ఈదుల్ అద్ హా (బక్రీద్) పండుగ – తెలుసుకోవలసిన విషయాలు  – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

ఖుత్బా అంశము: ఈదుల్ అద్హా (బక్రీద్)పండుగ –తెలుసుకోవలసిన విషయాలు                  

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.    

ఓ ముస్లిం లారా! ఒక గొప్ప దినము మనపై రాబోతున్నది. నిశ్చయంగా అది శుభకరమైనటువంటి ఖుర్బాని దినము. ఇది ఇస్లాం యొక్క గొప్ప విధి నెరవేర్చిన అనంతరం వస్తుంది. అనగా హజ్ తర్వాత వచ్చే పండుగ. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఈ విధంగా తెలియజేశారు: “అల్లాహ్ తఆలా దగ్గర అత్యంత ఘనత కలిగినటువంటి దినము – ఖుర్బానీ  (నహ్ర్) దినము“. అనగా; జిల్ హిజ్జా మాసం యొక్క పదవరోజు. ఆ తరువాత يَوْمُ الْقَرَّ “ఖర్ర్ దినము” (స్థిరపడి ఉండే రోజు) అనగా; జిల్ హిజ్జ మాసం యొక్క పదకొండవ  రోజు. ఈ రోజున హజ్ చేసే వారందరూ మినా ప్రదేశంలో ఆగుతారు.

1. ఈ ఖుర్బానీ పండుగ రోజుకు ఇతర దినాలపై ప్రాధాన్యతను ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే; హజ్ కు సంబంధించినటువంటి ఎక్కువ ఆచరణలు ఇదే రోజున పాటించబడతాయి, ఉదాహరణకు; హజ్ చేసేవారు ఆ రోజు జమ్రా ఉఖ్బా (పెద్దదాని)పై రాళ్లు కొట్టాలి, ఖుర్బానీ ఇవ్వాలి, శిరోముండన చేయాలి, తవాఫె ఇఫాదా చేయాలి, సయీ చేయాలి. మరియు హజ్ చేయనటువంటి వారు ఆ రోజున ఖుర్బానీ జంతువు బలి ఇస్తారు. ఈ ఆచరణలన్నీ అదే రోజు చేయబడతాయి. ఈ విధముగా ఆచరణలు అన్నీ ఏకం అయ్యే మరొక రోజు లేదు అందుకే ఆ రోజుకి ఇంత ప్రాధాన్యత లభించింది.

2. ఇస్లామీయ పండుగలకు వేరే ఇతర పండుగలపై ఇంత ప్రాధాన్యత లభించడానికి గల కారణం ఏమిటంటే; ఈ పండుగలు ఎంతో వివేకాన్ని మరియు గొప్ప లక్ష్యాలను తీసుకుని వస్తాయి. అందులో నుండి ముఖ్యంగా అల్లాహ్ యొక్క ఆచారాలను గౌరవించడం, మరియు విశ్వాసులకు సంతోషాన్ని కలుగ చేయడం. ఇస్లాం యొక్క అనుయాయులు ఈ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విధి విధానాలు, సౌలభ్యాలు గురించి ప్రజలకు తెలియపరచాలి.

అరఫా దినము (తొమ్మిదవ జిల్ హిజ్జా), ఖుర్బానీ దినం (పదవ జిల్ హిజ్జా), ఆ తరువాత “తష్ రీఖ్” దినాలు ఇస్లామియా పండుగ దినములు తిని త్రాగేటువంటి దినాలు (అబూ దావూద్)

3. ఓ విశ్వాసులారా! ఆ రోజు ఒక విశ్వాసి అల్లాహ్‌ యొక్క సామీప్యం పొందాలంటే దాని కొరకు అల్లాహ్ మార్గంలో ఖుర్బానీ ఇవ్వాలి. ఇది అల్లాహ్ యొక్క “ఖలీల్” స్నేహితులైనటువంటి ఇబ్రహీం మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సున్నత్ విధానము.

4. ఖుర్బానీ చేయడానికి కొన్ని మర్యాదలు మరికొన్ని పద్ధతులు ఉన్నాయి ఉదాహరణకు; జంతువుని ఖిబ్లా వైపు తిప్పి జుబహ్ చేయాలి, మరియు దానిపై అల్లాహ్ నామాన్ని పఠించాలి. ఈ విధంగా అనాలి:

اللهم هذا منك ولك، اللهم هذا عني وعن أهل بيتي، اللهم تقبل مني
అల్లాహుమ్మ హాజా మిన్ క వలక్, అల్లాహుమ్మ హాజా అన్నీ వ అన్ అహ్ల్ బైతీ, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్నీ
(ఓ అల్లాహ్! ఖుర్బానీ చేయు భాగ్యం నీవే ప్రసాదించావు. ఇది నీ కొరకే ఖుర్బానీ చేయుచున్నాము. ఓ అల్లాహ్! నా వైపు నుండి మరియు నా కుటుంబం వైపు నుండి దీనిని స్వీకరించు)

5. ఖుర్బానీ ఇచ్చే వారు స్తోమత ఉంటే స్వయంగా జంతువుని జుబహ్ చేయాలి. దాని విధానం – నిర్ణీత స్థలం అంటే గొంతును కోయాలి;  రక్తం వేగంగా ప్రవహించే రెండు రక్త నరాలు కోయాలి, ఇంకా శ్వాస నాళం మరియు ఆహారనాళం కోయాలి.

6. ఎవరైనా తన ఖుర్బానీ జంతువును వధించే బాధ్యతను మరొక వ్యక్తికి అప్పగిస్తే, దానిని వధించే వ్యక్తి అతని తరపున ఈ దువాను పఠించాలి: 

اللهم هذا منك ولك، اللهم هذا عن فلان ، اللهم تقبل منه
అల్లాహుమ్మ హాజా మిన్ క వలక్, అల్లాహుమ్మ హాజా అన్ ఫులాన్, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్ హు
(ఓ అల్లాహ్! ఖుర్బానీ చేయు భాగ్యం నీవే ప్రసాదించావు, ఇది నీ కొరకే ఖుర్బానీ చేయుచున్నాము, ఓ అల్లాహ్!  ఇది ఫలానా (పేరు పలకాలి) వ్యక్తి తరుపు నుండి దీనిని స్వీకరించు).

7. కత్తిని లేక చాకుని ఖుర్బానీ జంతువు నుండి దాచి ఉంచాలి. దాని ముందు పదును పెట్టరాదు, మరియు ఇతర జంతువుల ముందు దానిని జబహ్ చేయరాదు. ఇందులో మనం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సూక్తిని అనుసరించాలి: అల్లాహ్ తఆలా ప్రతి దానిపట్ల ఉన్నతంగా వ్యవహరించాలని ఆజ్ఞాపించాడు. కాబట్టి మీరు దేనినైనా వధించ వలసి వచ్చినప్పుడు దానిని ఉన్నతంగా వధించండి మరియు తమ ఆయుధానికి బాగా పొద్దున పెట్టండి .ఎందుకంటే వధించబడే జంతువును బాధించరాదు. (ముస్లిం)

8. ఖుర్బానీ ఇచ్చేటువంటి సమయం నాలుగు రోజుల వరకు ఉంటుంది. పండుగ రోజు ఆ తర్వాత మూడు “తష్ రీఖ్” దినాలు. ఇందులో మొదటి రోజు ఖుర్బానీ ఇవ్వడం ఉత్తమం. ఎందుకంటే ఇది జిల్ హిజ్జా మాసం యొక్క మొదటి పది రోజులలో ఉంది.

9. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు కొమ్ములు తిరిగిన తెల్లని రెండు పొట్టేళ్లను ఖుర్బానీగా ఇచ్చారు. మరియు ఎలాంటి జంతువుని ఖుర్బాని చేయకూడదో అది కూడా తెలియజేశారు. ఒంటి కన్ను కలిగిన దానిని ,రోగం ఉన్నట్లు స్పష్టంగా ఉన్న దానిని, కుంటిది, ఎముకల్లో సత్తువ లేని ముసలిది.(అహ్మద్)

10. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు పండగ రోజున ఖుర్బానీ మాంసం తోనే భోజనాన్ని ప్రారంభించే వారు.

11. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కాలంలో ప్రజలు ఖుర్బానీ ఇవ్వడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు, మరియు ఉన్నవాటిలో అన్నింటికంటే మంచి జీవాలను కొనుగోలు చేసేవారు, ఎందుకంటే ఎంత దృఢంగా ఆరోగ్యంగా ఉంటే అది అల్లాహ్ వద్ద అంతే ప్రియమైనదిగా పరిగణించబడుతుంది, మరియు దాని ద్వారా ఖుర్బానీ చేసే వ్యక్తికి కూడా అంతే ప్రతిఫలం లభిస్తుంది. ఇమామ్ ఇబ్నే తైమియా (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేశారు: “సాదారణంగా ఖుర్బానీ యొక్క పుణ్యఫలం దాని ఖరీదును బట్టి ఉంటుంది”. (అల్ ఫతావా)

12. అల్లాహ్ దాసులారా! ఖుర్బాని జీవం పై ఖర్చు పెట్టడంలో ఎలాంటి పరిమితి లేదు. దాని మాంసం తినవచ్చు, ప్రయాణంలో తీసుకు వెళ్లొచ్చు ,మరియు పేదలలో పంచి పెట్టవచ్చు. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

 فَكُلُوا مِنْهَا وَأَطْعِمُوا الْقَانِعَ وَالْمُعْتَرَّ
వాటిని (మీరూ) తినండి, అడగని అభాగ్యులకు, అడిగే అగత్యపరులకు కూడా తినిపించండి” (సూరా అల్ హజ్ 22:36)

హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియచేశారు:
(తినండి తినిపించండి మరియు దాచుకోండి) (ముస్లిం)

13. జంతువును జూబహ్ చేసిన తర్వాత, దానిలోని ఏ భాగాన్ని కానీ, మాంసాన్ని గానీ, చర్మాన్ని గానీ, మరేదైనా అమ్మడానికి అనుమతి లేదు.

14.  అవిశ్వాసుల హృదయాలు ఇస్లాం వైపు మొగ్గడానికి వారికి ఖుర్బానీ మాంసాన్ని ఇవ్వచ్చు.

15. ఖుర్బానీ మాంసాన్ని కసాయి వానికి కూలీగా ఇవ్వరాదు. ఎందుకంటే ధర్మం దీనికి అంగీకరించలేదు. కనుక అతనికి కూలీగా డబ్బులు మాత్రమె ఇవ్వాలి.

16. ఓ అల్లాహ్ దాసులారా! ఈ గొప్ప పండుగ తర్వాత ఘనత కలిగినటువంటి దినాలు కూడా వస్తాయి. వాటిని “తష్రీఖ్” దినాలు అంటారు ఆ దినములలో అతి ఎక్కువగా” జిక్ర్ “స్మరణ చేయమని అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు:

وَاذْكُرُوا اللَّهَ فِي أَيَّامٍ مَّعْدُودَاتٍ
(గణించదగిన ఆ దినాలలో (తష్రీఖ్‌ దినాలలో) అల్లాహ్‌ను స్మరించండి.) (సూరా అల్ బఖర 2:203)

ఈద్ రోజులలో చేయవలసిన ముఖ్యమైన ఆచరణ ఇక్కడ తెలపడం జరుగుతుంది: “తష్రీఖ్” యొక్క మూడు రోజులలో అన్ని సమయాలలో సంపూర్ణ తక్బీర్ పటించాలి. మరియు మూడవరోజు మగ్రిబ్ నమాజ్ వరకు తక్బీర్ చదువుతూ ఉండాలి. అలాగే  “తష్రీఖ్” యొక్క మూడవ రోజున అసర్ వరకు రోజువారీ ప్రార్థనలలో ఐదు పూటల ఈ విధంగా తక్బీర్ పటించాలి:

(అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లాల్లాహ్,  వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్)
ఇందులో అల్లాహు అక్బర్ రెండుసార్లు లేదా మూడుసార్లు పటించవచ్చు

17. తష్రీఖ్” దినాలు వాస్తవానికి తిని త్రాగే మరియు అల్లాహ్ స్మరించుకునే రోజులు. ఈ రోజులలో ఉపవాసం ఉండడం అనుమతించబడలేదు, ఎందుకంటే అవి పండుగ రోజులు.

మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియజేశారు: “తష్రీఖ్” దినాలు తిని త్రాగేటువంటి రోజులు”.
మరో హదీసులో ఉంది: “అల్లాహ్ ను స్మరించే రోజులు”.

18. ఈద్ గొప్ప ప్రయోజనాల్లో ఒకటి: ముస్లింల మధ్య సంబంధాన్ని నెలకొల్పడం, ఒకరినొకరు కలిసే సద్భావం కలిగి ఉండటం. హృదయాలలో సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకోవడం, భయం మరియు పేదరికాన్ని తొలగించడం, మరియు ద్వేషం మరియు అసూయలను నివారించడం, మరియు హృదయాలలో రగులుతున్న అసూయ అనే అగ్నిని ఆర్పడం. ఈద్ ప్రార్థనను నిర్వహించడానికి ముస్లింలను ఒకే చోట సమీకరించగల ఇస్లాం యొక్క సామర్ధ్యం మనకు కనిపిస్తుంది. అంతేకాదు భక్తి ప్రాతిపదికన వారిని సత్యం పై స్థిరంగా వారి హృదయాలను మార్గనిర్దేశం చేస్తుందనడానికి సంకేతం.

నౌమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియజేశారు: “విశ్వాసుల ఉదాహరణ కరుణపరంగా, ఐక్యత పరంగా, ప్రేమ పరంగా ఒక శరీరం లాంటిది. కనుక శరీరంలో ఏదైనా భాగంలో నొప్పి కలిగితే దాని ద్వారా జ్వరం వస్తుంది. అప్పుడు శరీరంలో ఉన్న అవయవాలన్ని ఒకదానికి ఒకటి సహకరించుకుంటాయి”. (ముస్లిం)

పండగ రోజున చేసేటువంటి మరొక అభిలషనీయమైన పని ఏమిటంటే; ఆ రోజున బంధుత్వాలను కలుపుకోవాలి. ఎందుకంటే అల్లాహ్ తన దాసుడిపై దీనిని విధిగా చేశాడు. ముఖ్యంగా శుభ సందర్భాలలో కాబట్టి ఎవరైతే బంధుత్వాలను కలుపుకుంటారో అల్లాహ్ తఆల అతనికి దగ్గరవుతాడు, మరి ఎవరైతే బంధుత్వాన్ని తెంచుకుంటారో అలాంటి వారిని అల్లాహ్ తన కారుణ్యం నుండి దూరం చేస్తాడు,

అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఎలా తెలియజేశారు అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు: “నేను కరుణామయుడును నేనే బంధుత్వాన్ని పుట్టించాను. మరియు దాని పేరును నా పేరుతో జోడించాను. కాబట్టి ఎవరైతే నీతో సంబంధం పెట్టుకుంటాడో అతనితో నేను సంబంధం పెట్టుకుంటాను, మరియు ఎవరైతే త్రేగదెంపులు చేసుకుంటాడో అతనితో నేను త్రేగదెంపులు చేసుకుంటాను“. (ముస్లిం)

ఓ అల్లాహ్ దాసులారా! కనుక ఎవరైతే తమ బంధువులతో స్నేహితులతో పోట్లాట కారణంగా విడిపోయారో వారు మన్నింపుల వైఖరిని అవలంబించండి. ఎందుకంటే అల్లాహ్ ఇలా అంటున్నాడు:

فَمَنْ عَفَا وَأَصْلَحَ فَأَجْرُهُ عَلَى اللَّهِ
కాని ఎవరయినా (ప్రత్యర్థిని) క్షమించి, సయోధ్యకు వస్తే అతనికి పుణ్య ఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్‌ది. ( సూరా ఆష్ షూరా 42:40)

మరొకచోట ఇలా అంటున్నాడు:

إِنَّمَا الْمُؤْمِنُونَ إِخْوَةٌ فَأَصْلِحُوا بَيْنَ أَخَوَيْكُمْ
విశ్వాసులు (ముస్లింలు) అన్నదమ్ములు (అన్న సంగతిని మరువకండి). కనుక మీ అన్నదమ్ముల మధ్య సర్దుబాటుకు ప్రయత్నించండి. (సూరా అల్ హుజురాత్ 49:10)

19. ఓ అల్లాహ్ దాసులారా పండుగ శుభాకాంక్షలు తెలుపడం ఒక మంచి పని. ఇబ్నె తైమియా (రహిమహుల్లాహ్) ఇలా తెలియ చేస్తున్నారు:  పండుగ నమాజ్ తరువాత ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు (تقبل الله منا ومنكم، وأحاله الله عليك) తెలుపుకునే విధానం కొందరి సహాబాల ద్వారా మనకు తెలుస్తుంది. మరియు కొంత మంది ధర్మ పండితులు కూడా దీనిని సమ్మతించారు. (అల్ ఫతావా)

20. అల్లాహ్ దాసులారా! అల్లాహ్ యొక్క అనుగ్రహాలకు వ్యతిరేకంగా చట్ట విరుద్ధమైన నిషేధించబడిన విషయాలకు పాల్పడితే దానికి బదులుగా అల్లాహ్ యొక్క శిక్ష వచ్చి పడుతుంది అని భయపడండి.

చివరిగా నేను, నా కోసం మరియు మీ కోసం పాప క్షమాపణ కోసం అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నాను, ఖచ్చితంగా అతను క్షమించేవాడు మరియు దయగలవాడు.

స్తోత్రం మరియు దరూద్ తరువాత

ఓ విశ్వాసి స్త్రీలారా! అల్లాహ్ విశ్వాస మాతృమూర్తులకు ఆజ్ఞాపిస్తూ ఖురాన్ ఈ విధంగా అంటున్నాడు:

وَقَرْنَ فِي بُيُوتِكُنَّ وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْجَاهِلِيَّةِ الْأُولَىٰ ۖ وَأَقِمْنَ الصَّلَاةَ وَآتِينَ الزَّكَاةَ وَأَطِعْنَ اللَّهَ وَرَسُولَهُ

మీరు మీ ఇండ్లల్లోనే ఆగి ఉండండి. పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా మీ సింగారాన్ని చూపిస్తూ తిరగకండి. నమాజు చేస్తూ ఉండండి. జకాతు ఇస్తూ ఉండండి. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి. (సూరా అల్ ఆహ్ జాబ్ 33:33)

అల్లాహ్‌ను తమ ప్రభువుగా, ఇస్లాంను తమ మతంగా మరియు ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రవక్తగా అంగీకరించే ఓ ఇస్లాం మహిళ లా, తీర్పు దినం వరకు వారి అడుగుజాడల్లో నడిచే విశ్వాసుల తల్లులకు మరియు విశ్వాసులైన మహిళలకు ఈ దైవిక ఉపదేశం సాధారణంగా అందరికీ వర్తిస్తుంది, కాబట్టి అల్లాహ్ కు మరియు ప్రవక్త విధేయతకు కట్టుబడి ఉండాలి.

మానవులు మరియు జిన్నాతులు యొక్క చెడు విధానాల పట్ల తస్మాత్ జాగ్రత్త వహించాలి. నగ్నత్వం మరియు అశ్లీల ఉపద్రవం యొక్క ప్రలోభాలలో పడకండి. అల్లాహ్ ఇలా అంటున్నాడు;

وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْجَاهِلِيَّةِ الْأُولَىٰ 
పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా మీ సింగారాన్ని చూపిస్తూ తిరగకండి. (సూరా అల్ ఆహ్ జాబ్ 33:33)

భద్రతను, క్షేమాన్ని కోరుకునే స్త్రీ తనను తాను అవిస్వాసుల కార్యకలాపాలలో అనుసరించకూడదు, ఎందుకంటే వారిని అనుసరించడం వలన ఇది హృదయం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అప్పుడు మనలో కూడా ఆ అవలక్షణాలు చోటు చేసుకుంటాయి. అల్లాహ్ ఇలా అంటున్నాడు:

وَاللَّهُ يُرِيدُ أَن يَتُوبَ عَلَيْكُمْ وَيُرِيدُ الَّذِينَ يَتَّبِعُونَ الشَّهَوَاتِ أَن تَمِيلُوا مَيْلًا عَظِيمًا

అల్లాహ్‌ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాలని కోరుతున్నాడు. కాని, తమ మనోవాంఛలను అనుసరిస్తున్నవారు మాత్రం మీరు (దైవమార్గం నుంచి) పెడదారి తీసి చాలా దూరం వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. (సూరా అన్ నిసా 4:27)

మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు! అల్లాహ్ మీ అందరినీ ఎల్ల వేళలా సుఖ సౌఖ్యాలతో ఉంచుగాక. అందరి పై తన శుభాల వర్షాన్ని కురిపించు గాక. అందరి ఆరాధనలు స్వీకరించుగాక. పాపాలను మన్నించుగాక. అల్లాహ్ అందరి ధర్మ సమ్మతమైన కోరికలు తీర్చుగాక. సదా చరణ పై స్థిరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు గాక!

చివరగా! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ పంపుతూ ఉండండి, ఎవరైతే ఒకసారి దరూద్ పంపుతారో అల్లాహ్ అతనిపై పది కారుణ్యాలు కురిపిస్తాడు.

اللهم صلِّ وسلِّم وبارك على عبدك ورسولك نبينا محمد، وعلى آله وصحبه أجمعين

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

అల్లాహ్ నామాలపై  గుణగణాలపై విశ్వాసం  – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه 

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢ 

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١ 

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١ 

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత : 

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.    

ఓ విశ్వాసులారా! అల్లాహ్ యొక్క దైవభీతి కలిగి ఉండండి. అల్లాహ్ అవిధేయతకు దూరంగా ఉండండి. ఇస్లాంలో అఖీదా పరంగా అల్లాహ్ యొక్క పవిత్ర నామాలపై, గుణగణాలపై విశ్వాసం తీసుకురావడం తప్పనిసరి. ఇస్లాంలో దీనికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంది. అల్లాహ్ తన మహోత్తరమైన దివ్య గ్రంథం ఖురాన్ లో తన గుణగణాలను ప్రస్తావిస్తూ ఇలా తెలియజేశాడు:

وَكَانَ ٱللَّهُ غَفُورٗا رَّحِيمًا
మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

మరొకచోట ఇలా ప్రస్తావించబడింది.

إِنَّ ٱللَّهَ كَانَ سَمِيعَۢا بَصِيرٗا
నిశ్చయంగా అల్లాహ్ వినేవాడు మరియు చూసేవాడు

ఇలాంటి వాక్యాలు దివ్య ఖురాన్ లో అనేక చోట్ల అనేకమార్లు ప్రస్తావించబడ్డాయి. అదే విధంగా దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా హదీసులలో అనేకసార్లు అల్లాహ్ యొక్క స్తోత్రం, ఆయన గుణగణాలను గురించి కొనియాడేవారు. 

అల్లాహ్ యొక్క నామాలపై, గుణగణాలపై విశ్వాసం ఉంచడం వలన దాసునిలో దైవభీతి మరియు భక్తితత్వం పెరుగుతుంది. దాని ద్వారా అల్లాహ్ దాసుని పట్ల ఎంతో సంతోషిస్తాడు. (ఎందుకంటే వాస్తవికత కూడా ఇదే) దాసుడు అల్లాహ్ గురించి ఎంత తెలుసుకుంటాడో అల్లాహ్ తో అంతే భయపడతాడు. ఉదాహరణకి, అల్లాహ్ దివ్య ఖురాన్ లో ఇలా సెలవిస్తున్నాడు:

إِنَّمَا يَخۡشَى ٱللَّهَ مِنۡ عِبَادِهِ ٱلۡعُلَمَٰٓؤُاْۗ
అల్లాహ్ దాసులలో జ్ఞానం గలవారు మాత్రమే ఆయనకు భయపడతారు.

సర్వం అల్లాహ్ యొక్క పవిత్ర నామాలపై, ఆయన గుణగణాలపై విశ్వాసం తేవడం యొక్క ప్రాధాన్యత ఎంతో మనకు వీటి ద్వారా తెలుస్తుంది. అందుకే దాసునిపై విధి ఏమిటంటే అతను అల్లాహ్ యొక్క పవిత్ర నామాలపై,  గుణగణాలపై అదే విధంగా విశ్వాసం తీసుకురావాలి ఏ విధంగా అయితే అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్ లో మరియు ప్రవక్త హదీసులలో బోధించబడిందో. 

ఓ విశ్వాసులారా! అల్లాహ్ యొక్క నామాలను ఆయన గుణగణాలను విశ్వసించడానికి రెండు ఆవశ్యకతలు ఉన్నాయి.  

మొదటిది: అవి వెల్లడి చేసిన విధానంలో, వాటి స్పష్టమైన అర్థంలో ఎలాంటి ఎలాంటి వక్రీకరణలు, అనుసరణులు, దిద్దుబాటులు లేకుండా అర్థం చేసుకోవడం.

క్రింది వక్రీకరణలు చేయకూడదు:

  • తహ్‌ రీఫ్‌’ అంటే: ఏ ఆధారము లేకుండా నామగుణాల భావాన్ని మార్చుట. తారుమారు చేయుట.
  • ‘తతీల్‌’ అంటే: అల్లాహ్‌ గుణనామాలన్నిటిని లేదా కొన్నిటిని తిరస్మరించుట. ఉదాహరణకు అల్లాహ్‌ ను నిరాకారునిగా నమ్ముట.
  • ‘తక్‌ యీఫ్‌’ అంటే: అల్లాహ్‌ గుణాలను మాట, ఊహ ద్వారా ఏదైనా ఒక రూపం ఇచ్చే ప్రయత్నం చేయుట. ఉదాహరణకు అల్లాహ్‌ చేయి అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని అనుట.
  • ‘తమ్‌సీల్‌ అంటే: అల్లాహ్‌ గుణాలను సృష్టి గుణాలతో పోల్పుట. లేదా సృష్టి గుణాల మాదిరిగా ఉంటాయని విశ్వసించుట.

అల్లాహ్ ఇలా తెలియజేశాడు:

وَلِلَّهِ ٱلۡمَثَلُ ٱلۡأَعۡلَىٰۚ
మరియు అల్లాహ్ మాత్రమే సర్వోన్నతుడిగా పరిగణింపబడేవాడు.

మరొకచోట ఇలా తెలియజేయడం జరిగింది.

لَيۡسَ كَمِثۡلِهِۦ شَيۡءٞۖ وَهُوَ ٱلسَّمِيعُ ٱلۡبَصِيرُ
ఆయనకు పోలింది ఏదీ లేదు. మరియు ఆయన సర్వం వినేవాడు, చూసేవాడు.

