రజియల్లాహు అన్హ) కథనం:
నేను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను రెండు నెలలు నిరంతరంగా ఉపవాసముండడం చూడలేదు. కేవలం షాబాన్ మరియు రమజాన్ నెలల్లో తప్ప. (తిర్మిజీ: 736, సహీహ్- అల్బానీ)
ఉసామా బిన్ జైద్ (రజియల్లాహు అన్హు) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను నేను మిమ్మల్ని షాబాన్ నెలలో ఉపవాసమున్నంతగా మరే నెలలోనూ చూడలేదు (కారణం ఏమిటి?) అని అడిగారు.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జవాబిస్తూ – “రజబ్ మరియు రమజాన్ నెలల మధ్య ప్రజలు ఉపవాసాల గురించి అశ్రద్ధ చూపే నెల ఇది. మరి చూడబోతే, ఈ నెలలోనే ఆచరణలు అల్లాహ్ వైపునకు లేపబడతాయి. మరి నా ఆచరణలు (నేను) ఉపవాసం వున్న స్థితిలో పైకి లేపబడటాన్ని నేను ఇష్ట పడతాను” అని అన్నారు.
ఈ హదీసులన్నింటి ద్వారా తెలిసిన విషయమేమిటంటే – ఈ నెలలో అధికంగా ఉపవాసాలు ఉండాలి.
షాబాన్ నెలలో ఉపవాసాల మహత్యం గురించి తెలుసుకున్నాక ఉదయించే ఒక ప్రశ్న ఏమిటంటే ఈ నెల 15వ తారీఖు ప్రాముఖ్యత ఏమిటి మరి?
వాస్తవం ఏమిటంటే – సత్యాసత్యాల గురించి ఏమాత్రం పట్టించుకో కుండా ఏ 3,4 విశిష్ఠ రాత్రుల గురించి వివరించడం జరుగుతూ వుంటుందో, వాటిలో షాబాన్ నెల 15వ తారీఖు రాత్రి కూడా ఒకటి. సాధారణంగా దీనిని ‘షబే బరాత్’ అని అంటూ వుంటారు.
ఈ రాత్రి గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ఈ ప్రవచనం ప్రామాణిక పరంపరతో ఉల్లేఖించబడింది:
“అల్లాహ్ – షాబాన్ నెల 15వ తేదీ రాత్రి తన సృష్టితాల వైపునకు (దయతో) చూస్తాడు. తదుపరి బహుదైవారాధకుడు (ముష్రిక్) మరియు అసూయా పరుడు తప్ప మిగతా సృష్టితాలను అందరినీ క్షమిస్తాడు.” (తిర్మిజి, ఇబ్నె హిబ్బాన్, బైహఖీ)
ఈ కాలపు హదీసువేత్త అయిన షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ ఈ హదీసుకు సంబంధించిన వేర్వేరు పరంపరలు పేర్కొన్న తర్వాత ఇలా వివరించారు: “దీని సారాంశం ఏమిటంటే ఈ హదీసు దీని వేర్వేరు పరంపరలతో కలిసి నిస్సందేహంగా ప్రామాణికమైనది (సహీహ్).” (అస్సహీహ : 1144)
మరో ఉల్లేఖనంలో పదాలు ఇలా వున్నాయి:
“నిశ్చయంగా అల్లాహ్, షాబాన్ నెల 15వ తేదీ రాత్రి దాసులపై కరుణతో (దయతో) చూస్తాడు. నిజమైన విశ్వాసులు (మోమిన్)ను క్షమిస్తాడు, అవిశ్వాసులకు గడువు ఇస్తాడు మరియు అసూయాపరులను వారి మనసులను అసూయ నుండి శుద్ధి చేసుకొనే వరకు వదిలేస్తాడు”. (సహీహుల్ జామె లిల్ అల్బానీ : 1898)
ప్రియతమ సోదరులారా!
షాబాన్ 15వ తేదీ రాత్రి మహత్యాన్ని వివరించే ఒకే ఒక్క ప్రామాణిక హదీసు ఇది. ఇది తప్ప సాధారణంగా ఈ రాత్రి మహత్యాన్ని గురించి ధార్మిక సమ్మేళనాల్లో, పత్రికల్లో వివరించబడే హదీసులన్నీ అత్యంత బలహీనమైనవేకాక, కాల్పనికమైనవి కూడా. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) షరీయతు ఇలాంటి పనికిమాలిన మాటల నుండి ఎంతో పరిశుద్ధంగా వుంది.
షబే బరాత్ ను పురస్కరించుకొని సాధారణంగా పేర్కొనబడే బలహీన, కాల్పనిక హదీసులలో కొన్ని ఇవి:
(1) “షాబాన్ నా మాసం మరియు రమజాన్ అల్లాహ్ మాసం” (జయీఫుల్ జామె – అల్బానీ : 3402, మౌజూ) దీనిని అల్బానీ రహిమహుల్లాహ్ కాల్పనికమైనది (మౌజూ) గా ఖరారు చేశారు.
(2) పేర్కొనబడే మరో ఉల్లేఖనం ఏమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక రాత్రి ఆయెషా (రజియల్లాహు అన్హ) ఇంట్లో వున్నారు. అకస్మాత్తుగా ఆయన అక్కణ్ణుంచి బయలుదేరారు. ఆయెషా (రజియల్లాహు అన్హ) కూడా ఆయన వెనుకనే వెళ్ళిచూస్తే, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) బఖీ (మదీనా స్మశాన వాటిక)లో వున్నారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమెను చూసి – (ఓ ఆయెషా!) అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నీపై దౌర్జన్యం చేస్తారని శంకించావా? అని అడిగారు. ఆమె – ఓ దైవ ప్రవక్తా! బహుశా మీరు మీ సతీమణులలో, ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళారన్న అనుమానం కలిగింది అని అన్నారు. దీనిపై ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) – “నిశ్చయంగా అల్లాహ్, షాబాన్ 15వ రాత్రి ఇహలోకపు ఆకాశానికి విచ్చేస్తాడు – తదుపరి ‘బనూ కల్బ్’ తెగ మేకల వెంట్రుకలకు సరిసమానంగా మానవులను క్షమిస్తాడు“. (తిర్మిజీ: 739, ఇబ్నె మాజ : 1389, జయీఫ్- అల్బానీ)
ఇతర ఇమాములతోపాటు స్వయానా ఇమామ్ తిర్మిజి కూడా ఈ హదీసును ఉల్లేఖించిన తర్వాత దీని బలహీనత ను సూచించారు. పైగా ఆయన ఇమామ్ బుఖారీ ద్వారా ఆయన దీనిని బలహీనమైనదని అనేవారని ఉల్లేఖించారు.
ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయమేమిటంటే – ఆయెషా (రజియల్లాహు అన్హ) వివరించిన వృత్తాంతము – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బఖీ వెళ్ళి అక్కడి వారి కోసం ప్రార్ధించడం- మాత్రం ప్రామాణికమైనది. సహీహ్ ముస్లిం వగైరా గ్రంథాల్లో దీని గురించి వివరంగా వుంది, కానీ, దానిలో షాబాన్ నెల 15వ తేదీ రాత్రి గురించి ఏ మాత్రం లేదు. ఆ ప్రామాణికమైన పూర్తి వృత్తాంతం ఇలా వుంది:-
ఆయెషా (రజియల్లాహు అన్హ) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ రాత్రి నా ఇంట్లో వున్నారు. తను కప్పుకొని వున్న దుప్పటిని, బూట్లను ఆయన తీసి ఆయన తలకు దగ్గరగా పెట్టారు. ఆయన ధరించివున్న దుప్పటి లోని కొంత భాగాన్ని పరుపుపై వేసి నడుంవాల్చారు. ఇలా కొంత సమయం దాటాక నేను నిద్రపోయానని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) భావించి మెల్లగా తన దుప్పటిని తీసుకొని, బూట్లు ధరించి, తలుపు తెరిచి బయటికి వెళ్ళి తలుపును మెల్లగా మూసేశారు. తదుపరి నేను లేచాను. నా శిరస్త్రాణం తలపై ధరించి, ఓణీ కప్పుకొని, దుప్పటి మడుచుకొని నేను కూడా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక వెళ్ళాను. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) బఖీ లోకి వెళ్ళారు. అక్కడ చాలా సేపు నిలబడివున్నారు. ఈ తరుణంలో మూడు సార్లు తన చేతుల్ని (దుఆ కోసం) పైకెత్తారు. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెను తిరగగా, నేను కూడా తిరిగాను. ఆయన త్వరత్వరగా నడుస్తే, నేను కూడా త్వరత్వరగా నడుస్తూ, ఆయన మెల్లగా పరుగెత్తితే నేను కూడా మెల్లగా పరుగెత్తుతూ, ఆయన వేగంగా పరుగెత్తితే నేను కూడా వేగంగా పరుగెత్తుతూ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కన్నా ముందుగా ఇంటికి వచ్చేశాను. కాసేపటికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా విచ్చేశారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)- ఓ ఆయెషా! ఏమయ్యింది నీకు, నీ శ్వాస ఎందుకు పెరిగి వుంది? అని అడిగారు. నేను – (అబ్బే) అలాంటి దేమీ లేదు అని అన్నాను. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా నీవైనా చెప్పు, లేదా అన్నీ తెలిసినవాడు, అత్యంత సూక్ష్మగ్రాహి అయిన అల్లాహ్ నాకంతా చెప్పేస్తాడు అని అన్నారు. నేను – నా తల్లిదండ్రులు మీకు అర్పితం! అని తదుపరి ఆయనకంతా వివరించాను. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – “నాకు ముందుగా ఒక ఛాయ కదలడం నేను చూశాను. ఆ ఛాయ నీదా?” అని అన్నారు. నేను – అవును అని అన్నాను. తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన అర చేత్తో ఛాతీ మీద కొట్టారు. దీనికి నాకు కాస్త నొప్పి కలిగింది తదుపరి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) – అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నీపై దౌర్జన్యం చేస్తారని నీ అభిప్రాయమా? అని అన్నారు. నేను (నా మనస్సులో) అనుకున్నాను – జనాలు ఎంతగా దాచిపెట్టినా అల్లాహ్ మాత్రం అన్నీ తెలిసినవాడు, వాస్తవానికి అల్లాహ్ సమస్తం ఎరిగినవాడు.
ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా వివరించారు: నువ్వు నన్ను చూసిన సమయంలో జిబ్రయీల్ (అలైహిస్సలాం) నా దగ్గరి కొచ్చారు, ఆయన నీకు కనపడకుండా మెల్లగా నన్ను పిలిచారు. నేను కూడా నీకు కనపడకుండా మెల్లగా జవాబిచ్చాను. నువ్వు లోదుస్తులు తీసి వుండడంతో ఆయన లోపలికి రాలేక పోయారు. నేనేమో నీవు నిద్రపోయావని భావించాను. అందుకే నిన్ను లేపడం మంచిది కాదని భావించాను. అదిగాక నేను లేకపోవడం మూలంగా నువ్వు భయపడతావేమో అని అనుకున్నాను. (ఈ లోగా) జిబ్రయీల్ (అలైహిస్సలాం) నాతో – ‘మీరు బఖీ దగ్గరికి వచ్చి బఖీ వాసుల మన్నింపు కోసం ప్రార్దించమని మీ ప్రభువు ఆజ్ఞాపించాడు’ అని అన్నారు. నేను (ఆయెషా రజియల్లాహు అన్హ) – నేను వారి కోసం ఏమని ప్రార్థించనూ అని అడిగాను, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ నువ్వు ఈ విధంగా పలుకు అని అన్నారు : “అస్సలాము అలా అహ్లిద్దియారి మినల్ మోమినీన వల్ ముస్లిమీన్, వ యర్ హముల్లాహుల్ ముస్తఖ్ దిమీన మిన్నా వల్ ముస్త ఆఖిరీన్, వ ఇన్నా ఇన్షా అల్లాహు బికుమ్ లలాహికూన్”.(ముస్లిం : 974)
కనుక రుజువైనదేమిటంటే – బఖీ వృత్తాంతానికీ, షాబాన్ నెల 15వ తేదీ రాత్రికి ఏ విధమైన సంబంధం లేదు. దీని గురించి ఒక్క సహీహ్ హదీసులో కూడా వివరించబడలేదు. అందుకే బలహీన (జయీఫ్) హదీసులను ఆధారంగా చేసుకొని ఈ రాత్రిగానీ, దాని తర్వాత రోజు గానీ స్మశానానికి వెళ్ళడం సున్నత్ అని విశ్వాసముంచడం సరైనది కాదు.
(3) షాబాన్ నెల 15వ తేదీ రాత్రి మీరు (ఆరాధనలో) నిలబడండి (జాగారణ చేయండి) మరియు మరుసటి రోజు ఉపవాసం ఉండండి. ఎందుకంటే – ఆ రోజు షాబాన్ 15వ తేదీ) సాయంత్రం కాగానే అల్లాహ్ ఇహలోక ఆకాశంపైకి వచ్చి ఇలా ప్రకటిస్తాడు- ఎవరైనా మన్నింపు కోరుకొనే వారున్నారా? వారిని నేను మన్నిస్తాను. ఎవరైనా ఉపాధి కోరుకొనే వారున్నారా? నేను వారికి ఉపాధి ప్రసాదిస్తాను. ఎవరైనా వ్యాధిగ్రస్తులై వున్నారా? వారికి నేను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాను. ఎవరైనా (ఏదైనా) అడిగే వారున్నారా? వారికది నేను ప్రసాదిస్తాను. ఎవరైనా ఎవరైనా ఇలా ఫజర్ సమయం వరకూ (ప్రకటిస్తూనే వుంటాడు) (జయీఫ్ అల్ జామె – అల్బానీ : 602, మౌజూ)
ఈ హదీసు కూడా కాల్పనిక, తప్పుడు హదీసు, దీనికి విరుద్ధంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా ప్రామాణికంగా ఉల్లేఖించబడిన ఈ హదీసును వివరిస్తూ వుండాలి.
“ఎంతో శుభవంతుడైన మన ప్రభువు ప్రతి రాత్రి మూడింట ఒక వంతు మిగిలి వున్నప్పుడు ఇహలోకపు ఆకాశంపైకి అవతరిస్తాడు. తదుపరి ఇలా ప్రకటిస్తాడు – నన్ను ప్రార్థించేవారు ఎవరున్నారు? నేను వారి ప్రార్థనలను స్వీకరిస్తాను. నన్ను ఏదైనా (కావాలని) అడిగేవారు ఎవరున్నారు? నేను వారికది ప్రసాదిస్తాను. నా మన్నింపు కోరుకొనేవారు ఎవరున్నారు? నేను వారిని మన్నిస్తాను”.
ముస్లిం లోని మరొక ఉల్లేఖనంలో అదనంగా ఇలా వుంది – “ఇలా (ఈ ప్రకటన) ఫజర్ వేళ వరకు కొనసాగుతూనే వుంటుంది.” (బుఖారీ: 1145, 6321, 7494 ముస్లిం: 758)
ఈ హదీసు ద్వారా – ప్రతి రాత్రికీ ఈ మహత్యం ఉందని తెలుస్తుంది. మరలాంటప్పుడు దీనిని కేవలం షాబాన్ నెల 15వ రాత్రికి ప్రత్యేకించడం తప్పు మరియు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అభాండం మోపడమే అవుతుంది.
(4) అలీ (రజియల్లాహు అన్హు) హదీసు: దీనిలో ఆయన వివరించిన దేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) షాబాన్ నెల 15వ రాత్రి 14 రకాతులు చదివారు. తదుపరి ఆయన కొన్ని సూరాలను పఠించారు. ఆ తర్వాత ఇలా సెలవిచ్చారు – నేను చేసినట్లే ఎవరైనా చేస్తే (ఇలాగే ఆచరిస్తే) స్వీకరించబడిన 20 హజ్జ్ లు మరియు 20 సం॥ల ఉపవాసాలకు లభించే అంత పుణ్యం లభిస్తుంది.
ఇబ్నుల్ జౌజి ఈ హదీసును అల్ మౌజుఅత్’లో సంగ్రహించి దీనిపై ఇలా వ్యాఖ్యానించారు: ఈ హదీసు కూడా కాల్పనికమైనది. దీని పరంపర కూడా అత్యంత చెడ్డగా వుంది. (అల్ మౌజుఆత్: 2వ సంపుటం, 445వ పేజి)
ఇమామ్ సుయూతీ ఇలా వివరించారు: ఈ హదీసును బైహఖీ ‘షోబుల్ ఈమాన్’ లో ఉల్లేఖించారు. దాదాపుగా ఇది కాల్పనికమైన తప్పుడు హదీసు. (తన్జిఉష్షరియ లి ఇబ్నె ఇరాక్: 2వ సంపుటం, 94వ పేజీ)
(5) సలాతుల్ అల్ ఫియా – దీని గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అలీ (రజియల్లాహు అన్హు)కు ఇలా వివరించారు:
ఏ వ్యక్తి అయినా ఈ రాత్రి 100 రకాతుల నమాజులు చదివి ప్రతి రకాతులో ఫాతిహా సూరా తర్వాత ఇఖ్ లాస్ సూరా 10 సార్లు చదివితే – అల్లాహ్ అతని కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. ఒకవేళ ‘లౌహే మహ్పూజ్’ లో అతను దురదృష్టవంతుడని వ్రాయబడివున్నప్పటికీ, అల్లాహ్ దానిని చెరిపేసి అదృష్టవంతుడని వ్రాస్తాడు. మరియు రాబోయే 1 సం॥ పాటు అతని పాపాలను లిఖించడం జరగదు.
“అల్ మౌజుఆత్”లో ఇబ్నుల్ జౌజి ఈ హదీసును గూర్చి ఎన్నో పరంపరలను పేర్కొన్న తర్వాత ఇలా వివరించారు :
ఈ హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు అవడంలో ఏమాత్రం సందేహం లేదు. దీనిలోని చాలా మంది ఉల్లేఖకులు అపరిచితులు మరియు కొందరైతే అతి బలహీన ఉల్లేఖకులు. ఈ స్థితిలో ఈ హదీసును దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా ఉల్లేఖించడం అసంభవం. మేము ఎంతో మందిని ఈ నమాజును చదువుతుండగా చూశాం. తక్కువ వ్యవధి కలిగిన రాత్రుళ్ళలో వీరు ఈ నమాజు చదివి నిద్రపోతారు. దీనితో వీరి ఫజర్ నమాజు నెరవేరదు. పైగా, మసీదులకు చెందిన అజ్ఞాన ఇమాములు ఈ నమాజును మరియు ఇలాగే ‘సలాతుర్రగాయిబ్’ ను కేవలం ప్రజలను సమీకరించడానికి మరియు దీని ద్వారా (ఏదైనా) ప్రత్యేక హెూదా పొందడానికి సాధనంగా చేసుకున్నారు. కథలు చెప్పేవారు సైతం తమ సమూహాల్లో ఈ నమాజును గూర్చే వివరిస్తూ వుంటారు. వాస్తవానికి ఇవన్నీ సత్యానికి చాలా దూరంగా వున్నాయి. (అల్ మౌజుఆత్ : 2వ సంపుటం, 440-443 పేజీలు)
ఇమామ్ నవవీ ఇలా సెలవిచ్చారు:
‘సలాతుర్రగాయిబ్’ గా పేరుగాంచి, రజబ్ నెల మొదటి రాత్రి మగ్రిబ్ – ఇషాల మధ్య 12 రకాతులుగా చదవబడే నమాజ్ మరియు షాబాన్ నెల 15వ రాత్రి 100 రకాతులుగా చదవబడే నమాజ్ – ఈ రెండు నమాజులు ఎంతో నీచమైన బిద్అత్ లు. కనుక ‘ఖువ్వతుల్ ఖులూబ్’ మరియు ‘ఇహ్యా ఉలూమిద్దీన్’ లాంటి గ్రంథాల్లో వీటి వివరణ చూసి మోసానికి గురికావద్దు. అంతేగాక, వీటికి సంబంధించి ఉల్లేఖించబడ్డ హదీసులను చూసి మోసపోవద్దు. ఎందుకంటే – అవన్నీ పూర్తిగా అసత్యం గనుక. (అల్ మజ్మూఅ లిన్నవవీ: 3వ సంపుటం, 379వ పేజీ)
ఇమామ్ షౌకానీ ఇలా వివరించారు:
ఇదొక కాల్పనిక తప్పుడు హదీసు. దీనిలో వచ్చిన పుణ్యానికి సంబంధించిన పదజాలం ద్వారా (ఇదొక కాల్పనిక హదీసని) స్పష్టంగా తెలుస్తుంది. (అంతేగాక) బుద్ధి జ్ఞానాలున్న ఏ ఒక్కరు కూడా దీని కాల్పనికతను గూర్చి సందేహించరు. పైగా దీని ఉల్లేఖకులు గూడా అపరిచితులు. (ఫవాయెద్ అల్ మజ్మూఅ: 53వ పేజీ)
ఆయన ఇంకా ఇలా వివరించారు:
ధార్మిక పరిజ్ఞానులు, విశ్లేషకుల ఒక సమూహం – ఉదా. ‘ఇహ్యా’ గ్రంథకర్త – ఈ హదీసు విషయంలో పొరపాటుకు లోనయ్యింది. వాస్తవానికి – షాబాన్ నెల 15వ రాత్రి గురించి వివిధ పరంపరలతో ఉల్లేఖించబడ్డ హదీసులన్నీ కాల్పనిక, తప్పుడు హదీసులే. (అల్ ఫవాయిదుల్ మజ్మూఅ : 53వ పేజీ)
ముల్లా అలీ ఖారీ ఈ హదీసు గురించి వ్యాఖ్యానిస్తూ ఇలా పేర్కొన్నారు: ఈ నమాజు గురించి బలహీన, కాల్పనిక హదీసులు తప్ప మరేమీ ఉల్లేఖించబడలేదు. అందుకే ‘ఖువ్వతుల్ ఖులూబ్’, ‘ఇహ్యా ఉలూమిద్దీన్’ గ్రంథకర్తలు దీనిని సంగ్రహించడం గురించి మీరు మోసానికి గురి కావద్దు.
