వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“(ఓ ప్రవక్తా!) నీ వైపునకు పంపబడిన (వహీ చేయబడిన) గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండు. నమాజును నెలకొల్చు. నిశ్చయంగా నమాజ్ సిగ్గమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్ స్మరణ చాలా గొప్ప విషయం (అన్నసంగతిని మరువరాదు). మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు.”(29, సూరతుల్ అన్కబూత్:45)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ జాబిర్ (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఐదు పూటల నమాజు చేయటం మీలో ఒకరి ఇంటి ముందు నిండుగా ప్రవహిస్తున్న సెలయేటిలో (పతి రోజు ఐదుపూటల స్నానం చేయటం లాంటిది”(ముస్లిం).
ఒక వ్యక్తి జీవితమంతా ముస్లింగా ఉండాలంటే అతను ప్రతి రోజు ఐదు సమయాల నమాజు విధిగా ఆచరించాలి. నమాజును ఆచరించేవారి కొరకు ప్రళయ దినాన అది జ్యోతిగాను ధృవ పత్రముగాను ఉంటుంది. తద్వారా వారు ప్రళయ దినాన నరకం నుండి విముక్తి పొందుతారు. కనుక అల్లాహ్ ఇలా తెలియజేసాడు: “వారి తరువాత కొందరు అయోగ్యులు వారి స్థానంలో వచ్చారు. వారు నమాజును త్యజించారు. మనో వాంఛలను అనుసరించారు. కనుక వారు త్వరలోనే (ప్రళయ దినాన) గయ్ (అనే నరకం)లో పడవేయబడుతారు”(19, సూరతుల్ మర్యం:59).
నమాజు ఆచరించేవారి కొరకు స్వర్గం ప్రాప్తమవుతుందని అల్లాహ్ ఇలా తెలియజేసాడు: “తమ నమాజులను కాపాడుకునేవారు. ఇలాంటి వారు సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు” (70, మఆరిజ్:34-35).
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “ప్రళయ దినాన దాసునితో మొట్టమొదట ప్రశ్నించబడే ఆరాధన నమాజు. ఆ నమాజును సరిగ్గా పాటించినట్లయితే సాఫల్యం పొందుతాడు. అదే గనుక సరిగ్గాలేదంటే అతను నష్టపోతాడు, విఫలుడవుతాడు” (తిర్మిజీ, సహీహ్ అల్ జామీ :2020).
నరకవాసుల పాపాల గురించి స్వర్గవాసులు ప్రశ్నించే విషయాన్ని అల్లాహ్ ఇలా తెలియజేసాడు: మీరు ఎందువల్ల నరకంలో పడ్డారు? (అప్పుడు వారు ఇలా సమాధానమిస్తారు). “మేము నమాజును స్థాపించలేదు. మేము పేదలకు అన్నదానం చేసేవారము కాము. మరియు మేము సత్యాన్ని తిరస్కరించే వారితో కలిసి సత్యాన్ని తిరస్కరిస్తూ ఉండేవారము. ప్రళయ దినాన్ని అబద్దంగా భావించాము, చివరికి మాకు మృత్యువు వచ్చేసింది”(74, సూరతుల్ ముద్దసిర్:42-47).
నమాజును ఉద్దేశ్యపూర్వకంగా వదిలినవారు ముస్లిములు కానేకారని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు: “విశ్వాసిగల దాసునికి కుఫ్ర్ కు (తిరస్కారికి) మధ్య వ్యత్యాసం నమాజును పాటించకపోవడమే”” (ముస్లిం). ప్రవక్త ముహమ్మద్ మరొకచోట ఇలా ప్రవచించారు: “మన (విశ్వాసుల) మధ్య మరియు వారి (అవిశ్వాసుల) మధ్య ఉన్న ఒడంబడిక నమాజును పాటించడము. ఎవరైయితే దాన్ని (నమాజును) పాటించరో, వారు అవిశ్వాసానికి గురికాబడ్డారు” (అహ్మద్, తిర్మిజీ, ఇబ్నుమాజా). మరొక చోట ఇలా తెలియజేసారు: “ఇస్లామే అసలైన ధర్మం. నమాజు దీని స్తంభం, దీని అత్యుత్తమ విలువైన స్థానం “అల్ జిహాద్ ఫీ సబీలిల్లాహ్”’ (ముస్లిం).
ప్రియమైన సోదరులారా! నమాజును జీవితంలో ఒక భాగంగా భావించి తప్పక నెరవేర్చండి. అప్పుడే ఇహపరాల సాఫల్యం పొందగలరు. ఎవరయితే ఆత్మ పరిశీలన చేసుకుంటారో, మరణానంతర జీవితం కొరకు సదాచరణా చేసుకుంటారో వారే వివేకవంతులు. మరెవరయితే తన మనసును దాని కోరికల అనుసరణకై వదిలేస్తారో, తరువాత అల్లాహ్ అనుగ్రహంపట్ల ఆశలు పెంచుకుంటారో వారే అవివేకులు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
రమజాన్ మరియు బక్రీద్ పండుగల నమాజు విధిగా నిర్ణయించబడింది. నిశ్చయంగా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతి పండుగ రోజున నమాజు చేసేవారు. స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరికీ పండుగ నమాజు వాజిబు.
పండుగ రోజు స్నానం చేయడం మన శక్తిని బట్టి మంచి దుస్తులు ధరించడం సున్నతుగా భావించడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెల్ల దుస్తులు ధరించేవారు. తెల్ల దుస్తులంటే చాలా ఇష్టపడేవారు. మరియు సువాసనలో అన్నిటికంటే మంచి సువాసన పూసుకునేవారు. అలాగే యమని అబాయా తొడిగేవారు” (తబ్రాని).
రమజాన్ పండుగ నమాజుకు బయలుదేరక ముందు అల్పాహారం చేయడం సున్నతు. బక్రీద్ పండుగ నమాజు తరువాత అల్పాహారం చేయడం సున్నతు. (సహీహుల్ జామీ :4845, ఇబ్నుమాజా)
బక్రీద్ పండుగ నమాజుకు, రమజాన్ పండుగ నమాజుకు బయలు దేరేటప్పుడు బిగ్గరగా తక్బీర్ చెబుతూ ఈద్గాహ్ చేరుకోవాలి.
అరఫా రోజు ఫజర్ నమాజు నుండి అయ్యాముత్ తష్రీఖ్ (బక్రీద్ నెల 9,10,11,12,13) రోజుల్లో తక్బీర్ పదాలు పఠిస్తూ ఉండాలి.
“అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహ్ అక్బర్, అల్లాహు అక్బర్ వ లిల్లాహిల్హమ్ద్”. అలాగే బక్రీద్ నాలుగు (10,11,12,139) రోజులలో ఖుర్చాని ఇవ్వవచ్చును.
(సహీహుల్ జామీ :5004, ఇర్వావుల్ గలీల్:654).
బక్రీద్ పండుగ రోజు తరువాత మూడు రోజులు ఖుర్బానీ చెయ్యవచ్చును. కాని పండుగ (జుల్హజ్10వ) రోజు ఖుర్బానీ చెయ్యడం ఉత్తమమైనది.
అయ్యాముత్ తష్రిఖ్ అంటే జిల్హజ్ నెల 11,12,13, రోజులు ఖుర్బానీ రోజులే. జిల్హజ్ 13వ రోజు సూర్యాసమయం వరకూ ఖుర్బానీ చెయ్యవచ్చును.
ఖుర్చానీ ఇవ్వదలుచుకున్నవారు తమ చేతులతోనే ఖుర్బానీ జంతువును జబహ్ చెయ్యడం మంచిది. అలాగే స్త్రీలు కూడా తమ ఖుర్బానీ జంతువును జబహ్ చెయ్యవచ్చును. లేక ఇతరుల ద్వారా జబహ్ చెయ్యించడం కూడా ధర్మమే.
పండుగ నమాజు తరువాత ఒక మంచి ధారుగల కత్తిని తీసుకొని “ఖుర్బానీ దుఆ” పఠించి జంతువును జబహ్ చేయాలి. తరువాత ఆ మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని బీదవారికి, మరొక భాగాన్ని బంధువులకు పంచాలి. మూడవ భాగాన్ని తమ సొంతానికై ఉంచుకోవాలి.
ఖుర్బానీ దుఆ:
“ఇన్నీ వజ్జహతు వజ్హియ లిల్లజీ ఫతరస్ సమావాతి వల్ అర్జ, హనీఫఃవ్ వమా అనా మినల్ ముష్రికీన్, ఇన్న సలాతి వ నుసుకీ వ మహ్యా వమమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, లా షరీక లహూ వ బిజాలిక ఉమిర్తు వ అన అవ్వలుల్ ముస్లీమీన్. అల్లాహుమ్మ మిన్క వ లక అన్ ……” ఖుర్బానీ ఎవరిపేరుతో ఇవ్వబడుతుందో వారి పేరు పేర్కొని “బిస్మిల్లాహి అల్లాహు అక్బర్” అని జబహ్ చెయ్యాలి.
రమజాన్ పండుగ నమాజుకు బయలదేరక ముందు ‘ఫిత్రా దానం చెల్లించాలి. బక్రీద్ పండుగ నమాజుకు తరువాత ఖుర్బానీ ఇవ్వాలి. (బుఖారి, ముస్లిం)
ఫిత్రా దానం చెల్లించే స్తోమత కలిగిన ప్రతి ముస్లిం విధిగా ఫిత్రా దానం చెల్లించాలి. ఇంట్లో ఉన్నవారి ప్రతి వ్యక్తికి బదులు ఒక ‘సా’ (2.500 కి.) హిజాజి ధాన్యాలు (బియ్యం లేక గోదుమలు లేదా మనం నిరంతరాయంగా వాడుకునే ధాన్యం) దానంగా ఇవ్వాలి. (అహ్మద్)
ముస్లిం సమాజానికి చెందిన బీదవారికి మాత్రమే ఫిత్రా దానం ఇవ్వాలి. అది ధాన్యం రూపంలో దానం చెయ్యడం ఉత్తమమైన ఆచారం.
హజ్రత్ అబూ సయీద్ ఖుద్రి;ఈ కథనం; ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు: “ప్రతి పండుగ నమాజు ఆచరించుటకై ఈద్గాహ్ వెళ్ళేవారు” (బుఖారి, ముస్లిం).
ప్రవక్త ముహమ్మద్: ఈద్గాహ్కు చిన్నారి పాపలను, యువతులను, వయసు మీరిన స్త్రీలను మరియు ఎవరి దగ్గరనైతే దౌని (స్కార్ఫ్) లేదో, వారు తమ సహోదరి వద్దనుండి దౌని తీసుకొని ఈద్గాహ్ పోవాలని ఆజ్ఞాపించారు. దీని ఉద్దేశ్యం ఏమంటే, స్త్రీలుకూడా ముస్లిం సమూహంలో వారి దుఆ పొందగలరని. దీనికి ఆధారంగా ఒక హదిసులో ఉమ్మే అతియ్యా ఈ ఉల్లేఖించారు: “పురిటి స్త్రీలు, బహిష్టు స్త్రీలు, పరదాలో ఉన్న మహిళలు నమాజ్ నెరవేర్చుటకై ఈద్గాహ్ పోవాలని, ముస్లిం పురుషులతో పాటు దుఆలో పాల్గొనాలనీ మాకు ఆజ్ఞాపించారు. కాని బహిష్టు స్త్రీలు మాత్రం నమాజు నుండి తప్పుకోవాలనీ ఆదేశించారు” (బుఖారి, ముస్లిం).
పండుగ నమాజుకు ముందు ఎలాంటి నఫిల్ నమాజు నెరవేర్చకూడదు.హజ్రత్ అబూ సయీద్ ఖుద్రి (రధి అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పండుగ నమాజుకు ముందు (నఫిల్) నమాజు నెరవేర్చలేదు. కాని పండుగ నమాజు తరువాత ఇంటికి వచ్చి రెండు రకాతులు (నఫిల్) చదివేవారు. (బుఖారి, ముస్లిం)
పండుగ నమాజాకై అజాన్ లేక ఇఖామత్ చెప్పకూడదు. హజత్ జాబిర్ బిన్ సముర (రధి అల్లాహు అన్హు) కథనం: “నేను ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారితో పండుగ నమాజు ఒకసారి రెండుసార్లు కాదు ఎన్నోసార్లు అజాన్ మరియు ఇఖామత్ లేకుండానే చదివాను.” (ముస్లిం)
పండుగల నమాజు సమయం: హజ్రత్ జున్దుబ్-ఈ కథనం ప్రకారం: “ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సూర్యుడు ఉదయించిన తరువాత ఈటె నీడ దాని ఎత్తుకు రెండింతలు అయిన తరువాత రమజాన్ నమాజు చదివేవారు. మరియు సూర్యుడు ఉదయించిన తరువాత ఈటె నీడ దాని ఎత్తుకు సమానంగా అయిన తరువాత బక్రీద్ నమాజు చదివేవారు”
ఇమామ్ షౌకానీ (రహిమహుల్లాహ్ అలైహి) గారు ఇలా తెలియజేసారు. “ఈ హదీసు పండుగ నమాజు సమయాల హదిసులలో చాలా ప్రామాణికమైన హదీస్గా భావించారు” (ఫిఖ్హుస్ సున్నా:1/279).
[అరబ్ దేశాలలో ఈద్ నమాజ్ సున్నత్ సమయం ప్రకారం నెరవేర్చుచున్నారు. కాని మన దేశాలలో ఈద్ నమాజ్ చాలా ఆలస్యంగా నెరవేర్చే అలవాటుకు గురికాబడ్డారు. ఇది ఎంత మాత్రం సున్నత్ పద్దతి కాదు.]
పండుగ రోజు పిల్లలు దఫ్ వాయించి ధర్మ పద్దతిలో మంచి గీతాలు మరియు ఇతర ఆటలతో ఖుషీ చేయవచ్చును. (బుఖారీ)
పండుగల రోజు ఇతరులతో కలసినప్పుడు “తఖబ్బలల్లాహు మిన్నా వ మిన్కా” అని చెప్పవలెను. (మా పుణ్యాలు మీ పుణ్య కార్యాలను అల్లాహ్ స్వీకరించుగాక) (తమాముల్ మిన్నా లిల్ అల్బాని:1/ 356)
పండుగల నమాజ్ ఆచరించే విధానము:
1) కాబతుల్లాహ్ దిశకు తిరిగి నిలబడాలి.
2) నమాజు కొరకై నియ్యత్ మనసులో అనుకోవాలి.
3)తరువాత పంక్తుల్ని తిన్నగా ఉంచుకోవాలి. పోత పోసిన సీసపు గోడ మాదిరిగా కలిసి నిలబడాలి. (బుఖారి, ముస్లిం)
4) తక్సీర్ (అల్లాహు అక్బర్) చెప్పినప్పుడు చెవుల వరకు చేతులను ఎత్తాలి. (ముస్లిం) చెవులను తాకవలసిన అక్కర లేదు. ఆ తరువాత కుడి చేతితో ఎడమ చెయ్యి మణికట్టుని పట్టుకొని రెండు చేతులను రొమ్ముపై (ఛాతిఫై) ఉంచాలి. (నసాయి, సహీహ్ సిఫతుస్ సలాతున్ నబి, అల్ అల్పానీ రహిమహుల్లాహ్ | పేజీ: 88)
7) తరువాత 7 సార్లు తక్బీర్లు (అల్లాహు అక్బర్ )నిదానంగా చెప్పాలి. (తిర్మిజి, అబూదావూద్)
ప్రతి తక్బీర్ కు చేతులను భూజాల వరకు లేక చెవుల వరకు ఎత్తాలి.
8) తరువాత ఇమామ్ బిగ్గరగా సూరతుల్ ఫాతిహా చదవాలి. ఇమామ్ వెనుక ఉన్నవారు (ముఖ్తదీలు) మెల్లగా చదవాలి. ఆ తరువాత ఇమామ్ వేరొక సూరా చదవాలి. ఇమామ్ వెనుక ఉన్నవారు నిశబ్దంగా వినాలి. సూరతుల్ ఫాతిహా మినహా ఇతర సూరాలు ముఖ్తదీలు చదవకూడదు.
9) తరువాత రుకూ సజ్దాలు చేసి రెండవ రకాతుకై అల్లాహు అక్బర్ అని నిలబడి సూరాలు పఠించక ముందు ఐదు సార్లు తక్బీర్లు నిదానంగా చెప్పి ప్రతి తక్బీర్ కు చేతులను భుజాల వరకు లేక చెవుల వరకు ఎత్తి ఛాతిపై కట్టుకోవాలి. ( అబూదావూద్)
10) పండుగ నమాజు మొదటి రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “ఖాఫ్ వల్ ఖుర్ఆనిల్ మజీద్) సూరా మరియు రెండవ రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “ఇఖ్బరబతిస్ సాఅతు వన్ షఖ్బల్ ఖమర్” సూరా చదవాలి. (ముస్లిం)
లేక పండుగ నమాజు మొదటి రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “సబ్బిహిస్మ రబ్బికల్ ఆలా” సూరా మరియు రెండవ రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “హల్ అతాక హదిసుల్ గాషియా” సూరా చదవాలి. (ఇర్వావుల్ గలీల్: 644)
11) ఆ తరువాత ప్రసంగించడం సున్నతు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అబూబకర్, మరియు హజ్రత్ ఉమర్ పండుగ నమాజు చేసిన తరువాత ప్రసంగించేవారు. (బుఖారీ, ముస్లిం)
12) పండుగ ప్రసంగం మింబర్ (వేదిక)పై ఎక్కి ప్రసంగించకూడదు. (బుఖారి, ముస్లిం)
అంటే ఈద్గాహ్లో మింబర్ తీసుకొపోవడం లేక అక్కడ మింబర్ లా కట్టించి దానిపై ఎక్కి ప్రసంగం చేయకూడదు. మామూలుగా నిలబడి ప్రసంగించాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Video Courtesy: Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
ఈ ఆడియో శుక్రవారం (జుమా) నమాజుకు త్వరగా హాజరు కావడం యొక్క ప్రాముఖ్యతను మరియు దానిని విడిచిపెట్టడం గురించిన తీవ్రమైన హెచ్చరికను వివరిస్తుంది. ఖురాన్ ఆయత్ (సూరా అల్-జుమా) మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసుల ఆధారంగా ఈ విషయం స్పష్టం చేయబడింది. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు ప్రకారం, జుమా నమాజుకు వేర్వేరు సమయాలలో (గడియలలో) ముందుగా వచ్చిన వారికి గొప్ప పుణ్యాలు లభిస్తాయి. మొదటి గడియలో వచ్చినవారికి ఒంటెను, రెండవ గడియలో వచ్చినవారికి ఆవును, ఆ తర్వాత గొర్రె, కోడి, మరియు కోడిగుడ్డును బలిదానం చేసినంత పుణ్యం లభిస్తుందని వివరించబడింది. ఇమామ్ ఖుత్బా (ప్రసంగం) ఇవ్వడానికి మింబర్ పైకి వచ్చిన తర్వాత, హాజరైన వారి పేర్లను నమోదు చేసే దేవదూతలు తమ గ్రంథాలను మూసివేసి ప్రసంగాన్ని వింటారని, కాబట్టి ఆలస్యంగా వచ్చేవారు ఈ ప్రత్యేక పుణ్యాన్ని కోల్పోతారని నొక్కి చెప్పబడింది. మరో హదీసులో, జుమా నమాజును నిరంతరంగా వదిలివేసే వారి హృదయాలపై అల్లాహ్ ముద్ర వేస్తాడని, దానివల్ల వారు అశ్రద్ధపరులలో చేరిపోతారని తీవ్రంగా హెచ్చరించబడింది. ముగింపులో, జుమా యొక్క ఘనతను అర్థం చేసుకుని, అజాన్కు ముందే మస్జిద్కు చేరుకోవాలని, ఈ తప్పనిసరి ప్రార్థనను విడిచిపెట్టే ఘోర పాపానికి దూరంగా ఉండాలని వక్త ఉద్బోధించారు.
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్.సోదర మహాశయులారా, జుమా నమాజ్ కు త్వరగా హాజరవటంలోని ఘనత, దాన్ని కోల్పోవటం గురించి హెచ్చరిక, ఈ అంశానికి సంబంధించి ఒక ఆయత్ మరియు రెండు హదీసులు విందాము.
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِن يَوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا إِلَىٰ ذِكْرِ اللَّهِ وَذَرُوا الْبَيْعَ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ. ఓ విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజుకు గాను పిలవబడినప్పుడు మీరు అల్లాహ్ ధికర్ వైపునకు పరుగెత్తి రండి మరియు వ్యాపారం వదిలిపెట్టండి. మీరు తెలుసుకున్నట్లయితే ఇది మీకు చాలా మేలైనది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారని హజరత్ అబూ హురైరా రదియల్లాహు తలా అన్హు ఉల్లేఖించారు: “ఎవరైతే జుమా రోజు జనాబత్ కు చేసే గుసుల్ లాంటి గుసుల్ స్నానం, అంటే సంపూర్ణ విధంగా స్నానం చేసి మస్జిద్ కు అందరికంటే ముందు వెళ్తాడో అతనికి ఒక ఒంటె బలిదానం ఖుర్బానీ చేసినంత పుణ్యం లభిస్తుంది. రెండవ వేళలో వెళ్ళిన వ్యక్తికి ఆవును బలిదానం ఇచ్చినంత పుణ్యం లభిస్తుంది. మూడవ వేళలో వచ్చిన వారికి కొమ్ములు గల గొర్రెను బలిదానం చేసినంత పుణ్యం లభిస్తుంది మరియు నాలుగవ గడియలో వెళ్ళే వారికి ఒక కోడి అల్లాహ్ మార్గంలో బలిదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఐదవ వేళలో వెళ్ళే వారికి అల్లాహ్ మార్గంలో ఒక కోడి గ్రుడ్డును దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇమాం ఖుత్బా ఇవ్వడానికి మింబర్ పైకి వస్తాడో, దేవదూతలు కూడా ప్రసంగం ఖుత్బా వినడానికి హాజరవుతారు.”
అంటే ఏం తెలిసింది? ఈ ఐదు వేళలు ఏవైతే తెలుపబడ్డాయో, అవి కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం ఫజర్ తర్వాత లేదా సూర్యోదయం తర్వాత నుండి ఇమాం మెంబర్ పైకి ఎక్కే వరకు. ఇక ఎవరైతే ఇమాం మెంబర్ పై ఎక్కిన తర్వాత మస్జిద్ లోకి ప్రవేశిస్తారో, ఈ దైవదూతలు ప్రత్యేకంగా జుమా కొరకు వచ్చే వారి గురించి తమ యొక్క దఫ్తర్ లలో, తమ యొక్క నోట్ బుక్స్ లలో ఏదైతే వారి పేర్లు రాసుకుంటూ ఉండడానికి వస్తారో వారి యొక్క జాబితాలోకి చేరకోరు. అంటే ఎంతో గొప్ప పుణ్యాన్ని, జుమాకు సంబంధించిన ప్రత్యేక ఘనతను వారు కోల్పోతున్నారు అని భావం.
لَيَنْتَهِيَنَّ أَقْوَامٌ عَنْ وَدْعِهِمُ الْجُمُعَاتِ أَوْ لَيَخْتِمَنَّ اللَّهُ عَلَى قُلُوبِهِمْ ثُمَّ لَيَكُونُنَّ مِنَ الْغَافِلِينَ “జుమా నమాజు చేయని వారు, జుమా నమాజును వదిలేవారు, వారు తమ ఈ అలవాటును మానుకోకుంటే త్యజించుకుంటే అల్లాహ్ వారి హృదయాలను మూసివేస్తాడు. వారి హృదయాలపై ముద్ర వేస్తాడు. ఏం జరుగుతుంది? ఆ తర్వాత వారు అశ్రద్ధ వహుల్లోకి చేరిపోతారు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా తాను విన్నట్లు అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు ఉల్లేఖించారు.
అయితే సోదర మహాశయులారా, పై ఆయత్ మరియు హదీసుల నుండి మనకు తెలిసిన విషయాలు ఏమిటి? జుమా నమాజ్ అజాన్ కంటే ముందే మస్జిద్ లోకి వచ్చి హాజరయ్యే, ఖుత్బా శ్రద్ధగా వినే ప్రయత్నం చేయాలి. జుమా నమాజుకు త్వరగా పోవుటలో చాలా ఘనత ఉంది, ఐదు రకాలుగా దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. జుమా నమాజ్ వదిలే వారికి భయంకరమైన హెచ్చరిక ఇవ్వబడింది. అలా చేయుట వల్ల వారి హృదయాలపై ముద్ర వేయడం జరుగుతుంది. మంచి విషయాలు, ధర్మ విషయాలు, అల్లాహ్ యొక్క బోధనలు అర్థం చేసుకోకుండా మూసివేయబడతాయి. అల్లాహు అక్బర్. ఇది ఎంత భయంకరమైన శిక్షనో గమనించండి. అల్లాహ్ తలా మనందరికీ జుమా యొక్క ఘనతను అర్థం చేసుకుని, దానిని పాటించేటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక.
వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అపశకునాల నమ్మకాలు కలిగిన ప్రజలు పూర్వపు కాలం నుండి ఈ రోజు వరకు ఉన్నారు. వారిలో ఒక్కొక్కరికి ఒక్కొ విధమైన నమ్మకం. కనుక కొంత మంది రాహు కాలాన్ని నమ్ముతారు. ఆ కాలానికి అనుగుణంగా తమ జీవితాలను గడుపుతారు. ఇంకా కొంత మంది గర్బవతి చనిపోతే అపశకునంగా భావించి, ఆమె అంతక్రయలు జరపకుండా కాకులు, గద్దలు పెక్కు తినుట కొరకు ఊరు బయట ఆమె దేహాన్ని పడేసిన సంఘటనలు ఉన్నాయి. మరియు కొంత మంది ప్రజలు ఉదయాన్నే వితంతువు ఎదురుపడితే అపశకునంగా భావిస్తారు. ఒకవేళ తమ అమ్మ లేక చెల్లి లేక కూతురు విధవరాలు ఉంటే, వారిని కూడా ఎదురుగా రాకూడదని నివారిస్తారు. మరియు కొందరు వారి నివాసాలను ఇంటి వరండాలకే పరిమితం చేస్తారు.
మరియు కొందరు ఇంటి నుండి బయలదేరేటప్పుడు పిల్లి గనుక ఎదురు వస్తే, లేక ఎవరైనా వారి ముందు తుమ్మినట్లయితే అపశకునంగా భావిస్తారు. తిరిగి ఇంట్లోకి పోయి కొన్ని నిమిషాలు కూర్చొన్న తరువాత తమ పనిపై బయలదేరుతారు. మరియు వీధికి ఎదురుగా ఇల్లు ఉంటే “వీధి పోటు” అని అపశకునంగా భావించేవారు కూడా ఉన్నారు. మరి కొంత మంది తమ ఇంటి వాస్తు సరిలేక పోతే, దానిని అపశకునంగా భావించి కట్టిన ఇల్లును కూలదీసిన సంఘటనలు లేకపోలేదు.
సూర్య గ్రహణాన్ని, చంద గ్రహణాన్ని కూడా అపశకునంగా నమ్ముతారు. గర్భిణీలపై వాటి ఛాయ పడితే పుట్టబోయే పిల్లలు గుడ్డివారిగానో, కుంటివారిగానో పుట్టుతారని భావిస్తారు. మరియు ఫలానా తేదిలలో లేక సమయాలలో పిల్లలు జన్మిస్తే భాగ్యవంతులు కారని, కాన్పు కాక మునుపే సిజేరియన్ చేసి కడుపులో నుండి పిల్లలను బయటకు తీసిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరియు గ్రహణాల ప్రభావం దేవాలయాలపై ఉంటుందని పూజారులు నమ్ముతారు. కనుక వారు దేవాలయాలను సైతం మూసివేస్తారు.
