ధర్మ విద్య ఎందుకు నేర్చుకోవాలి? [ఆడియో & టెక్స్ట్]

ధర్మ విద్య ఎందుకు నేర్చుకోవాలి?
https://youtu.be/dkJiN7q3VZA (38నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం ఇస్లాంలో ధార్మిక విద్య యొక్క ప్రాముఖ్యత మరియు దాని విధిగా ఉండటంపై దృష్టి సారిస్తుంది. ప్రపంచ విద్యకు లభించే విలువను, ధార్మిక విద్య పట్ల ప్రజల నిర్లక్ష్యంతో పోల్చి చూపిస్తుంది. కంపెనీ నియమాలు పాటించడం ఉద్యోగానికి ఎలా అవసరమో, సృష్టికర్త నిర్దేశించిన మార్గాన్ని అనుసరించడం మానవ గౌరవాన్ని నిలబెట్టడానికి అంతకంటే ముఖ్యం అని వక్త ఉద్ఘాటించారు. ధార్మిక విద్య అంటే ఒక ఉత్తమ మానవునిగా ఎలా జీవించాలో సృష్టికర్త నేర్పిన పద్ధతి అని నిర్వచించారు. విద్యను అభ్యసించడం మొదలుపెట్టిన క్షణం నుండే పుణ్యాలు లభిస్తాయని, అది స్వర్గానికి మార్గాన్ని సులభతరం చేస్తుందని, మరియు విద్యార్థి కోసం సృష్టిలోని ప్రతి జీవి ప్రార్థిస్తుందని వివరించారు. ఇస్లాం యొక్క మొట్టమొదటి ఆదేశం “ఇఖ్రా” (చదువు) అని గుర్తుచేస్తూ, జ్ఞానం ఇస్లాంకు పునాది అని స్పష్టం చేశారు.

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం)
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బ’అద్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబంపై మరియు వారి అనుచరులందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆ తర్వాత.

మహాశయులారా, అల్లాహ్ దయతో ఈరోజు మనం, ధర్మ విద్య అభ్యసించడం, ధర్మ జ్ఞానం నేర్చుకోవడం దీనికి సంబంధించిన ఘనతలు ఏమిటి? మరియు ధర్మ జ్ఞానం నేర్చుకోవడం మనపై విధిగా ఉందా? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

సామాన్యంగా ఈ రోజుల్లో ప్రజలు, రండి ఒకచోట కూర్చుందాం, ఫలానా రోజు మనం మస్జిద్ లో ఒక కూటమి ఉంది, ఒక ఇజ్తిమా ఉంది, అక్కడికి వెళ్లి ధర్మ విద్య నేర్చుకుందాము, ధర్మ జ్ఞానం నేర్చుకుందాము అని ఎవరికైనా మనం ఆహ్వానిస్తే, ధర్మ విద్య సమావేశాల్లో పాల్గొనడానికి మనసు అంతగా ఆకర్షించదు. అదే వేరే ఏదైనా జనరల్ ప్రోగ్రాం గానీ లేక వేరే ఏదైనా ఆటపాటల ప్రోగ్రాం అయితే, చెప్పకున్నా గానీ కేవలం తెలిస్తే సరిపోతుంది. ప్రజలు తమకు తామే వచ్చేస్తారు.

అంతకు ముందు మనం ధర్మ విద్య నేర్చుకోవడం మనపై విధియా? నేర్చుకోకపోతే నష్టం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాము.

ఈ ప్రశ్నకు సమాధానం డైరెక్ట్ సూటిగా ఖురాన్ మరియు హదీసు ఆధారంగా ఇచ్చే ముందు ఒక చిన్న సంఘటన, ఒక చిన్న విషయం మనం మాట్లాడుకుందాము. అదేమిటంటే, ఈరోజు ఒక వ్యక్తి కలిశాడు, జుహర్ కంటే కొంచెం ముందు. నాకు తెలిసిన వ్యక్తి, అతని బావ గురించి చెప్తున్నాడు. ఏమని?

మొన్న మూడు నాలుగు రోజుల క్రితం నేను ఫోన్ చేశాను అతనికి, అంటే మా బావకు. ఒక ట్రైనింగ్ లో, ఏం ట్రైనింగ్ నాకు తెలియదు కానీ, ఆ ట్రైనింగ్ విషయంలో ఢిల్లీకి వచ్చాడు. ప్రాపర్ అసలు ఉండేది హైదరాబాద్. ఢిల్లీకి వచ్చాడు అని. ఈరోజు నేను ఫోన్ చేశాను, చేసేసరికి ఈరోజు నైట్ లో దమ్మాంకు ఫ్లైట్ ఉంది, అతను ఒక నెల విజిట్ వీసా మీద ఒక ఏదో పెద్ద కంపెనీలో ఏదో సాఫ్ట్వేర్ కు సంబంధించిన మంచి చదువు చదివి ఉన్నారు, మంచి డిగ్రీ చేసి ఉన్నారు. దాని మీద కంపెనీ అతన్ని పంపుతుంది. టికెట్, ఇక్కడికి వచ్చిన తర్వాత జీతం, అన్నీ వాళ్ళే భరిస్తున్నారు.

హైదరాబాద్ నుండి బయలుదేరే లేరి, ఇక్కడ దమ్మాంలో చేరుకునేసరికి ప్రయాణ ఖర్చులు ఏదైతే అంటాం కదా? టికెట్ కాదు, కేవలం జేబు ఖర్చుకు ప్రయాణ ఖర్చులు అంటాం కదా, 300 డాలర్లు ఇచ్చారంట. 300 డాలర్లా? మాషా అల్లాహ్. కేవలం ప్రయాణ ఖర్చులు. హైదరాబాద్ నుండి దమ్మాం వచ్చేసరికి ఎన్ని గంటలు పడుతుంది? మహా ఎక్కువ అంటే ఐదు, ఆరు గంటలు అంతే.

తర్వాత ఏం చెప్పాడంటే, వాస్తవానికి ఎవరు ఎంత గొప్ప విద్య అభ్యసించి, ఎంత పెద్ద డిగ్రీలు సంపాదించి, ఆ ప్రకారంగా జీవితం గడుపుతారో, అతనికి ఇహలోకంలో ఎంత హైఫై, అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి.

అయితే అతను చెప్పిన సంఘటన మీద కొంచెం గ్రహిస్తే, ఈ ప్రపంచంలో ప్రపంచానికి సంబంధించిన ఏదైనా విద్య చాలా ఎక్కువ మోతాదులో, పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించి నేర్చుకుంటే, దానికి అనుకూలంగా మంచి హోదా అంతస్తులు, మంచి జీతాలు, మంచి ఉద్యోగాలు లభిస్తాయి అన్నటువంటి ఆశ మనిషికి ఉంటుంది.

దీనిని బట్టి మీరు ఒక విషయం తెలుసుకోండి. ప్రపంచానికి సంబంధించిన విద్య నేర్చుకొని లక్షలు ఖర్చు పెట్టి అంతా నేర్చుకున్న తర్వాత, దానికి తగిన ఫలం కూడా మనకు లభిస్తుంది అన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో, మన సృష్టికర్త పంపించినటువంటి గ్రంథం, దాని యొక్క విద్య మనం నేర్చుకుంటే ఏం లాభం ఉంటుంది అని అనుకోవడం, ఇది మన సృష్టికర్త పట్ల మనకు ఎంతటి గొప్ప భావన మనసులో ఉందో అట్లాగే మనకు అర్థమైపోతుంది. ఆలోచించండి. మనుషులు, ప్రజలు తయారు చేసిన విద్యలు, వారు స్వయంగా పుస్తకాలు రచించి, ఇహలోకంలో కొన్ని విషయాలు కనుక్కొని, వాటికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకొని, మంచి హైఫై ఉద్యోగాలు దొరికినందుకు ఎంత సంతోషించిపోతున్నారు, ఎంత సంబరపడుతున్నారు.

అదే మన సృష్టికర్త అయిన అల్లాహ్ ఆయనకు సంబంధించిన విద్య, ఆయనకు సంబంధించిన విషయాలు, ఆయన ఇచ్చిన ఆదేశాలు, ఆయన తమ అతి గౌరవనీయులైన మహనీయ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చిన ఆదేశాలు నేర్చుకోవడం ఎంతో హీనంగా, ఎంతో తక్కువగా మనం భావిస్తున్నామంటే, మనమే ఆలోచించుకోవాలి, మన మనసులో, మన హృదయంలో అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అదే విధంగా నేను అల్లాహ్ తో కూడా మహబ్బత్ కర్తా హు, నాకు అల్లాహ్ పట్ల పిచ్చి ప్రేమ ఉంది, అని ఏదైతే మనం నోటితో అంటామో, అది ఎంతవరకు నిజమనేది అట్లాగే మనం తెలుసుకోవచ్చు.

రెండో విషయం. దీనికి సంబంధించిందే. ఏదైనా కంపెనీలో మంచి ఉద్యోగం మనం పొందిన తర్వాత, కేవలం ఇప్పుడు ఊహించండి, ఒక వ్యక్తి హైఫై డిగ్రీలు సంపాదించి మంచి ఉద్యోగం అతను పొందాడు. కంపెనీలోని రూల్స్ రెగ్యులేషన్స్, డ్యూటీ టైమింగ్స్, ఆ డ్యూటీ ఎలాంటిదో, దానికి సంబంధించిన మరి కరెక్ట్ గా చేసినప్పుడే కదా అతను అంత జీతం వేసేది? ఒకవేళ ఏమైనా దొంగ గ్యాంబ్లింగ్ చేసి, పని చక్కగా చేయకుంటే, ఏ విధంగా, ఏ పద్ధతిలో చేయాలో అలా చేయకుంటే, ఒక నెల, రెండేళ్లు ఏదైనా అట్లాంటి మిస్సింగ్ చేస్తే, తర్వాత అయినా గాని పట్టుబడవచ్చు కదా? అతని అంతటి గొప్ప ఉద్యోగం అంతా వృధా అయిపోవచ్చు కదా? సంవత్సరం, రెండు సంవత్సరాల క్రితం సత్యం కంప్యూటర్ యొక్క యజమాని, ఏం పేరు మర్చిపోయాను? రామలింగరాజు, అతని పరిస్థితి, కొందరు అంటారు అతను వాస్తవానికి డబ్బులు దోచాడు, దొంగలించడం, ఏదైనా గ్యాంబ్లింగ్ చేయడం అలాంటివి చేయలేదట. ఏదో కేవలం కంపెనీని ఇంకా డెవలప్ చేసే ఉద్దేశంతోనే ఏదో లెక్కలు కొంచెం అటూ ఇటూ చేశారు అని కొందరు అంటారు. వాస్తవం ఏంటో మనకు తెలియదు. కానీ ఒక ఉదాహరణ మీకు చూపిస్తున్నాను. సత్యం కంప్యూటర్ అంటే ఇండియాలోనే కాదు, హైదరాబాద్ లోనే కాదు, వరల్డ్ లెవెల్ లో ఇంత అతనికి హోదా అంతస్తు ఉండేది. కానీ చిన్నపాటి మిస్టేక్ చేసినందుకు, తప్పు చేసినందుకు,

అయితే, దేవుడు అల్లాహ్ త’ఆలా మనల్ని అంటే ముందు మనం మానవుల్ని, ఇహలోకంలో సర్వ సృష్టిలో ఒక అతి ఉత్తమమైన సృష్టిగా మనకు హోదా అంతస్తు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అందులో ఇంకా మనం ఎవరైతే మనకు మనం ముస్లింలము అని అనుకుంటామో, ఇస్లాం పై ఉన్న వాళ్ళం అని మనం భావిస్తామో, మనకు మనుషుల్లోనే, మానవుల్లోనే ఇతర జాతులపై ఒక హోదా అంతస్తు, ఒక గౌరవం అనేది ఉందా లేదా? ఉంది. మరి ఈ గౌరవం, ఈ హోదా అంతస్తు ఎలా వచ్చేస్తుంది? విద్య లేకుండా, ఎలాంటి మనకు జ్ఞానం లేకుండా అలాగే మనం సంపాదించాలంటే ఈ హోదా దానికి మనం అర్హులం అవుతామా? ఎంతమాత్రం కాము.

షరియత్ యొక్క ఇల్మ్, ధర్మ జ్ఞానం, ధర్మశాస్త్ర జ్ఞానం ఎంత మనకు అవసరం ఉన్నదో ఖురాన్, హదీసుల ఆధారంగా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కానీ అది తెలపడానికి ముందు నేను ఇలాంటి కొన్ని ఉదాహరణల ద్వారా మీకు తెలుపుతున్నాను విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది డైరెక్ట్ ఖురాన్ హదీస్ ఏం చెప్తే, ఆ ఇదేంటి ఖురాన్ హదీస్ తప్ప ఇంకా వేరే రానే రాదా? ఇది మాకు విని విని బోర్ అవుతుందయ్యా అని అంటుంటారు. కానీ ఇది చాలా బాధాకరమైన విషయం.

వాస్తవానికి ఈ 21వ శతాబ్దంలో సైన్స్, మెడికల్ సైన్స్, ఇంకా వేరే టెక్నాలజీలో ఏ డెవలప్మెంట్ అయితే మనం చూస్తున్నామో, కొందరు శాస్త్రార్థులు ఏమంటారో తెలుసా? సైన్స్, టెక్నాలజీ యొక్క డెవలప్ అనేది ఇంతకుముందు కాలాల్లో ఎందుకు జరగలేదు? ఇప్పుడు ఎందుకు జరిగింది? దానికి అసలు మూలం ఇది.

అల్లాహ్ పంపినటువంటి దివ్య గ్రంథం. అంటే ఈ బుక్, అంటే ఈ దివ్య గ్రంథం, సైన్స్ బుక్ అని నేను చెప్పడం లేదు. టెక్నాలజీకి సంబంధించిన దీని యొక్క ముఖ్య ఉద్దేశం, మానవుడు ఇహలోకంలో మంచి జీవితం ఎలా గడపాలి, పరలోకంలో స్వర్గం ఎలా పొందాలి. ఆ మార్గం చూపుతుంది. ఇంకా, మనిషి ఏ తప్పుడు మార్గాలను అవలంబిస్తే స్వర్గంను కోల్పోయి నరకం పాలవుతాడో అది తెలుపుతుంది. సంక్షిప్తంగా నేను తెలిపే విషయం. కానీ ఇందులో, ఈనాటి కాలంలో విద్యకు సంబంధించిన ఎన్ని రకాలు ఉన్నాయో వాటన్ని మూల విషయాలు ఇందులో ఉన్నాయి. దీని మీద రీసెర్చ్ చేస్తూ చేస్తూ చేస్తూ ఇంకా ముందుకు సాగుతున్నారు.

కానీ మనం, మనకు మనం ముస్లింలం అని అనుకునే వాళ్ళం, ఇల్లా మన్ రహిమ రబ్బు, చాలా అరుదైన, చాలా తక్కువ మంది తప్ప, అనేక మంది ముస్లింలం ఈ ధర్మ విద్య నుండి, ఖురాన్ యొక్క విద్య నుండి దూరం అయినందుకే దినదినానికి మన పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. ఇలాంటి సందర్భంలోనే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆ హదీసును గుర్తుంచుకోండి.

إِنَّ اللَّهَ يَرْفَعُ بِهَذَا الْكِتَابِ أَقْوَامًا وَيَضَعُ بِهِ آخَرِينَ
(ఇన్నల్లాహ యర్ఫ’ఉ బి హాదల్ కితాబి అఖ్వామవ్ వయద’ఉ బిహి ఆఖరీన్)
నిశ్చయంగా అల్లాహ్ ఈ గ్రంథం ద్వారా కొందరు ప్రజలను ఉన్నత స్థానానికి తీసుకువస్తాడు, మరియు దాని ద్వారానే మరికొందరిని పడగొడతాడు.

అల్లాహ్ త’ఆలా ఈ గ్రంథం ద్వారా ప్రజల్లో కొందరిని పై స్థానానికి తీసుకొస్తాడు. ఎవరు వారు? ఖురాన్ ను చదివేవారు, దీని విద్య అభ్యసించేవారు, దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారంగా ఆచరించేవారు. ఇంకా ఎవరైతే ఈ ఖురాన్, దీని నుండి వెనుతిరుగుతారో, దీన్ని నేర్చుకోకుండా దూరం అవుతారో, దీని మీద ఏ నమ్మకం, ఏ విశ్వాసం, దీని మీద ఎలా ఆచరించాలో అలా ఆచరించకుండా ఉంటారో, వారి గురించి ఏం చెప్పారు?

وَيَضَعُ بِهِ آخَرِينَ
(వయద’ఉ బిహి ఆఖరీన్)
మరియు దాని ద్వారానే మరికొందరిని పడగొడతాడు.

వారిని చాలా అధోగతికి పాలు చేస్తాడు. చాలా తక్కువ స్థానానికి. అందుగురించి సోదరులారా, ఈ హదీస్ ఇలాంటి సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి. మనిషికి ధర్మ విద్య, తను ఈ జఠర కడుపు గురించి ఏదైతే తింటాడో, త్రాగుతాడో, బ్రతకడానికి రేపటి రోజు మళ్లీ లేచి నిలబడి మంచి ఏదైనా మనం పని చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నాలుగు ముక్కలు తింటాడో, ఆ కూడు కంటే, ఆ భోజనం కంటే ధర్మ విద్య ఎంతో ముఖ్యమైనది.

ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం రహమతుల్లాహ్ అలైహ్ ఒక సందర్భంలో చెప్తారు, ధర్మ విద్య మనిషికి లభించే దొరికే ఉపాధి కంటే ఎంతో ముఖ్యం. ఒకవేళ మనిషికి తిండి లేకుంటే ఏం నష్టం జరుగుద్ది? ఇహలోకంలో జీవితం కోల్పోతాడు. తింటూ బతికినా గాని, ఉపవాసంతో ఉన్నా గాని ఒక రోజు చనిపోయేదే ఉంది. కానీ ధర్మ విద్య లేకుండా, విశ్వాసపరమైన జీవితం గడపకుండా అతను చనిపోయాడు అంటే, శాశ్వతంగా సదాకాలం నరకంలో ఉండే అలాంటి దుర్భాగ్యం కూడా కలగవచ్చు. అందుగురించి ఈ లోకం మనం సామాన్యంగా తెలుగులో ఎన్నో సామెతలు ఉన్నాయి, నీటి బుగ్గ లాంటిది. ఒక ముస్లిమేతర తెలుగు కవి, క్షణమైన మన జీవితం అని ఒక పాట కూడా పాడాడు.

ఈ తక్కువ వ్యవధి, కొద్ది రోజుల్లో అంతమైపోయే జీవితంలో ధర్మ విద్య నేర్చుకొని, మనం దీని ప్రకారంగా జీవితం గడిపితే, చనిపోయిన తర్వాత జీవితం ఏదైతే శాశ్వతంగా ఉందో అక్కడ మనం బాగుపడతాము.

మరో విషయం. మీరు ఈ ప్రాపంచిక జీవితంలో ఏ పని చేయాలన్నా, మన కడుపు గురించి, పొట్టలో మన కడుపులో రెండు ముక్కలు రావడానికి ఏ పని చేయాలన్నా దానికి సంబంధించిన జ్ఞానం నేర్చుకోవడం తప్పనిసరి. అవునా కాదా? లేనిదే అది మనం ఏమీ చేయలేము. అయితే ఈ నాలుగు ముక్కల గురించి, 50, 60 సంవత్సరాల జీవితం ఏదైతే మనం గడుపుతామో, అందులో కొంచెం సుఖంగా ఉండడానికి మనం ఎంత విద్య నేర్చుకొని, ఎంత సంపాదించి, ఎంత మనం కూడబెట్టుకుంటామో, ఆ సదాకాలమైన, శాశ్వతమైన ఆ జీవితం సుఖపడడానికి మనకు ఏ విద్య, ఎలాంటి ఆచరణ అవసరం లేదా?

ఎవరైతే ధర్మ విద్య అవసరం లేదు అని అనుకుంటున్నారో, వారు ఆలోచించాలి. ఇహలోకంలో ఒక్క పూట అన్నం దొరకడానికి మనం రెక్క ఆడనిది మన డొక్క నిండదు. అలాంటి పరిస్థితిలో పరలోకం, శాశ్వతమైన జీవితం, అక్కడి సుఖం మనం పొందాలంటే ఉక్కెక్కనే దొరకాలి? ఎలాంటి ఖర్చు లేకుండా దొరకాలి? ఏ విద్య అభ్యసించకుండా దొరకాలి? ఏ మంచి ఆచరణ లేకుండా దొరకాలి? కేవలం పేరుకు ముస్లిం అని మనం అనుకుంటే సరిపోతుంది అని అనుకోవడం ఇది ఎంత మూర్ఖత్వమో ఆలోచించాలి.

అందుకే సోదరులారా, బహుశా ఈ జనరల్ టాపిక్, ఇలాంటి కొన్ని ఉదాహరణల ద్వారా ధార్మిక విద్య అనేది ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది.

ధార్మిక విద్య అంటే ఏమిటి? సామాన్యంగా కొందరు ఏమంటారు, అరే నేను ఒక జనరల్ గా ఒక మనిషిగా మంచి మనిషిగా బ్రతకాలనుకుంటా కానీ, మస్జిద్ కి పోవడం, ధర్మ విద్య నేర్చుకోవడం ఈ.. నేను ఇది చాలా క్రిటికల్ ఇవన్నీ, ఇదంతా దీనివల్ల గొడవలు జరుగుతాయి అది ఇది అని కొందరు తప్పుడు భావనలో కూడా పడతారు. అసలు మనం ధార్మిక విద్య, ధర్మ విద్య, ధర్మ జ్ఞానం అని అంటున్నాం కదా, ధార్మిక విద్య అంటే ఏంటి?

వాస్తవానికి సోదరులారా, ధార్మిక విద్య అంటే మనం ఒక ఉత్తమ మనిషిగా, ఉత్తమ మనిషిగా ఎలా జీవించగలుగుతామో ఇహలోకంలో, ఆ పద్ధతి మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్త అల్లాహ్ తెలిపాడు. దానిని నేర్చుకొని ఆ ప్రకారంగా జీవితం గడపడమే ధార్మిక విద్య. అదే ధార్మిక జీవితం.

ఇంతకుముందు నేను ఒక విషయం చెప్పాను. ఏ కంపెనీలో పని చేయాలనుకున్నా గాని ఆ కంపెనీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. పాటించకుంటే మనకు దొరికే జీతం అనేది సరిగా రాదు. ఆ కంపెనీ ద్వారా ఏ సుఖం మనం పొందాలనుకుంటున్నామో పొందలేము. అలాగే ఒక ఉత్తమ మనిషిగా, ఉత్తమ మనిషిగా మనం జీవితం గడపాలనుకుంటే, మనకు ఏ డైరెక్షన్, ఏ రూల్స్, ఏ రెగ్యులేషన్స్, ఏ పద్ధతి, ఏ చట్టము, ఏ నియమము అవసరం లేదా? ఆలోచించండి.

ఏ మనం జాబ్ చేస్తామో, ఏ డ్యూటీ చేస్తామో, ఏ ఉద్యోగం చేస్తామో, అక్కడ ఏయే నియమాలు ఉంటాయో, ఏయే చట్టాలు ఉంటాయో, అవన్నీ పాటించడానికి సిద్ధపడతాం మనం. ఎందుకు? జీతం దొరకాలి మనకు.

అయితే, ఉత్తమ మనిషిగా జీవించి పరలోకంలో స్వర్గం పొందడానికి మనకు ఏ పద్ధతి, ఏ డైరెక్షన్స్, ఏ రెగ్యులేషన్స్ అవసరం లేకుండా ఎలా జీవించగలుగుతాము? అయితే ఈ డైరెక్షన్స్, ఈ రూల్స్, రెగ్యులేషన్స్ ఎవరు మనకు మంచి విధంగా చూపించగలుగుతారు? ఎవరైతే మనల్ని పుట్టించారో ఆయనే చూపించగలుగుతాడు. ఉదాహరణకు, మెకానికల్ లైన్ లో పనిచేసేవాళ్లు, టయోటా కంపెనీకి సంబంధించిన బండి, నిస్సాన్ కంపెనీకి సంబంధించిన పార్ట్స్ తీసుకువచ్చి దానిలో పెడితే ఫిట్ అవుతాయా? కావు. చూడడానికి నిస్సాన్ బండి మరియు టయోటా బండి, చూడడానికి సేమ్ ఒకే రకంగా ఉన్నప్పటికీ లోపల కూడా ఎన్నో విషయాలు వేరువేరుగా ఉండవచ్చు. నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నా. అది 100% ఈ ఉదాహరణ అక్కడ ఫిట్ అవుతుందా లేదా అది కాదు, నేను చెప్పే విషయం ఏంటంటే, అల్లాహ్ మనల్ని పుట్టించాడు. మన గురించి, మన భవిష్యత్తు గురించి అల్లాహ్ కు ఎంత మంచి విధంగా తెలుసునో, ఇంకా వేరే ఎవరికైనా తెలిసి ఉంటుందా? ఉండదు. ఆయన చూపిన విధానమే అది సంపూర్ణ విధానం అవుతుంది. ఆయన చూపిన విధానం మీద, ఆ ప్రకారం మనం జీవితం గడిపితేనే మనకు ఇహ-పర రెండు లోకాల సుఖాలు అనేటివి ప్రాప్తమవుతాయి. అందుగురించి అల్లాహ్ త’ఆలా, 28వ పారాలో,

يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ
(యర్ఫ’ఇల్లా హుల్లదీన ఆమనూ మిన్కుమ్ వల్లదీన ఊతుల్ ఇల్మ దరజాత్)
మీలో విశ్వసించిన వారికి, మరీ ముఖ్యంగా జ్ఞానం వొసగబడిన వారికి అల్లాహ్ ఉన్నతమైన హోదాలను ప్రసాదిస్తాడు. (58:11)

మీలో ఎవరైతే విశ్వసించారో మరియు ఎవరైతే విద్య అభ్యసిస్తారో, వీరిద్దరి స్థానాలను అల్లాహ్ త’ఆలా పెంచుతూ పోతాడు, హెచ్చింపు చేస్తూ పోతాడు.

يَرْفَعِ اللَّهُ
(యర్ఫ’ఇల్లాహ్)
అల్లాహ్ హెచ్చిస్తాడు.

హెచ్చుతూ పోతాడు, పైకి తీసుకెళ్తూ ఉంటాడు.

الَّذِينَ آمَنُوا مِنكُمْ
(అల్లదీన ఆమనూ మిన్కుమ్)
మీలో ఎవరైతే విశ్వసించారో వారిని

وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ
(వల్లదీన ఊతుల్ ఇల్మ్)
మరియు ఎవరికైతే విద్య ఇవ్వబడ్డారో,

ఎవరికైతే విద్య లభించినదో, వారిద్దరి స్థానాలను, దరజాత్, అల్లాహ్ త’ఆలా పైకి ఎత్తుతూ పోతాడు. ఇంతకుముందు నేను ఫస్ట్ లో, స్టార్టింగ్ లో ఒక ఉదాహరణ చెప్పాను కదా, ఒక వ్యక్తి తన బావ గురించి. అయితే, ఎంత మంచి విద్య నేర్చుకొని, ఎంత మంచి అతని దగ్గర ఒక పని, షార్ప్నెస్ ఉంటే, అతను అంత హాయిగా సుఖంగా జీవిస్తాడు అని ఏదైతే భావిస్తున్నామో, అల్లాహ్ పంపినటువంటి ధర్మ జ్ఞానం, అల్లాహ్ పంపినటువంటి విద్య, అది నేర్చుకొని చాలా నీచంగా ఉంటాము అని మనం ఎలా భావిస్తున్నాము? మరి అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో ఇంత స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరైతే విశ్వసించి నా విశ్వాస మార్గంలో ఉంటారో, ఎవరైతే నేను పంపిన విద్యను నేర్చుకొని ఆ ప్రకారంగా జీవితం గడుపుతారో, వారి స్థానాలను నేను ఇంకా మీదికి చేస్తూ ఉంటాను, వారికి హోదా అంతస్తులు ప్రసాదిస్తూ ఉంటాను అని అల్లాహ్ త’ఆలా చెప్తున్నాడు. అల్లాహ్ మాటలో ఏమైనా పొరపాటు, అనుమానం అనేది ఉంటుందా? ఉండదు.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అందుకే చెప్పారు,

طَلَبُ الْعِلْمِ فَرِيضَةٌ عَلَى كُلِّ مُسْلِمٍ
(తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం)
విద్యాన్వేషణ ప్రతి ముస్లింపై విధిగా ఉంది.

విద్యా అభ్యసించడం ప్రతి ముస్లిం పై, స్త్రీ అయినా, పురుషుడైనా, ప్రతి ఒక్కరిపై విధిగా ఉన్నది. విధిగా ఉన్నది.

فَرِيضَةٌ
(ఫరీదతున్)
విధి

ఈ ఫరీదా, నమాజ్ ఫర్జ్, రోజా ఫర్జ్ హై, జకాత్ ఫర్జ్ హై అని మనం అనుకుంటాం కదా? ఇక్కడ ప్రవక్త ఏమంటున్నారు?

طَلَبُ الْعِلْمِ فَرِيضَةٌ
(తలబుల్ ఇల్మి ఫరీదతున్)
విద్యాన్వేషణ విధి.

ఇల్మ్, విద్య తలబ్, అభ్యసించడం, నేర్చుకోవడం ఫరీదా, అది కూడా ఒక విధి. కానీ ఈ విధి నుండి మనం సామాన్యంగా ముస్లింలు ఎంత దూరం ఉన్నాము?

తొలిసారిగా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన సూరా ఏది? ఇఖ్రా.

اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ
(ఇఖ్ర’ బిస్మి రబ్బికల్లదీ ఖలఖ్)
చదువు, సృష్టించిన నీ ప్రభువు పేరుతో. (96:1)

خَلَقَ الْإِنسَانَ مِنْ عَلَقٍ
(ఖలఖల్ ఇన్సాన మిన్ అలఖ్)
ఆయన మానవుణ్ణి రక్తపు గడ్డతో సృష్టించాడు. (96:2)

اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ
(ఇఖ్ర’ వరబ్బుకల్ అక్రమ్)
చదువు, నీ ప్రభువు పరమ దయాశీలి. (96:3)

الَّذِي عَلَّمَ بِالْقَلَمِ
(అల్లదీ అల్లమ బిల్ ఖలమ్)
ఆయనే కలము ద్వారా జ్ఞానాన్ని నేర్పాడు. (96:4)

عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ
(అల్లమల్ ఇన్సాన మా లమ్ య’అలమ్)
మానవునికి అతను ఎరుగని విషయాలను నేర్పాడు. (96:5)

ఈ ఐదు ఆయతులు తొలిసారిగా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించాయి. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రవక్త పదవి, ప్రవక్త కిరీటం అనేది ప్రసాదించబడింది. ఈ ఆయతుల మీద శ్రద్ధ వహించండి. ఇఖ్రా, ఈ పదమే ఏమున్నది? చదవండి, చదువు. ఇస్లాం లోని మొట్టమొదటి విషయం చదువు. ఈ చదువు నుండి మనం ఎంత దూరం ఉన్నామో ఈ రోజుల్లో చూడండి.

అచ్చా, చదువులో అబ్బాయి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు అతనికి ముందు మనం ఏం నేర్పాలి? పిల్లవాడు స్కూల్ పోవడానికి మూడు, మూడున్నర, నాలుగు సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు స్కూల్ కి పంపుతాము. మొట్టమొదటిసారిగా ఏ చదువు ఇవ్వాలి మనం? ఆ విషయం కూడా దీని ద్వారా నేర్పడం జరిగింది. ఏంటది?

اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ
(ఇఖ్ర’ బిస్మి రబ్బికల్లదీ ఖలఖ్)
చదువు, సృష్టించిన నీ ప్రభువు పేరుతో. (96:1)

ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడో ఆ సృష్టికర్త పేరుతో మీ చదువును ఆరంభించండి.

خَلَقَ الْإِنسَانَ مِنْ عَلَقٍ
(ఖలఖల్ ఇన్సాన మిన్ అలఖ్)
ఆయన మానవుణ్ణి రక్తపు గడ్డతో సృష్టించాడు. (96:2)

మనిషి పుట్టుక ఎలా జరిగింది? మనిషి యొక్క సృష్టి ఎలా జరిగింది? ఆ విషయం ఇక్కడ తెలపాడు అల్లాహ్ త’ఆలా. ఆ తర్వాత మరోసారి,

اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ
(ఇఖ్ర’ వరబ్బుకల్ అక్రమ్)
చదువు, నీ ప్రభువు పరమ దయాశీలి. (96:3)

చదువు, అక్రం అంటే ఏంటి? మహా గౌరవనీయుడు. ఇజ్జత్ ఓ ఇక్రాం అన్న పదం ఉర్దూలో కూడా వాడుతూ ఉంటారు. ఇక్రాం, అక్రం అంటే అంతకంటే మించిన కరమ్ చేసేవాడు ఇక లేడు అని.

ఇక్కడ ఖురాన్ వ్యాఖ్యానకర్తలు, ముఫస్సిరీనె కిరామ్ ఒక చాలా సున్నితమైన విషయం అంటారా? బారీక్ నుక్తా ఏం తెలుపుతారో తెలుసా? ఇఖ్రా చదువు, వరబ్బుకల్ అక్రమ్, నీ ప్రభువు చాలా గౌరవప్రదమైనవాడు. అంటే ఏంటి? చదువు వల్ల నీకు గౌరవప్రదము లభిస్తుంది. చదువు లేకుంటే మరి తర్వాత,

الَّذِي عَلَّمَ بِالْقَلَمِ
(అల్లదీ అల్లమ బిల్ ఖలమ్)
ఆయనే కలము ద్వారా జ్ఞానాన్ని నేర్పాడు. (96:4)

ఆ అల్లాహ్ కలము ద్వారా మనిషికి విద్య నేర్పాడు.

عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ
(అల్లమల్ ఇన్సాన మా లమ్ య’అలమ్)
మానవునికి అతను ఎరుగని విషయాలను నేర్పాడు. (96:5)

మనిషికి తెలియని జ్ఞానాలు అల్లాహ్ త’ఆలా పంచి నేర్పాడు.

సోదరులారా, తొలిసారిగా అవతరించిన ఈ ఆయతులో మనం శ్రద్ధ వహిస్తే ఎంత గొప్ప విషయం మన గురించి ఉంది. అంతేకాదు. తొలి మానవుడు ఎవరు? ఆదం అలైహిస్సలాం. స్కూళ్లలో చదివిన డార్విన్ థియరీ, డార్విన్ సిద్ధాంతం, కోతి నుండి మనిషి వచ్చినాడు, అది తప్పుడు విషయం. స్వయంగా డార్విన్ దానిని తిరస్కరించాడు. తిరస్కరించి ఒక పెద్ద బోర్డ్ లాగా రాసి సైన్ కూడా చేశాడు. ఈ సిద్ధాంతం, ఈ థియరీ నేనే సృష్టించాను, కానీ దీనికి ఎలాంటి ఆధారం లేదు, ఇది తప్పు అని ఖండించాడు. కానీ ఈ రోజుల్లో అతని ఆ ఖండనను ముందు తీసుకురాకుండా అతని ఆ తప్పుడు సిద్ధాంతాన్ని ప్రజలకు నేర్పుతున్నారు సైన్స్ బుక్ లో. కానీ అల్లాహ్ యొక్క దయవల్ల మనం ముస్లింలము గాని, అలాగే క్రిస్టియన్లు గాని, వారి విశ్వాసం ఏంటి? తొలి మానవుడు ఆదం అలైహిస్సలాం.

ఆదం అలైహిస్సలాం విషయం చెప్పేకి ముందు, మనలో మనలాంటి, తిని త్రాగి సంభోగించి శ్వాస పీల్చుకొని జీవించే ఇంకా వేరే జీవరాసులు ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. వారిలో మనలో తేడా ఏంటి? మనలో వారిలో వ్యత్యాసం, వారికి లేకుండా మనకు అల్లాహ్ ఏదైతే,

وَلَقَدْ كَرَّمْنَا بَنِي آدَمَ
(వ లఖద్ కర్రమ్నా బనీ ఆదమ)
నిశ్చయంగా మేము ఆదం సంతతికి గౌరవాన్ని ప్రసాదించాము (17:70)

మానవులకు మేము ఒక గౌరవమైన, ఒక మంచి గౌరవం అనేది ప్రసాదించాము అని అల్లాహ్ ఏదైతే అంటున్నాడో, అది మనకు ఆ గౌరవం ఎలా లభించింది? అయితే సూర బఖరాలో చూడండి మీరు,

وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا
(వ అల్లమ ఆదమల్ అస్మా’అ కుల్లహా)
మరియు అల్లాహ్ ఆదమ్ కు అన్ని వస్తువుల పేర్లు నేర్పాడు. (2:31)

అల్లాహ్ త’ఆలా ఆదంకు అన్ని విషయాల పేర్లు నేర్పాడు. తర్వాత ఓ దేవదూతలారా, మీరు ఆదంకు సజ్దా చేయండి అని ఆదేశం ఇచ్చాడు. ఆదంకు ఇతరుల మీద గౌరవం అనేది ఏ విషయంలో ప్రసాదించబడింది? విద్య ద్వారా. అర్థమవుతుందా విషయం? విద్య ప్రసాదించి అల్లాహ్ త’ఆలా ఈ విద్య ద్వారా మానవునికి గౌరవం అనేది ప్రసాదించాడు. ఇలాంటి అల్లాహ్ స్వయంగా ప్రసాదించిన ఈ విద్యను ఈరోజు మనం తిరస్కరిస్తున్నాము అంటే, అనేక మంది అనేక మన ప్రజలు, మన ముస్లిం సోదరులు ప్రత్యేకంగా, సోదరులారా, ఇది మనకు మనం ఎంత నష్టంలో పోతున్నామో చాలా గంభీరంగా ఆలోచించవలసిన విషయం.

ఇంకా చెప్పుకుంటూ పోతే విద్య నేర్చుకోవడంలో ఉన్న ఘనతలు, లాభాలు నేర్చుకుంటే ఏం లాభాలు, అవన్నీ మరో పెద్ద టాపిక్ అవుతుంది. కానీ అవన్నీ విషయాలు చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు. కానీ ఒకే విషయం చెప్తాను, కొంచెం శ్రద్ధ వహించే ప్రయత్నం చేయండి.

ఇస్లాం ధర్మం చాలా సులభమైనది. మానవుల కొరకు అనుకూలమైనది. అల్లాహ్ ఇస్లాంకు సంబంధించిన ఏ ఆదేశం మనకు ఇచ్చినా, అందులో మన కొరకు ఇహ-పరలోకాల మేలే మేలు ఉన్నది తప్ప నష్టం లేదు. అయితే, ప్రపంచంలో ఏ ఉద్యోగం పొందడానికైనా, ఏ మీరు పని నేర్చుకున్నా, ఏ విద్య నేర్చుకున్నా, కొన్ని సంవత్సరాలు కష్టపడి ఆ పని, ఆ విద్య నేర్చుకున్న తర్వాత కొద్ది రోజులకు, కొన్ని సంవత్సరాలకు దాని ఫలితం మీకు ముందుకు వస్తుంది. అవునా లేదా? ఇప్పుడు ఈయన కంప్యూటర్ మీద పని చేస్తున్నారు, ఈయన వెళ్లి ఏదో ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు, అన్నయ్య గారు ఏదో ఆ పెయింటింగ్ విషయంలో పని చేస్తున్నారు, ఆ పనులు, మెకానిక్ లైన్ పనులు గాని, నేర్చుకోవడానికి కొంత కాలం పడుతుందా లేదా? ఆ నేర్చుకునే సమయం ఏదైతే ఉందో, ఆ నేర్చుకునేటప్పుడే దాని యొక్క ఫలితం మనకు తొందరగా కనబడుతుందా? కనబడదు. కనబడకుండా గానీ, ఉంటుందా అంత తొందరగా ఫలితం? ఉండదు. కానీ ధర్మ విద్య, ఇల్మె దీన్ దీని గురించి ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి.

ధర్మానికి సంబంధించిన మీరు విద్య నేర్చుకున్నప్పుడు, నేర్చుకొని ఏ విషయం ఎట్లా ఆచరించాలి అని ఆచరించినప్పుడు ఏదైతే మీకు పుణ్యం దొరుకుతుందో, అది తర్వాత దొరుకుతుంది. కానీ ఈ విద్య నేర్చుకునేటప్పుడు కూడా మీకు పుణ్యం దొరుకుతుంది. ఇప్పుడు ఉదాహరణకు, ఉదాహరణకు అన్నయ్య దగ్గర అనుకోండి ఒక లక్ష రూపాయలు ఉన్నాయి. దాంతో జకాత్ ఇవ్వడం విధి ఉందా లేదా? ఉంది. అరే జకాత్ విషయం నేను నేర్చుకోవాలి, జకాత్ నాపై విధి ఉంది అని అన్నయ్య ఇప్పుడు జకాత్ గురించి నేర్చుకోవడం మొదలుపెట్టాడు. జకాత్ ఇచ్చినప్పుడు జకాత్ ఇచ్చిన పుణ్యం దొరుకుద్ది కదా? కానీ జకాత్ కు సంబంధించిన జ్ఞానం ఏదైతే నేర్చుకుంటున్నారో అప్పుడు కూడా అల్లాహ్ అతనికి ఆ పుణ్యం ప్రసాదిస్తూ ఉన్నాడు. ఏ పుణ్యం? ఆ ఇల్మ్ నేర్చుకునే, ఆ విద్య ఏదైతే నేర్చుకుంటున్నారో, ఆ నేర్చుకునే యొక్క పుణ్యం. అంటే మనం నేర్చుకోవడానికి ఏ సమయం అయితే ఉపయోగిస్తున్నామో, వెచ్చిస్తున్నామో, అది కూడా మనకు వృధా పోతలేదు. అది కూడా మనకు లాభకరంగా ఉంది.

అందుగురించే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు? ఒక మహదీసులో,

مَنْ قَرَأَ حَرْفًا مِنْ كِتَابِ اللَّهِ فَلَهُ بِهِ حَسَنَةٌ، وَالْحَسَنَةُ بِعَشْرِ أَمْثَالِهَا
(మన్ ఖర’అ హర్ఫమ్ మిన్ కితాబిల్లాహి ఫలహు బిహి హసనతున్, వల్ హసనతు బి అష్రి అమ్సాలిహా)
ఎవరైతే అల్లాహ్ గ్రంథంలోని ఒక్క అక్షరాన్ని పఠిస్తారో, అతనికి ఒక పుణ్యం లభిస్తుంది, మరియు ఆ పుణ్యం పదింతలు చేయబడుతుంది.

ఎవరైతే ఖురాన్ గ్రంథంలోని ఒక్క అక్షరం చదువుతారో, అతనికి ఎన్ని పుణ్యాలు? ఒక్క అక్షరం పై పది పుణ్యాలు. ఇంకా ఎవరికైనా అర్థం చేసుకోవడంలో కన్ఫ్యూజ్ కావొద్దు అని ప్రవక్త ఇంకా ఒక ఉదాహరణ ఇచ్చి చెప్పారు. సూర బఖరా స్టార్టింగ్ లో ఏముంది?

الٓمٓ
(అలిఫ్ లామ్ మీమ్)
(2:1)

ఇన్ని లా అఖూలు అలిఫ్ లామ్ మీమ్ హర్ఫున్, అలిఫ్ లామ్ మీమ్ ఇది మొత్తం ఒక అక్షరం కాదు. అలిఫున్ హర్ఫున్, వ లామున్ హర్ఫున్, వ మీమున్ హర్ఫున్. అలిఫ్ ఒక అక్షరం, లామ్ ఒక అక్షరం, మీమ్ ఒక అక్షరం. అలిఫ్ లామ్ మీమ్ అని మనం చదివితే ఎన్ని పుణ్యాలు దొరుకుతాయి ఇన్షా అల్లాహ్? 30 పుణ్యాలు దొరుకుతాయి. ఆ తర్వాత,

ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ ۛ هُدًى لِّلْمُتَّقِينَ
(దాలికల్ కితాబు లా రైబ ఫీహి, హుదల్లిల్ ముత్తఖీన్)
ఇది అల్లాహ్ గ్రంథం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది దైవభీతి పరులకు మార్గదర్శకత్వం చూపుతుంది. (2:2)

الَّذِينَ يُؤْمِنُونَ بِالْغَيْبِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ
(అల్లదీన యు’మినూన బిల్ గైబి వ యుఖీమూనస్సలాత వ మిమ్మా రజఖ్నాహుమ్ యున్ఫిఖూన్)
వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు. నమాజును స్థాపిస్తారు. మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చు చేస్తారు. (2:3)

సలాత్, నమాజ్. నమాజ్ చేసినప్పుడు నమాజ్ పుణ్యం దొరుకుతుంది. కానీ నమాజ్ ఎలా చేయాలి? ఏయే నమాజులు విధిగా ఉన్నాయి? నమాజు ఏయే నమాజులు సున్నతులు ఉన్నాయి, నఫీల్లు ఉన్నాయి? నమాజ్ యొక్క కంప్లీట్ పద్ధతి ఏంటిది? నమాజ్ లో ఏమేం చదవాలి? ఇవన్నీ నేర్చుకోవటానికి మనం ఏ సమయం అయితే వెచ్చిస్తామో, అవి నేర్చుకునేటప్పుడు కూడా మనకు పుణ్యం లభిస్తూనే ఉంటుంది. అందుగురించి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక్క హదీస్ వినండి, చాలా శ్రద్ధగా వినండి.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు,

مَا اجْتَمَعَ قَوْمٌ فِي بَيْتٍ مِنْ بُيُوتِ اللَّهِ
(మా ఇజ్తమ’అ ఖవ్మున్ ఫీ బైతిమ్ మిన్ బుయూతిల్లాహ్)
అల్లాహ్ యొక్క గృహాలలో ఒక గృహంలో ఎప్పుడైతే ఒక సమూహం సమావేశమవుతుందో,

అల్లాహ్ యొక్క గృహాల్లో నుండి ఏదైనా ఒక గృహంలో కొందరు సమూహమై ఒకచోట వారు జమా అయి,

يَتْلُونَ كِتَابَ اللَّهِ وَيَتَدَارَسُونَهُ بَيْنَهُمْ
(యత్ లూన కితాబల్లాహి వ యతదారసూనహు బైనహుమ్)
వారు అల్లాహ్ గ్రంథాన్ని పఠిస్తూ, దానిని తమలో తాము బోధించుకుంటూ ఉంటారో,

అల్లాహ్ యొక్క గ్రంథాన్ని చదువుతారు, పరస్పరం దాని విద్య ఒకరికి ఒకరు చెప్పుకుంటారు, దానిని పాఠాలు ఒకరికి ఒకరు చెప్పుకుంటారు, ఏమవుతుంది?

إِلَّا نَزَلَتْ عَلَيْهِمُ السَّكِينَةُ
(ఇల్లా నజలత్ అలైహిముస్సకీనహ్)
వారిపై ప్రశాంతత అవతరించకుండా ఉండదు,

వారిపై ఒక శాంతి, ఒక తృప్తి, ఒక నెమ్మది, నిదానం అల్లాహ్ వైపు నుండి అవతరిస్తుంది.

وَغَشِيَتْهُمُ الرَّحْمَةُ
(వ గషియతుహుముర్రహ్మహ్)
వారిని కారుణ్యం ఆవరిస్తుంది,

అల్లాహ్ యొక్క కారుణ్యం అనేది వారిని చుట్టుకుంటుంది.

وَحَفَّتْهُمُ الْمَلَائِكَةُ
(వ హఫ్ఫత్ హుముల్ మలా’ఇకహ్)
దేవదూతలు వారిని చుట్టుముడతారు,

దేవదూతలు ఆ సమావేశంలో పాల్గొంటారు. ఎన్ని లాభాలని? మూడు కదా? సుకూనత్, రహ్మత్ మరియు దేవదూతలు.

وَذَكَرَهُمُ اللَّهُ فِيمَنْ عِنْدَهُ
(వ దకరహుముల్లాహు ఫీమన్ ఇందహ్)
మరియు అల్లాహ్ తన వద్ద ఉన్నవారి ముందు వారిని ప్రస్తావిస్తాడు.

అల్లాహ్ వద్ద అతి చేరువుగా ఏ దూతలైతే, ఏ గొప్ప సృష్టి అయితే ఉందో, వారి ముందు అల్లాహ్ త’ఆలా వీరిని ప్రశంసిస్తూ ఉంటాడు. ఇంతటి గొప్ప విషయమో, ఇన్ని లాభాలు మనకు ఉన్నాయో చూడండి. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరో హదీస్ లో చెప్పారు,

مَنْ سَلَكَ طَرِيقًا يَلْتَمِسُ فِيهِ عِلْمًا
(మన్ సలక తరీఖన్ యల్తమిసు ఫీహి ఇల్మన్)
ఎవరైతే విద్యాన్వేషణకై ఒక మార్గంలో పయనిస్తారో,

ఎవరైతే ఇల్మ్, విద్య నేర్చుకోవడానికి, అభ్యసించడానికి ఒక దారిలో నడుస్తారో,

سَهَّلَ اللَّهُ لَهُ بِهِ طَرِيقًا إِلَى الْجَنَّةِ
(సహ్హలల్లాహు లహు బిహి తరీఖన్ ఇలల్ జన్నహ్)
అల్లాహ్ దాని ద్వారా అతని కోసం స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని సులభతరం చేస్తాడు.

ఆ దారిని అల్లాహ్ త’ఆలా అతని గురించి స్వర్గం వైపునకు సుగమం చేస్తాడు, సులభం చేస్తాడు. మరో హదీస్ లో చెప్పారు, ఎవరైనా విద్య నేర్చుకోవడానికి ఒక దారి మీద వెళ్తూ ఉంటే దేవదూతలు వారి గురించి తమ రెక్కలను చాచుతారు. అంతేకాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వ సృష్టి, ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి, ప్రతి సృష్టి అతని గురించి, ఓ అల్లాహ్ ఇతన్ని క్షమించండి, ఓ అల్లాహ్ ఇతని మీద కరుణించండి, ఓ అల్లాహ్ ఇతని మీద నీ దయ చూపండి, అని దుఆ చేస్తూ ఉంటారు. పక్షులు గాని, చీమలు గాని, చేపలు గాని, ప్రతి సృష్టి. ఎందుకు?

رِضًا لِمَا يَصْنَعُ طَالِبُ الْعِلْمِ
(రిదల్ లిమా యస్న’ఉ తాలిబుల్ ఇల్మ్)
విద్యాన్వేషి చేసే పని పట్ల సంతృప్తితో.

ఈ తాలిబుల్ ఇల్మ్, ఈ ధర్మ విద్య అభ్యసించే ఈ వ్యక్తి ఏ మంచి ఉద్దేశంతో ఈ ధర్మ విద్య నేర్చుకుంటున్నాడో, దానికి సంతోషపడి. అందుగురించి సోదరులారా, చెప్పాలంటే ఇంకా ఘనతలు ఉన్నాయి, కానీ ഇന്നటితో ఇంతటి విషయాలపై మనం శ్రద్ధ వహించి, ఇంకా మనం మన సోదరులకు, మన మిత్రులకు, మన దగ్గరి బంధువులకు అందరికీ ఈ ఘనతలు తెలిపి, వారందరినీ కూడా ఇలాంటి సమావేశాల్లో పాల్గొనడానికి మనం ప్రయత్నం చేద్దాము. ఇందులో కూడా మనకు ఎంతో గొప్ప పుణ్యం, ఫలితం, అజర్, సవాబ్ ఉంది.

جَزَاكُمُ اللَّهُ خَيْرًا وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ
(జజాకుముల్లాహు ఖైరన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్)
అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చుగాక. మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ఇతరములు:

ప్రళయ దినం మరియు దాని సూచనలు [ఆడియో, టెక్స్ట్]

ఇక్కడ వినండి లేదా ఆడియో డౌన్లోడ్ చేసుకోండి [37నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ప్రళయ దినం యొక్క భయంకరమైన స్వభావం, దాని అనివార్యత మరియు దాని రాకకు ముందు అల్లాహ్ తన కారుణ్యంతో పంపిన సూచనల గురించి వివరించబడింది. ఈ సూచనలు మూడు రకాలుగా విభజించబడ్డాయి: ఇప్పటికే జరిగిపోయినవి (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాక), ప్రస్తుతం జరుగుతూ పెరుగుతున్నవి (అజ్ఞానం మరియు అనైతికత పెరగడం), మరియు ప్రళయానికి అతి సమీపంలో సంభవించే పది పెద్ద సూచనలు. ముఖ్యంగా దజ్జాల్ యొక్క ఫితనా (సంక్షోభం) మరియు దాని నుండి రక్షణ పొందే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టబడింది. ఈ సూచనల గురించిన జ్ఞానం, విశ్వాసులు తమ విశ్వాసాన్ని పటిష్టం చేసుకోవడానికి, సత్కార్యాల వైపు పయనించడానికి మరియు చెడుకు దూరంగా ఉండటానికి ఒక హెచ్చరిక అని వక్త ఉద్బోధించారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

మా సోదరులారా! ప్రళయదినం మరియు దాని యొక్క సూచనల గురించి కొన్ని విషయాలు ఈ రోజు మనం ఇన్ షా అల్లాహ్ తెలుసుకుందాం.

ప్రళయదిన విషయం అనేది చాలా భయంకరమైనది. ఎంత భయంకరమైనదంటే దాన్ని మనం ఊహించలేము ఇప్పుడు. దాని గురించి అల్లాహ్ త’ఆలా సూరె హజ్ లో ఆరంభంలోనే ఒక ఆయత్ లో మూడు విషయాలు తెలిపాడు. ఏ రోజైతే ప్రళయం సంభవిస్తుందో, ఆ రోజు:

يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَى النَّاسَ سُكَارَىٰ وَمَا هُم بِسُكَارَىٰ وَلَٰكِنَّ عَذَابَ اللَّهِ شَدِيدٌ

ఆనాడు మీరు దాన్ని చూస్తారు… పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. గర్భవతుల గర్భాలూ పడిపోతాయి. ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్‌ (తరఫున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది. (22:2)

يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّآ اَرْضَعَتْ
(యౌమ తరౌనహా తద్’హలు కుల్లు ముర్దిఅతిన్ అమ్మా అర్దఅత్)
ఆ రోజు పాలు త్రాపించే తల్లి, పాలు త్రాగే తన పిల్లను మరిచిపోతుంది.

రెండో విషయం చెప్పాడు:

وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا
(వ తదఉ కుల్లు దాతి హమ్లిన్ హమ్లహా)
ప్రతి గర్భిణీ యొక్క గర్భం పడిపోతుంది

మూడో విషయం చెప్పాడు.

وَتَرَى النَّاسَ سُكَارٰى
(వ తరన్ నాస సుకారా)
జనులు ఆ రోజు, ప్రజలు ఆ రోజు మత్తులో ఉంటారు.

وَمَا هُمْ بِسُكَارٰى
(వమా హుమ్ బిసుకారా)
కాని నిజానికి వారు మత్తులో ఉండరు. (22:2)

ఆ మత్తులో ఉండడం అనేది ఏదో మత్తుపదార్థం సేవించినందుకు కాదు.

وَلٰكِنَّ عَذَابَ اللّٰهِ شَدِيْدٌ
(వలాకిన్న అదాబల్లాహి షదీద్)
ఆనాటి అల్లాహ్ యొక్క శిక్ష అనేది చాలా కఠినమైనది. అందుగురించి ప్రళయం సంభవించే రోజు ఇలాంటి పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటారు.

ఆ రోజు రాకముందే విశ్వాసులు సిద్ధమవడం, సత్కార్యాలు ముందుకు పంపుకోవడం, విశ్వాస మార్గాన్ని అవలంబించి ప్రజలందరూ కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ వైపునకు మరలడం తప్పనిసరి. అయితే ప్రళయం అనేది ఈ ప్రపంచమంతా, విశ్వమంతా నాశనమైన రోజు సంభవిస్తుంది. ఆ రోజు వరకు మనం బ్రతికి ఉంటామో లేదో తెలియదు. కానీ ఏ రోజైతే మనకు మన చావు వస్తుందో, ఆ రోజు మన ప్రళయం మనపై సంభవించినట్లే. మనం ఎప్పుడుచనిపోతామో, రేపో మాపో తెలుసా మనకు? తెలియదు. అయితే మనం, మన చావు వచ్చింది అంటే మన ప్రళయం వచ్చేసింది అన్నట్లే. ఆ ప్రళయం గురించి మనం వేచించి ఉండవలసిన అవసరం లేదు. అందుగురించే ఆ ప్రళయ విషయం వచ్చినప్పుడు మనలో ఒక భయం ఏర్పడినప్పుడు మనం సత్కార్యాల వైపునకు ముందుకు వెళ్ళాలి, విశ్వాస మార్గాన్ని బలంగా పట్టుకోవాలి. అప్పుడే మనకు ఇహలోకంతో పాటు పరలోకంలో కూడా మోక్షం అనేది ప్రాప్తమవుతుంది.

అయితే అల్లాహ్ యొక్క దయ మనపై చాలా ఉంది గనక, ఎల్లప్పుడూ మన మేలు కోరేవాడే గనక, ఆ ప్రళయానికి ముందు ఎన్నో సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు సంభవించినప్పుడల్లా మనిషి ప్రళయాన్ని గుర్తు చేసుకోవాలి. మరియు ఆ ప్రళయ రోజు, ప్రళయ దినాన తాను సాఫల్యం పొందిన వారిలో చేరకోవాలి అని తనకు తాను సిద్ధపడుటకు అల్లాహ్ త’ఆలా అలాంటి సూచనలు పంపిస్తూ ఉంటాడు.

ఖుర్ఆన్ లో అల్లాహ్ చెప్పాడు:

فَهَلْ يَنْظُرُوْنَ اِلَّا السَّاعَةَ اَنْ تَأْتِيَهُمْ بَغْتَةً ۚ فَقَدْ جَاۤءَ اَشْرَاطُهَا
(ఫహల్ యన్దురూన ఇల్లస్ సాఅత అన్ త’తియహుమ్ బగ్ తతన్, ఫఖద్ జా’అ అష్రాతుహా)
ఏమిటీ, ప్రళయ ఘడియ హటాత్తుగా తమపైకి రావాలని వారు ఎదురు చూస్తున్నారా? నిస్సందేహంగా దానికి సంబంధించిన సూచనలు (ఇప్పటికే) వచ్చేశాయి. (47:18)

ఏమిటి? ప్రళయం గురించి వారు వేచి చూస్తూ ఉన్నారా? అది ఎప్పుడైనా ముందు నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఏకాయెకిగా రావచ్చు. కానీ ఆ ప్రళయానికంటే ముందు దానికి సంబంధించిన సూచనలు వచ్చేసాయి.

اِقْتَرَبَتِ السَّاعَةُ وَانْشَقَّ الْقَمَرُ
(ఇఖ్ తరబతిస్ సాఅతు వన్ షఖ్ ఖల్ ఖమర్)
ప్రళయం సమీపించినది, చంద్రుడు రెండు ముక్కలయ్యాడు.(54:1)

ఇవన్నీ కూడా ప్రళయ సూచనల్లో.

అయితే సోదరులారా, ప్రళయం గురించి మనం సిద్ధపడడం, అది రాకముందే దాని గురించి మనం తయారీ చేయడం చాలా అవసరం. అయితే ప్రళయానికి ముందు ఏ సూచనలైతే రానున్నాయో, ఆ సూచనలు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతో వివరంగా మనకు తెలిపారు. దానికి సంబంధించిన హదీసులన్నీ ఏవైతే వచ్చాయో, ఆ హదీసులు, పండితులు ఆ సూచనలన్నిటినీ మూడు రకాలుగా విభజించారు.

ఒకటి, కొన్ని సూచనలు వచ్చేసాయి, సమాప్తమైపోయాయి. మరియు కొన్ని రెండో రకమైన సూచనలు, ఆ సూచనలు రావడం మొదలైంది, అది ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మూడో రకమైన సూచనలు ఏమిటంటే, ఆ మూడో రకమైన సూచనలు ప్రళయానికి మరీ దగ్గరగా వస్తాయి, అవి చాలా పెద్ద సూచనలు. అవి రావడం మొదలైంది అంటే ఒకటి వెనుక మరొకటి వస్తూనే పోతాయి. అందులో ఎలాంటి మధ్యలో గ్యాప్ అనేది ఉండదు.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా నియమింపబడి పంపబడడం. ప్రవక్తను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా పంపడం అనేది ప్రళయ సూచనల్లో ఒకటి అని కూడా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చావు, ఆయన ఈ లోకాన్ని వీడిపోవడం కూడా ప్రళయ సూచనల్లో ఒకటి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు:

بُعِثْتُ أَنَا وَالسَّاعَةُ كَهَاتَيْنِ
(బుఇస్తు అన వస్సాఅతు కహాతైన్)
నేను మరియు ప్రళయ ఘడియ ఈ రెండు వేళ్ళ వలే (దగ్గరగా) పంపబడ్డాము.

అంటే మా మధ్యలో ఎక్కువ సమయం లేదు అని భావం. కానీ ఆ సమయం అనేది మన అంచనా ప్రకారంగా కాదు, అల్లాహ్ యొక్క జ్ఞాన ప్రకారంగా.

ఉదాహరణకు, వాటి గురించి ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈ హదీస్ సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది. దాని కొంత భాగం బుఖారీలో కూడా ఉంది.

ఒకసారి జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇస్లాం అంటే ఏమిటి? ఈమాన్ అంటే ఏమిటి? మరియు ఇహ్సాన్ అంటే ఏమిటి? అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దానికి సమాధానం చెప్పారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత ప్రళయం ఎప్పుడు వస్తుంది అని అడిగారు. ప్రళయం ఎప్పుడు వస్తుందో అనేది నాకు తెలియదు అని ప్రవక్త గారు చెప్పారు. అయితే దాని యొక్క సూచనలు ఏవైనా చెప్పండి అని జిబ్రీల్ అడిగినప్పుడు, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు:

أَنْ تَلِدَ الْأَمَةُ رَبَّتَهَا
(అన్ తలిదల్ అమతు రబ్బతహా)
బానిస స్త్రీ తన యజమానురాలికి జన్మనివ్వడం.

మరియు రెండో సూచన ప్రవక్త వారు చెప్పారు, ఒంటిపై గుడ్డ లేనటువంటి వాళ్ళు, కాళ్ళల్లో చెప్పులు లేనటువంటి వాళ్ళు మరియు తిందామంటే టైం కు తిండి దొరకనటువంటి పేదవాళ్ళు, ఎంత ధనం వాళ్ళ చేతుల్లో వచ్చేస్తుందంటే, పెద్ద పెద్ద బిల్డింగులు వాళ్ళు కడతారు.

ఇంకా బుఖారీ ముస్లిం లో మరొక హదీస్ వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయానికి కంటే ముందు కొన్ని సూచనలు సంభవిస్తాయి. విద్య, ధర్మజ్ఞానం అనేది లేపబడుతుంది. అజ్ఞానం పెరిగిపోతుంది. ప్రజలు మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు సేవించడం అధికమైపోతుంది. మరియు వ్యభిచారం కూడా చాలా పెరిగిపోతుంది.

మరొక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయానికి ముందు కొన్ని సూచనలు ఉన్నాయి: అశ్లీలత అనేది ఎక్కువైపోతుంది. ప్రజలు తమ బంధుత్వాన్ని తెంచుకుంటూ ఉంటారు, కలుపుకోవడానికి బదులుగా. మరి ఎవరైతే అమానత్, ఏ విషయమైనా గానీ, నమ్మి ఒకరిని ఏదైనా అతని దగ్గర పెడితే, అలాంటి అమానతులు కాజేసుకునే వాళ్ళు అయిపోతారు. మరి ఎవరైతే మోసం చేసే వాళ్ళు ఉన్నారో, అమానత్ లో ఖియానత్ చేసే వారు ఉన్నారో, అలాంటి వారిని చాలా విశ్వసనీయులు, అమానతులు పాటించే వాళ్ళు అని భావించడం జరుగుతుంది.

ఈ విధంగా ఇంకా ఎన్నో సూచనలు హదీసులో వచ్చి ఉన్నాయి. ఒక సందర్భంలో ఒక గ్రామీణుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, “ప్రవక్తా, ప్రళయం ఎప్పుడు ఉన్నది? దానికి సూచనలు ఏమిటి?” అని అడిగాడు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయం, దానికి సూచన ఏమిటంటే, ఎప్పుడైతే అమానత్, అమానత్ గా ఉండకుండా దాన్ని కాజేసుకోవడం జరుగుతుందో, ఒకరిని విశ్వసనీయుడు, చాలా నమ్మకస్తుడు అని అతని వద్ద ఏదైనా మాట, ఏదైనా వస్తువు పెడితే దానిలో మోసం చేస్తాడో, అప్పుడు నీవు ప్రళయం వస్తుంది అని వేచించు. అయితే అమానత్ లో ఖియానత్ అనేది ఎలా జరుగుతుంది అని ఆ వ్యక్తి అడిగినప్పుడు, ఏ హోదా, ఏ పని, ఏ తగిన మనిషికి ఇవ్వాలో అలా కాకుండా, దానికి అర్హులు లేని వారికి ఇవ్వడం జరుగుతుందో అప్పుడు నీవు ప్రళయం గురించి వేచించు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.

ఈ విధంగా సోదరులారా, ఇక్కడ ఒక విషయం చాలా మనం శ్రద్ధగా మనం గమనించాలి. అదేమిటంటే, ఈ రోజుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే, ఇక ప్రవక్త చెప్పారు గనక, ప్రవక్త మాటల్లో ఎప్పుడూ కూడా అబద్ధం ఉండదు, చెప్పింది జరిగి తీరుతుంది అని ఈ రకంగా కేవలం మనం ఆలోచించి ఉండకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయానికి ముందే సంభవించే సూచనల గురించి మనకు తెలుపుతున్నారు అంటే ఇది కూడా స్వయంగా ఆయన అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త, అల్లాహ్ యొక్క సత్యమైన నిజమైన సందేశ దూత అని భావం. ఎందుకు? ఆయన ఏ మాట కూడా తన ఇష్ట ప్రకారంగా తన నోటితో చెప్పేవారు కాదు.

وَمَا يَنْطِقُ عَنِ الْهَوٰى ۗ‏ اِنْ هُوَ اِلَّا وَحْيٌ يُّوْحٰى
(వమా యన్తిఖు అనిల్ హవా. ఇన్ హువ ఇల్లా వహ్యుయ్యూహా)
అతను తన మనోవాంఛల ప్రకారం మాట్లాడడు. అది పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు. (53:3-4)

ఏదో ముందుకు జరగబోయే విషయాల గురించి ఏదైతే ప్రవక్త గారు చెప్తున్నారో, ఈ రోజుల్లో కొందరు అగోచర జ్ఞానం ఉన్నది, ఆ పండితుడు చాలా ఆరితేరినవాడు, అతను చాలా గొప్పవాడు అని ఏదో పంచాంగం చెప్పినట్లుగా కొన్ని విషయాలు తెలుపుతూ ఉంటారు. ఇలాంటి మోసపూరితమైన మాటలు, నవూదుబిల్లా అస్తగ్ఫిరుల్లా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పేవారు కాదు. అలాంటి విషయాలు ప్రవక్త చెప్పేవారు కాదు. సూర నజ్మ్ లో అల్లాహ్ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన తన కోరికతో ఏదీ మాట్లాడడు. అల్లాహ్ ప్రవక్త గారి గురించి చెప్తున్నాడు, ప్రవక్త వారు తమ కోరికతో, తమ ఇష్టం వచ్చినట్లు ఏదంటే అది మాట్లాడడు. అల్లాహ్ అతని వైపునకు ఏ వహీ పంపుతాడో, ఏ దివ్యవాణి పంపుతాడో, దాని ప్రకారమే ప్రవక్త అల్లాహ్ పంపినటువంటి విషయాల్ని ఇతరులకు తెలియజేస్తాడు.

అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఈ సూచనలు ఎందుకు తెలిపారు? ఇందులో మంచి విషయాలు ఏవైతే కరువవుతాయో, ఏ మంచి విషయాలలో మనం కొరత చూస్తామో, ఆ మంచి చేయడానికి మనం ముందుగా ఉండాలి. ఉదాహరణకు, ప్రళయానికి ముందు ధర్మ విద్య లేపబడుతుంది. అంటే ఏంటి? అది ఎక్కడో ఇట్లా పెట్టి ఉంటది ఎవడో వచ్చి తీసుకుంటాడు అట్లా భావం కాదు. దీనికి రెండు భావాలు ఉన్నాయి. ఒకటి, ధర్మ పండితులు ఎవరైతే ఉన్నారో, వారి చావు అనేది ఎక్కువైపోతుంది. రెండో భావం, ప్రత్యేకంగా ముస్లింలు మరియు ఇతరుల హృదయాల్లో నుండి ధర్మ జ్ఞానం అవలంబించాలి అన్నటువంటి ప్రేమ అనేది తగ్గిపోతుంది.