ఇంకా ఆయన ఇలా కూడా వివరించారు :
“ఈ బిద్దత్ నమాజ్ మొట్టమొదటగా 448 హి.శ.లో బైతుల్ మఖ్దిస్ నందు సృష్టించబడింది. అగ్ని పూజారులు కొందరు ఇస్లాం స్వీకరించారప్పుడు, వాళ్ళు ముస్లిములతో కలసి నమాజు చేసేటప్పుడు తమ ముందు అగ్నిని మండించేవారు. ఇలా వాళ్ళు ముస్లిములను కూడా సంతృప్తి పరచేవారు మరియు తమ భ్రష్ట విశ్వాసాలపై కూడా ఆచరించేవారు. వీళ్ళు సలాతుల్ అల్ ఫియా నమాజును కూడా ఆవిష్కరించారు. షాబాన్ నెల 15వ రాత్రి వాళ్ళు నమాజు చదువుతూ తమ ముందు అగ్ని మండించేవారు. దీని ద్వారా వారి ఉద్దేశ్యం – అగ్ని ముందు ఎక్కువ సేపు గౌరవంగా నిలవడడం. ఇంకా ఈ అగ్నిని ఆసరాగా చేసుకొని దీని ముసుగులో ఎన్నో చెడు పనులు చేసేవారు. దీనితో ఆ సమయంలోని సజ్జనులు – వీళ్ళు భూమిలోకి దిగద్రొక్కబడతారేమో అని భయపడ్డారు. అందుకే వారు – ఈ బిద్ అత్ ఆచరించబడుతున్న ప్రదేశం వదిలి దూరంగా వెళ్ళిపోయారు. అంతేగాక, దీని ముసుగులో వారు ఎన్నో నిషేధ కార్యాలను కూడా చేసేవారు“. (తొహ్ ఫతుల్ అహ్వజి- 3వ సంపుటం, 165వ పేజీ)
ఎంతో బాధాకరమైన విషయమేమిటంటే అగ్నిపూజారుల ద్వారా హిజ్ర 5వ శతాబ్దంలో ఆవిష్కరించబడి, దాని మహత్యం గురించి కాల్పనిక హదీసులు సృష్టించబడ్డ నమాజును ఈ రోజు ముస్లిములు షాబాన్ నెల 15వ రాత్రి ప్రత్యేకంగా నెలకొల్పుతారు మరియు ఎంతో జోరుగా ఈ తప్పుడు హదీసులను వివరిస్తారు.
ఈ హదీసు మరియు దీని లాంటి మరెన్నో హదీసులు నిస్సందేహంగా అతి బలహీన మరియు కాల్పనిక హదీసులు. ఇమాములలో ఉదా॥కు షౌకానీ, ఇబ్నుల్ జౌజి, ఇబ్నె హిబ్బాన్, ఖుర్తుబీ, సుయూతి మొ॥ వారు ఈ ఉల్లేఖనా లన్నింటినీ నమ్మదగ్గవి కావని ఖరారు చేశారు. మరిన్ని వివరాల కోసం- అల్ ఫవాయద్ అల్ మజ్మూఅ, అల్ మౌజుఅత్ అల్ కుబ్ర, తఫ్సీర్ అల్ ఖుర్తుబీ, అల్ అల్లాలి అల్ మస్నుఅ లను చూడవచ్చు.
కనుక, (ధర్మ) ప్రచార క్షేత్రంలో వున్నవారు- పరంపరల రీత్యా ప్రామాణి కంగా లేని ఈ (కాల్పనిక) ఉల్లేఖనాలను (ఇతరులకు) వివరించడం నుండి మరియు ముద్రించి పంచి పెట్టడం నుండి దూరంగా వుండాలి. ఏదైనా హదీసును (ఇతరులకు) వివరించడానికి ముందు, దాని పరంపరను గూర్చి అన్వేషించడం ఖచ్చితంగా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసుకు సేవ చేయడమే అవుతుంది. అలా కాని పక్షంలో, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఈ హెచ్చరిక ఎల్లప్పుడూ గుర్తుపెట్టు కోవాలి:
“ఎవరైనా, నేను చెప్పని మాటను నాకు ఆపాదిస్తే, అతను తన నివాసాన్ని నరకంలో ఏర్పరచుకోవాలి”. (బుఖారీ: 109)
ఇప్పుడు ఉదయించే ప్రశ్న ఏమిటంటే- షాబాన్ 15వ తేదీ రాత్రి మహ త్యాన్ని గురించి ఉల్లేఖించబడ్డ ప్రామాణిక హదీసు – “అల్లాహ్ షాబాన్ 15వ రాత్రి తన సృష్టితాల వైపు (దయతో) చూస్తాడు. తదుపరి బహుదైవారాధకుడు, ఆసూయపరులను తప్ప మిగతా అందరినీ క్షమిస్తాడు” లో సమావేశాలు ఏర్పాటు చేయడం గురించి వుందా? లేక ఏదైనా ప్రత్యేక ఆరాధన గురించి వుందా? లేదా ఈ హదీసులో దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చమని వచ్చిందా?
ఈ ప్రశ్నలకు జవాబు – పనికిమాలిన, కాల్పనిక ఉల్లేఖనాలను విడిచి, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి స్వచ్ఛమైన షరీయతుపై విశ్వాసం వుంచే ప్రతి ఒక్కడూ ఇవ్వగలడు. ఈ హదీసును న్యాయంగా గనక పరిశీలిస్తే విశదమయ్యే విషయమేమిటంటే- ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీనిలో ఎలాంటి సమావేశం గురించి గానీ, ప్రత్యేక ఆరాధన గురించి గానీ, దీపాలంకరణ చేసి బాణసంచా కాల్చడం గురించి గానీ ప్రస్తావించలేదు. పైగా ప్రస్తావించింది కేవలం ఏమిటంటే – అల్లాహ్ యొక్క సువిశాల మన్నింపు గురించి. తమ విశ్వాసంలో షిర్క్ ను చేర్చనివారు, స్వీయ శతృత్వ కారణంతో తోటి ముస్లిం పట్ల ఈర్ష్య, అసూయ కలిగి వుండని వాళ్లు దీనికి అర్హులు.
అందుకే, ఈ రాత్రిలోని సువిశాల మన్నింపు యొక్క అర్హత పొందాలంటే- మనిషి ముందుగా తన విశ్వాసాన్ని సరిచేసుకోవాలి. లాభ నష్టాల యజమాని కేవలం అల్లాహ్ అని గట్టిగా విశ్వసించాలి. కష్టాలను తీర్చేవాడు కూడా కేవలం ఆయనే అని విశ్వసించి కేవలం ఆయనపైనే నమ్మకం వుంచాలి. తమ ఆశలు నెరవేర్చే కేంద్రంగా దర్బారులను, మజార్లను కాక కేవలం అల్లాహ్ ను చేసుకోవాలి. పీర్లకు, సన్యాసులకు భయపడకుండా కేవలం అల్లాహ్ కు భయ పడాలి. మ్రొక్కుబడులు కూడా కేవలం అల్లాహ్ తోనే చేసుకోవాలి. ఆయనను తప్ప మరెవరినీ వేడుకోకూడదు. దీనితోపాటు, తోటి ముస్లిముల పట్ల ఈర్ష్య, అసూయలను వదిలి హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. మనిషి సాఫల్యానికి ఇవి ఎంతో అవసరమైన విషయాలు. ఇక దీపాలంకరణ చేసి బాణసంచా కాల్చడమైతే వృధా ఖర్చే. కనుక మన ధర్మం వారించిన ఈ విషయం నుండి గూడా దూరంగా వుండడం తప్పనిసరి.
ఎంతో దురదృష్టకరమైన విషయం ఏమిటంటే – షాబాన్ 15వ తేదీ రాత్రి మహత్యం గురించి ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా వివరించినదేమిటంటే ముష్రిక్ మరియు అసూయపరులను అల్లాహ్ క్షమించడు. వారు తప్ప మిగతా అందరిని ఆయన క్షమిస్తాడు. మరి ఈ రోజును ఎంతో మంది ప్రత్యేకంగా జరుపుకొంటారు. షబే బరాత్ ను పురస్కరించుకొని సమావేశాలు నిర్వహించ బడతాయి, వాటిలో ఈ రాత్రి మహత్యం గురించి కాల్పనిక, తప్పుడు హదీసులు వివరించడంతోపాటు, ‘నాత్’ పఠించేవారు మరియు వక్తలు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను వేడుకుంటారు. సహాయం కోసం ఆయనను అర్థిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే – బాహాటంగా షిర్క్ చేస్తూ ‘అల్లాహ్ క్షమాపణ’పై ఆశపెట్టుకుంటారు!
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసుకు ఆచరణ రీత్యా పరిహాసమాడబడుతుంది. మరి చూస్తే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) చాలా స్పష్టంగా – ముష్రిక్ ను క్షమించడం జరుగదు అని సెలవిచ్చివున్నారు. అయినప్పటికీ (షిర్క్ చేస్తూ) ఈ రాత్రి – నరకాగ్ని నుండి స్వేచ్ఛ పొందడానికి అనుమతి లభించిందని అనుకుంటారు.
ఎంత విచిత్ర పరిస్థితి ఇది! షిర్క్ నుండి పూర్తిగా పశ్చాత్తాప పడాల్సింది పోయి దీనిని క్రియాత్మకంగా ఆచరణలో పెట్టి దీని వైపునకు ప్రజలను ఆహ్వానించడం జరుగుతుంది!
ఎవరైనా ఇలా ప్రశ్నించవచ్చు- ఈ రాత్రి మన్నింపుల రాత్రి అని స్వయంగా రుజువు చేశారు. మరి ఈ రాత్రి ప్రత్యేకంగా ఆరాధిస్తే వచ్చిన నష్టమేంటి?
దీనికి మా జవాబు ఏమిటంటే- దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అల్లాహ్ మనకోసం ఆదర్శవంతునిగా ఖరారు చేశాడు. దీని అర్థం ఏమిటంటే- మనం ప్రతి రంగంలోనూ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అడుగుజాడల్లో నడుస్తూ ఆయనను అనుసరించాలి. అందుకే ఏ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏ ఆరాధన చేశారు అన్న విషయం చూడాలి. ఇలా, మనం హదీసు గ్రంథాలు మరియు ఆయన జీవిత చరిత్రను వివరించే గ్రంథాలను తిరగేస్తే మనకు తెలిసే విషయం ఏమిటంటే – ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ రాత్రి ప్రత్యేకంగా ఏమీ ఆరాధించలేదు, ప్రత్యేకంగా దీనిని జరుపుకోలేదు, సహాబాలను గూడా దీని గూర్చి ప్రోత్సహించలేదు.
అందుకే, మన ప్రియతమ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీనిని చేయలేదు కాబట్టి మనం కూడా చేయకూడదు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దీనిని (ఈ రాత్రిని) ఉత్సవంగా జరుపుకోలేదు కాబట్టి మనం కూడా జరుపుకోకూడదు.
హాఫిజ్ ఇబ్నె రజబ్ ఇలా పేర్కొన్నారు: షాబాన్ 15వ రాత్రి ఖియాం మహత్యం గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు సహాబాల ద్వారా ఏదియూ (ప్రామాణికంగా) నిర్ధారించబడలేదు. (లతాయిఫుల్ మారిఫ్)
ఇమామ్ అబూ బక్ర్ తర్ తూషి, జైద్ బిన్ అస్లం (తాబయీ) ద్వారా ఇలా ఉల్లేఖించారు: మేము మా గురువులనూ, ధార్మిక పరిజ్ఞానులనూ షాబాన్ 15వ రాత్రి వైపునకు గానీ, మక్ హూల్ వివరించిన హదీసు వైపునకు గానీ మ్రొగ్గు చూపడం చూడలేదు. అంతేగాక వారు ఈ రాత్రి ఔన్నత్యం వేరే రాత్రుల కన్నా ఎక్కువైనదని కూడా విశ్వసించేవారు కాదు.
ఇబ్నె అబీ మలైకాకు ఓసారి జియాద్ అనే కథలు చెప్పేవాడొకడు ప్రజలతో ఈ రాత్రి ప్రతిఫలం లైలతుల్ ఖద్ర్ ప్రతిఫలానికి సమానం అని చెబుతూ వుంటాడు – అని చెప్పబడింది. దీనికి ఆయన- నేను గనక వాడి ద్వారా ఈ మాట వింటే, నా చేతిలో కర్ర గనక వుంటే వాణ్ణి తప్పకుండా శిక్షిస్తాను అని అన్నారు. (అల్ హవాదిస్ వల్ దిద్ అ)
చర్చ సారాంశమేమిటంటే – షాబాన్ నెల 15వ రాత్రి ఆరాధన మహత్యం గురించి ఏదియూ (ప్రామాణికంగా) నిర్ధారించబడలేదు. దీని గురించి వివరించ బడే విషయాలన్నీ అసత్యాలు మరియు కల్పితమైనవి.
ఆలోచించదగ్గ మరో విషయమేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) షాబాన్ 15వ రాత్రి మహత్యం గురించి – “అల్లాహ్ తన దాసులపై ప్రత్యేకంగా దృష్టి సారించి ముష్రిక్ మరియు అసూయపరులను తప్ప అందరినీ క్షమిస్తాడు”- అని ఏదైతే సెలవీయబడిందో, అదే మహత్యం సోమవారం మరియు గురు వారాలకు గూడా ఇవ్వబడింది. దీని గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“ప్రతి సోమ మరియు గురువారాల్లో స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి. తదుపరి షిర్క్ చేయని, తన సోదరుని పట్ల ఈర్ష్య, అసూయ కలిగి వుండని ప్రతి వ్యక్తిని క్షమించడం జరుగుతుంది. తమ మధ్య ఈర్ష్య, అసూయ కలిగివున్న ఇద్దరు వ్యక్తులు సంధి చేసుకొనే వరకు వారికి వ్యవధి నివ్వడం జరుగుతుంది“. (ముస్లిం : 2565)
కనుక షాబాన్ నెల 15వ తేదీ రాత్రి మన్నింపు హదీసును – ప్రత్యేకంగా ఈ రాత్రిని (ఉత్సవంగా) జరుపుకోవడానికి, సమావేశాలు ఏర్పాటు చేయడానికి, ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి ఆధారంగా చేయలేం. ఒకవేళ ఈ కార్యాలన్నింటికీ దానిని (ఆ హదీసును) ఆధారంగా తీసుకుంటే మరి అలాంటి మహత్యమే సోమ, గురువారాలకు కూడా ఇవ్వబడింది. కనుక, షబే బరాత్ ను జరుపుకొనే వారు సోమ, గురువారాలను కూడా ప్రత్యేకంగా జరుపుకుంటారా మరి? ఆ రోజుల్లో కూడా ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తారా?
అల్లాహ్ మనందరినీ క్షమించుగాక! మనందరినీ సత్యాన్ని అర్థం చేసుకొని దానికనుగుణంగా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక! మరియు అసత్యం నుండి దూరంగా వుండే సద్బుద్ధిని ప్రసాదించుగాక! ఆమీన్!!
షబే బరాత్ జరుపుకొనే వారు ఈ రాత్రిని నిర్ణయాలు గైకొనబడే రాత్రిగా భావిస్తారు. దానికి ఆధారంగా ఈ ఆయతను తీసుకుంటారు:
إلا الزلتُهُ في لَيْلَةٍ مُبَرَكَةِ إِلا لَنَا مُنْذِرِينَ فِيهَا يُفْرَقُ كُلُّ أَمْرٍ حَكِيون
“నిశ్చయంగా మేము దీనిని (ఖురాన్ను) శుభప్రదమైన రాత్రి యందు అవతరింపజేశాము. నిస్సందేహంగా మేము హెచ్చరిక చేసేవాళ్ళము. ఆ రాత్రి యందే కీలకమైన ప్రతి ఉత్తర్వూ జారీ చేయబడుతుంది”. (దుఖాన్ : 3-4)
అల్లాహ్ యొక్క ఈ ఆదేశంలో ‘శుభప్రదమైన రాత్రి’ గురించి వివరించ బడింది. దీనిలో దివ్య ఖురాన్ అవతరింపజేయబడడంతో పాటు సం॥ అంతా జరగబోయే సంఘటనల గురించి నిర్ణయాలు తీసుకోబడతాయి. ఇక చూడాల్సిన విషయం ఏమిటంటే – ఆ శుభప్రదమైన రాత్రి అంటే ఏ రాత్రి? అని.
ఒకవేళ మనం, మన సంకల్పానికనుగుణంగా ఖురాన్ ను విశ్లేషించడం వదిలిపెట్టి, స్వయంగా ఖురాన్లోనే దాని విశ్లేషణను అన్వేషిస్తే ఈ ప్రశ్నకు సమాధానం మనకు దొరుకుతుంది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
إِنَّا أَنْزَلْنَهُ فِي لَيْلَةِ الْقَدْرِ
“నిశ్చయంగా మేము దీనిని (ఖురాన్ ను) ‘లైలతుల్ ఖద్ర్’ (ఘనమైన రాత్రి) యందు అవతరింపజేశాము“. (ఖద్ర్ : 1)
దీని ద్వారా – శుభప్రదమైన రాత్రి అంటే ‘లైలతుల్ ఖద్ర్’ అని తెలుస్తుంది. ఇది రమజాన్ నెలలోని ఆఖరి పది రోజుల్లోని బేసి సంఖ్యల రాత్రుల్లో వస్తుంది. అదేరాత్రి మనిషి జీవితం, మరణం, జీవనోపాధి తదితర అంశాలను గురించి నిర్ణయాలు తీసుకోబడతాయి.
‘శుభప్రదమైన రాత్రి’ గురించి అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రజియల్లాహు అన్హు), ఖతాదా, ముజాహిద్, హసన్ మొ॥ వారు కూడా ఇలాగే విశ్లేషించారు. ఈ విశ్లేషణనే విద్వాంసులందరూ సరైన విశ్లేషణగా ఖరారు చేశారు. (తఫ్సీర్ ఖుర్తుబీ : 8వ సంపుటం,, 432-433 పేజీలు)
ఇమామ్ అబూ బక్ర్ ఇబ్నుల్ అరబీ ఇలా పేర్కొన్నారు: ధార్మిక పండితుల దృష్టిలో ‘శుభప్రదమైన రాత్రి’ అంటే ‘లైలతుల్ ఖద్ర్’ అని అర్థం. కానీ కొందరి దృష్టిలో మాత్రం ఇది షాబాన్ నెల15వ రాత్రి. కానీ ఇది అసత్యం. ఎందుకంటే అల్లాహ్ తన సత్య గ్రంధంలో – ‘రమజాను నెల ఖురాన్ అవతరింప జేయబడిన నెల’ అని వివరించి తదుపరి, ఈ నెలలోని ‘లైలతుల్ ఖద్ర్’ను ఖురాన్ అవతరించిన రాత్రిగా ఖరారు చేశాడు. ఇక దీనిని (ఈ సత్యాన్ని) వదిలిపెట్టి ఎవరైనా, శుభప్రదమైన రాత్రి అంటే లైలతుల్ ఖద్ర్ కాక మరో రాత్రి అని అంటే అతను అల్లాహ్ పై పెద్ద అభాండం మోపినట్లే. షాబాన్ 15వ రాత్రి మహత్యం గురించి లేదా ఆ రాత్రి నిర్ణయాలు తీసుకోబడతాయి- అన్న దాని గురించి వచ్చిన హదీసులన్నీ అత్యంత బలహీనమైనవి. కనుక వీటి జోలికి పోకండి. (అహముల్ ఖురాన్, ఇబుల్ అరబీ:4వ సంపుటం, 106వ పేజీ)
ఇమామ్ ఇబ్నె కసీర్ ఇలా పేర్కొన్నారు : ‘శుభప్రదమైన రాత్రి’ మరియు ‘నిర్ణయాలు తీసుకోబడే రాత్రి’ అంటే లైలతుల్ ఖద్ర్ అని అర్థం. ఇక ఎవరైనా, ఇక్రమా చెప్పినట్లు-దీని అర్థం షాబాన్ 15వ రాత్రి – అని అంటే అది సరైనది కాదు, ఎందుకంటే స్వయంగా ఖురాన్ ద్వారానే ‘ఈ రాత్రి రమజాన్ నెలలో వస్తుంది’ అని రూఢీ అవుతుంది. (తఫ్సీర్ ఇబ్నె కసీర్ : 4వ సంపుటం, 163వ పేజీ)
కనుక షాబాన్ 15వ రాత్రిని నిర్ణయాలు తీసుకోబడే రాత్రిగా ఖరారు చేయడం ఎంతమాత్రం సరికాదు, దానికేమాత్రం విలువ లేదు.
ఆఖరుగా అల్లాహ్ ను వేడుకొనేదేమిటంటే – ఆయన మనందరినీ ఆయన విధేయతకు కట్టుబడి, ఆయన అవిధేయతకు దూరంగా వుండే సద్బుద్ధిని ప్రసాదించుగాక! మరియు మన అంతం ‘తౌహీద్ మరియు సత్యార్యాలపై’ కలుగజేయుగాక! ఆమీన్!
—
షాబాన్ నెల (The Month of Shaban) – Main page
షాబాన్ నెలకు సంబంధించిన పుస్తకాలు , ఆడియో, వీడియో , ఖుత్బాలు ..అన్నీ
https://teluguislam.net/2023/02/22/the-month-of-shaban/
రమదాన్ కొరకు సిద్ధపడే మాసం షాబాన్ – నసీరుద్దీన్ జామి’ఈ [32 ని] [వీడియో]
షాబాన్ నెల – విశేషాలు, ఆదేశాలు – జాదుల్ ఖతీబ్ [డైరెక్ట్ PDF] [19 పేజీలు]
రండి! షబె బరాత్ ఇలా జరుపుకుందాం – నసీరుద్దీన్ జామి’ఈ [11 ని] [ఆడియో]
షాబాన్ మాసపు ఘనత, సున్నతులు (ఆచారాలు) & బిద్అతులు (దురాచారాలు) – నసీరుద్దీన్ జామి’ఈ [42 ని] [వీడియో]
షాబాన్ నెల యొక్క సున్నతులు (ఆచారాలు) – నసీరుద్దీన్ జామి’ఈ [30 ని] [ఆడియో]
షాబాన్ నెల యెుక్క వాస్తవికత! షాబాన్ సున్నతులేమిటి? దురాచారాలేమిటి? – నసీరుద్దీన్ జామి’ఈ [పుస్తకం]
షబ్బే బరాత్ – షాబాన్ నెల యొక్క బిద్ఆత్’లు (దురాచారాలు) – నసీరుద్దీన్ జామి’ఈ [30 ని] [ఆడియో]
షబే బరాత్ చెయ్యమని దైవప్రవక్త ﷺ చెప్పారా? – షరీఫ్ మదనీ , వైజాగ్ [3 ని] [వీడియో]
షాబాన్ నెల వాస్తవికత – జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ
షాబాన్ నెల 15వ తేదీ రాత్రి అల్లాహ్ వీరిని తప్ప అందరినీ క్షమిస్తాడు – నసీరుద్దీన్ జామి’ఈ [10 ని] [ఆడియో]
13, 14 & 15 వ షాబాన్ రోజు ఉపవాసం గురుంచి ప్రశ్న – నసీరుద్దీన్ జామి’ఈ [7 ని] [ఆడియో]
షాబాన్ నెల సగభాగం గడిచి పోయిన తరువాత ఉపవాసం ఉండటం నిషేధం – పెద్ద షేఖుల నుండి ఫత్వా
గత రమజాన్ లో ధర్మ కారణం లేకుండా తప్పిపోయిన ఉపవాసాలు వచ్చే రమజాన్ లోపల పూర్తి చేసుకోలేకపోతే? [ఆడియో]
You must be logged in to post a comment.