మరియు కొంత మంది ప్రజలు పక్షులను ఎగురవేసి అవి కుడి దిశకు లేక ఎడమ దిశకు పోవటాన్నిబట్టి వారు శకునాలుగా నమ్ముతారు. తాము అనుకున్న దిశలో గాకుండా పక్షులు మరొక వైపు ఎగిరిపోతే దాన్ని అపశకునంగా భావిస్తారు. లేక అనుకున్న దిశలో ఎగిరిపోతే మంచి శకునంగా భావిస్తారు. ఇలా రక రకాల శకునాల నమ్మకాలు దేశ విదేశాల సమాజ ప్రజలలో విస్తరించి ఉన్నాయి.
ఇస్లామీయ ధర్మం ప్రకారం అపశకునం అనేది లేనే లేదు. మరియు లాభ నష్టాల అధికారం అల్లాహ్కు తప్ప మరెవరికీ లేదు. కనుక అల్లాహ్ ఇలా తెలియజేసాడు:
ఓ ప్రవకా! ఇలా అను:“మరియు అల్లాహ్ నీకు ఏదైనా హాని కలిగిస్తే! ఆయన తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు. మరియు ఆయన నీకు మేలు చేస్తే! ఆయనే ప్రతిది చేయగల సమర్థుడు.”(సూరతుల్ అన్ఆమ్:17)
“ఒక వేళ అల్లాహ్ నీకు ఏదైన ఆపద కలిగించదలిస్తే ఆయన తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు. మరియు ఆయన నీకు మేలు చేయదలిస్తే, ఆయన అను(గహాన్ని ఎవ్వడూ మళ్ళించలేడు” (సూరత్ యూనుస్:107)
“అల్లాహ్ నాకు కీడు చేయదలుచుకుంటే – ఆయన కీడు నుండి, నన్ను తప్పించగలవా? లేక ఆయన (అల్లాహ్) నన్ను కరుణించగోరితే ఇవి ఆయన కారుణ్యాన్ని ఆపగలవా?” వారితో ఇంకా ఇలా అను: “నాకు కేవలం అల్లాహ్ చాలు! ఆయన (అల్లాహ్)ను నమ్మేవారు (విశ్వాసులు), కేవలం ఆయన మీదే నమ్మకముంచుకుంటారు.”(సూరతు జుమర్:38)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రధియల్లాహు అన్హు) కథనం: నేను ఒక రోజు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి వాహనంపై ఆయన వెనుక కూర్చుని ఉన్నాను. అప్పుడు ఆయన నాతో ఇలా అన్నారు:
“ఓ అబ్బాయి! నేను నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పుతాను. నీవు అల్లాహ్ను గుర్తుంచుకో (అల్లాహ్ ఆదేశాలకు అనుగుణంగా కట్టుబడి ఉండు) అల్లాహ్ నిన్ను గుర్తుంచుకుంటాడు. నీవు అల్లాహ్ను గుర్తుంచుకో, ఆయన నీ ముందున్నట్లే గ్రహిస్తావు (అల్లాహ్ సహాయం నీ కొరకు నిత్యం ఉంటుంది). నీవు అర్ధించ దలుచుకున్నప్పుడు అల్లాహ్నే అర్థించు. నీవు సహాయం కోరాలనుకుంటే, అల్లాహ్నే సహాయం కోసం అర్ధించు. జా(గత్త! లోకమంతా ఏకమై నీకు మేలు చేకూర్చాలనుకున్నా అల్లాహ్ నీ కోసం వ్రాసి పెట్టిన దానికంటే ఎక్కువేమీ అది నీకు మేలు చేకూర్చజాలదు. ఒక వేళ నీకు కీడు తలపెట్టాలన్న ఉద్దేశ్యంతో ఏకమైనా కూడా అల్లాహ్ నీ కోసం వ్రాసి ఉంచిన దానికంటే ఎక్కువ నష్టమేమి అది కలిగించజాలదు. ఎందుకంటే కలములు పైకి లేపుకోబడ్డాయి. (విధివ్రాత (వాయటం అయిపోయింది.) పత్రాల సిరా ఆరిపోయింది.”
శకునమైనా అపశకునమైనా, దౌర్చాగ్యమైనా, కలిమి అయినా- లేమి అయినా అంతా అల్లాహ్ చేతుల్లోనే ఉన్నాయనీ, అమాయుకులను, అన్యం పుణ్యం తెలియని జంతువులను, నెలలను, దినాలను లేక సమయాలను దోషులుగా నిలబెట్టడం అర్ధం పర్ధం లేని విషయమేననీ మనం తెలుసుకోవాలి.
ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 75 -78). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
పుస్తకం పేరు: మరణానంతర జీవితం (Life After Death) (ఖుర్ఆన్ మరియు ప్రామాణిక హదీసుల వెలుగులో) కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)
ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ఆధారంగా ఈ పుస్తకంలో మరణానంతర జీవితం గురించి చక్కగా వివరించబడింది. రచయిత జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ గారు చాలా కష్టపడి, అనేక ప్రామాణిక ఆధారాలతో ఈ విషయాలను మన ముందుకు తీసుకు వచ్చారు. ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్ని సరిదిద్దుకోవటానికి ఉపయోగపడే ఒక మంచి పుస్తకం.
అల్లాహ్కు మాత్రమే సర్వ స్తోత్రములు చెందును. ఆయనే సర్వలోకాలకు ప్రభువు, ప్రతిఫల దినానికి అధిపతి, ఆయన ఎంతో పరిశుద్దుడు సంరక్షకుడు. అల్లాహ్ శాంతి మరియు కరుణ కటాక్షాలు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై, ఆయన కుటుంబీకులపై మరియు ఆయన అనుచరులపై, పుణ్యాత్ములైన సత్య మూర్తులసై కురియుగాక!.
మరణానంతర జీవితం మానవునికి అసలైన జీవితం. ఇహలోక జీవితంలో చేసుకున్న మంచిచెడులు మాత్రమే అతని వెంట వస్తాయి. మిగతా విషయాలన్ని ఇహలోక జీవితానికే పరిమితం. మానవుడు అసలైన విజయ లక్ష్యం సాధించాలంటే పరలోక విశ్వాసం, జ్ఞానం మరియు భయం, భక్తిని సాధించాలి. ఇహలోకంలో కూడా మనిషి శాంతి సుఖాలతో ఉండాలంటే మరియు సమాజం మానవ మర్యాదలతో ముందుకు నడవాలంటే పరలోక విశ్వాసమే పునాది. మరణానంతర జీవితం లేదంటే! మంచి, చెడులకు, సద్గుణాలకు, దుర్గుణాలకు, పాపాలకు, పుణ్యాలకు అర్జాలే ఉండవు. చావు బ్రతుకులకు, జంతువులకు, మానవులకు, స్వర్గానికి, నరకానికి కూడా అర్థమే లేదు.
మనిషి మరణించిన తరువాత తన విశ్వాసం ప్రకారం ప్రశ్నించబడుతాడు. ఒకవేళ అవిశ్వాసిగా ఉంటే, సర్వసృష్టికర్తను విశ్వసించకుండా నాస్తికుడిగా మారిపోయి. తన ఇష్టానుసారంగా జీవించడమే మానవుని లక్ష్యం అనుకుంటే అతను అవిశ్వాసి. ఇంకా కొంత మంది ప్రజలు దేవుడు ఉన్నాడనీ పరలోకం వాస్తవమేననీ, స్వర్గం, నరకం నిజమేననీ విశ్వసించినా వాటి వాస్తవాలను గ్రహించకుండా తమ ఇష్టానుసారంగా మూఢ విశ్వాసాలకు అనుగుణంగా ఆరాధించేవారు కూడా అవిశ్వాసులే.
అల్లాహ్ పై విశ్వాసం లేకపోతే, మరణానంతర జీవిత వాస్తవాలను విశ్వసించకపోతే, మరియు వాటిపై ధృఢమైన నమ్మకం లేకపోతే, ఇంకా తమ జీవితాలను పుణ్య జీవితాలుగా మార్చుకోకపోతే, అలాంటివారి ఇహపరాల జీవిత ఫలితాలు శూన్యమే. వారు ఎన్ని మానవతా కార్యసాధనలు చేసినా, చక్రవర్తులుగా ఉండి రాజ్యం మొత్తం దానం చేసినా, పరలోక లక్ష్యాన్ని సాధించలేరు. నరకాగ్ని నుండి రక్షించబడలేరు.
మానవునికి ప్రసాదించబడిన ఒక్కొక్క క్షణం మరియు ఒక్కొక్క అనుగ్రహం గురించి ప్రశ్నించడం జరుగుతుంది. వాటికి సమాధానం ఇవ్వనిదే మనిషి ఒక్క అడుగు ముందుకు వేయలేడు. అతను తాను చేసిన ప్రతి పనిని, ప్రతి మాటను, ప్రతి కుట్రను గురించి ప్రశ్నించబడుతాడు.
మరణానంతర జీవిత విశ్వాసం వలన మానవుడు పరలోక బాధల నుండి రక్షింపబడాలని, పరలోక జ్ఞానాన్ని అధ్యయనం చేసి దాన్ని విశ్వసిస్తాడు. ఇహలోక జీవితాన్ని ఉత్తమ రీతిలో గడుపుటకై సర్వ ప్రయత్నాలు చేస్తాడు. అలాగే మరణానంతర జీవిత విశ్వాసం వలన మానవుడు మృత్యువు పాందే వరకూ ఒక లక్ష్యాన్ని సాధించాలనీ శ్రమిస్తాడు. ఆ మహా లక్ష్యమే స్వర్గం.
మరణానంతర జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అగోచర విషయాలను, అంటే మనిషి మరణించిన తరువాత నుండి స్వర్గంలోనికి లేక నరకంలొనికి చేరుకునే వరకు ఎదురయ్యే విషయాలను ఖుర్ఆన్ మరియు ప్రామాణిక హదీసుల వెలుగులో అల్లాహ్ ప్రసాదించిన జ్ఞానం మేరకు మీ ముందు పొందుపరిచే ప్రయత్నం చేసాము.
“అహ్వాలుల్ ఖియామహ్”’అనే పేరున అబ్దుల్ మలిక్ అల్ కులైబ్ గారు, మరియు “అల్ జన్నత్ వన్నార్‘” పేరున ఉమర్ అల్ అష్ఖర్ గారు ఖుర్ఆన్ ఆయతులను మరియు ప్రామాణికమైన హదిసులను సేకరించి అరబీ భాషలో గ్రంథస్థం చేసారు. ఈ రెండు పుస్తకాలను అధ్యయనం చేసిన తరువాత మేము మీ కొరకు “మరణానంతర జీవితము” పేరుతో ఈ పుస్తకాన్ని సంక్షిప్తంగా తెలుగు భాషలో కూర్చు చేసాము. మరి కొన్ని వివరాలను కూడా అనేక ప్రామాణికమైన హదీసు గ్రంథాల నుండి సేకరించి చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో కూర్చు చేసాము.
సమగ్ర విషయ సూచిక
[1] మరణానంతర జీవిత విశ్వాసము
మనిషికి జ్ఞానం ఎలా ప్రసాదించబడింది?
మరణానంతర జీవితాన్ని ఎందుకు తిరస్కరించారు?
జన్మించిన వారు మరణించక తప్పదు. మరణించిన వారు ప్రళయ దినాన జన్మించక తప్పదు.
[2] మనుషులకు మరణం ప్రాప్తమయ్యే లక్షణాలు.
విశ్వాసికి మరణం సమీపించినప్పుడు ప్రాప్తమయ్యే మంచి లక్షణాలు.
కలిమయే షహాదత్.
నుదుటిపై చెమటలు.
శుక్రవారం మరణం.
షహీద్ కాబడిన ముస్లిం (అమరుడు).
అల్లాహ్ మార్గంలో (ఫీ సబిలిల్లాహ్) మృత్యువు పాందినవారు షహీద్.
పుణ్యకార్యాలు చేస్తుండగా మరణం సంభవిస్తే స్వర్గం ప్రాప్తమవుతుంది.
అవిశ్వాసికి మరణం సమీపించినప్పుడు ప్రాప్తమయ్యే చెడ్డ లక్షణాలు.
ధర్మాన్ని తప్పుగా విశ్వసించిన ప్రజలు.
మరణం సమీపించినప్పుడు దైవదూతలు ప్రత్యక్షమవుతారు.
మరణ వేదనలు (సకరాతుల్ మౌత్).
ఆకాశాలఫైకి ఆత్మ ప్రయాణం.
విశ్వాసిగా ఉన్న పుణ్యాత్ముడైన ముస్లిం ఆత్మకు లభించే గౌరవం.
అవిశ్వాసికి మరియు పాపాత్ముడైన ముస్లిం ఆత్మకు ధిక్కరణ లభిస్తుంది.
[3] సమాధిలో ఏం జరుగుతుంది?
సమాధిలో ప్రశ్నోత్తరాల తరువాత జరిగే సుఖదుఃఖాలు.
సమాధి తీవ్రత.
సమాధి భయాందోళన
సమాధి చీకటి.
నమ్మక ద్రోహం (గులూల్).
అబద్దాలు పలికేవారు, వ్యభిచారులు, వడ్డీ తీసుకునే వారు, ఖుర్ఆన్ గ్రంథాన్ని నేర్చుకున్న అవిధేయులు.
సమాధిలో నలిగిపోయే యాతన.
సమాధి యాతనలను మానవులు, జిన్నాతులు తప్ప ప్రతి ఒక్కరూ వినగలరు.
మానవులు, జిన్నాతులు సమాధి సుఖదుఃఖాలు ఎందుకు వినలేరు?
సమాధి యాతనలను ప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) విన్నారు.
సమాధిలో శిక్షలకు గురికాబడే కొన్ని కారణాలు.
మూత్రం అశుద్ధత వలన, చెప్పుడు సంభాషణ వలన శిక్షలు అనుభవిస్తారు.
అప్పు తీసుకొని తిరిగి చెల్లించని వారికి సమాధి శిక్ష.
ఇతరులు రోధించడం వలన మృతుడు శిక్షింపబడుతాడు.
సమాధి శిక్షనుండి కాపాడే పుణ్యాలు.
షహీద్గా మరణించిన వ్యక్తి.
అల్లాహ్ మార్గంలో పోరాడేందుకై సిద్ధంగా ఉండి చనిపోయిన వ్యక్తి
శుక్రవారం చనిపోయిన వ్యక్తి.
కడుపు బాధతో మరణించిన వ్యక్తి.
ప్రతి రాత్రి సూరతుల్ ముల్క్ పారాయణం చేసిన వ్యక్తి.
సమాధి శిక్షనుండి రక్షణకై చేసే ప్రార్థనలు
[4] ప్రళయం రోజు సర్వమానవుల సమీకరణ.
సూర్ (శంఖం) పూరించబడుతుంది.
కొమ్ము రూపంలో శంఖం.
శంఖాన్ని పూరించేవాడు.
శంఖం పూరించబడే రోజు.
రెండు సార్లు శంఖాన్ని పూరిస్తారు.
మట్టినుండి పునర్జీివితం ప్రాప్తమవుతుంది.
ప్రతి వ్యక్తికి వెన్నపూస ఆధారంగా పునర్జన్మ ప్రాప్తమవుతుంది.
ప్రవక్తల శరీరాలను భూమి తినదు.
సమాధి నుండి మొట్టమొదట వెలికివచ్చేవారు.
ప్రళయం రోజు సర్వ మానవాళి సమీకరణ జరుగుతుంది.
కర్మలకు అణుగుణంగా తీర్చు చేయబడును.
ప్రళయ దినాన భూమి నుండి సర్వ మానవులు సమావేశమయ్యే స్థితి.
ప్రళయం రోజు మొట్ట మొదట దుస్తులు ధరించేవారు.
సర్వ మానవులు సమీకరించబడే భూమి.
భూమ్యాకాశాలు మార్చబడేటప్పుడు మానవులంతా సిరాత్ (పుల్సిరాత్)పై ఉంటారు.
ప్రళయ బీభత్సం.
ప్రళయం రోజున ప్రతి ఒక్కరు స్వార్థపరులుగా ఉంటారు.
ప్రళయం ఒక్కరోజు 50 వేల సంవత్సరాలకు సమానమైనది.
అల్లాహ్ యావత్తు భూమ్యాకాశాలను చుట్టి తన పిడికిలిలో ఇముడ్చుకుంటాడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
461. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:-
“ఖుర్ఆన్ కంఠపాఠి గౌరవనీయులైన దైవదూత లాంటివాడు. అతను (ప్రళయదినాన) వారితోనే ఉంటాడు. ఖుర్ఆన్ పఠించడం తనకు ఎంతో ప్రయాసతో కూడిన పని అయినప్పటికీ, దాన్ని పఠించి కంఠస్తం చేసే వ్యక్తి రెట్టింపు పుణ్యఫలానికి అర్హుడవుతాడు.”
[సహీహ్ బుఖారీ : 65 వ ప్రకరణం – అత్తఫ్సీర్ ఖుర్ఆన్, 80 వ అధ్యాయం – ‘అబస’ సూరా]
మధురమైన, సువాసన కలిగిన నారింజపండులా ఉండండి
460. హజ్రత్ అబూ మూసా అష్ అరీ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:-
ఖుర్ఆన్ పఠించే వ్యక్తి (విశ్వాసి) రుచిలోనూ, సువాసనలోనూ మేలు జాతికి చెందిన నారింజపండు లాంటివాడు. ఖుర్ఆన్ పఠించని విశ్వాసి (మోమిన్) రుచి ఉన్నా సువాసన లేని ఖర్జూర పండు లాంటివాడు. ఖుర్ఆన్ పఠించే కపట విశ్వాసి పరిమళం ఉన్న చేదుఫలం లాంటివాడు. ఖుర్ఆన్ పఠించని కపట విశ్వాసి సువాసన లేని చేదుగా ఉండే అడవి దోసకాయ లాంటివాడు.
[సహీహ్ బుఖారీ : 70 వ ప్రకరణం – అల్ అత్ అము – 30 వ అధ్యాయం – జిక్రిత్తామ్]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, కలిమ-ఎ-షహాదత్ (సాక్ష్య వచనం) యొక్క రెండవ భాగమైన “ముహమ్మదుర్ రసూలుల్లాహ్” (ముహమ్మద్ (స) అల్లాహ్ యొక్క ప్రవక్త) యొక్క లోతైన అర్థం మరియు ప్రాముఖ్యత వివరించబడింది. ఈ వాక్యాన్ని విశ్వసించడంలో నాలుగు ముఖ్యమైన షరతులు ఉన్నాయని వక్త నొక్కిచెప్పారు: 1) ప్రవక్త (స) ఇచ్చిన ఆదేశాలను పాటించడం, 2) ఆయన చెప్పిన విషయాలను సత్యమని నమ్మడం, 3) ఆయన నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండటం, మరియు 4) ఆయన చూపిన పద్ధతిలో మాత్రమే అల్లాహ్ను ఆరాధించడం. ఇంకా, ఈ విశ్వాసానికి రెండు మూల స్తంభాలు ఉన్నాయని వివరించారు: ఆయన అల్లాహ్ యొక్క ‘అబ్ద్’ (దాసుడు) మరియు ‘రసూల్’ (ప్రవక్త). ఆయన ఒక మానవుడు, దాసుడు అని నమ్మడం ద్వారా ఆయన విషయంలో అతిశయోక్తికి పాల్పడకుండా, దైవత్వపు లక్షణాలను అంటగట్టకుండా ఉంటాము. అలాగే, ఆయన ప్రవక్త అని నమ్మడం ద్వారా ఆయన సందేశాన్ని తిరస్కరించకుండా, ఆయన స్థానాన్ని తగ్గించకుండా ఉంటాము. ఈ రెండు అంశాలను సమతుల్యం చేసుకోవడం సరైన ఇస్లామీయ విశ్వాసానికి కీలకం.
أَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِيْنَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِيْنَ، أَمَّا بَعْدُ. (సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. మరియు ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ (స) పైన, ఆయన కుటుంబ సభ్యులపైన మరియు ఆయన సహచరులందరిపైన శాంతి మరియు శుభాలు వర్షించుగాక.)
సోదర మహాశయులారా! “విశ్వాస మూల సూత్రాలు“ అనే ఈ ముఖ్య శీర్షికలో, అల్లాహ్ యొక్క దయవల్ల ఇప్పటివరకు మనం తౌహీద్, అల్లాహ్ ఏకత్వం విషయంలో, తౌహీద్ అంటే ఏమిటి? అందులో ముఖ్యమైన మూడు లేదా నాలుగు భాగాలు ఏవైతే మనం అర్థం చేసుకోవడానికి విభజించి తెలుసుకున్నామో.
రెండవ పాఠంలో, తౌహీద్, కలిమ-ఎ-తౌహీద్ لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్ – అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు) యొక్క నిజమైన భావం ఏమిటి? అందులో ఉన్న రెండు ముఖ్యమైన రుకున్లు, అంటే మూల సూత్రాలు నఫీ (نفي – తిరస్కరించుట) వ ఇస్బాత్ (إثبات – అంగీకరించుట), నిరాకరించుట మరియు అంగీకరించుట, వీటి గురించి ఇంకా لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్) యొక్క గొప్ప ఘనత ఏమిటి అనేది కూడా తెలుసుకున్నాము.
ఇక మూడవ పాఠంలో, لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్) కు ఏడు షరతులు అందులో ఉన్నాయి. వాటిలో ప్రతీ ఒక్కటినీ మనం నమ్మడం, అర్థం చేసుకోవడం, దాని ప్రకారంగా ఆచరించడం తప్పనిసరి. ఆ ఏడు షరతులు కూడా తెలుసుకున్నాము. సంక్షిప్తంగా ఏమిటవి? ఇల్మ్ (علم – జ్ఞానం), యఖీన్ (يقين – దృఢ విశ్వాసం), కబూల్ (قبول – అంగీకారం), ఇన్ఖియాద్ (انقياد – విధేయత), ఇంకా సిద్ఖ్ (صدق – సత్యసంధత), మహబ్బత్ (محبة – ప్రేమ), ఇఖ్లాస్ (إخلاص – నిష్కల్మషత్వం). ఏడు కదా! అయితే ఎవరైనా ఈ విషయాలు ఇంకా అర్థం కాకుంటే, వెనుక పాఠాలు వినాలి అని నేను కోరుతున్నాను. అల్లాహ్ యొక్క దయవల్ల YouTube ఛానల్లో ‘Z Dawah’ లేదా ‘JDK Naseer’ అనే ఛానల్లో వెళ్లి వాటిని పొందవచ్చు.
ఈనాటి పాఠంలో మనం అల్లాహ్ యొక్క దయవల్ల కలిమ-ఎ-షహాదత్ (كلمة الشهادة), పవిత్ర వచనం యొక్క సాక్ష్యం మనం ఏదైతే పలుకుతామో అందులో ముఖ్యంగా రెండు విషయాలు ఉన్నాయి కదా! ఒకటి لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్), రెండవది محمد رسول الله (ముహమ్మదుర్ రసూలుల్లాహ్). ఆరాధనలకు అర్హులు కేవలం అల్లాహ్ మాత్రమే అని నమ్ముతాము. ఇది لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్) లో ఉంది. ఇక రెండవది, محمد رسول الله (ముహమ్మదుర్ రసూలుల్లాహ్).
ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఏదైతే మనం అంటామో, సామాన్యంగా వుజూ చేసిన తర్వాత أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ (అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ) అనాలి. ఏంటి లాభం? స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరవబడతాయి. ఎవరైతే వుజూ చేసిన తర్వాత ఈ చిన్న దుఆ చదువుతారో అని మనకు సహీహ్ ముస్లిం షరీఫ్లో ఈ శుభవార్త ఉంది. అలాగే అత్తహియ్యాత్ మనం చదువుతాము కదా, అందులో కూడా أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ (అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ) అత్తహియ్యాత్లో. మరి ఈ అత్తహియ్యాత్ ప్రతీ నమాజ్లోని తషహ్హుద్లో, ప్రత్యేకంగా చివరి తషహ్హుద్, ఏ తషహ్హుద్లోనైతే మనం సలాం తింపుతామో, అందులో చదవడం నమాజ్ యొక్క రుకున్, నమాజ్ యొక్క పిల్లర్ లాంటి భాగం అని కూడా పండితులు ఏకీభవించారు. అయితే గమనించండి, మనం మాటిమాటికీ ఏదైతే ముహమ్మదుర్ రసూలుల్లాహ్ యొక్క సాక్ష్యం కూడా పలుకుతూ ఉంటామో, దాని యొక్క నిజమైన భావం తెలుసుకోవడం కూడా చాలా అవసరం.
హృదయంతో మరియు నోటితో, మనసా వాచా ఆయన అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అని సాక్ష్యం పలుకుతూ, ఆయన అల్లాహ్ యొక్క దాసుడు మరియు సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా పంపబడిన వారు అని నమ్మాలి. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని అంటే, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క దాసులు మరియు సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా పంపబడిన వారు. ముఖ్యంగా ఈ రెండు విషయాలు. ఇక ఈ రెండు విషయాలు నమ్ముతున్నప్పుడు అందులో మరికొన్ని వివరాలు ఉంటాయి, వాటిని కొంచెం మనం అర్థం చేసుకుందాం.
అయితే ఇందులో ధర్మ పండితులు, ప్రత్యేకంగా ఉలమాయె అఖీదా, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని మనం పలుకుతున్నాము, సాక్ష్యం పలుకుతున్నాము, నమ్ముతున్నాము అంటే అందులో నాలుగు విషయాలు వస్తాయి అని చెప్పారు. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ ను విశ్వసించడంలో ఎన్ని విషయాలు? నాలుగు విషయాలు.
మొదటి విషయం, ఆయన మనకు ఏ ఆదేశం ఇచ్చారో విధేయత చూపాలి, అంటే ఆజ్ఞాపాలన చేయాలి. طَاعَتُهُ فِيمَا أَمَرَ (తాఅతుహూ ఫీమా అమర్). ప్రవక్త ఏ ఆదేశం ఇచ్చారో ఆ ఆదేశాన్ని మనం పాటించాలి. అర్థమైందా? ఉదాహరణకు మీరు హదీసులు చదువుతూ ఉన్నప్పుడు, “ఆమురుకుం బి సబ్అ” (నేను ఏడు విషయాల గురించి మీకు ఆదేశిస్తున్నాను) అని సహీ బుఖారీలో వచ్చింది. అల్లాహ్ను తప్ప ఇంకా వేరే ఎవరినీ కూడా మీరు ఆరాధించకండి, ఐదు పూటల నమాజు పాబందీగా చేయండి, ఈ విధంగా. ఇంకా వేరే ఎన్నో ఆదేశాలు ఉన్నాయి. ప్రవక్త ఇచ్చిన ప్రతీ ఆదేశాన్ని ఏం చేయాలి? విధేయత చూపాలి. ఆజ్ఞాపాలన చేయాలి.
రెండవ విషయం, تَصْدِيقُهُ فِيمَا أَخْبَرَ (తస్దీఖుహూ ఫీమా అఖ్బర్). ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏ ఏ విషయాలు మనకు తెలిపారో వాటన్నింటినీ మనం సత్యంగా నమ్మాలి. గత కాలాలలో జరిగిన కొన్ని సంఘటనలు మనకు తెలిపారు. తర్వాత కాలంలో రానున్న కొన్ని సంఘటనల గురించి మనకు తెలియజేశారు. ప్రత్యేకంగా ప్రళయానికి కంటే ముందు కొన్ని సూచనలు సంభవిస్తాయి అని కూడా తెలిపారు. అరే, అంత పాత కాలం నాటి విషయాలు ఎలా చెప్పారు? అరే ఇలా కూడా జరుగుతుందా? అరే ప్రళయానికి కంటే ముందు ఇట్లా అవుతుందా? ఇలాంటి సందేహాల్లో మనం పడకూడదు. ప్రవక్త చెప్పిన మాట నూటికి నూరు శాతం సత్యం. అందులో అనుమానానికి, దాన్ని మనం తిరస్కరించడానికి, అబద్ధం అన్నటువంటి అందులో ఏ సంశయం లేనే లేదు. تَصْدِيقُهُ فِيمَا أَخْبَرَ (తస్దీఖుహూ ఫీమా అఖ్బర్). ప్రవక్త తెలిపిన విషయాలను సత్యంగా నమ్మాలి. నూహ్ (అలైహిస్సలాం) ఎన్ని సంవత్సరాలు జీవించారో, వాటికి సంబంధించిన కొన్ని విషయాలు, ప్రవక్త ఇబ్రాహీంకు సంబంధించిన విషయాలు, ప్రవక్త మూసా, ఈసా (అలైహిముస్సలాతు వత్తస్లీమ్) కు సంబంధించిన కొన్ని విషయాలు, ఇంకా బనీ ఇస్రాయీల్లో జరిగిన ఎన్నో సంఘటనలు ప్రవక్త మనకు తెలిపారు. వాటన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? సత్యంగా నమ్మాలి. ప్రళయానికి కంటే ముందు దజ్జాల్ వస్తాడు, మహదీ వస్తాడు, ఈసా (అలైహిస్సలాం) వస్తారు, అలాగే దాబ్బతుల్ అర్ద్ అనే ఒక జంతువు వస్తుంది. అలాగే ప్రళయానికి కంటే ముందు సూర్యుడు, ప్రతిరోజూ ఎటునుండి ఉదయిస్తున్నాడు? తూర్పు నుండి, ప్రళయం రోజు పడమర నుండి. అల్లాహు అక్బర్! అది అలా ఎలా జరుగుతుంది, ప్రతిరోజూ మనం ఇట్లా చూస్తున్నాము కదా, ప్రళయానికి కంటే ముందు అట్లా ఎట్లా జరుగుతుంది అని సందేహం వహించడానికి అవకాశం లేదు. ప్రవక్త తెలిపారు, ఇలా జరిగి తీరుతుంది.
ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఏదైతే మనం నమ్ముతామో, అందులో ఎన్ని విషయాలు ఉన్నాయని చెప్పాను? మొదటి విషయం, ఆయన ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలి, విధేయత చూపాలి, ఆజ్ఞాపాలన. రెండవది, ఆయన ఏ ఏ విషయాలు తెలిపారో అవన్నీ సత్యం అని నమ్మాలి.
మూడవది, اجْتِنَابُ مَا نَهَى عَنْهُ وَزَجَرَ (ఇజ్తినాబు మా నహా అన్హు వ జజర్). ఆయన ఏ విషయాల నుండి మనల్ని హెచ్చరించారో, వారించారో, నిషేధించారో, “ఇది చేయకండి” అని చెప్పారో వాటికి మనం దూరంగా ఉండాలి. తల్లిదండ్రులకు అవిధేయత చూపకండి, చేతబడి చేయకండి, జూదం ఆడకండి, వ్యభిచారం చేయకండి, షిర్క్ పనులు చేయకండి, గడ్డాలు కత్తిరించకండి. ఈ విధంగా ఏ ఏ నిషేధాలు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనకు నిషేధించి ఉన్నారో, ఖండించి ఉన్నారో, వారించి ఉన్నారో, వాటన్నిటినీ మనం వాటికి దూరంగా ఉండాలి.
నాల్గవ విషయం, وَأَلَّا يُعْبَدَ اللَّهُ إِلَّا بِمَا شَرَعَ (వ అల్లా యూ’బదల్లాహు ఇల్లా బిమా షర’అ). ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ను ఏ విధంగా ఆరాధించారో, అదే విధంగా మనం కూడా ఆరాధించాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ను ఎలా ఆరాధించాలో, మనము కూడా అలాగే ఆరాధించాలి. నమాజ్ విషయంలో గానీ, ఉపవాసాల విషయాలలో గానీ, జకాత్, హజ్ విషయాలలో గానీ, వివాహ విషయాలలో గానీ, ప్రవక్త యొక్క నడవడిక గానీ, అందుకొరకే అల్లాహ్ ఏం చెప్పాడు? لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ (లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనహ్ – నిశ్చయంగా మీ కొరకు అల్లాహ్ ప్రవక్తలో ఒక ఉత్తమ ఆదర్శం ఉంది). ప్రవక్త మీకు ఒక మంచి ఆదర్శం. మీరు ఆయన ఆదర్శాన్ని పాటించాలి.
ఇక ఈ నాలుగు విషయాలు ఏదైతే నేను చెప్పానో, ప్రతి ఒక్క దానికి ఖురాన్లో, హదీస్లో ఎన్నో దలీల్లు ఉన్నాయి. కానీ టైం మనకు సరిపడదు గనుక సంక్షిప్తంగా చెబుతున్నాను. విషయం అర్థమైంది కదా! మనం ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని నమ్ముతున్నాము అంటే ఎన్ని విషయాలు ఉన్నాయి అందులో? నాలుగు విషయాలు. మరొకసారి మీకు గుర్తుండడానికి: ఆయన ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలి, ఆయన తెలిపిన విషయాలను సత్యంగా నమ్మాలి, ఆయన ఏ విషయాల నుండి మనల్ని నిషేధించారో, ఖండించారో, వారించారో వాటికి దూరంగా ఉండాలి, ఆయన అల్లాహ్ను ఎలా ఆరాధించారో అలాగే మనం ఆరాధించాలి.
అయితే సోదర మహాశయులారా, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఏదైతే మనం పలుకుతున్నామో, ఇందులో కూడా ముఖ్యమైన రెండు రుకున్లు ఉన్నాయి. రెండు మూల సూత్రాలు ఉన్నాయి. لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్) లో రెండు మూల సూత్రాలు ఉన్నాయి అని చెప్పాము కదా, ఒకటి నఫీ, మరొకటి ఇస్బాత్. ఇందులో రెండు మూల సూత్రాలు ఉన్నాయి. ఒకటి ‘అబ్ద్’ (عَبْد), మరొకటి ‘రసూల్’ (رَسُول). ‘అబ్ద్’ అంటే దాసుడు. అంటే ఏంటి? ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన అబ్దుల్లాహ్ యొక్క కుమారుడు. అబ్దుల్లాహ్ మరియు ఆమిన. ఆయన యొక్క వంశ పరంపర ఏమిటి? ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం. ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ వంశ పరంపరంగా ఇబ్రాహీం (అలైహిస్సలాం) యొక్క పెద్ద కుమారుడైన ఇస్మాయీల్ (అలైహిస్సలాం) సంతతిలో వస్తారు. మరియు ఇబ్రాహీం (అలైహిస్సలాం), ఆదం (అలైహిస్సలాం) సంతతిలోని వారు. ఈ విధంగా, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మనలాంటి ఒక మనిషి. అల్లాహ్ యొక్క దాసుడు. కానీ కొంచెం జాగ్రత్త. మనలాంటి మనిషి అన్న ఈ పదం ఏదైతే ఉపయోగించానో, ఇక్కడ భావాన్ని తెలుసుకోవాలి. లేదా అంటే మళ్ళీ కొందరు మనల్ని పెడత్రోవ పట్టించేటువంటి ప్రమాదం ఉంది.
మనలాంటి మనిషి అని ఎప్పుడైతే మనం మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి అంటామో, అక్కడ దాని భావం ఏమిటి? మనం ఎలాగైతే తల్లిదండ్రులతో పుట్టామో, మనం ఎలాగైతే ఆదం యొక్క సంతతియో, మనకు ఎలాగైతే ఆకలి, దాహము కలిగినప్పుడు తినడం, త్రాగడం, అవసరాలు తీర్చుకోవడం, పడుకోవడం, నిద్ర రావడం, ఏదైనా దెబ్బ తగిలిందంటే నొప్పి కలగడం, బాధ కలగడం, ఇలాంటి మానవ సహజ అవసరాలు ఏవైతే ఉన్నాయో, అలాంటి అవసరాలే ప్రవక్తకు ఉండినవి. ఆయన వేరే ఏ సృష్టి కాదు, మానవ సృష్టిలోనే మనలాంటి ఒక వ్యక్తి. కానీ, సర్వ మానవాళిలోనే కాదు, సర్వ సృష్టిలో అల్లాహ్ తర్వాత అందరికంటే గొప్పవారు. అర్థమైందా? కేవలం మానవుల్లోనే కాదు, జిన్నాతులో, మిగతా ఈ సృష్టి అంతటి, అల్లాహ్ తప్ప ఈ లోకంలో ఏదేదైతే ఉందో, ప్రతి దానిలో కెల్లా అత్యంత గౌరవనీయులు, అత్యంత అల్లాహ్కు ప్రియులు, అత్యంత గొప్పవారు, ఎక్కువ ఘనత గలవారు ఎవరు? మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం). ప్రవక్త ముహమ్మద్ మనలాంటి మనిషి అంటే, నౌజుబిల్లా అస్తగ్ఫిరుల్లా, సమానత్వంగా చేస్తున్నాము, మనకు ఈక్వల్గా చేస్తున్నాము, అలాంటి భావం రానే రాకూడదు. మనలాంటి మనిషి అంటే ఏంటి ఇక్కడ భావం? మనం ఎలాగైతే తల్లిదండ్రులతో పుట్టామో, ఆయన కూడా అబ్దుల్లాహ్, ఆమినాకు పుట్టినవారు. మానవ జన్మ ఎత్తినవారు. మానవ అవసరాలు సహజంగా ఏవైతే ఉంటాయో తినడం, త్రాగడం, పడుకోవడం, పెళ్లిళ్లు చేసుకోవడం, సంతానం కలగడం, మార్కెట్కు వెళ్లడం, అవసరం ఉన్న సామాను కొనుక్కొని రావడం, ఈ విధంగా ఈ పనులు ఏదైతే మనం మానవులం చేసుకుంటామో, అలాంటి అవసరాలు కలిగిన ఒక వ్యక్తే. కానీ, ఆయన స్థానానికి ఎవరూ చేరుకోలేరు. ఈ లోకంలోనే మొత్తం అల్లాహ్ తర్వాత ఆయనకంటే గొప్ప ఇంకా వేరే ఎవరూ కూడా లేరు.
అబ్ద్. దీని గురించి ఖురాన్లో ఎన్నో పదాలు ఉన్నాయి. అబ్ద్ అన్న పదం ఖురాన్లో వచ్చింది. సూరహ్ కహఫ్ స్టార్టింగ్లో వచ్చింది. సూరహ్ కహఫ్ యొక్క చివరిలో కూడా వచ్చింది. సూరహ్ ఫుర్ఖాన్ యొక్క స్టార్టింగ్లో కూడా వచ్చింది. ఇంకా ఎన్నో సూరాలలో అబ్ద్ అంటే దాసుడు. అలాగే మానవుడు, మనిషి అన్న పదం కూడా, బషర్ (بشر), మనిషి అంటే బషర్ అని అరబీలో అంటారు, ఈ పదం కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గురించి ఉపయోగపడింది.
ఇక రెండవ రుకున్, రసూల్. రసూల్. అంటే ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ఆయన్ని ప్రళయం వచ్చే వరకు సర్వ మానవాళి వైపునకు, సర్వ దేశాల, ఈ మొత్తం సృష్టిలో ఉన్న ప్రజల వైపునకు ఆయన్ని ప్రవక్తగా, సందేశహరులుగా, సందేశాన్ని అందజేసే వారులుగా, ఆచరించి చూపే వారులుగా, స్వర్గం వైపునకు పిలిచే వారిగా, నరకం గురించి హెచ్చరించే వారిగా చేసి పంపాడు.
ఈ రెండిటినీ మనం తప్పకుండా నమ్మాలి మరియు ఈ ప్రకారంగానే మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. సూరత్ సబా, అలాగే సూరహ్ అంబియా, ఇంకా ఎన్నో సూరాలలో, అలాగే సూరతుల్ అన్ఆమ్లో కూడా, సూరతుల్ ఆరాఫ్లో కూడా ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సర్వ మానవాళి వైపునకు అల్లాహ్ యొక్క కారుణ్య మూర్తి, అల్లాహ్ యొక్క సందేశం అందజేసే ప్రవక్త అని చాలా స్పష్టంగా చెప్పబడినది.
ఈ రెండు గుణాలను మనం నమ్ముతాము కదా, లాభం ఏమిటి? ఈ రెండు ఉత్తమ గుణాలు, ఈ రెండు ఉత్తమ రుకున్లు, మూల సూత్రాలు, అబ్ద్ మరియు రసూల్, ప్రవక్త విషయంలో నమ్మడం తప్పనిసరి. ఎందుకు? ఇలా నమ్మడం ద్వారా ఆయన హక్కులో కొందరు ఏదైతే అతిశయోక్తి లేదా ఆయన హక్కును తగ్గించి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, ఆ రెండు రకాల వారికి ఇందులో సరైన సమాధానం ఉంది.
ప్రజల్లో కొందరు ఇలా ఉన్నారు, ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని మనిషే కాదు అని అంటున్నారు. ఆయన వేరే ఒక సృష్టి అని అంటున్నారు. అది కూడా తప్పు విషయం. మరికొందరు ఆయన ఒక మనిషి, అబ్దుల్లాహ్, ఆమినాకు పుట్టినవారు అని నమ్ముతున్నారు, కానీ ప్రవక్త అని నమ్మడం లేదు, తిరస్కరిస్తున్నారు. అయితే మరొక వైపు ఏమున్నది? ఆయన్ని ప్రవక్తగా నమ్మి ఆయన హక్కులో చాలా అతిశయోక్తితో ప్రవర్తించి, ఆయన్ని అల్లాహ్ యొక్క స్థానానికి లేపేస్తున్నారు. ఏం చేస్తున్నారు? కేవలం అల్లాహ్తో అడిగేటువంటి కొన్ని దుఆలు, కేవలం అల్లాహ్తో మాత్రమే ప్రశ్నించేటువంటి కొన్ని విషయాలు, “ఓ అల్లాహ్ మాకు సంతానం కలిగించు”, “ఓ అల్లాహ్ మాకు మా రోగాన్ని దూరం చేసి ఆరోగ్యం ప్రసాదించు”, “ఓ అల్లాహ్ మా యొక్క కష్టాలను దూరం చెయ్యి” – ఇట్లాంటివి ఏవైతే కొన్ని దుఆలు ప్రత్యేకంగా కేవలం అల్లాహ్తో మాత్రమే అడగవలసినవి ఉంటవియో, అవి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)తో అడుగుతున్నారు. మాకేం అవసరం ఉన్నా గానీ ప్రవక్త యొక్క దర్బార్ మీదికి వెళ్ళాము, ప్రవక్త యొక్క రౌదా వద్దకు వెళ్ళాము, అక్కడ మా అవసరాలు అన్నీ తీరిపోతాయి అన్నటువంటి మూఢనమ్మకాల్లో ఉన్నారు. తప్పు విషయం. ఆయన ప్రవక్త, సర్వ మానవుల్లో కెల్లా ఎంతో ఉత్తమమైన వారు. కానీ ఆయన అల్లాహ్ను ఆరాధించేవారు, మనం కూడా అల్లాహ్నే ఆరాధించాలి, ఆయన్ని ఆరాధించకూడదు.
మరికొందరు మన ముస్లిములలో ఎలా ఉన్నారు? ఆయన్ని ప్రవక్తగా అని నమ్ముతూ ఎంతో గౌరవం, ఆయనకు గౌరవం ఇస్తున్నట్లుగా చెబుతారు. కానీ ఇతరుల ఇమాములను, ఇతరుల ముర్షిద్లను, వేరే కొందరు పీర్లను నమ్మి, ప్రవక్త కంటే ఎక్కువగా వారికి స్థానం కల్పిస్తారు. ఇది కూడా ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని చదవడానికి వ్యతిరేకం అవుతుంది సోదర మహాశయులారా.
విషయం అర్థమైంది కదా! ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఎప్పుడైతే మనం నమ్ముతున్నామో, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని సాక్ష్యం పలుకుతున్నామో, అందులో ఎన్ని విషయాలు వస్తాయి? ఏమేమిటి? ఇచ్చిన ఆదేశాన్ని పాటించడం, చెప్పిన ప్రతి మాటను సత్యంగా నమ్మడం, నిషేధించిన వాటికి దూరంగా ఉండడం, ఆయన ఎలా అల్లాహ్ను ఆరాధించారో అలా అల్లాహ్ను ఆరాధించడం. ఇందులో రెండు రుకున్లు ఉన్నాయి, మూల సూత్రాలు ఉన్నాయి: ఒకటి అబ్ద్, రెండవది రసూల్. ఈ రెండిటినీ నమ్మడం ద్వారా ఎవరైతే ప్రవక్తను ఆయన స్థానానికి దించి తగ్గించారో వారికి కూడా ఇందులో జవాబు ఉంది, మరి ఎవరైతే ప్రవక్తను నమ్మినట్లుగా చెప్పి ఇతరులను ప్రవక్తకు పైగా, ప్రవక్త యొక్క మాటకు వ్యతిరేకంగా ఇతరుల మాటలకు ప్రాధాన్యతనిస్తున్నారు, ప్రవక్త యొక్క పద్ధతి, సున్నత్కు వ్యతిరేకంగా ఇతరుల యొక్క ఫత్వాలను, ఇతరుల యొక్క మాటలకు ప్రాధాన్యతనిస్తున్నారు, అలాంటి వారికి కూడా ఇందులో జవాబు ఉన్నది.
అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనందరికీ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గురించి మనం ఏదైతే సాక్ష్యం పలుకుతున్నామో, అందులో ఈ విషయాలను తెలుసుకొని ఈ ప్రకారంగా సాక్ష్యం పలికేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.