లాటరి (Lottery) టికెట్ కొనుక్కొని దానిలో పాల్గొనవచ్చా? – వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[4 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మనం ఇప్పుడు ఇస్లామీయ 12 వ నెల జిల్ హిజ్జా మాసం లో ఉన్నాము, ఇంకా కొద్దీ రోజులలో క్రొత్త ఇస్లామీయ సంవత్సరం 1443 ముహర్రం మాసం లో అడుగుపెట్టబోతున్నాము. మరి గడచిన సంవత్సరంలో నుండి మనం ఏమి గుణ పాఠాలు నేర్చుకోగలము? మనల్ని మనం ఎలా ఆత్మ పరిశీలన చేసుకోవాలి? మన తప్పుల్ని సరిదిద్దుకొని అల్లాహ్ యొక్క మార్గంలో ఎలా ముందుకు వెళ్ళాలి? ఈ వీడియో తప్పక చూడండి మరియు మీ బంధుమిత్రులకు తెలియజేయండి.
సంవత్సర ముగింపు గుణపాఠాలు – వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[40 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ కు దగ్గర కావాలనుకుంటున్నారా? అల్లాహ్ ప్రేమించేవారిలో, ఇష్టపడేవారిలో చేరాలనుకుంటున్నారా? మరి అల్లాహ్ సామీప్యం పొందడానికి మార్గాలు ఏమిటి? అల్లాహ్ సామీప్యం పొందితే కలిగితే గొప్ప ప్రయోజనాలు ఏమిటి? తప్పక విని ప్రయోజనం పొందండి. మరియు మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి ఇన్ షా అల్లాహ్
ఈ ప్రసంగంలో, అల్లాహ్ సామీప్యాన్ని (వసీలా) ఎలా పొందాలో ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. ప్రసంగం ప్రారంభంలో, విశ్వాసులు అల్లాహ్ సామీప్యాన్ని అన్వేషించాలని సూచించే ఖురాన్ ఆయతును ఉదహరించారు. అల్లాహ్ సామీప్యం పొందడానికి పది ముఖ్యమైన మార్గాలు వివరించబడ్డాయి: సమయానికి నమాజ్ చేయడం, ఫర్జ్ నమాజులతో పాటు సున్నత్ మరియు నఫిల్ నమాజులు అధికంగా చేయడం, అల్లాహ్ పట్ల విధేయత చూపడంలో ఉత్సాహం కలిగి ఉండటం, ఎల్లప్పుడూ అల్లాహ్ ను స్మరించడం (జిక్ర్), అల్లాహ్ ప్రసన్నత కోసం ఉపవాసం ఉండటం, చేసిన పాపాల పట్ల పశ్చాత్తాపం చెందడం, ఖురాన్ ను పారాయణం చేయడం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పంపడం, సజ్జనులతో స్నేహం చేయడం, మరియు పేదవారికి దానం చేయడం. ఈ మార్గాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి అల్లాహ్ కు ప్రియమైన వాడిగా మారి, అతని ప్రార్థనలు అంగీకరించబడతాయని మరియు ఇహపరలోకాలలో సాఫల్యం పొందుతాడని నొక్కి చెప్పబడింది.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బ’అద్.
سُبْحَٰنَكَ لَا عِلْمَ لَنَآ إِلَّا مَا عَلَّمْتَنَآ ۖ إِنَّكَ أَنتَ ٱلْعَلِيمُ ٱلْحَكِيمُ (సుబ్ హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అన్తల్ అలీముల్ హకీమ్) “(ఓ అల్లాహ్!) నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవూ నీవే!” (2:32)
వ ఖాలల్లాహు తబారక వ త’ఆలా
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ وَٱبْتَغُوٓا۟ إِلَيْهِ ٱلْوَسِيلَةَ (యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ వబ్తగూ ఇలైహిల్ వసీలహ్) విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్కు భయపడుతూ ఉండండి. ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. (5:35)
ప్రియమైన సోదరులారా! సోదరీమణులారా! అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క కృతజ్ఞత, ఆయన దయతో ఈరోజు మనమంతా ఒక కొత్త అంశాన్ని తీసుకొని సమావేశమై ఉన్నాము. అల్లాహ్ తో దుఆ ఏమనగా, ఖురాన్ మరియు హదీసుల ప్రకారం ఏవైతే వాక్యాలు మనకు వినబడతాయో వాటిని అమలుపరిచే భాగ్యాన్ని అల్లాహ్ త’ఆలా మాకు ప్రసాదించు గాక. ఆమీన్. అలాగే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అందరినీ ఒకేచోట సమావేశపరుస్తున్న వారందరికీ అల్లాహ్ త’ఆలా మంచి ఫలితాన్ని ఇహపరలోకాలలో ప్రసాదించు గాక. ఆమీన్.
అల్లాహ్ సామీప్య మార్గాలు
ప్రియమైన మిత్రులారా! ఖురాన్ గ్రంథంలోని ఒక ఆయత్.
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ وَٱبْتَغُوٓا۟ إِلَيْهِ ٱلْوَسِيلَةَ (యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ వబ్తగూ ఇలైహిల్ వసీలహ్) విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్కు భయపడుతూ ఉండండి. ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. (5:35)
ఓ విశ్వాసులారా! అల్లాహ్ యొక్క సామీప్యాన్ని మీరు అన్వేషించండి అని అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథంలో సెలవిచ్చాడు.
ఈరోజు మన అంశం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సామీప్య మార్గాలు. అల్లాహ్ సామీప్యం ఎలా పొందగలము? వాటి యొక్క మార్గాలు ఏమిటి? దాని ఫలితంగా మనకు అల్లాహ్ త’ఆలా కల్పించే భాగ్యాలు ఏమిటి? దీనిపై ఈరోజు సవివరంగా మీ ముందు ఉంచబోతున్నాను.
సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్ తబారక వ త’ఆలా మనల్ని అందరినీ సృష్టించారు. సరైన మార్గం కూడా అల్లాహ్ తబారక వ త’ఆలా మాకు సూచించాడు. సర్వ జనుల్లో అనేకమంది అనేక అభిప్రాయాలు, అనేక ఆలోచనలతో జీవిస్తున్నారు. కొంతమందికి కొన్ని విషయాల వల్ల ప్రేమ, మరి కొంతమందికి కొన్ని విషయాల పట్ల ఆకర్షణ, మరికొంతమందికి కొన్ని విషయాల పట్ల సంతుష్టి ఉంటుంది. అయితే ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తబారక వ త’ఆలా ఏమి చెబుతున్నాడంటే, ఓ విశ్వాసులారా! నా యొక్క సామీప్యాన్ని మీరు అన్వేషించండి.