రెండవ ఆవశ్యకత ఏమనగా: అల్లాహ్ యొక్క ఏయే పేర్లు మరియు గుణగణాలు ఖురాన్ మరియు హదీసులలో తెలియ చేయబడ్డాయో కేవలం వాటిపై మాత్రమే సరిపెట్టుకొని, వాటిపై మాత్రమే విశ్వాసము ఉంచడం. అందులో కొత్త పేర్లు చేర్చడం కానీ లేక మార్పు చేర్పులకు గురిచేయడం కానీ చేయరాదు.

ఇమామ్ అహ్మద్ బిన్  హంబల్ రహిమహుల్లాహ్ ఇలా తెలియచేశారు:

“అల్లాహ్ తఆలా ఏవైతే తన ప్రియమైన పేర్లను, ఉన్నతమైన స్వభావం కలిగిన గుణాలను గురించి తెలియజేశారో వాటికంటే గొప్పగా ఎవరూ కూడా తెలియజేయలేరు. ఇది అల్లాహ్ యొక్క ఔన్నత్యం”.
(ఖాజీ అబూ యాలా “తిబఖాతుల్ హనాబిల లో ఈ విషయాన్ని తెలియచేసారు)   

ఓ అల్లాహ్ దాసులారా! అల్లాహ్ యొక్క పేర్లకు, గుణగణాలకు విరుద్ధం ఏమిటంటే వాటిలో నాస్తికత్వాన్ని  చేర్చడము (ఇల్ హాద్ కి పాల్పడటం) అనగా అల్లాహ్ యొక్క పవిత్ర నామాలను మరియు గుణగణాల అర్ధాలను  ఏవిధంగానైతే మన పూర్వీకులు సలఫ్  పండితులు అర్థం చేసుకున్నారో అలా అర్థం చేసుకోకపోవడం. 

ఇల్ హాద్ అనేక రకాలు. అందులో ముఖ్యమైనది ఏమిటంటే అల్లాహ్ పేర్ల యొక్క అసలు అర్ధాన్ని మార్చడం, లేకపోతే అసలు అర్థమే లేకుండా చేయడం. ఈ రెండు విషయాలు విశ్వాసానికి విరుద్ధమైనవి మరియు అలాంటి మార్పుచేర్పులకు గురి అయిన పేర్లను అజ్ఞానంతో అల్లాహ్ వైపు ఆపాదించడం ఘోరమైన పాపం మరియు సలఫ్ పండితులు వారించినటువంటి బిద్అత్ లలో ఒకటి అవుతుంది. అల్లాహ్ అలాంటి వారిని శిక్ష  గురించి హెచ్చరిస్తున్నాడు.

అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

وَلِلَّهِ ٱلۡأَسۡمَآءُ ٱلۡحُسۡنَىٰ فَٱدۡعُوهُ بِهَاۖ وَذَرُواْ ٱلَّذِينَ يُلۡحِدُونَ فِيٓ أَسۡمَٰٓئِهِۦۚ سَيُجۡزَوۡنَ مَا كَانُواْ يَعۡمَلُونَ
మరియు అల్లాహ్ పేర్లు అన్నీ అత్యుత్తమమైనవే; కావున మీరు వాటితో ఆయనను ప్రార్థించండి. మరియు ఆయన పేర్ల విషయంలో సత్యం నుండి వైదొలగిన వారిని విసర్జించండి. వారు తమ కర్మలకు ప్రతిఫలం పొందగలరు.

మరో చోట ఇలా సెలవిచాడు:

[وَلَا تَقۡفُ مَا لَيۡسَ لَكَ بِهِۦ عِلۡمٌۚ إِنَّ ٱلسَّمۡعَ وَٱلۡبَصَرَ وَٱلۡفُؤَادَ كُلُّ أُوْلَٰٓئِكَ كَانَ عَنۡهُ مَسۡ‍ُٔولٗا]
మరియు (ఓ మానవుడా!) నీకు తెలియని విషయం వెంటబడకు. నిశ్చయంగా చూపులూ, వినికిడీ మరియు హృదయం వీటన్నింటినీ గురించీ, (తీర్పు దినమున) ప్రశ్నించడం జరుగుతుంది.

ఓ విశ్వాసులారా! ఇల్ హాద్ రకాలలో ముఖ్యమైనది ఏమిటంటే అల్లాహ్ సద్గుణ విశేషాలలో వక్రీకరణకు పాల్పడటం. అనగా అసలు పేరు యొక్క అర్ధాన్ని మార్చడం. వీటి గురించి సలఫ్ పండితులు అనగా మన పూర్వీకులు ఖురాన్ మరియు హదీస్ జ్ఞానం  ఉన్నవారు మాత్రమే వీటి అసలు అర్థాలను గ్రహించగలరు. ఉదాహరణకు మన సహాబాలు జ్ఞానాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి నేర్చుకున్నారు మరియు చిత్తశుద్ధితో ఆయనకు విధేయత చూపారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సైతం వారి గురించి ఇలా సాక్ష్యం ఇచ్చారు – “అందరికంటే మంచివారు, ఉత్తమమైన వారు నా కాలం నాటివారు, ఆ తర్వాత వారి తర్వాత వచ్చిన వారు, ఆ తర్వాత వారి తర్వాత వచ్చినటువంటి వారు“. (బుఖారి -2652 ముస్లిం -2533)  

దీని ద్వారా మనకు తెలిసొచ్చే దేమిటంటే ఏ విషయమైతే సహాబాల ఆలోచనకు విరుద్ధంగా ఉంటుందో ఆ విషయానికి ధర్మానికి ఏ సంబంధం లేదు. అది కేవలం ఒక కల్పితం మాత్రమే అవుతుంది.  అల్లాహ్ యొక్క నామాలలో సద్గుణ విశేషాలలో వక్రీకరణకు పాల్పడటం యొక్క ఉదాహరణ: (అల్లాహ్ సింహాసనం పై ఆసీనుడై ఉన్నాడు) దీని భావం ఆయన అక్కడి నుండి తన ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాడు.  కానీ భావించే వాళ్ళు మాత్రం ఆయన అక్కడ సింహాసనంపై ఉన్నతంగా ఉన్నాడు అనే విషయాన్ని తిరస్కరిస్తారు.  

మరొక రకం ఏమిటంటే అల్లాహ్ పేర్లలో ఏదైనా పేరు గురించి దాని స్వభావాన్ని గురించి అనేక రకాలుగా ఆలోచించడం. ఇది పూర్తిగా నిషేధించబడింది. ఎవరు కూడా తమ జ్ఞానం తో అల్లాహ్ ను గ్రహించలేరు. అల్లాహ్ ఇలా అంటున్నాడు [وَلَا يُحِيطُونَ بِهِۦ عِلۡمٗا]  (కాని వారు తమ జ్ఞానంతో ఆయనను గ్రహించజాలరు.) అనగా ఈ వాక్యంలో అల్లాహ్ గురించి ఆయన ఎలా ఉన్నాడు అన్నటువంటి విషయాల గురించి ఆలోచించడాన్ని అల్లా పూర్తిగా వారించాడు.  

మన సలఫ్ పండితులు కూడా ఈ విషయాన్ని కఠినంగా తిరస్కరించారు.  ఒక వ్యక్తి ఇమామ్ మాలిక్ బిన్ అనస్ (రహిమహుల్లాహ్) గారి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు ఓ (అబూ అబ్దుల్లాహ్)  అల్లాహ్ (రహ్మాన్) ఆర్ష్ పై ఎలా ఆసీనుడై ఉన్నాడు.? అని ప్రశ్నించాడు.  దానికి ఇమామ్ గారు కొద్దిసేపు తలవంచుకున్నారు. చమటలు కూడా పట్టసాగాయి. కొద్దిసేపు తర్వాత ఇలా సమాధానమిచ్చారు:

వెంటనే ఆ వ్యక్తిని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. (బైహఖీ ఫీ అస్మా వ సిఫాత్)   

ఇబ్నెఉతైమీన్ (రహిమహుల్లాహ్) గారు ఇమామ్ మాలిక్ గారి మాట గురించి వివరణ ఇస్తూ ఇలా తెలియజేశారు.

అల్లాహ్ యొక్క పవిత్ర నామాలలో ఇల్హాద్ కు పాల్పడటం యొక్క మరొక రకం ఏమిటంటే అల్లాహ్ ను ఇతరులతో పోల్చడం: ఉదాహరణ ఇతరుల చేతులను అల్లాహ్ చేతుల్లా ఉన్నాయి అనడం. అల్లాహ్ వీటి అన్నిటినుండి పరమ పరిశుద్ధుడు. 

నయీమ్ బిన్ హమ్మాద్ అల్ ఖాజాయీ రహిమాహుల్లాహ్ (బుఖారి రహిమహుల్లాహ్ గారి గురువు) ఆయన ఇలా అన్నారు:

ఓ విశ్వాసులారా! అల్లాహ్ యొక్క పవిత్ర పేర్లు మరియు ఆయన గుణగణాలలో ఎటువంటి మార్పు చేర్పులు చేయకుండా అర్థం చేసుకోవడం అఖీదాలోని భాగం. నలుగురు ఇమాములు కూడా ఈ విషయాన్ని ఏకీభవించారు  

ఇమామ్ ముహమ్మద్ బిన్ హసన్ అల్ షైబాని (వీరు ఇమామ్ అబూ హనీఫా గారి శిష్యులు) ఈ విధంగా తెలియజేశారు:

ఇమామ్ షాఫయీ (రహిమహుల్లాహ్) వారు ఇలా అన్నారు:

ఇబ్నె తైమీయా (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేశారు:

ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) అల్లాహ్ యొక్క వాక్యం [ثُمَّ ٱسۡتَوَىٰ عَلَى ٱلۡعَرۡشِۖ] (ఆయన సింహాసనం పై ఆసీనుడై ఉన్నాడు) యొక్క తఫ్సీర్ లో ఇలా రాశారు.  

వాస్తవికత కూడా ఇదే. ధార్మిక పండితులు దీని గురించే వివరించారు. అందులో  నయీమ్ బిన్ హమ్మాద్ అల్ ఖాజాయీ రహిమాహుల్లాహ్ (బుఖారి రహిమహుల్లాహ్ గారి గురువు) కూడా ఉన్నారు.  ఆయన ఇలా అన్నారు:

అబ్దుర్రహ్మాన్ బిన్ అల్ ఖాసిం అల్ మక్కీ  (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేశారు:

అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక. ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరిని క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాతాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.        

స్తోత్రం మరియు దరూద్ తరువాత  

ఓ ముస్లింలారా! మనిషి యొక్క హృదయం, తెలివి మరియు శరీర అవయవాలకు అల్లాహ్ యొక్క గుణగణాలు తెలుసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిం (రహిమహుల్లాహ్) ఇలా ప్రస్తావించారు:

ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి, అల్లాహ్ మీపై కరుణించు గాక! అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యాని కై  అజ్ఞాపించి ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ ఇలా అన్నాడు:  

[إِنَّ ٱللَّهَ وَمَلَٰٓئِكَتَهُۥ يُصَلُّونَ عَلَى ٱلنَّبِىِّۚ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ صَلُّوا۟ عَلَيْهِ وَسَلِّمُوا۟ تَسْلِيمًا] 
(నిశ్చయంగా అల్లాహ్‌, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.) 

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై నీ కారుణ్యాన్ని అవతరింప చేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు ప్రేమించు.  

ఓ అల్లాహ్! ఇస్లాం ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి. మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు. ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రతను ప్రసాదించు. మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి .  

ఓ అల్లాహ్! మమ్ములను ఇస్లాం మరియు ముస్లింలను నష్టంలో ముంచే ఆలోచన ఎవరికైతే ఉందో వారిని వారిలోనే నిమగ్నం చేసేయి. వారి ఆలోచనను వారివైపే త్రిప్పికొట్టు . ఓ అల్లాహ్! ఖరీదుల పెరుగుదల, వడ్డీ, వ్యబిచారము, భూకంపాలు, పరీక్షలను మా నుండి దూరం చేయి. ప్రత్యేకంగా మా దేశము నుండి మరియు సాదారణంగా ముస్లిముల అన్నీ దేశాలనుండి బాహ్యమైన, అంతర్గత కల్లోలాలను మానుండి దూరం చేసేయి. ఓ అల్లాహ్! మా నుండి కష్టాలను, ఇబ్బందులను దూరం చేయి. ఓ మా ప్రభువా! ఇహలోకంలో మాకు పుణ్యాన్ని, పరలోకంలో మేలును మరియు నరకం నుండి రక్షణ ను ప్రసాదించు . ఆమీన్.

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ 

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

అల్లాహ్ (త’ఆలా) (మెయిన్ పేజీ):
https://teluguislam.net/allah/

ముష్రిక్ లను కాఫిర్లుగా నమ్మక పోవడం | ఇస్లాం నుంచి బహిష్కరించే విషయాలు  – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

إنَّ الْحَمْدَ لِلَّهِ، نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وسَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ، وَأَشْهَدُ أَنْ لَا إلـٰه إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ.

)يَا أَيُّهَا الَّذِينَ آمَنُواْ اتَّقُواْ اللّهَ حَقَّ تُقَاتِهِ وَلاَ تَمُوتُنَّ إِلاَّ وَأَنتُم مُّسْلِمُون(.

 )يَا أَيُّهَا النَّاسُ اتَّقُواْ رَبَّكُمُ الَّذِي خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالاً كَثِيراً وَنِسَاء وَاتَّقُواْ اللّهَ الَّذِي تَسَاءلُونَ بِهِ وَالأَرْحَامَ إِنَّ اللّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبا(.

)يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلاً سَدِيداً * يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَمَن يُطِعْ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزاً عَظِيما(.

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.    

ఓ అల్లాహ్ దాసులారా! అల్లాహ్ తో భయపడుతూ ఉండండి, ఆయనను గౌరవించండి, ఆయన మాటను అనుసరించండి మరియు అవిధేయతకు పాల్పడమాకండి. గుర్తుంచుకోండి ధర్మాలన్నీ ఏయే  విషయాలపై  ఏకమై ఉన్నాయో  అందులో తౌహీద్ రెండు మూల స్తంభాలపై ఆధారపడి ఉండటము కూడా ఒకటి.

మొదటిది: అల్లాహ్ యేతరుల ఆరాధన నుంచి సంబంధం లేకపోవడం.  అల్లాహ్ ను కాకుండా ఇతరులను ఆరాధించడాన్ని అల్లాహ్ వాటికి “తాగూత్ ” అని పేరు పెట్టారు.

రెండవ మూలము:  కేవలం అల్లాహ్ యే నిజ ఆరాధ్యుడు అని సాక్ష్యం పలకటం. ఇదే తౌహీద్ కనుక ఏ వ్యక్తి అయితే తౌహీద్ తో పాటు బహుదైవారాధకుల ధర్మం నుంచి సంబంధం లేదు అన్నట్టు స్పష్టంగా సాక్ష్యం ఇవ్వడో, నిరాకరించడో  అతను తాగుత్ (మిద్య దైవారాధన ) ను తిరస్కరించలేదు అన్నట్టే . అలాంటి వ్యక్తి గురించి అల్లాహ్  ఈ విధంగా సెలవిచ్చారు:

فمن يكفر بالطاغوت ويؤمن بالله فقد استمسك بالعروة الوثقى لا انفصام لها
ఎవరయితే  అల్లాహ్ ను  తప్ప  వేరేతర  ఆరాధ్యులను  (తాగూత్ లను)  తిరస్కరించి,  కేవలం అల్లాహ్ ను మాత్రమే   విశ్వసిస్తారో  వారు  దృఢమైన  కడియాన్ని  పట్టుకున్నారు.

ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే అల్లాహ్ యేతర ఆరాధ్యులను (తాగూత్ లను)  తిరస్కరించడో అతను బలమైన కడియాన్ని పట్టుకోలేదు. ఆ బలమైన కడియం ఇస్లాం ధర్మం.

ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, తమ జాతి యొక్క  ధర్మం నుంచి నాకు ఎటువంటి సంబంధం లేదు అని స్పష్టం చేస్తూ ఈ విధంగా అన్నారు:

 إِنَّنِي بَرَاءٌ مِّمَّا تَعْبُدُونَ إِلَّا الَّذِي فَطَرَنِي فَإِنَّهُ سَيَهْدِينِ وَجَعَلَهَا كَلِمَةً بَاقِيَةً فِي عَقِبِهِ لَعَلَّهُمْ يَرْجِعُونَ

“మీరు పూజించే వాటి నుంచి నేను వేరైపోయాను. నన్ను పుట్టించిన వానిని మాత్రమే (నేను ఆరాధిస్తాను). ఆయనే నాకు సన్మార్గం చూపుతాడు”. మరి ఇబ్రాహీము ఈ మాటే – తన తదనంతరం – తన సంతానంలో మిగిలి ఉండేట్లుగా చేసి వెళ్ళాడు – ప్రజలు (షిర్క్‌ నుంచి) మరలిరావటానికి.

తారీక్ బిన్ అషీమ్ అల్ అస్జయీ ఉల్లేఖనం, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఏ వ్యక్తి అయితే “లా ఇలాహ ఇల్లలాహ్” పలికి అల్లాహ్ యేతర ఆరాధ్యులను తిరస్కరించాడో అతని ప్రాణాలు మరియు ధనము క్షేమంగా ఉన్నట్టే మరియు అల్లాహ్ యే అతని లెక్క చూసుకుంటాడు”. ( సహీహ్ ముస్లిం )

ఈ హదీస్ యొక్క అర్థం ఏమిటంటే ఏ వ్యక్తి అయితే  అల్లాహ్  కాకుండా ఇతర ఆరాధ్యులను  తిరస్కరించడో, అతని ప్రాణాలు మరియు ధనము క్షేమంగా లేనట్టే. ఇది కేవలం కాఫిర్ (అవిశ్వాసి) హక్కులోనే ఇలా జరుగుతుంది.

అల్లాహ్ దాసులారా! వివరించబడిన ఖురాన్ మరియు హదీస్ వెలుగులో  అర్ధమైన విషయం ఏమిటంటే ఎవరైతే ముష్రికులను కాఫిర్ గా ప్రకటించడో లేదా అతని కుఫ్ర్ లో (అవిశ్వాసంలో) సందేహం పడినా లేదా అతని ధర్మాన్ని సరైనదిగా భావించినా అతను అవిశ్వాసానికి పాల్పడినట్టే. అతను  ఇస్లామీయ బహిష్కరణలో నుంచి ఒక బహిష్కరణకు పాల్పడినట్టే.

అల్లాహ్ దాసులారా! ఏ వ్యక్తి అయితే తప్పుడు మతాలను అవలంబిస్తున్నాడో అతనిని కాఫిర్ ప్రకటించకపోవడం కూడా కుఫ్ర్ అవుతుంది. అతను ముస్లిం కాలేడు, ఎందుకంటే ఏ వ్యక్తినైతే అల్లాహ్ మరియు ప్రవక్త కాఫిర్ అని ప్రకటిస్తున్నారో అతనికి ఈయన కాఫిర్ అని భావించడంలేదు, అతని కుఫ్ర్ లో సందేహంపడి అల్లాహ్ మరియు ప్రవక్తను  వ్యతిరేకిస్తున్నాడు . మరియు అతను ఖుర్ఆన్ యొక్క సందేశాన్ని స్వీకరించలేదు, ఖురాన్ యొక్క సత్యతను స్వీకరించలేదు, మరియు ప్రవక్త గారి ఆజ్ఞ పాలన కూడా చేయలేదు. మరి  ఎవరైతే అల్లాహ్ మరియు ప్రవక్త సందేశాన్ని  స్వీకరించలేదో అతను కాఫిరే.  అల్లాహ్ మనందరిని రక్షించుగాక.

ఇంకా ఏ వ్యక్తి అయితే ముష్రిక్కులకు కాఫిరని భావించడో, ప్రకటించడో,  అతని వద్ద విశ్వాసం మరియు అవిశ్వాసం రెండు సమానమే, వీటి మధ్య ఎటువంటి భేదం, తేడా లేనట్టే. ఇందువల్లే అతను కాఫిర్ (అవిశ్వాసి) అవుతున్నాడు. (ఇది షేఖ్ సాలెహ్ అల్ ఫౌజాన్  గారి మాట, షర్హు నవాకిజుల్ ఇస్లాం అనే పుస్తకంలో 79వ పేజీలో వివరించారు)

అల్లాహ్ దాసులారా! ఒక కాఫిర్ ని కాఫిర్ అని భావించని వ్యక్తి వాస్తవానికి అతను ఇస్లాం మరియు కుఫ్ర్ మద్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించలేదు, అతనికి తెలియదు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన స్పష్టమైన ఆజ్ఞ.  ఖుర్ఆన్ లో అనేక చోట్ల అవిశ్వాసాన్ని తిరస్కరించడం జరిగింది మరియు ఇహ పరలోకాలలో అవిశ్వాసులకు పడే శిక్షలు గురించి ప్రస్తావన కూడా చేయడం జరిగినది.  ఏ వ్యక్తి అయితే ఒక కాఫిర్ ని కాఫిరని నమ్మడో అతను ముస్లిం అని అనిపించుకునే అర్హత అతనికి లేదు, ఎంతవరకు అంటే అతను ఇస్లాం మరియు అవిశ్వాసం మధ్య ఉన్న  వ్యత్యాసాన్ని గ్రహించి హృదయపూర్వకంగా  నోటి ద్వారా పూర్తిగా అవిశ్వాసానికి నాకు సంబంధం లేదు అని ప్రకటించనంతవరకు .

ఇంకా ఏ వ్యక్తి అయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఎవరినైతే కాఫిర్ అని స్పష్టం చేశారో అతన్ని కాఫిర్ అని భావించడో అతను అల్లాహ్ నిషేధించిన షిర్క్ ను హలాల్ గా ప్రకటించినట్టే,  ఎందుకంటే అల్లాహ్ మరియు ప్రవక్త ఒక   స్పష్టమైన ముష్రిక్ నీ అవిశ్వాసిగా ఖరారు చేస్తే ఇతను అతనిని కాఫిర్ అని నమ్మలేదు కాబట్టి. ఇలా చెయడం  అల్లాహ్ ఆజ్ఞకు వ్యతిరేకము. పైగా అల్లాహ్ తో పోరాడినట్టే. అల్లాహ్ ఆజ్ఞ ఇలా ఉన్నది:

قل تعالوا أتل ما حرم ربكم عليكم ألا تشركوا به شيئا
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ”రండి, మీ ప్రభువు మీపై నిషేధించిన వస్తువులు ఏవో మీకు చదివి వినిపిస్తాను. అవేమంటే; అల్లాహ్‌కు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి

ఇబ్నే సాది రహిమహుల్లాహ్ వారు ఈ విధంగా రాస్తున్నారు: “ఏ వ్యక్తులను అయితే ఇస్లాం షరియత్ ధర్మం కాఫిర్ అని ప్రకటించిందో  అతనిని కాఫిర్ అనటం తప్పనిసరి. మరి ఎవరైతే స్పష్టమైన ఆధారాల ద్వారా ఒక వ్యక్తి కాఫిర్ అని రుజువైన తర్వాత కూడా అతనిని కాఫిర్ అని భావించడో  అతను అల్లాహ్ మరియు ప్రవక్తను తిరస్కరించినట్టే. (ఫతావా అల్ సాదియా 98)

షేక్  అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ వారు అంటున్నారు: “ఎవరైతే ఒక వ్యక్తికి సంబంధించి అతని కుఫ్ర్ విషయంలో స్పష్టమైన ఆధారాలు రుజువు అయిన తర్వాత కూడా అతను కాఫిర్  అని నమ్మడో, ప్రకటించడో అతను కూడా ఆ వ్యక్తి (కాఫిర్) మాదిరిగానే. ఉదాహరణకు:  ఒక వ్యక్తి  ఒక యూదుడ్ని  ఒక నసరాని ను ( క్రైస్తవుడ్ని) లేదా కమ్యూనిస్టుని లేదా ఇలాంటి వాళ్లను కాఫిరని భావించడం లేదు. (వీళ్ళు కాఫిర్లు అని బహుకొద్ధి ధర్మ జ్ఞానం కలిగిన వాళ్ళకు  కూడా సందేహం లేదు).”  (మజ్మూ ఫతావా వ మఖాలాత్ ముతనవ్విఅహ్ (7/418) దారుల్ ఖాసిం, రియాజ్)

షేక్ సాలెహ్ అల్ ఫాజన్ హఫిజహుల్లాహ్ వారు అంటున్నారు: “ఎవరైతే ముష్రిక్ లను కాఫిర్లు అని నమ్మడో  వాడు కూడా  కాఫిర్ మరియు ముర్తదే  (ఇస్లాం నుంచి బహిష్కరించబడినట్టే). ఎందుకంటే అతని వద్ద ఇస్లాం మరియు కుఫ్ర్ రెండు సమానమే, అతను వీటి మధ్య వ్యత్యాసం చేయట్లేదు అందువలన అతను కాఫిర్”. (షర్హు నవాకిజుల్ ఇస్లాం పేజ్ 79)

అల్లాహ్ దాసులారా! తాగుత్ ను (అల్లాహ్ ను కాకుండా ఇతరులను ఆరాధ్యుడుగా చేసుకోవటం) తిరస్కరించటం చాలా విలువైనది, ప్రయోజకరమైనది. అల్లాహ్ ను విశ్వసించడం వలన తాగూత్ నిరాకరణ సంభవిస్తుంది. దానివల్లే దాసుడు పటిష్టమైన కడియాన్ని పట్టుకోవటం అనే ఈ ప్రక్రియ సంపూర్ణమవుతుంది ఇది అల్లాహ్ ఆజ్ఞలో ఈ విధంగా ఉన్నది:

(فَمَن يَكْفُرْ بِٱلطَّٰغُوتِ وَيُؤْمِنۢ بِٱللَّهِ فَقَدِ ٱسْتَمْسَكَ بِٱلْعُرْوَةِ ٱلْوُثْقَىٰ لَا ٱنفِصَامَ لَهَا).
ఎవరయితే  అల్లాహ్  తప్ప  వేరితర  ఆరాధ్యులను (తాగూత్ను)  తిరస్కరించి  అల్లాహ్ ను  మాత్రమే   విశ్వసిస్తారో  వారు  దృఢమైన  కడియాన్ని  పట్టుకున్నారు.

ఇది తహ్లియ(అలంకరణ) కన్నా తఖ్లియ(శుద్ధి) కు ప్రాధాన్యత ఇవ్వటం అవుతుంది. అంటే చెడును శుభ్రపరచి మంచిని అలంకరించటం.

అల్లాహ్ దాసులారా!  అబద్ధపు ధర్మాలు, మతాలను నిరాకరించటం ఐదు విషయాలను అవలంబించడం వల్ల జరుగుతుంది, సాధ్యమవుతుంది. (1) ఆ ధర్మాలు అసత్యము, అబద్ధమని విశ్వసించటము. (2) వాళ్ళను ఆరాధించకుండా ఉండటం, (3) వాటి పట్ల ద్వేషం కలిగి ఉండటం, (4) వాళ్ళను నమ్మి ఆరాధించే వాళ్ళను కాఫిర్లు గా భావించడం, (5) వాటి పట్ల శత్రుత్వం కలిగి ఉండటం. ఇవన్నీ షరతులు అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం రుజువు అవుతునాయి. అల్లాహ్ ఆదేశం:

(لقد كان لكم أسوة حسنة في إبراهيم والذين آمنوا معه إذ قالوا لقومهم إنا برءاء منكم ومما تعبدون من دون الله كفرنا بكم وبدا بيننا وبينكم العداوة والبغضاء أبدا حتى تؤمنوا بالله وحده)

ఓ ముస్లిములారా! మీకు   ఇబ్రాహీములోనూ, అతని వెంట  నున్న  వారిలోనూ   అత్యుత్తమమైన  ఆదర్శం  ఉంది.  వారంతా  తమ  జాతి  వారితో  స్పష్టంగా   ఇలా   చెప్పేశారు:  “మీతోనూ,  అల్లాహ్‌ను  వదలి  మీరు  పూజించే  వారందరితోనూ   మాకెలాంటి  సంబంధం  లేదు.  మేము  మిమ్మల్ని  (మీ  మిథ్యా  విశ్వాసాలను)   తిరస్కరిస్తు న్నాము.  ఒకే  ఒక్కడైన  అల్లాహ్‌ను  మీరు  విశ్వసించనంతవరకూ   మాకూ  –  మీకూ  మధ్య   శాశ్వతంగ  విరోధం,  వైషమ్యం  ఏర్పడినట్లే…

ఈ వాక్యం ద్వారా మూడు విషయాలు స్పష్టమవుతున్నాయి: అవిశ్వాసులతో  సంబంధం లేకపోవడం వ్యక్తం చేయడం, వాళ్ల ఆచరణ, షిర్క్ కి పాల్పడటం నుంచి సంబంధం లేదు అని వ్యక్తం చేయటము మరియు వాళ్ళ పట్ల కోపము ద్వేషము స్పష్టం చేయటము.

ఇక మిగిలిన మాట వాళ్ళ (అసత్య ధర్మాల దేవుళ్ళ) ఆరాధన అసత్యం అనే విషయం కలిగి ఉండటం అంటే ఇది ఈ వాక్యం ద్వారా స్పష్టం అవుతుంది. ఎందుకంటే అవి అసత్య ధర్మము అని మనం విశ్వసించనంతవరకు పైన పేర్కొనబడిన మూడు విషయాలు ఉనికిలోకి రావు.

ఇక అబద్ధపు ఆరాధ్యుల ఆరాధనను తిరస్కరించటము ఇంకా వాళ్లతో సంబంధం తెంచుకోవడానికి ఈ వాక్యం మనకు ఆధారము,  ఇందులో ప్రవక్త ఇబ్రాహీం తమ జాతి వారిని ఉద్దేశించి అంటున్నారు:

(وأعتزلكم وما تدعون من دون الله وأدعوا ربي عسى ألا أكون بدعاء ربي شقيا )     
నేను మిమ్మల్నీ, అల్లాహ్‌ను విడిచి  మీరు  మొరపెట్టుకునే  వారందరినీ  వదలి  పోతున్నాను. కేవలం  నా  ప్రభువును  మాత్రమే  వేడుకుంటాను. నా  ప్రభువుని  వేడుకుని  విఫలుణ్ణి   కానన్న  నమ్మకం  నాకుంది”  అని  (ఇబ్రాహీం)  చెప్పాడు.(5:15)

పై వాక్యంలో ఒక సూక్ష్మమైన విషయం దాగి ఉంది, అదేమిటంటే కుఫ్ర్ తో సంబంధం తెంచడం హృదయము, నాలుక, మరియు శరీర అవయవాల ద్వారా స్పష్టమవుతుంది. హృదయం నుంచి సంబంధం తెంచటం అంటే వాళ్లతో ద్వేషము మరియు వాళ్ళు అవిశ్వాసులు అన్న నమ్మకం కలిగి ఉండటంతోనే స్పష్టమవుతుంది , ఎలాగైతే ఖుర్ఆన్ వాక్యంలో  బోధించబడింది: ﴿كفرنا بكم﴾ .

నోటి నుంచి సంబంధం తెంచడం అనేది ప్రవక్త ఇబ్రాహీం వారి మాట ద్వారా స్పష్టమవుతుంది. ఆయన తమ జాతి వారు ముందు ఈ విధంగా ప్రకటించారు “ كفرنا بكم”

మరియు శరీర అవయవాల నుంచి సంబంధం తెంచటం ఈ వాక్యం ద్వారా మనకు స్పష్టమవుతుంది:

وَأَعْتَزِلُكُمْ وَمَا تَدْعُونَ مِن دُونِ اللَّهِ
నేను   మిమ్మల్నీ, అల్లాహ్‌ను విడిచి  మీరు  మొరపెట్టుకునే  వారందరినీ  వదలి  పోతున్నాను.

అల్లాహ్  దాసులారా: తాగూత్  నుంచి సంబంధం తెంచడం అనేది కేవలం ఆరాధన విషయంలో మాత్రం అంకితం కాదు, షిర్క్ మరియు కుఫ్ర్ లోని అన్ని రకాలలో ఇది వర్తిస్తుంది. ఉదాహరణకు : అల్లాహ్ కు లోపాలు ఆపాదించుటము లేదా ధర్మాన్ని ఎగతాళి  చేయటము లేదా సహబాలను తిట్టటం లేదా మాతృమూర్తులపై నింద మోపటము లేదా జిబ్రయిల్ వారు దౌత్య విషయంలో దగా, మోసం చేశాడని అనుమానించటము, లేదా యూద మతం క్రైస్తవ మతం బౌద్ధమతం ఇవన్నీ సత్యమే అని భావించడం, లేదా ఇలాంటి అవిశ్వాస చర్యలకు పాల్పడితే ఆ వ్యక్తి కాఫిర్ అవ్వటంలో ఎటువంటి సందేహం లేదు.

అల్లాహ్ దాసులారా!  ఇప్పటిదాకా వివరించిన విషయాల  ప్రకారం తౌహీద్ మరియు దాని వ్యతిరేకము అయిన షిర్క్ వివరణ స్పష్టం అయింది, తౌహీద్ విషయంలో పరస్పర ప్రేమ మరియు సంబంధాలు దాని యొక్క అర్థము స్పష్టమైనది , తౌహీద్ కి వ్యతిరేకమైన షిర్క్ నుంచి సంబంధం తెంచుకోవడం అనే విషయము అర్థం అయింది , దానిని తెలుసుకోవడం వల్ల హృదయము రుజుమార్గంపై నిలకడగా, స్థిరంగా ఉంటుంది, ఎందుకంటే ప్రతి వస్తువు యొక్క విలువ దాని  వ్యతిరేకం ద్వారానే  తెలుస్తోంది. ఒక కవి ఇలా అంటున్నాడు :

فالضِّد يظهر حسنه الضد   وبضِدها تتبين الأشياء
వ్యతిరేకం అనే పదానికి అందము దాని వ్యతిరేకంతోనే స్పష్టమవుతుంది,  మరియు వస్తువులు తమ వ్యతిరేకతతోనే అర్థమవుతాయి.

కనుక ఏ వ్యక్తికి అయితే షిర్క్ తెలియదో అతనికి తౌహీద్ కూడా తెలియదు, మరియు ఎవరైతే షిర్క్ నుంచి సంబంధం తెంచుకోడో అతను తౌహీద్ ని ఆచరణలోకి తీసుకురాలేదు.

అల్లాహ్ నాపై మరియు మీపై  ఖుర్ఆన్ యొక్క శుభాలను అనుగ్రహించు గాక! మనందరికీ వివేకంతో, హితోపదేశంతో కూడిన ఖురాన్ వాక్యాల నుంచి లాభం చేకూర్చు గాక! నేను ఇంతటితో నా మాటను ముగిస్తూ అల్లాహ్ తో మనందరి క్షమాపణ కొరకు ప్రార్థిస్తున్నాను, మరియు మీరు కూడా అల్లాహ్ తో క్షమాపణ కోరండి, నిస్సందేహంగా ఆయన క్షమించేవాడు మరియు అమిత దయామయుడు.

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అల్లాహ్ దాసులారా! అల్లాహ్ భీతి కలిగి ఉండండి. మరియు గుర్తుంచుకోండి! ఏ వ్యక్తి అయితే ఒక ముష్రిక్ ను కాఫిర్ గా భావించడంలో సందేహ పడతాడో అతను కూడా ఆ ముష్రిక్ మాదిరిగానే అవుతాడు. ఉదాహరణకు:  ఒక వ్యక్తి ఇలా అంటే: (నాకు తెలీదు యూదుడు కాఫీరో కాడో) లేక ఇలా అన్నా (నాకు తెలీదు క్రైస్తవులు కాపీర్లు లేక కాదో,) లేదా ఇలా అన్నా (నాకు తెలీదు అల్లాహ్ ను కాకుండా ఇతరులను మొరపెట్టుకునేవారు ముస్లిమో కాదో) లేదా ఇలా చెప్పినా  (నాకు తెలీదు ఫిరోన్ కాఫిరా కాదా అనేది) – ఇలా చెప్పిన వ్యక్తి కూడా కాఫిరే. ఇలా చెప్పటానికి కారణం ఏమిటంటే ఆ వ్యక్తి కుఫ్ర్ అనేది స్వతహాగా సత్యమా, అసత్యమా? అనే విషయంలో సందేహపడి ఉన్నాడు, కనుక అతను ఖచ్చితంగా ప్రకటించట్లేదు మరియు తాగూత్ ను  (మిద్య దైవారాధనను) కూడా తిరస్కరించట్లేదు. ఇక చూడబోతే అల్లాహ్ ఈ విషయాన్ని ఖురాన్లో స్పష్టంగా వివరించేశారు, అదేమిటంటే అవిశ్వాసం అసత్యమని, అబద్ధమని.  ఇది ఇలా స్పష్టమైనప్పటికీ కూడా దీంట్లో సందేహం కలిగి ఉంటే అతను ఖుర్ఆన్  లో వివరించబడిన ఆజ్ఞలను  విశ్వసించట్లేదు.

ఇంకో విషయం ఏమనగా ఇలా సందేహపడేవాడికి ఇస్లాంకి సంబంధించి ఏ అవగాహన లేదు. ఒకవేళ ఇస్లాం ధర్మం పట్ల అవగాహన ఉంటే అతని ముందు కుఫ్ర్ (ఇస్లాంకి వ్యతిరేకమైనది) స్పష్టమయ్యేది. మరి ఎవరికైతే ఇస్లాం పట్ల అవగాహన లేదో అతను ముస్లిం అని ఎలా అనబడతాడడు! ?.

షేక్ సులేమాన్ (*) బిన్ అబ్దుల్లా బిన్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హబ్ రహిమహుల్లాహ్ తమ పుస్తకం “ఔసఖు ఉరల్ ఇమాన్” లో అంటున్నారు: ఒకవేళ అతను వాళ్ళ కుఫ్ర్ విషయంలో సందేహపడినా లేదా వాళ్ళ కుఫ్ర్ కు సంబంధించి అవగాహన లేకపోయినా అలాంటి సమయంలో ఆ వ్యక్తి ముందు ఖుర్ఆన్ మరియు హదీస్ ఆధారాలు వివరించాలి. దానివల్ల వాళ్ళ కుఫ్ర్ (అవిశ్వాసం) స్పష్టమవుతుంది. దీని తర్వాత కూడా ఒకవేళ అతను వాళ్ళ కుఫ్ర్ విషయంలో సందేహంపడినా లేదా సంకోచంలో ఉన్నా ఆ వ్యక్తి కాఫిరే, ఎందుకంటే ఏ వ్యక్తి అయితే ఒక కాఫిర్ యొక్క కుఫ్ర్ విషయంలో సందేహం పడితే అతను కూడా కాఫిరే, ఈ విషయంలో ఉలమాలందరూ  ఏకీభవించి ఉన్నారు .

అల్లాహ్ దాసులారా!  ఎవరైతే అవిశ్వాసుల మతం సరైనదిగా  ప్రకటించాడో,  అతను వాళ్ళ కన్నా ఎక్కువగా మార్గభ్రష్టత్వానికి లోనై ఉన్నాడు.  ఎందుకంటే వాళ్ళ మతం అసత్యం అన్న విషయంలో సందేహానికి లోనై ఉన్నాడు, అతని కుఫ్ర్ (అవిశ్వాసం) అవిశ్వాసికన్నా ఎక్కువే. దీని వాస్తవం ఏమిటంటే ఎవరైతే కుఫ్ర్ ని సత్యంగా ప్రకటిస్తున్నాడో, అతడు ఇస్లాం ధర్మాన్ని అసత్యమని ప్రకటించినట్టే. అతను అసత్య ధర్మం కొరకు పోరాడినట్టే, దాని ప్రచారం చేస్తూ, దానిని సహకరించినట్టే, అవిశ్వాస ధర్మాన్ని ప్రచారం చేయటానికి విశాలమైన మైదానంలో సిద్ధమైనట్టే. (అల్లాహ్ మనందర్నీ కాపాడు గాక)

ఉదాహరణకు: ఒక వ్యక్తి ఇస్లాం కి వ్యతిరేకంగా విశ్వాసాన్ని (నమ్మకాన్ని) కలిగి ఉండి, దానిని  సరైనదిగా భావిస్తున్నాడో ఎలాగైతే యూద మతం  క్రైస్తవ మతం, సోషలిజం, సెక్యులరిజం లాంటివి, వీళ్ళందర్నీ సత్యమని భావించి లేదా ఈ ధర్మాలన్నీ ఒకటే అన్న భ్రమలో దాని వైపుకు ఆహ్వానించినా, ప్రచారం చేసినా, దావత్ ఇచ్చినా.

ఉదాహరణకు: యూద మతం, క్రైస్తవ మతం మరియు ఇస్లాం ధర్మం ఇవన్నీ ఇబ్రాహీం (అలైహిస్సలాం) వారి ధర్మమే అని ప్రచారం చేయడం, మరియు అధర్మ వాక్యాల ద్వారా ప్రజలను సందేహంలో, సంకోచంలో పడి వేయటము. ఇంకా యూదులు, క్రైస్తవులు మూసా మరియు ఈసా ప్రవక్త వారి యొక్క అనుయాయులే అని ప్రచారం చేయటం, ఇవన్నీ సత్యసత్యాలను తారుమారు చేయడమే.

ఎందుకంటే అల్లాహ్  ఇస్లాం ద్వారా మిగతా ధర్మాలన్నిటిని రద్దు చేశారు. ఒకవేళ మూసా మరియు ఈసా ప్రవక్తలు బ్రతికి ఉన్నా, వాళ్లు సత్య ధర్మంపై స్థిరంగా ఉన్నప్పటికీ  వాళ్లు కూడా ఇస్లాం ధర్మాన్నే అవలంబిస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే వాళ్ళు తెచ్చిన ధర్మాన్ని తారుమారు చేశారు, మార్పిడి చేశారు. అవి తమ అసలైన రూపంలో లేవు,  కనుక   తౌరాత్ ను కోల్పోయిన తర్వాత మూసా వారి ధర్మంలో వక్రీకరణ జరిగింది. మరియు యూదులు ఉజెర్ ప్రవక్తను ఆరాధించడం మొదలుపెట్టారు, ఇంకా ఆయన అల్లాహ్ కుమారుడని చెప్పటం మొదలుపెట్టారు. ప్రవక్త ఈసా వారిని అల్లాహ్ ఆకాశం వైపుకు ఆరోహణ చేసుకున్న తర్వాత ఆయన తీసుకొచ్చిన ధర్మంలో కూడా వక్రీకరణ మొదలై ఆయన అనుయాయులు శిలువను ఆరాధించడం మొదలుపెట్టారు. ఇక ఆయన అల్లాహ్ కుమారుడని, అల్లాహ్ ముగ్గురు దేవుళ్లలో ఒక్కడు  అని చెప్పటం మొదలెట్టారు. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా యూద మతం క్రైస్తవ మతం ఇస్లాం ధర్మం మూడు ఒకటే అని చెప్పటం సమంజసమేనా? ఆ ధర్మాల ద్వారా అల్లాహ్ ను ఆరాధించడం అనేది సమంజసమేనా?  కాదు ! ఎన్నటికీ సరైనది కాదు. అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నారు :

يَا أَهْلَ الْكِتَابِ قَدْ جَاءَكُمْ رَسُولُنَا يُبَيِّنُ لَكُمْ كَثِيرًا مِّمَّا كُنتُمْ تُخْفُونَ مِنَ الْكِتَابِ وَيَعْفُو عَن كَثِيرٍ ۚ قَدْ جَاءَكُم مِّنَ اللَّهِ نُورٌ وَكِتَابٌ مُّبِينٌ

ఓ గ్రంథవహులారా! మీ వద్దకు మా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చేశాడు. మీరు కప్పిపుచ్చుతూ ఉండిన గ్రంథంలోని ఎన్నో విషయాలను అతను మీ ముందు విపులీకరిస్తున్నాడు. మరెన్నో విషయాలను ఉపేక్షిస్తున్నాడు. అల్లాహ్‌ తరఫు నుంచి మీ వద్దకు జ్యోతి వచ్చేసింది. అంటే, స్పష్టమైన గ్రంథం వచ్చేసింది. (అల్ మాయిదా 5: 15)

మరో చోట ఇలా సెలెవిచ్చారు :

يَا أَهْلَ الْكِتَابِ قَدْ جَاءَكُمْ رَسُولُنَا يُبَيِّنُ لَكُمْ عَلَىٰ فَتْرَةٍ مِّنَ الرُّسُلِ أَن تَقُولُوا مَا جَاءَنَا مِن بَشِيرٍ وَلَا نَذِيرٍ ۖ فَقَدْ جَاءَكُم بَشِيرٌ وَنَذِيرٌ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

గ్రంథవహులారా! ప్రవక్తల ఆగమన క్రమంలో విరామం తర్వాత మా ప్రవక్త మీ వద్దకు వచ్చేశాడు. అతను మీకు స్పష్టంగా విడమరచి చెబుతున్నాడు. మా వద్దకు శుభవార్త అందించేవాడు, భయపెట్టేవాడు ఎవరూ రాలేదన్న మాట మీరు అనకుండా ఉండేందుకుగాను (ఈ ఏర్పాటు జరిగింది). అందుకే ఇప్పుడు నిజంగా శుభవార్త వినిపించేవాడు, భయపెట్టేవాడు మీ వద్దకు వచ్చేశాడు. అల్లాహ్‌ అన్నింటిపై అధికారం కలవాడు. (అల్ మాయిదా 5: 19)

ఇంకో చోట ఇలా ఆజ్ఞాపించారు :

وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ

ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు. ( ఆలే ఇమ్రాన్ 3: 85)

చివరిగా సారాంశం ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే అవిశ్వాసుల ధర్మాన్ని (యూధ మతం, క్రైస్తవ మతం) సత్యమని ప్రకటించాడో  అతను కూడా కాఫిరే.  అల్లాహ్ శరణం.

ఇదే విధంగా రవాఫిజ్ ల విశ్వాసం వైపుకు ఆహ్వానించడం కూడా వాళ్ల మాదిరిగా అయినట్టే, వాళ్లలో చేరిపోయినట్టే.

రవాఫిజ్ ల మతం: సమాధుల ఆరాధన, ఆహ్లె బైత్ (ప్రవక్త  గారి ఇంటి వాళ్ళను) ఆరాధించటం, ప్రవక్త గారి సున్నత్ ను తిరస్కరించటం, సహాబాలను కాఫిర్లు గా ప్రకటించటం, దైవదూతల నాయకుడైన జిబ్రయిల్ అమీన్ ను మరియు ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని అవమానించడం,  ఖుర్ఆన్ మరియు ప్రవక్త గారి దౌత్యాన్ని అవమానించడం.

ఇలాంటి విశ్వాసాలు కలిగి ఉన్న రవాఫిజ్ ల వైపుకు దావత్ ఇవ్వటము, వాళ్ళ విశ్వాసాలను అందంగా అలంకరించి ప్రకటించేవాళ్లు వీళ్ళలోనే తప్ప మరెవరో  కాదు. అందుకే అతను వాళ్ల మతం స్వీకరించ పోయినప్పటికీ కూడా వాళ్ళలాగా అవిశ్వాసియే, ఎందుకంటే అతను కుఫ్ర్ మరియు కపటాన్ని సత్యమే అని, సరైనదే అని భావించాడు కాబట్టి. అల్లాహ్ మనందరినీ దాన్నుంచి కాపాడుగాక

అల్లాహ్  దాసులారా!  తౌహీద్ మరియు దాని వ్యతిరేకాన్ని ( షిర్క్ ను) అర్థం చేసుకోవడానికి, దానికి పాల్పడకుండా  జాగ్రత్త పడడానికి ఇది చాలా ఉత్తమమైన సందర్భం. ముస్లింలు ముష్రిక్ లను అవిశ్వాసులని (కాఫిర్లు అని) భావించి, వాళ్ళ కుఫ్ర్ లో సందేహం పడకుండా, వాళ్ల  మతాన్ని సరైనదిగా భావించకుండా జాగ్రత్త పడటం తప్పనిసరి. ఈ మూడు విషయాలు ఇస్లాం నుంచి బహిష్కరించేవి. ప్రతి ముస్లిం పై తప్పనిసరి ఏమిటంటే ఎవరినైతే అయితే అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాఫిర్లు అని నిర్ధారించారో వారి కుఫ్ర్ గురుంచి  నమ్మకం కలిగి,  హృదయంలో ఎటువంటి సంకోచము సందేహం లేకుండా నమ్మాలి. (ఇది ప్రతి ముస్లిం పై తప్పనిసరి)

అల్లాహ్ ప్రజలందరికీ తౌహీద్ పై జీవితాంతం స్థిరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక, ఎందుకంటే ఏ వ్యక్తి అయితే షరియత్ ప్రకారం జీవితాన్ని గడుపుతాడో, స్థిరంగా  ఉంటాడో అతనికి తౌహీద్ పైనే మరణం లభిస్తుంది. అలాంటి వ్యక్తి ఎటువంటి ప్రశ్నోత్తరాలు లెక్క లేకుండా స్వర్గంలో ప్రవేశిస్తాడు .

మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అల్లాహ్ మిమల్ని గొప్ప సత్కార్యాన్ని గురుంచి ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశం:

إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما

నిశ్చయంగా   అల్లాహ్‌,  ఆయన  దూతలు  కూడా  దైవప్రవక్తపై  కారుణ్యాన్ని   పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా!  మీరు  కూడా  అతనిపై  దరూద్‌   పంపండి.  అత్యధికంగా  అతనికి  ‘సలాములు’  పంపుతూ  ఉండండి (33: 56)

اللهم صل وسلم على عبدك ورسولك محمد، وارض عن أصحابه الخلفاء، الأئمة الحنفاء، وارض عن التابعين ومن تبعهم بإحسان إلى يوم الدين.

ఓ అల్లాహ్! మాకు  ప్రపంచంలో మేలును, పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు. మరియు  నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.

للهم صل على نبينا محمد وآله وصحبه وسلِّم تسليما كثيرا

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

వక్ఫ్ (Waqf) మరియు ఇస్లాం [వీడియో]

అబూ బక్ర్ బేగ్ ఉమరీ, డా. సఈద్ అహ్మద్ మదనీ & నసీరుద్దీన్ జామి’ఈ
https://youtu.be/npKnVhoGZRs
[93 నిముషాలు]

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కుటుంబీకుల(అహ్లె-బైత్)ను గౌరవించడం – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.    

ఓ ముస్లిం లారా! అల్లాహ్ యొక్క దైవభీతిని కలిగి ఉండండి, ఆయనకు విధేయత చూపండి, ఆయన అవిధేయత నుండి జాగ్రత్త వహించండి. మరియు తెలుసుకోండి! మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి హక్కులలో ఒక హక్కు మరియు అహ్లె సున్నత్ వల్ జమాఅత్ యొక్క అఖీదా ఏమిటంటే ఆయన కుటుంబ సభ్యులను (ఇంటి వారిని) గౌరవించాలి, ప్రేమించాలి మరియు వారి గురించి ప్రవక్త గారు చేసిన హితోపదేశానికి కట్టుబడి ఉండాలి.

ఈ ప్రాథమిక (అఖీదా)కి సంబంధించి అనేక ఆధారాలు ఉన్నాయి జైద్ బిన్ అర్ఖమ్ (రదియల్లాహు అన్హు) గారు ఉల్లేఖించారు మరియు ఈ విధంగా తెలియపరిచారు: ఒకసారి మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు మక్కా మరియు మదీనా మధ్యలో ఉన్నటువంటి “ఖమ్” అనే నీటి ప్రదేశం వద్ద నిల్చుని ప్రసంగించసాగారు. మొదటగా ఆయన అల్లాహ్ కు పొగడ్తలు తెలిపారు, ఆయనను ప్రశంసించారు ఆతర్వాత ఉపదేశించారు; ఈ విధంగా అన్నారు – “ఓ ప్రజలారా! నేను కూడా మీలాంటి మనిషినే. అతి త్వరలోనే అల్లాహ్ యొక్క మరణ దూత కూడా నా వద్దకు రావచ్చు మరియు నేను దానిని స్వీకరించవచ్చు. కాబట్టి నేను మీ మధ్యన రెండు గొప్ప విషయాలను వదిలి వెళుతున్నాను. మొదటిది అల్లాహ్ యొక్క గ్రంథము ఖురాన్. ఇందులో సన్మార్గం మరియు నూర్ ఉంది. కాబట్టి మీరు అల్లాహ్ గ్రంధాన్ని దృఢంగా పట్టుకోండి. మరియు రెండవ విషయం నా కుటుంబీకులు వీరి విషయంలో నేను మీకు అల్లాహ్ ను గుర్తు చేస్తున్నాను”. ఈ విధంగా మూడు సార్లు అన్నారు.

హుస్సేన్ అన్నాడు, ఓ జైద్! మీలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వారి (అహ్లె-బైత్) కుటుంబీకులు ఎవరు? ఇందులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి సతీమణులు లేరా? జైద్ అన్నారు “ప్రవక్త గారి సతీమణులు కూడా ఉన్నారు కానీ ఆయన కుటుంబీకులు ఎవరంటే జకాత్ నిషేధించబడిన వారు”. (ముస్లిం)

అబూబకర్ సిద్దిక్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కుటుంబీకులను రక్షించండి“. (బుఖారి)

ప్రవక్త కుటుంబం యొక్క సద్గుణాలకు సంబంధించిన అనేక హదీసులు ఉన్నాయి, అవి సహీహ్, సునన్, మసానిద్ హదీసు గ్రంథాలలో వివరంగా పేర్కొనబడ్డాయి.

ఇబ్న్ తైమియా (రహిమహుల్లాహ్) ఈ విధంగా తెలియపరిచారు: ఈ విషయంలో ఎటువంటి సందేహానికి తావు లేదు, అదేమిటంటే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క అహ్లె-బైత్‌కు ఉమ్మత్ పై హక్కు ఏమిటంటే అందులో వారికి భాగస్వాములు ఎవరూ లేరు. వీరిపై ఉన్న ప్రేమకు మరియు సంరక్షణకు మరెవరు అర్హులు కాలేరు అని నమ్మడం. ప్రేమ మరియు సంరక్షతత్వానికి వీరు అర్హులైనట్లుగా మరే తెగవారు అర్హులు కాజాలరు. అదేవిధంగా ప్రేమ మరియు సంరక్షణకు అరబ్బులు అర్హులైనట్లుగా మరే ఇతర ఆదం సంతతి అర్హులు కాజాలరు. మరియు పండితుల యొక్క ఏకాభిప్రాయం ఏమిటంటే ఇతర దేశాలపై అరబ్బులకు, ఇతర అరబ్ తెగల కంటే ఖురేష్‌లకు మరియు మొత్తం ఖురైష్‌లపై బను హాషిమ్‌కు గొప్ప ఆధిక్యత సంతరించి ఉంది. (మిన్ హాజ స్సున్నహ్)

ఆ తర్వాత ఆయన వాసిలా బిన్ సఖా గారి హదీసుని తెలియజేశారు. ఇది పైన పేర్కొన్న ఘనతను సూచిస్తుంది. హదీసులో ఈ విధంగా ఉంది: నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలియజేస్తుండగా విన్నాను; “నిశ్చయంగా అల్లాహ్ తఆలా ఇస్మాయిల్ యొక్క సంతతిలో కినానా నీ ఎంపిక చేశాడు, కినానా ఖురేష్ ని ఎన్నుకున్నాడు, మరియు ఖురైష్ నుండి బనూహాషిమ్ ను ఎంపిక చేసి, బనూహాషిమ్ నుండి నేను ఎన్నుకోబడ్డాను”. (ముస్లిం)

ఓ విశ్వాసులారా! ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సతీమణులు ఆయన కుటుంబీకుల లోని వారే. అల్లాహ్ దివ్య ఖురాన్ లో ఇలా సెలవిచ్చాడు:

﴿إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا﴾
(ఓ ప్రవక్త ఇంటివారలారా! మీ నుండి (అన్ని రకాల) మాలిన్యాన్ని దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలన్నది అల్లాహ్‌ అభిలాష)

ఇబ్నే కసీర్ (రహిమహుల్లాహ్) వారు ఇలా వ్రాసారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సతీమణులు ఆయన కుటుంబీకులలోని వారే. దీనికి ఆధారం ఈ వాక్యం. ఇది ఆయన భార్యల గురించి వెల్లడి చేయబడింది.

ఓ ముస్లింలారా! ప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) యొక్క కుటుంబం పై సదఖా మరియు జకాత్ నిషిద్ధం. అల్లాహ్ వారి స్థానం మరియు ఔన్నత్యాన్ని పరిగణనలోకి తీసుకుని వారిపై నిషేధించాడు. ఎందుకంటే సదఖా మరియు జకాత్ అనేది ఒక మలినం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియజేశారు: “ముహమ్మద్ కుటుంబీకుల కొరకు సదఖా అనుమతి లేదు. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము యొక్క మలినం.”

సదఖా మరియు జకాత్ నిషేధించబడిన ప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) కుటుంబీకుల యొక్క రెండు తెగలు: బను హాషిమ్ బిన్ అబ్దే మునాఫ్ మరియు బనూ ముత్తలిబ్ బిన్ అబ్దే మునాఫ్.

ఓ విశ్వాసులారా! ప్రవక్త గారి కుటుంబీకుల ఘనతలో భాగంగా వారి గురించి ఉమ్మత్ కు ఆజ్ఞాపించబడినటువంటి విషయం ఏమిటంటే వారు తషహ్హుద్ లో ఈ దుఆ పటించాలి:

اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد.
اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد.

(ఓ అల్లాహ్ నీవు ఎలాగైతే ప్రవక్త ఇబ్రాహీం, వారి సంతానాన్ని కనికరించావో అలాగే ప్రవక్త ముహమ్మద్, వారి సంతానాన్ని కనికరించు, నిశ్చయముగా నీవే పొగడ్తలకు అర్హుడవు, గొప్ప ఘనతలు కలవాడవు. ఓ అల్లాహ్ ఎలాగైతే నీవు ప్రవక్త ఇబ్రాహీం, వారి సంతానానికి శుభాన్ని ప్రసాదించావో అలాగే ప్రవక్త ముహమ్మద్, వారి సంతానంపై శుభాన్ని ప్రసాదించు, నిశ్చయముగా నీవే పొగడ్తలకు అర్హుడవు, గొప్ప ఘనతలు కలవాడవు.)

అల్లాహ్ ఖుర్ఆన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక. ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరిని క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి, నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాత్తాపం చెందే వారిని తప్పక మన్నిస్తాడు.

స్తోత్రం మరియు దరూద్ తరువాత:

మీరు తెలుసుకోండి. అల్లాహ్ మీపై కరుణించు గాక! సలఫే సాలిహీన్ వారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కుటుంబీకుల యొక్క ఘనతలో గొప్ప ఉదాహరణలు తెలియపరిచారు.

అబూబకర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) గారు ఈ విధంగా తెలియజేశారు: “ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షి! నిశ్చయంగా నా బంధువుల పట్ల దయ చూపడం కంటే, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి బంధువుల పట్ల దయ చూపటం నా వద్ద ఎంతో ప్రియమైనది“.(బుఖారి ముస్లిం)

ఓ ముస్లింలారా! విశ్వాసులు అహ్లెబైత్ ను తప్పక ప్రేమిస్తారు! అయితే రాఫిజీలు మరియు షియా వర్గీయులు మాత్రమే వారిని ప్రేమిస్తారు, మిగతా వారందరూ వారిని ద్వేషిస్తారు అనే వాదన సరి అయినది కాదు.

వాస్తవానికి రవాఫిజ్ మరియు షియా వర్గీయులు అహ్లె-బైత్‌ పై ఘోరమైన దౌర్జన్యానికి పాల్పడ్డారు. వారిని అవమానపరిచి వారిని మోసం చేశారు. అహ్లె బైత్ కి సంబంధించినటువంటి అనేక హదీసులు తిరస్కరణకు దారి తీసాయి, దీనికి గల కారణం ఏమిటంటే వీరు అహ్లె బైత్ పై అబద్దాలను మోపారు. మరియు రవాఫిజ్ అహ్లె బైత్ లో అందరినీ కాకుండా కొందరిని మాత్రమే ప్రేమిస్తారు. కానీ సున్నతుని ప్రేమించేవారు దానిపై స్థిరంగా ఉండేవారు (అహ్లె సున్నత్ వల్ జమాఅత్) అహ్లె బైత్ వారందరి ని ప్రేమిస్తారు.

మరియు ఇది కూడా తెలుసుకోండి. అల్లాహ్ ఆయనపై తన కారుణ్యాన్ని కురిపించు గాక అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యం గురించి తెలియచేశాడు. అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు.

(إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما)
(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.)

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్దితో అనుసరించే వారిని ఇష్టపడు ప్రేమించు.

ఓ అల్లాహ్! ఇస్లాం, ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపాశకులకు నీ సహాయాన్ని అందించు.

ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రతను ప్రసాదించు. మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి. ఓ అల్లాహ్! మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు.

ఓ అల్లాహ్! మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు, ఓ అల్లాహ్! మమ్ములను ఆ నరకాగ్ని నుంచి రక్షించు,మాకు మోక్షాన్ని ప్రసాదించు

ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

క్రింది లింక్ కూడా చదవండి :
ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇంటివారి ప్రాశస్త్యం, వారి హక్కులు – డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్ [PDF]

దైవ గ్రంధాల పై విశ్వాసం – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖుత్బా అంశము: దైవ గ్రంధాల పై విశ్వాసం  

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.     

ఓ ముస్లింలారా! నేను మీకు మరియు స్వయాన నాకు అల్లాహ్ యొక్క దైవభీతి కలిగి ఉండాలని ఉపదేశిస్తున్నాను. అల్లాహ్ తఆలా మన ముందు తరాల వారి కొరకు మరియు మన తర్వాత తరాల వారి కొరకు కూడా ఇదే ఉపదేశం చేయడం జరిగింది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.

 وَلَقَدۡ وَصَّيۡنَا ٱلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ مِن قَبۡلِكُمۡ وَإِيَّاكُمۡ أَنِ ٱتَّقُواْ ٱللَّهَۚ

వాస్తవానికి మేము అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండమని, పూర్వం గ్రంథం ఇచ్చిన వారికీ మరియు మీకూ ఆజ్ఞాపించాము. (అల్ నిసా :131)

కనుక అల్లాహ్ తో భయపడండి, ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుండి దూరంగా ఉండండి.

తెలుసుకోండి! ఇస్లాం ధర్మంలో దైవ గ్రంథాలపై విశ్వాసం యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. ఇది విశ్వాస మూల స్థంభాలలో మూడవది. అల్లాహ్ తన దాసులపై కనుకరిస్తూ వారి సన్మార్గమునకై ప్రవక్త ద్వారా ఒక గ్రంథాన్ని కూడా పంపించాడు, కారణం ఇహపరాల సాఫల్యం.

అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:

[لَقَدۡ أَرۡسَلۡنَا رُسُلَنَا بِٱلۡبَيِّنَٰتِ وَأَنزَلۡنَا مَعَهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡمِيزَانَ]

నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వారితో పాటు గ్రంథాన్ని, ధర్మకాటాను కూడా అవతరింపజేశాము. (అల్ హదీద్ 57:25)

నిశ్చయంగా అల్లాహ్ తఆలా ఆయన అవతరింపజేసిన గ్రంథాలన్నిటిపై విశ్వాసం తేవడం విధిగా చేశాడు.

అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:

[قُولُوٓاْ ءَامَنَّا بِٱللَّهِ وَمَآ أُنزِلَ إِلَيۡنَا وَمَآ أُنزِلَ إِلَىٰٓ إِبۡرَٰهِ‍ۧمَ وَإِسۡمَٰعِيلَ وَإِسۡحَٰقَ وَيَعۡقُوبَ وَٱلۡأَسۡبَاطِ وَمَآ أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَمَآ أُوتِيَ ٱلنَّبِيُّونَ مِن رَّبِّهِمۡ لَا نُفَرِّقُ بَيۡنَ أَحَدٖ مِّنۡهُمۡ وَنَحۡنُ لَهُۥ مُسۡلِمُونَ]

(ముస్లిములారా!) మీరు ఇలా ప్రకటించండి: ”మేము అల్లాహ్‌ను విశ్వసించాము. మాపై అవతరింపజేయబడిన దానినీ, ఇబ్రాహీం, ఇస్మాయీల్‌, ఇస్‌హాఖ్‌, యాఖూబ్‌ మరియు వారి సంతతిపై అవతరింపజేయబడిన దానినీ, మూసా, ఈసా ప్రవక్తలకు వారి ప్రభువు తరఫున వొసగబడిన దానిని కూడా మేము విశ్వసించాము. మేము వారిలో ఎవరిమధ్య కూడా ఎలాంటి విచక్షణ (వివక్ష)ను పాటించము. మేము ఆయనకే విధేయులము.” (అల్ బఖర 2:136)

ఒకటి : అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాలు నిజమైనవి అని విశ్వాసం ఉంచాలి. ఉదాహరణకు అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు.

 [ءَامَنَ ٱلرَّسُولُ بِمَآ أُنزِلَ إِلَيۡهِ مِن رَّبِّهِۦ وَٱلۡمُؤۡمِنُونَۚ كُلٌّ ءَامَنَ بِٱللَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَكُتُبِهِۦ وَرُسُلِهِۦ]

తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా (సత్యమని నమ్మారు). వారంతా అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు (అల్ బఖర: 285)

గ్రంథ అవతరణ వహీ ద్వారా జరిగింది. వాస్తవంగా అల్లాహ్ తఆలా ఆకాశం నుండి భూమి పైకి వహీ తీసుకురావడానికి దైవదూతలను నియమించాడు. ఆ దూత పేరు జిబ్రయిల్ (అలైహిస్సలాం). ఈయన ప్రవక్తకు తన ప్రత్యేక గ్రంథాన్ని వెల్లడించాడు.

రెండో విషయం: ఏ గ్రంథాల గురించే అయితే మనకు తెలుసో వాటిని విశ్వసించడం. అవి ఆరు ఉన్నాయి. ఇబ్రహీం మరియు మూసా సహీఫాలు. తౌరాత్ మూసా (అలైహిస్సలాం) వారిపై అవతరింప చేయబడిన గ్రంథం, ఇంజీల్ ఈసా (అలైహిస్సలాం) వారిపై అవతరింప చేయబడిన గ్రంథం. జబూర్ దావూద్ (అలైహిస్సలాం) వారిపై అవతరింప చేయబడిన గ్రంథం మరియు ఖుర్ఆన్  మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై అవతరింప చేయడం జరిగింది.  కొంతమంది పండితుల అభిప్రాయం ఏమిటంటే మూసా సహీఫాలు మరియు తౌరాత్ ఒక్కటే అయితే ఈ విధంగా ఐదు పేర్లు అవుతాయి. మరియు అదే విధంగా ఏ గ్రంధాల గురించైతే మనకు తెలియదో వాటిపై కూడా మనం పరిపూర్ణంగా విశ్వాసం తీసుకురావాలి.

మూడో విషయం: దైవ ప్రవక్తలపై ఏ గ్రంథాలు అయితే అవతరించాయో వాటిపై మాత్రమే విశ్వాసముంచాలి. ఏ గ్రంధాలలోనైతే మార్పు చేర్పులు జరిగాయో వాటి పై విశ్వాసం ఉంచరాదు. ఉదాహరణకు మూసా ప్రవక్తపై అవతరింప చేయబడిన తౌరాత్ ను విశ్వసించాలి మరియు ఈసా ప్రవక్త పై అవతరించబడిన ఇంజీల్ గ్రంథం పై విశ్వాసం ఉంచాలి. ఇవి అసలు గ్రంథాలు. కానీ ఇప్పుడు ఏ గ్రంధాలైతే యూదులు చేతుల్లో మరియు క్రైస్తవుల చేతుల్లో ఉన్నాయో అవి మార్పులకు లోనయ్యాయి. గ్రంథాలకు అవే పేర్లు పెట్టినప్పటికీ వారు తమ పూర్వీకులు చెప్పినటువంటి విషయాలను అందులో చేర్చారు మరియు ఇవే అసలు గ్రంథాలని ప్రకటించారు. మరియు సంవత్సరాల తరబడి  ప్రజలు ఆ కల్పిత కథనాలను పాటించుకుంటూ వారు మార్గభష్టత్వానికి లోనయ్యారు మరియు ప్రజలను కూడా మార్గభష్టత్వానికి లోను చేశారు. కనుక గతించిన ప్రవక్తలపై అవతరింపజేసిన గ్రంథాలు మార్పు చేర్పులకు లోనవడం వలన అల్లాహ్ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపచేయబడినటువంటి దివ్య ఖుర్ఆన్ యొక్క రక్షణ బాధ్యతను స్వయంగా అల్లాహ్ నే తీసుకున్నాడు. అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు.

[إِنَّا نَحۡنُ نَزَّلۡنَا ٱلذِّكۡرَ وَإِنَّا لَهُۥ لَحَٰفِظُونَ]

మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము (అల్ హిజ్ర్ :9)

ఈ వాక్యంలో జిక్ర్ అనగా ఖురాన్ అనే భావం

నాల్గొవ విషయం: ఏ విషయాలు అయితే ఆ గ్రంథాల ద్వారా వెల్లడించబడ్డాయో వాటిని సత్యమని నమ్మడం. ఉదాహరణకు ఖుర్ఆన్  మరియు ఖుర్ఆన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలు, వాటిలో మార్పు చేర్పులకు గురికాకుండా ఉన్నటువంటి సంఘటనలు. అదేవిధంగా ఖుర్ఆన్ తెలియచేయనటువంటి విషయాలను మేము ధ్రువీకరించము మరియు తిరస్కరించం, ఎందుకంటే మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసులో ఇలా వచ్చింది – ఏదైతే గ్రంథ ప్రజలు మీకు తెలియ పరుస్తారో దానిని మీరు సత్యం లేక అసత్యం అని అనకండి,  ఈ విధంగా అనండి – “మేము అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పై విశ్వాసం తెచ్చాము“. ఎందుకంటే ఒకవేళ వారి మాట సత్యం అయితే ధ్రువీకరించినట్లు అవుతుంది మరియు అసత్యం అయితే దానిని తిరస్కరించినట్లు అవుతుంది (అబూ దావూద్-3644)

ఐదొవ విషయం: ఆ గ్రంథాలలో ఉన్నటువంటి ఆదేశాలు ఏవైతే రద్దు కాలేదో వాటిపై ఆచరించడం. ఉదాహరణకు: అల్లాహ్ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు.

[يُرِيدُ ٱللَّهُ لِيُبَيِّنَ لَكُمۡ وَيَهۡدِيَكُمۡ سُنَنَ ٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ وَيَتُوبَ عَلَيۡكُمۡۗ]

అల్లాహ్‌ మీకు (ధర్మాధర్మాలను) విడమరచి చెప్పాలనీ, మీ పూర్వీకుల్లోని (సజ్జనుల) మార్గంపై మిమ్మల్ని నడిపించాలనీ, మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాలని అభిలషిస్తున్నాడు (అల్ నిసా :26)

మరోచోట ఇలా తెలియజేస్తున్నాడు.

 [أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ هَدَى ٱللَّهُۖ فَبِهُدَىٰهُمُ ٱقۡتَدِهۡۗ]

అల్లాహ్‌ సన్మార్గం చూపించినటువంటివారు వీరే. కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు కూడా వారి మార్గాన్నే అనుసరించు (అల్ అన్ ఆమ్ :90)

ఆ ఆదేశాలలో ఖిసాస్ (ప్రతీకారం) కు సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఉన్నాయి. అల్లాహ్ తఆలా తౌరాత్ గురించి ప్రస్తావిస్తూ ఇలా తెలియజేశాడు.

وَكَتَبْنَا عَلَيْهِمْ فِيهَا أَنَّ النَّفْسَ بِالنَّفْسِ وَالْعَيْنَ بِالْعَيْنِ وَالْأَنفَ بِالْأَنفِ وَالْأُذُنَ بِالْأُذُنِ وَالسِّنَّ بِالسِّنِّ وَالْجُرُوحَ قِصَاصٌ ۚ فَمَن تَصَدَّقَ بِهِ فَهُوَ كَفَّارَةٌ لَّهُ ۚ وَمَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّهُ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ

(మేము తౌరాతు గ్రంథంలో యూదుల కోసం ఒక శాసనాన్ని లిఖించాము: (దీని ప్రకారం) ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పంటికి బదులు పన్ను. అలాగే కొన్ని ప్రత్యేక గాయాల కోసం కూడా (సరిసమానంగా) ప్రతీకారం ఉంది. కాని ఎవరయినా క్షమాభిక్ష పెడితే అది అతని పాలిట పరిహారం (కప్ఫారా) అవుతుంది. అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగా తీర్పు ఇవ్వనివారే దుర్మార్గులు.) (అల్ మాయిదా : 45)

మరియు ఈ ఆజ్ఞ మన షరీఅత్ (చట్టం)లో కూడా భాగమై ఉంది. దీనిపై ఆచరించడం కూడా జరుగుతుంది అని విశ్వసించాలి. మన ధర్మం దీనికి విరుద్ధం కాదు మరియు ఈ ఆజ్ఞ రద్దు చేయబడలేదు.

ఆరవ విషయం: ఈ గ్రంథాలు మానవులందరినీ ఒకే ధర్మం వైపునకు ఆహ్వానిస్తాయి అని విశ్వసించడం. దీనినే తౌహీద్ అంటారు. తౌహీద్  మూడు రకాలు. 1. తౌహీదె ఉలూహియత్  2. తౌహీదె రుబూబియత్ 3. తౌహీదె అస్మా వసిఫాత్.

ఏడవ విషయం: ఖురాన్ గ్రంథం పూర్వ గ్రంథాలను ధ్రువీకరిస్తుంది. మరియు వాటిపై ఆధిపత్యం కలిగినటువంటిది. మరియు పూర్వ గ్రంథాలను పరిరక్షిస్తుంది. పూర్వ గ్రంథాలన్నీ కూడా ఈ దివ్య ఖురాన్ ద్వారానే రద్దు చేయబడ్డాయి. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

[وَأَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ مُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ مِنَ ٱلۡكِتَٰبِ وَمُهَيۡمِنًا عَلَيۡهِۖ]

ఇంకా (ఓ ప్రవక్తా!) మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్య సమేతంగా అవతరింపజేశాము. అది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరిస్తుంది, వాటిని పరిరక్షిస్తుంది. (అల్ మాయిదా :48)

ఇబ్న్ తైమియా (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు : “ఖురాన్ లో ఇలానే ఉంది, అల్లాహ్ మరియు అంతిమ దినం గురించి పూర్వ గ్రంథాలలో వచ్చిన వార్తలు ధృవీకరించబడ్డాయి మరియు మరింత వివరంగా  పేర్కొనబడ్డాయి. ఈ విషయాలపై. స్పష్టమైన రుజువులు మరియు వాదనలు సమర్పించబడ్డాయి. అదేవిధంగా, ప్రవక్తలందరి ప్రవక్త పదవులు మరియు సందేశహరుల సందేశం అంగీకరించబడింది. మరియు అదే విధంగా ప్రవక్తల ద్వారా పంపబడిన అన్ని చట్టాలను అంగీకరించడం జరిగింది, మరియు వివిధ ఆధారాల ద్వారా మరియు స్పష్టమైన రుజువుల ద్వారా ప్రవక్తలను మరియు గ్రంథాలను తిరస్కరించిన వారితో చర్చలు వాదన చేయటం. అదేవిధంగా అల్లాహ్ వారికి విధించిన శిక్షలను గురించి మరియు గ్రంథాలను అనుసరించే వారికి అల్లాహ్ చేసే సహాయాన్ని గురించి మరియు గ్రంథవహులు మునుపటి గ్రంధాలలో  జరిపిన మార్పుల గురించి  మరియు వక్రీకరణల గురించి  అల్లాహ్ ప్రస్తావించాడు. గ్రంథాలలో వారు చేసిన పనులను, అలాగే వారు దాచిన అల్లాహ్ ఆజ్ఞలను కూడా పేర్కొన్నాడు. మరియు ప్రతి ప్రవక్త తీసుకువచ్చిన షరీఅత్ చట్టం గురించి తెలియజేయడం జరిగింది. మరియు అలానే పవిత్ర ఖుర్ఆన్ గురించి తెలియపరచడం జరిగింది. అందువల్ల, పవిత్ర ఖురాన్ అనేక విధాలుగా మునుపటి గ్రంథాల కంటే ఆధిక్యతను  ప్రాధాన్యత పొందింది. ఈ ఖుర్ఆన్ గ్రంథాల ప్రామాణికతకు సాక్షి మరియు ఈ గ్రంథాలలోని వక్రీకరణల అబద్ధానికి సాక్షి.” (మజ్ మూఅల్ ఫతావా17/44)

ఆయన ఇంకా ఇలా తెలియజేశారు “ఖుర్ఆన్ విషయానికొస్తే, ఇది స్వతంత్ర గ్రంథం. దానిని విశ్వసించిన వారికి మరే ఇతర గ్రంథం అవసరం లేదు. ఈ ఖుర్ఆన్ మునుపటి అన్ని గ్రంధాల లక్షణాల కలయిక మరియు ఇతర గ్రంథాలలో ఉన్న అనేక లక్షణాలను కలిగి ఉంది. అందుకే ఈ గ్రంధం మునుపటి గ్రంధాలన్నింటిని ధృవీకరిస్తుంది మరియు అన్నింటికంటే శ్రేష్ఠమైనది. ఇది మునుపటి పుస్తకాలలోని సత్యాన్ని రుజువు చేస్తుంది మరియు వాటిలోని తిరోగమనాలను తిరస్కరిస్తుంది. మరియు అల్లాహ్ ఏ ఆజ్ఞలను రద్దు చేశాడో, ఇది వాటిని రద్దు చేస్తుంది, కాబట్టి ఈ ధర్మం సత్యాన్ని రుజువు చేస్తుంది, ఇది మునుపటి గ్రంథాలలో బలమైన భాగం, మరియు ఈ గ్రంధాలు మారిన మతాన్ని చెల్లుబాటు చేయవు, ఈ గ్రంథాలలో రద్దు చేయబడిన విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి“. (మజ్ మూఅల్ ఫతావా 19/184-185)

[1] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో మొదటిది:- కేవలం అల్లాహ్ ని మాత్రమే ఆరాధించాలి. ఆయన ఆరాధనలో ఎవరిని సాటి కల్పించకూడదు, వారు ఎవరైనా సరే, విగ్రహం అయినా, మనుషులైనా ప్రవక్తలైనా, రాళ్ళు అయినా, ఇక వేరే ఇతర ఏ వస్తువులైనా సరే సాటి కల్పించరాదు. దీన్నిబట్టి అర్థం అవుతున్నటువంటి విషయం దైవ ప్రవక్తలందరి ధర్మం ఒక్కటే, వాళ్ళు కేవలం అల్లాహ్ ని మాత్రమే ఆరాధించేవారు.

[2] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో రెండవది:- విశ్వాస ప్రాథమిక విషయాలపై విశ్వాసం ఉంచడం. అవేమిటంటే అల్లాహ్ పై, దైవదూతలపై, దైవ గ్రంథాలపై, దైవ ప్రవక్తలపై,  ప్రళయ దినంపై, విధిరాత మంచి చెడు అవడంపై విశ్వాసం ఉంచాలి.

[3] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో మూడవది:- ప్రత్యేక ఆరాధనలను కేవలం అల్లాహ్ కొరకు విధిగా చేయడం. ఉదాహరణకు నమాజ్, జకాత్, రోజా మొదలైనవి. కానీ ప్రవక్తల రాకడ ప్రకారంగా ఆరాధనలు నిర్వహించబడే విధానములు విభిన్నంగా ఉన్నాయి. ఉదాహరణకు తౌరాత్ గ్రంథం కూడా నమాజ్ చదవమని ఆజ్ఞాపిస్తుంది మరియు ఇంజీల్ గ్రంథం కూడా నమాజ్ నమాజ్ చదవమని ఆజ్ఞాపిస్తుంది. అదే విధంగా ఖురాన్ గ్రంథం కూడా నమాజ్ గురించి ఆజ్ఞాపిస్తుంది. కానీ నమాజ్ విధానము, నమాజ్ ఆచరించే సమయము ఈ మూడు మతాలలో వేరువేరుగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఉపవాసం యొక్క ఆజ్ఞ కూడా అంతే.

షరియత్ యొక్క వివరణాత్మక తీర్పులకు సంబంధించినంతవరకు, సాధారణ పరంగా అన్ని గ్రంధాలు ఈ విషయాన్ని అంగీకరిస్తాయి, అయితే కొన్నిసార్లు అవి అల్లాహ్ యొక్క జ్ఞానం మరియు అతని ఆధిపత్యానికి అనుగుణంగా ఉంటాయి  ఎందుకంటే అల్లాహ్ కు తన దాసులకు ఏది మేలో తెలుసు కాబట్టి ఆయన దానికి తగినటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు. అల్లాహ్  ఇలా అంటున్నాడు :

[وَرَبُّكَ يَخۡلُقُ مَا يَشَآءُ وَيَخۡتَارُۗ مَا كَانَ لَهُمُ ٱلۡخِيَرَةُۚ]

(నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు.)(అల్ ఖసస్ :68)

మరోచోట ఇలా అంటున్నాడు:

[لِكُلّٖ جَعَلۡنَا مِنكُمۡ شِرۡعَةٗ وَمِنۡهَاجٗاۚ]

(మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ఒక విధానాన్ని, మార్గాన్నీ నిర్ధారించాము.)(అల్ మాయిదా:48)

ఉదాహరణకు అల్లాహ్ తఆలా వేటినైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్ కొరకు హలాల్ అనగా ధర్మ సమ్మతం చేశాడో వాటిలో కొన్నింటిని తన జ్ఞానము మరియు వివేకంతో బనీ ఇస్రాయీల సమాజంపై వాటిని నిషిద్ధం చేశాడు. అవి వారి కంటే ముందు ధర్మసమ్మతం గావించబడినవి.

 అల్లాహ్ ఇలా అంటున్నాడు:

[فَبِظُلۡمٖ مِّنَ ٱلَّذِينَ هَادُواْ حَرَّمۡنَا عَلَيۡهِمۡ طَيِّبَٰتٍ أُحِلَّتۡ لَهُمۡ وَبِصَدِّهِمۡ عَن سَبِيلِ ٱللَّهِ كَثِيرٗ]

యూదుల దుర్మార్గం వల్ల వారికి ధర్మసమ్మతంగా ఉన్న అనేక పరిశుద్ధ వస్తువులను మేము వారికోసం నిషేధించాము. వారు ఎంతో మందిని దైవమార్గం నుంచి అడ్డుకోవటం వల్లనూ (అల్ నిసా:160)

[4] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో నాల్గవది:- న్యాయం యొక్క ఆజ్ఞ. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

[لَقَدۡ أَرۡسَلۡنَا رُسُلَنَا بِٱلۡبَيِّنَٰتِ وَأَنزَلۡنَا مَعَهُمُ ٱلۡكِتَٰبَ وَٱلۡمِيزَانَ لِيَقُومَ ٱلنَّاسُ بِٱلۡقِسۡطِۖ]

నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వారితో పాటు గ్రంథాన్ని, ధర్మకాటాను కూడా అవతరింపజేశాము  ప్రజలు న్యాయంపై నిలిచి ఉండటానికి! (అల్ హదీద్ :25)

[5] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో ఐదొవది:- ఐదు విషయాలను తప్పక కాపాడుకోవాలి అనే ఆజ్ఞాపించబడింది. అవి ఏమిటంటే ధర్మం, విశ్వాసం, ధనము, గౌరవము మరియు ప్రాణం.

[6] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో ఆరవది:- మంచి నైతికత గురించి ఆజ్ఞాపించడం జరిగింది మరియు చెడు నడవడిక నుండి వారించడం జరిగింది. ఉదాహరణకు: గ్రంథాలన్నీటిలో తల్లిదండ్రులకు విధేయత చూపాలని మరియు బంధువులతో బాంధవ్యాలు కలుపుకోవాలని,  అతిధులకు గౌరవ మర్యాదలు చేయాలని, నిరుపేదలను ఆదుకోవాలని అనేటువంటి ఆజ్ఞలను జారీ చేయడం జరిగింది. అదే విధంగా చెడును వారించడం ఉదాహరణకు: దౌర్జన్యం, తిరుగుబాటు, తల్లిదండ్రుల అవిధేయత, ఒకరి గౌరవ మర్యాదలతో ఆడుకోవడం, అబద్ధం, దొంగతనం, చాడీలు చెప్పడం, గీబత్  మొదలైనవి.

దైవ గ్రంథాలపై విశ్వాసం గురించి కొన్ని లాభదాయకమైనటువంటి విషయాలు మీ ముందు ఉంచడం జరిగింది. అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక. ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరిని క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాతాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.   

స్తోత్రం మరియు దరూద్ తరువాత

తెలుసుకోండి! అల్లాహ్ మీపై కరుణించు గాక. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు – ఆకాశం నుంచి అవతరింప చేయబడిన గ్రంథాలలో గొప్ప గ్రంధాలు రెండు ఉన్నాయి. అవి తౌరాత్ మరియు ఖుర్ఆన్. దివ్య ఖురాన్ లో అనేకచోట్ల ఈ రెండు గ్రంథాల ప్రస్తావన ఒకేసారి వచ్చింది. ఎందుకంటే ఈ రెండు గ్రంథాలు ఉన్నతమైనవి మరియు ఈ రెండు గ్రంథాల లో ఉన్నటువంటి చట్టము పరిపూర్ణం గావించబడినది.

ఓ అల్లాహ్ దాసులారా! నిశ్చయంగా ఖుర్ఆన్ అన్ని గ్రంథాల కంటే ఎంతో ఉన్నతమైనది. అందుకే అల్లాహ్ ఈ ఖురాన్ కు పూర్వ గ్రంథాలన్నీటిపై ఆధిక్యతను ప్రసాదించాడు. ఈ గ్రంథంలో ఇతర గ్రంథాలలో లేని అద్భుతాలు మరియు జ్ఞానానికి సంబంధించినటువంటి ఎన్నో మేలైన విషయాలు ఉన్నాయి.

ఖురాన్ అనగా ఇది అల్లాహ్ యొక్క వాక్యము. దీని ద్వారా అల్లాహ్ మాట్లాడాడు. అల్లాహ్ మాట్లాడినటువంటి వాక్యాలను జిబ్రాయిల్ దూత ద్వారా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి వరకు చేరవేయబడ్డాయి తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు ఆ వాక్యాలను తన అనుచరులు వరకు చేర్చారు. వారు  ఖుర్ఆన్ ను తమ హృదయాలలో భద్రపరుచుకున్నారు. వాటిని ఆకులపై లేక కాగితాలపై లిఖించి భద్రపరిచారు. ఆ తర్వాత మూడవ ఖలీఫా ఉస్మాన్ (రదియల్లాహు అన్హు ) గారి పరిపాలనలో ఒక పుస్తక రూపంలో సంకలనం చేశారు. ఆ తర్వాత దాని నుంచి అనేక  కాపీలను చేసి ప్రచురించడం జరిగింది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

[إِنَّا نَحۡنُ نَزَّلۡنَا ٱلذِّكۡرَ وَإِنَّا لَهُۥ لَحَٰفِظُونَ]

మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము (అల్ హిజ్ర్ :9)

[1] ఈ ఖుర్ఆన్ అవతరణకు గల ఒక వివేకం ఏమిటంటే: ఆ ఖుర్ఆన్ యొక్క వాక్యాల పై యోచన చేసి బుద్ధిమంతులు ఉపదేశం పొందాలి అని మరియు వారిలో దైవభీతి జనించాలని. అల్లాహ్ ఇలా అంటున్నాడు :

[كِتَٰبٌ أَنزَلۡنَٰهُ إِلَيۡكَ مُبَٰرَكٞ لِّيَدَّبَّرُوٓاْ ءَايَٰتِهِۦ وَلِيَتَذَكَّرَ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ]

ఇదొక శుభప్రదమైన గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటందుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చుకునేందుకు మేము దీనిని నీ వైపుకు పంపాము. (సాద్ : 29)

ఒకచోట ఇలా సెలవిస్తున్నాడు:

 [وَكَذَٰلِكَ أَنزَلۡنَٰهُ قُرۡءَانًا عَرَبِيّٗا وَصَرَّفۡنَا فِيهِ مِنَ ٱلۡوَعِيدِ لَعَلَّهُمۡ يَتَّقُونَ أَوۡ يُحۡدِثُ لَهُمۡ ذِكۡرٗا]

ఇదే విధంగా (ఓ ప్రవక్తా!) మేము దీనిని నీపై అరబ్బీ ఖుర్‌ఆన్‌గా అవతరింపజేశాము. ప్రజలు భయభక్తులు కలిగి ఉండగలందులకు, లేదా వారిలో ధర్మచింతన రేకెత్తేందుకు పలు విధాలుగా ఇందులో భయబోధ చేశాము. (తహా :113)

[2] మరొక వివేకవంతమైన విషయం ఏమిటంటే: దైవభీతిపరులకు ప్రతిఫలం ప్రసాదించుటకు మరియు తిరస్కారుల కొరకు శిక్ష ఉందని హెచ్చరించుటకు.

ఇలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

[ فَإِنَّمَا يَسَّرۡنَٰهُ بِلِسَانِكَ لِتُبَشِّرَ بِهِ ٱلۡمُتَّقِينَ وَتُنذِرَ بِهِۦ قَوۡمٗا لُّدّٗا]

నువ్వు ఈ గ్రంథం ఆధారంగా భయభక్తులు గలవారికి శుభవార్తను వినిపించటానికీ, తగవులమారులను హెచ్చరించ టానికీ దీనిని నీ భాషలో చాలా సులభతరం చేశాము. (మర్యమ్ :97)

[3] మరొక వివేకవంతమైన విషయం ఏమిటంటే: ధర్మ ఆదేశాలను ప్రజలకు తెలియజేయడానికి అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు.

[وَأَنزَلۡنَآ إِلَيۡكَ ٱلذِّكۡرَ لِتُبَيِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ إِلَيۡهِمۡ وَلَعَلَّهُمۡ يَتَفَكَّرُونَ]

(అలాగే) ప్రజల వద్దకు పంపబడిన దానిని నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పేందుకు, తద్వారా వారు యోచన చేసేందుకుగాను మేము నీపై ఈ జ్ఞాపిక (గ్రంథము)ను అవతరింపజేశాము (అల్ నహ్ల్ :44)

మరొకచోట ఇలా అంటున్నాడు.

 [وَمَآ أَنزَلۡنَا عَلَيۡكَ ٱلۡكِتَٰبَ إِلَّا لِتُبَيِّنَ لَهُمُ ٱلَّذِي ٱخۡتَلَفُواْ فِيهِ]

వారు విభేదించుకునే ప్రతి విషయాన్నీ నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పాలని మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. (అల్ నహ్ల్ :64)

[4] మరోక వివేకవంతమైన విషయమేమిటంటే: విశ్వాసులు తమ విశ్వాసంపై స్థిరంగా ఉండాలని.

అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు

[قُلۡ نَزَّلَهُۥ رُوحُ ٱلۡقُدُسِ مِن رَّبِّكَ بِٱلۡحَقِّ لِيُثَبِّتَ ٱلَّذِينَ ءَامَنُواْ وَهُدٗى وَبُشۡرَىٰ لِلۡمُسۡلِمِينَ]

ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “విశ్వసించిన వారికి నిలకడను వొసగటానికి, ముస్లింలకు సన్మార్గం చూపటానికీ, వారికి శుభవార్తను వినిపించటానికీ నీ ప్రభువు వద్ద నుంచి పరిశుద్ధాత్మ (జిబ్రయీల్‌) దీన్ని సత్యసమేతంగా అవతరింపజేశాడు.” (అల్ నహ్ల్ :64)

[5] మరొక వివేకవంతమైన విషయం ఏమిటంటే : ప్రజల మధ్య ఖుర్ఆన్ ద్వారా తీర్పు జరగాలని.

అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.

 [إِنَّآ أَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ لِتَحۡكُمَ بَيۡنَ ٱلنَّاسِ بِمَآ أَرَىٰكَ ٱللَّهُۚ]

(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ నీకు చూపిన విధంగా నీవు ప్రజల మధ్య తీర్పు చెయ్యటానికిగాను మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్యంతోపాటు పంపాము.) (అల్ నిసా : 105)

ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి. అల్లాహ్ మీపై కరుణించుగాక . అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యానికై  అజ్ఞాపించి ఉన్నాడాని మీరు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ ఇలా అన్నాడు.

 [إِنَّ ٱللَّهَ وَمَلَٰٓئِكَتَهُۥ يُصَلُّونَ عَلَى ٱلنَّبِىِّۚ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ صَلُّوا۟ عَلَيْهِ وَسَلِّمُوا۟ تَسْلِيمًا] 

నిశ్చయంగా అల్లాహ్‌, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింప చేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు.

ఓ అల్లాహ్! ఇస్లాం, ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు. ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు, మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారిగా చేయి. ఓ అల్లాహ్ మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని, పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు. ఆమీన్

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

దైవ గ్రంధాలపై విశ్వాసం (మెయిన్ పేజీ ):
https://teluguislam.net/belief-in-books/

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పంపడంవలన  లాభాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖుత్బా అంశము : ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పంపడం  వలన  లాభాలు                

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.     

ఓ ముస్లిం లారా! అల్లాహ్ యొక్క దైవభీతిని కలిగి ఉండండి. ఆయనకు విధేయత చూపండి, అవిధేత నుండి జాగ్రత్త వహించండి.

తెలుసుకోండి! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)వారిపై దరూద్ పంపడం ద్వారా పది ప్రయోజనాలు ఉన్నాయి.

1. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై దరూద్ పంపమన్న అల్లాహ్ యొక్క ఆజ్ఞ నెరవేరుతూ ఉంటుంది.

అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا
ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి. (33:56)

2. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై దరూద్ పంపడం ఒక దుఆ లాంటిది. ఇది ఆరాధనలో భాగమే ఎందుకంటే ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ కాబట్టి దీని కొరకు పుణ్యఫలం కూడా ఉంది.

3. మహాప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై ఒకసారి దరూద్ పంపడం వలన అల్లాహ్ తఆలా యొక్క పది కారుణ్యాలు లభిస్తాయి. ప్రవక్త వారు ఇలా తెలియజేశారు: ఎవరైతే నాపై ఒకసారి దరూద్ పఠిస్తారో అల్లాహ్ వారి పై పదిసార్లు కరుణిస్తాడు. (ముస్లిం)

ప్రతిఫలం అనేది చర్య యొక్క స్వభావం ద్వారా లభిస్తుంది. కనుక ఎవరైతే ప్రవక్త వారిని ప్రశంసిస్తారో అల్లాహ్ దానికి బదులుగా అతడిని ప్రశంసిస్తాడు మరియు అతని స్థానాలను ఉన్నతం చేస్తాడు.

4. దరూద్ పఠించే వ్యక్తి యొక్క పది అంతస్తులు పెరుగుతాయి. అతనికి పది పుణ్యాలు లభిస్తాయి మరియు పది పాపాలు క్షమించబడతాయి.

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయినా నాపై ఒకసారి దరూద్ పఠిస్తే అల్లాహ్ అతనిపై పదిసార్లు కారుణ్యం కురిపిస్తాడు. అతని పది పాపాలను మన్నిస్తాడు. ఇంకా అతని పది అంతస్తులను పెంచుతాడు“. (నసాయి)

5. దరూద్ పాపాల మన్నింపుకు, దుఃఖవిచారాలను దూరం చేసుకోవటానికి, కష్టాలు కడగండ్ల నుండి గట్టెక్కటానికి దోహదపడుతుంది.

హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) కధనం: నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో మాట్లాడుతూ “దైవప్రవక్తా నేను మీపై అత్యధికంగా దరూద్ పంపుతూ ఉంటాను. వాస్తవానికి నేను నా ప్రార్ధన (దుఆ) లో ఎంత సేపు మీపై దరూద్ పఠించాలి?.” అని అడిగాను. అందుకాయన “నికిష్టమయినంత సేపు” అని అన్నారు. “నా ప్రార్థనలో నాల్గో వంతు మీ దరూద్ కోసం కేటాయిస్తే సరిపోతుందా?” అని అడిగాను. “సరిపోతుంది. కాని అంతకన్నా ఎక్కువ సేపు దరూద్ పఠిస్తే అది నీకే మంచింది” అని అన్నారాయన. నేను “సగం ప్రార్ధన దరూద్ కోసం కేటాయిస్తాను” అన్నాను. దానికాయన “సరే, నీ యిష్టం.కానీ అంతకన్నా ఎక్కువ సేవు దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అని అన్నారు.నేను మళ్లీ “అయితే మూడింట రెండు వంతుల ప్రార్థన దాని కోసమే కేటాయించమంటారా?” అని అడిగాను. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీ యిష్టం. ఇంకా ఎక్కువ సమయం దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అని అన్నాడు. చివరికి నేను “మరయితే నా ప్రార్ధన అంతా దరూద్ కోసమే ప్రత్యేకించుకుంటాను” అని అన్నాను. అప్పుడాయన “ఈ పద్ధతి నీ దుఃఖ విచారాలన్నిటినీ దూరం చేస్తుంది. నీ పాపాల మన్నింపుకు దోహదపడుతుంది” అని చెప్పారు. (తిర్మీజీ)

ఇబ్నే తైమియా (రహిమహుల్లాహ్) తెలియచేసారు: ఇతను హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) ఈయన అల్లాహ్ తో ఒక ప్రత్యేక దుఆ వేడుకునేవారు. కానీ ఎప్పుడైతే ఆయన తన ప్రత్యేక దుఆ దగ్గర దరూద్ పటించడం ప్రారంభించాడో అతని ఇహపరాల ఇబ్బందుల కొరకు అల్లాహ్ సరిపోయాడు. ఆయన దరూద్ పంపినప్పుడల్లా అల్లాహ్ అతనిపై పది కారుణ్యాలను కురిపించాడు. ఒకవేళ అతను తన సోదరుని కోసం దుఆ చేస్తే దైవదూతలు ఆమీన్ చెప్పడంతో పాటు నీకు కూడా అది లభించుగాక అనేవారు కాబట్టి మహా ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి కొరకు దుఆ  చేయడం ఎంతో ఉత్తమమైనది.

6. మహా ప్రవక్త మొహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై దరూద్ పంపడం వలన కలిగేటువంటి మరో ప్రయోజనం ఏమిటంటే ఎవరయినా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పఠిస్తే, స్వర్గంలో ఆయనకు ‘ఉన్నత స్థానం’ లభించాలని కోరుకుంటే ప్రళయ దినాన వారికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసు లభిస్తుంది.

హజ్రత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ అస్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్తుండగా విన్నాను, ఆయన ఈ విధంగా తెలియ చేసారు: “మీరు ఆజాన్ పిలుపు వినగానే దానికి తిరిగి అదే విధంగా సమాధానం చెప్పండి. ఆ తరువాత నాపై దరూద్ పటించండి. ఎవరు అయితే నాపై ఒకసారి దరూద్ పంపుతాడో అల్లాహ్ అతన్ని పది సార్లు కరుణిస్తాడు. నా కొరకు వసీలా’ (స్వర్గంలో ఒక ఉన్నత స్థానం) లభించాలని అల్లాహ్ ను కోరుకుంటే, ప్రళయ దినాన నేను వారి గురించి తప్పకుండా సిఫారసు చేస్తాను”. (ముస్లిం)

7. దుఆ చేసే వ్యక్తి తన దుఆ కి ముందు దరూద్ పఠించినప్పుడు అతనిలో దుఆ స్వీకరించబడుతుంది అనే ఆశ ఉంటుంది. ఎందుకంటే దరూద్ అతని దుఆ ని అల్లాహ్ అంగీకరించేందుకు తోడ్పడుతుంది.

ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా తెలియజేశారు: “ఆకాశం మరియు భూమి మధ్య దుఆ నిలిపివేయబడుతుంది. మీరు దానిపై ప్రార్థించే వరకు అనగా ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై దరూద్ పంపనంతవరకు దానిలో ఏదీ పైకి వెళ్లదు“. (తిర్మీజీ)

8. మనం పఠించేటువంటి దరూద్ ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి చేరవేయబడుతుంది, ప్రవక్త గారు ఇలా తెలియజేశారు: “మీ దరూద్ నాకు అందించబడుతుంది“. (అహ్మద్)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై తన ‘దరూద్’ పంపడం కంటే ఒక వ్యక్తికి గొప్ప గౌరవం ఏముంటుంది?

9. ఏదేని సభలో దూరూద్ పటించడం ఆ సభ యొక్క స్వచ్ఛతకు కారణం. దీనికి వ్యతిరేకంగా ఎవరైతే దూరూద్ పఠించరో అది వారి కొరకు ప్రళయ దినాన దుఃఖ దాయకంగా పరిణమిస్తుంది.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “కొంతమంది ఒకచోట సమావేశమై ఆ సమావేశంలో అల్లాహ్ ను జ్ఞాపకం చేసుకోకపోతే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై దరూద్ పంపకపోతే ప్రళయదినాన ఆ సమావేశం వారి పాలిట దుఃఖదాయకంగా (తలవంపుగా) పరిణమిస్తుంది. వారు సత్కార్యాల ఆధారంగా స్వర్గంలో ప్రవేశించేవారయినా సరే.” (అహ్మద్)

10. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ప్రేమ పెరుగుదలకు దరూద్ షరీఫ్ కారణం. ఇది విశ్వాసం యొక్క ఒడంబడికలలో ఒకటి, ఇది ఒక్క ప్రేమ ద్వారా మాత్రమే నెరవేరుతుంది. ఒక వ్యక్తి తన ప్రియమైన వ్యక్తిని ఎంత ఎక్కువగా గుర్తుంచుకుంటాడో, అతని సద్గుణాలు మరియు అతని ప్రేమకు దారితీసే లక్షణాలను పునరుద్ధరించుకుంటాడు. దీనివలన అతని ప్రేమ మరింత పెరుగుతుంది మరియు అతను ప్రేమించే ప్రియమైన వ్యక్తిని కలవాలనే కోరిక పూర్తిగా పెరుగుతుంది.

కానీ ఒక వ్యక్తి తాను ప్రేమించే వ్యక్తిని మర్చిపోయినప్పుడు అతని హృదయంలో నుండి అతని సద్గుణాలన్నీ తొలగిపోతాయి, మరియు అతనిపై ఉన్న ప్రేమ కూడా తగ్గిపోతుంది. ఒక ప్రేమికుడికి తాను ప్రేమించే తన స్నేహితుడిని చూడడం కంటే తన కళ్ళను మరి ఏమి చల్లపరచలేదు.

ఇవి ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై దరూద్ పంపడం వలన కలిగేటువంటి పది ప్రయోజనాలు – వీటిని ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిం (రహిమహుల్లాహ్) వారు (జలా అల్ ఆఫ్ హామ్) అనే పుస్తకంలో పొందుపరిచారు.

అల్లాహ్ ఖుర్ఆన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక, ఆయన వివేకం తో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక, అల్లాహ్ మనందరిని క్షమించుగాక, మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి, నిశ్చయంగా ఆయన (తౌబా)  పశ్చాత్తాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.   

స్తోత్రం మరియు దరూద్ తరువాత

ఓ ముస్లిం లారా! మహా ప్రవక్త  ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కొరకు దరూద్ పంపడంతోపాటు, వసీల మరియు ఫజీల (ఔన్నత్యం) కొరకు దుఆ  కూడా చేయాలి. అనగా ఓ అల్లాహ్! మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని నువ్వు వాగ్దానం చేసినటువంటి ఆ మఖామే మహమూద్ వరకు చేర్చు.  దీని ఆధారం జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఇలా తెలియజేశారు: “ఎవరైతే అజాన్ పిలుపు వింటారో వారు ఈ దుఆ  చదవాలి:

(ఈ సంపూర్ణ పిలుపుకు స్థిరముగా స్థాపించబడు నమాజుకు ప్రభువైన అల్లాహ్! హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారికి వసీల అనే ఆశ్రయం ప్రసాదించు. మహిమ కలిగిన ఔన్నత్యమును ప్రసాదించు. మరియు నీవు వారికి ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చు) (బుఖారి)

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: ముఅజ్జన్ (అజాన్ ఇచ్చేవాని) ప్రకటన విన్నప్పుడు, అతను అనే పలుకులే మీరూ పలకండి. ఆ తర్వాత నాపై దరూద్ పఠించండి. నాపై ఒకసారి దరూద్ పఠించేవారిని అల్లాహ్ పదిసార్లు కరుణిస్తాడు. ఆ తర్వాత నాకు ‘వసీలా’ లభించాలని అల్లాహ్ ను ప్రార్థించండి. వసీలా అనేది స్వర్గంలో ఒక (ఉన్నత స్థానం). స్వర్గవాసులందరిలో అది కేవలం ఒకే ఒక్కరికి లభిస్తుంది. ఆ ఒక్కణ్ణి నేనేనని నా అభిప్రాయం. కనుక నాకు వసీలా లభించాలని ప్రార్థించే వ్యక్తికి నా సిఫారసు తప్పకుండా లభిస్తుంది. (ముస్లిం)

వసీల” అనగా స్వర్గంలో ఉన్నటువంటి ఒక ఉన్నత స్థానము. “ఫజీల” అనగా మహిమ కలిగినటువంటి ఔన్నత్యము. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు తెలియచేసినటువంటి దాంట్లో మఖామే మహమూద్ లో “మహమూద్” అనగా ఒక ప్రదేశము అక్కడ నిల్చున్న వ్యక్తి ప్రశంసించబడతాడు. “అల్ మఖాం” అనగా లెక్క తీసుకునేటువంటి సందర్భంలో సిఫారసు కొరకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిల్చోనేటువంటి ప్రదేశము. దీని ఆధారం అబూరైన కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు: “మఖామే మహమూద్ అనగా సిఫారసు

మరియు హదీస్ యొక్క చివరిలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అని అన్నారు: “అనగా ఆచరణ ద్వారానే ప్రతిఫలం లభిస్తుంది కనుక ఏ వ్యక్తి అయితే మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి కొరకు మఖామే మహమూద్ గురించి అల్లాహ్ ను ప్రార్ధిస్తాడో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సిఫారసు కు అతను అర్హుడు అవుతాడు. మరియు ఆ వ్యక్తి పాపాలు క్షమించబడి, స్థానాలు ఉన్నతం చేయబడే వారిలో చేర్చబడతాడు”.

అల్లాహ్ మనందరికీ మహా ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సిఫారసు పొందే భాగ్యాన్ని ప్రసాదించుగాక! (ఆమీన్)

మరియు ఇది కూడా తెలుసుకోండి, అల్లాహ్ ఆయనపై తన కారుణ్యాన్ని కురిపించు గాక. అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యం గురించి తెలియచేశాడు. అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు.

(إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما)
(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.)

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు.

ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్ ,ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.

ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు. మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి. ఓ అల్లాహ్! మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు.   

ఓ అల్లాహ్! మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు. ఓ అల్లాహ్ మమ్ములను ఆ నరకాగ్ని నుంచి రక్షించు, మాకు మోక్షాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.  

ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయపడుతున్నాము మరియు ఆ స్వర్గంలోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము మరియు నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి  నీ శరణు కోరుకుంటున్నాము.

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

కహానహ్ (జ్యోతిష్యం) – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

అంశము : ఇస్లాం నుంచి బహిష్కరించే ఏడవ  విషయము: కహానహ్ (జ్యోతిష్యం)

إنَّ الْحَمْدَ لِلَّهِ، نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وسَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ، وَأَشْهَدُ أَنْ لَا إلـٰه إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ.

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత

అల్లాహ్ దాసులారా! ఆయనకు భయపడుతూ ఉండండి, ఆయన భీతి కలిగి ఉండండి, ఆయనకు విధేయత చూపండి,  అవిధేయతకు పాల్పడకండి. గుర్తుంచుకోండి!  తౌహీద్లో భాగమైన ఓ విషయం ఏమిటంటే: నామాలలో గుణగణాలలో అల్లాహ్ ను ఏకంగా భావించటం. అందులో అగోచర జ్ఞానం అనేది అల్లాహ్ యొక్క ప్రత్యేకమైన గుణం,  అది అల్లాహ్ కు  అంకితం అని ఖురాన్ మరియు హదీసుల ద్వారా మరియు ఈ ఉమ్మత్ యొక్క ఉలమాలు అందరూ ఏకీభవించి ఉన్న స్పష్టమైన విషయం. అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

قُل لَّا يَعْلَمُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ الْغَيْبَ إِلَّا اللَّهُ ۚ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ

“అల్లాహ్‌కు తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర జ్ఞానం లేదు. తాము ఎప్పుడు తిరిగి లేపబడతామో కూడా వారికి తెలియదు” అని ఓ ప్రవక్తా (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి చెప్పు. (సూరా అన్ నమ్ల్ 27 : 65)

ఓ హాదీస్ లో ఖాలిద్ బిన్ జక్వాన్ వారు రబీ బింతే ముఅవ్వీజ్ తో ఉల్లేఖిస్తున్నారు: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక బాలికను ఈ విధంగా గీతం పాడుతుండగా విన్నారు “మా ప్రవక్తకు రేపు జరిగే విషయాలు కూడా తెలుసు“. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)  “ఆ విషయాన్ని విడిచి మిగతాది పాడండి” అని వారించారు మరియు రేపు ఏం జరగనున్నది అనేది అల్లాహ్ కు తప్ప మరెవరికి తెలియదు అని బోధించారు. (ఇబ్ను మాజహ్, అల్లామా అల్బానీ రహిమహుల్లాహ్ వారు దీనిని ప్రామాణికంగా ఖరారు చేశారు).

ఇబ్నె ఉమర్ వారి ఉల్లేఖనము: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా అన్నారు: అగోచరజ్ఞానం ఖజానా కు ఐదు తాళం చెవులు ఉన్నాయి , దాని జ్ఞానం అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి లేదు, అందులో :  (1) రేపు ఏం జరగనున్నదో అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి తెలియదు, (2) మాతృ గర్భాలలో  ఏముందో అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి తెలియదు (*), (3) వర్షం ఎప్పుడు కురుస్తుందో ఆయనకు తప్ప మరెవరికి తెలియదు, (4) ఎవరు ఏ గడ్డపై మరణిస్తారో అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి తెలియదు మరియు (5) ప్రళయం ఎప్పుడు సంభవిస్తుందో అల్లాహ్ కు తప్ప మరి ఎవరికి తెలియదు. (సహీ బుఖారి).

తెలిసిన విషయమేమిటంటే అగోచర జ్ఞానం కేవలం అల్లాహ్ కు మాత్రమే అంకితము. ఇది అల్లాహ్ యొక్క గుణము.  ఇందులో ఎవరు కూడా ఆయనకి సాటిలేరు,  వాళ్ళు అల్లాహ్ సమీపంలో ఉన్న దైవదూతులైనా కావచ్చు, పంపించబడ్డ ప్రవక్తలైనా కావచ్చు. కనుక ఎవరైతే తనకు అగోచర జ్ఞానం ఉందని ప్రకటిస్తాడో అతను అల్లాహ్ కి ప్రత్యేకమైన గుణంలో అల్లాహ్ దాసులను భాగ్యస్వామ్యం చేసినట్టు. దాసుడ్ని అల్లాహ్ కు సమానము చేశాడు, మరియు ఘోరాతి ఘోరమైన పాపానికి (షిర్క్ ఎ అక్బర్) కి పాల్పడ్డాడు. తమ కాలానికి  ఇమామ్ అయిన ఇమామ్ అహ్లుస్ సున్నహ్: నుఐమ్ బిన్ హమ్మాద్ అల్ ఖుజాయీ వారు అన్నారు: “ఎవరైతే సృష్టికర్తను సృష్టిరాశులతో  సమానం చేశాడో అతను అవిశ్వాసానికి (కుఫ్ర్ కు) పాల్పడినట్టు.”

అల్లాహ్ దాసులారా! ప్రజలలో కొందరు అగోచర జ్ఞాన విషయంలో అల్లాహ్ కు సాటిగా సమానులని ప్రకటిస్తున్నారు. అల్లాహ్ కు ఈ నినాదానికి ఎటువంటి సంబంధం లేదు. వీళ్లు “కాహిన్” మరియు “అర్రాఫ్ “. కాహిన్ అంటే: భవిష్య జ్ఞానం కలిగి ఉన్నాడని ప్రచారం చేసుకునేవాడు, జ్యోతిష్యుడు. అర్రాఫ్ ( షోబదబాజ్) అంటే ఇందులో జ్యోతిష్యుడు, గుప్త విద్య కలిగిన వాడు, చేతబడి చేసేవాడు  అనే అన్ని అర్ధాలు వస్తాయి. అరబీ భాషలో ఇతన్ని “అర్రాఫ్” అంటారు.

షేక్ సాలేహ్ అల్ ఉసైమీన్ (రహిమహుల్లాహ్) అన్నారు: కాహిన్ అనే పదానికి అర్ధం “అంచనా” ఆధారం లేని విషయాల ద్వారా వాస్తవాలు సేకరించడం. ఆజ్ఞాన కాలంలో ఎవరి వద్దకు అయితే షైతానులు వచ్చేవో వాళ్ళు ఇదే పని చేసేవారు, షైతానులు ఆకాశం నుంచి సమాచారాలను అందించే వారు. ఈ జ్యోతిష్యులు షైతానులు నుంచి అందిన సమాచారంతో స్వంత మాటలు కలిపి ప్రజలకు చెప్పేవారు. ఒకవేళ వీళ్ళు చెప్పిన మాటలు నిజమైతే ప్రజలు వీళ్ళకు దగ్గరై ప్రతీ సమస్యకు పరిష్కారం కొరకు వీళ్ళని ఆశ్రయించే  వారు మరియు భవిష్యవాణులు తెలుసుకునే వారు.  అందుకే మనం (సాలేహ్ అల్ఉసైమీన్ వారు) అంటున్నాం,  కాహిన్ అంటే: భవిష్యత్తులో జరిగే అగోచార  విషయాల్ని తెలియజేసేవాడు .(ఇలా ప్రజల్లో ప్రచారం వుంది)

ఓ విశ్వాసులారా! జ్యోతిష్యుడు అగోచర జ్ఞానం నిరూపించడానికి రెండింటిలో ఒక మార్గాన్ని ఎన్నుకుంటాడు,

మొదటిది: దైవదూతల నుంచి సమాచారాన్ని దొంగలిచే షైతాన్ మాటలు వినటం. దీని ఆధారం సహీ బుఖారిలో ఆయేషా (రదియల్లాహు అన్హా) వారి ఉల్లేఖనం:

దైవ దూతలు ఆకాశం మబ్బుల్లో వస్తారు మరియు అల్లాహ్ తీసుకున్న నిర్ణయాలను తెలియజేస్తారు. అక్కడున్న షైతాన్లు రహస్యంగా ఆ మాటలను దైవదూతల నుంచి విని, ఈ చేతబడి చేసే వాళ్ళు,  జ్యోతిష్యాలు చెప్పే వాళ్లకు తెలియజేస్తారు. వాళ్ళు ఆ  విన్న మాటల్లో తమ తరఫునుంచి అబద్ధాలు కలిపి, తమ వద్దకు వచ్చే ప్రజలకు చెప్తారు. (బుఖారి)

అల్లాహ్ దాసులారా! తెలిసిన విషయం ఏంటంటే: జ్యోతిష్యులు ప్రజలకు అబద్ధమైన విషయాలను చెప్తారు. ఒకవేళ వాళ్ళు చెప్పిన విషయంలో ఏదైనా సత్యం ఉంటే, అది షైతాన్ దొంగిలించిన మాటల్లో నుంచి ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు చెప్పే అగోచర జ్ఞానానికి దానికి సంబంధం ఉండదు. ఈ విధంగా ప్రజలు వాళ్ళ చెప్పే విషయాల్లో ఆ ఒక్క సత్యమైన మాట వల్ల వాళ్ళ వలలో చిక్కుకుంటారు. మరియు అందులో కలిసి ఉన్న అబద్ధమైన విషయాలను పట్టించుకోరు.  మరికొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పే పూర్తి విషయాలు అబద్ధం అయినప్పటికీ దాన్ని సత్యమే అని భావిస్తారు. (ఇది మొదటి మార్గం)

రెండవ మార్గం: జిన్నులను ఆశ్రయించటం. ఆ జిన్  ప్రతి మానవుడుతో పాటే ఉండేవాడైనా కావచ్చు లేదా వేరే వాడైనా. ఇది ఎలా అంటే ప్రతి మానవుడుతో పాటు ఒక జిన్ నిమిత్తమై ఉంటాడు. అతను ఆ మానవుడికి చెడు వైపునకు ఆహ్వానిస్తూ ఉంటాడు, కనుక ఆయేషా (రదియల్లాహు అన్హా) వారి ఉల్లేఖనం లో ఈ విధంగా ఉంది: కొంతమంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కాహిన్ మరియు  జ్యోతిష్యులు గురించి ప్రశ్నించారు. దానికి సమాధానంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు “అది పెద్ద విషయం కాదు”  దానికి వారు ఇలా అడిగారు ” ప్రవక్త కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పే మాటలు నిజమవుతాయి కదా”  అంటే దానికి జవాబుగా ప్రవక్త వారు ఇలా అన్నారు ” వాళ్లు చెప్పే మాటల్లో ఏదైతే నిజం అవుతాయో అవి దైవదూతల నుంచి  దొంగలిస్తారు , దానిని ఈ జ్యోతిష్యులు, కాహిన్ లకు  చెవిలో కోడికూత మాదిరిగా చెప్తారు. తర్వాత వాళ్ళు ఆ ఒక్క మాటలో  వంద  అబద్ధాలు కలిపి చెప్తారు. ( బుఖారి, ముస్లిం)

కాహిన్ లకు మానవులతో పాటు ఉండే జిన్నాతులకు సంబంధం ఉంది అని చెప్పటానికి ఇది ఒక ఆధారం, ఎందుకంటే ప్రతి మానవుడుతో పాటు ఒక జిన్ నియమిత ఉంటాడు. అతను మానవుడికి చెడు వైపుకు ఆహ్వానిస్తూ ఉంటాడు. ఈ జిన్ ఆ వ్యక్తి యొక్క ప్రతి రహస్యాన్ని ఎరిగి ఉంటాడు, ఏదైతే ఇతర ప్రజలకు తెలియవో. ఉదాహరణకు: ఒక వ్యక్తి యొక్క ఏదో ఒక వస్తువు తప్పిపోతే ఆ వ్యక్తితో పాటు ఉండే జిన్ కి ఆ ప్రదేశము తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఎల్లప్పుడూ ఆ వ్యక్తితోనే ఉంటాడు కాబట్టి. ఒకవేళ ఈ వ్యక్తి కాహిన్ ను సంప్రదిస్తే ఆ  తప్పిపోయిన వస్తువు గురించి ప్రశ్నిస్తే ఆ జిన్ ఆ కాహిన్ కి ఆ వస్తువు ఒక ప్రదేశం గురించి తెలియజేస్తాడు. తర్వాత కాహిన్ ఆ ఒక్క మాటతో 100 అబద్ధాలు కలిపి ఆ వ్యక్తికి ఆ  ప్రదేశము తెలియజేస్తాడు. చివరికి ఆ వ్యక్తి పోగొట్టుకున్న వస్తువుని పొందిన తర్వాత ఆ కాహిన్ చెప్పిన ప్రతి మాట నిజమే అని భావిస్తాడు,  మరియు అతను అగోచర జ్ఞానం కలిగి ఉన్నాడని నమ్ముతాడు. వాస్తవానికి ఆ కాహిన్ ఆ జిన్ను నుంచి విన్న విషయాన్ని అతనికి చెప్పి ఉంటాడు, ఉదాహరణకు: ఒక వ్యక్తి తన భార్యతో చెప్పుకున్న విషయాలు, వాళ్ల తల్లి పేరు, ఊరు పేరు, ఇంటి అడ్రస్సు,  వాళ్ళు చేసే పని,  ఇంకా ఆ జిన్ కి , ఆ వ్యక్తికి సంబంధించి తెలిసిన విషయాలన్నీ కూడా మొదలైనవి.

అల్లాహ్ దాసులారా! కాహిన్ ఏ షైతాన్ని అయితే సంప్రదిస్తాడో అతను షైతాన్ నుంచి సేవలు తీసుకుంటాడు. దానికి బదులు ఆ కాహిన్ అతన్ని ఆరాధిస్తాడు. షైతాన్ లక్ష్యం కూడా ఇదే. షైతాన్ పూర్తి ఆదం సంతతిని మార్గ భ్రష్టత్వానికి గురి చేయడానికి లక్ష్యం చేసుకున్నాడు. ఇంకా ఇదే అతని పని మరియు ఇదే అతని సందేశము. అతని వలలో జ్యోతిష్యులు,  చేతబడి చేసే వాళ్ళు  కాహిన్ అందరూ చిక్కుకుంటారు,  వీళ్ళు మానవుల్లో ఉన్న షైతానులు అయితే అతను జిన్నాతుల నుంచి షైతాన్.  ఈ షైతాన్లు అందరు కలిసి మానవాళిని అపమార్గం పట్టిస్తారు.  (అల్లాహ్ మనందరినీ ఈ షైతాన్లు నుంచి కాపాడుగాక)

అల్లాహ్ దాసులారా! ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరైతే షరియత్ లో చెప్పిన రుఖ్యా ద్వారా వ్యాధులను నిర్మూలిస్తారో వాళ్లకు ఆ కాహిన్ చేసే నాటకాలు తెలిసికొని ఉంటారు. వాళ్ళల్లో ఒక్కరు చెప్పిన విషయం ఏమిటంటే: మీరు కాహిన్ రహస్యాన్ని ఛేదించడం అనుకుంటున్నారు అయితే: “మీకు కూడా తెలియని ఒక విషయము ఆ కాహిన్ ని అడగండి, ఎందుకంటే మీకు తెలియని విషయం కూడా మీతో పాటు ఉన్న జిన్ కి కూడా తెలియదు,  కనుక ఆ కాహిన్ కి కూడా తెలియకుండా పోతుంది. ఉదాహరణకు నేలపై నుంచి కొన్ని కంకర రాళ్లు తీసుకోండి, మీ పిడికిలను మూసేసి, తర్వాత కాహిన్ను ప్రశ్నించండి,  నా చేతిలో ఎన్ని రాళ్లు ఉన్నాయని, అతను దానికి సమాధానం ఇవ్వలేడు, మీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు, ఎందుకంటే ఈ విషయము, ఈ సమాధానము మీతో పాటు ఉన్న జిన్ కి కూడా తెలియదు,  అలాంటప్పుడు ఆ కాహిన్ ఏం సమాధానం ఇస్తాడు? .

సారాంశం ఏమిటంటే: కాహిన్ తమ అన్ని వ్యవహారాలలో జిన్నాతులను ఆశ్రయిస్తాడు,సహాయం తీసుకుంటాడు. అన్ని సంఘటనలు, సమాచారాన్ని తెలుసుకోవడానికి షైతాన్ ను ఆశ్రయిస్తాడు. షైతాన్ ఆ కాహిన్ చెవిలో కొన్ని విషయాలు ఊదుతాడు,  దానినీ ఆధారంగా చేసుకొని అనేక విషయాలు కలిపి  ప్రజలకు తెలియజేస్తారు. ఒకవేళ చెప్పిన మాట నిజమైతే ప్రజలు ఆ కాహిన్ ని అగోచర జ్ఞాని అనుకుంటారు,  ఇలా అతని వలలో చిక్కుకుంటారు. ప్రజలు అజ్ఞానంలో దాన్ని మహిమలు (కరామాత్) అనుకొని వీళ్ళు ఔలియా అల్లాహ్ (అల్లాహ్ స్నేహితులు) అనుకుంటున్నారు.  వాస్తవానికి వాళ్ళు ఔలియా ఉష్ షైతాన్ (షైతాన్ స్నేహితులు), ఎలాగైతే అల్లాహ్ ఖుర్ఆన్ లో సూరతుష్ షుఅరా లో  ఇలా తెలియజేశారు:

(هَلْ أُنَبِّئُكُمْ عَلَى مَنْ تَنـزلُ الشَّيَاطِين * تَنـزلُ عَلَى كُلِّ أَفَّاكٍ أَثِيم * يُلْقُونَ السَّمْعَ وَأَكْثَرُهُمْ كَاذِبُون).

(ప్రజలారా!) షైతానులు ఎవడిపైన దిగుతారో నేను మీకు తెలుపనా? అబద్దాలకోరు, పాపాత్ములైన ప్రతి ఒక్కరిపై వారు దిగుతారు. విని వినని కొన్ని మాటలు చెవుల్లో వేస్తారు. వారిలో అనేకులు అబద్ధాలు చెప్పేవారే (26: 221,-226)

తౌహీద్ ప్రజలారా: నుజూమి కూడా అగోచర జ్ఞానం కలిగి ఉన్నాడని ప్రకటిస్తాడు. నుజూమి అంటే: నక్షత్రాలను చూసి భవిష్యతులొ సంభవించే సంఘటనాల జ్ఞానాన్ని సేకరించేవాడు. ఉదాహరణకు: గాలి వీచే సమయము , వర్షం కురిసే సమయం, చలికాలం, వేసవి కాలము మరియు ధరలు మారే జ్ఞానము. వాళ్ళు చెప్పే విషయం ఏమిటంటే : ఆకాశంలో నక్షత్రాలు తిరిగే , కలిసే సమయాల్లో దానిని చూసి వీళ్ళు ఈ విషయాలు తెలియజేస్తారు. మరియు నక్షత్రాలు భూమండలంపై ప్రభావితమై ఉంటాయి అంటారు,  దీనిని “ఇల్మె తాసీర్”  అంటారు , మరియు దీని గురించి ప్రచారం  చేసుకునే వాడ్ని ‘జ్యోతిషి” అని అంటారు. వాళ్లు నక్షత్రాలను చూసి, వాళ్లతో మాట్లాడేటప్పుడు షైతాన్ వాళ్లకు చెప్పాలనుకున్న విషయాన్ని చిత్ర రూపంలో చూపిస్తాడు, దాని ద్వారా వాళ్ళు ప్రజలకు ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటారు. (ఇవన్నీ వ్యర్థమైన విషయాలు)

అల్లాహ్ దాసులారా! ఇల్మే నుజూమ్ లో ఓ భాగం: ఆకాశంలో తిరిగే నక్షత్రాలు మరియు అబ్జద్ అక్షరాల (అరబీ ఆల్ఫాబెట్స్) ద్వారా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను తెలియజేయడం కూడా ఉంది, ఇబ్నే అబ్బాస్ (రదియల్లాహు అన్హు) గారు చెప్పిన మాటకు ఇదే అర్థము: ఒక జాతి వారు అబూజాద్  (అరబీ ఆల్ఫాబెట్స్) లను ఉపయోగించి , నక్షత్రాలను చూసి ఇలా భవిష్యవాణిలను చెప్పేవాళ్లు  నా ఉద్దేశ ప్రకారం వాళ్లు పరలోకంలో ఏం భాగాన్ని పొందలేరు. (ఏ ప్రతిఫలం దక్కడు) .

( దీనినీ అబ్దూర్రజ్జాక్ వారు ముసన్నఫ్ అనే గ్రంథంలో పేర్కొన్నారు , ఇమామ్ బైహకిఖీ వారు కూడా పేర్కొన్నారు)

ఇల్మే నుజూమ్ లోని ప్రదర్శనలో ఇంకో భాగం జ్యోతిష్య శాస్త్రవేత్తలు (Astrologers), వీళ్ళు మానవ భవిష్యత్తులో సంభవించే విషయాలను తెలుసుకున్నారని మరియు దానిని వార్తల్లో , మ్యాగజైన్స్ లోప్రచారం చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసే వాదన ఏమిటంటే : ఎవరైతే  బిర్జ అక్రబ్ నక్షత్రము  మెరిసే సమయంలో  పుడతాడో , జన్మించాడో, అతని తలరాత మంచిది కాదని మరి ఎవరైతే “బిర్జ్ మిజాన్” నక్షత్రము మెరిసే సమయంలో జన్మిస్తాడో వాడు మంచి అదృష్టం గలవాడు అని భావించడం మొదలైనవి.

అల్లాహ్ దాసులారా! ఇల్మే నుజూమ్ కూడా చేతబడి కిందే పరిగణించడం జరుగుతుంది. ఈ రెండిటి మధ్య సమానమైన విషయం ఏమిటంటే : షైతాన్  నుండి సంప్రదింపులు,  సంబంధాలు, దాని ఆధారము ఇబ్నె అబ్బాస్ వారి ఉల్లేఖనము, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరైతే ఇల్మే నుజూమ్ నేర్చుకున్నాడో అతను చేతబడిలో ఒక భాగాన్ని నేర్చుకున్నట్టే , కనుక ఆ భాగాన్ని పెంచుకునే వాళ్ళు పెంచుకోండి. (సహీ ముస్లిం)

ఇల్మే నుజూమ్ ను ఇల్మే తాసీర్ అంటారు. అంటే: నక్షత్రాల ప్రసరణ వలన (నక్షత్రాలు తిరగటం వలన)  దాని ప్రభావం భూమండలంపై  పడుతుంది. అంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాట “అతను జాదులో (చేతబడిలో) ఒక భాగాన్ని నేర్చుకున్నాడు” కు అతను చేతబడిలోని ఒక రకానికి గురయ్యాడు అని అర్థం. మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాట “అందులో ఎవరైతే తమ భాగాన్ని పెంచుకోవాలనుకుంటున్నారో  పెంచుకోండి” అంటే అర్థము ఎవరైతే  ఖగోళ జ్యోతిష శాస్త్ర జ్ఞానాన్ని నేర్చుకుంటాడో అతను అదే విధంగా చేతబడి విద్యను నేర్చుకున్నాడు, దాన్ని ఇంకా పెంచుకుంటున్నాడు.

అల్లాహ్ దాసులారా!  ఇస్లాం ధర్మం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మంచి శకునము తీసుకునే ఆజ్ఞ ఇస్తుంది. మరియు మానవుడికి చేసే మార్గదర్శకాలు ఎలా ఉంటాయి అంటే: అందులో ఇహ పరలోకాలా సాఫల్య రహస్యం దాగి ఉంటుంది. షిర్క్, బహు దైవారాధన, పాపాలు, మోసాలు,  అబద్ధాల ను నివారిస్తుంది . అందుకే ఇస్లాం షైతాన్ చేష్టలను, మార్గాలను ముందు నుంచే ఆరికట్టింది. కనుక కాహిన్ల వద్దకు వెళ్లటాన్ని నిషేధం చేసింది.  మరియు జ్యోతిష్యులు చెప్పే వాళ్ళ వద్దకు వెళ్లే వాళ్ళ విషయంలో కఠినంగా చర్యలు తీసుకోవడం జరిగినది. ఆ  కాహిన్ల వద్దకు ప్రశ్నించడానికి వెళ్లినా సరే. ఇమామ్ ముస్లిం వారు ప్రవక్త గారి సతీమణి సఫీయహ్ (రదియల్లాహు అన్హా) వారితో ఉల్లేఖించారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వారు అన్నారు: ఏ వ్యక్తి అయితే అగోచారవిషయాలను చెప్పేవాడి (జ్యోతిష్యుడు) వద్దకు వెళ్లి అతన్ని ఏ విషయంలోనైనా ప్రశ్నించినా, లేదా అతను చెప్పిన మాటను నమ్మినా నలభై (40) రోజుల వరకు అతను చేసిన నమాజులు స్వీకరించబడవు (ఆమోదకరమైనవి కావు). (సహీ ముస్లిం)

ఏ వ్యక్తి అయితే జ్యోతిష్యుల వద్ద కాహిన్ వద్ద వెళ్లి అతన్ని ఏదైనా విషయంలో ప్రశ్నించాడు,  కానీ దానికి ఇవ్వబడిన సమాధానాన్ని  నమ్మలేదు, అలాంటి వ్యక్తి యొక్క 40 రోజులు నమాజు స్వీకరించబడవు అనే విషయం ఈ హదీస్ ద్వారా స్పష్టమవుతుంది. ఆ వ్యక్తి కాఫిర్ అవ్వడు (ఎందుకంటే ఇవ్వబడిన సమాధాన్ని స్వీకరించలేదు ‘నమ్మలేదు’ కాబట్టి). అందువల్ల అతను ఇస్లాం నుంచి బహిష్కరించబడడు.

కానీ! ఏ వ్యక్తి అయితే ఆ కాహిన్ వద్దకు వెళ్లి ఏ విషయంలోనైనా అతన్ని ప్రశ్నించి మరియు అతను ఇచ్చిన సమాధానాన్ని సత్యమని నమ్మితే అలాంటి వ్యక్తి ఇస్లాం పరిధిలో నుంచి బహిష్కరించబడినట్టే. ఎందుకంటే అతను ఏదో ఒక విషయాన్ని నమ్మిన తర్వాతే  కాహిన్ అగోచర జ్ఞాని అని  విశ్వసించినట్టవుతుంది.  మరియు  అల్లాహ్ కు అంకితమైన ఈ అగోచర జ్ఞానం విషయంలో ఆ కాహిన్ ను సాటి నిలబెట్టినట్టే అవుతుంది. మరి ఇలాంటి వ్యక్తి ఖుర్ఆన్ లో ఇవ్వబడ్డ విషయాలను తిరస్కరించినట్టు. మరియు కుఫ్ర్ కి పాల్పడినట్లు అవుతుంది. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు ) వారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు : “ఏ వ్యక్తి అయితే కాహిన్  వద్దకు వెళ్లి , అతను చెప్పిన సమాచారాన్ని సత్యమని విశ్వసిస్తే అతను ప్రవక్త పై అవతరించబడ్డ ధర్మాన్ని (షరియత్) ను తిరస్కరించినట్టే“. (మస్నద్ అహ్మద్)

హజరత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను. “శకునము తీయువాడు, తీయించువాడు, గుప్తవిద్య చేయువాడు, చేయించువాడు, జాదు చేయువాడు, చేయించువాడు మనలోలేరు (అంటే ఇస్లాంలో లేరు). ఏ వ్యక్తి అయినా గుప్త విద్య చేయువాని వద్దకు వెళ్ళి అతడు చేప్పిన మాటలను ధృవీకరించిన ఎడల అతడు మతమును నిరాకరించిన వాడవుతాడు” (దీనిని ఉత్తమ సనద్ బజ్జార్ ఉల్లేఖించెను)

అల్లాహ్ దాసులారా! ఈ కాహిన్,  జ్యోతిష్యుల  కార్యకలాపాలు సూఫీల వద్దనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ గురువులు  కాహిన్లు లేదా అర్రాఫ్ (జ్యోతిష్యులు) అయి ఉన్నారు. వాళ్ళ గురువులు, విలాయత్ పొంది ఉన్నారు (వలి అని) కరమాత్ (మహిమలు) తెలుసు అని ప్రకటిస్తూ ఉంటారు. మరియు అగోచర జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తులు మత్రమే విలాయాత్ మరియు కరామాత్ చేస్తారు అనీ వాళ్ళ నమ్మకం, దాన్ని వాళ్ళు  కష్ఫ్  (నేరుగా అల్లాహ్ తో మాట్లాడటం)  అనే పేరు పెట్టారు, (ఒకవేళ వాళ్ళు దీనికి  అగోచర జ్ఞానం అని పేరు పెడితే ప్రజల ముందు అవమాన పాలవుతారని ఈ విధంగా  పేర్లు మార్చారు )

అల్లాహ్ దాసులారా! కహానత్ నిషేధము అని మరియు కాయిన్ల వద్దకు వెళ్ళటము అవిశ్వాసము అని స్పష్టం చేయడానికి ఇది చాలా లాభకరమైన విషయ సూచిక. కాహిన్ జ్యోతిష్యము చేసినా, చేయించినా, ఈ విద్యను  నేర్చుకున్న లేదా మనసులో దానికి సంబంధించి ఇష్టం కలిగి ఉన్న సరే ఇవన్నీ అవిశ్వాస పూరితమైన ఆచరణ.

అల్లాహ్ మనందరికీ ఖురాన్ యొక్క శుభాలతో,  ఆశీర్వాదాలతో దీవించును గాక. అల్లాహ్ మనందరినీ వివేకంతో, హితోపదేశంతో కూడిన వాక్యాల ప్రకారం ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు గాక. నేను నా కొరకు మీ కొరకు అల్లాహ్ నుంచి క్షమాపణ వేడుకుంటున్నాను. మరియు మీరు కూడా ఆయన నుంచి క్షమాపణ కోరండి. సందేహంగా ఆయన క్షమించేవాడు దయగలవాడు. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత …

అల్లాహ్ దాసులారా! ఆయన భీతి కలిగి ఉండండి.  కాహిన్ ల చేష్టలలో “తరక్” అనేది కూడా ఒక భాగమే. దాని ద్వారా అరబ్ వాళ్లు అగోచర జ్ఞానాన్ని ఆర్జిస్తారన్న సంతోషంలో, భ్రమలో ఉండేవారు. తరక్ అంటే “నడవటం”. వాళ్లు నేలపై కొన్ని గీతలు గీస్తారు,  ఆ గీత ద్వారా వాళ్ళు నడిచినట్టు భావించి, ఆ గీత ద్వారా అగోచర జ్ఞానం తెలిసింది అని వ్యక్తం చేస్తారు.

రమాల్ అనేది కూడా జ్యోతిష్యంలో పరిగణించడం జరుగుతుంది. ఈ పద్ధతి ఎలా అంటే: ఓ వ్యక్తి తమ చేతులారా ఇసుకపై కొన్ని గీతలు గీసి,  దాని ద్వారా ఆ గోచర జ్ఞానం ప్రకటిస్తాడు.

కహానత్ లో (జ్యోతిష్యంలో) రాళ్లతో కొట్టడం కూడా ఒక భాగమే, ఇది ఎలా అంటే ఎవరైనా వ్యక్తి వచ్చి ఏదో ఒక సంఘటన గురించి ప్రశ్నిస్తే ఈ జ్యోతిష్యుడు తమ వద్ద ఉన్న ఆ చిన్న చిన్న కంకర రాళ్ళను తీసి ఆ రాళ్ల పై కొట్టి దాని ద్వారా ఆ వ్యక్తి అడిగిన సమస్యకు పరిష్కారం సమాధానం తెలుసుకుంటాడు.

కహానత్ లో ఫింజాన్ (కప్పు, Cup) చదవటము కూడా భాగమే, ఇది ఎలా అంటే:  వ్యక్తి కప్పులో కాఫీ తాగిన తర్వాత మిగిలిన దానిపై ఆ మాంత్రికుడు తమ దృష్టిని కేంద్రీకరిస్తాడు , దాని చుట్టుపక్కల కొన్ని గీతలు గీసి,  దాని ద్వారా అగోచర జ్ఞానం కలిగిందని,  వచ్చిన వాళ్లకు సమస్యలకు పరిష్కారం చెప్పటము ఇలా చేస్తా ఉంటారు,

ఈ కహానత్ లో చేతి రేఖలను చదివి చెప్పటం కూడా భాగ్యమే , అది ఎలా అంటే : జ్యోతిష్యుడు కాహిన్లు చేతి రేఖలను:  అడ్డంగా నిలువుగా కలిసి ఉన్నరేఖలను చూసి ప్రజలకు ఇలా ఇలా జరగనున్నది అని చెప్తారు.

ఇక కహానత్లో “అయాఫా” (పక్షుల ద్వారా శకునం తీయడం)  కూడా భాగమే దాని పద్ధతి ఏమిటంటే: పక్షులను గాలిలో వదిలి అవి ఒకవేళ కుడివైపు ఎగిరితే మంచి శకునం లేదా ఎడమవైపు ఎగిరితే చెడు జరుగుతుంది అని శకునాలను తీస్తారు. ఖచ్చితంగా అయాఫా కూడా అధర్మమైన పద్ధతే. ఎందుకంటే పక్షులు అల్లాహ్ యొక్క సృష్టితాలు. వాటిలో మేలు గాని చెడు గాని చేసే శక్తి ఉండదు. అల్లాహ్ యే వాళ్ల పోషకుడు, పాలకుడు. అల్లాహ్ ఈ విధంగా తెలియజేశారు:

 أَلَمْ يَرَوْا إِلَى الطَّيْرِ مُسَخَّرَاتٍ فِي جَوِّ السَّمَاءِ مَا يُمْسِكُهُنَّ إِلَّا اللَّهُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ

శూన్యాకాశంలో ఆజ్ఞాబద్ధులై ఉన్న పక్షులను వారు చూడలేదా? అల్లాహ్‌ తప్ప వాటిని ఆ స్థితిలో నిలిపి ఉంచేవారెవరూ లేరు. నిశ్చయంగా విశ్వసించేవారి కోసం ఇందులో గొప్ప సూచనలున్నాయి. (సూరా అన్ నహ్ల్ 16: 79)

ఇంకా ఈ విధంగా అన్నారు:

أَوَلَمْ يَرَوْا إِلَى الطَّيْرِ فَوْقَهُمْ صَافَّاتٍ وَيَقْبِضْنَ ۚ مَا يُمْسِكُهُنَّ إِلَّا الرَّحْمَٰنُ ۚ إِنَّهُ بِكُلِّ شَيْءٍ بَصِيرٌ

ఏమిటీ, వీరు తమపై రెక్కల్ని చాచుతూ, (ఒక్కోసారి) ముడుచుకుంటూ ఎగిరే పక్షుల్ని చూడటం లేదా? కరుణామయుడు (అయిన అల్లాహ్) తప్ప వాటిని ఆ స్థితిలో ఎవరూ నిలిపి ఉంచటం లేదు. నిశ్చయంగా ప్రతి వస్తువు ఆయన దృష్టిలో ఉంది. (సూరా అత్ తహ్రీం 67 : 19)

ఈ కహానత్ (జ్యోతిష్యం) లో శకునం కూడా భాగమే. అవి కంటికి కనిపించేవే అయినా సరే, లేదా వినేటటువంటి నుంచి అయినా సరే. అంటే పావురాలను ఎగిరిపించి శకునాలు తీయటము లేదా ఇంటిపై కూర్చున్న గుడ్లగూబను చూసి శకునము తీయటము, లేదా పదమూడవ (13వ) అంకె నుంచి, మెల్లకన్ను ,కాళ్లు లేనివాడు నుంచి శకునము తీయటము, ఉదాహరణకు: “మెల్లకన్ను కలిగి ఉన్న వ్యక్తిని చూసి ఇలా అనటం “ఈరోజు మొత్తం దరిద్రంగా ఉంటుంది, మంచి జరగదు”. కనుక అతను వ్యాపారం మూసేసి,  ఆరోజు మొత్తం కొనటము అమ్మటముగాని చేయకుండా ఉండటము, బహుశా అతనికి ఆరోజు చెడు, కీడు జరుగుతుంది అని, ఆపద విరుచుకు పడుతుందని తెలిసిపోయినట్టు. ఇంకా ఒక వ్యక్తి కుడి చేయి అరచేతిలో దురద పుట్టితే అలా జరుగుతుందని లేదా ఎడమ చేయి అరిచేతిలో దురద పుడితే ఇలా జరుగుతుందని భావించటం ఇంకా మొదలైనవి. వీటన్నిటిలో ఏ ఒక్కటి లో కూడా అల్లాహ్ చెడును, హానిని పెట్టలేదు. కానీ ప్రజలు వాటి నుంచి శకునాలను తీస్తున్నారు, చెడు జరుగుతుందని భావిస్తున్నారు. ఆ రోజులను కీడులా భావించుకుంటున్నారు. దీనికి అర్థం ఏమిటంటే:  ఆ రోజు ఏం జరుగుతుందో దాన్ని తెలుసుకొని, అల్లాహ్ కు తెలిసిన అగోచర విషయంలో అల్లాహ్ కు సాటిగా నిలిచాడు. దీని కొరకు వాళ్ళు అసమర్థమైన విషయాలను కారణాలుగా చేస్తున్నారు.

శకునం తీయడం అనేది హారాం, ఇంకా షిర్క్ కూడా. దీనికి ఆధారం అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వారి ఉల్లేఖనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా వివరించారు: “ఎవరి శకునము అతనికి తమ అవసరాలను తీర్చకుండా ఆపేసిందో అతను షిర్క్ చేసినట్టు,  దానికి సహాబాలు అడిగారు “దానికి పరిహారం ఏమిటి “? దానికి ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:

( اللهم لا خير إلا خيرك، ولا طير إلا طيرك، ولا إلـٰه غيرك )

ఓ అల్లాహ్ నువ్వు ప్రసాదించిన మేలు కన్నా మరో మేలు ఏదీ లేదు, నువ్వు నియమించిన శకునము కన్నా మరో శకునము లేదు,  మరియు నీవు తప్ప మరో ఆరాధ్యుడు లేడు (అహ్మద్)

శకునం హరాం అనడానికి ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) గారి ఈ హదీస్ కూడా మనకు ఆధారం : వ్యాధి తనంతట తానే  వ్యాపించడం, శకునం తీయటము, మరియు గుడ్లగూబ వల్ల కీడు, సఫర్ మాసం వల్ల శకునం ఇలాంటివి ఏమీ లేవు (అన్ని వ్యర్ధ మాటలే) ( బుఖారి)

ప్రవక్త (సల్లల్లహు అలైహి వసల్లం) మాట “శకునం లేదు”- దీనివల్ల శకునాలు ఏమీ లేవు  అన్న మాట పూర్తిగా స్పష్టమవుతుంది.

సారాంశము ఏమిటంటే : కహానత్ “జ్యోతిష్యం”లో చాలా రకాలు ఉన్నాయి,  కానీ అన్ని రకాలలో సమాంరతమైన విషయము ఏమిటంటే అది “అగోచర జ్ఞానం ప్రకటన“. పద్ధతులు వేరేగా ఉంటాయి, అందులో కొన్ని షైతానులతో సంబంధం ఉంటుంది,  మరికొందరు కేవలం ఉట్టిగా ప్రకటనలు చేస్తారు, దాని ద్వారా ప్రజలను మోసం చేస్తారు, తమ వలలో పడేసుకుంటారు. అల్లాహ్ మనందరినీ వీళ్ళ నుంచి కాపాడుగాక.

ముగింపు ప్రసంగం :

మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అల్లాహ్ మిమల్ని గొప్ప సత్కార్యాన్ని గురుంచి ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశం:

 ( إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما )

నిశ్చయంగా   అల్లాహ్‌,  ఆయన  దూతలు  కూడా  దైవప్రవక్తపై  కారుణ్యాన్ని   పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా!  మీరు  కూడా  అతనిపై  దరూద్‌  పంపండి.  అత్యధికంగా  అతనికి  ‘సలాములు’  పంపుతూ  ఉండండి. – (33: 56)

اللهم صل وسلم على عبدك ورسولك محمد، وارض عن أصحابه الخلفاء، الأئمة الحنفاء، وارض عن التابعين ومن تبعهم بإحسان إلى يوم الدين.

ఓ అల్లాహ్! మాకు  ప్రపంచంలో మేలును, పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు. మరియు నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు. ఓ అల్లాహ్! మన హృదయాలను కపటం నుంచి, మన ఆచరణను ప్రదర్శన బుద్ధి నుంచి మరియు మా చూపులను ద్రోహం నుంచి కాపాడుగాక .

ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయపడుతున్నాము, మరియు ఆ స్వర్గంలోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము.మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము మరియు నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి నీ శరణు కోరుకుంటున్నాము.

ఓ అల్లాహ్! ఇహపరలోకాల సర్వ మేలును ప్రసాదించు, ఆ మేలు మాకు తెలిసిన తెలియకపోయినా మరియు ఇహ పరలోకాల చెడు నుంచి మమ్మల్ని రక్షించు ఆ చెడు మాకు తెలిసిన తెలియకపోయినా. ఓ అల్లాహ్! నీ అనుగ్రహాలు మా నుండి తొలగిపోవటాన్ని గురుంచి,  ఆరోగ్యం పోవటం నుంచి, నీ శిక్షల నుంచి, నీ ఆగ్రహానికి గురికాకుండా మనల్ని రక్షించు, కాపాడు.

ఓ అల్లాహ్ మాకు ప్రపంచంలో పుణ్యాన్ని ప్రసాదించు, పరలోకంలో మేలును ప్రసాదించు, మమ్మల్ని నరక శిక్ష నుండి కాపాడు.

اللهم صل على نبينا محمد وآله وصحبه وسلِّم تسليما كثيرا.

పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్
రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి

జాదు (చేతబడి) – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

[డౌన్లోడ్ తెలుగు PDF] – [డౌన్లోడ్ అరబిక్ PDF]

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ [آل عمران 102]. يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا [النساء 102]. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا * يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَمَنْ يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا [الأحزاب 70، 71].

స్తోత్రములు మరియు దరూద్ తరువాత:

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.      

అల్లాహ్ దాసులారా!  చేతబడి అంటే తాయత్తులపై, ముడులపై, మందులపై మంత్రాలు చదివి ఊదటం. దాని ద్వారా శరీరాలు, హృదయాలు ప్రభావితమవుతాయి. దానివల్ల వ్యక్తి వ్యాధి బారిన పడతాడు లేదా మరణిస్తాడు, లేదా మనిషి ఆలోచనలను, ఊహలను ప్రభావితం చేస్తుంది, లేదా భార్య భర్తలను వేరు చేయటము లేదా కలిసి వ్యాపారం చేస్తున్న ఇద్దరు స్నేహితులను వేరు చేయటము జరుగుతుంది. (అల్ ముగ్ని కితాబుల్ ముర్తద్)

అల్లాహ్ దాసులారా! చేతబడిలో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి: హఖీఖి (వాస్తవమైనది). రెండవది: తఖయ్యులాతి (ఊహలు మరియు అంచనాలు).

హాఖీఖిలో మూడు రకాలు ఉన్నాయి: 

మొదటిది శరీరం పై ప్రభావం చూపిస్తుంది, దానివల్ల వ్యక్తి వ్యాధి బారిన పడతాడు లేదా మరణిస్తాడు. 

రెండవ రకములో  మానవ హృదయం పై ప్రేమ లేదా ద్వేషము ద్వారా  ప్రభావం చూపిస్తుంది, ఉదాహరణకు: భార్యను ద్వేషిస్తున్న భర్త మనసులో భార్య ప్రేమను సృష్టించడం, లేదా దానికి విరుద్ధము. దీని వల్లనే భర్త భార్యకు లేదా భార్య భర్తకు అందంగా కనిపించడం జరుగుతుంది (దీనినీ అరబిలో “అత్ ఫ్ ” అనే పేరుతో గుర్తిస్తారు) లేదా ప్రేమిస్తున్న భార్యకు భర్త దృష్టిలో శత్రువు లాగా చూపిస్తారు, దీని వల్ల భార్య భర్తకు, భర్త భార్యకు శత్రువు లాగా కనిపిస్తూ ఉంటారు (దీనినీ అరబీలో “సర్ ఫ్” అంటారు).

మూడో రకం ద్వారా మనిషి భ్రమ పడుతూ ఉంటాడు: నేను ఆ పని చేశాను, వాస్తవానికి ఆ పని అతను చేసి ఉండడు.  ఈ చేతబడి యొక్క ఉదాహరణ: లబీద్ బిన్ ఆసిం అనే యూదుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారికి చేతబడి చేసాడు. దాని వల్ల ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) వారు ఏదైనా పని చేశారని అనుకునేవారు కానీ వాస్తవానికి ఆ పని చేసి ఉండరు. ఈ విధంగా ఎన్నో నెలల వరకు ప్రవక్త వారిపై ఆ చేతబడి ప్రభావం ఉండేది (ఈ సంఘటన బుఖారి, ముస్లిమ్లలో వివరించబడినది)

అల్లాహ్ దాసులారా!  చేతబడి చేసేవాడు  మంత్రాల ద్వారా షైతాన్ నుండి సహయం తీసుకుంటాడు, అది ఎలా అంటే: మాంత్రికుడు అతి చెడ్డదైన మురికి  పరిస్థితిలో చేరి ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేస్తాడు,  దీని కోసం అతను చెడ్డ జిన్నాతులను ఆశ్రయిస్తాడు, మరి కొన్ని ముడులను మంత్రించి  దానిపై ఊదుతాడు,  (దీనిని అరబీ భాషలో నఫస్ అంటారు) దీని గురించి అల్లాహ్ ఖురాన్ లో ఇలా తెలియజేశాడు:

وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي العُقَد
(మంత్రించి) ముడులలో ఊదే వారి కీడు నుండి (113: 04) 

ఊదేవాళ్లు అంటే: చెడు జిన్నాత్తులు. వారు ముడులపై ఊదుతారు ఎందుకంటే చేతబడి యొక్క ప్రభావము జిన్నాతులు ఊదటం ద్వారానే అవుతుంది. కనుక వాళ్ళ శరీరాల నుంచి ఒక రకమైన ఊపిరి విడుదలవుతుంది, అందులో వాళ్ల ఉమ్మి కలిసి ఉంటుంది, దాని వల్ల ఎదురుగా ఉన్న వ్యక్తికి కీడు, హాని జరుగుతూ ఉంటుంది. ఈ జిన్నాతుల, షైతాన్ల ద్వారా ఎదుటి వ్యక్తి చేతబడికి గురవుతాడు, తఖ్దీర్ (విధివ్రాత) లోని ఒక రకం“కౌని” (జరగడం) మరియు “ఇజ్నీ” (ఆజ్ఞ) ద్వారానే చేతబడి సంభవిస్తుంది. అల్లాహ్ ఆదేశంపై శ్రద్ధ వహించండే:

وَمَا هُم بِضَارِّينَ بِهِ مِنْ أَحَدٍ إِلاَّ بِإِذْنِ اللَّه

ఎంత చేసినా వారు అల్లాహ్ అనుమతి లేకుండా ఆ చేతబడి ద్వారా ఎవరికీ ఎలిం కీడు కలిగించలేరు సుమా. (బఖర 2:102)

అల్లాహ్ దాసులారా!  కొంతమంది మాంత్రికుల వద్దకు వెళ్లి తనను కొంత కాలం వరకూ తన భార్య పిల్లల నుంచి వేరు చేయాలనుకొని చేతబడి జరిపిస్తారు. దాని ద్వారా వారు కొంత కాలం వరకు భార్య పిల్లల నుంచి నిశ్చింతమై ఉంటారు, ఈ విధంగా వాళ్ళు ప్రయాణాలను , పనులన్నీ ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు ఆ చేతబడిని భంగం చేస్తారు.

అల్లాహ్ దాసులారా! మాంత్రికులు, చేతబడి చేసే వాళ్ళు మనుషులను మోసం చేస్తూ ఉంటారు. కనుక ఎవరైనా వాళ్ల వద్దకు వెళ్తే, వాళ్ల ముందు ఖురాన్ పారాయణం చేస్తారు. దాని ద్వారా వచ్చిన వ్యక్తి  ఇతను అల్లాహ్ యొక్క వలి అని మంచి ఉద్దేశం కలిగి ఉంటారు. ఈ విధంగా మనుషులను మోసం చేస్తూ ఉంటారు. ఇలాంటి మాంత్రికులు తమ చేతబడిని కరామత్ (అల్లాహ్ తరఫు నుంచి మహిమ) అని ప్రదర్శిస్తూ ఉంటారు. వాస్తవానికి అది మంత్ర తంత్రాలు, చేతబడి. దానిని నేర్చుకోవటము మరియు అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్లడం కూడా నిషిద్ధము. దాని నుండి దూరం ఉండటం మరియు దానిని నివారించడము తప్పనిసరి (వాజిబ్).

అల్లాహ్ దాసులారా! తఖయ్యులాతి చేతబడి ప్రభావం అవ్వడానికి ఒకే మార్గం ఉన్నది – కంటి చూపులను ప్రభావితం చేయటము. శరీరము, హృదయము, ఆలోచనపై కాదు. కనుక ఎవరిపై అయితే చేతబడి చేస్తారో ఆ వ్యక్తి ప్రతి వస్తువు రూపాన్ని దానిని అవాస్తమైన వేరే రూపంలో చూస్తాడు. వాస్తవంగా ఆ వస్తువు ఉండదు.  ఈ చేతబడి ఫిర్ఔన్ దర్బారులో ఉన్న మాంత్రికులు మూసా ప్రవక్త వారిపై ప్రయోగం చేశారు, ఇదొక రకమైన షైతాన్ పని.

ప్రజలారా!  ఈ రకమైన “తఖయ్యులాతీ” చేతబడి వాస్తవాన్ని ప్రభావితం చేస్తుంది. కనుక చూసేవాని కంట్లో దాని వాస్తవ  ప్రభావం జరుగుతుంది, కానీ చూస్తున్న వస్తువుపై దీని ప్రభావం ఉండదు. చూస్తున్న వస్తువు ఎక్కడ ఉన్నది అక్కడే వాస్తవంగా అలాగే ఉంటుంది,  కానీ చూసే వ్యక్తి కంట్లో మాత్రం చేతబడి ప్రభావం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఏ వస్తువు యొక్క రూపాన్ని మార్చటము తీర్చిదిద్దటము ఇది అల్లాహ్ కు మాత్రమే సాధ్యము, ఆయనకు ఎవరూ సాటి లేరు.

నేటి కాలంలో సర్కస్ పేరుమీద లేదా రెజ్లింగ్ గేమ్ అని చెప్పే ఆటలు కూడా తఖైయ్యులాతి చేతబడిలోనే భాగము. దాని ద్వారా మాంత్రికులు ప్రజల ఊహలను  ప్రభావితం చేస్తూ ఉంటారు. కనుక వస్తువులు తమ అసలైన రూపానికి విరుద్ధంగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్లు తమ చేసే ఈ పనిని చేతబడి అని చెప్పరు.  ఎందుకంటే ప్రజలు భయాందోళనకి గురికాకూడదని,  దానిని రెజ్లింగ్ ఆటలు ఇంకా వేరే ఆటల పేర్లు ఇస్తూ ఉంటారు. కానీ పేర్లు మారటం వలన వాస్తవం మారదు, ఎందుకంటే  వాస్తవాలను బట్టి నిర్ణయాలు ఉంటాయి. ఆ చేతబడి ఉదాహరణ ఏమిటంటే: ఒక వ్యక్తి తన తల వెంట్రుకల నుంచి కారు తీయడం, ఇంకో వ్యక్తి నిప్పులు తినటము, ఒక వ్యక్తి ఇనుపుతో తనకు తాను దాడి చేసుకోవడం లేదా నాలుకను కోసుకోవడం లేదా ఒక జంతువు నోటిలో ప్రవేశించి మల మార్గం ద్వారా  బయటకు రావడం, ఇంకా తమ వస్త్రాల నుంచి పావురాన్ని వెలికి తీయటము లేదా ప్రజల ముందు ఒక వ్యక్తి ఛాతీపై కారు నడిపించుట ఇలాంటి మొదలైనవి  ఎన్నో మానవుడి అధికారంలో లేనివి అన్ని షైతాన్ సహాయంతో జరుగుతూ ఉంటుంది.  షైతాన్ దాని తీవ్రతను భరిస్తూ ఉంటాడు,  లేదా ప్రజల కంటిపై చేతబడి ప్రభావం.

అల్లాహ్ దాసులారా!  చేతబడి చేసే మాంత్రికుల గురించి ఖురాన్ లో కూడా ఖండించడం జరిగినది. అల్లాహ్ ఆజ్ఞ:

وَلَا يُفْلِحُ السَّاحِرُ حَيْثُ أَتَىٰ
మాంత్రికుడు ఏ విధంగా (ఎంత అట్టహాసంగా) వచ్చినా సఫలీకృతుడు కాలేడు. (తాహా 20:69)

ఇంకా ఇలా ఆదేశించాడు:

 وَلَا يُفْلِحُ السَّاحِرُونَ
మాంత్రికులు సఫలీకృతులు కాలేరు. (యూనుస్ 10:77).