ఇది ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఏం చేయాలి? మనం ప్రయత్నం చేయాలి. ఇదిగో ఒక చిన్న ఉదాహరణ ఇవ్వాలా. ఇప్పుడు ఈ బండ ఎండల్లో 45-47 వరకు కూడా డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత చేరుకుంటుంది. అయినా గాని పని వదులుకుంటామా మనం? చెమటలు కారుతూ ఉంటాయి. శరీరం మండుతూ ఉంటుంది. కానీ ఎందుకు పని చేస్తాం? ఎందుకు ఆ కష్టాన్ని భరిస్తూ ఉంటాం? ఈ పట్టి కష్టపడితేనే ఈ చెమట మనది వస్తేనే, మనం కొంచెం ఓపిక వహిస్తేనే మనకు జీతం దొరుకుద్ది. అప్పుడే మనం మన కడుపు నింపగలుగుతాము, మన పిల్లల కడుపు నింపగలుగుతాము అని ఆలోచిస్తాం. ఇంతకంటే ఎక్కువ ఆలోచన మనకు కేవలం ఈ శరీరం గురించేనా? ఈ ఆత్మ గురించి వద్దా? ఈ ఆత్మ వీడి పోయింది అంటే ఈ శరీరం ఏదైనా లాభంలో ఉందా? తీసుకెళ్లి బొంద పెడతాం. తీసుకెళ్లి దఫన్ చేసేస్తాం. మట్టిలో అది కుళ్ళిపోతుంది. కానీ ఆత్మ మిగిలి ఉంటుంది. అల్లాహ్ త’ఆలా మరొక శరీరం ప్రసాదిస్తాడు. ఈ శరీరంలో కూడా ఒక వెన్నుముక బీజం ఉంటుంది, ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా రెండోసారి లేపినప్పుడు దాని ద్వారా మళ్ళీ లేపుతాడు.

అయితే, చెప్పే విషయం ఏంటి? ఈ కేవలం శరీరానికి ఎంత సుఖం మనం ఇవ్వదలుచుకుంటున్నామో, దాని గురించి ఎంత కష్టపడుతున్నామో, మనకు ఇష్టం లేని ఒక సత్కార్యం, మనకు ఇష్టం లేని విశ్వాసం, మనకు ఇష్టం లేని ఒక మంచి కార్యం, దాని వైపునకు కూడా మనం మనసును ఒప్పించి అయినా కానీ ముందడుగు వెయ్యాలి.

ఇంకా కొన్ని సూచనలు మనం విన్నాం. ఏంటవి? వ్యభిచారం అధికమైపోవడం. మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు సేవించడం అధికమైపోవడం. అశ్లీలత పెరిగిపోవడం. ఇలాంటి విషయాలు మనం విన్నప్పుడు ఏం చేయాలి? అరే ప్రవక్త చెప్పిండు కదా ఎట్లైనా అయిపోతది అని మనం కూడా దాంట్లో పాల్గొనాలా? కాదు. ప్రవక్త ఈ వార్త మనకు ఇస్తున్నారు అంటే, తమ పరలోకాన్ని సాఫల్యం చేసుకోగోరే వారు, ప్రళయ దినాన తమకు నరకం నుండి మోక్షం కలగాలి, ప్రళయ దినాన వచ్చే కష్టాలన్నీ కూడా దూరం కావాలి అని కోరుకునేవారు ఇహలోకంలో సంభవించే ఈ చెడులకు దూరం ఉండండి. ఏ మంచి విషయాలు తగ్గుతాయి అని తెలుస్తుందో, దాన్ని మనం చేయడానికి ముందడుగు వెయ్యాలి. ఏ చెడు పెరుగుతుంది అని మనకు తెలుస్తుందో, దానికి మనం దూరం ఉండాలి. ఇది అసలు కారణం చెప్పడానికి.

మరి సోదరులారా, ప్రళయం సంభవించేకి ముందు మూడవ రకమైన సూచనలు ఏవైతే సంభవిస్తాయో, అవి చాలా పెద్ద సూచనలు, చాలా ఘోరమైనవి. ఒక సందర్భంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు, అప్పటికి సహాబాలు, ప్రవక్త గారిని విశ్వసించిన సహచరులు ప్రళయం గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. “మీరేం చర్తించుకుంటున్నారు? ఏ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు? పరస్పరం ఏ విషయం మీద చర్చలు జరుగుతుంది?” అని ప్రవక్త గారు అడిగారు. వారు చెప్పారు, “మేము ప్రళయం గురించి పరస్పరం చర్చించుకుంటున్నాము.”

అప్పుడు ప్రవక్త గారు చెప్పారు,

إِنَّهَا لَنْ تَقُومَ حَتَّى تَرَوْنَ قَبْلَهَا عَشْرَ آيَاتٍ
(ఇన్నహా లన్ తఖూమ హత్తా తరౌన ఖబ్లహా అష్ర ఆయాతిన్)
నిశ్చయంగా, ప్రళయం, దానికంటే ముందు పది పెద్ద సూచనలు సంభవించే వరకు ప్రళయం రాదు.

ఏంటి ఆ పెద్ద సూచనలు?

  1. అద్-దుఖాన్ (పొగ): ఒక చాలా విచిత్రమైన మరియు చాలా భయంకరమైన ఒక పొగ ఏర్పడుతుంది. దాని వివరణ మనం వివరంగా మరో సందర్భంలో తెలుసుకుందాము.
  2. అద్-దజ్జాల్: దజ్జాల్ యొక్క రాక.
  3. దాబ్బతుల్ అర్ద్: ఒక జంతువు వస్తుంది. మాట్లాడుతుంది. ఇతను విశ్వాసి, ఇతను అవిశ్వాసి అనేది చెప్తుంది.
  4. సూర్యుడు పడమర నుండి ఉదయించడం: సూర్యుడు ప్రతిరోజు ఎటునుంచి ఉదయిస్తున్నాడు? తూర్పు నుండి. కానీ ప్రళయానికి సమీపంలో ఇటు పడమర వైపు నుండి ఉదయిస్తాడు.
  5. ఈసా ఇబ్ను మర్యం రాక: యేసు క్రీస్తు, ఈసా అలైహిస్సలాం దిగి వస్తారు.
  6. య’జూజ్ మరియు మ’జూజ్: ఒక జాతి, వారు బయటికి వెళ్తారు.
  7. మూడు పెద్ద భూకంపాలు: ఒకటి తూర్పులో, మరొకటి పడమరలో, మరొకటి ఈ జజీరతుల్ అరబ్ (అరబ్ ద్వీపంలో). చాలా గాంభీర్యంగా భూమి క్రుంగిపోతుంది.
  8. యమన్ నుండి ఒక అగ్ని: ఇందులో చివరి పెద్ద సూచన, యమన్ నుండి ఒక అగ్ని వెలుదేరుతుంది, అగ్ని వెళ్తుంది. ఆ అగ్ని వెళ్ళింది అంటే చాలా పెద్ద పెద్దగా ఉంటుంది. ప్రజల్ని నెట్టేసుకుంటూ వస్తుంది. ప్రజలు పరిగెడుతూ ఉంటారు. ఎక్కడ? షామ్ (సిరియా) వైపున. అది చివరి యొక్క పెద్ద సూచన అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.

అయితే ఈ పెద్ద సూచనలు ఒకటి తర్వాత మరొకటి, ఒకటి తర్వాత మరొకటి ఈ విధంగా మొదలై కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. వాటి మధ్యలో ఏ గ్యాప్ అనేది ఉండదు.

వీటన్నిటిలో అతి భయంకరమైనది దజ్జాల్ యొక్క సంక్షోభం, దజ్జాల్ యొక్క ఫితనా. దజ్జాల్ ఎవడు? అతడు ఒక మానవుడు, ఒక మనిషే. కానీ ప్రళయానికి ముందు అతడు వస్తాడు. అల్లాహ్ త’ఆలా అతనికి ఒక శక్తిని ఇస్తాడు. దాని మూలంగా అతడు ఎన్నో మహిమల పేరు మీద ప్రజలను మోసం చేసి, నేను మీ దేవుణ్ణి, నేను మీ అనారోగ్యులకు, రోగంతో ఉన్నవారికి స్వస్థత ప్రసాదించేవాణ్ణి, మీలో కష్టంలో ఉన్నవారికి సుఖం ఇచ్చేవాణ్ణి, నేను మీ యొక్క ప్రభువుని అని తనకు తాను చాటింపు చేసుకుంటాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే దజ్జాల్ బయలుదేరాడు అని వింటారో, అతనితోని ఎదుర్కోవడానికి, అతని ముందుకు వచ్చే ప్రయత్నం చేయొద్దు, దూరమే ఉండాలి. ఎందుకంటే ఆ సందర్భంలో ఒక విశ్వాసి నా విశ్వాసం చాలా బలంగా ఉంది, నేను ఎలాంటి మోసంలో పడను అని అనుకుంటాడు. కానీ వాడు ఎలాంటి మాయాజాలం చూపిస్తాడో, దానికి మోసపోయి తన విశ్వాసాన్ని కోల్పోతాడు. అతన్ని ప్రభువుగా నమ్మేస్తాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు:

“చూడండి ఇంతకముందు వచ్చిన ప్రవక్తలందరూ కూడా దజ్జాల్ గురించి హెచ్చరించారు. ఎందుకంటే ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం వచ్చే వరకు ఎన్ని ఫితనాలు, ఎన్ని సంక్షోభాలు, ఎన్ని ఇలాంటి ఉపద్రవాలు జరిస్తాయో, పుడతాయో, వాటన్నిటిలో అతిపెద్ద భయంకరమైన ఫితనా, ఉపద్రవం దజ్జాల్ యొక్క ఫితనా. అందుగురించే ప్రతి ప్రవక్త తమ జాతి వారికి అతని గురించి హెచ్చరించారు. నేను కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.

వినండి, అతను తనకు తాను ప్రభువుగా చాటింపు చేసుకుంటాడు. అయితే మీ ప్రభువు కేవలం అల్లాహ్ మాత్రమే. దజ్జాల్ ను మీరు గుర్తు పట్టాలంటే అతనికి రెండు కళ్ళు ఉండవు. ఒకే ఒక కన్ను ఉంటది, ఒంటి కన్ను అంటాం కదా. ఒకే కన్ను ఉంటుంది. ఆ ఒక కన్ను కూడా సామాన్య మనుషుల కన్నుల మాదిరిగా ఉండదు, బయటికి వచ్చి ఒక ద్రాక్ష పండు పెద్దది ఎలా ఉంటుందో ఆ విధంగా భయంకరంగా ఉంటుంది. మరియు అతని తల మీద, నుదుటి మీద ك ف ر (కాఫ్-ఫా-రా) కాఫిర్ అన్న పదం రాసి ఉంటుంది. చదివిన వాళ్ళు, చదవని వాళ్ళు, జ్ఞానులు, అజ్ఞానులు అందరూ కూడా ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతారు.

మరియు అతడు ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజలకు ఎన్నో మోసపెడుతూ వారిని నేను ప్రభువుగా నమ్మండి అని అంటూ ఉంటాడు. అయితే ప్రజల్ని నమ్మించడానికి ఒక సందర్భంలో అతనికి ఎలాంటి శక్తి లభిస్తుంది అంటే చాలా పెద్ద సంఖ్యలో అతని వెంట జనం ఉంటుంది. ఒక సందర్భంలో ప్రవక్త గారు చెప్పారు, అతన్ని అనుసరించే వారిలో స్త్రీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది అని. ఒక సందర్భంలో అతని వెంట చాలా పెద్ద జనం ఉంటుంది. అతడు ఆకాశాన్ని ఆదేశిస్తే వర్షం కురుస్తుంది. భూమిని ఆదేశిస్తే పంట వెళ్తుంది. చూడు, నేను ప్రభువును కాదా అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాడు.

ప్రజలు కొందరు నమ్మరు. ఆ సందర్భంలో ఒక వ్యక్తిని ముందుకు తీసుకువచ్చి నీ తల్లిదండ్రిని బ్రతికించి చూపించాలా అని అంటాడు. అయితే అతని వెంట షైతానులు ఉంటాయి. ఇద్దరు షైతానులు అతని యొక్క తల్లిదండ్రి యొక్క రూపంలో అతని ముందుకు వస్తారు. ఇలాంటి మోసం జరుగుద్ది మరియు అల్లాహ్ యొక్క ఎంత గొప్ప దయ మనపై గమనించండి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కూడా మొత్తం మన విశ్వాసంలో పడకుండా, విశ్వాసంపై స్థిరంగా ఉండడానికి అల్లాహ్ మనకు ప్రవక్త ద్వారా ఈ విషయాలు తెలియపరిచాడు. కానీ మన దురదృష్టం ఏంటంటే చదువుకు, విద్యకు ఎంతో దూరం ఉండిపోతున్నాం. విషయాలన్నీ తెలుసుకోవాలి. రోజు కొంచెం ఒక పేజీ అయినా గానీ ఖుర్ఆన్ దాని అనువాదంతో చదవాలి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులను చదువుతూ ఉండాలి. ప్రవక్త వారి యొక్క జీవితం చదువుతూ ఉండాలి. ఈ కాంక్ష ఇంకా ఎప్పుడు మనలో పుడుతుంది?

వాస్తవానికి ఈ రోజుల్లో గమనిస్తే, ఏ ఉపద్రవాలు, సంక్షోభాలు, ఫితనా ఎక్కువ అవుతూ ఉన్నాయో, అందులో నేనైతే అనుకుంటా, మన చేతులో ఇలాంటి పెద్ద పెద్ద షైతానులు రావడం అని కూడా ఒకటి భావిస్తాను. ఎందుకో తెలుసా? వాస్తవానికి దీని వెనక నిజంగా వీటి ద్వారా, అంటే ఈ మొబైల్ సెట్స్, స్మార్ట్ ఫోన్స్, మరి ఇలాంటి దీనికి సంబంధించిన ఎన్నో పరికరాలు ఏవైతే ఉన్నాయో, వీటి వలన కొంత ప్రయోజనం, ఎంతో లాభం ఉండవచ్చు. కానీ ఈ రోజుల్లో జనం ఆ లాభానికంటే ఎక్కువగా నష్టంలో దాన్ని ఉపయోగిస్తున్నారు, వాటిని ఉపయోగిస్తున్నారు. గంటల తరబడి పేజీ పైకి చేస్తూ, చేస్తూ, Facebook నుండి, Facebook లో చూసి చూసి మన ఫేస్ ఏ పాడైపోతుంది. కానీ దానిని మనం గమనించడం లేదు. దానికి బదులుగా ఏదైనా మంచి విషయం చదవాలి అంటే కోరిక పుట్టడం లేదు. ఉదాహరణకు Facebook ఇచ్చాను. ఈ విధంగా ఎన్నో విషయాలు ఉన్నాయి. అంతకు ముందు, ఇవి రాకముందు డిష్ లు, టీవీలు, మంచి మంచి ప్రోగ్రాంలో అని అనుకునేవాళ్ళం. స్త్రీలు ఫిలింలు, సీరియల్ లలో, పురుషులు ఎంతో మంది ఎన్నో రకాల ఆటల్లో, క్రికెట్ అని కొందరు, మరికొందరికి మరికొన్ని కాంక్షలు.

సోదరులారా, అల్లాహ్ మనపై కరుణించి, ఆయన మనకు ఎంతో మనపై దయచేసి, ప్రళయానికి ముందు సంభవించే సూచనల గురించి ఏ చిన్న చిన్న వివరాలు అయితే తెలిపాడో, మన ప్రవక్త ద్వారా వాటిని తెలుసుకొని మంచి విషయాలకు ముందుకు వెళ్లి, చెడు నుండి మనం దూరం ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడే మన ఇహలోకం బాగుపడుతుంది, మన పరలోకం కూడా మనకు బాగుపడుతుంది. అక్కడ నరకం నుండి మోక్షం పొంది స్వర్గంలో మనం చేరగలుగుతాం.

దజ్జాల్ ఇక్కడ ఉండేది ఎన్ని రోజులు? కేవలం 40 రోజులు మాత్రమే ఈ ప్రపంచంలో. కానీ మొదటి రోజు ఒక సంవత్సరం మాదిరి, రెండో రోజు ఒక నెల మాదిరిగా, మూడో రోజు ఒక వారం మాదిరిగా, మిగితా రోజులు 37 సామాన్య రోజులుగా ఉంటాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. చివరికి ఈసా అలైహిస్సలాం దిగి వస్తారు. విశ్వాసుల ఒక సంఖ్య, విశ్వాసుల ఒక గ్రూప్ వారి వెంట ఉంటుంది. ఈసా అలైహిస్సలాం దజ్జాల్ ను వెతికి, దజ్జాల్ ను చంపేస్తారు. హత్య చేస్తారు.

కానీ ఒక విషయం, ఇతడు చాలా పెద్ద దజ్జాల్, భయంకరమైనవాడు. అయినా గానీ రెండు విషయాలు దీంట్లో మనం గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటి? ఇతని ఉపద్రవాలు, ఇతని యొక్క ఫితనా, ఇతను ప్రజల్ని దుర్మార్గంలో పడవేయడానికి ఎంత ఏ ప్రయత్నం చేసినా గానీ, అల్లాహ్ పై గట్టి నమ్మకంతో అతన్ని ఎదురించకుండా, మనం ఉన్నకాడ మనం ఉండి, విశ్వాసంపై స్థిరంగా ఉండి, సత్కార్యాలు చేస్తూ ఉండి, ప్రత్యేకంగా దజ్జాల్ నుండి రక్షణకై, దజ్జాల్ నుండి అల్లాహ్ మనల్ని రక్షించాలని ప్రవక్త ఏ దుఆలు అయితే మనకు నేర్పారో, ఏ ప్రత్యేక కార్యాలు అయితే మనకు నేర్పారో అవి చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు అతని ఎన్ని భయంకరమైన, ఎన్ని మోసాలు, ఎన్ని మాయాజాలం మహిమలు అని చూపించినా గానీ అందులో ఇన్ షా అల్లాహ్ మనం పడం. కానీ విశ్వాసం మరియు ప్రవక్త చూపిన విధానంలో మనం ఉండాలి, కరెక్ట్ గా ఆచరణలో ఉండాలి. ఉదాహరణకు ప్రతి నమాజులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు,

اَللّٰهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ، وَمِنْ عَذَابِ جَهَنَّمَ، وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ، وَمِنْ شَرِّ فِتْنَةِ الْمَسِيْحِ الدَّجَّالِ
(అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ అదాబిల్ ఖబ్ర్, వ మిన్ అదాబి జహన్నమ్, వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాత్, వ మిన్ షర్రి ఫిత్నతిల్ మసీహిద్ దజ్జాల్)

అని చదివేవారు. ఇది చదువుతూ ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు ప్రతి జుమా రోజు ఏం చదవాలి? సూరె కహఫ్ చదువుతూ ఉండండి అని చెప్పారు. అది చదువుతూ ఉండాలి.

ఈ రోజుల్లో మన పరిస్థితి ఏమైంది? మా తల్లిదండ్రి మమ్మల్ని స్కూల్ కు పంపలేదు, మా తల్లిదండ్రి మమ్మల్ని మదరసాలో చేర్పించలేదు, మాకు ఖుర్ఆన్ చిన్నప్పుడు నేర్పలేదు అని ఇప్పటివరకు మనం నేర్చుకోలేకపోతున్నాము. కానీ మన చిన్నప్పుడు ఇట్లాంటి మొబైల్స్ ఉండెనా? వీటిని ఎలా ఆపరేటింగ్ చేయాలో అవన్నీ తెలుసా? అక్షరజ్ఞానం లేని వాళ్ళు కూడా ఇవి ఉపయోగించుకుంటున్నారు, దీన్ని వాడుతున్నారు. ఏమీ రాని వ్యక్తి కూడా తనకు ఇష్టమైన పాట దాంట్లో ఎన్నుకొని వింటున్నాడు, ఇష్టమైన ఫిలిం దాంట్లో తీసి చూస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు ఆ చెడులో ఏ జ్ఞానం అయితే మనది ఉపయోగపడుతుందో, మంచి తెలుసుకోవడానికి నాకైతే చదువు రాదు, చలో ఈ రోజు నేను ఏం చేస్తా, ఈ ఖుర్ఆన్ అప్లికేషన్ దీంట్లో స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేసి ఆ ఈరోజు జుమ్మా కదా, జుమ్మా రోజు నేను సూర కహఫ్, నాకు చదవ రాదు, కనీసం చూసుకుంటూ శ్రద్ధగా వింటూ ఉంటా. అట్లా ఎవరైనా ఆలోచిస్తున్నారా? బహుశా వెయ్యిలో ఎవరైనా ఒకరు ఉంటే ఉండవచ్చునేమో. ఇలాంటి ప్రయత్నాలు చేయాలి మనం.

రెండో విషయం, ఆ పెద్ద దజ్జాల్ నుండి మనం రక్షణ పొందాలంటే, అతని యొక్క మాయాజాలంలో మనం చిక్కిపోకూడదు అంటే ఈ పనులు చేయడంతో పాటు, ఆ పెద్ద దజ్జాల్ రాకముందు ఎందరో చిన్న చిన్న దజ్జాల్లు వస్తూ ఉంటారు. వాటి మాయాజాలకు కూడా మనం దూరం ఉండాలి. ఈ రోజుల్లో ఎందరో ఉన్నారు. గారడీ ఆటల్లాంటివి ఆడిపిస్తారు, మంత్రాలు చేస్తున్నాము, చేతబడి చేస్తున్నాము, మా దగ్గర మాయాజాలం ఉన్నది, మా దగ్గర ఫలానా శక్తి ఉన్నది, దేవుడు నాలో వదిగి వచ్చాడు, దేవుడు నాలో ఈ విధంగా చూపించుకుంటూ ప్రజల్ని మోసం చేసి, ప్రజల యొక్క నజరానాలు, ప్రజల యొక్క డబ్బులు, ప్రజల యొక్క ఆస్తులు అన్నీ కాజేసుకుంటూ దేవుని పేరు మీద తింటూ ఉన్నారు. అల్లాహ్ పేరు మీద తింటూ ఉన్నారు. ఇక ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఆ పేర్లు చెప్పేది ఉంటే కొందరికి కోపాలే వస్తాయి.

మన బర్రార్ లలో కూడా ఎన్నో మజార్లు, దర్గాలు, దర్బారులు, బాబాల యొక్క ఏమైతే అనుకుంటామో అక్కడ కూడా ఇలాంటి విషయాలు ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అందుగురించి సోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇలాంటి మోసాల్లో పడకుండా, దుర్మార్గంలో పడకుండా, విశ్వాసంపై మన యొక్క చావు కావాలి అంటే తప్పకుండా మనం ఏం చేయాలి? విశ్వాస మార్గం మీద ఉండాలి. ఖుర్ఆన్ హదీస్ చదువుతూ ఉండాలి. ధర్మ జ్ఞానం మనం నేర్చుకుంటూ ఉండాలి. అల్లాహ్ త’ఆలా ఇలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ప్రళయం రాకముందు ఏ సూచనలైతే సంభవిస్తా ఉన్నాయో, అల్లాహ్ ఆ సూచనల్లోని చెడు విషయాల నుండి మనల్ని దూరం ఉంచి, ఏ మంచి విషయాలు కరువవుతాయో వాటికి చేరువై, దగ్గరై, అలాంటి విషయాలు నేర్చుకొని మన వాళ్ళల్లో వాటిని ఇంకింత పెంపొందించే భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ త’ఆలా దజ్జాల్, దజ్జాల్ కు ముందు వచ్చే ఇంకా చిన్న చిన్న దజ్జాల్ ల వారందరి ఫితనాల నుండి కూడా మనల్ని అల్లాహ్ కాపాడుగాక.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వబరకాతుహు.

పరలోకం (The Hereafter)
https://teluguislam.net/hereafter/

అల్లాహ్ అంటే ఎవరు? ఇస్లాం అంటే ఏమిటి? [ఆడియో & టెక్స్ట్]

అల్లాహ్ అంటే ఎవరు? ఇస్లాం అంటే ఏమిటి?
https://youtu.be/e6YALKM5wwU [33 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, అల్లాహ్ యొక్క ఏకత్వం, ఆయన గుణగణాలు మరియు సృష్టిలో ఆయన పాత్ర గురించి వివరించబడింది. అల్లాహ్ యే ఈ సృష్టి అంతటికీ మూలాధారుడని, ఆయనే జీవన్మరణాలకు అధిపతి అని మరియు సర్వ మానవాళికి ఉపాధిని ప్రసాదించేవాడని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేయబడింది. మానవులకు మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ ప్రవక్తలను పంపాడని, వారిలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పబడింది. ఇస్లాం అంటే అల్లాహ్ కు లొంగిపోవడమని, ఇది కేవలం ఒక మతవర్గానికి చెందినది కాదని, సర్వ మానవాళికి చెందిన సత్య ధర్మమని నొక్కి చెప్పబడింది. భారతదేశంలో ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోనే ప్రవేశించిందని, ఆది మానవుడు ఆదం అలైహిస్సలాం కూడా భారత ఖండంలోనే అవతరించారని చారిత్రక ఆధారాలతో వివరించబడింది. చివరగా, ఇస్లాంను కాదని మరో మార్గాన్ని అనుసరించేవారు పరలోకంలో నష్టపోతారని ఖురాన్ హెచ్చరికతో ప్రసంగం ముగించబడింది.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

అల్లాహ్ త’ఆలా ఈ సృష్టి అంతటికీ మూలాధారుడు. ఆది నుండి ఉన్నవాడు, అంతము వరకు ఉండేవాడు. సర్వ ప్రాణి, సర్వ సృష్టికి సమాప్తము, వినాశనము అనేది ఉంటుంది. కానీ అల్లాహ్, అతనికి ఎలాంటి మరణము గానీ, ఎలాంటి సమాప్తము గానీ లేదు.

అల్లాహ్, ఏ అస్తిత్వాన్ని, ఎవరినైతే మనం అల్లాహ్ అని అంటామో ఆయన గురించి ఖురాన్ దివ్య గ్రంథంలో ఎన్నో ఆయతులలో ఆయన యొక్క పరిచయం చాలా వివరంగా ఉంది.

اللَّهُ الَّذِي خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ
(అల్లాహుల్లదీ ఖలకకుమ్, సుమ్మ రజఖకుమ్, సుమ్మ యుమీతుకుమ్, సుమ్మ యుహ్యీకుమ్)
ఆయనే మిమ్మల్ని సృష్టించినవాడు. అల్లాహ్ ఆయనే మీ అందరికీ ఆహారం ప్రసాదించేవాడు. ఆ అల్లాహ్ యే మీ అందరికీ మరణం ప్రసాదిస్తాడు మరియు ఆ తర్వాత మరోసారి మిమ్మల్ని బ్రతికిస్తాడు, తిరిగి లేపుతాడు. (30:40)

ఈ విధంగా చూసుకుంటూ పోతే అల్లాహ్ గురించి ఖురాన్ గ్రంథంలో ప్రత్యేకంగా సూర రూమ్, ఇంకా వేరే కొన్ని సూరాలలో చాలా స్పష్టంగా ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు సూర ఆరాఫ్, ఆయత్ నంబర్ 54.

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ
నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై (అర్ష్‌పై) ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌ అపారమైన శుభాలు కలవాడు.(7:54)

ఆయనే రాత్రిని పగటిపై కప్పుతున్నాడు. మరియు ఈ పగలు అనేది రాత్రి వెంట పడుతుంది. మరియు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆయన ఆజ్ఞకు లోబడి ఉన్నాయి. వినండి, ఈ లోకంలో ఆదేశం చెల్లేది, ఆజ్ఞ పాలన జరిగేది అల్లాహ్ ది మాత్రమే. సృష్టి ఆయనదే గనక ఆజ్ఞా పాలన కూడా ఆయనదే జరుగును. ఆ అల్లాహ్ సర్వ విశ్వ విశ్వాసాలకు, ఈ సర్వ లోకాలకు ప్రభువు, చాలా శుభము కలవాడు.

ఇంకా ఖురాన్ గ్రంథంలో మనం చూసినట్లయితే,

اللَّهُ الَّذِي رَفَعَ السَّمَاوَاتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا
(అల్లాహుల్లదీ రఫ అస్సమావాత్ బిగైరి అమదిన్ తరౌనహా)
స్తంభాలు లేకుండా (నే) ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపిన వాడే అల్లాహ్‌. దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు. (13:2)

ఆ ఆకాశాలను ఎలాంటి పిల్లర్ లేకుండా ఏ ఒక్క పిల్లర్ లేకుండా పైకి లేపి నిలిపాడు, తరౌనహా, దీనికి ఏ ఒక్క పిల్లర్ లేని విషయం మీరు చూస్తున్నారు. మరోచోట సూర ఇబ్రాహీంలో,

اللَّهِ الَّذِي لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ
(అల్లాహుల్లదీ లహూ మా ఫిస్సమావాతి వ మా ఫిల్ అర్ద్)
ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్తమూ ఆ అల్లాహ్‌దే. (14:2)

وَوَيْلٌ لِلْكَافِرِينَ مِنْ عَذَابٍ شَدِيدٍ
(వ వైలున్ లిల్ కాఫిరీన మిన్ అదాబిన్ షదీద్)
తిరస్కారుల కొరకు కఠిన శిక్ష మూలంగా వినాశం ఉంది. (14:2)

మరి ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తున్నారో, అల్లాహ్ ను తిరస్కరిస్తున్నారో అలాంటి వారికి వినాశనం ఉంది మరియు చాలా భయంకరమైన శిక్ష ఉంది. ఇంకా ఈ రకంగా చూసుకుంటే ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు సూర ఇబ్రాహీం.

اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ وَسَخَّرَ لَكُمُ الْفُلْكَ لِتَجْرِيَ فِي الْبَحْرِ بِأَمْرِهِ ۖ وَسَخَّرَ لَكُمُ الْأَنْهَارَ
భూమ్యాకాశాలను సృష్టించి, ఆకాశాల నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీ ఆహారం కోసం పండ్లు ఫలాలను ఉత్పన్నం చేసినవాడే అల్లాహ్‌. ఆయనే తన ఆజ్ఞతో సముద్రంలో నౌకలు నడవటానికి వాటిని మీకు లోబరచాడు. ఆయనే నదీ నదాలను మీ అధీనంలో ఉంచాడు. (14:32)

అయితే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్, ఆ సృష్టికర్త, పోషణకర్త, జీవన్మరణాల ప్రధాత, ఈ సర్వ సృష్టికి మూలం ఆయనే. అయితే సర్వ సృష్టిని మన సేవ కొరకు, మనం వాటి ద్వారా లాభం పొందడానికి సృష్టించాడు. సూర బఖరాలోని మూడవ రుకూలో,

هُوَ الَّذِي خَلَقَ لَكُمْ مَا فِي الْأَرْضِ جَمِيعًا
(అల్లదీ ఖలక లకుమ్ మా ఫిల్ అర్ది జమీఆ)
భూమిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకే సృష్టించినవాడు ఆయనే. (2:29)

ఆ అల్లాహు త’ఆలా ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని, ఖలక లకుమ్ మా ఫిల్ అర్ది జమీఆ, సమస్తాన్ని మీ కొరకు పుట్టించాడు. కానీ మనల్ని కేవలం ఆయన్ని ఆరాధించుటకే పుట్టించాడు. ఆయన్ను ఎలా ఆరాధించాలి? అందుకొరకు ఆయన స్వయంగా ఏదైనా అవతారం ఎత్తి ఈ లోకంలో రాలేదు. ఎలాగైతే వేరే కొందరు తప్పుడు మార్గాల్లో ఉన్నారో, కొందరు ఏమనుకుంటారు, స్వయంగా అల్లాహ్ లేదా వారి వారి భాషల్లో వారు అల్లాహ్ ను దేవుడు అని, ఈశ్వరుడు అని ఏదైతే అనుకుంటారో వారి యొక్క తప్పుడు విశ్వాస ప్రకారం, ఆ సృష్టికర్త మానవులకు మార్గం చూపడానికి అవతారం ఎత్తి వస్తాడు అని, లేదా ఇద్దరు ముగ్గురు కలిసి ఒక దేవుడై వారిలో ఒకరిని మానవులకు మార్గం చూపడానికి పంపాడు అని, ఇవన్నీ కూడా తప్పుడు విశ్వాసాలు.

ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ ఏం చేశాడు? ఆయన మానవుల్లోనే అతి ఉత్తమ నడవడిక గల మరియు మానవుల్లోనే అందరికీ తెలిసి ఉన్న ఒక మంచి వ్యక్తిని తనకు మరియు తన దాసులకు మధ్య ప్రవక్తగా, ఒక సందేశ దూతగా ఎన్నుకున్నాడు.

اللَّهُ يَصْطَفِي مِنَ الْمَلَائِكَةِ رُسُلًا وَمِنَ النَّاسِ
(అల్లాహు యస్తఫీ మినల్ మలాఇకతి రుసులన్ వ మినన్నాస్)
అల్లాహ్ తన సందేశహరులుగా దైవదూతలలో నుండి, మానవులలో నుండి ఎన్నుకుంటాడు. (22:75)

అల్లాహు త’ఆలా దైవదూతల్లో కూడా సందేశ దూతలను ఎన్నుకుంటాడు, అలాగే మానవుల్లో కూడా అల్లాహు త’ఆలా తనకిష్టమైన వారిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. ఎన్నుకొని అతని వద్దకు తన దూత ద్వారా గాని లేదా డైరెక్ట్ అతని హృదయ ఫలకం మీద తన యొక్క సందేశాన్ని అవతరింపజేస్తాడు. ఆ ప్రవక్త అల్లాహ్ యొక్క ఆ సందేశాన్ని తీసుకొని, స్వీకరించి, నేర్చుకొని, తర్వాత ప్రజలకు వినిపిస్తారు.

ఈ విధంగా ఖురాన్ లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఎన్నో సందర్భాల్లో ఈ విషయం తెలిపి ఉన్నాడు. అల్లాహు త’ఆలా తనకిష్టమైన ప్రజల్లోని ఒక వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత ఆ ప్రవక్తగా చేసిన తర్వాత అతని వద్దకు దైవదూతను పంపి గానీ, అతని వద్దకు దివ్యవాణి పంపి గానీ, వహీ. మరి లేదా ఏదైనా పర్దా, హిజాబ్ అడ్డులో ఉండి మాట్లాడి గానీ అల్లాహు త’ఆలా తన యొక్క సందేశాన్ని అతని వద్దకు చేర్పిస్తాడు. ఈ విధంగా మానవులు ఎలా అల్లాహ్ ను ఆరాధించాలి, ఆ ఆరాధన మార్గాన్ని తన ప్రవక్తల ద్వారా వారికి నేర్పుతాడు.

ఇక ఎవరైతే వక్రమార్గంలో పడి, స్వాభావిక వారి యొక్క ఫిత్రత్, స్వాభావికం, ప్రకృతి విధానాన్ని వదిలేసి తప్పుడు ఆచారాల్లో, దురాచారాల్లో పడి ఉంటారో, వారు ఏమంటారు, ఈ మాలాంటి ఒక మనిషి మమ్మల్ని ఎందుకు మంచి గురించి చెప్పాలి? ఎందరో ప్రవక్త కాలాల్లో ప్రవక్తను తిరస్కరించినవారు,

أَبَشَرٌ يَهْدُونَنَا
(అ బషరున్ యహ్దూననా)
‘ఏమిటి, సాటి మానవులు మాకు మార్గదర్శకత్వం చేస్తారా?!’ (64:6)

మాలాంటి మనిషే కదా ఇతను, ఇతని మీదనే అల్లాహు త’ఆలా ఎందుకు వహీ పంపాడు? ఇతన్నే ప్రవక్తగా ఎందుకు ఎన్నుకున్నాడు? మాలో ఇంకా వేరే ఎవరు లేకుండేనా? అంటే దీని భావం ఏంటి? ఈ విధంగా వ్యతిరేకించడం మనిషిలో ఈ వ్యతిరేక గుణం మొదలైంది అంటే, ప్రతి దాన్ని, స్వయంగా తన తండ్రిని అనవచ్చు. నువ్వే నాకు ఎందుకు తండ్రిగా అయినావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? నువ్వే నాకు ఎందుకు తల్లిగా అయినావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? నువ్వే మాకు ఎందుకు రాజుగా ఉన్నావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? ఇతడే ఎందుకు మాకు ప్రవక్తగా వచ్చాడు అన్న విషయం, దాని గురించి అల్లాహు త’ఆలా ఒక సమాధానం ఏమి చెప్పాడు? అల్లాహ్ అతనిదే సృష్టి, అతనిదే ఆజ్ఞా పాలన జరుగును. అతడు తాను కోరిన వారిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. అల్లాహ్ యొక్క సృష్టిలో అల్లాహ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడిగే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే అల్లాహ్ చేసేది మానవుల మేలు కొరకు, అది ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. కానీ ఎవరైతే ఇలాంటి అడ్డ ప్రశ్నలు వేస్తారో వారు ప్రకృతి సిద్ధాంతాలకు దూరమై వక్రమార్గంలో నడుస్తూ ఉంటారు.

మరికొందరు ఏమన్నారు? సరే, మాకు సన్మార్గం చూపడానికి అల్లాహ్ యొక్క ఇష్టం ఉండేది ఉంటే, ఏదైనా దైవదూతలను పంపే, పంపకపోయేదా? దైవదూతలను ఎందుకు పంపలేదు? అయితే సూర అన్ఆమ్ లో దాని యొక్క సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. వలౌ జఅల్నాహు మలకన్, ఒకవేళ దైవదూతలను మేము వారి మధ్యలో ప్రవక్తగా చేసి పంపినా, వారిని ఆ దైవదూత రూపంలో ఉంచలేము. వారిని ఒక మనిషిగా చేసి వారికి ఎందుకంటే గమనించండి, మానవుల అవసరాలు దైవదూతల అవసరాలకు భిన్నంగా ఉంటాయి. అయితే మానవులకు సన్మార్గం చూపడానికి మానవుల్లోనే ఒక జ్ఞానం ఉన్న, మంచి నడవడిక గల, ఇతరులకు ఆదర్శంగా ఉండగలిగే అటువంటి వారినే అల్లాహు త’ఆలా ఎన్నుకుంటాడు.

అయితే సోదరులారా, చెప్పే విషయం ఏంటంటే, అల్లాహ్, ఆయన ఎలాంటి అవతారం ఎత్తడు. ఆయన ఒకరి ఏదైనా వేషంలో ఇహలోకంలోకి రాడు, మానవులకు మార్గం చూపడానికి. ఆయన సిద్ధాంతం ఏంటి? ఇంతకుముందు గ్రంథాల్లో కూడా ఆ విషయాల్ని తెలియబరిచాడు. చిట్టచివరి గ్రంథం ఖురాన్ లో కూడా స్పష్టపరిచాడు. అయితే మానవులకు మార్గం చూపడానికి అల్లాహు త’ఆలా ప్రవక్తల పరంపర ఏదైతే మొదలుపెట్టాడో ఆదం అలైహిస్సలాం నుండి, చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఈ పరంపర సాగుతూ వచ్చింది. ముహమ్మద్ ప్రవక్త ద్వారా ఈ ప్రవక్తల పరంపరను అల్లాహు త’ఆలా అంతం చేశాడు. ఆయనను చివరి ప్రవక్తగా పంపాడు. మరియు ప్రళయం సంభవించే వరకు ఆ ప్రవక్తనే మనం ఆదర్శంగా, మనం అంటే సర్వ మానవులం, ఆదర్శంగా చేసుకొని అల్లాహ్ ఆయనపై పంపినటువంటి దివ్య ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకొని, ఆ దివ్య ఖురాన్ ను ప్రవక్త ముహమ్మద్ వారు ఎలా ఆచరించారో అలా ఆచరించే ప్రయత్నం చేయాలి అని అల్లాహ్ మనకు ఆదేశించాడు. అందు గురించి సూర ఇబ్రాహీం గానీ ఇంకా వేరే సూరాలు మనం చూసేది ఉంటే,

كِتَابٌ أَنْزَلْنَاهُ إِلَيْكَ لِتُخْرِجَ النَّاسَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ
(కితాబున్ అన్జల్నాహు ఇలైక లితుఖ్రిజన్నాస మినజ్జులుమాతి ఇలన్నూర్)
(ఇది) ఒక గ్రంథం. దీనిని మేము నీపై అవతరింపజేశాము – నీవు ప్రజలను వారి ప్రభువు అనుమతితో చీకట్లలో నుంచి వెలుగులోకి తీసుకురావటానికి. (14:1)

సర్వ ప్రజల్ని మీరు చీకట్లలో నుండి తీసి వెలుతురులోకి, ప్రకాశంలోకి తీసుకురావాలి అని. అయితే ఈ రోజుల్లో ఎంతోమంది ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకోలేదో, వారు ఏమనుకుంటారు, ఇస్లాం ధర్మం అన్నది ప్రవక్త ముహమ్మద్ ది. ఇది కేవలం ముస్లింల ప్రవక్త, కేవలం ముస్లింల ధర్మం మరియు ఖురాన్ ఇది కేవలం ముస్లింల ధర్మం. కానీ ఇది నిజమైన మాట కాదు.

స్వయంగా ఒకవేళ మనం ఖురాన్ లో చూసి ఉంటే, ఇక్కడ ఎన్నో సందర్భాల్లో అల్లాహు త’ఆలా ఖురాన్ గురించి, ప్రవక్త ముహమ్మద్ గురించి, ఇస్లాం ధర్మం గురించి, అల్లాహ్ గురించి, అల్లాహ్ అంటే అల్లాహ్ స్వయంగా తన గురించి, అల్లాహ్ అనే అతను ముస్లింల దేవుడే కాదు. సర్వ మానవుల దేవుడు. అందు గురించి ఖురాన్ స్టార్టింగ్ లోనే మొట్టమొదటి ఆదేశం అని అనబడుతుంది. రెండో రుకూ పూర్తయిన తర్వాత మూడో రుకూ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో,

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ
(యా అయ్యుహన్నాస్ ఉ’బుదూ రబ్బకుమ్)
ఓ ప్రజలారా! మిమ్మల్ని, మీకు పూర్వం గడిచిన వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. తద్వారా మీరు దైవభీతిపరులు కాగలరు. (2:21)

ఓ ప్రజలారా, ముస్లింలారా, అరబ్బులారా, ఈ విధంగా అనబడలేదు. యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా, ఉ’బుదూ రబ్బకుమ్, మీ ప్రభువుని మీరు ఆరాధించండి. ఎవరు ఆ ప్రభువు? అల్లదీ ఖలకకుమ్, ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, వల్లదీన మిన్ కబ్లికుమ్, మీ కంటే ముందు ఉన్న వారిని, ముందు గతించిన వారిని పుట్టించాడో. లఅల్లకుమ్ తత్తకూన్, ఈ విధంగా మీరు నరకం నుండి తమకు తాము రక్షించుకోవచ్చు.

అయితే ఇక్కడ సర్వ ప్రజల్ని అల్లాహ్ ఉద్దేశించి కేవలం ఆ ఏకైక సృష్టికర్తను, అల్లాహ్ ను మాత్రమే పూజించాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా,

يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا
(యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీఆ)
“ఓ మానవులారా! నేను మీ అందరి వైపునకు అల్లాహ్ పంపిన ప్రవక్తను.” (7:158)

ఓ జనులారా, ఓ మానవులారా, నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా చేసి పంపబడ్డాను. నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా చేసి పంపబడ్డాను. సందేశ దూతగా పంపబడ్డాను. ఎవరి వైపు నుండి? ఆ అల్లాహ్ వైపు నుండి,

الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ
(లహూ ముల్కుస్సమావాతి వల్ అర్ద్)
భూమ్యాకాశాల సామ్రాజ్యం ఆయనదే. (7:158)

ఈ సర్వ ఆకాశాల మరియు భూమిలో ఉన్న సర్వానికి అధికారి ఆయన మాత్రమే.

ఇక ఖురాన్ గ్రంథం, ఇంతకుముందు నేను సూర ఇబ్రాహీం ఒక ఆయత్ మీకు ముందు చదివాను, కితాబున్ అన్జల్నాహు ఇలైక లితుఖ్రిజన్నాస్. ఈ గ్రంథం ఏదైతే మీపై అవతరింపజేశామో, దీని ద్వారా మీరు ప్రజలను, అరబ్బులను అని అనలేదు, ప్రజలను మిమ్మల్ని చీకట్ల నుండి వెలుతురు వైపునకు తీయడానికి పంపాము. అంతేకాకుండా ఒక చాలా ప్రఖ్యాతి గాంచిన ఆయత్, సర్వసామాన్యంగా ఎందరో హిందువులకు కూడా ఇది తెలిసి ఉంటుంది కావచ్చు.

شَهْرُ رَمَضَانَ الَّذِي أُنْزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِلنَّاسِ
(షహ్రు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆన్, హుదల్లిన్నాస్)
రమజాను నెల – ఆ నెలలోనే ఖుర్ఆన్ అవతరించింది. అది మానవులందరికీ మార్గదర్శకత్వం వహించేది. (2:185)

రమదాన్ మాసంలో ఖురాన్ అవతరించింది, హుదల్లిన్నాస్, ఈ ఖురాన్ సర్వ మానవాళికి మార్గదర్శకత్వం.

అయితే సోదరులారా, ఈ రోజుల్లో సర్వ మానవులు కేవలం అల్లాహ్ ను మాత్రమే విశ్వసించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని విశ్వసించాలి, ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించాలి, తమ జీవితం అల్లాహ్ పంపిన ఈ గ్రంథం, అల్లాహ్ పంపిన చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శ ప్రకారంగానే గడపాలి.

కానీ, మన, సామాన్యంగా మనం, మన తెలుగు దేశంలో అనండి, తెలుగుదేశం అంటున్నాను, అంటే పార్టీ అనట్లే నేను, ఆంధ్ర, తెలంగాణ అని ఇక రెండు పేర్లు చెప్పేదానికి బదులుగా, లేక మొత్తం భారతదేశంలో అనండి, సామాన్యంగా ఏమంటారు, ఈ ఇస్లాం దేశం ఒక 700 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం మన ఇండియాలోకి వచ్చింది. అంతకుముందు ఇస్లాం అనేది లేదు. అందు గురించి మధ్యంతరంలో పుట్టుకొచ్చిన విషయం ఇది, దీన్ని ఎందుకు మనం స్వీకరించాలి? మన తాత ముత్తాతలు పాతకాలం నుండి ఏ ఆచారం మీద ఉన్నారో, ఏ ధర్మం మీద ఉన్నారో అలాగే ఉండాలి అని ఒక మాట అంటారు. విన్నారు కదా ఎన్నోసార్లు.

అయితే దీంతో మనకు గొడవ అవసరం లేదు. ప్రేమపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా, గ్రంథాల ఆధారంతో మీరు సత్యాన్ని తెలుసుకోండి అని వారికి నచ్చచెబుదాము. దానికి మనం ఏ పద్ధతిలో వారికి నచ్చ చెప్పాలి? మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇస్లాం అంటే ఏంటి? దాని అర్థం, దాని భావం ఏంటో నచ్చచెప్పాలి. ఇస్లాం అంటే ఏదో కొత్త ధర్మం కాదు. ఇస్లాం అంటే ఒకరికి ఏదైనా శత్రుత్వం వహించే లేదా ఒకరి గురించి ఏదైనా చెడు చూపించేటువంటి విషయం కాదు. ఇస్లాం అన్నదానికి భావం, మనం మన సృష్టికర్తకు లొంగబడి ఆయన ముందు తలవంచి ఆయన ఇష్ట ప్రకారం జీవితం గడపడం. ఇంకా నేను వివరంలో లోతుగా వెళ్ళలేను, సలము నుండి ఒక భావం దీని గురించి లొంగిపోవట అని వస్తుంది. శాంతిని పొందుట అని కూడా వస్తుంది. ఈ రెండిటినీ కలిపితే, మీరు మీ సృష్టికర్తకు లొంగిపోయి ఇహపరలోకాల్లో శాంతిని పొందండి.

ఈ రకంగా చూసుకుంటే, సీన్, లామ్, మీమ్ అన్న ఈ మూడు అక్షరాలు మూల పదం ఏదైతే ఉందో ఇస్లాంకి, దానికి అనుగుణంగా ఈ పదం ఎన్నో రకాలుగా ఏదైతే వాడబడుతుందో, అస్లమ, యుస్లిము, యుస్లిమూన, ముస్లిమూన, ఈ విధంగా ఖురాన్ లో మీరు చూసి ఉంటే, ఒక సందర్భంలో అల్లాహ్ త’ఆలా ఏం చెప్పాడో గమనించండి.

أَفَغَيْرَ دِينِ اللَّهِ يَبْغُونَ
(అఫగైర దీనిల్లాహి యబ్గూన్)
ఏమిటి, వీరు అల్లాహ్ ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తున్నారా? (3:83)

ఏమైంది ఈ ప్రజలకు? అల్లాహ్ పంపినటువంటి సత్య ధర్మాన్ని మాకు వద్దు, మేము ఈ సత్య ధర్మాన్ని స్వీకరించమని అంటున్నారా, తిరస్కరిస్తున్నారా, ఇష్టం లేదు అని అంటున్నారా?

وَلَهُ أَسْلَمَ مَنْ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا
(వలహూ అస్లమ మన్ ఫిస్సమావాతి వల్ అర్ది తౌఅన్ వ కర్హా)
వాస్తవానికి భూమ్యాకాశాలలోని సమస్త వస్తువులు – ఇష్టపూర్వకంగా గానీ, అయిష్టంగా గానీ – ఆయనకే విధేయత చూపుతున్నాయి. (3:83)

మీరు మానవులు, ఐదు ఫిట్ల మనిషి, నాలుగున్నర ఫిట్ల మనిషి, మీ సంగతేంటి? మీకంటే పెద్ద పెద్ద సృష్టి రాశులు, ఆకాశం, ఆకాశాల్లో ఉన్న సర్వము, భూమి, భూమిలో ఉన్న సర్వము, అవన్నీ కూడా అస్లమ, లొంగిపోయి ఉన్నాయి. విధేయత పాటిస్తున్నాయి. అల్లాహ్ ఆజ్ఞా పాలన చేస్తున్నాయి, వారికి ఇష్టమైనా, ఇష్టం కాకపోయినా. అస్లమ, వారందరూ ఇస్లాంలోకి వచ్చారు, అంటే ఏంటిది? ఈ సర్వ సృష్టి మనం చూస్తున్నాము, సూర్యుడిని అల్లాహ్ పుట్టించినప్పటి నుండి ఒక్కసారైనా దైవం, అంటే అల్లాహ్ యొక్క నిర్ణయం, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆ సూర్యుని గురించి నిర్ణయించిన దారిని, మార్గాన్ని ధిక్కరించి, వ్యతిరేకించి నడుస్తుందా? నడుస్తున్నాడా? అలా అయితే ఇప్పటివరకు ఎప్పుడో నాశనం అయిపోయేది.

సోదరులారా, ఈ ఒక్క విషయం చెప్పాను సూర్యుడని. ఇస్లాం ధర్మం అంటే ఏంటిది? ఇది ఏదో కొత్త 400 సంవత్సరాల క్రితం, 1400 సంవత్సరాల క్రితం, 700 సంవత్సరాల క్రితం వచ్చిన ధర్మం కాదు. ఆది మానవుడి నుండే కాదు, అంతకు ముందు నుండి ఉంది. ప్రతి సృష్టి అల్లాహ్ కు లొంగి ఉన్నది. అయితే మానవులను కూడా అల్లాహ్ పుట్టించింది ఆయన ఆదేశం పాటించి, ఆయనను మాత్రమే ఆరాధించుటకు.

అయితే చివరిగా ఈ సందేశం సంపూర్ణం చేయబడింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద. అందుగురించే ఇప్పుడు ఇదియే ఇస్లాం, అంటే ఖురాన్, అల్లాహ్, ముహమ్మద్ ప్రవక్త. వీటిని ఈ ముగ్గురిని, మూడింటిని మనం స్వీకరించడం, అంగీకరించడం, ఒప్పుకోవడం ప్రకారంగా జీవితం గడపడం తప్పనిసరి.

ఇక ఏదైతే పుకారు ఉందో, వెయ్యి సంవత్సరాల క్రితమని, ఇది కూడా తప్పు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నగరంలో ఉన్నప్పుడే భారత ఖండంలో ఇస్లాం ప్రవేశించింది. ఇస్లాం అంటే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పరిచయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన సత్య ధర్మం అప్పుడే ఇండియాలో చేరింది. ఇప్పటికీ దాని యొక్క గుర్తులు, దాని యొక్క చిహ్నాలు కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించిన సహాబాలు, వారిలో ఇద్దరి సమాధులు ఇప్పటికీ ఇండియాలో ఉన్నాయి. కానీ చరిత్ర నుండి కూడా దూరమై, కళ్ళు మూసుకొని లేదా తెలిసినప్పటికీ వాటి మీద ముసుగు వేసి సత్యాన్ని స్వీకరించకపోతే అది వేరే విషయం.

మరొక చారిత్రక విషయం, దాని గురించి ఖురాన్ లో, హదీస్ లో ఎలాంటి ప్రూఫ్ అనేది లేదు, కానీ చారిత్రకంగా ఒక విషయం చాలా ప్రఖ్యాతి గాంచి ఉంది. అదేమిటంటే ఆది మానవుడు అని ఎవరినైతే అనడం జరుగుతుందో, అంటే ఆదం అలైహిస్సలాం మరియు ఆయన యొక్క భార్య హవ్వా అలైహిస్సలాం, వీరిద్దరినీ అల్లాహు త’ఆలా స్వర్గం నుండి ఏదైతే దించాడో అప్పుడు ఆదం అలైహిస్సలాం ఆ కాలంలో ఇండియా, ఇప్పుడు ఉన్న ఇండియా, శ్రీలంక ఇదంతా కలిసి ఉండే, అయితే సరాందీప్ అనే ప్రాంతంలో వచ్చారు, దిగారు, తర్వాత అక్కడి నుండి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్లి మక్కాలో చేరుకున్నారు అని కూడా చారిత్రకంగా ఒక మాట ఉంది. దీన్ని నిరాకరించడానికి ఇంతకంటే బలమైన ఏదైనా విషయం ఉండేది ఉంటే అది వేరే విషయం. కానీ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను? అయితే మన భారత ఖండంలోనే ఆది మానవుడు అవతరించాడు. ఆ ఆది మానవుడు అల్లాహ్ యొక్క దాసుడు. అతను ముస్లిం. అతని నుండి వచ్చిన సర్వ సంతానము ఇస్లాం ధర్మ ప్రకారంగానే ఉంటుంది. అల్లాహ్ ఖురాన్ లో ఏమి చెప్పాడు?

فِطْرَتَ اللَّهِ الَّتِي فَطَرَ النَّاسَ عَلَيْهَا
(ఫిత్ రతల్లాహిల్లతీ ఫతరన్నాస అలైహా)
అల్లాహ్ మానవులను ఏ ప్రకృతిపై పుట్టించాడో దానినే అవలంబించు. (30:30)

మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, “కుల్లు మౌలూదిన్ యూలదు అలల్ ఫిత్రా.” పుట్టే ప్రతి పిల్లవాడు ఫిత్రత్, ప్రకృతి ధర్మం, స్వాభావిక ధర్మంపై పుడతాడు. కానీ అతనికి మాటలు రావు, ఇంకా ఏమీ అనుభవం ఉండదు గనక, ఫ అబవాహు యుహవ్విదానిహి. అతని యొక్క తల్లిదండ్రి యూదులైతే, అబ్బాయిని కూడా యూదునిగా చేసేస్తారు. తల్లిదండ్రులు ఒకవేళ అగ్ని పూజారులైతే, ఆ పిల్లవాడు కూడా అలాగే మారిపోతాడు. కానీ ఎప్పుడైతే అతడు పెరుగుతాడో, బుద్ధి జ్ఞానం గలవాడైతాడో, సత్యాన్ని తెలుసుకుంటాడో, ధర్మాన్ని వెతుకుతాడో, అతనికి సత్యం అనేది తెలిసి రావచ్చు. ఒకవేళ ఇహలోక ఏదైనా ఆశలు, ఇహలోక ఏవైనా భయాలు, లేదా హోదా, అంతస్తుల దురాశలు, ఇలాంటివి ఏవీ అడ్డు రాకుంటే, తప్పకుండా మనిషి సత్యం విన్న తర్వాత, అతనికి మాట అర్థమవుతుంది, స్వీకరించగలడు. ఎందుకంటే ఇహలోకంలో నేనే రాజుని అని కాదు, నేనే మీ ప్రభువుని, నా ముందే మీరు తలవంచాలి అన్నటువంటి గర్వానికి గురియై ఎంతో గర్వంతో విర్రవీగుతూ కొంతకాలం ప్రజల్ని తన ముందు, తమ ముందు వంచించుకున్న అలాంటి పెద్ద పెద్ద నాయకులు స్వయంగా వారి ప్రాణం పోయే సందర్భంలో ఏమన్నారు? ఫిరౌన్, అతని కంటే దుర్మార్గుడు, దౌర్జన్యుడు బహుశా ఇంకా వేరే ఒకడు రాలేదు. అతడు కూడా ఏమన్నాడు? మూసా మరియు హారూన్ ల యొక్క ప్రభువు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రభువుని నేను విశ్వసిస్తున్నాను అన్నాడు.

మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ ప్రవక్త. ఆయన కాలంలో ఎవరైతే ప్రవక్తకు వ్యతిరేకంగా నాయకత్వం వహించారో, వారిలో ఒకరి పేరు అబూ జహల్. ప్రవక్త అతని గురించి ఏమన్నాడు ఒకసారి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ జహల్ గురించి ఒకసారి ఏమన్నారు? ఈ అబూ జహల్ ఈ కాలానికి ఫిరౌన్ లాంటివాడు. కానీ అంతటి ఆ దుర్మార్గుడు దొంగచాటుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ పఠించేటప్పుడు వినేవాడు. విన్నాడు. విని, సత్యం అతనికి తెలిసింది. అతని యొక్క దగ్గరి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు లాంటి వాడు, అతన్ని అడిగాడు కూడా, రాత్రి నేను కూడా ఖురాన్ విన్నాను, నువ్వు కూడా దొంగచాటుగా విన్నావు అంటే నేను వినలేదు అని ముందు అన్నాడు. తర్వాత చెప్పాడు, చెప్పే మాట అతనిది బాగానే అనిపిస్తుంది, కానీ ఇతడి వంశం, అబూ జహల్ యొక్క వంశం ముత్తాతల్లో ఒకరి వైపు నుండి వస్తుంది, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబ్దే మునాఫ్ నుండి వస్తారు. వీరి యొక్క వంశంలో వారు ఎలాంటి అన్ని మంచి కార్యాలు చేసుకుంటూ వచ్చారో, మనం కూడా చేసుకుంటూ వచ్చాము. కానీ ఈరోజు ఇతడు కొత్త ఏదో మాట మొదలు పెట్టాడు కదా, అలాంటి హోదా అంతస్తు మనకు దొరకదు కదా. అంటే కేవలం ప్రపంచ దురాశలకు లోనై సత్యాన్ని తిరస్కరించలేదు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చిన తర్వాత, మదీనా వలస వచ్చిన తర్వాత అక్కడ ప్రవక్తకు శత్రువుల్లో చాలా కఠినంగా వ్యతిరేకించిన వారిలో ఒకతని పేరు హుయై బిన్ అఖ్తబ్, యూదుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్యల్లో ఒక భార్య ఎవరు? సఫియ్యా రదియల్లాహు అన్హా. ఆ నాయకుని యొక్క కుమార్తె. ఆమె ఇస్లాం స్వీకరించింది. ప్రవక్తకు భార్యగా అయింది. ఆమె ఒక సందర్భంలో చెప్తుంది, నేను ఇంకా చాలా నా చిన్న వయసు నాది. ప్రవక్త ఆ రోజుల్లో మదీనాలో వచ్చే సందర్భంలో మా నాన్న మరియు మా చిన్న తండ్రి, చాచా, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అతడు వచ్చేసాడు మదీనాలో అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి. మరి ఏంటి ఉద్దేశం? అతని గురించి మన గ్రంథాల్లో కూడా వచ్చింది ఉంది కదా, చిట్టచివరి ప్రవక్త అని. ఇద్దరు ఆ సత్య విషయాలన్నీ తెలుసు వారికి. ఎందుకంటే యూద గ్రంథాల్లో కూడా ప్రవక్త ముహమ్మద్ గురించి వచ్చింది ఉంది ప్రస్తావన. కానీ వారు ఏమన్నారు? లేదు, లేదు, లేదు, మనం ప్రాణం ఉన్నంతవరకు అతన్ని వ్యతిరేకించి, అతనికి తిరుగుబాటుగా, ఎదురుగానే మనం ఉండాలి, అంటే ఈ రోజుల్లో ఏమనవచ్చు మనం, అపోజిషన్ పార్టీలోనే ఉండాలి, ఎప్పుడు కూడా వారితో కలవవద్దు.

అయితే ప్రపంచ దురాశాలకు గురై కూడా ఎందరో ఇలాంటి సత్యాన్ని తిరస్కరించిన వారు ఉన్నారు. అందు గురించి సోదరులారా, ఇవన్నీ మనకు ఇహలోకంలో కొద్ది రోజులు మాత్రమే పనికి వస్తే రావచ్చు, అందరికీ కూడా రావు. కానీ చివరికి చనిపోయే సందర్భంలో కూడా సత్యాన్ని తిరస్కరించడం, ధర్మాన్ని వ్యతిరేకించడం, ఏ మాట మనకు తెలిసిందో అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు నుండి దాన్ని అమలు చేయనందుకు, అమలు పరచనందుకు, తప్పకుండా దీని గురించి ప్రశ్నించబడుతుంది మరియు పరలోకంలోనైతే చాలా నష్టపోతాము. అందు గురించి ఖురాన్ లో అల్లాహ్ త’ఆలా ఏం చెప్పాడు?

وَمَنْ يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
(వ మన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుఖ్బల మిన్హు)
ఎవడైనా ఇస్లాంను కాదని మరో ధర్మాన్ని అవలంబించదలిస్తే, అది అతని నుండి ఎంతమాత్రం స్వీకరించబడదు. మరి అతను పరలోకంలో నష్టపోయే వారిలో చేరతాడు. (3:85)

ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని తనకు ధర్మంగా ఒప్పుకుంటాడో, దాన్ని స్వీకరించి బ్రతుకుతాడో, ఫలన్ యుఖ్బల మిన్హ్, అది అతని నుండి ఎన్నటికీ స్వీకరించబడదు. వహువ ఫిల్ ఆఖిరతి, ఇక్కడ ఒక విషయం గమనించండి. అల్లాహ్ ఏమంటున్నాడు? వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. అతడు పరలోకంలో చాలా నష్టపోయే వారిలో కలుస్తాడు. ఇహలోకం గురించి చెప్పలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొందరు తప్పుడు మార్గంలో ఉన్నప్పటికీ అల్లాహ్ తొందరగా పట్టి శిక్షించడు. కొంత వెసులుబాటుని ఇస్తూ ఉంటాడు. అందు గురించి ఇలాంటి వెసులుబాటుని పొంది తప్పుడు భావంలో పడకూడదు. అల్లాహు త’ఆలా మనందరికీ సన్మార్గం చూపుగాక. ఇస్లాం ధర్మం స్వయంగా అర్థం చేసుకొని ఇతరులకు దానిని అర్థం మంచిగా నచ్చచెప్పే భాగ్యం ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

జుమా నమాజును వదలడం పాపమా? [ఆడియో, టెక్స్ట్]

[5 నిముషాలు]
https://youtu.be/J8IAEgfxvtk
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

జూమా నమాజ్ వదిలివేయడం ఘోరమైన పాపాలలో ఒకటి మరియు కబీరా గునా (పెద్ద పాపం). దీనికి సాధారణ పుణ్యాలు ప్రాయశ్చిత్తం కావు, ప్రత్యేకమైన తౌబా (పశ్చిత్తాపం) అవసరం. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జూమాను విడిచిపెట్టిన వారి ఇళ్లను తగలబెట్టాలని తీవ్రంగా ఆకాంక్షించారు, ఇది ఈ పాపం యొక్క తీవ్రతను సూచిస్తుంది. సరైన కారణం లేకుండా ఉద్దేశపూర్వకంగా వరుసగా మూడు జూమా నమాజ్‌లను వదిలివేసే వారి హృదయాలపై అల్లాహ్ ముద్ర వేస్తాడని మరియు వారు ఏమరుపాటులో పడినవారిలో కలిసిపోతారని కూడా ఆయన హెచ్చరించారు.అందువల్ల, ప్రతి ముస్లిం జూమా నమాజ్‌ను తప్పనిసరిగా పాటించాలి మరియు దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

జూమా నమాజ్‌ను వదలడం పాపమా?

సోదర మహాశయులారా, ఈ రోజుల్లో మనిషి ప్రాపంచిక జీవితంలో లీనమైపోయి మరియు పరలోకాన్ని మరిచిపోయి, ఐదు పూటల నమాజ్‌లను విలువ లేకుండా, ఎలాంటి భయం లేకుండా వదిలేస్తున్నాడంటే, జూమా నమాజ్‌లను కూడా ఎంతోమంది ఎన్నో సాకులు చెప్పుకుంటూ వదిలేస్తున్నారు.

అయితే, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం ఒక విషయం, రెండు హదీసులను మీకు వినిపిస్తాను. దీని ద్వారా మీరు గుణపాఠం నేర్చుకొని ఇక నుండి ఏ ఒక్క రోజు కూడా జూమా వదలకుండా ఉండడానికి జాగ్రత్త పడండి.

ఒక విషయం ఏంటి? సోదర మహాశయులారా, జూమా నమాజ్‌ను వదలడం చిన్న పాపం కాదు. సరైన కారణం లేకుండా జూమా నమాజ్‌ను వదలడం ఘోరమైన పాపాల్లో ఒకటి, ‘కబీరా గునా’ అని ఏదైతే అంటారో. మరియు సామాన్యంగా ఖురాన్ ఆయతులు మరియు హదీసుల ద్వారా మనకు ఏం తెలుస్తుంది?

إِن تَجْتَنِبُوا كَبَائِرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنكُمْ سَيِّئَاتِكُمْ
(ఇన్ తజ్తనిబూ కబాయిర మా తున్‌హౌన అన్‌హు నుకఫ్ఫిర్ అన్‌కుం సయ్యిఆతికుమ్)
మీకు నిషేధించబడిన ఘోరమైన పాపాలను మీరు వదిలివేస్తే, మేము మీ చెడులను మీ నుండి తొలగిస్తాము.

ఇంకా వేరే ఇలాంటి ఆయతులు ఈ భావంలో హదీసులు ఉన్నాయి. అంటే ఈ కబీరా గునా, ఘోరమైన పాపాలు అట్లే క్షమింపబడవు. దాని గురించి ప్రత్యేకమైన తౌబా (పశ్చిత్తాపం) అవసరం. కొన్ని సందర్భాల్లో కొన్ని పుణ్యాలు చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని మనం వింటాము కదా? అలాంటి పాపాల్లో ఈ జుమాను వదలడం రాదు. అందు గురించి భయపడండి.

అంతేకాదు, ప్రవక్త మహానీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జూమా నమాజ్‌కు ఎంత గొప్ప విలువ ఇచ్చారో గమనించండి. సహీ ముస్లిం షరీఫ్‌లోని హదీస్, హదీస్ నెంబర్ 652.

హజ్రత్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు:

قَالَ لِقَوْمٍ يَتَخَلَّفُونَ عَنِ الْجُمُعَةِ: لَقَدْ هَمَمْتُ أَنْ آمُرَ رَجُلاً يُصَلِّي بِالنَّاسِ، ثُمَّ أُحَرِّقَ عَلَى رِجَالٍ يَتَخَلَّفُونَ عَنِ الْجُمُعَةِ بُيُوتَهُمْ.
(ఖాల లిఖౌమిన్ యతఖల్లఫూన అనిల్-జుముఅతి: లఖద్ హమమ్తు అన్ ఆముర రజులన్ యుసల్లీ బిన్నాసి, సుమ్మ ఉహర్రిక అలా రిజాలిన్ యతఖల్లఫూన అనిల్-జుముఅతి బుయూతహుమ్)

జూమా నమాజ్ నుండి వెనుక ఉండిపోయే ప్రజల గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ప్రజలకు నమాజ్ చేయించడానికి నేను ఒక వ్యక్తిని ఆదేశించి, ఆ తర్వాత జూమాకు రాకుండా తమ ఇళ్లలో ఉండిపోయిన వారి ఇళ్లను తగలబెట్టాలని నేను నిశ్చయించుకున్నాను.”

వారి ఇండ్లకు మంట పెట్టాలి అన్నటువంటి కాంక్ష ఉంది. కానీ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అలా చేయలేదు. సోదర మహాశయులారా, ప్రవక్త ఇంత భయంకరమైన శిక్ష వారికి తమ జీవిత కాలంలో ఇవ్వాలని, వారు బ్రతికి ఉన్నప్పుడే వారి ఇండ్లను కాలబెట్టాలని కోరారంటే, ఈ పాపం చిన్న పాపమా సోదరులారా?

మరొక హదీసును విన్నారంటే, ఇంకా భయకంపితలు అయిపోవాలి. జుమా ఇక ఎన్నడూ వదలకుండా ఉండడానికి అన్ని రకాల మనం సంసిద్ధతలు ముందే చేసుకొని ఉండాలి. ఈ హదీస్ కూడా సహీ ముస్లింలో ఉంది, హదీస్ నెంబర్ 865.

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ మరియు హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా మేము విన్నాము అని అంటున్నారు. ఏం చెప్పారు ప్రవక్త?

لَيَنْتَهِيَنَّ أَقْوَامٌ عَنْ وَدْعِهِمُ الْجُمُعَاتِ، أَوْ لَيَخْتِمَنَّ اللَّهُ عَلَى قُلُوبِهِمْ، ثُمَّ لَيَكُونُنَّ مِنَ الْغَافِلِينَ.
(లయన్‌తహియన్న అఖ్వామున్ అన్ వద్ఇహిముల్-జుముఆతి, అవ్ లయఖ్తిమన్నల్లాహు అలా ఖులూబిహిమ్, సుమ్మ లయకూనున్న మినల్-గాఫిలీన్)

“ప్రజలు జూమా నమాజ్‌లను వదిలివేయడం మానుకోవాలి, లేకపోతే అల్లాహ్ వారి హృదయాలపై ముద్ర వేస్తాడు, అప్పుడు వారు ఏమరుపాటులో పడినవారిలో కలిసిపోతారు.”

ఎవరి హృదయాలపై ముద్ర పడిపోతుందో వారు ఏమరుపాటులో గురి అయిన వారిలో కలిసిపోతారు. అల్లాహ్ ఇలాంటి వారి నుండి మనల్ని కాపాడుగాక. ఖురాన్‌లో ‘గఫ్లా’ (ఏమరుపాటు), ‘గాఫిలీన్’ (ఏమరుపాటులో పడినవారు) అన్న పదం ఎక్కడెక్కడ వచ్చిందో చూసి, దాని అనువాదం, దాని వెనకా ముందు ఉన్నటువంటి శిక్షలు చదివి చూడండి.

జుమాలను వదిలినందుకు రెండు శిక్షలు ఇక్కడ ఇవ్వబడుతున్నాయి చూడండి. ఒకటి ఈ హదీసులో మనం ఇప్పుడు తెలుసుకున్న హదీసులో: ఒకటి, అల్లాహ్ ముద్ర వేసేస్తాడు. రెండవది, ఏమరుపాటిలో గురి అయిన వారిలో మనం కలిసిపోతామంటే, భయంకరమైన శిక్ష కాదా?

అల్లాహు తఆలా మనందరికీ హిదాయత్ ఇవ్వుగాక. ఇకనైనా భయపడండి. ఇన్ని రోజుల జీవితం ఇహలోకంలో. అల్లాహ్ యొక్క ఆదేశాల ప్రకారం జీవితం గడిపి, మనం భక్తుల్లో, నరకం నుండి ముక్తి పొందే వారిలో, సత్పురుషుల్లో చేరే ప్రయత్నం చేద్దాము.

అల్లాహ్ మనందరికీ స్వర్గంలో చేర్పించేటువంటి ప్రతి సత్కార్యం చేసే సద్భాగ్యం ప్రసాదించుగాక. వ ఆఖిరు దావాన అనిల్-హందులిల్లాహ్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) ప్రాముఖ్యత [ఆడియో & టెక్స్ట్]

అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) ప్రాముఖ్యత
https://youtu.be/F_XuR9WXUr8 [25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియ సహచరుడు, ఇస్లాం మొదటి ఖలీఫా అయిన హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి జీవితంలోని ముఖ్య ఘట్టాలు వివరించబడ్డాయి. ఇస్లాంకు ముందు ఆయన స్వచ్ఛమైన, నిజాయితీ గల జీవితం, ప్రవక్త గారి పిలుపును అందుకుని క్షణం కూడా సంకోచించకుండా ఇస్లాం స్వీకరించిన తీరు, ప్రవక్త గారి పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ, విశ్వాసం గురించి చర్చించబడింది. మేరాజ్ సంఘటన తర్వాత ప్రవక్తను సత్యవంతునిగా ధృవీకరించడం ద్వారా “సిద్దీఖ్” అనే బిరుదును ఎలా పొందారో వివరించబడింది. ఇస్లాం కోసం బానిసలను విడిపించడం, హిజ్రత్ (వలస) ప్రయాణంలో ప్రవక్త గారికి తోడుగా నిలవడం, థౌర్ గుహలో ఆయన చేసిన త్యాగం, ప్రవక్త గారి మరణానంతరం ముస్లిం సమాజాన్ని ఎలా ధైర్యంగా నిలబెట్టారో వంటి అనేక స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఇందులో ప్రస్తావించబడ్డాయి.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్ హందులిల్లాహి వహ్ దహ్, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బ’అద అమ్మా బ’అద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచరుల గురించి తెలుసుకొని ఉన్నాము.

ఈరోజు మనం హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి జీవిత విశేషాల గురించి తెలుసుకుందాము.

హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించాక రెండున్నర సంవత్సరాలకు ఇహలోకంలోకి వచ్చారు. ఆయన తన చిన్నతనం నుండే ఎంతో నిజాయితీగా, సత్యవంతునిగా మరియు ఎంతో అందరికీ ఇష్టమయ్యే మృదువైన, ఉత్తమమైన నడవడికను అవలంబించుకొని జీవితం గడుపుకుంటూ వచ్చారు. ఆయన జీవిత చరిత్రను మనం చూస్తే, ఇస్లాం కంటే ముందు అజ్ఞాన కాలంలో ఆయన తన యవ్వనంలో గానీ, ఇస్లాం స్వీకరించక ముందు గానీ ఏ ఒక్క రోజు కూడా మత్తుపానీయాలకు సమీపించలేదు, దగ్గరికి వెళ్ళలేదు. ఏ చెడు అలవాట్లకు, సామాన్యంగా ఏదైతే కొన్ని సమాజాల్లో యువకులు కొన్ని చెడు గుణాల్లో పడిపోతారో, అలాంటి ఏ చెడు గుణానికి దగ్గర కాలేదు.

ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం గురించి ప్రచారం ప్రారంభం చేయక ముందు నుండే అతను ప్రవక్త గారికి ఒక దగ్గరి స్నేహితునిగా, ఒక మంచి స్నేహితునిగా ఉన్నారు. ఆయనకు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే నేను ప్రవక్తను, అల్లాహ్ నన్ను సర్వ మానవాళి వైపునకు సందేశహరునిగా, ప్రవక్తగా చేసి పంపాడో, నా పిలుపు ఏమిటంటే, అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు మరియు నేను ఆయన ప్రవక్తను, నీవు ఈ విషయాన్ని స్వీకరిస్తావా అని అంటే, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు క్షణం పాటు గురించి కూడా సంకోచించక, ఎలాంటి సందేహంలో పడక, ఏ ప్రశ్న ప్రవక్త ముందు చేయక వెంటనే స్వీకరించారు. కొందరు తడబడాయిస్తారు, కొందరు ఆలోచిస్తారు, మరికొందరు ఎదురు ప్రశ్నలు వేస్తారు కానీ హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు అలాంటి ఏ సంకోచంలో పడకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే నమ్ముకున్నారు.

ఇంకా మనం ఆయన జీవితం గురించి తెలుసుకున్నప్పుడు ఎన్నో విషయాలు ముందుకు రానున్నాయి, కానీ ఒక సందర్భంలో ఎప్పుడైతే హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హుతో, ఏమిటి నీవు నీ స్నేహితుడు అంటే వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి, నీ స్నేహితుడు చెప్పిన ప్రతి మాటను ఒప్పుకుంటున్నావు అని హేళనగా కొందరు అవిశ్వాసులు అడిగినప్పుడు, అవును, ఆయన అమీన్ మరియు సాదిఖ్ అని మీరు కూడా నమ్మేవారు కదా! ఆయన ప్రపంచంలో ఎవరితోనీ కూడా తన స్వయ అవసరానికి అయినా ఏ ఒక్క రోజు గానీ ఏ ఒక్కసారి గానీ అబద్ధం పలకలేదు. అలాంటి వ్యక్తి సృష్టికర్త అయిన అల్లాహ్ పై ఎలా అబద్ధాన్ని, ఎలా అబద్ధాన్ని మోపుతారు? ఒక అభాండను అల్లాహ్ వైపునకు ఎలా అంకితం చేస్తారు? చేయలేరు. అందుగురించి ఆయన చెప్పిన ప్రతి మాటను నేను నమ్ముతాను. అల్లాహ్ ఈ విషయం నాకు తెలిపాడు అని ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారో అందులో నేను ఏ మాత్రం సంకోచించను. సోదర మహాశయులారా, సోదరీమణులారా, విశ్వాసం అంటే ఇలా దృఢంగా ఉండాలి. మనం కూడా హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క జీవితం ద్వారా మంచి ఉత్తమమైన గుణపాఠాలు నేర్చుకోవాలి.

హజ్రత్ అబూబకర్, ఈ బిరుదుతోనే ఆయన చాలా ప్రఖ్యాతి గాంచారు. అబ్దుల్ అతీఖ్ అని ఇంకా అబ్దుల్ కాబా అని వేరే ఎన్నో రకాల పేర్ల గురించి మనకు చరిత్రలో తెలుస్తుంది. కానీ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన గురించి అబ్దుల్లాహ్ అన్న పేరును పెట్టారు, అల్లాహ్ యొక్క దాసుడు అని, కానీ అబ్దుల్లాహ్ అన్న పేరుతో ఆయన ఫేమస్ కాలేదు. అబూబకర్ అన్న పేరుతో మరియు మరొక బిరుదు “సిద్దీఖ్”.

దీని గురించి కూడా ఎన్నో ఉల్లేఖనాలు ఉన్నాయి. ఖురాన్ ఒక ఆయతు ద్వారా కూడా ఎందరో ఖురాన్ వ్యాఖ్యానకర్తలు ఈ విషయం తెలిపారు.

وَالَّذِي جَاءَ بِالصِّدْقِ وَصَدَّقَ بِهِ ۙ أُولَٰئِكَ هُمُ الْمُتَّقُونَ
(వల్లజీ జా అబిస్సిద్ఖి వసద్దఖ బిహీ ఉలాఇక హుముల్ ముత్తఖూన్)
సత్యాన్ని తీసుకువచ్చినవాడూ, దాన్ని సత్యమని ధృవీకరించిన వాడూ – అలాంటి వారే దైవభీతి గలవారు. (39:33)

ఇందులో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సత్యపరిచిన వారు, వారే భయభక్తులు కలిగి ఉన్నవారు, వారే ముత్తఖీన్ అని అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఏదైతే తెలుపుతున్నాడో, సద్దఖ నుండి సిద్దీఖ్ వస్తుంది. అయితే మొట్టమొదటిసారిగా ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సత్యపరిచిన వారు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ గనుక ఆయనకు సిద్దీఖ్ అన్న బిరుదు పడింది. అంతేకాదు దీని గురించి ఒక ప్రఖ్యాతిగాంచిన సంఘటన ఏమిటంటే ఎప్పుడైతే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గగన ప్రయాణం మేరాజ్ కు వెళ్లి వచ్చారో ఆ తర్వాత మేరాజ్ యొక్క సంఘటన ప్రజలకు తెలియపరిచారు. అప్పుడు విశ్వాసులు ఆ విషయాన్ని నమ్మారు. కానీ అవిశ్వాసులు హేళన చేశారు. మేము ఇక్కడి నుండి మక్కా నుండి బైతుల్ మఖ్దిస్ వెళ్ళాలంటే నెల పడుతుంది కనీసం, నీవు ఒకే రాత్రి రాత్రిలోని కొంత భాగములో బైతుల్ మఖ్దిస్ వెళ్లి మళ్ళీ అక్కడ నుండి ఏడు ఆకాశాల వరకు వెళ్ళావు, ఏమిటి మమ్మల్ని పిచ్చి వాళ్ళుగా అనుకుంటున్నావా అని ఎగతాళి చేశారు. కానీ ఆ సమయంలో అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు తెలుపుతున్న సందర్భంలో అబూబకర్ లేరు. ఒక అవిశ్వాసి అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వద్దకు వెళ్లి, ఏమిటి ఎవరైనా మక్కా నుండి బైతుల్ మఖ్దిస్ వరకు ఒక రాత్రిలో వెళ్లి వచ్చాను అని అంటే నమ్ముతావా? అంటే అబూబకర్ సిద్దీఖ్ చెప్పారు, లేదు. సామాన్యంగా మనం ప్రయాణం చేస్తూ ఉంటాము. ఎన్ని రోజుల ప్రయాణం పడుతుంది మనకు తెలుసు కదా. ఎవరైనా ఇలా చెప్పేది ఉంటే ఎలా నమ్మాలి? అతడు సంతోషపడి వెంటనే చెప్పాడు, అయితే మరి నీ స్నేహితుడు నీ మిత్రుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెబుతున్నాడు కదా, రాత్రి కొంత భాగంలోనే బైతుల్ మఖ్దిస్ కి వెళ్ళాడంట, అక్కడి నుండి ఏడు ఆకాశాలకు వెళ్లి స్వర్గ నరకాలను కూడా దర్శనం చేసి వచ్చారంట. వెంటనే అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు తెలిపారు, ఒకవేళ ఈ మాట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే అది నూటికి నూరు పాళ్ళు నిజం, అందులో అబద్ధానికి అసత్యానికి ఏ ఆస్కారం లేదు. అల్లాహు అక్బర్! గమనించండి. అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు సరే నేను ముహమ్మద్ ను తెలుసుకుంటాను సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ తర్వాత నిజమో లేదో చెబుతాను ఇవన్నీ ఇలా చెప్పలేదు విషయాలు, ఏమన్నారు? అతని ముంగట అప్పుడే అప్పటికప్పుడే చెప్పారు, ఒకవేళ ఈ మాట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గనుక చెప్పేది ఉంటే ఆ మాట నిజము, అందులో ఎలాంటి అనుమానం లేదు. అందుగురించి ఆయనకు సిద్దీఖ్ అన్నటువంటి బిరుదు పడింది అని కూడా చెప్పడం జరిగింది.

అంతేకాకుండా సహీ బుఖారీలో కూడా ఒక హదీస్ వచ్చి ఉంది. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్, ఉమర్, ఉస్మాన్ నలుగురు ఉహద్ పర్వతంపై ఉన్నారు. అప్పుడు ఉహద్ పర్వతం అందులో ప్రకంపన వచ్చింది, ఊగ సాగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ కాలుతో ఒకసారి ఇలా కొట్టి, ఉస్బుత్ ఉహుద్ (ఓ ఉహుద్, స్థిరంగా ఉండు), ఉహుద్ కదలకు, నిలకడగా ఉండు, ఇప్పుడు నీపై ఒక నబీ, ఒక సిద్దీఖ్ మరియు ఇద్దరు షహీదులు ఉన్నారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. అంటే ప్రవక్త అంటే స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సిద్దీఖ్ అంటే హజ్రత్ అబూబకర్ మరియు ఇద్దరు షహీదులు అంటే హజ్రత్ ఉమర్ మరియు ఉస్మాన్.

సోదర సోదరీమణులారా, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఇస్లాం కంటే ముందు తమ జీవితంలో ఏ ఒక్కసారి కూడా షిర్క్ కార్యకలాపాలకు పాల్పడలేదు. ఆయనకు యవ్వనంలో చేరుకున్నప్పటి నుండే వ్యవసాయం ఇంకా పెద్దలతో ఉండడం మరియు హుందాతనంగా జీవించడం ఆరంభించారు. ఆయన యవ్వనంలో చేరిన తర్వాత ప్రజలలో ఒక చాలా మంచి వ్యక్తిగా, ఏదైనా ముఖ్య విషయాల్లో అతనితో సలహా తీసుకోవాలి అని ప్రజలు కోరేవారు. ఇస్లాం స్వీకరించిన తర్వాత అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు మౌనం వహించలేదు. నాకు ఇస్లాం లాంటి ఒక అనుగ్రహం లభించింది కదా ఇక దీనిపై నేను స్థిరంగా ఉంటాను అని తనకు తాను ఆలోచించుకొని కేవలం జీవితం గడపలేదు. ఇస్లాం స్వీకరించిన వెంటనే ఇస్లాం యొక్క ప్రచారం కూడా మొదలు పెట్టారు. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో ఏ పది మంది గురించి ఇహలోకంలోనే స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చారో వీరు తప్పకుండా స్వర్గంలో చేరుతారు అని అందులో మొట్టమొదటి వ్యక్తి అబూబకర్, ఆ తర్వాత మిగతా తొమ్మిది మందిలో అధిక శాతం హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు యొక్క బోధనతో, హజ్రత్ అబూబకర్ యొక్క ప్రోత్సాహంతో ఇస్లాం స్వీకరించారు. ఉదాహరణకు హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ తల్హా, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ ఇంకా వేరే కొంతమంది. అంతేకాదు, హజ్రత్ అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు వ్యాపారం చేస్తూ ఉండేవారు. అల్లాహు త’ఆలా ఆ వ్యాపారం ద్వారా అతనికి చాలా శుభం కలుగజేశాడు. ఆయన ఎంతో మంచి విధంగా ధనం సంపాదించారు, హలాల్, ధర్మసమ్మత మార్గం నుండి. కానీ ధనం అంటే ఇష్టపడి దాని ప్రేమలో, వ్యామోహంలో చిక్కుకునే వారు కాదు. సాధ్యమైనంత వరకు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడుతూ ఉండేవారు.

ఇక ఈ ఉత్తమ గుణం అయితే ఇస్లాం తర్వాత ఎలా మారింది? సమాజంలో ఎవరైతే కొందరు బానిసలు, బానిసరాండ్లు, మరికొందరు బలహీనులు ఎవరైతే ఇస్లాం స్వీకరించారో, వారు ఇస్లాం స్వీకరించిన కారణంగా వారి యొక్క యజమానులు వారిని బాధిస్తూ ఉండేవారు. అయితే హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వారిని వారి యొక్క యజమానుల నుండి కొని తన స్వయ డబ్బుతో వారిని అల్లాహ్ మార్గంలో విడుదల చేసేవారు. ఇస్లాంపై ఇక మీరు స్వేచ్ఛగా జీవితం గడపండి అని. హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు స్వయంగా తాను తన డబ్బుతో ఏ ఏ బానిసలను కొని బానిస నుండి విముక్తి కలిగించారో వారిలో ఆమిర్ ఇబ్ను ఫుహైరా, ఉమ్ము ఉబైస్, జున్నైరా, నహదియా మరియు ఆమె కూతురు, హజ్రత్ బిలాల్ రదియల్లాహు త’ఆలా అన్హు చాలా ప్రఖ్యాతిగాంచిన వారు తెలిసిన విషయమే మరియు బనీ మొఅమ్మల్ కు సంబంధించిన ఒక బానిసరాలు.

అంతేకాకుండా, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఇస్లాం స్వీకరించిన తర్వాత ప్రజలకు ఇస్లాం బోధించడంలో స్వయంగా ఒక్కొక్కసారి ఆయనపై ఎన్నో ఆపదలు వచ్చేవి. ఎందుకంటే ప్రవక్త జీవిత చరిత్ర చదివిన వారికి విషయం తెలుసు, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని స్వయంగా మరియు వారిని విశ్వసించిన వారిపై అవిశ్వాసులు హత్యా, దౌర్జన్యాలు చేసేవారు మరియు ఎన్నో రకాలుగా వారిని బాధించేవారు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేస్తూ ఉన్నారు. ఒక దుర్మార్గుడు వచ్చి తన యొక్క దుప్పటిని తీసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మెడలో వేసి ఇంత గట్టిగా లాగాడంటే దాని మూలంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవూదుబిల్లా ఇక ఆయనకు ప్రాణం పోయినట్లు ఏర్పడింది. అప్పుడు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వచ్చి ఆ దుష్టుల నుండి, దుర్మార్గుల నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విడిపించి, “అతఖ్ తులూన రజులన్ అన్ యఖూల రబ్బి యల్లాహ్” (నా ప్రభువు కేవలం అల్లాహ్ అని అన్నందుకు ఒక వ్యక్తిని చంపుతారా?) అని, ఏమిటి నా ప్రభువు కేవలం అల్లాహ్ మాత్రమే అని అన్నంత మాత్రాన మీరు ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి పుణ్యాత్ముని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇంత దుర్మార్గానికి మీరు ఒడిగడుతున్నారు అని వారిని హెచ్చరించారు. అప్పుడు ఆ దుర్మార్గులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను వదిలి అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు వారిని కొట్టడం మొదలు పెట్టారు. చివరికి ఆయన స్పృహ తప్పిపోయారు. అతని యొక్క తల్లి ఉమ్ము ఖుహాఫా వచ్చి తన కొడుకును వెంట తీసుకొని వెళ్ళింది. ఇంట్లోకి తీసుకెళ్లాక కొంత క్షణం, కొంత సమయం గడిచింది. స్పృహ వచ్చింది. స్పృహ వచ్చిన వెంటనే తల్లి తీసుకొచ్చి నీళ్లు ఇస్తుంది, నాన్న ఈ నీళ్లు త్రాగి కొంచెం ఓదార్పు వహించి నీవు విశ్రాంతి తీసుకో. హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు చెబుతారు, లేదు లేదు, ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పరిస్థితి ఏముందో ఒకసారి నాకు తెలపండి. తల్లి అంటుంది, నాన్న నువ్వు కొంచెం మేలుకున్నాక, విశ్రాంతి తీసుకొని నీ శరీరంలోని ఈ అవస్థలు కొంచెం దూరమయ్యాక వెళ్లి నీవు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాచారాన్ని తెలుసుకుంటూ. కానీ అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఒప్పుకోలేదు. ఉమ్మె జమీల్ ను పిలవండి అని తల్లికి చెప్పారు. ఎవరు? హజ్రత్ ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క సోదరి. అప్పటికి ఆమె ఇస్లాం స్వీకరించింది కానీ స్వయంగా ఉమర్ కు తెలియదు. హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి వద్దకు ఉమ్మె జమీల్ వచ్చింది. అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉమ్మె జమీల్ చెవిలో ఒక మాట మాట్లాడారు, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క క్షేమ విషయాలు తెలుసుకున్నారు. ఆయన బాగున్నారు, స్వస్థతగా ఉన్నారు అని తెలిసినప్పుడు అప్పుడు అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు గారికి నెమ్మది, ఎంతో ఆనందం ఏర్పడింది. అయినా శరీరంలో స్వయంగా నడిచి వెళ్లే అటువంటి శక్తి లేదు, కానీ అమ్మ యొక్క సహాయంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్లారు. ప్రవక్తను చూసుకున్న తర్వాత ఆయన శరీరంలోని అవస్థలన్నీ దూరమైనట్లు ఆయనకు ఏర్పడ్డాయి. అల్లాహు అక్బర్. ఇలాంటి ప్రేమ వెలిబుచ్చేవారు. ఇలాంటి విశ్వాసం వారిది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల. అల్లాహ్ ను విశ్వసించిన తర్వాత అల్లాహ్ ఆరాధనపై నిలకడగా ఉండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను విశ్వసించి, ప్రవక్త బాటను తూచా తప్పకుండా అనుసరిస్తూ ఈ విధంగా వారు జీవితం గడిపారు. ఈ రోజుల్లో మన పరిస్థితి ఏముందో ఒకసారి గమనించండి. అబూబకర్ ఎవరు అబూబకర్? అల్లాహు అక్బర్! అబూబకర్, ఆయనను ప్రశంసిస్తూ ఖురాన్లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ పేరు చెప్పకుండా ఆయన ఉత్తమ గుణగణాలను ప్రస్తావిస్తూ ఎన్నో ఆయతులు అవతరింపజేశాడు.

ఏ ఒక్క క్షణం పాటు కూడా ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విడని వారు. అల్లాహ్ ధర్మం కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సైగను చూసి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ధర్మం కొరకు ఏం అవసరం ఉంది అని చెప్పక ముందే గ్రహించి తన ఆస్తిని, తన సంతానాన్ని, తనకు తానును అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త గురించి త్యాగం చేసేవారు.

ఎప్పుడైతే మక్కా నుండి మదీనా వలస పోవడానికి అనుమతి వచ్చిందో, ఎందరో ముస్లింలు మదీనా వైపునకు వలస పో సాగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఎన్నో సార్లు నాకు కూడా అనుమతి ఇస్తున్నారా మదీనా వెళ్ళడానికి అని అంటే, ప్రవక్త చెప్పేవారు, లేదు, ఓపిక వహించు, అల్లాహు త’ఆలా నీకు ఏదైనా మంచి స్నేహితం ప్రసాదించవచ్చు. అంటే నీ ఈ వలస ప్రయాణంలో నీకు ఎవరైనా మంచి తోడు లభించవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ వైపు నుండి వారికి అనుమతి లభించిన తర్వాత అబూబకర్ కు తెలిపారు, మన ఇద్దరము కలిసి వలస ప్రయాణానికి వెళ్తాము. మంచి రెండు వాహనాలను, ఒంటెలను సిద్ధపరిచి ఉంచు. అప్పుడు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు రెండు ఒంటెలను మంచిగా సిద్ధపరిచి ఉంచారు. అబూబకర్ ఉద్దేశం ఈ రెండు ఒంటెలు స్వయంగా తమ ఖర్చుతో ఆయన తయారు చేసి ఉంచారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఒప్పుకోలేదు. ప్రవక్త ఉపయోగించడానికి ఏ ఒంటెను తీసుకోవాలనుకున్నారో దాని యొక్క ఖరీదు అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హుకు చెల్లించారు. అంతే కాదు, ఈ వలస ప్రయాణంలో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, అల్లాహు అక్బర్! ఎన్నో మహిమలు జరుగుతాయి. ప్రతిసారి హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క ఘనత మరియు ఆయన యొక్క విశిష్టత ఇంకా స్పష్టమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇంటి నుండి కదిలి వెళ్లారో, అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వద్దకు వచ్చారు. ఒంటెలపై ప్రయాణం చేస్తూ ఘారె థౌర్ లోకి వెళ్లి అక్కడ శరణు తీసుకున్నారు. ఆ సందర్భంలో ముందు స్వయంగా అబూబకర్ ఆ ఘార్ లోపలికి వెళ్లారు, ఆ గుహ లోపలికి వెళ్లారు. ఘార్ అంటే గుహ, థౌర్ అక్కడ దాని యొక్క పర్వతం పేరు అందులోని ఒక గుహ. ఆ గుహలో ముందు అబూబకర్ వెళ్లారు ఎందుకు? అక్కడ ఏదైనా పురుగు పూసి, ఏదైనా విషకాటు వేసే అటువంటి విషపురుగులు ఉండకూడదు, ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏదైనా అవస్థ కలగకూడదు అని. అక్కడంతా పరిశుభ్ర చేసిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని లోపలికి పిలిచారు. మరియు ఆ సందర్భంలో ఒకచోట రంధ్రాన్ని చూస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిద్రపోతున్నారు. ఆయనకు ఎలాంటి బాధ కలగకూడదు అని, ఏదైనా ఆ రంధ్రంలో నుండి విషపురుగు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని స్వయంగా ఆయనను గానీ కాటు వేయకూడదు అన్న భయంతో తన ఒక కాలును, తన యొక్క పాదాన్ని ఆ రంధ్రానికి ఆనించి ఉంచారు. కొంతసేపటికి ఏదో విషపురుగు కాటేస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చాలా బాధ కలుగుతుంది, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తల అబూబకర్ తోడపై ఉంది. నేను కదిలానంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నిద్ర చెడిపోతుంది, ఆయన మేలుకుంటారేమో అన్న భయంతో కదలకుండా చాలా జాగ్రత్తగా ఉన్నారు. అల్లాహు అక్బర్! ఎంతటి గొప్ప త్యాగం ఒకసారి గ్రహించండి మీరు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ యొక్క లుఆబ్ ముబారక్ అంటే లాలాజలాన్ని ఆ విషకాటు, విషపురుగు కాటేసిన చోట పెడతారు, అప్పటికప్పుడే నయమైపోతుంది. ప్రయాణంలో వెళుతున్నప్పుడు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఒకసారి ప్రవక్తకు ముందు, ఒకసారి ప్రవక్త వెనక, ఒకసారి ప్రవక్త కుడి వైపున, మరొకసారి ప్రవక్త ఎడమ వైపున ఈ విధంగా ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో అడిగారు, అబూబకర్ ఇలా వెనక, ముందు, కుడి, ఎడమ ఈ విధంగా ఎందుకు మీరు మారుస్తున్నారు స్థలం వెళుతూ వెళుతూ? అప్పుడు అబూబకర్ చెప్పారు, నాకు ఎప్పుడైతే భయం ఏర్పడుతుందో, శంకిస్తానో, ఇటు నుంచి ముందు నుండి ఎవరైనా శత్రువులు ఎదురవుతారా ఆ సందర్భంలో మీకు ఏ హాని కలగకుండా, మీపై ఎలాంటి బాణం రాకుండా నేను ముందుకు వెళ్తాను. నాకు ఎప్పుడైతే ఏదైనా వెళుతూ వెళుతూ ప్రాంతంలో ఇటువైపున ఏదైనా రాళ్ల వెనక ఎవరైనా దాగి ఉండవచ్చును, ఎవరైనా ఏదైనా అక్కడ నుండి బాణం విసురుతారా, ఏదైనా శత్రువు అక్కడ నుండి ఏదైనా దాడి చేస్తాడా అని భయం కలిగినప్పుడు నేను కుడి వైపున వస్తాను, ఎడమ వైపున భయం కలిగినప్పుడు ఎడమ వైపు వెళ్తాను, వెనక వైపు భయం కలిగినప్పుడు వెనక వెళ్తాను. ఈ విధంగా హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కాపాడడానికి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏ హాని కలగకుండా ఉండడానికి ఇంతగా జాగ్రత్తలు పాటిస్తూ ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట ఈ వలస ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఏ అవసరం పడుతుందో అని తన వద్ద ఉన్న డబ్బు ధనం మొత్తం వెంట తీసుకొని వెళ్లారు. అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విశ్వాసం, వారి యొక్క ప్రేమ వారి ఇంటి వారి గురించి వదిలి వెళ్లారు. అల్లాహు అక్బర్! సోదర సోదరీమణులారా, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు మొట్టమొదటిసారిగా పురుషులలో ఇస్లాం స్వీకరించిన వ్యక్తి యొక్క ఈ అమూల్యమైన గాధను మనం వింటూ ఉన్నాము. అల్లాహ్ యొక్క దయతో ఈయన యొక్క జీవితంలోని మరెన్నో మంచి విషయాలు మనం తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క వివిధ సందర్భాలలో వివిధ రకాల ధైర్య సాహసాలు, ఇస్లాం ప్రాప్తి కొరకు, వ్యాపించడానికి ఆయన చేసినటువంటి కృషి ఇంత అంత కాదు. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వలస వచ్చిన తర్వాత ప్రతిసారి ప్రతి సమయంలో సులభతరమైన స్థితి గానీ, కష్టతరమైన పరిస్థితి గానీ అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో, అన్ని స్థితుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అండదండగా ఉన్నారు. బద్ర్ యుద్ధం సంఘటన, దాని యొక్క వివరాలు ఎవరికీ తెలియవు? తెలియని వారు చదవండి, తెలుసుకోండి. కేవలం 313 వరకు ఇటువైపు నుండి ముస్లింలు మరియు అటువైపు నుండి అల్లాహ్ యొక్క సత్య ధర్మాన్ని వ్యతిరేకిస్తూ, అల్లాహ్ యొక్క సత్య ధర్మాన్ని ఈ భూమి మీద నుండి నశింపజేయాలి అన్నటువంటి ఒక తప్పుడు ఉద్దేశ్యాన్ని తీసుకుని వెయ్యి కంటే ఎక్కువ మంది వస్తారు. ధర్మాధర్మాల మధ్య, సత్యాసత్యాల మధ్య నెలకొన్నటువంటి ఈ యుద్ధంలో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో రెండు చేతులు ఎత్తి అల్లాహ్ తో దుఆ చేస్తున్నారు, దుఆ చేస్తున్నారు. ఓ అల్లాహ్ నీ ధర్మాన్ని కాపాడడానికి, నీ ధర్మంపై స్థిరంగా ఉండడానికి, నీ ధర్మం నలువైపులా వ్యాపించడానికి ఈ కొంతమంది తమ ప్రాణాలు తమ చేతిలో తీసుకుని ఏదైతే వచ్చారో, నీవు వారిని స్వీకరించు, నీ ధర్మాన్ని కాపాడు, నీ ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఎవరైతే వచ్చారో వారి నుండి మమ్మల్ని, నీ ధర్మాన్ని అన్నిటిని కాపాడేవారు నువ్వే. దుఆ చేస్తూ ఉన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. చేతులు ఎత్తి దుఆ ఎక్కువ సేపు చేయడం మూలంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భుజాల మీద ఉన్నటువంటి ఆ దుప్పటి కింద జారిపడిపోతుంది. అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆ విషయం చూసి, ఆ సంఘటన చూసి వచ్చి ఆ దుప్పటి కింది నుండి తీసి ప్రవక్త భుజాల మీద వేస్తూ, ప్రవక్తా ఇక సరిపుచ్చుకోండి, ఆపేయండి, అల్లాహు త’ఆలా తప్పకుండా మీ విన్నపాన్ని ఆమోదిస్తాడు, మీరు చేస్తున్న ఇంతటి ఈ దుఆలను తప్పకుండా స్వీకరిస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తృప్తి ఇవ్వను సాగారు. ఆ తర్వాత ఉహద్ యుద్ధం గానీ, ఆ తర్వాత కందక యుద్ధం గానీ, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించే వరకు ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో, ప్రతి యుద్ధంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తోడుగా వెంట వెంటనే ఉన్నారు.

చివరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయాక సహాబాల పరిస్థితి ఏమైంది? అలాంటి సందర్భంలో కూడా హజ్రత్ అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు చెక్కుచెదరకుండా, కదలకుండా ఎంతో ఓర్పుతో, సహనంతో, ధైర్యంతో, నిలకడగా ఉన్నారు. ఆ సంఘటన మీరు బహుశా విని ఉండవచ్చును.

ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోకాన్ని వీడిపోయారో, మలకుల్ మౌత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వారి ఆత్మను తీసుకున్నారో, కేవలం ఈ భౌతిక కాయం హజ్రత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా గారి యొక్క ఇంట్లో మంచముపై ఉన్నది. ఈ విషయం వెంటనే మదీనాలో ఉన్నటువంటి ముస్లింలందరికీ తెలిసిపోయింది. అందరూ చాలా బాధతో రోధిస్తూ మస్జిద్-ఎ-నబవీలో సమూహం అవుతారు. కానీ ఎంతో ధైర్యవంతుడు, ఎంతో శూరుడు, యుద్ధ మైదానాలలో ఎందరినో చిత్తు చేసినటువంటి ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆయన కూడా ప్రవక్త మరణించారు అన్న విషయాన్ని భరించలేకపోతున్నారు. ఏమన్నారు? ప్రవక్త మరణించలేదు. మూసా అలైహిస్సలాం ఎలాగైతే కొద్ది రోజుల గురించి వేటికి వెళ్లారో అల్లాహ్ తోనే కలుసుకోవడానికి, మళ్లీ తిరిగి వచ్చారో అలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్లారు, చనిపోలేదు. ఎవరైనా ముహమ్మద్ చనిపోయారు అని అనేది ఉంటే నేను అతనిని నా ఈ తల్వారితో నరికేస్తాను అన్నటువంటి నినాదం కూడా మొదలు పెట్టారు. ఆ సమయంలో అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు కొంత దూరంలో ఉన్నారు. ఆయనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణ వార్త తెలిసిన వెంటనే వచ్చేస్తారు. ముందు తమ కూతురు ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర భార్య, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి యొక్క శుభ భౌతిక కాయం ఉన్న ఆ గదిలో వస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దుప్పటి కప్పి ఉంటుంది. ముఖము పై నుండి దుప్పటి తీస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నొసటి మీద చుంబిస్తారు, ముద్దు పెట్టుకుంటారు. అప్పుడు అంటారు, కేవలం అల్లాహ్ మాత్రమే ఎలాంటి మరణం లేనివాడు, ఎల్లకాలం శాశ్వతంగా బ్రతికి ఉండేవాడు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు రెండు మరణాలు లేవు, ఒకే ఒక మరణం ఏదైతే ఉండెనో అది వచ్చేసింది, మీరు చనిపోయారు. అప్పటికీ ముస్లింల యొక్క ఈ పరిస్థితి, వారి యొక్క బాధ, మరోవైపున హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క నినాదం, హజ్రత్ అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఇవన్నీ చూస్తారు. వెళ్లి ఉమర్ ను కూర్చోమని చెప్తారు, కానీ ఆ బాధలో అతను అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి మాటను పట్టించుకోలేకపోతారు. అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు అలాంటి క్లిష్ట పరిస్థితిలో సహాబాలను ఎలా ఓదార్చాలి, ఉమర్ ఏదైతే తప్పుడు ఆలోచనలో ఉన్నాడో ప్రవక్త మరణ బాధ కలిగి అతడు ఏ ఆవేశంలో ఉన్నాడో, అతనిని ఎలా ఓదార్చాలి, అతడి యొక్క తప్పు ఆలోచనను ఎలా సరిచేయాలి? అల్లాహు అక్బర్! అల్లాహ్ యొక్క ఎంత గొప్ప దయ అబూబకర్ మీద కలిగింది. అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఎవరితోనూ గొడవపడలేదు, ఉమర్ ఏంటి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు అని ఆ సందర్భంలో ఏమీ చెప్పలేదు. వెంటనే మస్జిద్-ఎ-నబవీలో మెంబర్ పై ఎక్కారు. అల్లాహ్ యొక్క హమ్ద్-ఒ-సనా, ప్రశంసలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ తర్వాత అంటే ఖుత్బ-ఎ-మస్నూనా అని ఏదైతే అంటామో మనం సామాన్యంగా, ఆ తర్వాత

مَنْ كَانَ يَعْبُدُ مُحَمَّدًا فَإِنَّ مُحَمَّدًا قَدْ مَاتَ، وَمَنْ كَانَ يَعْبُدُ اللَّهَ فَإِنَّ اللَّهَ حَىٌّ لاَ يَمُوتُ
ఎవరైతే ముహమ్మద్ ను పూజించేవారో, ముహమ్మద్ చనిపోయారు అన్న విషయం వారు తెలుసుకోవాలి. మరి ఎవరైతే అల్లాహ్ ను పూజిస్తున్నారో, అల్లాహ్ ను ఆరాధిస్తున్నారో అల్లాహ్ శాశ్వతంగా బ్రతికి ఉండేవాడు, ఎన్నటికీ అతనికి మరణం రాదు.

ఆ తర్వాత ఖురాన్ యొక్క ఆయత్ చదివి వినిపిస్తారు, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు.

وَمَا مُحَمَّدٌ اِلَّا رَسُوْلٌۚ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِ الرُّسُلُ ۗ اَفَا۟ىِٕنْ مَّاتَ اَوْ قُتِلَ انْقَلَبْتُمْ عَلٰٓى اَعْقَابِكُمْ ۗ وَمَنْ يَّنْقَلِبْ عَلٰى عَقِبَيْهِ فَلَنْ يَّضُرَّ اللّٰهَ شَيْـًٔا ۗوَسَيَجْزِى اللّٰهُ الشّٰكِرِيْنَ

(వమా ముహమ్మదున్ ఇల్లా రసూలున్ ఖద్ ఖలత్ మిన్ ఖబ్లిహిర్ రుసుల్, అఫఇమ్మాత అవ్ ఖుతిలన్ ఖలబ్తుమ్ అలా అ’అఖాబికుమ్, వమన్ యన్ఖలిబ్ అలా అఖిబైహి ఫలన్ యదుర్రల్లాహ షైఆ, వసయజ్ జిల్లహుష్ షాకిరీన్)
ముహమ్మద్ కేవలం ఒక ప్రవక్త మాత్రమే. ఆయనకు పూర్వం కూడా ఎందరో ప్రవక్తలు గడిచిపోయారు. ఒకవేళ ఆయన మరణించినా, లేదా చంపబడినా మీరు మీ మడమల మీద వెనుతిరిగి పోతారా ఏమిటి? అలా వెనుతిరిగి పోయినవాడు అల్లాహ్ కు ఎలాంటి నష్టాన్నీ కలిగించలేడు. కృతజ్ఞత చూపే వారికి అల్లాహ్ త్వరలోనే ఉత్తమ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. (3:144)

ఈ ఆయత్ వినగానే హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు అంటారు, నా కాళ్లు నా వశంలో లేవు, నేను కింద పడిపోయాను. అవును, నేను ఈ ఆయత్ ఖురాన్ లో చదివి ఉన్నాను కానీ బహుశా అప్పుడు నేను దీని యొక్క అర్ధాన్ని, దీని యొక్క భావాన్ని ఇంత గంభీరంగా తీసుకోలేదు అని అతను ఒప్పుకున్నారు. సహాబాలందరూ ఈ ఆయత్ అప్పుడే విన్నట్లుగా వారందరూ రోధిస్తూ ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారు అన్న విషయం వారు ధృవీకరించుకున్నారు. హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు యొక్క ఈ సమయస్ఫూర్తి, ఈ ధైర్యం, ఈ సాహసం, అల్లాహ్ యొక్క సహాయం ఆయనతో ఉండడం మూలంగా ముస్లిం ఉమ్మత్ అంతా ఐకమత్యంతో నిలబడగలిగింది.

ఆ తర్వాత ప్రవక్త తర్వాత మొదటి ఖలీఫాగా హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు నియమితులయ్యారు. నియమితులైన తర్వాత ఆయన ముందు ఎన్నో ఫిత్నాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. మక్కా, మదీనా మరియు తాయిఫ్ ఈ మూడు ప్రాంతాలు తప్ప దాదాపు అరేబియా ద్వీపకల్పంలో ఉన్నటువంటి అనేక తెగల వారు ఇస్లాం నుండి మళ్ళీ తిరిగి తమ పాత ధర్మం వైపునకు వెళ్ళిపోయారు. కొందరు జకాత్ ఇవ్వడానికి తిరస్కరించారు. మరికొందరు తమను తాము ప్రవక్తగా ప్రకటించుకున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, ముస్లింల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉన్నటువంటి సమయంలో హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోక ముందు ఉసామా బిన్ జైద్ యొక్క ఆధ్వర్యంలో ఏదైతే ఒక సైన్యాన్ని సిద్ధపరిచారో, ఆ సైన్యాన్ని పంపడానికే తీర్మానం తీసుకుంటారు. ఎందరో సహాబాలు అన్నారు, అబూబకర్, మదీనాలో మన సంఖ్య తక్కువగా ఉంది, ముస్లిం సైన్యాన్ని బయటికి పంపకండి, మనపై ఎవరైనా దాడి చేస్తారేమో. కానీ అబూబకర్ అన్నారు, లేదు, ప్రవక్త ఏదైతే తీర్మానం తీసుకున్నారో, దాన్ని నేను పూర్తి చేసి తీరుతాను. ఆ సైన్యాన్ని పంపారు. ఆ తర్వాత జకాత్ ఇవ్వని వారితో కూడా నేను యుద్ధం చేస్తాను అన్నారు. ప్రవక్తకు జకాత్ రూపంలో ఏది ఇచ్చేవారో, దానిలో ఒక చిన్న మేకపిల్లను కూడా ఎవరైనా ఇవ్వడానికి తిరస్కరిస్తే నేను అతనితో యుద్ధం చేస్తాను అన్నారు. అల్లాహు అక్బర్! ఎంతటి ధైర్యం. రెండు సంవత్సరాలు, కొన్ని నెలల కాలంలోనే హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు అల్లాహ్ యొక్క దయతో, అల్లాహ్ యొక్క సహాయంతో ఇస్లాంను మళ్ళీ తిరిగి అరేబియా ద్వీపకల్పంలో స్థాపించారు. ఎవరైతే ఇస్లాంను వీడి వెళ్లారో వారిని మళ్ళీ ఇస్లాం వైపునకు తీసుకువచ్చారు.

ఆ తర్వాత ఆయన చనిపోయారు. ఆయన చనిపోయాక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమాధి పక్కనే ఆయనకు కూడా చోటు లభించింది. సోదర సోదరీమణులారా, అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు, ఆయన జీవితం నుండి మనం గుణపాఠం నేర్చుకోవాలి. ప్రవక్తపై విశ్వాసం, అల్లాహ్ పై విశ్వాసం ఎలా ఉండాలి, ఇస్లాం ధర్మం కోసం ఎలాంటి త్యాగాలు చేయాలి, ఎలాంటి కష్ట నష్టాలకు ఓర్చుకోవాలి, ఎలాంటి సాహసంతో ఇస్లాం కొరకు మనం సేవ చేయాలి అన్నటువంటి విషయాలు ఆయన జీవితం నుండి నేర్చుకోవాలి. అల్లాహ్ మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల యొక్క జీవిత చరిత్రలను చదివి, విని, వారి యొక్క మార్గాన్ని అవలంబించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహుమ్మ సల్లీ వసల్లిమ్ అలా నబియ్యినా ముహమ్మద్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

భార్యతో మలమార్గం ద్వారా సంభోగించడం | ఇస్లామీయ నిషిద్ధతలు [వీడియో| టెక్స్ట్ ]

ఈ ప్రసంగంలో, భార్యతో మల మార్గం ద్వారా సంభోగించడం ఇస్లాంలో ఘోరమైన పాపమని, దీనికి పాల్పడే వారిపై అల్లాహ్ శాపం ఉంటుందని హదీసుల ఆధారంగా వివరించబడింది. కొందరు భర్తలు తమ కోరికలను తీర్చుకోవడానికి ఖుర్ఆన్ ఆయతులను తప్పుగా అన్వయించి, భార్యలను మోసం చేయడం లేదా బెదిరించడం వంటివి చేస్తున్నారని ప్రస్తావించబడింది. ఈ దుశ్చర్యలకు కారణం అజ్ఞానం, వివాహానికి ముందున్న చెడు అలవాట్లు, మరియు పాశ్చాత్య సంస్కృతి, నీలి చిత్రాల ప్రభావం అని పేర్కొనబడింది. ఇస్లాం పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, మలమూత్ర విసర్జన తర్వాత ఎడమ చేతితో శుభ్రపరుచుకోవాలని చెప్పిన ధర్మంలో, నోటితో మర్మాంగాలను తాకడం వంటివి ఎంతమాత్రం అనుమతించబడవని స్పష్టం చేయబడింది. వైవాహిక జీవితంలో ఇస్లామీయ హద్దులను పాటించి, పవిత్రంగా జీవించాలని, చెడు అలవాట్లను విడిచిపెట్టి పశ్చాత్తాపం చెందాలని ఉపదేశించబడింది.

కొందరు బలహీన విశ్వాసులు తమ భార్యలతో మల మార్గం ద్వారా సంభోగించడంలో వెనకాడరు. ఇది ఘోర పాపాల్లో పరిగణించబడుతుంది. ఇది ఘోర పాపాల్లో పరిగణించబడుతుందని బహుశా వారికి తెలియదేమో. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా శపించారో గుర్తుందా? అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీస్ వినండి:

مَلْعُونٌ مَنْ أَتَى امْرَأَتَهُ فِي دُبُرِهَا
(మల్’ఊనున్ మన్ అతా ఇమ్రఅతహూ ఫీ దుబురిహా)
తన భార్యతో మల మార్గం ద్వారా సంభోగించే వాడిపై శాపం కురియు గాక. (అబూ దావూద్ 2162 సహీహుల్ జామి 5865).

అల్లాహ్ అన్ని రకాల శాపనాల నుండి, శాపనాలకు గురి అయ్యే కార్యాల నుండి దూరం ఉంచు గాక.

అయితే సోదర మహాశయులారా, ఇంతకుముందే మనం ఒక హదీస్ చదివి ఉన్నాము, రుతుస్రావంలో కలిసే వారి గురించి. ఆ హదీస్ ఇక్కడ కూడా వస్తుంది. ఎందుకంటే అందులో కూడా వచ్చింది,

مَنْ أَتَى حَائِضًا أَوْ امْرَأَةً فِي دُبُرِهَا أَوْ كَاهِنًا فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ ﷺ

“రుతువుస్రావంలో ఉన్న భార్యతో సంభోగించువాడు, లేదా భార్యతో మల మార్గం ద్వారా సంభోగించువాడు మరియు జ్యోతిష్యుని వద్దకు వెళ్ళేవాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించినదానిని తిరస్కరించినవాడగును“. (తిర్మిజి 135, సహీహుల్ జామి 5918).

సోదర మహాశయులారా, స్వాభావిక గుణం గల ఎందరో భార్యలు ఈ పద్ధతిని తిరస్కరిస్తారు. కానీ కొందరు భర్తలే విడాకులిస్తానని బెదిరిస్తారు. మల మార్గం ద్వారా వారు తమ కోరికను పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. అయితే వారు గమనించాలి, వారు రెండు రకాల పాపాలు, రెండు రకాల ఘోరమైన స్థితులకు గురవుతున్నారు. ఒకటి, శాపం వారిపై పడుతుంది. రెండవది, కుఫ్ర్ లో పడిపోతున్నారు వారు.

ఇక మరికొందరు భర్తలు ఎలా ఉన్నారంటే నవూజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, ఖుర్ఆన్ ఆయత్ యొక్క భావం తప్పుగా చెప్తారు. అరే భర్త అయితే ఖుర్ఆన్ ఆయత్ చెప్తున్నాడు, తన తప్పుడు కోరికను పూర్తి చేసుకోవడానికి, మరి ఎవరైనా ఆలిమ్ ను అడుగుదామా, ఈ ఆయత్ యొక్క సరైన భావం ఏంటి అని అనుకుంటారు కొందరు స్త్రీలు. కానీ సిగ్గుపడి అడగలేరు. వారి గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది, శ్రద్ధ వహించండి. పండితులతో ప్రశ్నించి తెలుసుకోవడానికి సిగ్గుపడే తమ భార్యలను కొందరు భర్తలు మోసం చేసి మల మార్గం ద్వారా వారి కోరికను పూర్తి చేసుకునే విధానం యోగ్యమని ఖుర్ఆన్ యొక్క ఈ ఆయత్ చూపుతారు. ఏంటి ఆ ఆయత్?

[نِسَاؤُكُمْ حَرْثٌ لَكُمْ فَأْتُوا حَرْثَكُمْ أَنَّى شِئْتُمْ]
(నిసాఉకుమ్ హర్సుల్లకుమ్ ఫ’తూ హర్సకుమ్ అన్నా షి’తుమ్)
మీ భార్యలు మీకు పంటపొలాల (వంటివారు), కావున మీ పొలాలకు మీరు కోరిన విధంగా పోవచ్చు. (బఖర 2: 223).

మీరు కోరిన విధంగా మీ యొక్క భార్యలతో మీరు ఉండండి అన్నటువంటి విషయం దీన్ని ప్రస్తావించి, తమ ఆ నిషిద్ధ కార్యం చేయడానికి ఈ ఆయత్ ను దలీల్ గా తీసుకుంటారు. కానీ వారికి తెలిసి ఉండాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులు ఖుర్ఆన్ ఆయతుల భావాన్ని విశదీకరిస్తాయి. అయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో చెప్పారు, భర్త తన భార్యతో సంభోగించడానికి ఆమె ముందు నుండి, ఆమె వెనుక నుండి ఎలా వచ్చినా సరే, కానీ సంతానం కలిగే దారి నుండే సంభోగించాలి.

అయితే మలము వచ్చే దారి నుండి సంతానం కలగదు అన్న విషయం అందరికీ తెలిసినదే. ఇంతటి ఘోర పాపానికి ఒడిగట్టే కారణాలు ఏమిటో తెలుసా? పవిత్ర దాంపత్య జీవితంలో కాలు మోపే ముందు అజ్ఞానపు దుశ్చేష్టలకు పాల్పడి ఉండడం. నిషిద్ధమైన, భిన్నమైన, అసాధారణ పద్ధతులకు వారు అలవాటు పడి ఉండడం. లేదా నీలి చిత్రాల్లోని, కొందరికి బ్లూ ఫిలిమ్స్ చూసేటటువంటి అలవాటు, ఇక పెళ్ళైన తర్వాత కూడా ఆ రోజుల్లో లేక ఆ సమయంలో కూడా చూస్తూ ఉండేటటువంటి కొన్ని సంఘటనలు వారి జ్ఞాపక శక్తిలో నాటుకుపోయాయో వాటిని వారు వదులుకోలేకపోతారు.

అయితే ఇలాంటి వారందరూ కూడా తమ దుశ్చేష్టలను మానుకోవాలి, చెడ్డ అలవాటులను వదులుకోవాలి. అల్లాహ్ తో స్వచ్ఛమైన తౌబా చేయాలి. వారు చేయరు గనక ఇంకింత అలాంటి పాపాల్లోనే కూరుకుపోతూ ఉంటారు.

మరొక ముఖ్య విషయం గమనించండి, భార్య భర్తలిద్దరూ ఏకమై, ఇష్టపడి ఈ దుష్కార్యం చేసుకున్నా అది నిషిద్ధమే అవుతుంది. ఏదైనా నిషిద్ధ కార్యం ఇష్టపడి చేసినంత మాత్రాన ధర్మసమ్మతం కాజాలదు.

సోదర మహాశయులారా, ఇక్కడి వరకు ఈనాటి పాఠాలు పూర్తిగా అయిపోయాయి. కానీ చివరిలో లేక ఈ రోజులో చదివినటువంటి పాఠాల్లో భార్య భర్తల విషయం గురించి ఎన్నో అంశాలు వచ్చినాయి గనక మరొక విషయం చాలా ముఖ్యమైనది మిగిలిపోతుంది. దాన్ని సంక్షిప్తంగా చెప్పేసి నేను నా పాఠాన్ని ముగించేస్తాను.

చివరి పాఠంలో మీరు ఒక విషయం విన్నారు కదా, కొందరు భర్తలు భార్యలకు మోసం చేసి ఖుర్ఆన్ ఆయతులతో తప్పుడు భావం చెప్పే ప్రయత్నం చేస్తారు. విన్నారు కదా? అలాగే మరికొందరు భర్తలు ఖుర్ఆన్ లోని మరొక ఆయత్:

هُنَّ لِبَاسٌ لَّكُمْ وَأَنتُمْ لِبَاسٌ لَّهُنَّ
(హున్న లిబాసుల్లకుమ్ వ అన్తుమ్ లిబాసుల్లహున్న)
వారు (భార్యలు) మీ కొరకు వస్త్రధారణ, మీరు వారి కొరకు వస్త్రధారణ. (2:187)

భార్యలు భర్తల కొరకు, భర్తలు భార్యల కొరకు వారి యొక్క వస్త్రధారణ, అని ఏదైతే ఆయత్ ఉందో, దీని ద్వారా భార్యలకు మోసం చేసి మరిన్ని చెడు అలవాట్లకు పాల్పడతారు. దుష్కార్యాలకు పాల్పడతారు. అదేంటి? కొందరు భర్తలు భార్యలకు బలవంతం చేస్తారు వారి మర్మాంగాన్ని తమ నోట్లో తీసుకోవాలని.

ఎందరో పురుషులు పరస్పరం కలుసుకొని, ప్రత్యేకంగా కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి యువకులు తమ యొక్క ఫ్రెండ్స్ తో తమ యొక్క భార్యల గురించి ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ ఉంటారు. కొందరు పురుషులు కూడా వచ్చి ఇలాంటి ప్రశ్నలు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి.

భార్య భర్తలిద్దరూ కూడా ఒకరు మరొకరి మర్మాంగాన్ని నోట్లో తీసుకోవడం, ఇంకా వేరే ఇలాంటి ఏ పనులైనా గానీ, ఇవన్నీ కూడా తప్పుడు అలవాటులు. వాస్తవానికి ఈ కల్చర్ చాలా చెండాలమైనది. ఇస్లామీయ సంస్కృతి, కల్చర్ ఎంతమాత్రం కాదు. వెస్ట్రన్ కల్చర్ ఇది. వాస్తవంగా ఈ సమస్య సుమారు ఈనాటికి 20 సంవత్సరాల క్రితమే కొందరు చాలా అరుదుగా అడిగారు. అప్పుడే నేను ఆనాటి, అంటే 20 సంవత్సరాల క్రితమే అప్పుడు చాలా పెద్ద వయసులో ఉన్న కొందరు ఉలమాలను అడిగితే, వారు ఆశ్చర్యపడ్డారు. ఇలాంటి వాటికి కూడా పాల్పడతారా? వాస్తవానికి ఇది వెస్ట్రన్ నుండి వచ్చినదే. ఈ బ్లూ ఫిలిమ్ లు, ఇంకా వెస్ట్రన్ యొక్క నగ్న చిత్రాలు, ఫిలిమ్ లు అన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రబలిపోతున్నాయి.

ఇందులో ఉన్నటువంటి చెడులను నేను సైంటిఫిక్ పరంగా తెలపడం లేదు. మీ బుద్ధి జ్ఞానాలకు అర్థమయ్యే రీతిలో, సులభమైన రీతిలో కొన్ని విషయాలు చెప్తున్నాను, గమనించండి. ఏ పవిత్రమైన, పరిశుభ్రమైన ఇస్లాం ధర్మం, ఎడమ చేతితోనే ఇస్తింజా చేయాలి, మలమూత్ర విసర్జన తర్వాత శుభ్రత అనేది కేవలం ఎడమ చెయ్యితో చేయాలి, కుడి చెయ్యిని కూడా తాకనివ్వకూడదు అని చెప్పిందో, అలాంటి ధర్మం నోట్లో తీసుకోవడానికి, నాకడానికి, ఆ ఇలాంటి ఇంకా చెడు వాటికి అనుమతి ఇస్తుందా? గమనించండి.

భార్య భర్తలు ఇద్దరు, వారి మధ్యలో ఏ పరదా లేదు అంటే ఇక వేరే ఏ హద్దులూ లేవు, ఎలా ఇష్టం ఉంటే అలా, ఇలాంటి భావం తీసుకోవడం చాలా తప్పు. అందుకొరకే ఇస్లాం ధర్మం గురించి తెలుసుకునే ప్రయత్నం ఇంకా చేస్తూ ఉండాలి కానీ, ఎక్కడో ఒక ఆయత్, ఎక్కడో ఒక హదీస్ తీసుకొని, విని, తన ఇష్ట ప్రకారంగా దాన్ని ధర్మపరంగా అనుమతించినదే అని భావిస్తూ చేయడం ఇది మరీ చాలా ఘోరమైన పొరపాటు, ఘోరమైన తప్పు.

ఇక ఇలాంటి ఈ దుశ్చేష్టల వల్ల, నోట్లో తీసుకునే అటువంటి బలవంతాలు చేయడం ద్వారా ఏ ఏ రోగాలకు గురి అవుతున్నారో, వాటి గురించి నేను ఆ వివరణలోకి వెళ్ళను. ధర్మవేత్తలు కొందరు, డాక్టర్ల యొక్క సలహాలతో అవన్నీ వివరాలు కూడా తెలిపారు. సంక్షిప్తంగా చెప్పేది ఏంటంటే, వీటన్నిటికీ దూరంగా ఉండండి, ధర్మంగా జీవించే ప్రయత్నం చేయండి. ఇస్లాం ధర్మం, ఇది ఎవరో కొందరు థింక్ ట్యాంకర్స్ లేదా పరిశోధన చేసిన ప్రయత్నాలు కావు. మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్, మనందరి కొరకు కారుణ్యమూర్తిగా చేసి పంపిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా పంపినటువంటి సత్య ధర్మం. ప్రళయం వరకు వచ్చే అన్ని సమస్యలకు ఉత్తమ మంచి పరిష్కారం ఉంది. చివరికి వైవాహిక జీవితంలో, సామాజిక జీవితంలో, భార్య భర్తల జీవితంలో కూడా, ఇందులో ఏ నిషిద్ధతలు ఉన్నాయో, ఏ చెడులు ఉన్నాయో వాటికి దూరంగా ఉండడంలోనే మన జీవితాలు పరిశుభ్రంగా ఉంటాయి.

అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక. అన్ని రకాల చెడుల నుండి దూరం ఉంచు గాక. ఆమీన్. వా ఆఖిరు ద’వాన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=7377

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

మరణం మరియు సమాధి శిక్షల వివరాలు, సందేహ సమాధానాలు [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణం మరియు సమాధి శిక్షల వివరాలు, సందేహ సమాధానాలు
https://www.youtube.com/watch?v=_HrW7uu-pc4 [14 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం మరణం మరియు సమాధి జీవితం (బర్ జఖ్) గురించిన వివిధ ప్రశ్నలకు సమాధానమిస్తుంది. మరణ దూత (మలకుల్ మౌత్) అందరికీ ఒకరేనని, వేర్వేరు మతాల వారికి వేర్వేరు దూతలు ఉండరని స్పష్టం చేస్తుంది. విశ్వాసులు మరియు అవిశ్వాసుల మరణ అనుభవాలలో తేడా ఉంటుందని సహీ హదీసుల ఆధారంగా వివరిస్తుంది. విశ్వాసి ఆత్మ శాంతియుతంగా తీయబడి, స్వర్గపు సువాసనలతో స్వీకరించబడి, ఆకాశాలలో గౌరవించబడుతుంది. దీనికి విరుద్ధంగా, అవిశ్వాసి ఆత్మ కఠినంగా తీయబడి, నరకపు దుర్వాసనలతో అవమానించబడుతుంది. సమాధిలో పెట్టడం అనేది సాధారణ పద్ధతి అయినప్పటికీ, దహనం చేయబడిన లేదా ఏ విధంగానైనా శరీరం నాశనమైనప్పటికీ, ఆత్మకు శిక్ష లేదా బహుమానం తప్పదని ఖురాన్ మరియు హదీసుల ద్వారా వివరిస్తుంది. ఈ మధ్య కాలాన్ని “బర్ జఖ్” అని అంటారు. చివరగా, సమాధిలో జరిగే ముగ్గురు దేవదూతల ప్రశ్నలు (నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? నీ ప్రవక్త ఎవరు?) మరియు వాటికి విశ్వాసులు, అవిశ్వాసులు ఇచ్చే సమాధానాలను చర్చిస్తుంది.

أَسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ
(అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బ’అద్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు. మరియు ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారి కుటుంబ సభ్యులు మరియు సహచరులందరిపై శాంతి మరియు శుభాలు కురియుగాక. ఇక ఆ తర్వాత.

చావు మరియు సమాధి శిక్షణ గురించి ఒక ప్రశ్న వచ్చింది. వాస్తవానికి ఆ ప్రశ్నలో ఎన్నో ఇంకా లింక్ ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానంగా ఈ ఆడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. శ్రద్ధగా వింటారని, విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.

మొదటి విషయం ఏమిటంటే, సామాన్యంగా చావు దూత అని, మలకుల్ మౌత్ అని, మౌత్ కా ఫరిష్తా అని, లేదా యమదూత అని ఏదైతే అంటారో, హిందువులకు వేరు, ముస్లింలకు వేరు, క్రైస్తవులకు వేరు, వేరే ఇంకా మతాలు అవలంబించే వారికి వేరు, అలాగా ఏమీ లేరు. ఇలాంటి భ్రమలో నుండి మనం బయటికి రావాలి. వాస్తవానికి, ప్రాణం తీసే దూత మరియు ఆయనకు తోడుగా వచ్చే అటువంటి దూతలు, ఆ తోడుగా వచ్చే దూతల యొక్క సంఖ్య అల్లాహ్ కు మాత్రమే తెలుసు. అయితే, ఇక్కడ మనకు ఖురాన్ హదీస్ ద్వారా తెలుస్తున్న విషయం ఏంటంటే, విశ్వాసులు, పుణ్యాత్ములు వీరికి వీరి యొక్క ప్రాణం ఒక రకంగా తీయడం జరుగుతుంది మరియు ఎవరైతే అవిశ్వాసులు లేదా విశ్వాసులుగా ఉండి కలిమా చదివి కూడా మహా పాపాత్ములు ఉంటారో వారి యొక్క ప్రాణం మరో రకంగా తీయడం జరుగుతుంది అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఖురాన్ యొక్క ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఏదైనా వేరే సందర్భంలో ఆ ఆయతులు, ఆ వాటి యొక్క అర్థం భావం అనేది ఇన్ షా అల్లాహ్ రికార్డ్ చేసి పంపుదాము. కానీ సంక్షిప్తంగా ప్రస్తుతం ఏంటంటే, సహీ హదీస్లో వచ్చిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు.

విశ్వాసుడు, పుణ్యాత్ముడు అతని ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు, ప్రాణం తీసే దూత, ఆయన కూడా దైవదూతనే, ప్రాణం తీసే దూత వస్తాడు మరియు స్వర్గం నుండి కరుణ దూతలు కూడా హాజరవుతారు. స్వర్గం నుండి వారు సువాసనతో కూడి ఉన్నటువంటి వస్త్రాలు తీసుకొని వస్తారు. ఆ తర్వాత అతని దగ్గర కూర్చుండి, ప్రభువు యొక్క కారుణ్యం వైపునకు, అల్లాహ్ యొక్క సంతృష్టి వైపునకు వచ్చేసెయ్ ఓ పవిత్ర ఆత్మా, ఈ రోజు నీపై నీ ప్రభువు ఏమీ కోపగించుకోకుండా నీ పట్ల సంతృప్తి కలిగి ఉన్నాడు అన్నటువంటి శుభవార్తలు వినిపిస్తూ ఉంటారు. దీని సంక్షిప్త విషయం ఖురాన్ సూరే హామీమ్ అస్సజ్దాలో కూడా వచ్చి ఉంది.

وَأَبْشِرُوا بِالْجَنَّةِ الَّتِي كُنتُمْ تُوعَدُونَ
(వ అబ్షిరూ బిల్ జన్నతిల్లతీ కున్తుం తూ’అదూన్)
“మీకు వాగ్దానం చేయబడిన స్వర్గం ఇదేనని సంతోషించండి.” (41:30)

ఇక ప్రాణం తీసే దూత ఎంతో సునాయాసంగా, నిదానంగా మంచి విధంగా అతని యొక్క ప్రాణం తీస్తాడు. ఆ మనిషి యొక్క ఆత్మ కూడా మంచి విధంగా ఆ ప్రాణం తీసే దూత యొక్క చేతుల్లోకి వచ్చేస్తుంది. దానికి కూడా హదీసుల్లో కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ దైవదూతలు వెంటనే ఆ సువాసనలతో కూడి ఉన్నటువంటి స్వర్గపు వస్త్రాలలో ఆ ఆత్మను చుట్టుకొని ఆకాశం పైకి వెళ్తారు. మొదటి ఆకాశం ద్వారాలు మూయబడి ఉంటాయి. అయితే అక్కడ తీసుకుపోయే దూతలు పర్మిషన్ కోరుతారు. ఆకాశపు యొక్క ఆ దూతలు అడుగుతారు, ఈ మంచి ఆత్మ ఎవరిది మీరు తీసుకొని వస్తున్నారు? అయితే అతని యొక్క మంచి పేరు, మంచి గుణాలు ఈ దైవదూతలు తెలియజేస్తారు. ఆకాశపు ద్వారాలు తెరవబడతాయి. ఆ మొదటి ఆకాశపు దైవదూతలు ఘనంగా ఇతన్ని స్వాగతిస్తూ ఆ దూతలతో కలిసి ఇంకా పైకి వెళ్తారు. ఈ విధంగా రెండో ఆకాశం పైకి చేరుతారు. అలాగే అక్కడ కూడా స్వాగతం జరుగుతుంది, ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. చివరికి ప్రతి ఆకాశంలో కూడా అలాగే జరుగుతుంది. ఏడో ఆకాశం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అలాగే జరుగుతుంది. అప్పుడు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆదేశం వస్తుంది. నా యొక్క ఈ దాసుని యొక్క ఆ నామము عِلِّيِّينَ (ఇల్లియీన్) ఉన్నతమైన స్థానం లో రాయండి. మరో ఉల్లేఖన ప్రకారం, ఇతని యొక్క ఆత్మ అనేది ఏదైతే ఉందో, దీని ఇతడు స్వర్గపు యొక్క రుచులు, స్వర్గపు యొక్క మంచి అనుభవాలు పొందుతూ ఉంటాడు. కానీ, మళ్ళీ అతన్ని ప్రశ్నించడానికి తిరిగి ఆ మనిషిని ఏదైతే సమాధిలో ఖననం చేయడం జరుగుతుందో, ఆ అతని శరీరంలో పంపడం జరుగుతుంది. ఇది విశ్వాసుడు, పుణ్యాత్ముని యొక్క ఆత్మ ఏదైతే తీయడం జరుగుతుందో దాని యొక్క సంక్షిప్త విషయం.

ఇక మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కాఫిర్ (అవిశ్వాసుడు), ఫాసిఖ్ వ ఫాజిర్ (పాపాత్ములు) వారి యొక్క ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు ప్రాణం తీసే దూత వస్తాడు మరియు నరకం నుండి శిక్ష దూతలు దుర్వాసనతో కూడి ఉన్న చెడ్డ వస్త్రాలను తీసుకొని వస్తారు. ప్రాణం తీసే దూత ఓ చెడు ఆత్మా, వచ్చేసెయ్ అల్లాహ్ యొక్క కోపం, ఆగ్రహం వైపునకు అని అంటారు. అతని యొక్క ఆత్మ శరీరంలో తిరుగుతుంది. ఆ ప్రాణం తీసే దైవదూత చేతిలోకి రావడానికి రెడీగా ఉండదు. కానీ బలవంతంగా తీయడం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే ఆ దూతలు ఆ వస్త్రాల్లో చుట్టుకొని పైకి వెళ్తారు. కానీ ఆకాశపు ద్వారాలు తెరవబడవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ లోని ఈ ఆయత్ కూడా చదివారు:

لَا تُفَتَّحُ لَهُمْ أَبْوَابُ السَّمَاءِ
(లా తుఫత్తహు లహుమ్ అబ్వాబుస్ సమా’)
వారి కొరకు ఆకాశ ద్వారాలు తెరవబడవు. (7:40)

మళ్ళీ అక్కడి నుండే అతని యొక్క ఆత్మను క్రిందికి విసిరివేయడం జరుగుతుంది. మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరే హజ్ లోని ఆయత్ చదివారు:

وَمَن يُشْرِكْ بِاللَّهِ فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ فَتَخْطَفُهُ الطَّيْرُ أَوْ تَهْوِي بِهِ الرِّيحُ فِي مَكَانٍ سَحِيقٍ
(వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫక అన్నమా ఖర్ర మినస్ సమా’ఇ ఫతఖ్తఫుహుత్ తైరు అవ్ తహ్వీ బిహిర్ రీహు ఫీ మకానిన్ సహీఖ్)
అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించేవాడు ఆకాశం నుండి క్రింద పడిపోయిన వాని వంటివాడు. పక్షులు అతన్ని తన్నుకుపోతాయి, లేదా గాలి అతన్ని దూరప్రాంతానికి విసిరివేస్తుంది. (22:31)

అంటే అల్లాహ్ తో పాటు షిర్క్ చేసేవారు, ఇలా పాపాలలో తమ జీవితం పూర్తిగా గడిపేవారు, పాపాలలో విలీనమైన వారు, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వారి యొక్క ఉపమానం ఎలా తెలుపుతున్నాడంటే,

فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ
(ఫక అన్నమా ఖర్ర మినస్ సమా)
ఆకాశం నుండి పడిపోయిన వాని వలె.
ఆకాశం నుండి పడిపోయిన వారు, ఇక అతనిని పక్షులు తమ యొక్క చుంచులతో వేటాడుతాయి, లాక్కుంటాయి, లేదా గాలి అనేది అటు ఇటు ఎక్కడైనా విసిరి పారేస్తుంది. అక్కడి నుండి పారేయడం జరుగుతుంది. అయితే ఏడు భూముల కింద سِجِّين (సిజ్జీన్) ఖైదీల చిట్టా అనే ఏదైతే దఫ్తర్ (రిజిస్టర్), ప్రాంతం ఏదైతే ఉందో అందులో అతని నామం రాయడం జరుగుతుంది. ఇక అతన్ని, ఆ శరీరం, భౌతికాయాన్ని అతని బంధువులు ఖననం చేశారంటే, అక్కడ ప్రశ్నోత్తరాల గురించి అందులో పంపడం జరుగుతుంది.

ఇక ఆ తర్వాత, సమాధిలో ఏదైతే పెట్టడం జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుంది సంక్షిప్తంగా వినండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరంగా ఆ విషయాలు తెలిపారు. కానీ ఆ విషయాల యొక్క వివరణలో వెళ్ళేకి ముందు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోండి. అదేమిటంటే, సామాన్యంగా సమాధి యొక్క శిక్ష లేదా సమాధి యొక్క వరాలు అని ఏదైతే అనడం జరుగుతుందో, ఇక్కడ ఇలా ఎందుకు అనడం జరుగుతుంది అంటే, వాస్తవానికి మానవ చరిత్రలో మానవునికి ఇవ్వబడిన ఆదేశ ప్రకారం అతన్ని సమాధిలో పెట్టడమే. ఇక ఎవరైతే సమాధిలో పెట్టకుండా వేరే పద్ధతులు అవలంబిస్తున్నారో, వారు స్వభావానికి, ప్రకృతికి విరుద్ధమైన పని చేస్తున్నారు. ఇదొక మాట అయితే, రెండో మాట ఏమిటంటే, అధిక శాతం చనిపోయే వారిని సమాధిలో పెట్టడం జరుగుతుంది. అందుకొరకే ఈ పదాలు ఉపయోగించబడ్డాయి.

కానీ ఇక ఎవరైనా, ఎవరిదైనా కాల్చివేయడం జరిగితే, లేదా ఎవరైనా అగ్నికి ఆహుతి అయి పూర్తిగా బూడిదైపోతే, లేదా ఏదైనా మృగ జంతువు యొక్క ఆహారంగా మారిపోతే, ఇంకా సంక్షిప్తంగా చెప్పాలంటే, మనిషిని బొందలో పెట్టకుండా, సమాధిలో పెట్టకుండా ఏ విధంగా ఏది జరిగినా గానీ, ఈ శరీరం ఏదైతే ఉందో, భౌతికాయం అని ఏదైతే అంటామో అది నాశనమైపోతుంది. కానీ ఆత్మ అయితే ఉంటుంది. అల్లాహ్ త’ఆలా తలుచుకుంటే ఆత్మకైనా శిక్ష ఇవ్వవచ్చు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలై దీనికి సంబంధించిన ఎన్నో వివరాలు తెలిపి ఉన్నారు. అల్లాహ్ తలుచుకుంటే ఆ కుళ్ళిపోయిన, కాలిపోయిన, ఆహారంగా మారిపోయిన ఆ శరీరాన్ని మరోసారి ఉనికిలోకి తీసుకురావచ్చు. లేదా అల్లాహ్ త’ఆలా తలుచుకుంటే కొత్త శరీరం ప్రసాదించవచ్చు. అల్లాహ్ తలుచుకుంటే, సమాధి యొక్క శిక్షలు మరియు వరాలు ఏవైతే ఉన్నాయో, శిక్షలు అంటే అవిశ్వాసులకు పాపాత్ములకు, వరాలు అంటే, అనుగ్రహాలు అంటే విశ్వాసులకు మరియు పుణ్యాత్ములకు, ఈ సమాధి శిక్షలు లేదా అనుగ్రహాలు, వరాలు ఇవి ప్రతి ఒక్కరికీ జరిగి ఉంటాయి.

وَمِن وَرَائِهِم بَرْزَخٌ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
(వ మిన్ వరా’ఇహిమ్ బర్ జ ఖున్ ఇలా యౌమి యుబ్ ‘అసూన్)
వారి వెనుక పునరుత్థాన దినం వరకు ఒక అడ్డుతెర (బర్ జఖ్) ఉంటుంది. (23:100)

దీన్నే కొందరు మధ్య కాలం, ఇటు ఇహలోకం అటు పరలోకం, దాని మధ్య లోకం ఇది. మధ్య లోకంలో ఇవి తప్పకుండా జరిగి ఉంటాయి. తప్పకుండా జరిగి ఉంటాయి. ఈ విశ్వాసం మనం తప్పకుండా మనసులో నిశ్చయించాలి. ఈ విషయాలను నమ్మాలి.

ఇక సమాధిలో… సమాధి అంటే ఇక్కడ గుర్తు ఉంది కదా, ఒకవేళ ఎవరినైనా సమాధిలో పెట్టడం జరగకపోయినా గానీ వారిని ప్రశ్నించడం జరుగుతుంది. వచ్చి దైవదూత అడుగుతాడు, నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? మరియు నీ ప్రవక్త ఎవరు? అప్పుడు విశ్వాసుడు అయితే, నా ప్రభువు అల్లాహ్, నా యొక్క ధర్మం ఇస్లాం మరియు నా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని సమాధానం ఇస్తాడు. తర్వాత నాలుగో ప్రశ్న అడగడం జరుగుతుంది, ఈ విషయాలు నీవు ఎలా తెలుసుకున్నావు అని? అతడు చెబుతాడు, నేను ఖురాన్ ను చదివాను, ధర్మం నేర్చుకున్నాను అని.

ఇక ఎవరైతే అవిశ్వాసి లేదా పాపాత్ముడై ఉంటాడో, మహా ఘోరమైన పాపాత్ముడు, అలాంటి వారు ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వరు. అయ్యో, మాకు తెలియదు, ప్రజలు అన్నట్లుగా మేమన్నాము అని అంటారు. నువ్వు ఎందుకు తెలుసుకోలేదు, ఎందుకు చదువుకోలేదు, ఎందుకు చదువుకున్న వారిని అనుసరించి ఖురాన్ పారాయణం చేయలేదు అని చెప్పుకుంటూ వారిని కొట్టడం, శిక్షించడం జరుగుతుంది.

ఇక సమాధిలో, ఈ మధ్య లోకంలో జరిగే అటువంటి మరికొన్ని వివరాలు కూడా ఉన్నాయి. కానీ సమయం ఇప్పటికే ఎక్కువైనందుకు నేను ఇంతటితో ముగిస్తున్నాను. కానీ మీ యొక్క ప్రశ్నకు సమాధానం లభించింది అని ఆశిస్తున్నాను. సంక్షిప్తంగా మీ ప్రశ్న ఏముండే? ఎవరి చావు ఎట్లా వస్తుంది? హిందువులకు వేరే రకంగా యమదూత వస్తాడా, ప్రాణం తీసే దూత వస్తాడా? ఇంకా ముస్లింలకు వేరే దూతనా? మనలాంటి, మనకు జరిగే విధంగానే వారికి జరుగుతాయా? మరి వారినైతే సమాధిలో పెట్టడం జరగదు కదా, కాల్చేస్తారు కదా, మరి వారికి ఎలా జరుగుతుంది? ఇలాంటి ప్రశ్నలు ఏవైతే వచ్చాయో వాటన్నిటినీ కలుపుకొని ఈ సంక్షిప్త విషయం తెలపడం జరిగింది.

చనిపోయిన తర్వాత నుండి మొదలుకొని, మళ్ళీ అల్లాహ్ యొక్క మైదానే మహ్షర్ లో నిలబడే వరకు ఏ ఏ సంఘటనలు జరుగుతాయని ఖురాన్ మరియు సహీ హదీసులలో తెలపబడ్డాయో, వాటన్నిటినీ మనం విశ్వసించి ఆ ప్రకారంగా మన విశ్వాసాన్ని బలపరుచుకొని ఉంచేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా ఆఖరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు.

أَسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక

అజాన్ తర్వాత చేసే రెండు దుఆల ఘనత [వీడియో & టెక్స్ట్]

అజాన్ తర్వాత చేసే రెండు దుఆల ఘనత (فضل الذكر بعد الآذان)
https://www.youtube.com/watch?v=IUyKck4lvfI [ 2 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

అజాన్ తర్వాత చెదివే ఈ రెండు దుఆల ఘనత చాలా గొప్పగా ఉంది
ప్రతి అజాన్ తర్వాత చదవండి, అనేకానేక పుణ్యాలు, లాభాలు పొందండి

ఈ వీడియో లో చెప్పబడిన దుఆలు ఇక్కడ నేర్చుకోవచ్చు: అజాన్ తర్వాత చేయు దుఆలు 

ఈ ప్రసంగంలో అజాన్ తర్వాత పఠించవలసిన రెండు ముఖ్యమైన దువాల గురించి వివరించబడింది. మొదటి దువా సహీహ్ ముస్లిం నుండి ఉల్లేఖించబడింది, దీనిని పఠించడం ద్వారా గత పాపాలు క్షమించబడతాయి. రెండవ దువా సహీహ్ బుఖారీ నుండి తీసుకోబడింది, దీనిని పఠించిన వారికి ప్రళయ దినాన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సిఫారసు లభిస్తుంది. ఈ రెండు దువాల యొక్క ప్రాముఖ్యత మరియు వాటి ద్వారా లభించే గొప్ప ప్రయోజనాలను వక్త నొక్కి చెప్పారు.

మహాశయులారా, ఇప్పుడు మనం అజాన్ తర్వాత రెండు రకాల దువాలు మనకు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పారు. ప్రతీ ఒక్క దువాలో మన గురించి ఎంతో గొప్ప లాభం ఉంది.

మొదటి హదీస్ సహీహ్ ముస్లిం లోనిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ఎవరైతే అజాన్ విన్న తర్వాత, అజాన్ కు సమాధానం చెబుతూ అజాన్ పూర్తిగా విన్న తర్వాత

أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ، وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، رَضِيتُ بِاللهِ رَبًّا، وَبِمُحَمَّدٍ رَسُولًا، وَبِالْإِسْلَامِ دِينًا

(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వహ్ దహూ లా షరీక లహూ, వ అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, రదీతు బిల్లాహి రబ్బన్, వబి ముహమ్మదిన్ రసూలన్, వబిల్ ఇస్లామి దీనా)

“అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్య దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఏకైక దేవుడు, ఆయనకు భాగస్వాములు లేరు మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. నేను అల్లాహ్ ను ప్రభువుగా, ముహమ్మద్ ను ప్రవక్తగా మరియు ఇస్లాంను నా ధర్మంగా స్వీకరించాను.”

అని చదువుతారో,

غُفِرَ لَهُ ذَنْبُهُ
(గుఫిర లహూ దన్బుహూ)

వారి యొక్క పాపాలు క్షమించబడతాయి, మన్నించబడతాయి అని శుభవార్త ఇవ్వడం జరిగింది.

ఇది ఒక దువా. మరోసారి విని మీరు దీన్ని జ్ఞాపకం ఉంచుకునే ప్రయత్నం చేయండి. సామాన్యంగా మనం దీనిలో సగ భాగం అంతకంటే ఎక్కువగా నేర్చుకునే ఉంటాము ఇంతకుముందు.

ఇక రెండవ దువా, సహీహ్ బుఖారీలోని పదాలు ఈ విధంగా ఉన్నాయి. జాబిర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే అజాన్ విన్న తర్వాత ఈ దువా చదువుతారో, ప్రళయ దినాన వారికి నా సిఫారసు తప్పకుండా లభిస్తుంది. అల్లాహు అక్బర్! ఎంత గొప్ప అదృష్టమో గమనించండి. ప్రళయ దినాన ప్రవక్తలు సిఫారసు చేయాలి అని మనం తహతహలాడుతూ ఉంటాము. ఆ రోజు మనకు ఈ సిఫారసు పొందడానికి ఈ రోజు ఐదు పూటల నమాజులు చేయాలి. అజాన్ విన్నప్పుడు, అజాన్ అయిన తర్వాత దువా మనం చదవాలి.

اللَّهُمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ، وَالصَّلَاةِ الْقَائِمَةِ، آتِ مُحَمَّدًا الْوَسِيلَةَ وَالْفَضِيلَةَ، وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي وَعَدْتَهُ

(అల్లాహుమ్మ రబ్బ హాదిహి ద్దావతి త్తామ్మ, వస్సలాతిల్ ఖాయిమ, ఆతి ముహమ్మదన్ అల్ వసీలత వల్ ఫదీల, వబ్ అత్ హు మఖామమ్ మహ్మూదన్ అల్లదీ వ అత్తహ్)

“ఓ అల్లాహ్! ఈ సంపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడిన నమాజుకు ప్రభువా! ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మధ్యవర్తిత్వం మరియు శ్రేష్టతను ప్రసాదించు. మరియు నీవు వాగ్దానం చేసిన ప్రశంసనీయమైన ఉన్నత స్థానానికి ఆయనను చేర్చు.”

అల్లాహ్ త’ఆలా ఈ దువాలను ప్రతీ అజాన్ తర్వాత చదువుతూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక. వీటి యొక్క బరకత్ లో, శుభంలో అల్లాహ్ మన పాపాలను మన్నించి ప్రళయ దినాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు మనకు ప్రాప్తి చేయుగాక.

ఈ పోస్ట్ లింక్: https://teluguislam.net/?p=5568

పురుషులు బంగారం వేసుకొనుట | ఇస్లామీయ నిషిద్ధతలు [వీడియో | టెక్స్ట్]

పురుషులు బంగారం వేసుకొనుట (ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు)
https://youtu.be/7NYeGuNGHnk (6 నిముషాలు)
 ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో పురుషులు బంగారం ధరించడం పూర్తిగా నిషిద్ధం (హరామ్) అని స్పష్టంగా వివరించబడింది. బంగారం ఏ రూపంలో ఉన్నా – ఉంగరం, గొలుసు, బ్రాస్‌లెట్ వంటివి – పురుషులు వాడకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల ప్రకారం, బంగారం మరియు పట్టు స్త్రీలకు ధర్మసమ్మతం కానీ పురుషులకు నిషిద్ధం. ఒక సహాబీ చేతిలో బంగారు ఉంగరం చూసినప్పుడు ప్రవక్త దానిని తీసి పారేసి, అది నరక జ్వాల వంటిదని హెచ్చరించిన సంఘటన వివరించబడింది. ఆ సహాబీ, ప్రవక్త పారేసిన దానిని తిరిగి తీసుకోకపోవడం, ప్రవక్త పట్ల వారికున్న గౌరవం మరియు అనుసరణకు నిదర్శనం. ఆధునిక కాలంలో గడియారాలు, బటన్లు, పెన్నులు వంటి వస్తువులలో కూడా బంగారం వాడకంపై హెచ్చరిక చేయబడింది. చెడును శక్తి ఉన్నప్పుడు చేతితో ఆపాలని, నిషిద్ధమని తెలిసిన వెంటనే దానిని వదిలివేయాలని ఈ ప్రసంగం బోధిస్తుంది.

బంగారం ఏ రూపంలో ఉన్నా, దానిని పురుషులు వాడుట నిషిద్ధం. శ్రద్దగా వినండి. బంగారం ఏ రూపంలో ఉన్నా, గొలుసు రూపంలో కొందరు వేసుకుంటారు, ఏదైనా ఒక బ్యాంగిల్ రూపంలో చేతిలో వేసుకుంటారు పురుషులు. మరి కొందరు ఉన్నారు, రెండు చెవులలో నుండి ఏదైనా ఒక చెవిలో, ఇలా కొందరు ఈనాటి కాలంలో అలవాటు పడుతున్నారు. అయితే బంగారం ఏ రూపంలో ఉన్నా, దానిని పురుషులు వాడుట నిషిద్ధం.

అబూ మూసా అష్’అరీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

أُحِلَّ لِإِنَاثِ أُمَّتِي الْحَرِيرُ وَالذَّهَبُ وَحُرِّمَ عَلَى ذُكُورِهَا
బంగారం, పట్టు నా అనుచర సంఘంలోని స్త్రీలకు ధర్మసమ్మతం. పురు షులకు నిషిద్ధం”.
(ముస్నద్ అహ్మద్: 4/393. సహీహుల్ జామి 207).

ఈరోజు మార్కెట్లో గడియారాలు, అద్దాలు, బటన్లు, పెన్నులు, చైన్లు ఇంకా మెడల్ పేరుతో బంగారపు లేదా బంగారు వన్నె ఎక్కించినవి చాలా ఉన్నాయి. ఇంకా పురుషులకు స్వర్ణ గడియారం అని కొన్ని కాంపిటీషన్లలో ప్రకటించబడుతుంది. అయితే ఇవి నిషిద్ధం అని తెలుసుకోవాలి.

సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చినటువంటి హదీస్. శ్రద్ధగా వింటారు, అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను.

أنَّ رسُولَ الله ﷺ رَأَى خَاتَمًا مِنْ ذَهَبٍ فِي يَدِ رَجُلٍ فَنَزَعَهُ فَطَرَحَهُ وَقَالَ: يَعْمِدُ أَحَدُكُمْ إِلَى جَمْرَةٍ مِنْ نَارٍ فَيَجْعَلُهَا فِي يَدِهِ فَقِيلَ لِلرَّجُلِ بَعْدَ مَا ذَهَبَ رَسُولُ الله ﷺ خُذْ خَاتِمَكَ انْتَفِعْ بِهِ قَالَ لَا وَالله لَا آخُذُهُ أَبَدًا وَقَدْ طَرَحَهُ رَسُولُ الله ﷺ

అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన ప్రకారం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక వ్యక్తి చేతికి బంగారపు ఉంగరం చూశారు. ఆయన దానిని తీసిపారేశారు. మళ్ళీ ఇలా హెచ్చరించారు: “మీలో ఎవరికైనా నరకజ్వాల కావాలని ఉంటే దీనిని తన చేతిలో తొడగవచ్చు”. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెళ్ళిన తరువాత అక్కడ ఉన్నవారన్నారు: ‘నీ ఉంగరాన్ని తీసుకో, వేరే విధంగా దానితో ప్రయోజనం పొందవచ్చు’. అప్పుడు అతనన్నాడు: ‘లేదు. అల్లాహ్ సాక్షిగా! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తీసిపారేసిన దాన్ని నేను ఎన్నడూ తీసుకోను’. (ముస్లిం 2090).

ఎవరైతే చేతిలో బంగారపు ఏదైనా వస్తువు వేసుకుంటారో, ఉంగరం కానీ, గాజు కానీ, ఇంకా ఇలాంటిది ఏదైనా, అయితే వారు నరక శిక్షకు ఆహుతి అవుతారు అని హెచ్చరిక ఇది.

అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అటు వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ ఉన్నవారు ఆ సహాబీకి చెప్పారు, “నీ ఉంగరాన్ని తీసుకో, వేరే విధంగా దానితో ప్రయోజనం పొందవచ్చు.” అప్పుడు ఆ సహాబీ అన్నారు, “లేదు. అల్లాహ్ సాక్షిగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసి పారేసిన దానిని నేను ఎన్నడూ తీసుకోను.” ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఉన్నటువంటి గౌరవ అభిమానం. ప్రవక్తకు ఏ విషయం ఇష్టం లేదో, ప్రవక్త తన చేతితో దానిని తీసి పారేశారో, అలాంటి దాని దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి? ఒక విషయాన్ని ప్రవక్త నిషిద్ధం అని అన్నప్పుడు, దానికి నేను ఎందుకు పాల్పడాలి? ఇలాంటి కాంక్ష ఎంత గొప్పగా ఉండిందో గమనించండి.

ఈ రోజుల్లో, “అరే ఈ తాయెత్తు వేసుకోవద్దు, ఈ ఉంగరం బంగారపుది పురుషులు వేసుకోకూడదు” అని చెప్పినప్పుడు, “సరే, నేను తర్వాత తీసేస్తాను, లేదు ఇంట్లో నేను మా అమ్మతోని ఒకసారి మాట్లాడి ఆ తర్వాత తీస్తాను” ఈ విధంగా మన యొక్క సాకులు ఉంటాయి. కానీ సహాబీ, గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసి పారేసిన విషయానికి దగ్గరగా పోదలుచుకోలేదు.

  1. బంగారపు ఉంగరం వేసుకొనుట నరక శిక్షకు కారణమవుతుంది.
  2. తన శక్తి పరిధిలో ఉన్నప్పుడు మనిషి చెడును తన చేతితో ఖండించాలి. ఎవరికి అధికారం ఉన్నదో వారే చేయాలి, వేరే వారు చేసి ఇంకా నష్టానికి గురికాకూడదు.
  3. పురుషుడు బంగారపు ఉంగరం వేసుకొని ఉంటే, తెలిసిన వెంటనే, ఏ ఆలస్యం చేయకుండా తన చేతిలో నుండి తీసి కనీసం జేబులోనైనా వేసుకోవాలి. కానీ ఇక ఆ చేతిలో ఉంచుకోకూడదు. మెడలో ఉంటే మెడలో నుండి తీసేయాలి. తర్వాత తన ఇంట్లోని స్త్రీలకు ఇవ్వచ్చు, స్త్రీలు దాన్ని ఉపయోగించవచ్చును.
  4. సహాబాలు ప్రవక్త అనుకరణలో ఎంత ముందుగా ఉండేవారన్న విషయం తెలిసింది.

అయితే ఇక్కడ గమనించండి మరొక విషయం. అదేమిటంటే, ఈ రోజుల్లో కొందరు ఏమంటున్నారు? సరే ఇక బంగారం నిషిద్ధం అన్నారు కదా, మరి వెండిది వేయవచ్చా? “లేదు మా అబ్బాయి వాళ్ళ స్నేహితులు క్లాస్మేట్లు ఎవరో వేసుకున్నారంట, ఇంట్లో వచ్చి అడుగుతున్నాడు, నాకు కూడా ఒక చిన్న ఏదైనా వెండి యొక్క చైన్ ఇవ్వమని, లేదా చేతిలో ఏదైనా చైన్ వేసుకుంటా” అని. లేదు. ఇన్ షా అల్లాహ్ ఆ మాట తర్వాత కూడా వస్తుంది. స్త్రీలు పురుషుల పోలిక, పురుషులు స్త్రీల పోలిక అవలంబించకూడదు అని. కానీ ఇక్కడ ఒక మాట వచ్చింది గనక నేను దాన్ని గుర్తు చేశాను, చెప్పేశాను.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5351

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

తయమ్ముం, దాని విధానం మరియు సందర్భాలు [వీడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

తయమ్ముం, దాని విధానం మరియు సందర్భాలు
[https://youtu.be/1saC1XDHDgo [30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 


తయమ్ముమ్‌:

క్రింద తెలుపబడే కారణాలు సంభవించినప్పుడు ప్రయాణికులు, స్థానికులు ఎవరైనా సరే వుజూ మరియు గుస్ల్‌ కు బదులుగా తయమ్ముమ్‌ చేయవచ్చును.

1- అతికష్టంగా వెతికినప్పటికీ నీళ్ళు దొరకనప్పుడు, లేదా ఉండికూడా వుజూకు సరిపడనప్పుడు తయమ్ముమ్‌ చేయవచ్చును. కొంత దూరములో నీళ్ళు ఉన్నా అక్కడికి వెళ్ళి తీసుకోవడంలో అతనికి ధన, ప్రాణ నష్టమున్నప్పుడు కూడా తయమ్ముమ్‌ చేయవచ్చును.

2- వుజూ అవయవాల్లో ఏ ఒకదానికైనా గాయమయితే దాన్ని కడిగే ప్రయత్నం చేయాలి. కడగడం వల్ల నష్టం ఉంటే మసహ్‌ చేయాలి, అంటే చేయి తడి చేసి దాని మీద తుడువాలి. మసహ్‌ వల్ల కూడా హాని కలిగే భయం ఉంటే తయమ్ముమ్‌ చేయవచ్చును.

3- ఏ నీళ్ళు లేదా వాతవరణం మరీ చల్లగా ఉండి నీళ్ళ ఉపయోగం హానికరంగా ఉంటే తయమ్ముమ్‌ చేయవచ్చును.

4- నీళ్ళు కేవలం త్రాగడానికి మాత్రమే ఉన్నప్పుడు కూడా తయమ్ముమ్‌ చేయవచ్చును.

తయమ్ముమ్‌ విధానం:

మనుసులో నియ్యత్‌ /సంకల్పం చేసుకొని రెండు అరచేతులు ఒక సారి భూమిపై తట్టి ముఖముపై మళ్ళీ మణికట్ల వరకు రెండు చేతులపై మసహ్‌ చేయాలి. (కొందరు వుజూ చేసినట్టుగా మోచేతుల వరకు, కాళ్ళు సయితం మసహ్‌ చేస్తారు ఇది ప్రవక్త పద్దతి ఎంతమాత్రం కాదు). వుజూను భంగపరిచే విషయాలే తయమ్ముమ్‌ ను భంగపరుస్తాయి. నమాజుకు ముందు లేదా నమాజు మధ్యలో నీళ్ళు లభిస్తే తయమ్ముమ్‌ భంగమవుతుంది. నమాజు పూర్తి చేసుకున్న తరువాత నీళ్ళు లభిస్తే ఆ నమాజు అయినట్లే. తిరిగి మళ్ళీ చేయవలసిన అవసరం లేదు.

[ఇది నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)  గారు రాసిన “శుద్ధి & నమాజు (Tahara and Salah)” అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ఈ ఆడియోలో, ప్రవక్త తయమ్ముమ్ (నీరు లేనప్పుడు చేసే శుద్ధి) గురించి వివరిస్తున్నారు. తయమ్ముమ్ అంటే అల్లాహ్ ఆరాధన ఉద్దేశంతో పరిశుభ్రమైన మట్టిపై రెండు చేతులు కొట్టి ముఖాన్ని మరియు రెండు అరచేతులను తుడుచుకోవడం. నీరు అందుబాటులో లేనప్పుడు లేదా దాని వాడకం హానికరమైనప్పుడు తయమ్ముమ్ చేయడం విధిగా చెప్పబడింది. ఇది ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఉమ్మత్‌కు మాత్రమే ఇవ్వబడిన ఒక గొప్ప వరం మరియు సౌకర్యం అని, గత ప్రవక్తల అనుచరులకు ఈ సౌలభ్యం లేదని హదీసుల ద్వారా వివరించబడింది. తయమ్ముమ్ యొక్క షరతులు – నియ్యత్ (ఉద్దేశం), నీరు లేకపోవడం, మరియు పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించడం. చిన్న అశుద్ధి (హదసె అస్గర్) మరియు పెద్ద అశుద్ధి (హదసె అక్బర్) రెండింటికీ తయమ్ముమ్ సరిపోతుంది. అయితే, నీరు అందుబాటులోకి వచ్చిన వెంటనే, తయమ్ముమ్ చెల్లదు మరియు స్నానం లేదా వుదూ చేయడం తప్పనిసరి అవుతుంది.

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ సహ్‌బిహీ అజ్మయీన్, అమ్మా బాద్.

తయమ్ముమ్ అంటే అల్లాహ్ యొక్క ఆరాధన ఉద్దేశంతో పరిశుభ్రమైన మట్టి మీద రెండు అరచేతులను కొట్టి ముందు ముఖం మీద తర్వాత రెండు అరచేతుల మీద ఇలా తుడుచుకోవడం.

నీళ్లు లేని సందర్భంలో లేదా నీళ్లు ఉండి దాని ఉపయోగం హానికరంగా ఉన్నందువల్ల ఈ తయమ్ముమ్ చేయటం విధిగా ఉంది. అల్లాహుతాలా దీని గురించి చాలా స్పష్టంగా ఆదేశించాడు. సూరె మాయిదా సూర నెంబర్ ఐదు ఆయత్ నెంబర్ ఆరులో అల్లాహ్ ఆదేశం ఉంది.

فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا
ఫలమ్ తజిదూ మాఅన్ ఫతయమ్మమూ సయీదన్ తయ్యిబా
మీరు నీళ్లు పొందని స్థితిలో పరిశుభ్రమైన మట్టితో తయమ్ముమ్ చేసుకోండి.

فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ مِنْهُ
ఫమ్సహూ బివుజూహికుమ్ వ ఐదీకుమ్ మిన్హ్
మీ ముఖాలను తుడుచుకోండి. మీ చేతులను కూడా తుడుచుకోండి.

అయితే దీని ఆదేశం ఏంటి? విధిగా ఉంది. నీళ్లు లేని సందర్భంలో లేక నీళ్లు ఉండి మన కొరకు హానికరంగా ఉన్న సందర్భంలో తయమ్ముమ్ తప్పనిసరిగా చేయాలి.

అయితే ఇక్కడ ఇంకో విషయం మనకు తెలిసి ఉండటం చాలా మంచిది. అందువల్ల మనం అల్లాహ్ యొక్క కృతజ్ఞత అనేది ఇంకా ఎంతో గొప్పగా చెల్లించుకోవచ్చు. అదేమిటి?

ఈ తయమ్ముమ్ యొక్క సౌకర్యం ఇది అల్లాహ్ వైపు నుండి కేవలం మన కొరకు ఒక గొప్ప వరం. ఎందుకంటే ఇంతకుముందు ప్రవక్తల అనుసరులకు, ఇంతకుముందు ప్రవక్తలను విశ్వసించిన వారికి ఇలాంటి సౌకర్యం అల్లాహ్ ప్రసాదించలేదు. ఈ సౌకర్యం అల్లాహ్ తాలా ఎవరికి ఇచ్చాడు ప్రత్యేకంగా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుసరులకు, ఆయనను విశ్వసించిన వారికి ప్రసాదించాడు.

ఈ విషయం బుఖారీ ముస్లింలో ఒక చాలా స్పష్టమైన హదీస్ ఉంది. జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తాలా అన్హు గారు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు: “ఐదు విషయాలు ఉన్నాయి, నాకంటే ముందు ఏ ప్రవక్తకు అవి ఇవ్వబడలేదు.” గమనించండి. అంటే ఈ ఐదు విషయాల ప్రత్యేకత అనేది కేవలం మన ప్రవక్తకే ప్రసాదించబడినది. ఒకటి, నా శత్రువులు నా నుండి ఒక నెల దూర ప్రయాణంలో ఉంటారు కానీ వారి హృదయాల్లో అల్లాహ్ నా యొక్క భయం వేస్తాడు. రెండవది, అది మన టాపిక్ కు సంబంధించింది.

وَجُعِلَتْ لِيَ الْأَرْضُ مَسْجِدًا وَطَهُورًا
వ జుఇలత్ లియల్ అర్దు మస్జిదవ్ వతహూరా
సర్వభూమిని అల్లాహ్ నా కొరకు నమాజు చేయుటకు స్థలంగా, పరిశుభ్రత పొందుటకు సాధనంగా చేశాడు.

فَأَيُّمَا رَجُلٍ مِنْ أُمَّتِي أَدْرَكَتْهُ الصَّلَاةُ فَلْيُصَلِّ
ఫఅయ్యుమా రజులిమ్ మిన్ ఉమ్మతీ అద్రకత్ హుస్సలా ఫల్ యుసల్లీ.
ఈ భూమిలో మీరు ఎక్కడ సంచరిస్తున్నా సరే, ఎక్కడా ఉన్నా సరే నమాజ్ టైం అయిన వెంటనే నమాజ్ చేసుకోవాలి. నీళ్లు లేవు, తహారత్ లేదు ఇలాంటి ఏ సాకులు చెప్పుకోరాదు.

మూడో విషయం,

وَأُحِلَّتْ لِيَ الْغَنَائِمُ وَلَمْ تَحِلَّ لِأَحَدٍ قَبْلِي
వ ఉహిల్లత్ లియల్ గనాయిమ్ వలమ్ తహిల్ల లిఅహదిన్ ఖబ్లీ.
యుద్ధ ఫలం నా కొరకు హలాల్, ధర్మసమ్మతంగా చేయబడింది. నాకంటే ముందు ఎవరి కొరకు కూడా అది ధర్మసమ్మతంగా లేకుండింది.

మాలె గనీమత్, యుద్ధ ఫలం, యుద్ధ ధనం, యుద్ధం జరిగినప్పుడు ఇస్లాం మరియు కుఫ్ర్ మధ్యలో ఇస్లాం పై ఉన్నవారు గెలిచిన తర్వాత అవిశ్వాసుల ధనం ఏదైతే పొండేవారో దానిని మాలె గనీమత్ అని అనబడుతుంది.

నాలుగో విషయం, وَأُعْطِيتُ الشَّفَاعَةَ వ ఉ’తీతుష్షఫాఆ. ప్రళయ దినాన సిఫారసు చేసే ఈ గొప్ప భాగ్యం అల్లాహ్ నాకు ప్రసాదించనున్నాడు.

ఐదో విషయం,

وَكَانَ النَّبِيُّ يُبْعَثُ إِلَى قَوْمِهِ خَاصَّةً وَبُعِثْتُ إِلَى النَّاسِ عَامَّةً
వ కానన్నబియ్యు యుబ్అసు ఇలా కౌమిహీ ఖాస్సతన్ వ బుఇస్తు ఇలన్నాసి ఆమ్మహ్.
ఇంతకుముందు ప్రవక్తలు ప్రత్యేకంగా తమ జాతి వారి వైపునకు పంపబడేవారు. కానీ నేను సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా పంపబడ్డాను.

ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు, చనిపోయారు కూడా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ప్రళయం వచ్చే వరకు ప్రతి మనిషి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించడం తప్పనిసరి. లేకుంటే అతని అంతిమ గతి ఏమవుతుంది? నరకమే అవుతుంది. అయితే మన టాపిక్ కు సంబంధించిన విషయం ఏంటి ఇక్కడ? భూమి మస్జిద్ గా కూడా ఉంది, అది తహూర్, పరిశుభ్రతకు సాధనంగా కూడా అల్లాహ్ తాలా దానిని చేశాడు.

మూడు విషయాలు మనం విన్నాము. తయమ్ముమ్ అంటే ఏమిటి, దాని ఆదేశం ఏంటి అంటే అది విధిగా ఉంది, మూడో విషయం అది అల్లాహ్ వైపు నుండి ఒక గొప్ప వరం.

నాలుగో విషయం, ఖురాన్లో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల్లో దీని గురించి చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి గనక, ఎవరికీ ఏ సందేహం అనేది ఉండకూడదు. తయమ్ముమ్ చేసే విషయంలో, ఎక్కడ ముస్లిం, ఒక విశ్వాసుడు ఏ ప్రాంతంలో ఉన్నా గానీ, అక్కడ అతనికి నైట్ ఫెయిల్ అయింది అని, భార్య భర్తలు ఉండేది ఉంటే వారిద్దరూ మధ్యలో సంబంధాలు జరిగాయి గనక వారిపై ఇప్పుడు స్నానం చేయడం విధిగా ఉంది, నీళ్లు లేవు అని, ఇంకా వేరే ఏ సాకులు కూడా చెప్పకుండా, నమాజ్ టైం అయిన వెంటనే నీళ్లు లేనప్పుడు తయమ్ముమ్ చేసి లేక నీళ్లు ఉండి మన ఆరోగ్యానికి, మన శరీరానికి హానికరంగా ఉంటే నీళ్లు వాడకుండా తయమ్ముమ్ చేసి వెంటనే నమాజ్ చేయాలి. ఈ రోజుల్లో అనేక మంది యువకులు ప్రత్యేకంగా బజారుల్లో తిరగడం, ఇంకా వేరే పనుల్లో ఉండి, నమాజ్ టైంలో ఏదైనా మస్జిద్ దగ్గర ఉన్నప్పటికీ కూడా నమాజ్ కు రారు. సాకు ఏం చెప్తారు ఎక్కువ శాతం? “నాకు తహారత్ లేదు”. ఇది చాలా ఘోరమైన పాపం.

తయమ్ముమ్ హదసె అక్బర్ (పెద్ద అశుద్ధి), హదసె అస్గర్ (చిన్న అశుద్ధి) రెండిటికీ పనిచేస్తుంది. హదసె అక్బర్ అంటే ఏంటి? స్వప్న స్కలనం కావడం (నైట్ ఫెయిల్ కావడం), లేక భార్య భర్తలు కలుసుకోవడం. ఇందువల్ల ఏదైతే స్నానం చేయడం విధిగా ఉంటుందో దానిని హదసె అక్బర్ అంటారు. సామాన్యంగా మలమూత్ర విసర్జన తర్వాత, ఏదైనా అపాన వాయువు (గాలి) వెళితే, ఇలాంటి స్థితులు ఏవైతే ఉంటాయో వాటిని హదసె అస్గర్ అంటారు.

ఈ రెండిటికీ కూడా తయమ్ముమ్ సరిపోతుంది. దానికి దలీల్ (ఆధారం) ఏమిటి? సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలో ఒక చాలా పెద్ద హదీస్ ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రయాణ విషయంలో. అందులో ఒక తయమ్ముమ్ కు సంబంధించిన విషయం ఏంటంటే, ఒకచోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ చేసి,

فَلَمَّا انْفَتَلَ مِنْ صَلَاتِهِ إِذَا هُوَ بِرَجُلٍ مُعْتَزِلٍ لَمْ يُصَلِّ مَعَ الْقَوْمِ
ఫలమ్మన్ ఫలత మిన్ సలాతిహీ ఇదా హువ బిరజులిమ్ ముఅతజిలిల్ లమ్ యుసల్లి మఅల్ కౌమ్
నమాజ్ చేసి తిరిగిన తర్వాత ఒక వ్యక్తిని చూశారు ప్రవక్త గారు. అతను ఒక పక్కకు ఉన్నాడు, అందరితో కలిసి నమాజ్ చేయలేదు.

مَا مَنَعَكَ يَا فُلَانُ أَنْ تُصَلِّيَ مَعَ الْقَوْمِ
మా మనఅక యా ఫులాన్ అన్ తుసల్లి మఅల్ కౌమ్
అందరితో జమాఅత్ తో సహా, సామూహికంగా నమాజ్ ఎందుకు చేయలేదు నీవు అని ప్రవక్త వారు అతన్ని అడిగారు.

అప్పుడు అతడు ఏం చెప్పాడు?

أَصَابَتْنِي جَنَابَةٌ وَلَا مَاءَ
అసాబత్నీ జనాబతున్ వలా మా
నేను అశుద్ధావస్థకు గురయ్యాను, స్నానం చేయడం నాకు విధిగా అయిపోయింది. నీళ్లు లేవు.

అందు గురించి ఇంతవరకు నేను స్నానం చేయలేకపోయాను గనక, మీతో పాటు నేను నమాజ్ చేయలేదు. అప్పుడు ప్రవక్త ఏమన్నారు?

عَلَيْكَ بِالصَّعِيدِ فَإِنَّهُ يَكْفِيكَ
అలైక బిస్సయీద్ ఫఇన్నహూ యక్ఫీక్
పరిశుభ్రమైన మట్టి ఉంది కదా, అది నీకు సరిపోతుంది.

అలాగే సహీహ్ బుఖారీలోనే అమ్మార్ బిన్ యాసిర్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క సంఘటన ఉంది. అప్పటి వరకు ఆయనకు తయమ్ముమ్ విషయం తెలియదు. నమాజ్ టైం అయిపోయింది, స్నానం చేయడం విధిగా ఉంది. ఆయన ఏం చేశాడు? గాడిద మట్టిలో ఎలా పొర్లుతుందో చూశారా ఎప్పుడైనా? అతను స్వయంగా అంటున్నాడు, గాడిద ఎలా మట్టిలో పొర్లుతుందో అలా నేను మట్టిలో మొత్తం స్నానం చేసినట్టుగా లేచి నమాజ్ చేసుకొని ప్రవక్త వద్దకు వచ్చాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఈ విషయం అడిగాను. ప్రవక్త గారు చెప్పారు, “అంతగా చేసే అవసరం లేదే నీకు. కేవలం రెండు చేతులు పరిశుభ్రమైన మట్టి మీద కొట్టి, మట్టి అంటి ఉంటుంది గనక అని ఒక్కసారి ఊదుకొని ముఖముపై, కుడి చేయి అరచేతితో ఎడమ చేయి అరచేతి మీద, ఈ ఎడమ చేయి యొక్క అరచేతి లోపలి భాగంతో కుడి చేయి అరచేతి పై భాగం మీద మసాజ్ చేస్తే ఒక్కసారి సరిపోతుంది.”

ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల ద్వారా మనకు ఏం తెలుస్తుంది? స్నానం చేయడం విధిగా అయిన సందర్భంలో గానీ, లేక వుదూ చేయడం విధిగా ఉన్న సందర్భంలో గానీ, ఈ రెండు సందర్భాల్లో కూడా నీళ్లు లేనప్పుడు తయమ్ముమ్ సరిపోతుంది.

స్నానం అంటే తెలుసు, వుదూలో మనం కొన్ని ప్రత్యేక అవయవాలు కడుగుతాము. స్నానం చేయడం విధిగా ఉంటే ఏం చేస్తాము? గోరంత కూడా ఎక్కడా పొడితనం ఉండకుండా మంచిగా స్నానం చేస్తాము. కానీ నీళ్లు లేని సందర్భంలో ఒకే ఒక తయమ్ముమ్ రెండిటికీ సరిపోతుంది. ఒకసారి స్నానానికి ఇంకొకసారి వుదూకు అని రెండు రెండు సార్లు తయమ్ముమ్ చేసే అవసరం లేదు. ఒక్కసారి తయమ్ముమ్ చేసి నమాజ్ చేసుకుంటే స్నానానికి బదులుగా మరియు వుదూకు బదులుగా సరిపోతుంది.

తయమ్ముమ్ కూడా ఒక ఇబాదత్. నమాజుకు వుదూ చేయడం షరత్ కదా. వుదూ దేనితో చేస్తాము? నీళ్లతోని. నీళ్లు లేని సందర్భంలో అల్లాహ్ మనకు ఈ సౌకర్యం కలుగజేశాడు. అందు గురించి ఇది కూడా ఒక ఇబాదత్ గనక ఇందులో కొన్ని షరతులు ఉన్నాయి.

మొదటి షరత్, మొదటిది నియ్యత్. నియ్యత్ అంటే తెలుసు కదా ఇంతకు ముందు ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాము. ఏదో పెద్ద మంత్రం అలా చదవడం కాదు నోటితోని. ఏ కార్యం చేస్తున్నామో, ఏ సత్కార్యం, ఏ మంచి కార్యం, ఏ ఇబాదత్, దాని యొక్క సంకల్పం మనసులో చేసుకోవాలి. ఏమని? ఈ నా యొక్క సత్కార్యం ద్వారా అల్లాహ్ యే సంతృప్తి పడాలి, అల్లాహ్ యే నాకు దీని యొక్క ప్రతిఫలం ఇవ్వాలి అన్నటువంటి నమ్మకం ఉండాలి, అన్నటువంటి సంకల్పం, నియ్యత్ అనేది ఉండాలి. వేరే ప్రజలకు చూపడానికి గాని, ముతవల్లాకు చూపడం గాని, ఇంకా మన సంతానానికి చూపించడానికి గాని, నేను ఒక ముస్లింగా అన్నటువంటి భావన ఇతరులకు కలిగించడం కొరకు ఇలాంటి ఏ ప్రాపంచిక ఉద్దేశాలు ఉండకూడదు.

రెండవ నిబంధన, రెండవ షరత్, నీళ్లు లేకపోవడం లేదా ఉండి దానిని వాడడం మనకు నష్టకరంగా ఉండడం. అందుగురించి అల్లాహుతాలా సూరె మాయిదాలో ఏదైతే చెప్పాడో, అది కూడా మనకు ఒక ఆధారంగా ఉంది:

وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ
వ ఇన్ కున్తుమ్ మర్దా అవ్ అలా సఫరిన్
ఒకవేళ మీరు రోగులై ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా…

హానికరంగా ఉండడం అనేదేదైతే చెప్తున్నామో, అది మనకు కొన్ని హదీసుల ద్వారా కూడా వివరంగా తెలుస్తుంది. అంతే కాకుండా ఖురాన్లో అల్లాహ్ ఏం చెప్పాడు? సూరె నిసా, ఆయత్ నెంబర్ 29లో ఉంది:

وَلَا تَقْتُلُوا أَنفُسَكُمْ
వలా తఖ్తులూ అన్ఫుసకుమ్
మీకు మీరు (లేదా ఒకరినొకరు) చంపుకోకండి.

ఆత్మహత్యలు చేసుకోకండి, పరస్పరం ఒకరు మరొకరిని హత్య చేయకండి. ఇవన్నీ భావాలు దీంట్లో వస్తాయి.

إِنَّ اللَّهَ كَانَ بِكُمْ رَحِيمًا
ఇన్నల్లాహ కాన బికమ్ రహీమా
నిశ్చయంగా అల్లాహ్ మీ పట్ల చాలా కనికరం కలవాడు.

ఈ విధంగా ఈ షరతులు మనకు తెలిసినాయి, అర్థమైనాయి.

మూడో షరత్ ఏంటంటే, తయమ్ముమ్ చేయడానికి పరిశుభ్రమైన మట్టితో చేయాలి. ఈ మూడు షరతులు తయమ్ముమ్ కు సంబంధించినవి.

ఇందులో రెండు ఫర్దులు ఉన్నాయి. ఒకటి ఏమిటి? ముఖాన్ని తుడవడం. మరొకటి? రెండు అరచేతులను.

అయితే ఏ సందర్భాల్లో తయమ్ముమ్ చేయవచ్చు అన్న విషయం మనకు ఇంతకు ముందే సంక్షిప్తంగా వచ్చింది. నీళ్లు లేనప్పుడు లేక ఉండి కూడా వాడడం నష్టంగా ఉన్నప్పుడు. దానినే మరికొంచెం వివరంగా తెలుసుకుందాం.

నీళ్లు లేకపోవడం అంటే ఏమిటి? నీళ్లు లేకపోవడం అంటే మనం ఎక్కడ ఉన్నామో ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో ఎక్కడా నీళ్లు వుదూ చేయడానికి దొరకకపోవడం. మనం అక్కడి వరకు మన వద్ద బండి ఉంటే బండి ద్వారా వెళ్లడం గానీ, లేక కాలి నడకతో వెళ్లడం గానీ సాధ్యం ఉండి కొన్ని అడుగులు వెళ్తే అక్కడ దొరుకుతాయి అన్నటువంటి ఛాన్స్ ఉండేది ఉంటే, నీళ్లు లేని కింద లెక్కించబడదు. ఉదాహరణకు, ఇప్పుడు ఇక్కడ మనం సౌదియాలో ఉన్నాం గనక ఇక్కడి నుండి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో నీళ్లు ఉన్నాయి అనుకోండి. మనకు ఇక్కడ దగ్గరలో లేవు, అయితే నమాజ్ టైం అయినప్పుడు మన దగ్గర ఏదైనా బండి ఉంది లేక కార్ ఉంది, లేక మన మిత్రుని దగ్గర బండి ఉంది, వేరే ఎన్నో అవసరాలకు మనం తీసుకుంటూ ఉంటాం, వాడుకుంటూ ఉంటాము. ఆ రెండు కిలోమీటర్ల దూరానికి వెళ్లి ఆ నీళ్లు తీసుకురావడం మనకు కష్టంగా ఉంటుందా? ఉండదు. అయితే దాన్ని నీళ్లు లేవు అన్న విషయం అక్కడ వర్తించదు. మనం ఎక్కడి వరకు వెళ్లి నీళ్లు తీసుకోవడం సాధ్యం ఉన్నదో అక్కడి వరకు వెళ్లి తీసుకోవాలి. ఇక ఎక్కడైతే సాధ్యం కాదో అది నీళ్లు లేవు అన్న దానికి కింద లెక్కించబడుతుంది.

రెండో విషయం, మన దగ్గర నీళ్లు ఉన్నాయి కానీ త్రాగడానికి ఉన్నాయి. ఆ నీళ్లతో మనం స్నానం చేస్తే లేక వుదూ చేయడం మొదలు పెడితే త్రాగడానికి మనకు నీళ్లు దొరకవు. కొన్ని కొన్ని సందర్భాల్లో కరువు ఏర్పడుతుంది, వర్షాలు ఉండవు, మన దగ్గర కూడా అలాంటి ప్రాంతం అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది కదా. నీళ్లు త్రాగడానికి మాత్రమే ఉన్నాయి. వాడుకోవడానికి లేవు. అలాంటి సందర్భంలో కూడా అది నీళ్లు లేని కిందనే లెక్కించబడుతుంది. ఎందుకంటే ఇస్లాం మనల్ని మనం నష్టపరుచుకోవడానికి ఆదేశించదు. ఇదే ఆయత్లో, ఎక్కడైతే మనం ఇంతకు ముందు సూరె మాయిదా ఆయత్ చదివామో అందులోనే అల్లాహుతాలా ముందు ఏం చెప్తున్నాడు?

مَا يُرِيدُ اللَّهُ لِيَجْعَلَ عَلَيْكُم مِّنْ حَرَجٍ
మా యురీదుల్లాహు లియజ్అల అలైకుమ్ మిన్ హరజ్
అల్లాహుతాలా మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికి గురి చేయదల్చుకోలేదు.

وَلَٰكِن يُرِيدُ لِيُطَهِّرَكُمْ
వలాకిన్ యురీదు లియుతహ్హిరకుమ్
అల్లాహ్ ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని శుభ్రపరచడం, పరిశుద్ధులుగా చేయడం.

وَلِيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكُمْ
వ లియుతిమ్మ నిఅమతహూ అలైకుమ్
తన యొక్క కారుణ్యాన్ని మీపై సంపూర్ణం చేయడం.

ఎందుకు?

لَعَلَّكُمْ تَشْكُرُونَ
లఅల్లకుమ్ తష్కురూన్
మీరు కృతజ్ఞత చెల్లించే వాళ్ళు కావాలి అని.

గమనించండి. నీళ్లు త్రాగడానికి కూడా మనకు లేకుంటే మన జీవితమే చాలా నష్టంలో పడిపోవచ్చు. అందుగురించి వాడుకోవడానికి ఉన్న నీళ్లు మొత్తానికి అయిపోయి, కేవలం త్రాగడానికి మాత్రమే ఉన్నాయి, దానిని వాడితే ఇక మనకు చాలా ఇబ్బందికి గురవుతాము, అలాంటప్పుడు కూడా నీళ్లు లేవు అన్న విషయంలోనే వర్తిస్తుంది.

మూడో రకం, నీళ్లు ఉన్నాయి చాలా. కానీ కొనాల్సి వస్తుంది. కొనాల్సి వస్తుంది. అయితే పిసినారితనం చేసి డబ్బు పెట్టి ఎందుకు కొనాలి? ఎక్కడైనా ఫ్రీగా దొరికితే చూసుకుందాము. అన్నటువంటి భావన ఉంచుకొని, శక్తి ఉండి కూడా మనం కొనకుంటే అది పాపంలో పడిపోతాము. కానీ మన దగ్గర నీళ్లు కొనేంత శక్తి లేదు. ఉన్నాయి నీళ్లు కానీ కొనాల్సి వస్తుంది. కొనేంత శక్తి కూడా మన దగ్గర లేదు. కొన్నే కొన్ని డబ్బులు ఉన్నాయి, అవి మన ఈ రోజుకు గాని, లేకుంటే ఇంకా కొన్ని రోజుల వరకు మన అతి ముఖ్యమైన తిండి ఏదైతే ఉందో దాని గురించి గడవాలి. ఇలాంటి ఇబ్బందికరమైన జీవితం ఉన్నప్పుడు కొనడం కష్టతరంగా ఉన్నప్పుడు, కడుపు నిండా భోజనం చేసుకొని డ్రింకులు తాగవచ్చు కానీ ఇక్కడ వుదూ చేసుకోవడానికి ఒక నీళ్లు, ఒక అర లీటర్ నీళ్లు కొనలేము? ఆ డ్రింకులు ఏంటి, పెప్సీలు ఏంటి అవి మన జీవనానికి అత్యవసరమైన తిండి కింద లెక్కించబడుతుందా? లెక్కించబడదు.

విషయం అర్థమవుతుంది కదా. నీళ్లు లేవు అన్న ఈ పదం అనేది ఎన్ని రకాలుగా వస్తుంది, దాని యొక్క రూపాలు ఏంటున్నాయో అవన్నీ నేను వివరిస్తున్నాను.

రెండో విషయం, నీళ్లు ఉన్నాయి కానీ దాని ఉపయోగం మనకు నష్టకరంగా ఉంది. అంటే చలి వల్ల కావచ్చు. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. వేడి చేసుకోవడానికి ఎలాంటి సౌకర్యం లేదు ఇప్పుడు. ఒకవేళ ఉన్నది సౌకర్యం కానీ ఎంత సేపు పడుతుందంటే, మన ఈ నమాజ్ టైం అనేది దాటిపోతుంది. అలాంటప్పుడు ఆ నీళ్లు ఉపయోగించడం వల్ల మనకు నష్టం కలుగుతుంది అన్న భయం ఉండేది ఉంటే తయమ్ముమ్ చేయవచ్చు. ప్రవక్త సల్లల్లాహు వసల్లం కాలంలో ఒకసారి ఏం జరిగింది? ఒక వ్యక్తికి నెత్తిలో గాయమైంది. ప్రయాణంలో ఉన్నాడు, నెత్తిలో గాయమైంది. చాలా చల్లని రాత్రి, అతనికి స్నానం చేయడం కూడా విధి అయిపోయింది. దగ్గర ఉన్న స్నేహితులను అడిగాడు, ఏం చేయాలి నేను? ఫజర్ నమాజ్ టైం. “లేదు లేదు నీకేంటి, తప్పకుండా నువ్వు స్నానం చేసి నమాజ్ చేయాల్సిందే” అని అన్నారు అతని స్నేహితులు. అల్లాహ్ కరుణించు గాక వారిని. ఆయన స్నానం చేశాడు కానీ అందువల్ల అతని ప్రాణం పోయింది. తర్వాత ప్రవక్త సల్లల్లాహు వసల్లం వారి వద్దకు వచ్చిన తర్వాత, “మీరు మీ సోదరుని చంపేశారు. ధర్మజ్ఞానం లేనప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేదు? ఎందుకు అడగలేదు? అతను అలాంటి సందర్భంలో కేవలం తయమ్ముమ్ చేస్తే సరిపోయేది కదా” అని ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు బోధ చేశారు.

అయితే చలి వల్ల గాని, లేక మన శరీరంలో వుదూ చేసే అవయవాలకు ఏదైనా గాయమై ఉంది, అందువల్ల కూడా మనకు నీళ్లు వాడడం, ఉపయోగించడం నష్టకరంగా, హానికరంగా, ప్రాణం పోయేటువంటి భయం, లేక రోగం ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువ పెరిగే భయం, ఖురాన్లో అల్లాహ్ ఏం చెప్పాడు? “వ ఇన్ కున్తుమ్ మర్దా.” మీరు ఒకవేళ అనారోగ్యానికి గురియై మీకు నీళ్లు దొరకకుంటే తయమ్ముమ్ చేయవచ్చును. చూడండి, గమనించండి, ఇన్ని సౌకర్యాలు అల్లాహ్ ఇచ్చిన తర్వాత అరే జాన్దేలేరే క్యా ముస్లిం థండీ అయినా క్యా నమాజ్ పడతా? సామాన్యంగా అనుకుంటూ ఉంటాం కదా మనం. ఏంటి ఈ ముతవల్లాలు, ఈ మౌల్వీ సాబులు వీళ్లకు ఏం పని పాటలు ఉండయి, కేవలం అల్లాహ్ అల్లాహ్ అంటూ నమాజులు చేసుకుంటూ ఉంటారు, మన లెక్కలో ఎక్కడ పని చేస్తారు? కానీ అదే ఈ తిండి కొరకు, కూడు కొరకు, పని గురించి ఇంతటి చల్లని వాతావరణంలో కూడా ఎవరైనా డ్యూటీ వదులుకుంటాడా? చల్లగా ఉంది ఈ రోజు డ్యూటీకి వెళ్లకూడదు అని. ఏమీ దొరకకుంటే కప్పుకునే బ్లాంకెట్ అయినా వేసుకొని డ్యూటీకి వెళ్తాడు కానీ నమాజ్ విషయం వచ్చేది ఉంటే, అల్లాహ్ యొక్క దయ అని నమాజు ఎగ్గొడతాడు. ఇంకా సౌదియాలో ఇంటి నుండి మనం మస్జిద్ కి వెళ్ళడానికి కిలోమీటర్లు నడిచిపోయే అవసరమే పడదు. అవునా కాదా? వెనకా, ముంగట, కుడి పక్కన, ఎడమ పక్కన, ఎటు చూసినా అల్లాహ్ యొక్క దయ వల్ల మస్జిద్లే మస్జిద్లు. చాలా దగ్గరలో. అయినా గానీ మనం చలి కాలంలో ఇలాంటి సాకులు చెప్పి నమాజులను వదిలేస్తే, మనం ఇంకెవరికో కాదు నష్టంలో పడేసేది. మనకు మనం నరకానికి దారి సులభం చేసుకుంటున్నాము. అందు గురించి సోదరులారా, అల్లాహ్ మనందరికీ భయపడే మరియు ఇలాంటి సౌకర్యాలు ఏదైతే అల్లాహ్ ఇచ్చాడో వాటిని ఉపయోగించుకొని అల్లాహ్ యొక్క ఆరాధన సరైన పద్ధతిలో చేసే భాగ్యం కలిగించు గాక.

అయితే ఒక విషయం ఇక్కడ గుర్తించాలి, అదేమిటి? ఎప్పుడైతే నీళ్లు దొరుకుతాయో అప్పుడు తయమ్ముమ్ చేయడం అనేది మానేసేయాలి. నీళ్లు వచ్చిన వెంటనే. చివరికి కొందరు ఆలిములు ఏమంటున్నారో తెలుసా? నీళ్ల గురించి అన్ని రకాల ప్రయత్నం నువ్వు చేశావు, నీళ్లు దొరకలేదు, తయమ్ముమ్ చేసుకుని నమాజ్ మొదలు పెట్టావు, నీళ్లు వచ్చాయి. నమాజ్ ను తెంపేసేయ్, వుదూ చేసుకొని నమాజ్ చెయ్. అర్థమైందా?

మరో విషయం ఇక్కడ, తయమ్ముమ్ ద్వారా కూడా ఒక్కటి కంటే ఎక్కువ నమాజులు కూడా చేయవచ్చు. ఉదాహరణకు మీరు అసర్ లో తయమ్ముమ్ చేశారు. ఆ వుదూను, అంటే తయమ్ముమ్ తో ఏదైతే మీకు వుదూ అయిందో దాన్ని మీరు కాపాడుకున్నారు. మూత్రానికి వెళ్ళలేదు, ఇంకా వుదూ భంగమయ్యే ఏవైతే కారణాలు మనం ఇంతకు ముందు విన్నామో అలాంటివి ఏవీ సంభవించలేదు. అయితే మగ్రిబ్, ఇషా అన్నీ చేసుకుంటూ వచ్చినా గానీ కానీ నీళ్లు వచ్చేస్తే అరె నేను అప్పుడు తయమ్ముమ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు మగ్రిబ్ నమాజ్ కంటే ముందు నీళ్లు వచ్చేసాయి, అసర్ టైంలో నీళ్లు లేవు. మగ్రిబ్ వరకు నీళ్లు వచ్చేసినాయి. నా అప్పటి వుదూ ఉంది కదా, దానితోనే నేను మగ్రిబ్ చేసుకుంటాను. తప్పు విషయం. నీళ్లు వచ్చేసాయి ఇప్పుడు తయమ్ముమ్ నీది చెల్లదు, తయమ్ముమ్ నీది నడవదు, అది expire అయిపోయినట్లు. అర్థమవుతుంది కదా. మళ్లీ కొత్తగా వుదూ చేసుకొని మీరు మగ్రిబ్ నమాజ్ అనేది చేయాలి. అంటే నీళ్లు వచ్చిన వెంటనే తయమ్ముమ్ సమాప్తం అయిపోతుంది. దాని యొక్క ఆదేశం అనేది ఇక ఉండదు. ఎందుకు? అల్లాహ్ ఏమంటున్నాడు?

فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا
ఫలమ్ తజిదూ మాఅన్ ఫతయమ్మమూ
నీళ్లు పొందని సందర్భంలో మీరు తయమ్ముమ్ చేయండి.

నీళ్లు వచ్చిన తర్వాత? ఇక ఉండదు.

ఇంకో విషయం. స్నానం చేసే విషయంలో, అంటే స్నానం విధి అయింది, నీళ్లు లేవు. నమాజ్ టైం అయింది. ఏం చేసినాం మనం? తయమ్ముమ్ చేసుకొని నమాజ్ చేశాం. ఓకే? తర్వాత నీళ్లు వచ్చాయి. స్నానం చేయాలా చేయవద్దా? చేయాలి. ప్రశ్న అర్థమైందా? ఉదాహరణకు ఫజర్ నమాజే అనుకోండి. రాత్రి నైట్ ఫెయిల్ అయింది. నీళ్లు దొరకలేదు. లేక ఫజర్ నమాజ్ టైం గనక ఎక్ దమ్ మైనస్ డిగ్రీ వాతావరణం ఉండి, నీళ్లు వాడితే మనకు జ్వరం వచ్చేస్తుంది, నీళ్లు వాడేది ఉంటే మనకు ఇంకా ఏదైనా అనారోగ్యానికి గురి అయ్యే సూచనలు ఉన్నాయి. నీళ్లు వాడలేదు, తయమ్ముమ్ చేసుకున్నాము. పొద్దెక్కేసరికి మనకు ఆరోగ్యం బాగైపోయింది, ఇప్పుడు నీళ్లు వాడడంలో నష్టం లేదు. అప్పుడు స్నానం చేయాలా, చేయవద్దా? చేయాలి.

చాలా పెద్దగా ఉంది హదీస్ అని నేను ఇంతకు ముందు ఒక ఇమ్రాన్ బిన్ హుసైన్ రదియల్లాహు అన్హు గారి హదీస్ ఏదైతే చెప్పానో, అందులో ఆ వ్యక్తి నువ్వు ఎందుకు మాతో నమాజ్ చేయలేదు అని ప్రవక్త గారు అడిగారు కదా, అతను ఏమన్నాడు? నా దగ్గర నీళ్లు లేవు, నేను జునుబీ అయిపోయాను, అశుద్ధావస్థకు గురయ్యాను. ప్రవక్త చెప్పారు, నీకు తయమ్ముమ్ సరిపోయేది. ఆ తర్వాత కొంతసేపటికి, అయితే ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు అప్పటికే పంపి ఉన్నారు కొందరిని నీళ్ల గురించి. పోండి మీరు నీళ్ల గురించి వెతకండి అని. ఆ హదీస్ అంతా పొడుగ్గా ఉన్నది అంటే అందులో ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారి గొప్ప మహిమ కూడా ఉన్నది. మరి ఎప్పుడైనా గుర్తు చేయండి చెప్తాను దాని గురించి. కానీ సంక్షిప్తం ఏంటంటే నీళ్లు దొరుకుతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందులో తమ చేతులు పెడతారు, అల్లాహ్ బరకత్ ప్రసాదిస్తాడు, అందరూ తమ తమ దగ్గర ఉన్న పాత్రలన్నీ నింపుకుంటూ ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు చూడండి, ఏ విషయం ఎంత ముఖ్యమైనది, అవసరమైనది ఉంటుందో దాని విషయంలో అశ్రద్ధ వహించరు. ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు ప్రయాణంలో ఉన్నారు, ఎందరో సహచరులు ఉన్నారు, ఎందరియో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ నీళ్లు వచ్చిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు వసల్లం గారు ఆ వ్యక్తిని గుర్తు చేసి, అతన్ని పిలవండి, హా నీళ్లు తీసుకెళ్ళు, తీసుకెళ్లి నువ్వు స్నానం చెయ్యి అని ఆదేశించారు.

సహీహ్ బుఖారీలో ఆ హదీస్ ఉంది, 344 హదీస్ నెంబర్. అయితే విషయం ఏం తెలిసింది మనకు? స్నానం విధిగా ఉన్నప్పుడు నీళ్లు లేవు లేక ఉండి దానిని వాడడం మనకు నష్టకరంగా ఉంటే నమాజ్ చేసుకున్నాము తయమ్ముమ్ తోని. కానీ తర్వాత ఆ నష్టం తొలిగిపోయింది లేదా నీళ్లు మనకు దొరికినాయి, అలాంటప్పుడు ఏం చేయాలి? స్నానం అనేది చేయాలి.

కొంచెం ఈ విషయాలు ఎక్కువ శాతం చలి కాలంలో, ఇంకా వేరే ప్రయాణంలో ఉన్న సందర్భంలో, వేరే సందర్భాల్లో కూడా మనకు అవసరం పడతాయి గనక కొంచెం వివరంగా చెప్పడం జరిగింది. అయితే, మేజోళ్లపై మసాహ్ విషయం అనేది అల్లాహ్ యొక్క దయతో మనం వచ్చే నెక్స్ట్ పాఠంలో తెలుసుకుందాము. దీని గురించి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతాయి. అయితే తప్పకుండా ఉలమాలతో, ధర్మవేత్తలతో మనం మంచి సంబంధాలు ఉంచుకొని అలాంటి ప్రశ్నలను మనం వారితో తెలుసుకోవాలి. షరీయత్ యొక్క సమాధానం, ధర్మపరమైన సమాధానం ఏముంటుందో తెలుసుకొని దాని ప్రకారంగా అల్లాహ్ యొక్క ఆరాధన చేసే ప్రయత్నం చేయండి. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.


ఇతరములు: