ప్రళయ కాల చిహ్నాలు : సంగీతం అధికమై పోతుంది

సంగీతం అధికమై పోతుంది

ప్రళయ కాల చిహ్నాలు : సంగీతం అధికమై పోతుంది

హజ్రత్ ఇమ్రాన్‌ ఇబ్న్ హుసైన్‌ కథనం: ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ప్రళయం సమీపించినప్పుడు ఈ ఉమ్మత్‌ ప్రజలు భూమిలోనికి దిగద్రొక్కబడతారు, ఢీ కొట్టుకొని చనిపోతారు, రూపాలు మారిపోతాయి” అప్పుడు ఒక వ్యక్తి: “ఓ దైవ ప్రవక్తా! అది ఎప్పుడు సంభవిస్తుందని”  ప్రశ్నించాడు. “సంగీతాలు, భజంత్రీలు, నాట్యాలు ఎక్కువైనప్పుడు. మరియు మద్యం (అధికంగా) హెచ్చరిల్లినప్పుడు” అని సమాధానమిచ్చారు”

(తిర్మిజీ, ఇబ్ను మాజ, సహీహ్‌ అల్‌ జామీ సగీర్‌: 3559).

అనేక మంది ప్రజలు పోటిలు పడి గెలవాలనే భావనతో తమ ఆలోచనలను మార్చుకుంటున్నారు. అది అలా ఉండగా మరో వైపు చిన్న చిన్న పిల్లలతో సహా వృద్దులను కూడా నాట్యాలు చేయిస్తున్నారు. పోటీల పేరున ఇండ్లల్లో దాగిఉన్న స్త్రీలు సహితం బహిరంగంగా నిర్వహించే పోటిలలో పాల్గొంటున్నారు. అనేక భాషలలో, అనేక రాష్ట్రాలలో, నాట్య పోటీలు అధికమై పోయాయి. అలాగే స్టేజ్‌ పోటీలు, సంగీతాల పోటీలు, పాటల కచేరీలు ప్రతి ఛానలుకు అధికంగా డబ్బును సమకూర్చుకొనే సాధనాలుగా మారిపోయాయి.


ఇది ప్రళయ దిన చిహ్నాలు అనే పుస్తకం నుండి తీసుకోబడింది.
కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)

%d bloggers like this: