రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు “మరణానంతర జీవితం” అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక “నరకంపై వంతెన”. అల్లాహు అక్బర్.
మహాశయులారా, ప్రళయ దినాన సంభవించే అన్ని ఘట్టాలలో అతి భయంకరమైనది, అతి క్లిష్టతరమైనది ఇది కూడా ఒకటి. ఆ రోజు అల్లాహు తఆలా నరకంపై ఒక వంతెనను ఏర్పాటు చేస్తాడు. ప్రతీ మనిషీ ఆ వంతెనపై తప్పకుండా వచ్చి ఉంటాడు.
వ ఇమ్ మిన్కుమ్ ఇల్లా వారిదుహా, కాన అలా రబ్బిక హత్మమ్ మఖ్దియ్యా. (وَإِن مِّنكُمْ إِلَّا وَارِدُهَا ۚ كَانَ عَلَىٰ رَبِّكَ حَتْمًا مَّقْضِيًّا) అనువాదం: మీలో ప్రతీ ఒక్కడూ దానిపై వచ్చి ఉంటాడు. ఇది నీ ప్రభువు చేసినటువంటి తిరుగులేని నిర్ణయం, ఖచ్చితమైన నిర్ణయం.
మీలో ప్రతీ ఒక్కడూ దానిపై వచ్చి ఉంటాడు. ఇది నీ ప్రభువు చేసినటువంటి తిరుగులేని నిర్ణయం, ఖచ్చితమైన నిర్ణయం. అయితే, ఆ వంతెన ఎలాంటిది? దేనిపై వేయబడుతుంది? ఆ వంతెన వెడల్పు ఎంత ఉంటుంది? దానిపై ఎవరు ఎలా వెళ్తారు, దాటుతారు? ఇవన్నీ విషయాలు కూడా చాలా తెలుసుకోవలసి ఉంది.
మహాశయులారా, ముందు విషయం మనం ఇక్కడ గమనించాల్సింది, ఆ వంతెన నరకంపై ఉంటుంది. అల్లాహు అక్బర్. అంటే భావం ఏమిటి? ఏ కొంచెం కాలు జారినా, డైరెక్ట్ నరకంలోనే పడిపోతాము. అల్లా మనందరినీ రక్షించు గాక. అయితే అది వెడల్పుగా ఉండదు. ఇది కూడా చాలా ఘోరమైన విషయం. సహీహ్ ముస్లిం షరీఫ్లో వచ్చి ఉంది. హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు తెలిపారు:
బలగనీ అన్నల్ జిస్ర అలా జహన్నమ్ అహద్దు మినస్ సైఫ్ వ అదఖ్ఖు మినష్ షఅర్. (بَلَغَنِي أَنَّ الْجِسْر عَلَى جَهَنَّم أَحَدُّ مِنَ السَّيْفِ وَأَدَقُّ مِنَ الشَّعْرِ) అనువాదం: ఆ నరకంపై ఉన్న వంతెన, కత్తి పదును కంటే ఎక్కువ పదునుగా, కుచ్చగా ఉంటుంది మరియు వెంట్రుక కంటే మరీ సన్నగా ఉంటుంది అని నాకు చేరింది.
ఆ నరకంపై ఉన్న వంతెన కత్తి పదును కంటే ఎక్కువ పదునుగా, కుచ్చగా ఉంటుంది మరియు వెంట్రుక కంటే మరీ సన్నగా ఉంటుంది. అల్లాహు అక్బర్. తాడు అని అనవచ్చా? లేదు. గమనించండి. అయితే, ఇది కత్తి పదును కంటే మరీ కుచ్చగా, పదునుగా మరియు వెంట్రుక కంటే మరీ సన్నగా ఉంటది అని ఏదైతే తెలపడం జరిగిందో, అది ఎలా కావచ్చు? మనం అనుమానానికి గురి కాకూడదు. ఎలాంటి సందేహం వహించవద్దు. ఎందుకంటే పరలోకాన సంభవించే విషయాలన్నీ కూడా మనం ఇహలోక జ్ఞానంతో అర్థం చేసుకోలేము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [1] – సంకల్ప శుద్ధి, సత్ప్రవర్తన [మరణానంతర జీవితం – పార్ట్ 23] [21 నిముషాలు] https://www.youtube.com/watch?v=bqcAR6CBK80 వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والعاقبة للمتقين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد
మహాశయులారా, మరణానంతర జీవితం అనే అంశంలో మీకు స్వాగతం. మరణానంతర జీవితం అనే అంశంలో ఒక ముఖ్య శీర్షిక ప్రళయ దినాన త్రాసు యొక్క ఏర్పాటు చేయడం, అందులో కర్మలను, కర్మ పత్రాలను, ఆ కర్మలు చేసిన మానవుల్ని కూడా తూకం చేయబడటం దాని గురించి మనం ఎన్నో వివరాలు విని ఉన్నాము. అయితే, ఇందులోనే ఒక ముఖ్య శీర్షిక త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు ఏమిటి?
మహాశయులారా, ఇలాంటి విషయాలు మనం ఎక్కువగా చదవడం, వినడం, తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసు బరువుగా ఉన్నప్పుడే మనం స్వర్గాల్లోకి ప్రవేశించగలుగుతాము. ఒకవేళ మన సత్కార్యాల పళ్ళెం బరువుగా కాకుండా తేలికగా ఉంటే, అల్లాహ్ కాపాడుగాక మనందరినీ రక్షించుగాక, నరకంలోనికి వెళ్ళవలసి వస్తుంది. అందుకొరకు ఈనాటి నుండి మనం అల్లాహ్ యొక్క దయవల్ల ఏ సత్కార్యాలు ప్రళయ దినాన మన త్రాసును బరువుగా చేస్తాయి, ఆ సత్కార్యాల గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాము.
ఇందులో మొదటి విషయం ఇఖ్లాస్. అంటే సంకల్ప శుద్ధి. ఏ కార్యం ఎంత ఎక్కువగా సంకల్ప శుద్ధితో కూడుకొని ఉంటుందో అంతే ఎక్కువగా దాని పుణ్యం పెరుగుతుంది. ఎంత పుణ్యం ఎక్కువగా పెరుగుతుందో అంతే పళ్ళెంలో, సత్కార్యాల త్రాసులో అది బరువుగా ఉంటుంది. ఎవరైనా ఎంత పెద్ద సత్కార్యం చేసినా, అది చూడడానికి ఎంత గొప్పగా ఉన్నా, సంకల్ప శుద్ధి కలిగి లేకుంటే, అది కేవలం అల్లాహ్ యొక్క సంతృష్టి కొరకు చేయబడకుంటే దాని యొక్క సత్ఫలితం మనిషికి ఏ మాత్రం దొరకడమే కాదు, ఏనాడైతే మనిషి దాని సత్ఫలితం పొందుదాము అని ప్రలోకాన హాజరవుతాడో అప్పుడు దుమ్ము ధూళి వలె అది వృధా అయిపోతుంది. ఏమీ ఫలితము మనిషికి లభించదు. చూడడానికి ఇహలోకంలో అతను ఎంతో కష్టపడ్డాడు. చూడడానికి ఆ కార్యం చేయడానికి అతను ఎంతో శ్రమించాడు, కానీ సంకల్ప శుద్ధి లేని వల్ల దాని పుణ్యం తుడుచుకుపోతుంది. సత్ఫలితం లేకుండా చేస్తుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక: ప్రళయ దినాన నెలకొల్పబడే త్రాసు యొక్క గాంభీర్యత, కష్టతరం, దాని యొక్క భయంకరత్వం.
త్రాసు గురించి వింటున్న వివరాలతో ఇహలోకంలోనే మనకు ఒక గుణపాఠం రావాలి. మనం దైనందిన జీవితంలో చేసే సత్కార్యాలు పెరుగుతూ ఉండాలి మరియు దుష్కార్యాలు తగ్గుతూ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా రేపటి రోజు ఆ త్రాసులో తూకం చేయబడతాయి.
ప్రళయ దినాన ఎప్పుడైతే సూక్ష్మమైన విషయాలను కూడా త్రాసులో పెట్టబడి తూకం చేయడం జరుగుతూ ఉంటుందో, ఇవన్నీ విషయాలు కర్మపత్రాల్లో కూడా వ్రాయబడి ఉంటాయో, ఆ కర్మపత్రాలను కూడా తూకం చేయడం జరుగుతుందో, ఈ విషయాల్ని అపరాధులు, పాపాలు చేస్తూ ఉన్నవారు ఈ విషయాన్ని చూసి చాలా గాంభీర్యతకు గురి అవుతారు. వారు స్వయంగా ఏమంటారు ఆ సందర్భంలో, ఆ విషయాన్ని అల్లాహు తాలా సూరహ్ కహఫ్ లో తెలియజేశాడు.
وَوُضِعَ الْكِتَابُ కర్మపత్రాలు వారి ముందు పెట్టడం జరుగుతుంది.
فَتَرَى الْمُجْرِمِينَ مُشْفِقِينَ مِمَّا فِيهِ అపరాధులను నీవు ఆ రోజు చూస్తావు, వారు భయ కంపితులై వాటిలో ఉన్న, వ్రాయబడిన ఆ విషయాలన్నింటినీ చూసి భయకంపితులై పోతారు.
وَيَقُولُونَ మరియు అంటారు:
يَا وَيْلَتَنَا مَالِ هَٰذَا الْكِتَابِ మా పాడుగాను, ఇది ఎలాంటి గ్రంథం, ఎలాంటి కర్మపత్రం.
لَا يُغَادِرُ صَغِيرَةً وَلَا كَبِيرَةً ఏ చిన్న దానిని గానీ, ఏ పెద్ద దానిని గానీ వదిలేయకుండా మొత్తం దీంట్లో వ్రాయబడింది.
إِلَّا أَحْصَاهَا ప్రతీ ఒక్కటి అందులో చేర్చడం జరిగింది.
وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا వారు చేసుకున్న సర్వాన్ని వారు తమ ముందు హాజరుగా చూస్తారు.
وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا నీ ప్రభువు ఎవరిపై కూడా ఏ మాత్రం అన్యాయం చేయడు, ఎవరిపై ఏ రవ్వంత కూడా దౌర్జన్యం చేయడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
త్రాసు అంటే ఏమిటి? ప్రళయ దినాన దాని యొక్క గాంభీర్యత, కష్టతరం అనేది ఎలా ఉంటుంది? [మరణానంతర జీవితం – పార్ట్ 19] [21 నిముషాలు] https://www.youtube.com/watch?v=kKaOZfTuxe0 వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి వహద, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బాద అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ఈనాటి శీర్షిక: త్రాసు అంటే ఏమిటి? ప్రళయ దినాన దాని యొక్క గాంభీర్యత, కష్టతరం అనేది ఎలా ఉంటుంది?
మహాశయులారా, సృష్టికర్త అయిన అల్లాహ్ సర్వము తెలిసినవాడు. మరియు ఆయన ఎవరి పట్ల కూడా ఎలాంటి అన్యాయం చేయనివాడు. ఆయన కరుణామయుడు, కృపాశీలుడు మరియు దాసులకు వారి పుణ్యాలకంటే ఎంతో ఎక్కువ రేట్లో ఉపకారాలు చేసి వారిని మన్నిస్తూ ఉండేవాడు. కానీ రవ్వంత కూడా ఎవరిపై ఏ అన్యాయము చేయడు.
ఆయన ప్రళయ దినాన తలచుకుంటే, దాసుల పట్ల ఆయనకున్న పరిజ్ఞానంతో వారి యొక్క విశ్వాసం, అవిశ్వాసం, సత్కార్యాలు, దుష్కార్యాలు అనే ఆధారం మీద వారిని స్వర్గంలో పంపడం, నరకంలో పంపడం వంటి తీర్పులు చేయగలడు. అలా చేసే అధికారం అతనికి ఉంది. కానీ, అలా చేయకుండా వారి యొక్క లెక్క, వారి యొక్క తీర్పు, సాక్ష్యాధారాలను, ఇంకా ఆ రోజు త్రాసును నెలకొల్పుతాడు.
త్రాసును నెలకొల్పి, అందులో ప్రజలు చేసినటువంటి సత్కార్యాలను ఒకవైపున, దుష్కార్యాలను మరోవైపున తూకం చేస్తాడు. స్వయంగా సత్కార్యాలు, దుష్కార్యాలు చేసిన ప్రజలను కూడా అందులో పెట్టడం జరుగుతుంది. అంతేకాదు, ఏ కర్మపత్రాలు దైవదూతలు రాస్తూ ఉన్నారో, ఆ పత్రాలను కూడా, ఆ ఫైల్లను కూడా అందులో తూకం చేయడం జరుగుతుంది. ఇదంతా దేని కొరకు? ప్రజలు కూడా స్వయంగా వారు తృప్తికరమైన న్యాయం వారికి లభించినది అని వారికి మనస్తృప్తి కలగాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ తో దుఆ చేయడంలో ఎవరిని, ఏ విషయాల్ని మధ్యవర్తిత్వంగా మనం పెట్టుకోవచ్చు? [మరణానంతర జీవితం – పార్ట్ 17] [25 నిముషాలు] https://www.youtube.com/watch?v=x27-UYBIOU4 వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక అల్లాహ్ తో దుఆ చేయడంలో ఎవరిని ఏ విషయాల్ని మధ్యవర్తిత్వంగా మనం పెట్టుకోవచ్చు.
అయితే మహాశయులారా మన అంశం మరణానంతర జీవితం. మనం సీరియల్ వారీగా పరలోకంలో ఏ ఏ మజిలీలు ఉన్నాయి, ఏ ఏ విషయాలు సంభవిస్తాయి వాటి గురించి వింటూ వస్తున్నాము.అయితే అల్లాహుతాలా తీర్పు గురించి రావడంలో ఏదైతే చాలా ఆలస్యం జరుగుతుందో ఆ దీర్ఘ సమయాన్ని ప్రజలు భరించలేక సిఫారసు గురించి ఏదైతే ప్రవక్తల వద్దకు వెళ్తారో, వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు చివరికి వస్తారు. ఆ విషయాలు వింటూ ఉన్నాము కానీ సిఫారసుకు సంబంధించిన విషయం చాలా ముఖ్య విషయం.
ఆ రోజు ఇంకా ఎన్ని రకాల సిఫారసులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పొందడం చాలా ముఖ్యము గనుక, దానికి సంబంధించిన ఒక భాగం అంటే ఇహలోకంలో సిఫారసుకు సంబంధించిన ఏ మూఢనమ్మకాలు ఉన్నాయో వాటిని మనం దూరం చేసుకొని సరైన విశ్వాసాన్ని, సరైన సిఫారసు వివరాల్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. అందుగురించి మనం మనం అసలైన మన అంశాన్ని విడిపోయాము అని ఏమాత్రం భావించకండి. అయితే మహాశయులారా మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు అల్లాహ్ తో దుఆ చేసే సందర్భంలో ఎవరినైనా మధ్యవర్తిత్వంగా వసీలాగా పెట్టుకోవడం ఎంతవరకు యోగ్యం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రళయ దినాన సిఫారసు చేసే హక్కు ఎవరెవరికి లభిస్తుంది? ఎవరి సిఫారిసు చెల్లుతుంది? [మరణానంతర జీవితం – పార్ట్ 18] [22 నిముషాలు] https://www.youtube.com/watch?v=5Hpmj-eG9oE వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్. నబీయ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్ .అమ్మాబాద్.
రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి అంశం: ప్రళయ దినాన సిఫారసు చేసే హక్కు ఎవరెవరికి లభిస్తుంది? ఎవరి సిఫారసు చెల్లుతుంది?
మహాశయులారా ఈ శీర్షిక కూడా చాలా ముఖ్యమైనది. దీనిని తెలుసుకోవడం ద్వారా మనకు లాభం ఏమిటంటే ఎవరెవరి సిఫారసు ప్రళయ దినాన చెల్లుతుంది అని అల్లాహ్ ఖురాన్ ద్వారా గాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహీ హదీసుల ద్వారా గాని మనకు తెలియజేశారో వాటి పట్ల మన బాధ్యత ఏమిటో అవి కూడా తెలియజేశారు. ఉదాహరణకు ప్రళయ దినాన ఖురాన్ సిఫారసు చేస్తుంది. ఖురాన్ అల్లాహ్ యొక్క దివ్య గ్రంథం అని మనకు తెలుసు. అయితే ఖురాన్ ఎవరి పట్ల సిఫారసు చేస్తుంది? ఎవరైతే దానిని ఎల్లవేళల్లో చదువుతూ ఉంటారో, దాని పారాయణం చేస్తూ ఉంటారో, దాని పారాయణంతో పాటు అర్థ భావాలను కూడా అర్థం చేసుకుంటూ వాటిలో యోచిస్తూ ఆచరణలో ఉంచడమే సరిపుచ్చుకోకుండా ఈ ఖురాన్ యొక్క దావత్ ఖురాన్ వైపునకు ఇతరులను కూడా ఆహ్వానిస్తారో మరియు ఏదైనా రోగానికి, అవస్థకు గురి అయినప్పుడు ఖురాన్ ద్వారా స్వస్థత పొందుటకు ఏ ఆయతులు ఏ సందర్భంలో చదవాలో వాటిని పాటిస్తారో, ఈ విధంగా ఖురాన్ చదువుతూ దాని ప్రకారం ఆచరించే వారి పట్ల అది సిఫారసు చేస్తుంది. ఇక ఈ విషయం ఎవరికైతే తెలుస్తుందో వారు ఖురాన్ చదవడం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపవచ్చు. అలాగే మిగతా విషయాలు కూడా. అందుగురించి ఈ శీర్షికను కూడా వినడం, దీనిని గ్రహించడం చాలా అవసరం. ,
మహాశయులారా! మొట్టమొదటి విషయం ఎవరికైతే ప్రళయ దినాన సిఫారసు చేయడానికి అర్హత కలుగుతుందో వారు మన గౌరవనీయులైన, ప్రియులైన మనందరి ప్రియ ప్రవక్త, చిట్టచివరి ప్రవక్త, దయామయ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ విషయం మనం ఇంతకుముందు భాగంలో కూడా విని ఉన్నాము. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి షఫాఅతె ఉజ్మా ఆ మహా మైదానంలో మకామె మహమూద్ అన్నటువంటి గొప్ప స్థానంలో ప్రశంసనీయబడిన స్థానంలో వారికి ఈ సిఫారసు యొక్క హక్కు లభిస్తుంది. అక్కడ ఆయనకు పోటీ సమానులు ఎవరూ ఉండరు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు ఒక్క సందర్భంలోనే కాదు వివిధ సందర్భాల్లో సిఫారసు చేసే హక్కు లభిస్తుంది అని కూడా మనం తెలుసుకున్నాము. ఉదాహరణకు నరకంలో పడిపోయిన వారిని వారి తౌహీద్, నమాజ్ ఇలాంటి మంచి కార్యాల వల్ల వారికి బయటికి తీయడం, స్వర్గంలో చేరే ముందు స్వర్గం తెరవబడటానికి సిఫారసు చేయడం. స్వర్గంలో చేరిన వారికి ఎలాంటి శిక్షా మరీ ఎలాంటి లెక్కా తీర్పు లేకుండా స్వర్గంలో పోవడానికి సిఫారసు ఎక్కువ హక్కు. అలాగే స్వర్గంలో చేరిన వారు వారికి ఉన్నత స్థానాలు లభించాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేయడం. ఈ విధంగా ఎన్నో రకాల సిఫారసు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేస్తారు అని వాటికి సంబంధించిన ఆధారాలు కూడా మనం విని ఉన్నాము. అందుగురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయంలో ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకునే అవసరం లేదు అని భావిస్తున్నాను.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ఇస్లామీయ విశ్వాసంలోని ఐదవ ముఖ్యమైన అంశమైన పరలోక జీవితంపై విశ్వాసం గురించి వివరించబడింది. పరలోకం అంటే ఏమిటి, దాని ఉనికికి ఖురాన్ మరియు హదీసుల నుండి ఆధారాలు, మరియు ప్రపంచంలో జరిగే అన్యాయాలకు అంతిమ న్యాయం జరగాల్సిన ఆవశ్యకత వంటి విషయాలు చర్చించబడ్డాయి. పరలోకంలో జరిగే ముఖ్య సంఘటనలైన హషర్ మైదానం (సమావేశ స్థలం), కర్మపత్రాల పంపిణీ, మీజాన్ (త్రాసు), జహన్నం (నరకం), మరియు జన్నత్ (స్వర్గం) గురించి కూడా ప్రస్తావించబడింది. చివరగా, పరలోకంపై విశ్వాసం ఒక వ్యక్తిని దైవభీతితో జీవించేలా, పుణ్యకార్యాల వైపు ప్రేరేపించేలా మరియు పాపాలకు దూరంగా ఉంచేలా ఎలా చేస్తుందో, తద్వారా సమాజంలో శాంతి ఎలా నెలకొంటుందో వివరించబడింది.
అల్ హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్.
అన్ని రకాల ప్రశంసలు, పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలు మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ప్రసంగంలో, విశ్వాస ముఖ్యాంశాలలోని ఐదవ ముఖ్యాంశం పరలోకం పట్ల విశ్వాసం గురించి తెలుసుకుందాం.
పరలోకం అంటే ఏమిటి? పరలోకాన్ని విశ్వసించడానికి మన వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? పరలోకంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటి? పరలోకాన్ని విశ్వసిస్తే మనిషికి కలిగే ప్రయోజనము ఏమిటి? ఇవన్నీ ఇన్ షా అల్లాహ్ ఈ ప్రసంగంలో వస్తాయి.
ఆ హదీస్ మరొక్కసారి మనము విందాం. జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్తా, ఈమాన్ అంటే ఏమిటి అని ప్రశ్నించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇస్తూ, అల్లాహ్ ను విశ్వసించటం, దూతలను విశ్వసించటం, గ్రంథాలను విశ్వసించటం, ప్రవక్తలను విశ్వసించటం, పరలోకాన్ని విశ్వసించటం, విధివ్రాతను విశ్వసించటం అని సమాధానం ఇచ్చినప్పుడు, జిబ్రీల్ అలైహిస్సలాం వారు నిజమే అని ధ్రువీకరించారు కదండీ. ఆ ప్రకారంగా ఈమాన్ (విశ్వాసం) అంటే ఆరు విషయాలను విశ్వసించవలసి ఉంది కదండీ. అందులోని ఐదవ విషయం, పరలోకం పట్ల విశ్వాసం. ఈ పరలోకం పట్ల విశ్వాసం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మీ ముందర ఉంచుతున్నాను. ఇన్ షా అల్లాహ్, శ్రద్ధగా విని ఆచరించే ప్రయత్నము చేయండి.
పరలోకం అంటే ఏమిటి?
ముందుగా, పరలోకం అంటే ఏమిటి తెలుసుకుందాం. పరలోకం అంటే, మానవులందరూ కూడా మరణించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవులందరినీ ఒక రోజు మళ్ళీ బ్రతికిస్తాడు. ఆ రోజు వారి కర్మల లెక్కింపు జరుగుతుంది. ఎవరైతే సత్కార్యాలు ఎక్కువగా చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, వారికి బహుమానాలు ఇవ్వబడతాయి. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, వారికి శిక్షలు విధించటం జరుగుతుంది. ఇలా జరిగే దినాన్ని పరలోక దినం, లెక్కింపు దినం అని కూడా అంటూ ఉంటారు.
పరలోకానికి ఆధారాలు
పరలోకం ఉంది అని నమ్మటానికి ఆధారాలు మనము ఇప్పుడు చూచినట్లయితే, ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పదేపదే పరలోకం గురించి మరియు పరలోకంలో జరగబోయే విషయాల గురించి మనకు తెలియపరిచి ఉన్నాడు. హదీసులలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలలో కూడా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట పరలోకము మరియు పరలోకంలో జరగబోయే విషయాల ప్రస్తావన మనకు కనబడుతూ ఉంటుంది. ఒక ఉదాహరణ మీ ముందర ఉంచుతున్నాను చూడండి. ఖురాన్ గ్రంథము 23వ అధ్యాయము 15, 16 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:
ثُمَّ اِنَّكُمْ بَعْدَ ذٰلِكَ لَمَيِّتُوْنَ ثُمَّ اِنَّكُمْ يَوْمَ الْقِيٰمَةِ تُبْعَثُوْنَ ఆ తరువాత మీరంతా తప్పకుండా మరణిస్తారు. మరి ప్రళయ దినాన మీరంతా నిశ్చయంగా లేపబడతారు. (23:15-16)
ఈ రెండు వాక్యాలలో ప్రళయ దినం ప్రస్తావన కూడా వచ్చి ఉంది. మనిషి మరణించిన తర్వాత మళ్ళీ బ్రతికించబడతారు అనే ప్రస్తావన కూడా వచ్చి ఉంది. ఇలా చాలా వాక్యాలు ఉన్నాయి, చాలా హదీసులు, ఉల్లేఖనాలు ఉన్నాయి. తద్వారా, పరలోకము తప్పనిసరిగా ఉంది అని గ్రంథాల ద్వారా స్పష్టమవుతూ ఉంది. ప్రతి విశ్వాసి కూడా పరలోకాన్నే విశ్వసించటం తప్పనిసరి.
ఇక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే, పరలోకం సంభవిస్తుంది అని కూడా మనకు తెలుస్తుంది. అది ఎలాగంటే, మనం చూస్తూ ఉంటాం. చాలా చోట్ల ప్రపంచంలో, బలవంతులు, దౌర్జన్యపరులు నిరుపేదలపై, బలహీనులపై దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు. హత్యలు చేస్తూ ఉంటారు, అత్యాచారాలు చేస్తూ ఉంటారు, ప్రాణాలు తీసేసి ఇది ప్రమాదము అని చిత్రీకరిస్తూ ఉంటారు, అరాచకాలు సృష్టిస్తూనే ఉంటారు, కబ్జాల మీద కబ్జాలు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉంటే, మనం చూస్తూ ఉంటాం. బలహీనులు న్యాయం కావాలి అని ఎదురు చూస్తూనే ఉంటారు, కానీ వారికి ఎక్కడ కూడా న్యాయం దొరకదు, చివరికి వారు అలాగే బాధపడుతూనే మరణించి ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. బలవంతుల్లో కొందరు, రాజకీయ నాయకుల, అధికారుల అండదండలతో, ధనముతో తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. వారు చేసిన అరాచకాలకు శిక్షలు పడవు. ఏదో ఒక రకంగా పలుకుబడి ద్వారా వారు తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. చివరికి వారు కూడా ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు.
ప్రశ్న ఏమిటంటే, మరి అన్యాయానికి గురి అయిన ఈ పీడితులకు, దేవుడు కూడా న్యాయం చేయడా? అన్యాయము చేసి, అరాచకాలు సృష్టించిన ఈ దుర్మార్గులకు, దేవుడు కూడా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కూడా శిక్షించడా? అంటే, దానికి ఇస్లాం ఇచ్చే సమాధానం ఏమిటంటే, తప్పనిసరిగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు, మరియు అతనికి న్యాయం చేస్తాడు. అలాగే ప్రతి నేరస్తునికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని నేరానికి సరిపడేటట్టుగానే శిక్షిస్తాడు. ఎంతటి నేరము ఉంటుందో అంతటి కఠినమైన శిక్ష కూడా విధిస్తాడు. దీనికి సరైన ప్రదేశము పరలోకము.
పరలోకంలో నిరుపేద, ధనికుడు, బలహీనుడు, బలవంతుడు, రాజకీయ అండదండలు, ధనము, పలుకుబడి ఇవన్నీ ఏమీ గానీ ఉండవు, పనికిరావు కూడా. అక్కడ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు మరియు ప్రతి నేరస్తునికి అతని నేరానికి తగినంత శిక్ష కూడా విధిస్తాడు. ఆ రోజు న్యాయము స్థాపించబడుతుంది. ఆ ప్రకారంగా పరలోకము తప్పనిసరిగా సంభవిస్తుంది అని మనకు స్పష్టమవుతుంది మిత్రులారా.
పరలోకంలో జరిగే కొన్ని ముఖ్యమైన విషయాలు
పరలోకంలో ఏమేమి ఉంటాయి అనే విషయాలు మనం చూచినట్లయితే, చాలా విషయాలు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియపరిచి ఉన్నారు. కొన్ని విషయాలు మాత్రమే ఈ ప్రసంగంలో చెబుతున్నాను. ఇన్ షా అల్లాహ్, పరలోకంలో ఏమి జరుగుతుంది అనే ప్రసంగం వినండి, అందులో వివరాలు ఇన్ షా అల్లాహ్ మీకు దొరుకుతాయి. ఇక రండి, కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పరలోకంలో హషర్ మైదానము ఉంది. హషర్ మైదానము అంటే ఏమిటి? ప్రళయం సంభవించిన తర్వాత, యుగాంతము సంభవించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ భూమి ఆకాశాలను సృష్టిస్తాడు. ఆ రోజు భూమి ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక చదరపు మైదానములా, పాన్పు లాగా ఉంటుంది. ఆ మైదానంలో ఒక చెట్టు గానీ, ఒక గుట్ట గానీ, ఒక భవనము గానీ ఉండదు. ఆ మైదానంలో, ఆది మానవుడైన ఆదమ్ అలైహిస్సలాం వద్ద నుండి యుగాంతం సంభవించినంత వరకు ఎంతమంది మానవులైతే జన్మించి, మరణించారో వారందరినీ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ బ్రతికించి నిలబెడతాడు.
వారందరూ కూడా ఆ మైదానంలో నిలబడినప్పుడు, వారి వారి చేతికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. ఎవరైతే సత్కార్యాలు చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, కుడిచేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు వారి కర్మలను, వారి సత్కార్యాలను చూసి, చదివి సంతోషిస్తూ ఉంటారు, వారి మొహము ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, అరాచకాలు సృష్టించి ఉంటారో, ఎడమ చేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు చేసుకున్న పాపాలన్నీ వారు ఆ రోజు చదువుకుంటూ, ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. వారి మొహం ఆ రోజు నల్లబడిపోతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే, దానిని హషర్ మైదానము అని అంటారు.
అలాగే పరలోకంలో ఏముంది అని మనం చూచినట్లయితే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మీజాన్ ఉంచి ఉన్నాడు. మీజాన్ అంటే ఏమిటి? త్రాసు అని అర్థం. ఆ త్రాసులో ఏమి తూంచబడుతుంది అంటే, ప్రజల పుణ్యాలు, పాపాలు తూచబడతాయి. ఎవరి పుణ్యాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు విజేతలుగా నిలబడతారు. ఎవరి పాపాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు దోషులుగా నిలబడతారు. ఆ రోజు తుది నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాదే. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎవరిని మన్నించాలనుకుంటాడో వారిని మన్నిస్తాడు. మరి ఎవరినైతే శిక్షించాలనుకుంటాడో వారిని శిక్షిస్తాడు. నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చేతిలోనే ఉంటుంది. కాకపోతే, విశ్వాసం ప్రామాణికమైనది అవుతుంది కాబట్టి మిత్రులారా, ఆ రోజు రానున్నది. ప్రపంచంలోనే విశ్వసించండి, సత్కార్యాలు చేయండి అని మనకు తెలపబడింది. మొత్తానికి పరలోకంలో త్రాసు ఉంది, అందులో ప్రజల కర్మలు తూచబడతాయి.
అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జహన్నం సిద్ధం చేసి ఉంచాడు. జహన్నం అంటే నరకం అని అర్థం. నరకంలో ఏముంది అంటే, అది ఒక పెద్ద బావి, దాని నిండా అగ్ని ఉంది. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కారానికి పాల్పడి ఉంటారో, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అలాంటి వారిని శిక్షించడానికి నరకంలో పడవేస్తాడు. ఎవరు ఎన్ని ఘోరమైన నేరాలు, పాపాలు చేసి ఉంటారో, వారికి నరకంలో అంత కఠినమైన శిక్ష కూడా విధించబడుతుంది. అల్లాహ్ మన అందరికీ దాని నుండి, దాని శిక్షల నుండి రక్షించుగాక, ఆమీన్.
అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జన్నహ్, ఉర్దూలో జన్నత్, తెలుగులో స్వర్గం సిద్ధం చేసి ఉన్నాడు. స్వర్గంలో ఏమున్నాయి అంటే, అందులో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అనుగ్రహాలు అన్నీ ఉంచి ఉన్నాడు. ఆ అనుగ్రహాలు ఎవరికి దక్కుతాయి అంటే, ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు, పుణ్యాలు ఎక్కువగా చేసుకుని ఉంటారో, వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆ స్వర్గము ప్రసాదిస్తాడు. ఎవరు ఎన్ని ఎక్కువ పుణ్యాలు చేసుకొని ఉంటారో, వారు స్వర్గంలో అంత ఉన్నతమైన స్థానాలలో చేరుకుంటారు. స్వర్గంలో ఉన్నవారు, ప్రశాంతంగా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి భయము లేకుండా, సంతోషంగా జీవించుకుంటూ ఉంటారు. అలాంటి స్వర్గం అల్లాహ్ మన అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.
పరలోకంలో ఇంకా ఏమి ఉంటాయి అంటే, పరలోకంలో హౌదె కౌసర్ ఉంది, పరలోకంలో పుల్ సిరాత్ ఉంది, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మీరు పరలోకంలో ఏమి జరుగుతుంది, పరలోక విశేషాలు అనే ప్రసంగాలు వినండి, ఇన్ షా అల్లాహ్ తెలుస్తుంది. సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి, ఇక చివరులో మనము…
పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం
పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి అనేది ఇన్ షా అల్లాహ్ తెలుసుకొని మాటను ముగిద్దాం. పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటట? మనిషి పరలోకాన్ని విశ్వసించటం వలన దైవభీతితో జీవిస్తాడు. పుణ్యాలు బాగా చేసి, పరలోక అనుగ్రహాలు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. పాపాలు చేస్తే పరలోకంలో శిక్షలు తప్పవు అని భయపడుతూ ఉంటాడు. మరియు అలా భయపడటం వలన, అతను అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అలా చేయటం వలన సమాజంలో శాంతి నెలకొంటుంది.
ఒకసారి ఆలోచించి చూడండి. ప్రతి వ్యక్తి పరలోకాన్ని విశ్వసించి, పరలోకంలో ఉన్న అనుగ్రహాలను విశ్వసించి, పరలోకంలో ఉన్న శిక్షలను కూడా విశ్వసించి, వాటిని దృష్టిలో పెట్టుకుని జీవిస్తున్నప్పుడు, సత్కార్యాలు చేసుకుందాం, పుణ్యాలు సంపాదించుకుని స్వర్గానికి చేరుకుందాం అనుకుంటూ ఉంటే, అలాగే పాపాలు చేయవద్దు, చేస్తే నరకానికి వెళ్లి శిక్షలు అనుభవించవలసి ఉంటుంది కాబట్టి, వద్దు అయ్యా పాపాలు, నేరాలు అని దానికి దూరంగా ఉంటూ ఉంటే, ప్రతి వ్యక్తి ఆ విధంగా విశ్వసించి జీవించుకుంటే, అలాంటి సమాజము శాంతియుతంగా ఉంటుంది అని చెప్పటానికి ఇంకేమి కావాలి మిత్రులారా.
కాబట్టి, నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మన అందరికీ సంపూర్ణ విశ్వాసులుగా జీవించే భాగ్యం ప్రసాదించుగాక. నరక శిక్షల నుండి అల్లాహ్ మమ్మల్ని కాపాడి, స్వర్గవాసులుగా మమ్మల్ని అందరినీ స్వర్గానికి చేర్చుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఉజైర్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – “మరణించిన 100 సంవత్సరాలకు మళ్ళీ బతికిన వ్యక్తి” https://youtu.be/D1oAzBvsApU [32 నిముషాలు] వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో వక్త, బనీ ఇస్రాయీల్ ప్రవక్తలలో ఒకరైన ఉజైర్ (అలైహిస్సలాం) గారి అద్భుతమైన జీవిత చరిత్రను వివరించారు. ముఖ్యంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు మరణం ఇచ్చి 100 సంవత్సరాల తర్వాత తిరిగి ఎలా బ్రతికించారో, ఆ సమయంలో జరిగిన చారిత్రక పరిణామాలు (బాబిలోనియా రాజు నెబుకద్ నెజర్ ద్వారా జెరూసలేం నాశనం, తౌరాత్ గ్రంథం దహనం, యూదుల బానిసత్వం మరియు విడుదల) గురించి చర్చించారు. ఉజైర్ (అలైహిస్సలాం) నాశనమైన నగరాన్ని చూసి ఆశ్చర్యపోవడం, అల్లాహ్ ఆయనను 100 సంవత్సరాలు మృతునిగా ఉంచి తిరిగి లేపడం, ఆయన ఆహారం చెడిపోకుండా ఉండటం మరియు గాడిద ఎముకలు తిరిగి ప్రాణం పోసుకోవడం వంటి దృష్టాంతాలను ఖురాన్ వాక్యాల (సూర బఖరా 2:259) ద్వారా వివరించారు. అలాగే, యూదులు ఉజైర్ (అలైహిస్సలాం) ను దైవ కుమారుడిగా భావించి చేసిన మార్గభ్రష్టత్వాన్ని ఖండిస్తూ (సూర తౌబా 9:30), మరణానంతర జీవితం, పునరుత్థానం, మరియు అల్లాహ్ శక్తిసామర్థ్యాలపై విశ్వాసం ఉంచాలని ఈ ప్రసంగం ద్వారా బోధించారు.
الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ [అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్]
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్.
సోదర సోదరీమణులారా! మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
ప్రవక్త ఉజైర్ (అలైహిస్సలాం) పరిచయం
ఈనాటి ప్రసంగంలో మనము ఒక ప్రవక్త గురించి తెలుసుకోబోతున్నాము. ఆయన ప్రత్యేకత ఏమిటంటే, ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణం ఇచ్చి వంద సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రతికించాడు. ఎవరండీ ఆయన? ఆశ్చర్యకరంగా ఉంది కదా వింటూ ఉంటే. ఆయన మరెవరో కాదు ఆయనే ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం వారు.
ఉజైర్ అలైహిస్సలాం వారి ప్రస్తావన ఖురాన్ గ్రంథంలో రెండు సూరాలలో వచ్చి ఉంది. ఒకటి సూర బఖరా రెండవ సూరా, రెండవది సూర తౌబా తొమ్మిదవ సూరా. ఈ రెండు సూరాలలో ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం వారి ప్రస్తావన వచ్చి ఉంది. ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం బనీ ఇస్రాయీల్ ప్రజల వద్దకు పంపించబడిన ప్రవక్తలలో ఒక ప్రవక్త.
బనీ ఇస్రాయీల్ చారిత్రక నేపథ్యం
ఆయన బనీ ఇస్రాయీల్ ప్రజల వద్దకు పంపించబడే సరికి, బనీ ఇస్రాయీల్ ప్రజల్లోని అధిక శాతం ప్రజలు కనుమరుగైపోయారు లేదా బానిసత్వానికి గురైపోయారు. అల్-ఖుద్స్ నగరంలో, పాలస్తీనా దేశంలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే బనీ ఇస్రాయీల్ వారు మిగిలి ఉన్నారు. అంతే కాదండీ, వారు నివసిస్తున్న పట్టణము కూడా నేలమట్టం అయిపోయింది. వారు ఎంతగానో పవిత్రంగా భావించే బైతుల్ మఖ్దిస్ కూడా నేలమట్టం అయిపోయింది. అలా ఎందుకు జరిగిందంటే, దాన్ని తెలుసుకోవడానికి బనీ ఇస్రాయీల్ వారి క్లుప్తమైన చరిత్ర మనము దృష్టిలో ఉంచుకోవాలి.
సులైమాన్ అలైహిస్సలాం వారి మరణానంతరం పరిస్థితులన్నీ తలకిందులైపోయాయి. సులైమాన్ అలైహిస్సలాం వారి సంతానంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయం కలిగింది. వారు ఎంతో పటిష్టంగా ఉన్న వారి సామ్రాజ్యాన్ని రెండు ముక్కలు చేసుకున్నారు. ఒక తమ్ముడు సగ భాగాన్ని, మరో తమ్ముడు సగ భాగాన్ని పంచుకొని, ఒక భాగానికి ‘ఇస్రాయీల్ రాజ్యం‘ అని పేరు పెట్టుకున్నారు, దానికి సామరియా రాజధాని అయ్యింది. మరో భాగానికి ‘యహూదా రాజ్యం’ అని పేరు పెట్టుకున్నారు, దానికి యెరూషలేము రాజధాని అయ్యింది.
అయితే ఆ తర్వాత ఇస్రాయీల్ లో ఉన్న బనీ ఇస్రాయీల్ ప్రజలు తొందరగా మార్గభ్రష్టత్వానికి గురైపోయారు. విగ్రహారాధనకు పాల్పడ్డారు, ‘బాల్‘ అనే విగ్రహాన్ని ఆరాధించారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడికి ప్రవక్తల్ని పంపించాడు. హిజ్కీల్ అలైహిస్సలాం వారు వచ్చారు, ఇలియాస్ అలైహిస్సలాం వారు వచ్చారు, అల్-యస అలైహిస్సలాం వారు వచ్చారు. ప్రవక్తలు వచ్చి వారికి చక్కదిద్దేటట్టు ప్రయత్నం చేసినా, దైవ వాక్యాలు బోధించినా, అల్లాహ్ వైపు పిలిచినా, వారు మాత్రము పాపాలను వదలలేదు, విగ్రహారాధనను కూడా వదలలేదు, మార్గభ్రష్టులుగానే మిగిలిపోయారు.
చివరికి ఏమైందంటే, పక్కనే ఉంటున్న ఆషూరీయులు వచ్చి ఇస్రాయీల్ సామ్రాజ్యం మీద యుద్ధం ప్రకటించి ఆ రాజ్యాన్ని వశపరుచుకున్నారు. ఆ ప్రకారంగా బనీ ఇస్రాయీల్ ప్రజలు రెండు భాగాలుగా విడిపోయి ఉన్న ఆ రెండు రాజ్యాలలో నుంచి ఒక రాజ్యము ఆషూరీయుల చేతికి వెళ్ళిపోయింది.
బైతుల్ మఖ్దిస్ విధ్వంసం
అయితే ఆశూరీయులు మిగిలిన రెండవ భూభాగాన్ని కూడా ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేసినా వారి పప్పులు ఉడకలేదు. ఎందుకంటే ఇక్కడ దైవభీతి మిగిలి ఉండింది కాబట్టి. కానీ కొద్ది రోజులు గడిచాక ఇక్కడ పరిస్థితులు కూడా మళ్ళీ మారిపోయాయి. ఇక్కడ ప్రజలు కూడా మార్గభ్రష్టత్వానికి గురైపోయారు, పాపాల్లో మునిగిపోయారు. అలాంటప్పుడు ఇరాక్ దేశము నుండి, బాబిలోనియా నుండి నెబుకద్ నెజరు (అరబ్బీలో ‘బుఖ్తె నసర్‘) అనే రాజు సైన్యాన్ని తీసుకొని వచ్చి యహూదా దేశం మీద, రాజ్యం మీద దాడి చేశాడు. యుద్ధం ప్రకటించి బనీ ఇస్రాయీల్ వారిని ఊచకోత కోశాడు. అలాగే బనీ ఇస్రాయీల్ వారి ఆస్తుల్ని ధ్వంసం చేయటంతో పాటు, వారు ఎంతగానో పవిత్రంగా భావించే బైతుల్ మఖ్దిస్ ని కూడా నేలమట్టం చేసేశాడు. వారు ఎంతో గౌరవంగా చదువుకునే, ఆచరించుకునే పవిత్రమైన గ్రంథం తౌరాత్ ని కూడా అతను కాల్చేశాడు.
బనీ ఇస్రాయీల్ ప్రజల్ని అయితే ముందు చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా హతమార్చాడు. తర్వాత ఎవరెవరైతే పనికొస్తారు అని అతను భావించాడో వారిని బానిసలుగా ఇరాక్ దేశానికి, బాబిలోనియా పట్టణానికి తీసుకెళ్లిపోయాడు. ఎవరితో అయితే నాకు అవసరం లేదులే వీళ్ళతో అని అనుకున్నాడో, అలాంటి వారిని మాత్రము అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే మిత్రులారా! ఆ ప్రకారంగా బనీ ఇస్రాయీల్ ప్రజలు, ముందు ఇస్రాయీల్ సామ్రాజ్యాన్ని ఆషూరీయుల చేతికి అప్పగించాల్సి వచ్చింది, యహూదా సామ్రాజ్యాన్ని నెబుకద్ నెజరు రాజుకి అప్పగించాల్సి వచ్చింది
ఆ ప్రకారంగా వారి రెండు రాజ్యాలు కూడా రెండు వేరు వేరు శత్రువులు లాక్కున్నారు. అలాగే జయించి వశపరచుకున్నారు. మళ్ళీ బనీ ఇస్రాయీల్ ప్రజలు పరాభవానికి గురి అయ్యి ఉన్నారు, బానిసలుగా మార్చబడి ఉన్నారు. ఎంతో కొంతమంది మాత్రమే అక్కడ మిగిలిపోయి ఉన్నారు. అలాంటి పరిస్థితిలో, పట్టణము కూల్చబడి ఉంది, పుణ్యక్షేత్రము కూల్చబడి ఉంది, ప్రజలు కూడా చెల్లాచెదురైపోయి ఉన్నారు, బానిసలుగా మార్చబడి ఉన్నారు, ఎంతో కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు. అలాంటి స్థితిలో ఉజైర్ అలైహిస్సలాం వారు వచ్చారు.
వంద సంవత్సరాల మరణం యొక్క సంఘటన
ఆయన మామూలుగా పొలం వద్ద పని కోసము గాడిద మీద కూర్చొని బయలుదేరి వెళ్లారు. వెళ్లి అక్కడ పొలం పనులన్నీ ముగించుకొని కొన్ని ద్రాక్ష పండ్లు, అలాగే అత్తి పండ్లు తీసుకొని మళ్ళీ అదే గాడిద మీద కూర్చొని తిరిగి ఇంటికి పయనమయ్యారు. వస్తూ వస్తూ ఒకచోట లోయలోకి ప్రవేశించి కాసేపు నీడలో సేద తీరుదాము అని ఒక గోడ నీడలో లేదా ఒక చెట్టు నీడలో ఆయన కూర్చోవడానికి ప్రయత్నిస్తూ, ఆయన వద్ద ఉన్న గాడిదను ఒకచోట కట్టేశారు.
తర్వాత నీడలో కూర్చొని ఆయన వద్ద ఉన్న ద్రాక్ష పండ్లను ముందుగా ఒక పాత్రలో పిండారు. ఆ ద్రాక్ష రసంలో కొన్ని రొట్టె ముక్కలు నాన్చడానికి ఉంచారు. ఆ రొట్టెలు నానే వరకు ఆయన గోడను లేదా చెట్టుని అలా వీపుతో ఆనుకొని, కంటి ముందర కనిపిస్తున్న దృశ్యాలను చూడసాగారు. ముందర పాడుబడిపోయిన పట్టణము, కూల్చబడిన పట్టణము, కూల్చబడిన పుణ్యక్షేత్రము అవి దర్శనమిస్తున్నాయి. అవి చూస్తూ ఉంటే, ఊహించని రీతిలో, అనుకోకుండా ఆయన ప్రమేయం లేకుండానే ఆయన నోటి నుండి ఒక మాట వచ్చింది. ఏంటి ఆ మాట అంటే:
أَنَّىٰ يُحْيِي هَٰذِهِ اللَّهُ بَعْدَ مَوْتِهَا [అన్నా యుహ్ యీ హాజిహిల్లాహు బాద మౌతిహా] దీని చావు తర్వాత అల్లాహ్ తిరిగి దీనికి ఎలా ప్రాణం పోస్తాడు? (ఖుర్ఆన్, 2:259)
అంటే ఈ నగరం మొత్తం పాడుబడిపోయింది కదా, మళ్ళీ ప్రజల జీవనంతో ఈ నగరం కళకళలాడాలంటే ఇది సాధ్యమవుతుందా? అని ఆశ్చర్యం వ్యక్తపరిచారు. అనుమానం వ్యక్తపరచలేదు, ఇది ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఉజైర్ అలైహిస్సలాం వారు గొప్ప దైవభీతిపరులు, గ్రంథ జ్ఞానము కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి అల్లాహ్ తో ఇది సాధ్యమేనా అని అనుమానము, సందేహము ఎప్పుడూ వ్యక్తపరచరు. అల్లాహ్ శక్తి మీద ఆయనకు పూర్తి నమ్మకం ఉంది. ఆశ్చర్యం వ్యక్తపరిచారు – ఇది ఎప్పుడు అవుతుంది? ఎలా అవుతుంది? ఇప్పట్లో ఇది అయ్యే పనేనా? అనేటట్టుగా ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే ఆయన ఏ స్థితిలో అయితే నీడలో అలా వీపు ఆంచుకొని కూర్చొని ఉన్నారో, అదే స్థితిలో ఆయనకు మరణం ఇచ్చేశాడు. ఎన్ని సంవత్సరాల వరకు ఆయన అదే స్థితిలో ఉన్నారు అంటే, వంద సంవత్సరాల వరకు ఆయన అదే స్థితిలో ఉన్నారు.
فَأَمَاتَهُ اللَّهُ مِائَةَ عَامٍ [ఫ అమాతహుల్లాహు మిఅత ఆమిన్] “అల్లాహ్ అతన్ని నూరేళ్ళ వరకు మరణ స్థితిలో ఉంచాడు.” (ఖుర్ఆన్, 2:259)
ఖురాన్ లో నూరేళ్ళ వరకు ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అదే స్థితిలో ఉంచాడు అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది.
యూదుల విముక్తి మరియు జెరూసలేం పునర్నిర్మాణం
అయితే 100 సంవత్సరాలు ఆయన అదే స్థితిలో ఉన్నారు కదా, మరి ఈ 100 సంవత్సరాలలో ఏమి జరిగిందంటే చాలా ముఖ్యమైన విషయాలు చోటు చేసుకున్నాయి. ఏమి జరిగిందంటే, నెబుకద్ నెజరు బనీ ఇస్రాయీల్ వారి మీద దాడి చేసి, పుణ్యక్షేత్రం కూల్చేసి, గ్రంథము కాల్చేసి, బనీ ఇస్రాయీల్ వారిని పురుషుల్ని అలాగే మహిళల్ని బానిసలుగా మార్చి ఇరాక్ దేశానికి, బాబిలోనియా పట్టణానికి పట్టుకెళ్లిపోయాడు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే…
పక్కనే ఉన్న పార్షియా దేశం (ఇరాన్ దేశం అని మనం అంటున్నాం కదా), ఆ పార్షియా దేశానికి చెందిన రాజు ఇరాక్ దేశం మీద యుద్ధం ప్రకటించాడు. యుద్ధం చేసి ఇరాక్ దేశాన్ని జయించేశాడు. ఇరాక్ దేశము ఇప్పుడు పార్షియా దేశ రాజు చేతికి వచ్చేసింది. ఆ పార్షియా దేశము (అనగా ఇరాన్ దేశపు రాజు) ఇరాక్ దేశాన్ని కూడా జయించిన తర్వాత, అక్కడ బానిసలుగా నివసిస్తున్న యూదులను స్వతంత్రులుగా చేసేసి, “మీరు మీ సొంతూరికి, అనగా పాలస్తీనా దేశానికి, అల్-ఖుద్స్ నగరానికి తిరిగి వెళ్లిపోండి” అని అనుమతి ఇచ్చేశాడు.
చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము 50-60 సంవత్సరాల తర్వాత ఆ రాజు ద్వారా బనీ ఇస్రాయీల్ ప్రజలకి మళ్ళీ బానిసత్వం నుండి స్వతంత్రం లభించింది. అప్పుడు వారందరూ కూడా స్వతంత్రులై బాబిలోనియా పట్టణాన్ని వదిలేసి, మళ్ళీ పాలస్తీనాలో ఉన్న అల్-ఖుద్స్ నగరానికి పయనమయ్యారు. అయితే ఈ 50-60 సంవత్సరాలలో వారు భాష మర్చిపోయారు, సంప్రదాయాలు మర్చిపోయారు, ధర్మ ఆదేశాలు కూడా చాలా శాతము మర్చిపోయారు. సరే ఏది ఏమైనప్పటికీ వాళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వచ్చి అక్కడ మళ్ళీ నివాసం ఏర్పరచుకున్నారు. ఆ ప్రకారంగా కూల్చివేయబడిన ఆ పట్టణము, నగరము మళ్ళీ ప్రజల నివాసంతో కళకళలాడటం ప్రారంభించింది. ఇలా వంద సంవత్సరాల లోపు జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు చోటు చేసుకున్న తర్వాత, అప్పుడు రెండవసారి మళ్ళీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉజైర్ అలైహిస్సలాం వారికి మళ్ళీ బ్రతికించాడు.
చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము ఆయన మరణించే సమయానికి ఆయన వయస్సు 40 సంవత్సరాలు ఉండింది. 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రతికించబడుతున్నప్పుడు కూడా ఆయన 40 సంవత్సరాల వయసులో ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా, అదే శక్తితో, అదే శరీరంతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను మళ్ళీ బ్రతికించాడు.
దూత రాక మరియు గాడిద పునరుత్థానం
దూత వచ్చాడు. దూత వచ్చి ఆయనను లేపి:
قَالَ كَمْ لَبِثْتَ [ఖాల కమ్ లబిస్త] “నీవు ఎంత కాలం ఈ స్థితిలో ఉన్నావు?” అని అడిగాడు. (ఖుర్ఆన్, 2:259)
ఉజైర్ అలైహిస్సలాం వారు లేచి ముందు అటూ ఇటూ చూశారు. చూస్తే గాడిద కనిపించట్లేదు. గాడిద బంధించిన చోట పాడుబడిపోయిన ఎముకలు కనిపిస్తున్నాయి. 100 సంవత్సరాలు గడిచిన విషయం ఆయనకు తెలియదు. ఈ 100 సంవత్సరాలలో గాడిద చనిపోయింది, ఎముకలు కూడా పాడుబడిపోయాయి, కొన్ని పాడుబడిన ఎముకలు కనిపిస్తున్నాయి. పక్కనే ఉంచబడిన ద్రాక్ష రసంలో ఉంచబడిన రొట్టె ముక్కలు, అవి మాత్రము తాజాగా అలాగే ఉన్నాయి, ఫ్రెష్ గా ఉన్నాయి. ఆహారాన్ని చూస్తూ ఉంటే, ఇప్పుడే కొద్దిసేపు ఏమో నేను అలా పడుకొని లేచానేమో అనిపిస్తూ ఉంది. గాడిదను చూస్తూ ఉంటే అసలు గాడిద కనిపించట్లేదు. కాబట్టి వెంటనే ఆయన ఏమన్నారంటే:
لَبِثْتُ يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ [లబిస్తు యౌమన్ ఔ బాద యౌమ్] “ఒక రోజు లేదా ఒక రోజులో కొంత భాగం మాత్రమే నేను ఈ స్థితిలో ఉన్నాను” అని చెప్పారు. (ఖుర్ఆన్, 2:259)
ఆహారాన్ని చూసి ఆయన ఆ విధంగా అనుమానించారు. అయితే దూత వచ్చి:
بَل لَّبِثْتَ مِائَةَ عَامٍ [బల్ లబిస్త మిఅత ఆమ్] “కాదు, నీవు ఈ స్థితిలో వంద సంవత్సరాలు ఉన్నావయ్యా” (ఖుర్ఆన్, 2:259)
అని చెప్పి, “చూడండి మీ గాడిద మరణించి ఎముకలు ఎముకలైపోయింది. మీ కళ్ళ ముందరే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దానిని మళ్ళీ బ్రతికిస్తాడు చూడండి” అని చెప్పగానే, అల్లాహ్ నామంతో పిలవగానే ముందు ఎముకలు తయారయ్యాయి. ఎముకలు జోడించబడ్డాయి. ఆ ఎముకల మీద మాంసము జోడించబడింది. ఆ తర్వాత దానికి ప్రాణము వేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఉజైర్ అలైహిస్సలాం వారి కళ్ళ ముందరే ఎముకలుగా మారిపోయిన ఆ గాడిద మళ్ళీ జీవించింది. అప్పుడు ఉజైర్ అలైహిస్సలాం వారు అదంతా కళ్ళారా చూసి వెంటనే ఈ విధంగా పలికారు:
قَالَ أَعْلَمُ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ [ఖాల ఆలము అన్నల్లాహ అలా కుల్లి షైఇన్ ఖదీర్] “అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడని నాకు తెలుసు” అని ఉజైర్ అన్నారు. (ఖుర్ఆన్, 2:259)
ఈ ప్రస్తావన మొత్తము ఖురాన్ గ్రంథము రెండవ అధ్యాయము 259వ వాక్యంలో వివరంగా తెలుపబడి ఉంది.
కుటుంబంతో తిరిగి కలయిక
సరే, 100 సంవత్సరాల తర్వాత ఆయన బ్రతికారు, పట్టణం ప్రజలతో కళకళలాడుతూ ఉంది, పట్టణం పూర్తిగా మళ్ళీ నిర్మించబడి ఉంది, పుణ్యక్షేత్రము కూడా మళ్ళీ నిర్మించబడి ఉంది. గాడిద మీద కూర్చొని ఆయన పట్టణానికి వెళ్లారు.
పట్టణానికి వెళ్ళినప్పుడు చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, ఆయన మరణించేటప్పుడు ఆయన ఇంటిలో ఒక సేవకురాలు ఉండేది, అప్పుడు ఆవిడ వయస్సు 20 సంవత్సరాలు. ఇప్పుడు ఈయన 100 సంవత్సరాల తర్వాత వెళ్తున్నారంటే ఆవిడ వయస్సు ఎంత అయి ఉంటుందండి? 20 + 100, కలిపితే 120 సంవత్సరాలకు చేరుకొని ఉంది. ఆవిడ పూర్తిగా ముసలావిడగా మారిపోయి, వృద్ధాప్యానికి గురయ్యి, కంటిచూపు దూరమైపోయింది, కాళ్ళు కూడా పడిపోయి ఉన్నాయి. ఆవిడ ఒక మంచానికే పరిమితమైపోయి ఉంది.
ఆవిడ వద్దకు ముందు ఉజైర్ అలైహిస్సలాం వారు వెళ్ళారు. వెళ్లి “అమ్మా నేను ఉజైర్ ని” అంటే, ‘ఉజైర్’ అన్న పేరు వినగానే ఆవిడ బోరున ఏడ్చేసింది. “ఎన్నో సంవత్సరాల క్రితము మా యజమాని ఉండేవారు” అని ఏడుస్తూ ఉంటే, “అమ్మా నేనే మీ యజమాని ఉజైర్ ని” అని చెప్పారు. అప్పుడు ఆ మహిళ, “అరె! 100 సంవత్సరాల తర్వాత వచ్చి మీరు నా యజమాని అంటున్నారు, ఎలాగండి నేను నమ్మేది? ఉజైర్ గొప్ప భక్తుడు. ఆయన ప్రార్థన చేస్తే, దుఆ చేస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తప్పనిసరిగా ఆమోదించేవాడు. మీరు ఉజైర్ అయితే, నాకు కంటిచూపు మళ్ళీ రావాలని, అలాగే చచ్చుబడిపోయిన నా కాళ్ళు మళ్ళీ ఆరోగ్యంగా మారాలని దుఆ చేయండి” అని కోరారు.
ఉజైర్ అలైహిస్సలాం వారు దుఆ చేశారు. దుఆ చేయగా ఆవిడకు కంటిచూపు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తిరిగి ఇచ్చేశాడు, ఆవిడ కాళ్ళు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ నయం చేసేశాడు. అప్పుడు ఆవిడ లేచి, ఉజైర్ అలైహిస్సలాం వారిని చూసి, చెయ్యి పట్టుకొని, “నేను సాక్ష్యం ఇస్తున్నాను ఈయనే ఉజైర్ అలైహిస్సలాం” అని సాక్ష్యం ఇచ్చారు.
తర్వాత “రండయ్యా మీ ఇంటిని చూపిస్తాను, మీ కుటుంబీకుల్ని చూపిస్తాను” అని ఉజైర్ అలైహిస్సలాం వారిని వెంటబెట్టుకొని ఉజైర్ అలైహిస్సలాం వారి ఇంటికి వెళితే, అప్పుడు కుటుంబ సభ్యులలో ఉజైర్ అలైహిస్సలాం వారి కుమారులు ఉన్నారు. వారి వయస్సు కూడా 100 దాటిపోతూ ఉంది. ఉజైర్ అలైహిస్సలాం వారిని ఇంటి బయట నిలబెట్టి, ఆవిడ ఇంటిలోనికి ప్రవేశించి ఉజైర్ అలైహిస్సలాం వారి కుమారుల వద్దకు వెళ్లి, “మీ నాన్నగారు వచ్చారు” అంటే వారందరూ షాక్ అయ్యారు. అవాక్కయిపోయారు. “అదేమిటి 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో కనుమరుగైపోయిన మా తండ్రి ఇప్పుడు తిరిగి వచ్చారా ఇంటికి?” అని వారు షాక్ అయిపోతూ ఉంటే, “అవునండీ, చూడండి నాకు కంటిచూపు ఉండేది కాదు, నాకు కాళ్ళు కూడా చచ్చుబడిపోయి ఉండేవి. కానీ ఆయన వచ్చి ప్రార్థన చేయగా నాకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కంటిచూపు ఇచ్చాడు, కాళ్ళను నయం చేశాడు. నేను మళ్ళీ ఆరోగ్యంగా తిరగగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను. చూడండి బయట ఉన్నారు” అని చెప్పగానే, వచ్చి ఉజైర్ అలైహిస్సలాం వారిని మళ్ళీ ఇంట్లోకి ఆహ్వానించగా, ముందుగా కుమారులు ఆశ్చర్యపడ్డారు.
సందేహం వ్యక్తపరుస్తూ ఒక కుమారుడు ఏమన్నాడంటే, “చూడండి మా నాన్నగారికి భుజం పక్కన మచ్చ లాంటి ఒక గుర్తు ఉండేది, అది ఉందేమో చూడండి” అన్నారు. ఉజైర్ అలైహిస్సలాం వారు బట్టలు కొంచెం పక్కకు జరిపి చూపియగా, అక్కడ నిజంగానే ఆ మచ్చ లాంటి గుర్తు కనిపించింది. అప్పుడు కుటుంబ సభ్యులు ఉజైర్ అలైహిస్సలాం వారిని “ఈయనే మా తండ్రి” అని గ్రహించారు.
తౌరాత్ గ్రంథం పునరుద్ధరణ
అయితే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము ఉజైర్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 40 సంవత్సరాల వ్యక్తి లాగే సిద్ధం చేశాడు. వారి కుమారులు మాత్రము 100 సంవత్సరాలు చేరుకున్న వృద్ధుల్లా కనిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఇలా సంఘటన జరిగిన తర్వాత ఉజైర్ అలైహిస్సలాం వారు మళ్ళీ నగరంలోకి వచ్చారు, నగర ప్రజల్ని ప్రోగు చేశారు. ప్రోగు చేసి “ఎవరెవరికి తౌరాత్ గ్రంథంలోని వాక్యాలు కంఠస్థమై ఉన్నాయో, ఎన్ని కంఠస్థమై ఉంటే వారు వచ్చి నాకు వినిపించండి” అని పిలుపునిచ్చారు. ఎవరెవరికి ఎన్ని వాక్యాలు కంఠస్థం చేయబడి ఉన్నాయో వారందరూ వచ్చి ఉజైర్ అలైహిస్సలాం వారికి వారు కంఠస్థం చేసిన ఆ తౌరాత్ గ్రంథంలోని దైవ వాక్యాలు వినిపించారు.
అప్పుడు ఉజైర్ అలైహిస్సలాం వారు ఒక చెట్టు నీడలో కూర్చొని, ఇతర వ్యక్తుల నోట విన్న వాక్యాలు, ఆయన స్వయంగా కంఠస్థం చేసిన వాక్యాలు అన్నీ కూడా మళ్ళీ రచించారు. ఆ ప్రకారంగా మళ్ళీ తౌరాత్ గ్రంథం (నెబుకద్ నెజరు రాజు దాన్ని కాల్చేసి వెళ్లిపోయాడని చెప్పాము కదా), ఆ కాలిపోయి కనుమరుగైపోయిన తౌరాత్ గ్రంథంలోని వాక్యాలను, ఎవరెవరు ఎంత కంఠస్థం చేసి ఉన్నారో అన్ని వాక్యాలు మళ్ళీ తిరిగి ఉజైర్ అలైహిస్సలాం వారు రచించారు. రచించి ప్రజలకు గ్రంథము ఇవ్వడంతో పాటు ఆ గ్రంథంలోని వాక్యాలు, వాటి సారాంశము ప్రజలకు బోధించడం ప్రారంభించారు.
యూదుల మార్గభ్రష్టత్వం మరియు దైవ కుమారుని వాదన
ఆ తర్వాత ఉజైర్ అలైహిస్సలాం వారు ఎన్ని సంవత్సరాలు జీవించారు అంటే, చరిత్రలో ప్రామాణికమైన ఆధారాలు మనకు ఎక్కడా దొరకలేదు. ఆయన మాత్రము మరణించారు. ఎప్పుడు మరణించారు? ఎన్ని సంవత్సరాల వయసులో మరణించారు? ఏ విధంగా ఆయన మరణం సంభవించింది? అన్న వివరాలు మాత్రము ప్రామాణికమైన ఆధారాలలో మనకు ఎక్కడా దొరకలేదు. అయితే ఆయన సమాధి మాత్రము ‘డమస్కస్’ నగరంలో నేటికీ ఉంది అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.
ఆయన మరణానంతరం చోటు చేసుకున్న పరిస్థితుల్ని మనం చూసినట్లయితే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం, ఉజైర్ అలైహిస్సలాం వారు జీవించినన్ని రోజులు ప్రజలు ఆయనను ఒక బోధకునిగా గౌరవించారు. ఆయన మరణించిన తర్వాత… ఆయన 100 సంవత్సరాలు మరణించి మళ్ళీ జీవించారన్న ఒక అభిప్రాయం ఉండేది, ఆయన దుఆతో ప్రజల సమస్యలు తీరాయని మరొక అభిప్రాయం ఉండేది, అలాగే ఆయన గ్రంథాన్ని రచించి ప్రజలకు వినిపించారు, ఇచ్చారు అనే మరో అభిప్రాయం ఉండింది. ఇలా అనేక అభిప్రాయాల కారణంగా ఉజైర్ అలైహిస్సలాం వారి గౌరవంలో బనీ ఇస్రాయీల్ ప్రజలు హద్దు మీరిపోయారు. ఆ గౌరవంలో, అభిమానంలో ఏకంగా ఉజైర్ అలైహిస్సలాం వారిని “దైవ కుమారుడు” అని చెప్పటం ప్రారంభించారు. తర్వాత అదే వారి విశ్వాసంగా మారిపోయింది, “ఉజైర్ దైవ కుమారుడు” అని నమ్మటం ప్రారంభించారు. వారి ఈ నమ్మకం సరికాదు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలోని తొమ్మిదవ అధ్యాయం, 30వ వాక్యంలో స్పష్టంగా ఖండించి ఉన్నాడు.
“ఉజైర్ అల్లాహ్ కుమారుడు” అని యూదులు అంటున్నారు. “మసీహ్ (క్రీస్తు) అల్లాహ్ కుమారుడు” అని క్రైస్తవులు అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ పూర్వీకులలోని అవిశ్వాసులు చెప్పిన మాటలనే వీళ్ళు అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నాశనం చేయుగాక! సత్యం నుండి వారెలా తిరిగిపోతున్నారో చూడండి. (ఖుర్ఆన్, 9:30)
అంటే ఈ వాక్యాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారు నమ్ముతున్న నమ్మకాన్ని ఖండిస్తూ, ఇది నిజము కాదు, వారు కల్పించుకున్న కల్పితాలు మాత్రమే, వారి నోటి మాటలు మాత్రమే అని స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు.
ఉజైర్ (అలైహిస్సలాం) మరియు చీమల సంఘటన (హదీసు ప్రస్తావన)
ఉజైర్ అలైహిస్సలాం వారి గురించి ఒక హదీసులో పరోక్షంగా ప్రస్తావన వచ్చి ఉంది. బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఒక హదీసు ఉందండి. ఆ హదీసు ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:
‘పూర్వము ఒక ప్రవక్త ఉండేవారు. ఆయన వెళుతూ ఉంటే ఒకచోట కూర్చున్నప్పుడు, ఆయనకు ఒక చీమ కరిచింది. చీమ కరిచినప్పుడు ఆయన కోపగించుకొని, కోపంతో చీమ పుట్టను త్రవ్వేసి, ఆ పుట్టలో ఉన్న చీమలన్నింటినీ దహనం చేసేశారు.వెంటనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ ప్రవక్త వద్దకు వహీ (దైవవాణి) పంపించాడు. ‘నీకు హాని కలిగించింది, నీకు కుట్టింది ఒక చీమ కదా. నీకు కోపం ఉంటే ఒక చీమను చంపుకోవాలి. కానీ, పూర్తి పుట్టలో ఉన్న చీమలన్నింటినీ దహనం చేసేయటము, కాల్చేయటం ఏమిటి?’ అని ఒక ఉల్లేఖనంలో ఉంది.
మరో ఉల్లేఖనంలో ఈ విధంగా తెలుపబడి ఉంది: ‘నీకు ఒక్క చీమ కుట్టిందన్న సాకుతో, నీవు ఆ పుట్టలో ఉన్న చీమలన్నింటినీ దహనం చేసేశావు. వాస్తవానికి ఆ సమూహము అల్లాహ్ ను స్మరించేది (తస్బీహ్ చేసేది). అల్లాహ్ ను స్మరించే ఒక సమూహాన్ని ఒక్క చీమ కుట్టిన కారణంగా నీవు దహనం చేశావేమిటి?’ అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆక్షేపించాడు.’
మరి ఎవరి గురించి ఇక్కడ ప్రస్తావన ఉంది అంటే ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు మరియు హసన్ బస్రీ రహిమహుల్లా వారు ఏమంటున్నారు అంటే, ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఆ ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం అని తెలియజేసి ఉన్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.
ఉజైర్ అలైహిస్సలాం ఏ కాలానికి చెందిన వారు అంటే చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, సులైమాన్ అలైహిస్సలాం మరియు ఈసా అలైహిస్సలాం వీరిద్దరి మధ్యలో వచ్చిన ప్రవక్త. అలాగే మరికొంతమంది ధార్మిక పండితులు ఏమంటున్నారు అంటే, ఉజైర్ అలైహిస్సలాం వారు ప్రవక్త కాదు, ఆయన గొప్ప భక్తుడు, గ్రంథ జ్ఞాని అని అంటున్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.
ఇది ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర. ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనము గ్రహించాల్సిన పాఠాలు ఏమిటి అనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకొని మాటను ముగిస్తాను.
పాఠాలు మరియు గుణపాఠాలు
1. అల్లాహ్ మృతులను తిరిగి బ్రతికించగలడు:
ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం గ్రహించాల్సిన మొదటి విషయం ఏమిటంటే, మృతులను మళ్ళీ బ్రతికించేవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అన్న విషయం ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనకు స్పష్టంగా తెలుపబడింది. ఉజైర్ అలైహిస్సలాం వారు 100 సంవత్సరాల కోసము మరణించి, 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ అల్లాహ్ ఆజ్ఞతో జీవించబడ్డారు, మళ్ళీ బ్రతికించబడ్డారు. చూసారా? మొదటిసారి ప్రాణం పోసిన ఆయన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఆయనకు 100 సంవత్సరాల కోసం మరణం ఇచ్చి, 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనకు బ్రతికించి ప్రాణం పోసి నిలబెట్టాడు. కాబట్టి మానవులను మళ్ళీ పుట్టించగల శక్తి అల్లాహ్ కు ఉంది అని ఈ ఉజైర్ అలైహిస్సలాం వారి ద్వారా మనకు స్పష్టం చేయబడింది.
ఖురాన్ గ్రంథం 36వ అధ్యాయం, 78-79 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు.
“కుళ్లి కృశించి పోయిన ఎముకలను ఎవడు బ్రతికిస్తాడు?” అని వాడు (మానవుడు) సవాలు విసురుతున్నాడు. వారికి సమాధానం ఇవ్వు, “వాటిని తొలిసారి సృష్టించినవాడే మలిసారి కూడా బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు.” (ఖుర్ఆన్, 36:78-79)
తొలిసారి పుట్టించిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మలిసారి కూడా పుట్టించగలుగుతాడు, ఆయనకు అలా చేయటం చాలా సులభం అని తెలుపబడటం జరిగింది. ఖురాన్ లో ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇబ్రహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ తో, “నీవు మరణించిన వారిని మళ్ళీ ఎలా బ్రతికిస్తావు?” అని అడిగినప్పుడు, పక్షుల్ని తీసుకొని వాటి ఎముకల్ని అటూ ఇటూ పడవేయ్యండి, తర్వాత అల్లాహ్ పేరుతో పిలవండి, అవి మళ్ళీ బ్రతికి వస్తాయి అని చెప్పగా, ఆయన అలాగే చేశారు. అల్లాహ్ పేరుతో పిలవగానే ఎముకలుగా మార్చబడిన ఆ పక్షులు మళ్ళీ పక్షుల్లాగా జీవించి ఎగురుకుంటూ ఆయన వద్దకు వచ్చాయి.
అలాగే హిజ్కీల్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో, ఇంచు మించు 35 వేల మంది లోయలో మరణించారు. ప్రవక్త కళ్ళ ముందరే మళ్ళీ వారు బ్రతికించబడ్డారు. అలాగే మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో, ఇంచు మించు 70 మంది బనీ ఇస్రాయీల్ తెగకు చెందిన నాయకులు పర్వతం మీద మరణించారు. తర్వాత మూసా అలైహిస్సలాం దుఆతో వాళ్ళు మళ్ళీ బ్రతికించబడ్డారు.
ఈ విధంగా ఖురాన్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణించిన వారు, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడతారు అన్న కొన్ని ఉదాహరణలు తెలియజేసి ఉన్నాడు. అలాగే గుహవాసులు, ‘అస్ హాబుల్ కహఫ్’ అని మనం అంటూ ఉంటాం. వారిని కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముందు మరణం ప్రసాదించి, తర్వాత మళ్ళీ జీవించేలాగా చేశాడు. ఇలాంటి కొన్ని ఉదాహరణలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో తెలియజేసి ఉన్నాడు.
ఆ ఉదాహరణల ద్వారా మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణించిన వారిని మళ్ళీ లేపగలుగుతాడు అని స్పష్టంగా, ఉదహరించి మరీ నిజమైన ఆధారాలతో తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి విశ్వాసి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణించిన వారిని మళ్ళీ లేపగలుగుతాడు, మళ్ళీ బ్రతికించగలుగుతాడు అని నమ్మాలి, విశ్వసించాలి.
2. సమాజ సంస్కరణ బాధ్యత:
ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం గ్రహించాల్సిన మరొక విషయం, సమాజ సంస్కరణకు కృషి చేయాలి. ఉజైర్ అలైహిస్సలాం వారు రెండవసారి లేపబడినప్పుడు, ప్రజల వద్దకు వెళ్లి దైవ వాక్యాలు రచించి, ప్రజలకు అందజేయడంతో పాటు బోధించారు. సమాజాన్ని సంస్కరించారు, ప్రజలను సంస్కరించారు. కాబట్టి ప్రతి విశ్వాసి సమాజాన్ని సంస్కరించడానికి కృషి చేయాలి. చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సమాజమైన మనకు “ఉత్తమ సమాజం” అని బిరుదు ఇస్తూ, “మీరు మంచిని బోధిస్తారు, చెడును నిర్మూలిస్తారు” అని బాధ్యత ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి సమాజ సంస్కరణ కోసము కృషి చేయాలన్న విషయం ఇక్కడ మనము గుర్తు చేసుకోవాలి.
3. మరణానంతర జీవితం:
మరణానంతరం జీవితం ఉంది అన్న విషయం కూడా ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనకు తెలుపబడింది. ఉజైర్ అలైహిస్సలాం వారు మరణించారు, మళ్ళీ బ్రతికించబడ్డారు. అదే విధంగా పుట్టిన తర్వాత మరణించిన ప్రతి మనిషిని పరలోకంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ బ్రతికిస్తాడు. అక్కడ లెక్కింపు ఉంటుంది, చేసిన కర్మలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడ లెక్క తీసుకొని స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయిస్తాడు. మరణానంతర జీవితం ఉంది అని స్పష్టపరచడానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా ప్రజలకు కొన్ని ఉదాహరణలు ప్రపంచంలోనే చూపించి ఉన్నాడు. మరణించిన వాడు మరణించాడు, ఇక మట్టిలో కలిసిపోయాడు అంతే, ఆ తర్వాత మళ్ళీ జీవితం అనేది లేదు అని భ్రమించే వారికి, చూడండి మరణించిన వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ లేపుతాడు అని ఇక్కడ కొంతమందిని లేపి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చూపించి ఉన్నాడు కాబట్టి, ఆ ప్రకారంగా మరణానంతర మరొక జీవితం ఉంది అన్న విషయం ఇక్కడ తెలియజేయడం జరిగింది. ప్రతి విశ్వాసి ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి.
4. సృష్టి యావత్తు అల్లాహ్ ను స్తుతిస్తుంది:
అల్లాహ్ ను స్తుతిస్తూ ఉండాలి. చీమల గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమన్నారంటే, “అవి అల్లాహ్ ను స్తుతిస్తూ ఉన్నాయి. అల్లాహ్ ను స్తుతించే చీమలని మీరు దహనం చేసేసారు ఏమిటి?” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడ ఆ ప్రవక్తను నిలదీశాడు అంటే, చీమలు సైతం అల్లాహ్ ను స్తుతిస్తూ ఉన్నాయి. ఉత్తమ జీవులైన మానవులు మరీ ఎక్కువగా అల్లాహ్ ను స్తుతిస్తూ ఉండాలి, అల్లాహ్ ను స్మరిస్తూ ఉండాలి.
ఖురాన్ గ్రంథం 62వ అధ్యాయం, 1వ వాక్యంలో అల్లాహ్ ఈ విధంగా తెలియజేశాడు:
భూమి ఆకాశాలలో ఉన్న ప్రతిదీ అల్లాహ్ ను స్తుతిస్తూ ఉంది, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంది, అల్లాహ్ ను స్మరిస్తూ ఉంది. కాబట్టి మానవులు కూడా అల్లాహ్ ను స్తుతిస్తూ, అల్లాహ్ ను స్మరిస్తూ, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉండాలి. ఎవరైతే అల్లాహ్ ను స్తుతిస్తారో వారు ఇహపర సాఫల్యాలు మరియు అనుగ్రహాలు పొందుతారన్న విషయం కూడా తెలియజేయడం జరిగింది.
5. అగ్నితో శిక్షించే అధికారం:
చివర్లో ఒక విషయం ఏమిటంటే, అగ్నితో శిక్షించే అధికారం అల్లాహ్ కు మాత్రమే ఉంది. ఆయన (పూర్వం ఒక ప్రవక్త) చీమ కుట్టింది అని చీమలను కాల్చేశాడు. కాల్చేస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా “ఎందుకు వారిని కాల్చింది? కుట్టింది ఒక చీమే కదా. ఆ ఒక చీమని కావాలంటే మీరు చంపుకోవాలి గాని, మొత్తం చీమలను దహనం చేశారు ఏమిటి?” అని నిలదీశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని తెలియజేశారు అంటే:
“నిశ్చయంగా, అగ్నితో శిక్షించే అధికారం అగ్నిని సృష్టించిన ప్రభువు (అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా) కు మాత్రమే ఉంది” అన్నారు. (అబూ దావూద్). మరొక ఉల్లేఖనంలో, “అగ్నితో శిక్షించే అధికారం ఎవ్వరికీ లేదు అల్లాహ్ కు తప్ప” అన్నారు (బుఖారీ). అంటే అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ అగ్నితో శిక్షించే అధికారం లేదు.
ఇవి ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి మనకు బోధపడిన కొన్ని విషయాలు. నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మిమ్మల్ని అందరినీ అన్న విన్న విషయాల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
లేదా ఇండ్ల కప్పులు కూలి తలక్రిందులుగా పడివున్న పట్టణం మీదుగా పోయినవాడు; (అతనిని నీవు చూడలేదా?) “దీని చావు తరువాత అల్లాహ్ తిరిగి దీనికి ఎలా ప్రాణం పోస్తాడు?” అని ఆ వ్యక్తి ఆశ్చర్యపోయినప్పుడు అల్లాహ్ అతన్ని చంపి నూరేళ్ళవరకు మరణస్థితిలో ఉంచాడు. తరువాత అతన్ని లేపి, “ఈ స్థితిలో నువ్వు ఎంతకాలం ఉన్నావు?” అని అడిగాడు. “మహా అయితే ఒక రోజు లేక ఒక రోజులో కొంత భాగం” అని అతను బదులిచ్చాడు. “లేదు. నువ్వు నూరేళ్ళు ఈ స్థితిలో పడిఉన్నావు. కాస్త నీ అన్నపానీయాల వైపు చూడు. అవి ఏ మాత్రం చెడిపోలేదు. మరి నీ గాడిదను కూడా చూసుకో. మేము నిన్ను ప్రజల కోసం ఒక నిదర్శనంగా చేయదలిచాము. మేము (గాడిద) ఎముకలను ఏ విధంగా లేపి, వాటిపై మాంసం నింపుతామో చూడు! ఇదంతా ప్రస్ఫుటమయి పోయాక, “అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడని నాకు తెలుసు” అని అన్నాడతను.
ఉజైర్ (అలైహిస్సలాం) తన తోటలోకి ప్రవేశించి అక్కడి ప్రకృతి సౌందర్యానికి మ్రాన్పడి అలాగే కాసేపు నిలబడి పోయారు. పచ్చగా కళకళలాడే చెట్లు, వాటిపై ఒక కొమ్మ మీద నుంచి మరొక కొమ్మపైకి కిలకిలరావాలతో ఎగిరే పక్షులు, విసనకర్రల్లాంటి చెట్ల ఆకుల నుంచి వీస్తున్న స్వచ్ఛమైన పిల్లతెమ్మరలు ఆస్వాదిస్తూ తన చేతిలో ఉన్న బుట్టను క్రింద పెట్టారు. అలా చాలా సేపు నిలబడిపోయారు. చెట్ల కొమ్మలు నోరూరించే పండ్ల భారంతో క్రిందికి వంగిపోయి ఉన్నాయి. ఆయన తన బుట్టను తీసుకుని అందులో రకరకాల పండ్లు కోసుకున్నారు. ఆ బుట్టను తన గాడిద వీపున కట్టారు. దాని పై కూర్చుని వెళ్ళిపోయారు.
దారిలో కూడా ప్రకృతి సౌందర్యం గురించి, ప్రకృతిలోని రమణీయత గురించి ఆలోచించి ఆశ్చర్యపోసాగారు. గాడిద దారితప్పి తనను ఎటో తీసుకు పోవడాన్ని ఆయన గుర్తించలేదు. ఆలోచనల నుంచి బయటపడి చూసేసరికి ఆయన ఒక పాడుపడిన ఊరిలో ఉన్నారు. నేలపై మానవుల కంకాళాలు, జంతువుల అస్థిపంజరాలు చెల్లాచెదరుగా పడఉన్నాయి. వారంతా గతించిన కాలాల ప్రజలని, వారి చిహ్నాలు చిందర వందరగా పడి ఉన్నాయని గ్రహించారు.
ఆయన గాడిదపై నుంచి క్రిందికి దిగారు. గాడిదపై ఉన్న బరువును క్రిందికి దించి, ఒక కూలిపోయిన గోడకు అనుకుని కూర్చున్నారు. ఆ ఊరి ప్రజలకు ఏమయ్యిందో అని ఆలోచించసాగారు. ఆయనకు మరణానంతర జీవితం గురించి ఆలోచన వచ్చింది. మరణించిన వారు మళ్ళీ ఎలా బ్రతికించబడతారు? ఆయన మనసులో ఇలాంటి ఆలోచనలు ముసురుకున్నాయి. ఆలోచనల్లో మునిగి అలాగే కునికిపాట్లు పడుతూ నిద్రలోకి జారిపోయారు.
అలా రోజులు గడచపోయాయి, నెలలు గతించాయి. సంవత్సరాలు కాల గర్భంలో కలసపోయాయి. ఉజైర్ (అలైహిస్సలాం) నిద్రలోనే ఉన్నారు. ఈ సుదీర్ఘకాలంలో ఆయన పిల్లలు, వాళ్ళ పిల్లలు, పిల్లల పిల్లలు ఇలా తరాలు గడచిపోయాయి. జాతులు అంతరించాయి. కొత్త జాతులు ఉనికిలోకి వచ్చాయి.
అల్లాహ్ తన ప్రవక్తలతో వ్యవహరించే తీరు విభిన్నంగా ఉంటుంది. సాధారణ విశ్వాసికి ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన అనుభూతి లభించక పోయినా అతను తన విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. కాని దేవుని సందేశ హరులైన ప్రవక్తలకు వారి విధుల నిర్వహణలో, దేవుని సందేశం ప్రజలకు అంద జేయడంలో పటిష్టమైన సంకల్పం అవసరం. అందుకుగాను జీవితానికి సంబంధించిన లోతయిన వాస్తవాలను తెలుసుకోవలసిన అవసరం కూడా వారికి ఉంటుంది. అందుకే ప్రవక్తల వద్దకు దైవదూతలు వచ్చేవారు. స్వర్గనరకాలు, భూమ్యాకాశాలు, మరణానంతరం జీవితం వగైరా వాస్తవాలను వారికి చూపించడం జరిగేది.
మెలకువ
ఉజైర్ (అలైహిస్సలాం) తన దీర్ఘనిద్ర నుంచి మేల్కొన్నారు. అల్లాహ్ ఆదేశానుసారం ఆయన నిద్ర పూర్తయ్యింది. ఆయన నిద్ర పోయినప్పుడు ఎలా ఉన్నారో నిద్ర లేచినప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఒక దైవదూత ఆయన ముందు ప్రత్యక్ష మయ్యాడు. ఉజైర్తో దైవదూత, “ఎంతకాలం నిద్రపోయానని భావిస్తున్నావు?” అని ప్రశ్నించాడు. ఉజైర్ (అలైహిస్సలాం) జవాబిస్తూ, “నేను రోజులో చాలా భాగం నిద్ర పోయి ఉంటాను” అన్నారు. దైవదూత ఆయన్ని చూస్తూ, “కాదు, నువ్వు వంద సంవత్సరాలు నిద్రపోయావు. చూడు! నీ పండ్లు అప్పుడు ఎంత తాజాగా ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే తాజాగా ఉన్నాయి. నీ త్రాగునీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంది. కాని నీ గాడిదను చూడు, కేవలం దాని అస్థిపంజరం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు.. అల్లాహ్ మహత్యాన్ని చూడు..మరణించిన వారిని మళ్ళీ ఆయన ఎలా బతికిస్తాడో అర్థం చేసుకో.. దీన్ని నీ ప్రభువు తరపు నుంచి నిదర్శ నంగా భావించు. నీ మనస్సులో ఉన్న అనుమానాలన్నీ తొలగించుకో” అన్నాడు.
ఉజైర్ (అలైహిస్సలాం) చూస్తుండగానే గాడిద అస్థిపంజరంపై మాంసం కండరాలు చోటు చేసుకున్నాయి. గాడిద మళ్ళీ సజీవంగా లేచి నిలబడింది. ఆయన ఆశ్చర్యంగా, “అల్లాహ్ ఏమైనా చేయగల శక్తి కలిగినవాడని నేనిప్పుడు దృఢంగా నమ్ముతున్నాను” అన్నారు.
అంతరించిన గతం
ఉజైరు తెలిసిన ప్రాంతాలన్నీ పూర్తిగా మారిపోయాయి. తన ఇంటిని వెదకడానికి చాలా సమయం పట్టింది. చివరకు ఇంటికి చేరుకుంటే అక్కడ ఆయనకు ఒక వృద్ధ మహిళ కనబడింది. ఆమె కళ్ళు కనబడడం లేదు. కాని ఆమె జ్ఞాపకశక్తి చాలా బలంగా ఉంది. ఉజైర్ (అలైహిస్సలాం) ఆమెను గుర్తించారు. తాను ఇల్లు వదలి వచ్చినప్పుడు ఆమె తన ఇంటిలో పనిచేసే చిన్నపిల్ల. ఆయన ఆమెతో, “ఇది ఉజైర్ ఇల్లేనా” అని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇస్తూ, “అవును” అంది. ఆమె దుఃఖంతో, “ఉజైర్ ఇల్లు వదలి వెళ్ళిపోయారు. చాలా సంవత్సరాలై పోయాయి. ఆ తర్వాత ఎవరికీ ఆయన ఎక్కడికెళ్ళిందీ తెలియరాలేదు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. చాలా కాలంగా ఆయన పేరు ప్రస్తావించిన వాళ్ళు కూడా లేరు” అంది. ఉజైర్ (అలైహిస్సలాం) ఆమెతో, “నేనే ఉజైర్. అల్లాహ్ అభీష్టం వల్ల నేను చాలా కాలం నిద్ర పోయాను. అల్లాహ్ నన్ను వంద సంవత్సరాల తర్వాత నిద్ర లేపాడు” అన్నారు.
ఈ మాటలు విని ఆ వృద్ధమహిళ చాలా ఆశ్చర్యపోయింది. కాస్సేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత, “ఉజైర్ (అలైహిస్సలాం) చాలా ధర్మాత్ముడు. అల్లాహ్ ఆయన ప్రార్థనలను వినేవాడు. ఆయన రోగుల స్వస్థత కోసం ప్రార్థించిన ప్రతిసారీ వారికి ఆరోగ్యం చేకూరేది. కాబట్టి, నువ్వు ఉజైర్అ యితే అయితే నా ఆరోగ్యం కోసం, నా కంటిచూపు కోసం అల్లాహ్ ను ప్రార్థించు” అని అడిగింది.
ఉజైర్ (అలైహిస్సలాం) అల్లాహ్ ను వేడుకున్నారు. అల్లాహ్ ఆయన ప్రార్థనలకు ప్రతిస్పందించాడు. ఆ వృద్ధమహిళకు ఆరోగ్యం చేకూరింది. ఆమె కంటిచూపు మళ్ళీ వచ్చింది. ఆమె ఆయనకు ధన్యవాదాలు చెప్పి ఈ వార్త అందరికీ చెప్పడానికి తక్షణమే బయటకు వెళ్ళింది. ఉజైర్ పిల్లలు, మనుమలు, మనుమల పిల్లలు అందరూ పరుగున వచ్చారు. యువకునిగా కనబడుతున్న ఉజైర్ని చూసి ఆయన తమకు తాతగారని వారు నమ్మలేకపోయారు. “ఇది నిజమా!” అని గుసగుసలాడు కోసాగారు. ప్రస్తుతం ముసలివాడై పోయిన ఉజైర్ కొడుకు ఒకరు “నా తండ్రికి భుజంపై ఒక పుట్టుమచ్చ ఉండేది. మా అందరికీ ఆ పుట్టుమచ్చ గురించి బాగా తెలుసు. మీరు ఆయనే అయితే ఆ పుట్టుమచ్చ చూపించండి” అని ప్రశ్నించాడు. ఉజైర్ తన భుజంపై ఉన్న పుట్టుమచ్చను చూపించారు. అయినా వారికి సంతృప్తి కలగలేదు. మరో కుమారుడు, “జెరుసలేమ్ను బుఖ్స్సర్ ఆక్రమించుకుని తౌరాత్ గ్రంథాలన్నింటినీ ధ్వంసం చేసినప్పటి నుంచి తౌరాత్ కంఠస్థం చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది మిగిలారు. అలా తౌరాత్ కంఠస్థం చేసిన వారిలో మా తండ్రిగారు కూడా ఒకరు. మీరు ఆయనే అయితే తౌరాత్ వినిపించండి” అనడిగాడు. ఉజైర్ తౌరాత్ మొత్తం పఠించి వినిపించారు. ఆయన స్వరానికి వారు మంత్రముగ్ధులై విన్నారు. నిజంగా ఉజైర్ (అలైహిస్సలాం) తిరిగి వచ్చారని వారికి అప్పటికి నమ్మకం కలిగింది. అందరూ ఆయన్ను ప్రేమతో కౌగిలించుకున్నారు. ఆనంద భాష్పాలు రాల్చారు.
ఆ పిదప యూదులు, “అల్లాహ్ ఉజైర్ను మళ్ళీ బ్రతికించాడు. కాబట్టి ఆయన తప్పక అల్లాహ్ కుమారుడై ఉండాలి” అనడం ప్రారంభించారు. (చదవండి దివ్యఖుర్ఆన్: 9:30, 2:259)
“ఉజైర్ అల్లాహ్ కుమారుడు” అని యూదులంటున్నారు. “మసీహ్ (ఏసు క్రీస్తు) అల్లాహ్ కుమారుడు” అని నసారా (క్రైస్తవులు) అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ పూర్వీకుల్లోని అవిశ్వాసులు చెప్పిన మాటలనే వీళ్ళూ అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నాశనం చేయుగాక! (సత్యం నుండి) వారెలా తిరిగిపోతున్నారు!?
గ్రహించవలసిన పాఠాలు
సాధారణంగా మనిషి కళ్ళకు కనబడే వాటిని పట్టించుకోకుండా తమ స్వంత ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. ఉజైర్ తిరిగి రావడం అల్లాహ్ చూపించిన మహత్యంగా గ్రహించే బదులు యూదులు ఆయన్ను దేవుని కుమారునిగా పిలువడం ప్రారంభించారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మనిషి ఇహలోకంలో శాశ్వతంగా ఉండడు,శాశ్వత జీవితం పరలోక జీవితం. అయితే ఇక్కడ ఉండీ అక్కడి జీవితం గురించి ఎలా ఆలోచించగలం, ఊహించగలమో తెలుసుకొనుటకు ఈ వీడియో చూడండి.
ఈ ప్రసంగంలో, వక్త పరలోక జీవితం మరియు దాని కోసం సిద్ధం కావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఇహలోక జీవితం ఒక పరీక్ష అని, శాశ్వతం కాదని, మోసంతో కూడుకున్నదని ఖురాన్ ఆయతుల ద్వారా వివరించారు. మరణ సమయం ఎవరికీ తెలియదని, కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వాసంతో, సత్కార్యాలు చేస్తూ ఉత్తమమైన స్థితిలో మరణాన్ని పొందాలని కోరుకోవాలని, కేవలం కోరుకుంటే సరిపోదని, దానికి తగ్గ ఆచరణ కూడా ఉండాలని ఉద్బోధించారు. కష్టాలు, సుఖాలు రెండూ అల్లాహ్ నుండే వచ్చే పరీక్షలని, వాటిని సహనంతో, నమాజ్ తో ఎదుర్కోవాలని సూచించారు. యువత, ఆరోగ్యం, సంపద, తీరిక సమయం మరియు జీవితం వంటి ఐదు అమూల్యమైన వరాలను అవి చేజారిపోకముందే సద్వినియోగం చేసుకోవాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసును ఉటంకించారు. సమయాన్ని వృధా చేయకుండా, అల్లాహ్ ధ్యానంలో మరియు సత్కార్యాలలో గడపడం ద్వారా పరలోక సాఫల్యం కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
بِسْمِ ٱللَّٰهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ సహ్బిహీ అజ్మయీన్, అమ్మా బాద్.
أَعُوذُ بِٱللَّهِ ٱلسَّمِيعِ ٱلْعَلِيمِ مِنَ ٱلشَّيْطَانِ ٱلرَّجِيمِ శపించబడిన షైతాన్ నుండి నేను సర్వశ్రోత మరియు సర్వజ్ఞుడైన అల్లాహ్ శరణు వేడుతున్నాను.
كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ ۗ وَإِنَّمَا تُوَفَّوْنَ أُجُورَكُمْ يَوْمَ الْقِيَامَةِ ۖ فَمَن زُحْزِحَ عَنِ النَّارِ وَأَدْخِلَ الْجَنَّةَ فَقَدْ فَازَ ۗ وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا مَتَاعُ الْغُرُورِ ప్రతి ప్రాణీ మరణ రుచి చూడవలసిందే. మరి నిశ్చయంగా ప్రళయ దినాన మీరు మీ పూర్తి ప్రతిఫలాలు పొందగలరు. కనుక ఎవరైతే నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశింపజేయబడతాడో అతనే సాఫల్యం పొందినవాడు. ఈ ఐహిక జీవితం కేవలం మోసపు సామాగ్రి తప్ప మరేమీ కాదు.
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వ జగత్తుకు ఏకైక యజమాని, మన ఆరాధనలకు నిజమైన ఆరాధనీయుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు స్తుతులు, పొగడ్తలు అన్నీయు చెల్లును. అంతిమ ప్రవక్త, దయామయ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ యొక్క అనేక అనేక కరుణలు, శాంతులు, శుభాలు కురియుగాక.
పరలోక జీవితం కొరకు మన తయారీ
సోదర మహాశయులారా! ఈరోజు మనం ‘పరలోక జీవితం, దాని గురించి మనం ఏం సిద్ధపరుస్తున్నాము’ అనే శీర్షికపై కొన్ని విషయాలు విందాము, గ్రహిద్దాము, ఆచరణకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆచరించే ప్రయత్నం చేద్దాము ఇన్షా అల్లాహ్. అల్లాహ్ త’ఆలా అలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అయితే, నా ఈ చిన్న ప్రసంగంలో కొన్ని ప్రశ్నలు కూడా నేను అడుగుతాను. మీరు త్వరగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. ఇన్షా అల్లాహ్.
మరణ సమయం ఎవరికీ తెలియదు
మొదటి ప్రశ్న ఏంటంటే, మనం ఎప్పుడు చనిపోతాము అన్న విషయం మనకు తెలుసా? లేదు. మనం ఎప్పుడు చనిపోతాము అన్న విషయం మనలో ఎవరికీ తెలియదు. స్వయంగా అల్లాహ్ త’ఆలా సూరె లుఖ్మాన్ చివరిలో,
وَمَا تَدْرِي نَفْسٌ مَّاذَا تَكْسِبُ غَدًا ۖ وَمَا تَدْرِي نَفْسٌ بِأَيِّ أَرْضٍ تَمُوتُ తాను రేపు ఏం చేయనున్నదో ఏ ప్రాణీ ఎరుగదు. తాను ఏ గడ్డపై మరణిస్తాడో కూడా ఎవరికీ తెలీదు (31:34)
ఏ స్థితిలో మరణించాలని కోరుకోవాలి?
మనకు చావు ఎప్పుడు వస్తుందో అన్న విషయం తెలియనప్పుడు, చావు ఏ పరిస్థితిలో వస్తే బాగుంటుంది అన్న విషయం ఎప్పుడైనా ఒక్కసారైనా మనం ఆలోచించామా? ఉదాహరణకు, రెండో ప్రశ్న అనుకోండి.
ఒక వ్యక్తి లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుతూ చదువుతూ చనిపోతున్నాడు. మరో వ్యక్తి అవిశ్వాస మాటలు లేదా ఏదైనా పాటలు పాడుకుంటూ చనిపోతున్నాడు. ఒక వ్యక్తి నమాజ్ చేస్తూ సజ్దా స్థితిలో ఉండి చనిపోతున్నాడు. మరో వ్యక్తి నమాజ్ సమయాన్ని వృధా చేసి పాటలు వినుకుంటూ, ఫిలింలు చూసుకుంటూ, ఇంకా వేరే ఏదైనా చెడు కార్యాలు చూస్తూ ఆ స్థితిలో చనిపోతున్నాడు. ఒక వ్యక్తి ఎవరైనా బీదవారికి దానం చేస్తూ లేక ఎవరికైనా సహాయం చేస్తూ ఆ స్థితిలో చనిపోతున్నాడు. మరో వ్యక్తి ఎవరైనా బీదవాళ్ళను తన చేతి కింద పనిచేసే వాళ్ళను, వారిపై అన్యాయం చేస్తూ, ఏదైనా దౌర్జన్యం చేస్తూ ఆ స్థితిలో చనిపోతున్నాడు. ఒక వ్యక్తి ప్రయాణంలో వెళ్తున్నాడు, వాహనంలో ఉన్నాడు, నోటి మీద అల్లాహ్ యొక్క జిక్ర్ ఉంది, యాక్సిడెంట్ అయిపోయింది, ఆ సందర్భంలో కూడా అతనికి కలిమా నోటి మీద వచ్చేసింది. మరో వ్యక్తి తన ఫ్రెండ్లతో, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసుకుంటూ ప్రయాణం చేస్తున్నాడు, ఆ స్థితిలో అతనికి చావు వచ్చేసింది, యాక్సిడెంట్ అయింది, ఆ స్థితిలో చావు వచ్చింది.
ఇప్పుడు మీరే ఆలోచించండి, స్వయంగా మీరు, అంటే నేను, మీలో ప్రతి ఒక్కరు, స్వయంగా నేను కూడా, నేను ఏ స్థితిలో నాకు చావు వస్తే బాగుంటుంది అని ఆలోచించాలి. దేని గురించి నేను సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి? కుడి వైపున చెప్పిన విషయాలకా లేకుంటే ఎడమ వైపున చెప్పిన విషయాలకా? మీ అందరిలో ప్రతి ఒక్కరు ఇదే కోరుకుంటున్నారా? ఇన్షా అల్లాహ్. అల్లాహ్ త’ఆలా మన ఈ కోరిక ప్రకారం అలాంటి ఆచరణ ప్రసాదించుగాక, మరి మన కోరిక ప్రకారం మన యొక్క చావు అదే స్థితిలో అల్లాహ్ త’ఆలా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.
కోరికకు తగ్గ ఆచరణ
అయితే సోదరులారా! మాట్లాడుకున్నప్పుడు ఇది కోరుకుంటున్నాము. కుడివైపున సైగ చేసి ఏ విషయాలైతే చెప్పబడ్డాయో అవి కోరుకుంటున్నాము అని మాట్లాడేటప్పుడు, ఎవరైనా ప్రశ్న ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పడం సులభం. కానీ దానిని ఆచరణ రూపంలో కూడా మనం ఉంచాలి. ఎందుకంటే కలిమా చదువుతూ, నమాజ్ చేసుకుంటూ, ఇంకా వేరే ఉత్తమ కార్యాలు చేస్తూ మన చావు రావాలి అని కోరుకోవడం ఇది ఒక అంతు అయితే, ఎగ్జాక్ట్లీ దాని ప్రకారం లేదా కనీసం దానికి దగ్గరగా అలాంటి మంచి ఆచరణలు అవలంబించడం ఇది మరో అంతు.
కేవలం కోరికల మీద మేడలు కడతామా? ఇప్పుడు మనం ఇక్కడ విదేశ జీవితం గడుపుతున్నాము. ఇక్కడ సంపాదిస్తున్నాము. మనకన్ని కోరికలు ఉన్నాయా లేదా? ఉదాహరణకు ఇప్పుడు పెళ్లి కాని యువకులు, ఇలాంటి స్త్రీతో, ఇలాంటి అమ్మాయితో వివాహం చేయాలి, ఆ అమ్మాయిలో ఇలాంటి, ఇలాంటి గుణాలు ఉండాలి, నేను ఇక్కడ మంచిగా సంపాదించాలి, ఇంత మంచి ఒక ఇల్లు కట్టాలి, ఒక గృహం నిర్మించాలి, ఇలాంటి కోరికలు ఉన్నాయా లేవా? మనం ప్రతిరోజు పడుకునే ముందు ఇలాంటి కోరికల్ని గుర్తు చేసుకుంటూ, వాటిని వల్లించుకుంటూ, మళ్ళించుకుంటూ, తిరిగి తిరిగి వాటిని గుర్తు చేసుకుంటూ మనం పడుకున్నప్పటికీ, ఓ పది సంవత్సరాల తర్వాత ఆ మేడ కట్టి అక్కడ తయారు ఉంటుందా? బిల్డింగ్ కట్టి అక్కడ రెడీ ఉంటుందా? ఏం చేయాల్సి ఉంటుంది? దాని గురించి ప్రయత్నం చేయాలి, సంపాదించాలి, ఇల్లు కట్టడానికి దానికి సంబంధించిన మనుషులు ఎవరైతే ఉంటారో వారితో కలవాలి, ఆ పనులు చేయాలి. అలాగే కలిమా చదువుతూ, నమాజ్ చేస్తూ, మంచి స్థితిలో, ఉత్తమ రీతిలో నాకు చావు రావాలి అని కోరుకున్నంత మాత్రాన కోరిక తీరుతుందా? లేదు.
‘మౌత్ కా బయాన్’ అని ఉర్దూలో ఒక పుస్తకం ఉంది. దాని యొక్క రచయిత ఒక సంఘటన గుర్తు చేశాడు. ఒక వ్యక్తి రోడ్డు మీద నిలబడి సామాను అమ్ముకుంటూ ఉంటాడు. ఇలాంటి మనుషులను మనం ఎంతో మంది చూస్తూ ఉంటాం కదా. పొద్దుటి నుండి సాయంకాలం వరకు, “పాంచ్ రియాల్, పాంచ్ రియాల్, పాంచ్ రియాల్, ఐదు రూపాయలు, ఐదు రూపాయలు, ఐదు రూపాయలు, ఖంస రియాల్, ఖంస రియాల్, ఖంస రియాల్”. మార్కెట్లో ఎప్పుడైనా విన్నారా లేదా ఇట్లాంటిది? అదే పాట. నమాజ్ లేదు, అల్లాహ్ యొక్క జిక్ర్ లేదు, ఇంకా వేరే ఉత్తమ కార్యాలు ఏవీ లేవు. ముస్లిం. చనిపోయేటప్పుడు, చావు దగ్గరికి వచ్చినప్పుడు, అతని బంధువులు దగ్గరగా ఉండి, “నానా, లా ఇలాహ ఇల్లల్లాహ్ చదవండి” అని అంటున్నారు. “లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పక్కన అక్కడ మెల్లమెల్లగా పలుకుతున్నారు కనీసం విని అంటారని. కొంచెం మాట్లాడడానికి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, “ఐదు రూపాయలు, ఐదు రూపాయలు, ఐదు రూపాయలు, పాంచ్ రియాల్, పాంచ్ రియాల్, పాంచ్ రియాల్, పాంచ్ రియాల్” అదే మాట వస్తుందట. ఎందుకు?
ఈ విధంగా మనిషి ఏదైనా ఉద్యోగపరంగా ఏదైనా ఒక మాటను మాటిమాటికీ చెప్పడం, అది తప్పు అని కాదు ఇక్కడ చెప్పే ఉద్దేశం. కానీ అల్లాహ్ యొక్క జిక్ర్, ఈమాన్, విశ్వాసం, నమాజ్, ఇతర సత్కార్యాలకు ఏ స్థానం అయితే ఇవ్వాలో, ఇతర సత్కార్యాలు ఎంతగా పాటించాలో, వాటిని పాటించడం కూడా తప్పనిసరి.
ఇహలోక జీవితం – ఒక మోసం
చావు ఎప్పుడు వస్తుంది మనకు తెలియదు. చావు మంచి స్థితిలో రావాలి మనందరి కోరిక. కానీ జీవితం గడుపుతున్నప్పుడు, “అరే! యవ్వనం ఉంది కదా, మనం యువకులం కదా, ఇప్పుడే కదా, ఒకేసారి కదా జీవితం, ఒకేసారి కదా ఛాన్స్” అనుకుంటూ మన కోరికలు మంచిగా ఉన్నప్పటికీ, ఆచరణను మంచిగా ఉంచకుంటే, చావు మంచిగా వస్తుంది అన్న ఆశ ఏదైనా ఉంటుందా? అందుగురించి సోదరులారా!
كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ (కుల్లు నఫ్సిన్ జాఇఖతుల్ మౌత్) ప్రతి జీవికీ మరణ రుచి చూడక తప్పదు. (సూరె ఆలి ఇమ్రాన్ లో ఉంది ఆ ఆయత్)
وَإِنَّمَا تُوَفَّوْنَ أُجُورَكُمْ يَوْمَ الْقِيَامَةِ (వ ఇన్నమా తువఫ్ఫౌన ఉజూరకుమ్ యౌమల్ ఖియామహ్) ప్రళయ దినాన మీరు చేసుకున్న కర్మలకు సంపూర్ణ ఫలితం మీరు పొందుతారు.
అయితే వినండి,
فَمَن زُحْزِحَ عَنِ النَّارِ وَأَدْخِلَ الْجَنَّةَ فَقَدْ فَازَ (ఫమన్ జుహ్జిహ అనిన్నారి వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్) ఎవరైతే నరకం నుండి దూరం చేయబడ్డారో, స్వర్గంలో ప్రవేశింపబడ్డారో, విజయం అతనిది. సాఫల్యం అతనికి లభించింది.
ఇక్కడి వరకు విషయం అర్థమైంది కదా? ఏం చెప్పాడు అల్లాహ్ త’ఆలా? ప్రతి జీవి మరణించక తప్పదు, తప్పకుండా చనిపోతారు. ఆ తర్వాత చెప్పాడు అల్లాహ్ త’ఆలా, మీరు చేసుకున్న ప్రతి కర్మలకు సంపూర్ణ ఫలితం లభిస్తుంది. ఆ తర్వాత చెప్పాడు, నరకం నుండి దూరం చేయబడి, స్వర్గంలో ప్రవేశించిన వారు వారే సాఫల్యం పొందిన వారు. కానీ ఆ మరణం రాకముందు మనం ఎక్కడున్నాము? ఈ భూమి మీదే కదా, ఈ లోకంలో కదా. ఇక్కడ ఉండే కదా మనం ఆ స్వర్గం గురించి ఏదైనా ప్రయత్నం చేయాలి? ఇక్కడ ఉండే మనం సత్కార్యాలు చేయాలి, అప్పుడు నరకం నుండి దూరం చేయబడతాము, స్వర్గంలో ప్రవేశింపజేయబడతాము. అయితే అల్లాహ్ త’ఆలా ఎంత గొప్ప విషయం ఆ తర్వాత చెప్పాడో గమనించండి, ‘ఫఖద్ ఫాజ్’, సాఫల్యం పొందాడు అని మాట అయిపోయింది, కాలేదు. ఆ తర్వాత అల్లాహ్ చెప్పాడు,
ఇహలోక జీవితం, ఇందులో ఎన్నో రకాల మీకు మోసాలు జరుగుతాయి. ఒక వ్యక్తి వ్యాపారంలో మోసపోతాడు, ఇంకో వ్యక్తి తన వ్యవసాయంలో మోసపోతాడు, ఇంకో వ్యక్తి ఉద్యోగంలో మోసపోతాడు, ఇంకో వ్యక్తి ఏదైనా పని చేసుకుంటూ మోసపోతాడు. ఇవన్నీ మోసాలు చాలా తేలికగా, ఏ లెక్క లేనివి. అతి గొప్ప మోసం, ఎలాంటి మోసం? మనిషి స్వర్గం గురించి ఆలోచిస్తూ, స్వర్గం గురించి కోరికలు ఊహించుకుంటూ దాని గురించి ఏమీ చేయకుండా, ఏ సత్కార్యం పాటించకుండా, విశ్వాస మార్గం అవలంబించకుండా జీవితం గడపడం ఇది మహా మోసం.
ఇలాంటి మోసం అర్థమవుతుందా? ఉదాహరణకు, రోజూవారీగా కూలి తీసుకొని పనిచేసే వాళ్ళ విషయం గమనించండి, “ఈరోజు నా దగ్గర నువ్వు పని చేయాలి. ఎంత? ఈరోజు పనిచేస్తే 200 రియాల్ నీకు ఇస్తాను.” ఒప్పందం అయిపోయింది. సాయంకాలం వరకు మీకు డబ్బు ఇవ్వకుండా వెళ్ళిపోతే ఏమంటారు? మోసం చేశాడు వీడు అని నాలుగు తిడతారా లేదా? ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాము. కొందరు ఇలాంటి మోసాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ మనకు మనం ముస్లింలమనుకొని, విశ్వాసులమన్నటువంటి సంతృప్తిలో ఉండి, విశ్వాస మార్గం మీద స్థిరంగా ఉండకుండా, సత్కార్యాలు చేస్తూ మనం జీవితం గడపకుండా ఆ స్వర్గం మన తాతముత్తాతల ఏదైనా ఆస్తి ఉన్నట్లుగా మనం దొరుకుతుందిలే, ఎప్పుడో ఒకసారి స్వర్గంలో పోవాల్సిందే కదా అన్నటువంటి ఆలోచనల్లో పడి, సత్కార్యాలను వదులుకోవడం, ఇష్టం వచ్చినట్లు పాపాలు చేసుకుంటూ జీవితం గడపడం, ఇది మనకు మనం మోసంలో పడిపోతలేమా? స్వర్గం యొక్క కోరిక ఉంది, చేస్తున్న కార్యాలు ఏంటి? స్వర్గంలో తీసుకెళ్ళేటివా? కాదు.
ఇప్పుడు ఎండకాలం రాబోతుంది. రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. ఏం కనబడుతుంది? ముంగట రోడ్డు మీద నీళ్లు ఉన్నట్లు కనబడుతుంది. జరుగుతుంది కదా అలాంటిది? అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటాయా నీళ్లు? మీరు అనుకోండి, ఉదాహరణకు మీరు ఒక ఎడారిలో ఉన్నారు. ఎండలో తపించిపోయి మీకు చాలా దాహం కలుగుతుంది. నీళ్లు లేక మీరు తపిస్తున్నారు. మీకు ఎండమావులు కనబడతాయి. ఎండమావులే అంటారు కదా, సురాబ్. ఆహ్! ఇంకొంచెం నేను నడిచిపోతే ఇక నాకు నా ప్రాణంలో ప్రాణం వచ్చేస్తది, ఇక నీళ్లు దొరుకుతాయి, అన్నటువంటి ఆశతో అలసిపోయి, నడవలేని శక్తి, శక్తి ఏ మాత్రం లేదు నడవడానికి, కానీ అలాంటి ఎండమావులు, ఎండమావులు కాదు దాన్ని నీళ్లు అనుకుంటున్నాం మనం. ఇంకొంచెం కష్టపడి నాలుగు అడుగులు వెళ్దాము అని అనుకొని అక్కడికి వెళ్ళేసరికి అక్కడ నీళ్లు ఉండకుండా ఎండమావులు అని మీకు అనిపించినప్పుడు ఎంత బాధ కలుగుతుంది? ఇక ఎందుకు జీవితం, ఛా! ఇక్కడే చనిపోతే బాగుంటది. అనిపిస్తదా లేదా?
ఎవరైతే అల్లాహ్ ను కాకుండా వేరే దేవతలను ఆరాధిస్తారో, అలాంటి వారికి ప్రళయ దినాన ఇలాంటి మోసపు శిక్ష కూడా జరుగుతుంది. సహీ బుఖారీలో హదీస్ వచ్చి ఉంది. అందుగురించి సోదరులారా, ఇకనైనా మనం ఉన్న కొత్త జీవితాన్ని మనం అదృష్టంగా భావించి దాన్ని విశ్వాస మార్గంలో, సత్కార్యాలు చేసుకుంటూ గడిపే ప్రయత్నం చేద్దాం. ఇన్షా అల్లాహ్.
ఇహలోకం ఒక పరీక్ష
చూడండి, ఇహలోకంలో అల్లాహ్ ఎందుకు పంపాడు మనల్ని? హాయిగా స్వర్గం లాంటి జీవితం గడపడానికా లేకుంటే పరీక్ష గురించా? ఇది మూడో ప్రశ్న అనుకోండి మీరు. ఇహలోకంలో మనం ఎందుకు వచ్చాము? హాయిగా, లగ్జరీ లైఫ్ గడపడానికా లేకుంటే ఒక పరీక్ష పరమైన జీవితం గడపడానికా? పరీక్ష. ఎలాంటి అనుమానం లేదు కదా? అలాంటప్పుడు ఇక్కడ ఎదురయ్యే కష్టాలు, ఇక్కడ మనకు కలిగే బాధలు, వాటికి మనం చిన్నబోయి లేక మనస్తాపం చెంది, ఎంతో మనకు మనం కుళ్ళిపోయాము, ఇక ఎందుకురా నా జీవితం అన్నటువంటి భావనలో వెళ్లి, విశ్వాస మార్గం, స్వర్గంలో చేర్పించే సత్కార్యాలు, వాటిని ఎందుకు మరిచిపోతాము మనం?
మన విశ్వాస మార్గాన్ని వదలకుండా ఇలాంటి కష్టాల్ని, ఇలాంటి బాధల్ని ఎదుర్కొంటే ఇంకా మనకు స్వర్గాలలో స్థానాలు రెట్టింపు అవుతాయి, పెరుగుతూ పోతాయి. ఖురాన్ లో ఒక ఆయత్ ఉంది:
وَجَعَلْنَا بَعْضَكُمْ لِبَعْضٍ فِتْنَةً (వ జ’అల్నా బ’అదకుమ్ లి బ’అదిన్ ఫిత్న) పరస్పరం ఒకరినొకరిని అల్లాహ్ మీకు పరీక్షగా చేశాడు.
మరో ఆయత్ ఉంది:
وَنَبْلُوكُم بِالشَّرِّ وَالْخَيْرِ فِتْنَةً (వ నబ్లూకుమ్ బిష్షర్రి వల్ ఖైరి ఫిత్న) ఇహలోకంలో మీకు సుఖము, శాంతి, అన్ని రకాల మంచితనాలు ఇచ్చి పరీక్షిస్తాను, బాధ, కఠోర జీవితం, ఎన్నో రకాల ఆపదల్లో మిమ్మల్ని ఇరికించి కూడా మిమ్మల్ని పరీక్షిస్తాను.
బిష్షర్రి వల్ ఖైర్. షర్ర్, ఖైర్ ఇక్కడ పదాలు వింటూ ఉంటారు కదా. షర్ర్ అంటే కీడు, చెడు. ఖైర్ అంటే మంచితనం. ఈ రెండు రకాలుగా కూడా మిమ్మల్ని నేను పరీక్షిస్తాను అని అల్లాహ్ త’ఆలా అంటున్నాడు.
కొందరు కఫీల్ (employer) యొక్క ఇబ్బంది వల్ల గాని, జీతాలు సరిగ్గా దొరకవని వల్ల గాని, లేక జీతాలు బాగానే ఉన్నాయి, కఫీల్ తోని కిరికిరి ఏం లేదు, కానీ తోడుగా పనిచేసే వాళ్ళతోని కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు, ఈర్ష్య, జిగత్సలు, ఇంకా వేరే రకాల ఏవే. సామాన్యంగా మనం ఇక్కడ చూసుకున్న కొన్ని కష్టాల గురించి నేను చెప్తున్నాను. ఇలాంటి కష్టాల్లో కొందరు ఎంతో పెద్ద కష్టంగా భావించి నమాజ్ వదులుతారు. ఇలాంటి కష్టాల్ని దూరం చేసుకోవడానికి సరైన మార్గం ఏంటో తెలుసుకోకుండా ఇంకెంత పాపాల్లో చిక్కుకుంటూ పోతారు.
సోదరులారా! ఎప్పుడు ఏ కష్టం వచ్చినా గాని, ఆ కష్టం దూరం చేసేవారు ఎవరు? అల్లాహ్. అయితే, కష్టాలు దూరం చేయమని అల్లాహ్ ను మొరపెట్టకుండా, అల్లాహ్ కు ఇష్టమైన కార్యాలు చేయకుండా, ఇంకా పాపాల్లో మనం చిక్కుకుంటూ పోతే కష్టాలు పెరుగుతాయా, తరుగుతాయా? ఆలోచించండి, ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? “ఎందుకయ్యా నమాజ్ కు రావటం లేదయ్యా?” అంటే, “అరే! నాకు ఉన్నటువంటి బాధలు మీకు ఉంటే తెలుస్తది. మీరు ఎప్పుడు నమాజ్, నమాజ్ అనే అంటా ఉంటారు.” నమాజ్ అన్ని రకాల మేళ్లు, అన్ని రకాల మంచితనాలకు మూలం. ఎలాంటి కష్టం, ఎలాంటి బాధ ఉన్నా గాని, అది దూరం కావాలి అంటే అల్లాహ్ ఏమంటున్నాడు?
وَاسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ (వస్త’ఈనూ బిస్సబ్రి వస్సలాహ్) సహనం ద్వారా మరియు నమాజ్ ద్వారా సహాయం అర్థించండి.
ఇంకా మీరు సూరహ్ బఖరాలో చూస్తే, రెండో పారాలో, “ఫద్కురూనీ అద్కుర్కుమ్ వష్కురూలీ వలా తక్ఫురూన్. యా అయ్యుహల్లజీన ఆమనూ…
اسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ ۚ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ (ఇస్త’ఈనూ బిస్సబ్రి వస్సలాహ్, ఇన్నల్లాహ మ’అస్సాబిరీన్) ఓ విశ్వాసులారా! మీరు సహాయాన్ని కోరండి, సహనం ద్వారా మరియు నమాజ్ ద్వారా. నిశ్చయంగా అల్లాహ్ సహనం పాటించే వారితో ఉన్నాడు.
ఆ తర్వాతనే వెంటనే చూడండి. సూరహ్ బఖరా, ఆయత్ నెంబర్ 153. “ఇన్నల్లాహ మ’అస్సాబిరీన్” ఆ తర్వాత, “వలా తఖూలూ లిమయ్ యుఖ్తలు ఫీ సబీలిల్లాహి అమ్వాత్, బల్ అహ్యావున్ వలాకిల్లా తష్’ఉరూన్”. అల్లాహ్ మార్గంలో ఎవరైతే హత్య చేయబడతారో వారి గురించి చెప్పబడింది, సామాన్య మృతి చెందిన వారి లాగా మీరు భావించకండి. ఆ తర్వాత అల్లాహ్ అంటున్నాడు, ఆయత్ నెంబర్ 155లో:
وَلَنَبْلُوَنَّكُم بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ (వ లనబ్లువన్నకుమ్ బిషైఇమ్ మినల్ ఖౌఫి వల్ జూఇ’) మేము తప్పకుండా మిమ్మల్ని పరీక్షిస్తాము కొంత భయంతో మరియు ఆకలి ద్వారా.
وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَالثَّمَرَاتِ (వ నఖ్సిమ్ మినల్ అమ్వాలి వల్ అన్ఫుసి వస్సమరాత్) మీ ధనాల్లో, మీ ప్రాణాల్లో, మీ ఉత్పత్తుల్లో కొరత చేసి, తక్కువ చేసి
మీరు ఎంత మీ ధనం పెరగాలి అని, మీ వ్యాపారం ఎంత డెవలప్ కావాలని మీరు ఆలోచిస్తారో అది అంత పెరగకుండా దాన్ని తరిగించి, మీ సంతానంలో గాని, మీ బంధువుల్లో గాని ఎవరికైనా చావు వచ్చి, వస్సమరాత్, ఇంకా మీ వ్యవసాయ పరంగా ఏదైనా ఫలాలు, ఫ్రూట్స్ అలాంటివి ఉంటే వాటిలో మీకు ఏదైనా నష్టం చేగూర్చి మిమ్మల్ని పరీక్షిస్తాము.
وَبَشِّرِ الصَّابِرِينَ (వ బష్షిరిస్సాబిరీన్) సబర్ విషయం గడిచింది కదా. సబర్ చేస్తే వాళ్లతోనే అల్లాహ్ ఉన్నాడు అని అన్నాడు కదా ఇంతకుముందే. ఇక్కడ ఏమన్నాడు? అలాంటి సబర్ చేసే వారి గురించి, ఇలాంటి కష్టాలు ఎవరిపై వస్తాయో, ఆ కష్టాల్లో ఎవరైతే సబర్ చేస్తారో, సహనం పాటిస్తారో, వారికి శుభవార్త ఇవ్వండి అని అల్లాహ్ అంటున్నాడు.
అర్హత లేనిదే క్షమాపణ లేదు
అయితే, చిన్నపాటి కష్టాలు వచ్చినందుకు మనం అల్లాహ్ కు ఇంకా దగ్గరగా కాకుండా, దూరమవుతూ ఉంటే, ఇది ఎలాంటి ఉదాహరణ? ఒక వ్యక్తికి కడుపు నొప్పి వేసింది, లేక బాగా తల తిరుగుతుంది, తల నొప్పి ఉంది, ఎలాంటి పరిస్థితిలోనైనా ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాలి. చూసే వారందరూ అంటున్నారు, “తొందరగా ఇప్పుడే ఆంబులెన్స్ ని పిలవండి.” అతను ఏమంటున్నాడు, “వద్దు, వద్దు. అటు వెళ్తే నాకు ఇంకా రోగం పెరుగుద్ది.” అలాంటి వారిని ఏమంటారు? ఎవరికైనా అపెండిక్స్ అయింది అనుకోండి, ఒక వైపున చాలా నొప్పులు వేస్తుంది కదా, విపరీతమైన నొప్పి. నిలబడలేడు, పడుకోలేడు, కూర్చోలేడు, ఎలాంటి స్థితిలో కూడా అతనికి విశ్రాంతి అనేది దొరకదు. అలాంటి వ్యక్తికి హాస్పిటల్ తీసుకెళ్లకుండా, డాక్టర్ ను కల్పించకుండా అలాగే వదిలేస్తారా?
సోదరులారా! అలాగే కష్టాలు ఎన్ని మనకు వచ్చినా గాని, ఎటు వైపునకు మనం మరలాలి? అల్లాహ్ వైపునకు మరలాలి. అందుగురించి అల్లాహ్ త’ఆలా ఏమంటున్నాడు?
وَأَخَذْنَاهُم بِالْبَأْسَاءِ وَالضَّرَّاءِ لَعَلَّهُمْ يَتَضَرَّعُونَ (వ అఖద్నాహుమ్ బిల్ బ’సాఇ వద్దర్రాఇ ల’అల్లహుమ్ యతదర్ర’ఊన్) వారిని మేము కష్టాల్లో, ఆపదల్లో పట్టుకున్నాము, పరీక్షలకు గురిచేశాము. వారు అల్లాహ్ వైపునకు మరలి ఇంకా ఎక్కువగా మొరపెట్టుకోవాలని.
కానీ ఈ రోజుల్లో ఆ పని చేస్తున్నామా మనం? సోదరులారా! అందుగురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీసును ఎల్లవేళల్లో మనం మన దృష్టిలో ఉంచుకోవాలి. మహనీయ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
ఐదు విషయాలను ఐదు విషయాలకు ముందు సద్వినియోగం చేసుకోండి
اغتنم خمسا قبل خمس (ఇగ్తనిమ్ ఖమ్సన్ ఖబ్ల ఖమ్సిన్) ఈ ఐదు స్థితులు రాకముందు ఈ ఐదు స్థితులను మీరు అదృష్టంగా భావించి దాన్ని మీరు వినియోగించుకోండి.
حَيَاتَكَ قَبْلَ مَوْتِكَ (హయాతక ఖబ్ల మౌతిక) మీ జీవితాన్ని చావు రాకముందు. చావు వచ్చిన తర్వాత ఏమైనా సత్కార్యాలు చేయగలుగుతామా? చేయలేము.
وَشَبَابَكَ قَبْلَ هَرَمِكَ (వ షబాబక ఖబ్ల హరమిక) రెండవది, మీ యవ్వనాన్ని వృద్ధాప్యం రాకముందు. “జవానీ మే క్యా జీ, తౌబా కర్తే సో బుడ్డే హోనే కే బాద్ కర్నా.” ఇది ఒక సామెతగా అయిపోయింది చాలా మంది ప్రజల్లో ఇది. హజ్ ఎప్పుడు చేయాలి అంటే మన సామాన్యంగా ఇండియా, పాకిస్తాన్ నుండి హజ్ గురించి వచ్చే వచ్చేవాళ్లు ఎక్కువ శాతం ఎవరు ఉంటారు? ముసలివాళ్లు. ఇక్కడ కూడా కొందరు ఉన్నారు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు గడిచాయి, ఒక ఉమ్రా కూడా నసీబ్ లేదు. “ఉమ్రా చేయండి, హజ్ చేయండి” అంటే, “అరే! ఇంత తొందరగా ఎందుకు? మళ్ళీ ఏమైనా పాపాలు జరుగుతాయి కదా.” అస్తగ్ఫిరుల్లాహ్. అయితే ఇంకా జీవితం ముందుకు దొరుకుతుంది, ఆ తర్వాత హజ్ చేసిన తర్వాత ఇక మనం పుణ్యాల్లోనే జీవితం గడిపే అంతటి అవకాశం ఉంటుంది అన్నటువంటి నమ్మకం ఉందా మనకు? మరి అలాంటప్పుడు ఆలస్యం దేని గురించి? తౌబా ప్రతి ఒక్కరు చేస్తూ ఉండాలి. షబాబక్, యవ్వనం, ఇగ్తనిమ్, దీన్ని అదృష్టంగా భావించు, ఖబ్ల హరమిక్, వృద్ధాప్యానికి చేరుకునే ముందు.
సోదరులారా! ఇంతకుముందు 55, 60, 60 దాటిన తర్వాత వాళ్లను ముసలివాళ్లు అని అనేవారు, వృద్ధులు అనేవారు. కానీ ఈ రోజుల్లో 40 వరకే డల్ అయిపోతున్నారు అందరూ. అవునా లేదా? అందుగురించి, యవ్వనంలో చేసే అటువంటి ఆరాధన, దాని పుణ్యం వృద్ధాప్యంలో చేసే ఆరాధన కంటే ఎక్కువ గొప్పగా ఉంటుంది. అందుగురించి ప్రవక్త ఏం చెప్పారు? నీ యవ్వనాన్ని నీవు అదృష్టంగా భావించు వృద్ధాప్యం రాకముందు.
وَصِحَّتَكَ قَبْلَ سَقَمِكَ (వ సిహ్హతక ఖబ్ల సఖమిక) ఆరోగ్యాన్ని అనారోగ్యానికి గురి కాకముందే నీవు అదృష్టంగా భావించు.
وَغِنَاكَ قَبْلَ فَقْرِكَ (వ గినాక ఖబ్ల ఫఖ్రిక) అల్లాహ్ ఏదైనా ధనం ఇచ్చి ఉన్నాడు, దాన్ని బీదరికానికి గురి కాకముందే అదృష్టంగా భావించు.
وَفَرَاغَكَ قَبْلَ شُغْلِكَ (వ ఫరాగక ఖబ్ల షుగులిక) ఏదైనా సమయం దొరికింది, దాన్ని అదృష్టంగా భావించి సత్కార్యాలలో గడుపు, నీవు ఏదైనా పనిలో బిజీ కాకముందు.
సమయాన్ని వృధా చేయవద్దు
ఇప్పుడు మనలో ఎంతో మంది యువకులు తమ యవ్వనాన్ని, తమ ఆరోగ్యాన్ని, తమ యొక్క ఫ్రీ టైమ్ ఏం చేస్తున్నారు అంటే, టైం పాస్ చేస్తున్నాను. ఏం చేస్తున్నారు? టైం పాస్ చేస్తున్నారు. పాస్ అన్నదానికి ఒక అర్థం, గడుపుతున్నాము అని కూడా వస్తుంది, కొడుకు ఎగ్జామ్ లో పాస్ అయిండా ఫెయిల్ అయిండా? ఆ భావం కూడా వస్తుంది. కానీ ఒకసారి ఆలోచించాలి. సామాన్యంగా అనుకునేవారు, టైం గడుపుతున్నాము అనే భావం తీసుకుంటున్నారు. కానీ ఎందులో? ఫిలింలు చూస్తూ, పాటలు వింటూ, లేదా క్యారమ్ బోర్డులు ఆడుకుంటూ, దాన్ని ఏమంటారు ఏదో, రాజా, రాణి, చోర్, ఏదో కాగితాలు ఉంటాయి కదా, పేకాట? పేకాట అంటారా? ఇట్లాంటి ఆటల్లో గడుపుతూ ఉంటారు. ఏం చేస్తున్నారు అంటే, అతను టైం పాస్ చేస్తున్నాము. కానీ వాస్తవానికి, ఇక్కడ టైం పాస్ అయితలేదు, ఇందులో నీవు గడిపే టైం అంతా ఫెయిల్ అవుతుంది. రేపటి రోజు అల్లాహ్ ముందు చేరుతావు, ఈ సమయం ఏదైతే నీవు వృధాగా గడిపావో, అల్లాహ్ యొక్క స్వయంగా నీకు విద్యాపరంగా, నీ మేధాపరంగా, నీ ఇహలోక పరంగా, నీ పరలోక పరంగా లాభం చేగూర్చలేని దానిలో నువ్వు ఏదైతే గడిపావో, దాని గురించి నీవు సమాధానం చెప్పవలసి ఉంది. అందుగురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఏం చెప్తారు?
మనిషి ఏ సమయాన్నైతే పడుకొని ఉండి గాని, కూర్చొని ఉండి గాని, నడుస్తూ ఉండి గాని అల్లాహ్ యొక్క ధ్యానంలో గడపకుంటే, అతని ఆ నడక, అతని ఆ కూర్చోవడం, అతని ఆ పడుకోవడం అదంతా పాపభరితంగా మరియు ఎంతో బాధకరమైన సమయంగా గడుస్తుంది. ప్రళయ దినాన దాని గురించి విచారణ, లెక్క అనేది జరుగుతుంది.
అందుగురించి సోదరులారా! ప్లీజ్, ఇక టైమ్ ను వృధా చేసుకోకండి. అల్లాహ్ త’ఆలా ఖురాన్ లోని ఒక్కో అక్షరానికి పది పది పుణ్యాలు ఇస్తానని వాగ్దానం చేస్తున్నప్పుడు, రోజు మనం ఖురాన్ చదవడంలో ఎంత సమయం గడుపుతున్నాము? ఇవన్నీ పరలోకంలో పనికి వచ్చే వస్తువులా కాదా? లేక పేకాటలా, ఫిలింలు చూడడమా, పాటలు వినడమా? అవి పనికి వస్తాయా? అందుగురించి సోదరులారా! మనం సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాము. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ధర్మపరంగా మన విద్య పెరగకుంటే, మనం చేస్తున్న ఆచరణలో, సత్కార్యాల్లో ఇంకా కొన్ని సత్కార్యాలు పెరగకుంటే, చెప్పండి మన జీవితం వృధా కాకుంటే ఇంకేమవుతుంది?
సౌదీలో పది సంవత్సరాలు ఉండి వచ్చిన తర్వాత, మీరు స్వదేశానికి తర్వాత మీ ఫ్రెండ్ గాని, లేక మీ బంధువులో ఎవరైనా గాని, “ఏం చేసినావురా పది సంవత్సరాలు ఉండి?” అంటే, “పని చేశాను.” “అవునురా పని చేశావు, ఇక్కడ కూడా ఎడ్లు, ఆవులు, గాడిదలు అన్నీ కూడా అవి కూడా పనిచేస్తున్నాయి. నువ్వు అక్కడికి పోయి పరదేశానికి పోయి ఏం సంపాదించావు అక్కడ, ఏం చేశావు? చెల్లె పెళ్లి చేశావా? బిడ్డ పెళ్లి చేశావా? ఇల్లు కట్టావా?” అడుగుతారా లేదా? అప్పుడు నువ్వు ఏమీ చేయలేదు అనుకో. ఇల్లు కట్టలేకపోయావు, చెల్లె పెళ్లి చేయలేకపోయావు, ఒక్క డబ్బు ఇక్కడ కూడబెట్టి ఒక పైసా అక్కడ నువ్వు ఏమీ చిన్న లాభం చేయలేకపోయావు. శబాష్ అని అంటారా లేకుంటే నాలుగు తిడతారా? కువైట్ పోయి వచ్చినా గాని, సౌదీయా పోయి వచ్చినా గాని, మలేషియా పోయి వచ్చినా గాని, అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా ఏమీ చేయకుంటే, కనీసం నీ తల్లిదండ్రులకు ఉండడానికి ఒక చిన్న గూడైనా, చిన్నవాడి ఇల్లన్నా మంచిగా తయారు చేస్తే బాగుండకపోవునారా? అని నాలుగు తిడతారా లేదా?
ఎగ్జాక్ట్లీ ఇదే ఉదాహరణ మనది. ఇహలోక జీవితం మనకు టెంపరరీగా ఇచ్చాడు దేవుడు, పరీక్ష సమయంగా ఇచ్చాడు దేవుడు, అల్లాహ్ త’ఆలా. ఇక్కడ మనం సత్కార్యాలు సమకూర్చుకోవాలి ఎక్కడి గురించి? పరలోకం గురించి. ఇప్పుడు మనం ఆలోచించండి, ఇక్కడికి వచ్చి జాలియాత్ క్లాసులలో పాల్గొని సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు గడిచాయి, సూరహ్ ఫాతిహా కరెక్ట్ కాలేదు, రుకూలో సుబ్హాన రబ్బియల్ అజీమ్ తప్ప ఇంకా వేరే కొత్త ఒక దుఆ నేర్చుకోలేదు, అత్తహియాత్ సరిగా రాదు, దాని తర్వాత దరూద్-ఎ-ఇబ్రాహీం గురించి ఇప్పుడు ఆలోచించలేదు. ఆలోచించండి, లాభంలో మన జీవితం గడుస్తున్నట్లా లేకుంటే నష్టంలో గడుస్తున్నట్లా? సంవత్సరాల తరబడి మనం క్లాసులలో వస్తాము లేక సంవత్సరాల తరబడి మనం జుమా ఖుత్బాలు వింటాము, కానీ పాటలు వినడం మానుకుంటలేము, ఫిలింలు చూడడం మానుకుంటలేము, గడ్డాలు వదలడం మనం మొదలుపెట్టలేము, ఇంకా అల్లాహ్ యొక్క మార్గంలో మనం మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి, మలుచుకోవాలి అన్నటువంటి భావన మనకు కలుగుతలేదు అంటే, ఇహలోక ప్రేమ మనలో ఎక్కువ ఉన్నట్లా, పరలోక ప్రేమ ఎక్కువ ఉన్నట్లా? చెప్పండి. ఇయ్యాల ఏదో తిన్నచ్చాడు, తాగచ్చాడు, బాగానే వర్షానికి ముందు ఉరుములు ఉరిమినట్టుగా జరుగుతుంది అనుకోకండి. ఇది మన వాస్తవ జీవితం. చెప్పే విషయాలు మీ అందరికంటే ముందు స్వయంగా నా ఆత్మకు, నా ఇస్లాహ్, నాకు నేను సరిదిద్దుకోవడానికి చెప్తున్నాను. ఆ తర్వాత మీ గురించి చెప్తున్నాను. ఆలోచించాలి. ఈ విషయాల్ని మనం పరస్పరం ఆలోచించుకోకుంటే, పరస్పరం మనలో మనం చర్చించుకుంటూ మనకు మనం బాగు చేసుకునే ప్రయత్నం చేయకుంటే, మరి ఎప్పుడు మన యొక్క క్లారిఫికేషన్, మన ఇస్లాహ్, మనకు సంబంధించిన అన్ని రకాల చెడు నుండి దూరం అవ్వడం ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? చనిపోయిన తర్వాతనా? అయ్యో, పాపం, ఇన్ని రోజులు వచ్చి వచ్చి ఇదే పాప స్థితిలో చనిపోయాడు అని నలుగురు ఎన్ని దుఆలు ఇచ్చినా గాని, దుఆకు ముందు అర్హుడు కాకుంటే మనిషి, వంద మంది కాదు, వెయ్యి మంది దుఆ చేసినా గాని లాభం ఉండదు.
అబ్దుల్లా బిన్ ఉబై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఉన్నటువంటి మునాఫిక్, వంచకుడు, ప్రవక్త వెనక నమాజ్ చేసేవాడు, ప్రవక్తతోని జిహాద్ లో కూడా పాల్గొనేవాడు. కానీ అతనికి యొక్క మగ్ఫిరత్, అతనికి క్షమాపణ అయితే లభించిందా? లేదు. అల్లాహ్ త’ఆలా చెప్పాడు:
إِنَّ الْمُنَافِقِينَ فِي الدَّرْكِ الْأَسْفَلِ مِنَ النَّارِ (ఇన్నల్ మునాఫిఖీన ఫిద్దర్కిల్ అస్ఫలి మినన్నార్) మునాఫిక్ లు నరకంలోని అతి అధమ స్థానంలో ఉంటారు.
చివరికి అతని కొడుకు కోరాడు, ప్రవక్తా, మీరు వచ్చి మా నాన్నగారి యొక్క జనాజా చేయించండి అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని జనాజా నమాజ్ చేయించడానికి కూడా వెళ్లారు. అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో ఆయత్ అవతరింపజేశాడు,
وَلَا تُصَلِّ عَلَىٰ أَحَدٍ مِّنْهُم مَّاتَ أَبَدًا (వలా తుసల్లి అలా అహదిమ్ మిన్హుమ్ మాత అబదా) అలాంటి వంచకులకు నమాజ్-ఎ-జనాజా కూడా మీరు చేయించకండి అని.
ప్రవక్త నమాజ్ చేయించారు కూడా, ప్రవక్త దుఆ అతని గురించి కబూల్ అయిందా? లేదు, కాలేదు. అందుగురించి మనలో కొందరు ఏమనుకుంటారు, ఏదో చిన్నపాటి పాపాలు జరుగుతూ ఉండి, తప్పులు జరుగుతూ ఉండి, ఆ, ఏదో ఇట్లా జీవితం గడుపితే ఏమైతంది, రేపటి రోజు కొద్ది రోజుల తర్వాతనైనా స్వర్గం పోతాం కదా, అయ్యో మా ఊర్లో ఇంత మంది మౌలీ సాబులు ఉన్నారు కదా, సౌదీలో ఒకవేళ చనిపోతే ఇంకా బాగుంటుంది, ఇక్కడ ఎక్కువ మంది జనాజా నమాజ్ చదువుతారు కదా. ఇట్లాంటి ఆలోచనల్లో కూడా ఉంటారు. అయితే దాని గురించి నేను చెప్తున్నాను. స్వయంగా మనం అల్లాహ్ క్షమాపణకు అర్హులు కాకుంటే, వంద మంది కాదు, వెయ్యి మంది కాదు, లక్షల మంది నమాజ్ చేసినా గాని, మన ఊర్లే కాదు, ఇక్కడ సౌదీలో కాదు, హరమ్ షరీఫ్ లో జనాజా జరిగినా గాని, మదీనాలో జరిగినా గాని, అతని యొక్క క్షమాపణ అనేది అర్హత లేకుంటే ఎంత మంది దుఆలు కూడా పనికి రావు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆ కూడా అబ్దుల్లా బిన్ ఉబై గురించి పనికి వచ్చిందా? రాలేదు.
అందుగురించి సోదరులారా, చెప్పే విషయం ఏంటంటే ఇహలోక జీవితం చాలా చిన్నగా ఉంది. నాలుగు రోజుల ఈ జీవితాన్ని మనం కేవలం తిండి, ఇంకా మన కోరికలు గడుపుకోవడంలోనే గడుపితే, పరలోకంలో చాలా నష్టం చూసుకోవాల్సి ఉంటుంది. అల్లాహ్ త’ఆలా అలాంటి నష్టాల నుండి మనందరినీ కాపాడుగాక. అందుగురించి ఖురాన్ యొక్క ఈ ఆయత్ ద్వారా నేను ఈనాటి ఈ ప్రసంగాన్ని సమాప్తం చేస్తాను. అల్లాహ్ త’ఆలా ఎవరైతే పరలోకానికి ప్రాధాన్యత ఇస్తారో, అల్లాహ్ వారి గురించి ఏం చెప్పారు?
إِنَّ هَٰؤُلَاءِ يُحِبُّونَ الْعَاجِلَةَ وَيَذَرُونَ وَرَاءَهُمْ يَوْمًا ثَقِيلًا (ఇన్న హా ఉలాఇ యుహిబ్బూనల్ ఆజిలత వ యదరూన వరాఅహుమ్ యౌమన్ సఖీలా) వీరు ఇహలోకానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు, ఇహలోకాన్ని ప్రేమిస్తున్నారు, మరియు ఆ భారీ, బరువైన ఆ రోజు ఏదైతే ఉందో దాన్ని వదిలేస్తున్నారు. (సూరహ్ ఇన్సాన్, ఆయత్ నెంబర్ 27)
ఆ రోజు చాలా శిక్ష కఠిన, ఎంతో భయంకరమైన ఆ రోజు. అది మన గురించి సులభతరంగా కావాలంటే, ఎంతో హాయిగా, మంచితనంగా గడవాలంటే, ఇహలోకంలో సత్కార్యాలు చేసుకోవాలి, సత్కార్యాల్లో జీవితం గడపాలి. అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net