అల్లాహ్ యొక్క సామీప్యం ఎంతో ఉన్నతమైన స్థానం. విలువైన స్థానం. ఆ ఉన్నతమైన స్థానానికి, ఆ విలువైన స్థానానికి మనిషి చేరుకోగలిగితే, ఇక అక్కడి నుంచి అల్లాహ్ తబారక వ త’ఆలా ను ఆ మనిషి ఏది కోరుకుంటాడో, ఆ దాసుడు ఏది కోరుకుంటాడో దాన్ని అల్లాహ్ త’ఆలా ప్రసాదిస్తాడు. ఆ విలువైన స్థానం, ఆ విలువైన సామీప్యాన్ని పొందడానికి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక విషయాలు సూచించారు. ఆ సామీప్యం మనిషికి దొరికినట్లయితే ఆ మనిషి యొక్క విలువ కూడా పెరిగిపోతుంది. అతని భక్తి కూడా పెరిగిపోతుంది. అల్లాహ్ వద్ద ఉన్నత స్థానాల్లో ఉంటాడు.
అయితే ఆ సామీప్యం మనకు ఎలా లభిస్తుంది? దాని కోసం మనం ఎన్నుకోవలసిన మార్గాలు ఏమిటి? ఇది మీరు, మేము చెప్పుకుంటే వచ్చేది కాదు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ప్రవక్తా! మీకు ఏ దేవుడైతే, ఏ అల్లాహ్ అయితే మీకు ప్రవక్తగా చేసి పంపించాడో అతని సాక్షిగా నేను చెబుతున్నాను. అల్లాహ్ తబారక వ త’ఆలా మీకు అందజేసిన సందేశం ఏమిటో నాకు వివరించండి.
అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, “షహాదతైన్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్.” దాన్ని “అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్.” నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప మరి నిజమైన ఏ దేవుడు లేడు. అలాగే నేను సాక్ష్యమిస్తున్నాను మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని. దీని తర్వాతే మిగతా విషయాలన్నీ అక్కడ వస్తాయి. ఆ వ్యక్తి దాన్ని విశ్వసించేవాడు. ఆ వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో అంటున్నాడు, రేయింబవళ్ళలో అల్లాహ్ తబారక వ త’ఆలా మాపై విధించిన విషయాలు ఏమిటో చెప్పండి.
మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఆదేశించారు. రేయింబవళ్ళలో అల్లాహ్ తబారక వ త’ఆలా మనపై విధించిన విషయం ఏమిటంటే, ఐదు పూటల నమాజు విధిగా అల్లాహ్ తబారక వ త’ఆలా చేశాడు. ఆ వ్యక్తి అన్నాడు, ప్రవక్తా! ఇంకేమైనా ఉందా? అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఐదు పూటల నమాజు తర్వాత నీకిష్టమైతే ఇంకా ఎక్కువైనా చదువుకోవచ్చు. ఆ తర్వాత ఆ వ్యక్తి అన్నాడు, ప్రవక్తా! అల్లాహ్ తబారక వ త’ఆలా మీకు అందజేసిన సందేశంలో ఇంకేమైనా చేయవలసి ఉంటే అది కూడా చెప్పండి. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రమజాన్ మాసములో ఉపవాసాలు ఉండుట, పూర్తి మాసంలో ఉపవాసాలు ఉండుట. ఆ వ్యక్తి అన్నాడు, ఇంకేమైనా ఉందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఆ పూర్తి మాసం తర్వాత నీకు ఇష్టమైతే మిగతా రోజుల్లో కూడా నువ్వు ఉపవాసాలు ఉండవచ్చు.
మీకు అందజేసిన ఆదేశాల్లో ఇంకేమైనా ఉందా అని అడిగాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, జకాత్ చెల్లించటం, సంవత్సరానికి ఒకసారి జకాత్ చెల్లించటం. ఈ విధంగా ఒక్కొక్క విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళు చాలా క్లుప్తంగా వివరించారు. అన్ని విషయాలు విన్న ఆ వ్యక్తి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అన్నాడు, ఓ ప్రవక్తా! ఏవైతే మీరు నాకు వినిపించారో, ఏవైతే సందేశం నాకు ఇచ్చారో ఆ సందేశంలో నేను రవ్వంత కూడా ఎక్కువ చేయను, రవ్వంత కూడా తగ్గించను. ఏదైతే నేను నాపై విధిగా ఉందో అది మాత్రమే నేను చేస్తాను. ఇంకా ఎక్కువ చేయను, ఇంకా తక్కువ చేయను అని ఆ వ్యక్తి పలకరించి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వెళ్తుండగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏదైతే ఈ మనిషి అన్నాడో, ఏదైతే ఈ మనిషి వాంగ్మూలం ఇచ్చాడో దాన్ని సరిగ్గా నెరవేరిస్తే ఇతను తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్తను ఇచ్చారు.
ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా! ఇది బుఖారీ, ముస్లింలో ఉంది, ఈ ఒక్క హదీస్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే అల్లాహ్ సామీప్యం పొందటం చాలా సులువు. కానీ మనం కాస్త గ్రహించట్లేదు. ఒకవేళ మనం గ్రహిస్తే అల్లాహ్ సామీప్యం పొందటం చాలా సులువైన విషయం. ఎందుకంటే ఆ వ్యక్తి అడిగిన విషయాల్లో ఏవైతే అల్లాహ్ తబారక వ త’ఆలా విధిగా చేశాడో అవి మాత్రమే నేను చేస్తాను అని చెప్పాడు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్త వినిపించారు, ఈ వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు అని. అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందటానికి మనిషికి కావలసినది ఏమిటంటే, అత్యంత విలువైన, అల్లాహ్ తబారక వ త’ఆలా ఏదైతే అతనిపై విధిగా చేశాడో దాన్ని అమలు పరచటం. అల్లాహ్ త’ఆలా విధిగా చేయనిది మనము ఎంత చేసుకున్నా అది విధికి సమానంగా ఉండదు. ధార్మిక పండితులు, ధార్మిక విద్వాంసులు అనేక విషయాలు దీనికి సంబంధించి చెప్పారు. అందులో కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. అవి అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందడానికి మార్గాలు అన్నమాట.
1. మొట్టమొదటిది: సమయానికి నమాజ్ చేయడం
మొట్టమొదటిదిగా అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందటానికి కావలసింది ఏమిటంటే, ‘అదావుస్ సలాతి ఫీ అవ్ఖాతిహా’. నమాజుని దాని యొక్క సమయంలో ఆచరించటం.