ఈ రెండు వాక్యాల ద్వారా మాంత్రికుడు ఏ విధంగానైనా సఫలికృతుడు కాలేడు, విజయం సాధించలేడని నిరూపించడం జరుగుతుంది (ఇది చేతబడి నేర్చుకొని అవిశ్వాసానికి పాల్పడిన వ్యక్తి హక్కులు) (అల్లామా షింఖీతి రహిమహుల్లాహ్ వారు ఖుర్ఆన్ వాక్యం వివరణలో మాంత్రికుడు కాఫిర్ (అవిశ్వాసి) అని నిరూపించారు)

ప్రవక్త మూసా అలైహిస్సలాం నోటి ద్వారా కూడా అల్లాహ్ మాంత్రికులను ఖండించాడు, ఖురాన్ వాక్యం ఈ విధంగా ఉన్నది:

مَا جِئْتُم بِهِ السِّحْرُ ۖ إِنَّ اللَّهَ سَيُبْطِلُهُ ۖ إِنَّ اللَّهَ لَا يُصْلِحُ عَمَلَ الْمُفْسِدِينَ

మీరు తెచ్చినది మంత్రజాలం, అల్లాహ్ ఇప్పుడే దానిని మిథ్యగా చేసి చూపిస్తాడు, అల్లాహ్ ఇలాంటి కల్లోల జనుల పనిని చక్కబడనివ్వడు. (యూనుస్ 10:81).

ఈ వాక్యం ద్వారా అర్థం అవుతున్న స్పష్టమవుతున్న విషయం ఏంటంటే ఈ భూమండలంపై మాంత్రికులు చేతబడి చేసేవాళ్లే  కల్లోల్లాన్ని, ఉపద్రవాలను, సృష్టించేవాళ్ళు.

పైన వివరించబడిన ఆయతుల ద్వారా స్పష్టమవుతున్నది ఏమిటంటే: మాంత్రికుడు, చేతబడి చేసేవాడు కాఫిర్ (అవిశ్వాసి). చేతబడి చేపించడం నిషిద్ధం మరియు ఈ భూమండలవాసులపై దాని చెడు ప్రభావం, హాని కలుగుతుందని, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ పనిని మరణాంతరం మానవుడిని సర్వనాశనం చేసే పనులలో లెక్కించారు. హజ్రత్ అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

اجْتَنِبُوا السَّبْعَ الْمُوبِقَاتِ

“వినాశనానికి గురి చేసే ఏడు విషయాలకు దూరంగా ఉండండి”. దానికి సహచరులు “ప్రవక్తా! అవి ఏమిటి?” అని అడిగారు. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు:

الشِّرْكُ بِاللهِ، وَالسِّحْرُ…
“అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించడం, చేతబడి చేయటం….” (బుఖారి 2766/ ముస్లిం 89).

హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు:

لَيْسَ مِنَّا مَنْ تَطَيَّرَ أَوْ تُطُيِّرَ لَهُ، أَوْ تَكَهَّنَ أَوْ تُكُهِّنَ لَهُ، أَوْ سَحَرَ أَوْ سُحِرَ لَهُ… وَمَنْ أَتَى كَاهِنًا فَصَدَّقَهُ بِمَا يَقُولُ فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ ﷺ

“శకునం తీయువాడు, తీయించువాడు, జ్యోతిష్యం చేయువాడు, చేయించు వాడు, చేతబడి చేయువాడు, చేయించువాడు మాలోని వారు కారు. ఏ వ్యక్తి అయినా జ్యోతిష్యం చేయువాని వద్దకు వెళ్ళి అతడు చెప్పిన మాటలను ధృవీకరించినచో అతడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లలాహు  అలైహి వసల్లంపై అవతరించిన దానిని తిరస్కరించినవాడవుతాడు.” (*)

(*) ఈ హదీస్ ని ఇమామ్ బజ్జార్ 3578 ఉల్లేఖించారు. అయితే ముఅజం కబీర్ 355లోని పదాలు ఇలా ఉన్నాయి: హజ్రత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ రజియల్లాహు అన్హు ఒక వ్యక్తి  చేతిలో ఇత్తడి కడియాన్ని చూసి, ఇదేమిటి అని ప్రశ్నించగా అతను చెప్పాడు: నాకు ‘వాహిన’ అను ఒక రోగం ఉంది, ఇది వేసుకుంటే అది దూరమవుతుందని నాకు చెప్పడం జరిగింది. ఈ మాట విన్న ఇమ్రాన్ రజియల్లాహు  అన్హు  చెప్పారు: أَمَا إِنْ مُتَّ وَهِيَ عَلَيْكَ وُكِلْتَ إِلَيْهَا నీవు ఇది వేసుకొని ఉండగానే చనిపోయావంటే నీవు దానికే అప్పగించబడిన వానివి అవుతావు. మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పై హదీస్ తెలిపారు: “శకునం తీయువాడు, తీయించువాడు …. మాలోనివారు కారు”. (దీనిని అల్లమా అల్బానీ రహిమహుల్లాహ్ వారు సహీ అన్నారు. సహీహుల్ జామి 5435, సహీహా 2195).

ఇమామ్ బైహఖి హజ్రత్ ఖతాదాహ్ వారితో ఉల్లేఖించారు, కఅబ్ అన్నారు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “చేతబడి చేయువాడు, చేయించువాడు, జ్యోతిష్యం చేయువాడు, చేయించువాడు, శకునం చేయువాడు, చేయించువాడు నా నిజదాసులు కారు. నా నిజమైన దాసులు: నన్ను విశ్వసించి నాపై పూర్తి నమ్మకం కలిగినవారే”. (షుఅబుల్ ఈమాన్ 1176).

అల్లాహ్ దాసులారా!  చేతబడి చేయించడం కొరకు మాంత్రికుని (జాదూగర్) వద్దకు వెళ్లడం అవిశ్వాసం. అది కుఫ్ర్ (అవిశ్వాసం) అవ్వడానికి కారణం ఏమిటంటే: అతను ఆ చేతబడి(జాదు) ను ఇష్టపడ్డాడు, తమపై లేదా ప్రజలపై  చేయించడాన్ని సమ్మతించాడు.

జాదు (చేతబడి)కి పాల్పడక పోయినా దానిని ఇష్టపడటం కూడా అవిశ్వాసమే (కుఫ్ర్). ఎందుకనగా కుఫ్ర్ ను ఇష్టపడటం కూడా కుఫ్ర్ (అవిశ్వాసమే) అవుతుంది.  ఇది ఎలాంటిదంటే: ఒక వ్యక్తి విగ్రహారాధనను లేదా శిలువకు సాష్టాంగం చేయడాన్ని ఇష్టపడుతున్నట్లు. ఇలాంటి వ్యక్తి ఒకవేళ అతను సాష్టాంగం చేయకపోయినప్పటికీ,  విగ్రహారాధన చేయకపోయినా అతను కాఫిరే. ఉదాహరణకు:  ఒక వ్యక్తి ఇలా అంటున్నాడు “నేను చేతబడి చెయ్యను, చేయమని ఆజ్ఞాపించను, చేతబడి నేర్చుకోను, నేర్చుకోమని ఆజ్ఞాపించను, కానీ నా ఇంట్లో, సమాజంలో చేతబడి జరగటం నాకు ఇష్టం, నేను దానిని నిరాకరించను”. ఇలాంటి వ్యక్తి కూడా కాఫిరే. ఎందుకంటే కుఫ్ర్ పట్ల రాజీ పడి ఉండడం కూడా కుఫ్ర్ యే గనక. కనీసం తన మనస్సుతో కుఫ్ర్ ను ఖండించనివాని హృదయంలో విశ్వాసం లేనట్లే. (అల్లాహ్ మనల్ని రక్షించుగాక)

అల్లాహ్ దాసులారా! ఈ తఖయ్యులాతీ  చేతబడి చేసేవాడు, వాస్తవాలను మార్చే శక్తి ఉందని ఆరోపిస్తాడు. మరి ఇలాంటి వాళ్ళు తమ ఈ దుష్చేష్ట వల్ల ఈ విశ్వంలో నియంత్రణ అధికారం కలిగి ఉన్నారని,  మరియు అల్లాహ్ ను కాకుండా వేరే వాళ్ళతో సహాయం ఆర్థిస్తారు.  ఈ రెండిటికి పాల్పడతారు, మొదటిది తౌహీదే రుబూబియత్ లో షిర్క్, రెండోది తౌహీదే ఉలూహియత్ లో షిర్క్ అవుతుంది. ఒక వ్యక్తి ముష్రిక్ మరియు మార్గ భ్రష్టుడు అవ్వడానికి ఈ రెండు ఆచరణలు సరిపోతాయి.  తౌహీదే రుబూబియత్ లో షిర్క్ అవ్వటానికి కారణం ఏమిటంటే అతను వాస్తవాలను మార్చే శక్తి కలిగి ఉన్నాడని ఆరోపించటం. కానీ ఈ విశ్వంలో వాస్తవాలను మార్చే శక్తి  అల్లాహ్ కు తప్ప మరెవరికీ లేదు, ఆయనే విశ్వాన్ని నడిపిస్తున్నాడు. ఆయనే సృష్టికర్త. ఆయనే ఒక వస్తువుని మరో వస్తువులో (రూపములో) మార్చే అధికారం కలిగి ఉన్నవాడు. కానీ ఇలాంటి అధికారము ఒక చేతబడి చేసేవాడు నేను కలిగి ఉన్నానని ఆరోపిస్తాడు,  ఈ విషయంలో అతను షిర్క్ కి పాల్పడుతున్నాడు, ఈ విషయంలో అతను అబద్ధం చెప్తున్నాడు. ఎందుకంటే అతను చేసే జాదు (చేతబడి)ని బట్టి అతను నేను అధికారం కలిగి ఉన్నాను అని ఆరోపిస్తున్నాడు, కానీ కళ్ళ పై ఆ చేతబడి ప్రభావం ఉన్నంతవరకు ఎదుటి వ్యక్తి భ్రమలో పడి ఉంటాడు. ఎప్పుడైతే దాని ప్రభావం తగ్గుతుందో వాస్తవం ప్రజల ముందు స్పష్టమవుతుంది మరియు వస్తువులు తమ అసలైన రూపంలో కనిపిస్తాయి

తౌహీదే ఉలూహియత్ లో షిర్క్ అవ్వడానికి కారణం ఏమిటంటే అతను షైతాన్ నుంచి సహాయం తీసుకుంటాడు మరియు షైతాన్ కి సాష్టాంగం చేసి, షైతాన్ని ఆరాధిస్తాడు,  షైతాన్ పేరు మీద జంతువులను జిబహ్ చేస్తాడు. మరి కొన్ని సందర్భాల్లో షైతాన్ ప్రసన్నత పొందటానికి ఖుర్ఆన్ని అవమానిస్తాడు. ఎందుకంటే షైతాన్ అతడి నుంచి ఎటువంటి ప్రతీకారము కోరడు, కేవలం అతను కుఫ్ర్ కి పాల్పడి, ఈ భూమండలంలో కల్లోలాన్ని వ్యాపించడం తప్ప. కనుక మాంత్రికుడు (చేతబడి చేసేవాడు) తనకు సహాయపడే షైతాన్ ను ఆరాధిస్తాడు, ఇదే అతని కుఫ్ర్ కి కారణం. మరియు ఆ మాంత్రికుడు అతన్ని ఆరాధించడం ద్వారా షైతాన్ లాభం పొందినట్లు గ్రహిస్తాడు. అదే షైతాన్ యొక్క అసలుద్దేశ్యం, అతడు ఆదం సంతతి నుండి కోరేది అదే. ఇదే విషయం అల్లాహ్ ఇలా తెలిపాడు:

أَلَمْ أَعْهَدْ إِلَيْكُمْ يَا بَنِي آدَمَ أَن لاَّ تَعْبُدُوا الشَّيْطَانَ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِين * وأنِ اعْبُدونِي هَذَا صِرَاطٌ مُسْتَقِيم

“ఓ ఆదం సంతతివారలారా! మీరు షైతాన్‌ను పూజించకండి, వాడు మీ బహిరంగ శత్రువు” అని నేను మీ నుండి వాగ్దానం తీసుకోలేదా? “మీరు నన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం” అని కూడా. (యాసీన్ 36:60,61).

ఇప్పటి వరకు వివరించబడిన విషయాల యొక్క సారాంశం ఏమిటంటే ఖురాన్, హదీసుల ఆధారంగా మరియు ఇజ్మాఎ ఉమ్మత్ ప్రకారంగా “చేతబడి నిషిద్ధము“. (మజ్మూఉల్ ఫతావా లిబ్ని తైమియహ్ 35/171)

షైతాన్   నుంచి సహాయం పొందటం వలన మాంత్రికుడికి ఏం లాభం? మరియు ఆ  మాంత్రికుడికి ప్రజల నుంచి  ఏమి లాభం?

అల్లాహ్ దాసులారా!  చేతబడి చేసేవాడు (మాంత్రికుడు) షైతాన్ నుంచి అనేక లాభాలు పొందుతాడు. ఉదాహరణకు:

షైతాన్ అతనికి దూర ప్రదేశాల ప్రయాణం అతి వేగంగా చేపిస్తాడు, ఇలాంటివి మొదలైనవి.

మాంత్రికుడు ప్రజల బలహీనతల నుంచి లబ్ధి పొందుతాడు , దాని ద్వారా ఆర్థికంగా లాభం పొందుతూ ఉంటాడు.  ఈ ముగ్గురు – షైతాన్ ,చేతబడి చేసేవాడు, చేయించేవాడు – తమ ప్రపంచాన్ని, పరలోకాన్ని నాశనం చేసుకుంటారు.

అల్లాహ్  దాసులారా!  చేతబడి చేయుట మరియు వాళ్ళ వద్దకు వెళ్లుట నుండి దూరంగా ఉండటం తప్పనిసరి. అయితే మాంత్రికుల వద్దకు పోకుండా ఉండటమే సరిపోదు, ఇస్లామీయ చట్ట ప్రకారం పరిపాలిస్తున్న దేశం అయితే, బాధ్యులకు మాంత్రికుల గురించి, వారి కార్యకలాపాల గురించి తెలియజేయాలి. వాళ్ళ సభలకు వెళ్లి, వాళ్ళ సంఖ్యను పెంచి, వాళ్లకు సహాయం చేయడం లాంటివన్నీ యోగ్యం లేలదు; అది టెలివిజన్ ద్వారానైనా, అనేక ఛానల్స్ మరియు అప్లికేషన్ల ద్వారా అయినా, అది కాలక్షేపం కొరకైనా, దాని అవగాహన కొరకైనా, లేదా దాన్ని తెలుసుకునే ప్రయత్నానికైనా  సరే,  ఏ ఉద్దేశంతో నైనా సరే వాళ్ళ వైపుకు వెళ్లకుండా ఉండాలి.

అల్లాహ్ దాసులారా! మాంత్రికులు, చేతబడి చేసేవాళ్లు మరియు ఇలాంటి అనేక ప్రక్రియలు అవిశ్వాస పూరితమైనవి. ఈ పనులు చేసే వాళ్ళపై అల్లాహ్ విధించిన శిక్షలను అమలు చేయడం ఉత్తమమైన ఆరాధన మరియు అల్లాహ్ సామిప్యాన్ని పొందే ఉత్తమైన ఆరాధనలలో ఒకటి. ఎందుకంటే వీళ్లు భూమండలంపై కల్లోల్లాన్నీ, ఉపద్రవాలను వ్యాపింప చేస్తారు, కనుక అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) వారి ఉల్లేఖనం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు ఇలా తెలియజేశారు: భూమిపై ఒక్క అపరాధికి అల్లాహ్ నియమించిన శిక్షను విధించడం వలన భూవాసులపై 40 రోజులు వర్షం కురవటం  కన్నా ఉత్తమైనది. (ఇబ్ను మాజహ్, అల్లామా ఆల్బాని వారు ప్రామాణికంగా ఖరారు చేశారు)

ఇబ్ను తైమియహ్ రహిమహుల్లాహ్ వారు ఇలా చెప్పారు: (మాంత్రికులను హతమార్చడం) దీనితోపాటు వాళ్ళ ఆచరణ, చేతబడికి సహాయపడే ప్రతి దానిని నాశనం చేయాలి, వృధా చేయాలి, అంతం చేయాలి, వీళ్లను సామాన్య రహదారులపై కూర్చోవడానికి నివారించాలి, మరియు ఇలాంటివాళ్లకు ఇల్లు అద్దెకి ఇవ్వరాదు. ఇవన్నీ అల్లాహ్ మార్గంలో జిహాద్ యొక్క ఉత్తమమైన రూపము, మార్గము.( మజ్మూ ఫతావా లి ఇబ్న్ తైమీయహ్)

చేతబడి ప్రక్రియలో పడకుండా జాగ్రత్త పడడానికి తెలుసుకోవలసిన ఖచ్చితమైన విషయాలు మరియు చేతబడి చేసేవాడు మరియు అతని వద్ద  పోయే వాళ్ల  కుఫ్ర్ ను తెలుసుకొనుటకు ఈ ఖుత్బా చాలా ప్రయోజనం చేకూర్చి ఉండాలి.

బారకల్లాహు లీ వలకుం ఫిల్ ఖుర్ఆనిల్ అజీం, వనఫఅనీ వఇయ్యాకుం బిమా ఫీహి మినల్ ఆయాతి వజ్జిక్రిల్ హకీం, అఖూలు ఖౌలీ హాజా, వఅస్తగ్ ఫిరుల్లాహ లీ వలకుం ఫస్తగ్ఫిరూహ్, ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీం.

(అల్లాహ్ నాపై, మీ పై ఖుర్ఆన్ శుభాలను అవతరింపజేయుగాకా! నాకూ, మీకూ అందులో ఉన్న వివేకము, లాభము ద్వారా ప్రయోజనం చేకూర్చుగాక! నేను నా మాటను ముగిస్తాను. మరియు నా కొరకు, మీ కొరకు క్షమాపణ కోరుతున్నాను మీరు కూడా కోరండి. నిస్సందేహంగా అల్లాహ్ చాలా క్షమించేవాడూ మరియు కరుణించేవాడూ.

చేతబడి నుండి రక్షణ మార్గాలు

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత …

అల్లాహ్ దాసులారా!  అల్లాహ్  భీతి కలిగి ఉండండి. మరి గుర్తుంచుకోండి. చేతబడి ప్రభావం కలగకుండా జాగ్రత్తగా ఉండడానికి: అజ్కార్ సబాహ్, మసా (ఉదయం, సాయంత్రం దుఆలు) చదువుతూ ఉండాలి.

చేతబడి సంభవించిన తర్వాత స్వస్థత పొందటానికి మూడు పద్ధతులు అవలంభించాలి:

మొదటి పద్ధతి మరియు చాలా ముఖ్యమైనది: అజ్కార్ సబాహ్, మసా (ఉదయం, సాయంత్రం దుఆలు) చదువుతూ ఉండాలి.

రెండవది పద్ధతి మరియు చాలా లాభదాయకమైనది: చేతబడి చేసిన ఆ వస్తువునీ,  దాచిన  ప్రదేశాన్ని తెలుసుకోవడం.  అది నేల లోపల ఉన్నా, లేదా కొండపై ఉన్నా, లేదా వేరే ఎక్కడున్నా సరే చేతబడి చేసి దాచిన ఆ వస్తువును తెలుసుకుంటే, దాన్ని అక్కడ నుంచి వెలికి తీసి నాశనం చేస్తే, తొలగిస్తే చేతబడి ప్రభావం దూరం అవుతుంది.

మూడవ పద్ధతి: ఇది ఏ వ్యక్తికి అయితే తన భార్యతో సంభోగ విషయంలో ఇబ్బందిగా ఉందో,  అలాంటి వ్యక్తికి చేయబడ్డ చేతబడి కి చాలా లాభకరమైనది.  ఏడు (7 ) పచ్చటి రేగి  ఆకులను తీసుకోవాలి, దానిని రాయితో దంచి, రుబ్బి, సన్నగా పేస్ట్ చేసి దానిని ఒక గిన్నెలో వేసి దానిపై స్నానం చేసేంత నీటిని వేసి, అందులో ఆయతుల్ కుర్సీ మరియు ఖుల్ యొక్క నాలుగు సూరాలు చదివి మరియు సూరతుల్ ఆరాఫ్, సూరతుల్ యూనుస్ మరియు సూరతుత్ తాహా లో చేతబడికి సంబంధించిన ఆయతులు పఠించాలి. దాని తర్వాత ఆ నీటిలోని కొద్ది భాగాన్ని మూడు సార్లు చేసి త్రాగాలి, మిగిలిన నీళ్లతో స్నానం చేయాలి. ఈ విధంగా చేతబడి యొక్క ప్రభావము ఇన్ షా అల్లాహ్  తొలగిపోతుంది. ఈ విధంగా రెండు మూడు సార్లు వ్యాధి నయం అయ్యే వరకు చేసినా పర్వాలేదు.

అల్లాహ్ మీపై కరుణించుగాకా, తెలుసుకోండి! అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యం గురించి సూర అహ్ జాబ్:56లో ఆజ్ఞాపించాడు:

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا (56)

అల్లాహుమ్మ సల్లి వసల్లిమ్ వబారిక్ అలా అబ్దిక వరసూలిక ముహమ్మద్, వర్ జ అన్ అస్ హాబిహిల్ ఖులఫా, వమన్ తబిఅహుమ్ బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్. అల్లాహుమ్మ అఇజ్జల్ ఇస్లామ వల్ ముస్లిమీన్, వఅజిల్లష్ షిర్క వల్ ముష్రికీన్, వదమ్మిర్ అఅదాఅక అఅదాఅద్దీన్, వన్సుర్ ఇబాదకల్ మువహ్హిదీన్.

ఓ అల్లాహ్ మా దేశాలలో భద్రతను ప్రసాదించు, మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గంపై నడిచే వారీగా చేయు.

ఓ అల్లాహ్ మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్ మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు.

ఓ అల్లాహ్ మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్మల్ని కాపాడు.

سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُون وَسَلَامٌ عَلَى الْمُرْسَلِين وَالْحَمْدُ للهِ رَبِّ الْعَالَمِين

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

ఉపవాసాల నియమాలు | హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) 

హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) (Bulugh-al-Maraam)
సంకలనం  : అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం  : మౌలానా సఫీవుర్రహ్మాన్ ముబారక్ పూరీ
తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్ , హైదరాబాద్ –ఇండియా

عَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا تَقَدَّمُوا رَمَضَانَ بِصَوْمِ يَوْمٍ وَلَا يَوْمَيْنِ, إِلَّا رَجُلٌ كَانَ يَصُومُ صَوْمًا, فَلْيَصُمْهُ } مُتَّفَقٌ عَلَيْهِ 1‏ .‏

527. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : “మీలో ఎవ్వరూ రమజాన్ కు ముందు ఒకటి లేక రెండు ఉపవాసాలు ఉండకండి. అయితే ఎవరన్నా అంతకు ముందు నుంచి ఉపవాస వ్రతాలు పాటిస్తూ వస్తున్నట్లయితే ఆ రోజు ఉపవాసాన్ని పూర్తిచేసుకోవచ్చు.” (బుఖారీ, ముస్లిం)

وَعَنْ عَمَّارِ بْنِ يَاسِرٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { مَنْ صَامَ اَلْيَوْمَ اَلَّذِي يُشَكُّ فِيهِ فَقَدْ عَصَى أَبَا اَلْقَاسِمِ ‏- صلى الله عليه وسلم ‏-} وَذَكَرَهُ اَلْبُخَارِيُّ تَعْلِيقًا, وَوَصَلَهُ اَلْخَمْسَةُ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ, وَابْنُ حِبَّانَ 1‏ .‏

528. హజ్రత్ అమ్మార్ బిన్ యాసిర్ (రదియల్లాహు అన్హు) కథనం : “ఎవరయితే సందేహాస్పదమయిన రోజున ఉపవాసం (రోజా) పాటించాడో అతడు అబుల్ ఖాసిం (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు అవిధేయత చూపాడు.”

(బుఖారీ దీనిని ‘ముఅల్లఖ్’గా పేర్కొన్నారు. ఐదుగురూ దీనిని ‘మౌసూల్’గా పరిగణించారు. కాగా; ఇబ్నె హిబ్బాన్ ఈ హదీసును ప్రామాణికంగా ఖరారు చేశారు)

సారాంశం:
ఇస్లామీయ షరియత్ ప్రకారం ఉపవాసాలు మొదలెట్టినా (రమజాన్) నెలవంకను చూసి మొదలెట్టాలి. ఉపవాసాలు విరమించినా (షవ్వాల్) నెలవంకను చూసి మరీ విరమించాలి. ఒకవేళ షాబాన్ నెల 29వ తేదీన నెలవంక కనిపించకపోతే ఆ మరుసటి రోజు షరియత్ పరంగా సందేహాస్పదమయిన రోజుగా భావించబడుతుంది. ఆ దినాన ఉపవాసం ఉండటం భావ్యం కాదు. ఈ సందర్భంగా ఖగోళ శాస్త్రజ్ఞుల లెక్కలపై ఆధారపడటం కూడా షరియత్ స్ఫూర్తికి విరుద్ధం. ఖగోళ శాస్త్రవేత్తలు వేసిన లెక్కలు కూడా అనేకసార్లు నిజం కాలేదు.

وَعَنِ اِبْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا [ قَالَ ]: سَمِعْتُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ: { إِذَا رَأَيْتُمُوهُ فَصُومُوا, وَإِذَا رَأَيْتُمُوهُ فَأَفْطِرُوا, فَإِنْ غُمَّ عَلَيْكُمْ فَاقْدُرُوا لَهُ } مُتَّفَقٌ عَلَيْهِ 1‏ .‏ وَلِمُسْلِمٍ: { فَإِنْ أُغْمِيَ عَلَيْكُمْ فَاقْدُرُوا [ لَهُ ] 2‏ .‏ ثَلَاثِينَ } 3‏ .‏ وَلِلْبُخَارِيِّ: { فَأَكْمِلُوا اَلْعِدَّةَ ثَلَاثِينَ } 4‏ .‏

وَلَهُ فِي حَدِيثِ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- { فَأَكْمِلُوا عِدَّةَ شَعْبَانَ ثَلَاثِينَ } 1‏ .‏

529. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించగా తాను విన్నానని హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) తెలిపారు: “నెలవంకను చూసిన మీదట మీరు ఉపవాసాలుండండి. (పండుగ కోసం) నెలవంకను చూసిన మీదట ఉపవాస విరమణ (ఇఫ్తార్) చేయండి. ఒకవేళ ఆకాశం మేఘావృతమయివుంటే లెక్క వేసుకోండి.” (ముత్తఫఖున్ అలైహ్).

‘ముస్లిం’లోని వాక్యం ఇలా వుంది: “ఒకవేళ ఆకాశం మేఘావృతమై ఉంటే 30 రోజుల లెక్క కట్టండి.” బుఖారీలో ఈ విధంగా ఉంది – “మరి 30 రోజాల లెక్కను పూర్తిచేయండి.” బుఖారీలోనే హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ఇలా వుంది: ‘మరి మీరు షాబాన్ నెలలోని 30 రోజులను గణించండి.’