ఫజర్ నమాజ్ ఫజర్ సమయంలో, జోహర్ నమాజ్ జోహర్ సమయంలో, అసర్ నమాజ్ అసర్ సమయంలో, మగ్రిబ్ నమాజ్ మగ్రిబ్ సమయంలో, ఇషా నమాజ్ ఇషా సమయంలో. ఏ నమాజ్ ఏ సమయంలో అల్లాహ్ తబారక వ త’ఆలా విధిగా చేశాడో ఆ నమాజ్ ని ఆ సమయంలో విధిగా భావించి ఆచరించాలి. కొంతమంది ఫజర్ నమాజ్ ని హాయిగా పడుకొని జోహర్ నమాజ్ తో కలిపి చదువుతారు. ఇది అల్లాహ్ తబారక వ త’ఆలాకి నచ్చదు. సమయాన్ని తప్పించి నమాజ్ ఆచరించటం అనేది విధిగా అల్లాహ్ తబారక వ త’ఆలా చేయలేదు. కనుక అల్లాహ్ యొక్క సామీప్యం పొందాలంటే ఏదైతే అల్లాహ్ తబారక వ త’ఆలా విధిగా చేశాడో, ఎప్పుడు చేశాడో దాన్ని ఆ ప్రకారంగానే అమలు చేయటం. ఇస్లాం ధర్మంలో రెండో మౌలిక విధి నమాజ్ ది ఉంది. మొదటిది షహాదతైన్, ఆ తరువాత నమాజ్ అన్నమాట. నమాజ్ ని దాని సమయంలో పాటించటం, ఆచరించటం ఉత్తమం.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారు, మనిషి చనిపోయిన తర్వాత అన్నిటికంటే ముందు అల్లాహ్ వద్ద అతనితో ప్రశ్నించబడేది నమాజే. నమాజ్ గురించి అతను సమాధానం ఇవ్వగలిగితే మిగతా విషయాల్లో అతను విజయం, సాఫల్యం పొందుతాడు. కనుక ఇది గుర్తుపెట్టుకోవాలి. అల్లాహ్ సామీప్యం పొందడానికి కావలసినది విధిగా చేసి ఉన్న నమాజులని సమయం ప్రకారం ఆచరించటం, పాటించటం.
2. సున్నత్ మరియు నఫిల్ నమాజులు
ఇక రెండోది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఒక వ్యక్తి, ప్రవక్తా! స్వర్గంలో నేను మీతో ఉండాలనుకుంటున్నాను. అప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అయితే నువ్వు ఎక్కువగా నమాజ్ ఆచరించు. విధిగా ఉన్న నమాజులని ఆచరించిన తర్వాత సున్నత్ నమాజులను, నఫిల్ నమాజులను ఇలాంటి నమాజులను ఎక్కువగా ఆచరించటం వలన అల్లాహ్ యొక్క సామీప్యం మనకు లభిస్తుంది. ఎంతవరకు అయితే మనిషి అల్లాహ్ యొక్క భక్తిని తన హృదయంలో, తన మనసులో పెంపొందించుకుంటాడో, అల్లాహ్ తబారక వ త’ఆలా అతనికి తన సామీప్యానికి దరికి తీసుకుంటాడు. కనుక సున్నత్ నమాజులను, నఫిల్ నమాజులను, అలాగే రాత్రిపూట ఏకాంతంలో చదివే తహజ్జుద్ నమాజులను కూడా వదలకూడదు. ఈ నమాజులు మన స్థాయిని పెంచుతాయి. అల్లాహ్ సన్నిధిలో మన యొక్క విలువ పెరుగుతుంది.
3. అల్లాహ్ పట్ల విధేయత
ఆ తర్వాత మూడో మార్గం ఏమిటంటే అల్లాహ్ యొక్క విధేయతను పాటించడంలో ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆశతో ఉండాలి. విధేయత అంటే ఇతాఅత్. ఏదైతే అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ పని చేయమని, ఆ పని చేయమని అల్లాహ్ త’ఆలా మాకు ఆజ్ఞాపిస్తాడో ఆ ఆజ్ఞను శిరసా వహించటానికి ఇతాఅత్ అంటాము. ఆ ఇతాఅత్ చేయటానికి మనము ఎల్లప్పుడూ ఆశ కలిగి ఉండాలి. ఉత్సాహం కలిగి ఉండాలి. ఉత్సాహం లేకుండా ఏదీ మనిషి చేయలేడు, ఇష్టం లేకుండా ఏది మనిషి చేయలేడు. అల్లాహ్ విధేయత పట్ల మనిషి ఉత్సాహం కలిగి ఉంటే ఆ విశ్వాసంలో కలిగే రుచే వేరుగా ఉంటుంది. ఇది మూడో మార్గం అన్నమాట.
4. అల్లాహ్ ను స్మరించడం (జిక్ర్)
ఇక నాలుగో మార్గం ఏమిటంటే అల్లాహ్ తబారక వ త’ఆలాని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి. అంటే జిక్ర్. జిక్ర్ అంటే అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క నామము యొక్క జపము. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక దుఆలతో నామాలతో, జపాలతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూచించారు. మనిషి కూర్చొని ఉన్నా, నమాజ్ తర్వాత అయినా, ఏదైనా వస్తువు మన చేతి నుండి కింద పడిపోయినా, ఏదైనా వస్తువు మనకు ఆకర్షణను కలిగించినా, అనేక విధాలుగా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క నామాన్ని మనం స్మరిస్తూ ఉండాలి. సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, మాషాఅల్లాహ్. ఈ విధంగా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క నామాలను స్మరిస్తూ ఉండాలి. దీని ద్వారా మన యొక్క విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, తద్వారా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క సామీప్యం మనకు లభిస్తుంది.
5. ఉపవాసం
ఇక ఐదోది ఏమిటంటే, అల్లాహ్ ప్రసన్నత కోసం ఉపవాసం ఉండుట. ఉపవాసం అనేది ఎవరికీ కానవచ్చేది కాదు. అల్లాహ్ ప్రసన్నత కోసం మనిషి ఉపవాసం ఉంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమి చెప్పారంటే, ఎవరైతే అల్లాహ్ ప్రసన్నత కోసం ఒక రోజు ఉపవాసం ఉండినట్లయితే, అల్లాహ్ తబారక వ త’ఆలా అతని యొక్క ముఖాన్ని 70 సంవత్సరాల దూరంగా నరకాగ్ని నుండి ఉంచుతాడు. ఇది కేవలం ఒక రోజు ఉపవాసం ఉంటే అల్లాహ్ తబారక వ త’ఆలా అతని ముఖాన్ని నరకాగ్ని నుండి 70 సంవత్సరాల దూరం వరకు తప్పిస్తాడు. ఆ విధంగా అల్లాహ్ ప్రసన్నత కోసం ఎన్ని ఉపవాసాలు ఉన్నా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక ఉపవాసాలు చూపించారు. వారంలో రెండు రోజులు ఉపవాసం ఉండుట, ఒక మాసములో, ఒక నెలలో మూడు రోజులు, 13, 14, 15 వ తేదీలలో ఉపవాసాలు ఉండుట. అలాగే అరఫా రోజున ఉపవాసం ఉండుట, ముహర్రం రోజులో 9, 10 ఈ రెండు రోజులు ఉపవాసాలు ఉండుట. రమజాన్ మాసములో విధిగా చేయబడిన ఒక నెల ఉపవాసాలు ఉండుట. ఈ విధంగా అనేక ఉపవాసాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఉపదేశించారు. ఈ ఉపవాసాల ద్వారా మనిషిలో విశ్వాసము, ఈమాన్ పెరుగుతుంది. దాని మూలంగా అతను అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందగలుగుతాడు.
6. పశ్చాత్తాపం (తౌబా)
ఇక ఆరోది ఏమిటంటే పశ్చాత్తాపం, ‘అత్తౌబతు అనిల్ మ’ఆసీ’. పశ్చాత్తాపం. ఏవైతే మనము చెడు కర్మలు చేసి ఉన్నామో, నేరాలు చేసి ఉన్నామో, దాని పట్ల పశ్చాత్తాపం చెందుతూ ఉండాలి. అల్లాహ్ త’ఆలాతో ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండాలి. అల్లాహ్ త’ఆలా వైపు మరలుతూ ఉండాలి. ఎల్లప్పుడూ అల్లాహ్ త’ఆలాతో క్షమాపణ, మన్నింపు కోరుతూ ఉండాలి. దీని మూలంగా మన యొక్క పాపాలు అల్లాహ్ తబారక వ త’ఆలా తుడిచి పెడతాడు. దాని ద్వారా మన యొక్క ఈమాన్ పెరుగుతుంది, అల్లాహ్ యొక్క సామీప్యం మనకు కలుగుతుంది. మనిషి ఏ సమయంలో ఎలాంటి పాపం చేస్తాడో అతనికే తెలుసు. కొన్ని సందర్భాలు ఇలాంటివి కూడా ఉంటాయి, అతను పాపాలు చేస్తాడు, ఆ పాపాలు అతనికి గుర్తు ఉండవు. కనుక అల్లాహ్ తబారక వ త’ఆలాతో దుఆ ఏమని చేయాలంటే, ఏ పాపాలైతే నేను తెలిసి చేశానో, తెలియక చేశానో అన్నిటినీ నువ్వు క్షమించు అని అల్లాహ్ త’ఆలాతో మన్నింపు కోరుతూ ఉండాలి.
పశ్చాత్తాపం చేయటానికి, క్షమాపణ కోరటానికి, మన్నింపు కోరటానికి గడువు తీసుకోకూడదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, రాత్రిళ్ళలో ఎవరైతే పాపాలు చేస్తారో, నేరాలు చేస్తారో అతని కోసం అల్లాహ్ తబారక వ త’ఆలా పగలు తన రెండు హస్తాలను చాచి, ఓ నా భక్తులారా! ఎవరైతే రాత్రిళ్ళలో మీరు పాపాలు చేసి ఉన్నారో, నేరాలు చేసి ఉన్నారో, నేను మిమ్మల్ని క్షమిస్తాను, రండి. ఆ సమయంలో ఎవరైతే అల్లాహ్ తబారక వ త’ఆలాతో పశ్చాత్తాపం కోరుతారో, అల్లాహ్ త’ఆలా వారిని క్షమిస్తాడు, మన్నించి వేస్తాడు. అదే విధంగా పగటి పూట ఎవరైతే పాపాలు చేస్తూ ఉంటారో, వారి కోసం అల్లాహ్ తబారక వ త’ఆలా రాత్రి తన హస్తాలు చాచి, ఓ నా దాసులారా! మీరు పగటిపూట ఏమైనా నేరాలు చేసి ఉంటే, పాపాలు చేసి ఉంటే, రండి, క్షమాపణ కోరండి, మీ పాపాలను నేను తుడిచి వేస్తాను, మన్నించి వేస్తాను. కానీ మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు పాపం పట్ల పశ్చాత్తాపం చెందితే మళ్ళీ బహుశా నాతో పాపం జరిగే అవకాశం ఉంది. కనుక ఇప్పుడే పశ్చాత్తాపం చెందకూడదు. జీవితంలో చివరి కాలంలో, శేష జీవితంలో నేను పాపాల నుండి విముక్తి పొందటానికి అల్లాహ్ త’ఆలాతో పశ్చాత్తాపం కోరాలి అనే భావన అతనిలో కలిగి ఉంటుంది. ఇది ముమ్మాటికీ తప్పు, పొరపాటు. మనిషి అన్న తర్వాత చిన్న పాపాలు గాని, పెద్ద పాపాలు గాని, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. కానీ అల్లాహ్ తబారక వ త’ఆలా క్షమిస్తూనే ఉంటాడు. గఫూరుర్ రహీం. ఆయన కరుణించేవాడు, క్షమించేవాడు, అమితంగా క్షమించేవాడు, కరుణించేవాడు. ఎల్లప్పుడూ తమ పాపాల పట్ల అల్లాహ్ త’ఆలాతో పశ్చాత్తాపం కోరుతూ ఉండాలి.
7. ఖురాన్ పారాయణం
ఇక ఏడో మార్గం ఏమిటంటే, అల్లాహ్ తబారక వ త’ఆలా అవతరింపజేసిన ఖురాన్ గ్రంథాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉండాలి, కంఠస్థం చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. అల్లాహ్ తబారక వ త’ఆలా మహత్తరమైన గ్రంథాన్ని అవతరింపజేశాడు. మన సాఫల్యం కోసం, పరలోకంలో మనం విజయం సాధించాలనే ఉద్దేశ్యముతో అల్లాహ్ త’ఆలా మన కోసం ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఈనాడు మన స్థితి కాస్త గ్రహించినట్లయితే మనకు అర్థమవుతుంది, అదేమిటంటే ఖురాన్ చదవటం వచ్చిన వాళ్ళు అయినా సరే, ఖురాన్ చదవటం రాని వాళ్ళు అయినా సరే సమానమయ్యారు. ఖురాన్ చదవటానికి వారి వద్ద సమయం లేదు. ఖురాన్ నేర్చుకోవడానికి వారి వద్ద సమయం లేదు. ఇది అంతిమ దైవ గ్రంథం. నిజమైన గ్రంథం. ఈ భూమండలంలో ఏదైనా నిజమైన గ్రంథం, అల్లాహ్ యొక్క దైవ గ్రంథం ఉండినట్లయితే అది కేవలం ఖురాన్ గ్రంథం మాత్రమే. అసలైన స్థితిలో అలాగే భద్రంగా ఉంది.
ఎంత అభాగ్యులు వారు, ఎవరైతే ఈ గ్రంథాన్ని విడిచిపెట్టి తన జీవితాన్ని సాగిస్తున్నారో. చాలా దురదృష్టవంతులు. అల్లాహ్ యొక్క గ్రంథం ఈ భూమండలం మీద ఉన్నప్పుడు మనలో విశ్వాసం దాన్ని చదవడానికి, దాన్ని పారాయణం చేయడానికి, కంఠస్థం చేయడానికి ఎలా తహతహలాడాలంటే అంత ఉత్సాహంతో ఉండాలి. ఖురాన్ గ్రంథం పట్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పి ఉన్నారు, ఎవరైతే ఒక అక్షరం చదువుతాడో దానికి బదులుగా అల్లాహ్ తబారక వ త’ఆలా పది పుణ్యాలు లభింపజేస్తాడు. ఖురాన్ గ్రంథంలో వాక్యాలు, పదాలు అనేక అక్షరాలతో కూడి ఉన్నాయి. అది చదవంగానే అల్లాహ్ తబారక వ త’ఆలా వారికి ఎంతో విలువైన పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. దాని మూలంగా వారి యొక్క విశ్వాసం పెరుగుతుంది, అల్లాహ్ యొక్క సామీప్యం వారికి లభిస్తుంది. కనుక ఖురాన్ గ్రంథాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉండాలి. ఏదైతే మనకు వస్తుందో, ఒక సూరా వచ్చినా, మొత్తం ఖురాన్ వచ్చినా, నిరంతరంగా చదువుతూ ఉండాలి.
అల్లాహ్ తబారక వ త’ఆలా సూరె ఫుర్ఖాన్ లో ఈ విధంగా చెప్తున్నాడు, ప్రళయ దినం నాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సన్నిధిలో అంటారు, “యా రబ్బీ ఇన్న హాజల్ కౌమీత్తఖజూ ఖురాన మహ్జూరా”. ఓ నా ప్రభువా! ఈ నా జాతి వారు ఖురాన్ గ్రంథాన్ని చదవటం విడిచిపెట్టారు. కనుక ఈ స్థితి రాకుండా మనం ఏం చేయాలంటే, ఖురాన్ గ్రంథాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. దాని దాని కారణంగా మనకు మేలు జరుగుతుంది, అల్లాహ్ యొక్క సామీప్యం దొరుకుతుంది.
8. దరూద్
ఎనిమిదో మార్గం ఏమిటంటే, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ తబారక వ త’ఆలా మన సన్మార్గం కోసం పంపించాడు. ఆయన్ని ప్రవక్తగా చేసిన అల్లాహ్ తబారక వ త’ఆలా మనపై పెద్ద ఉపకారమే చేశాడు. ఆయన చెప్పకపోతే, ఆయన మార్గాన్ని సూచించకపోతే నిజమైన మార్గం మనకు దొరికేది కాదు. అర్థమయ్యేది కాదు. కనుక మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అత్యధికంగా దరూద్ చదువుతూ ఉండాలి.
అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్, కమా సల్లయిత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్, కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్.
ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై చదివే దరూద్, పంపే దరూద్ అన్నమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించి ఉన్నారు, మీలో ఎవరైతే నాపై ఎక్కువ దరూద్ పంపుతారో, చదువుతారో అతను నాకు సమీపంగా ఉంటాడు. అల్లాహ్ సామీప్యం పొందడానికి ఈ దరూద్ కూడా మనకు తోడ్పాటు అవుతుంది.
9. మంచివారితో స్నేహం
అలాగే తొమ్మిదో మార్గం ఏమిటంటే, మంచి వ్యక్తులతో స్నేహం కలిగి ఉండాలి. స్నేహం అన్నది కేవలం ప్రపంచంలో మనం చెప్పుకుంటా స్నేహం కాదు. సద్వర్తుల స్నేహం. ఎవరైతే అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగి ఉంటాడో, ఎల్లప్పుడూ అల్లాహ్ ని గుర్తు చేస్తూ ఉంటాడో, అల్లాహ్ యొక్క విధేయతను పాటిస్తూ ఉంటాడో, అల్లాహ్ తో ఎవరైతే భయపడుతూ ఉంటారో వారి యొక్క స్నేహాన్ని మనము చేసుకోవాలి. మనము ఇటువంటి వారిని స్నేహించము. మన జీవిత కాలంలో మనకున్న స్నేహాలు, స్నేహితులు వేరు. అల్లాహ్ తబారక వ త’ఆలా ఏదైతే సూచిస్తున్నాడో అది వేరు. కనుక గుర్తుంచుకోవాలి, స్నేహం చేసేటప్పుడు మనలో ఉన్న గుణం ఏమిటి, అది మన స్నేహం ద్వారా వ్యక్తమవుతుంది. ఒక మంచి మనిషి అల్లాహ్ తో భయపడేవాడు, అల్లాహ్ పట్ల సంతుష్టుడయ్యేవాడు, అల్లాహ్ యొక్క దాసులతో ప్రేమిస్తాడు, స్నేహం చేస్తాడు. కనుక మంచి స్నేహితులని ఎన్నుకోవాలి. దాని మూలంగా వారు చేస్తున్న ఆచారాలు, వారు చేస్తున్న కర్మలు మనకు కూడా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. దాని ద్వారా మన విశ్వాసం కూడా, ఈమాన్ కూడా పెరుగుతుంది. తద్వారా అల్లాహ్ సన్నిధిలో మనము కూడా ఒక సామీప్యాన్ని పొందగలుగుతాం.
10. దానం చేయడం
పదోది ఏమిటంటే, దానము చేయటం, పేదవారిపై దానము చేయటం. దానం చేయడాన్ని అల్లాహ్ తబారక వ త’ఆలా ఎంతో మెచ్చుకుంటాడు. అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా చెప్పి ఉన్నాడు, ఏదైతే మీకు నేను ప్రసాదించి ఉన్నానో అందులో నుంచి మీరు ఖర్చు పెట్టండి పేదవారిపై. ఇక్కడ చెప్పవలసిన విషయం ఏమిటంటే, మన దగ్గర ఎంత ఉంది అనేది కాదు, ఏదైతే అల్లాహ్ త’ఆలా మనకు ప్రసాదించి ఉన్నాడో, అది కొంత అయినా ఎంతైనా సరే, అందులో నుంచి ఖర్చు పెట్టి అల్లాహ్ ప్రసన్నత కోరటం అనేది ఇక్కడ మాట. ఎల్లప్పుడూ అల్లాహ్ తబారక వ త’ఆలా కోసం, అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం మనము దానధర్మాలు చేస్తూ ఉండాలి. దీని మూలంగా అల్లాహ్ యొక్క సామీప్యం మనకు దొరుకుతుంది.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులు, సహాబాలు ఎంతో శ్రమపడి అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క ప్రసన్నత కోరేవారు. ఒక సందర్భంలో హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆయన వద్ద ఉన్న అన్ని వస్తువులు తీసుకొచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ప్రవేశపెట్టారు. వారి స్థితిని గమనించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు తో అన్నారు, ఓ అబూబకర్! ఇవన్నీ ఇక్కడికి తీసుకువచ్చావు, ఇంట్లో ఏమి పెట్టుకున్నావు? ఆయన అన్నారు, ప్రవక్తా! నేను ఇంట్లో అల్లాహ్ మరియు ప్రవక్తను వదిలేసి వచ్చాను.
ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులు అల్లాహ్ ప్రసన్నత కోసం అనేక విధాలుగా ఖర్చు పెట్టేవారు. అల్లాహ్ యొక్క ప్రసన్నతను పొందాలని.
ఈ పది సూత్రాలు, పది మార్గాలు ఉన్నాయి అల్లాహ్ యొక్క సామీప్యం పొందడానికి.
అల్లాహ్ సామీప్యం యొక్క ఫలితం
అయితే ఇప్పుడు చెప్పవలసిన విషయం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సామీప్యం మనం పొందినట్లయితే, అప్పుడు అల్లాహ్ తబారక వ త’ఆలా మా యొక్క ప్రతి మాటను వింటూ ఉంటాడు, మేము కోరేదానికి అల్లాహ్ తబారక వ త’ఆలా ప్రసాదిస్తూ ఉంటాడు. ఒక హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, ‘లవ్ అఖ్సమ అలల్లాహి ల అబర్రహ్’. అల్లాహ్ సామీప్యం పొందినవాడు ఎప్పుడైనా అల్లాహ్ మీద ప్రమాణం చేస్తే అల్లాహ్ తబారక వ త’ఆలా అతని యొక్క ప్రమాణాన్ని పూర్తి చేస్తాడు.
అదే విధంగా మరో హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క సామీప్యం పొందినవాడు అల్లాహ్ యొక్క స్నేహితుడు అవుతాడు, వలీ అవుతాడు. ఎవరైతే అల్లాహ్ యొక్క వలీతో ఏదైనా విషయం పట్ల హాని కలిగించినట్లయితే అల్లాహ్ తబారక వ త’ఆలా అంటున్నాడు, అతను తోనే అతనితో నేను యుద్ధం చేయడానికి సిద్ధమై ఉన్నాను. అల్లాహ్ మిత్రుల పట్ల, అల్లాహ్ యొక్క సామీప్యం పొందిన వారి పట్ల అల్లాహ్ తబారక వ త’ఆలా ఏం చెప్తున్నాడంటే, అతనిని నేను మెచ్చుకుంటాను, అతనిని నేను ఇష్టపడతాను, అతను ఏ చేతిలోనైతే పట్టుకుంటుంటాడో ఆ చేతిని నేను అయిపోతాను. ఏ కాలి ద్వారా అయితే అతను నడుస్తూ ఉంటాడో ఆ కాలును నేను అయిపోతాను. ఏ కళ్ళ ద్వారా అతను చూస్తూ ఉంటాడో ఆ కళ్ళు నేను అయిపోతాను. అని ఎంతో ప్రేమతో, ఎంతో ప్రసన్నతతో అల్లాహ్ తబారక వ త’ఆలా చెప్తున్నాడు.
అల్లాహ్ యొక్క సామీప్యం మనం పొందినట్లయితే మన యొక్క ప్రతి మాట అల్లాహ్ తబారక వ త’ఆలా వింటాడు. మేము ఏది కోరితే అల్లాహ్ తబారక వ త’ఆలా అది మాకు ప్రసాదిస్తాడు.
కనుక చివరిగా అల్లాహ్ తబారక వ త’ఆలా తో దుఆ ఏమనగా, ఏవైతే మనం విన్నామో ఆ మాటలని గుర్తించి సరైన మార్గంపై నడిచే భాగ్యాన్ని అల్లాహ్ తబారక వ త’ఆలా మాకు ప్రసాదించు గాక. అల్లాహ్ తబారక వ త’ఆలా ఏవైతే విధిగా చేసి ఉన్నాడో వాటిని ఆచరించి అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందే భాగ్యాన్ని అల్లాహ్ త’ఆలా మనకు ప్రసాదించు గాక. ఆమీన్.
వ ఆఖిరు ద’అవానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సులైమాన్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[క్రింది విషయం ఖురాన్ కథామాలికఅనే పుస్తకం నుండి తీసుకోబడింది]
ప్రవక్త సులైమాన్ (అలైహిస్సలాం) (970-931 క్రీ.పూ.)
“చివరకు సులైమాన్ సైన్యమంతా ఒక చీమల లోయకు చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా ప్రకటించింది: “ఓ చీమల్లారా! సులైమాను, అతని సైన్యాలు తెలీకుండా మిమ్మల్ని నలిపివేసే స్థితి ఏర్పడకుండా ఉండేందుకు, మీరు మీ మీ పుట్టలలోనికి దూరిపోండి.” ” (ఖుర్ఆన్ 27: 18)
ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) వివేకం మూర్తీభవించిన పాలకులు. ఆయన కుమారుడు సులైమాన్ మరింత తెలివి, వివేకసంపద కలిగినవారు. ఆయన చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడే తెలివితేటలు, వివేక విచక్షణలు ప్రదర్శించారు. రాజ దర్బారులో వివాదాల, ఫిర్యాదుల తీర్పులు జరుగుతున్నప్పుడు ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) తన కుమారుణ్ణి కూడా దర్బారులో పిలిచి కూర్చుండబెట్టేవారు.
ఒకసారి ఒక రైతు ఓ ఫిర్యాదు తీసుకుని వచ్చాడు. ఆ రైతు తన పొలంలో గోధుమ, మొక్కజొన్న పండించే వాడు. పొలంలో ఫలవృక్షాలు కూడా ఉండేవి. ఈ రైతుకు పొరుగున మరో వ్యక్తి ఉన్నాడు. ఈ పొరుగు వ్యక్తి గొర్రెలు పెంచేవాడు. రైతు పొలంలో పంట బాగా ఏపుగా పెరిగినప్పుడు పొరుగువాని గొర్రెలు పొలంలో పడి పంట మొత్తం ఆగం చేసి వెళ్ళేవి. ఈ వివాదం దర్బారుకు వచ్చింది. పొరుగువాడు రైతు చేసిన ఫిర్యాదు నిజమేనని ఒప్పుకున్నాడు. ఇద్దరి వాంగ్మూలాలు విన్న తర్వాత ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) తన తీర్పు చెబుతూ, రైతుకు జరిగిన నష్టానికిగాను పొరుగు వ్యక్తి తన గొర్రెలను రైతుకు ఇచ్చి నష్ట పరిహారం చెల్లించాలని అన్నారు. తన గొర్రెలు విచ్చలవిడిగా తిరగడానికి వదలి వేసిన పొరుగువాడు ఈ విధంగా గుణపాఠం కూడా నేర్చుకుంటాడని దావూద్ (అలైహిస్సలాం) అన్నారు. అప్పటికి సులైమాన్ వయసు కేవలం పదకొండు సంవత్సరాలు మాత్రమే. ఆయన ఈ తీర్పు విని లేచి నిలబడి మాట్లాడడానికి తండ్రి అనుమతి కోరారు. తండ్రి ఆయనకు అనుమతి ఇచ్చారు. సులైమాన్ మాట్లాడుతూ తాను ఈ తీర్పుతో ఏకీభవించడం లేదని, ఈ శిక్ష చాలా తీవ్రంగా ఉందని అన్నారు. బాల సులైమాన్ ధైర్యంగా చెప్పిన ఈ మాటలు విని పూర్తి దర్బారు నిర్ఘాంతపోయింది. దర్బారులో గుసగుసలు వ్యాపించాయి. దావూద్ ప్రవక్త చిరునవ్వుతో తన కుమారుడిని చూస్తూ ఈ వివాదానికి నీ తీర్పు ఏమిటో చెప్పు అన్నారు. అప్పుడు సులైమాన్ మాట్లాడుతూ, గొర్రెలను కొంతకాలం వరకు రైతుకు అధీనం చేయాలని, ఆ విధంగా రైతు వాటి ఉత్పత్తుల ద్వారా అంటే పాలు, ఉన్ని, వగైరాలతో లాభం పొంది తన నష్టాన్ని పూడ్చుకుంటాడని, ఈ లోగా గొర్రెల యజమాని ఒక సంవత్సరం పాటు రైతు పొలాన్ని సాగుచేసి పంట పండించి పంట కోయకుండా రైతుకు అప్పగించాలని, రైతు తన అధీనంలో ఉన్న గొర్రెలను, ఎన్ని గొర్రెలయితే పొరుగువాడు తన అధీనం చేశాడో అన్ని గొర్రెలను తిరిగి అతనికి అప్పగించాలని, వాటికి పుట్టిన గొర్రెపిల్లలను ఇవ్వనవసరం లేదని అన్నారు. ఈ విధంగా గొర్రెల యజమాని నిర్లక్ష్యానికి తగిన శిక్ష కూడా పడుతుందని, అతను ఒక సంవత్సరం పాటు ఎలాంటి ప్రతిఫలం లేకుండా పొలంలో పని చేసి పంట పండించి రైతుకు అప్ప గించవలసి ఉంటుందని, అలాగే అతను పూర్తిగా తన గొర్రెలను కోల్పోయే పరిస్థితి కూడా ఉండదని చెప్పారు. పంట సిద్ధంగా ఉన్న పొలాన్ని అతను అప్పగించిన తర్వాత రైతు దానిని కోసుకోవచ్చు. ఈ తీర్పును రాజదర్బారు నిశ్శబ్దంగా వింటూ ఉండిపోయింది.
రాజు దావూద్ (అలైహిస్సలాం) తన తీర్పును ఉపసంహరించుకుంటున్నానని, తన కుమారుని తీర్పును అమలు చేయాలని ఆదేశించారు. కుమారుని తీర్పు నిష్పక్ష పాతంగా, న్యాయసమ్మతంగా, వివేకవంతంగా, తన తీర్పు కన్నా ఉత్తమంగా ఉందని ప్రకటించారు. రైతు, గొర్రెల యజమాని ఇద్దరూ కూడా తీర్పు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. (చదవండి దివ్యఖుర్ఆన్ : 21:78-82)
కుమారుని ద్రోహం
ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) తన తర్వాత తన కుమారుడు సులైమాన్ ను రాజుగా చేయాలని నిర్ణయించారు. కాని దావూద్ (అలైహిస్సలాం) గారి మరో కుమారుడు అబ్సాలోమ్ పెద్దవాడు. పెద్దవాడయినప్పటికీ రాజబాధ్యతలు నిర్వర్తించే యోగ్యతలు అతనికి లేవు. తన తండ్రి సులైమాన్ ను రాజుగా చేయాలని నిర్ణయించడం అబ్సాలోమ్ కు నచ్చలేదు. అతనిలో ఈర్ష్యాద్వేషాలు బుసలు కొట్టాయి. ఎలాగైనా రాజ సింహాసనాన్ని హస్తగతం చేసుకోవాలని అతను కుట్రపన్నాడు.
ముందుగా అతడు ప్రజలను మభ్యపుచ్చి తన పక్షానికి వచ్చేలా చేయాలనుకున్నాడు. ప్రజలను తన వైపు త్రిప్పుకోవడానికి ఒక పథకం వేశాడు. ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి సులైమాన్ దర్బారుకు వస్తున్నప్పుడు వారిని అక్కడకు వెళ్ళకుండా అడ్డుకుని తన వద్దకు వచ్చేలా చేశాడు. ఆ విధంగా తాను చాలా వివేకవంతుడినన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి ప్రయత్నించాడు. ఆ పిదప తన కుట్రకు పనికివచ్చే కొంతమంది దుర్మార్గులను తన అనుచరులుగా చేర్చుకున్నాడు. ఒక రోజు అతను తన తండ్రితో గిబియన్ పట్టణానికి వెళ్తాను అనుమతించమని కోరాడు. గిబియన్ పట్టణంలో తాను చేయవలసిన పని ఉందని సాకులు చెప్పాడు. తనతో పాటు తన అనుచరులను తీసుకుని వెళ్ళాడు. గిబియన్ పట్టణానికి వెళ్ళిన వెంటనే బనీ ఇస్రాయీల్లోని వివిధ తెగలకు రహస్య సందేశాలు పంపాడు. నగారా శబ్దం వినగానే తనను రాజుగా ప్రకటించాలని వారందరికీ సూచనలు పంపించాడు. కాని దావూద్ (అలైహిస్సలాం) పట్ల విశ్వాసం కలిగిన ప్రజలు ఈ ఆదేశాన్ని లక్ష్యపెట్టలేదు. అబ్సాలోమ్ అనుచరులకు, వివిధ తెగలకు మధ్య తీవ్రమైన పోరాటం జరిగింది. జెరుసలేమ్ పట్టణం దాదాపుగా నాశనం అయ్యింది.
తన కుమారుని ద్రోహం గురించి దావూద్ ప్రవక్తకు తెలిసింది. తన స్వంత కుమారుడు ఇలా వ్యవహరించాడని తెలిసి ఆయన చాలా బాధకు గురయ్యారు. అయినా ఆయన సంయమనాన్ని కోల్పోలేదు. తన రాజ్యంలో రక్తపాతాన్ని ఆయన ఇష్టపడలేదు. అబ్సాలోమ్ పట్టణాన్ని బలవంతంగా వశపరచుకోవచ్చని ఆయన భయపడ్డారు. అందువల్ల ఆయన తన వారికి వెంటనే పట్టణాన్ని వదిలి వేయాలని సందేశం పంపించారు. హాని కలుగకముందే అక్కడి నుంచి తప్పించుకొమ్మని చెప్పారు. చాలా మంది పట్టణాన్ని వదలి జోర్డాన్ నదిని దాటి వచ్చేశారు. దావూద్ (అలైహిస్సలాం) ఆలివ్ కొండను ఎక్కి అల్లాహ్ ను ప్రార్థించారు. ప్రజలను ఈ ప్రమాదం నుంచి కాపాడమని వేడుకున్నారు. కొంతమంది ప్రజలు తమ దుస్థితికి రాజుగారే కారణమని విమర్శించారు. కాని చాలా మంది దావూద్ పక్షాన విశ్వాసంగా నిలబడ్డారు. ఆయన వారితో, “నా స్వంత కుమారుడు నాకు ద్రోహం చేసినప్పుడు పరులు నాకు వ్యతిరేకమయ్యారని నేను ఎలా చెప్పగలను” అన్నారు.
దావూద్ (అలైహిస్సలాం) కొందరు అధికారులను అక్కడికి పంపి పరిస్థితి చక్క దిద్దమన్నారు. అబ్సాలోమ్కు ఎలాంటి హాని చేయవద్దని వారిని ఆదేశించారు. దావూద్ (అలైహిస్సలాం) పంపిన అధికారులు కఠినంగా అక్కడి తిరుగుబాటును అణచి వేశారు ఈ పోరాటంలో అబ్సాలోమ్ హతమయ్యాడు. జెరుసలేమ్ మళ్ళీ శాంతిభద్రతలు పునరుద్ధరించబడ్డాయి. దావూద్ (అలైహిస్సలాం) రాజుగా పరిపాలించడం కొనసాగింది.
సులైమాన్ రాజరికం
తన తండ్రి మరణానంతరం సులైమాన్ (అలైహిస్సలాం) రాజుగా పాలనాపగ్గాలు చేపట్టారు. తన రాజ్యం వంటి మరో రాజ్యం లేనంత చక్కగా పాలించే అనుగ్రహం ప్రసాదించాలని ఆయన అల్లాహ్ ను ప్రార్థించారు. అల్లాహ్ ఆయన కోరికను మన్నించాడు. సులైమాన్ (అలైహిస్సలాం) మహావివేకవంతుడు మాత్రమే కాదు, అల్లాహ్ ఆయనకు అనేక వరాలు ప్రసాదించాడు. ఆయన గాలులను తన అదుపులో ఉంచుకోగలిగేవారు. పశుపక్ష్యాదులతో మాట్లాడగలిగేవారు. భూగర్భంలో ఉన్న ఖనిజాలను త్రవ్వి బయటకు తీసి వాటితో ఉపకరణాలు, ఆయుధాలు తయారు చేసే విద్యను మనుష్యులకు, జిన్నాతులకు (అగ్నితో సృష్టించబడిన బుద్ధిజీవులైన ప్రాణులకు) నేర్పాలని అల్లాహ్ ఆయనకు ఆదేశించాడు. అల్లాహ్ ఆయనకు ఒక రాగి గనిని కూడా ప్రసాదించాడు. ఆ కాలంలో రాగి అరుదైన లోహంగా ఉండేది.
ఒక రోజు సులైమాన్ (అలైహిస్సలాం) తన సైన్యాన్ని సమావేశపరచారు. అదొక విచిత్రమైన సైన్యం. అందులో మనుష్యులు, పశుపక్ష్యాదులు, జిన్నాతులు ఉన్నారు. సైన్యాన్ని తీసుకుని ఆయన అష్కెలాన్ రాజ్యానికి బయలుదేరారు.
వారు ఒక లోయ నుంచి వెళుతున్నప్పుడు ఒక చీమ ఈ సైన్యం రావడాన్ని చూసింది. మిగిలిన చీమలను హెచ్చరిస్తూ, ”పారిపోండి. పుట్టల్లో తలదాచు కోండి. లేకపోతే మనల్ని చూడకుండా సులైమాన్ సైన్యం మనల్ని తొక్కేస్తుంది” అని అరిచింది. ఈ అరుపు సులైమాన్ చెవులకు సోకింది. ఆయన నవ్వుకున్నారు. ఒక ప్రవక్తగా తాను కావాలని అల్లాహ్ సృష్టి దేనికీ హాని తలపెట్టనన్న విషయాన్ని ఆ చీమ గుర్తించినందుకు సంతోషించారు. చీమలను కాపాడినందుకు ఆయన అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
రాతి గుమ్మటం
జెరుసలేమ్ ఒక పెద్ద శిలపై సులైమాన్ (అలైహిస్సలాం) ఒక అందమైన ఆరాధనాలయాన్ని నిర్మించారు. ప్రజలు అల్లాహ్ ను ఆరాధించడానికి వచ్చేలా ఈ ఆరాధనాలయాన్ని కట్టారు. నేడు దీనిని “మస్జిదుల్ అక్సా” లేదా “మస్జిదుల్ ఖుద్స్” లేదా ”డోమ్ ఆఫ్ రాక్” అని పిలుస్తున్నారు. ఇక్కడి నుంచి సులైమాన్ (అలైహిస్సలాం) వెంట పెద్ద సంఖ్యలో అనుచరులు మక్కాలోని పవిత్ర గృహానికి యాత్రకు బయలు దేరారు. వారు తమ హజ్ యాత్ర పూర్తి చేసుకుని అక్కడి నుంచి యమన్ చేరుకుని సనా పట్టణానికి వచ్చారు. ఇక్కడ తెలివిగా పట్టణాల్లో నీటిపారుదల సదుపాయాన్ని ఏర్పాటు చేసిన పద్ధతి చూసి ఆయన చాలా ప్రభావితులయ్యారు. తన రాజ్యంలో కూడా అలాంటి నీటిపారుదల సదుపాయం ఏర్పాటు చేసుకోవాలని భావించారు. కాని తన రాజ్యంలో అందుకు అవసరమైన నీటివనరులు లేవు. ఆయన వెంటనే హూపో పక్షి కోసం కబురంపారు. ఆ పక్షి భూగర్భంలో జనవనరులను పసిగట్టగలదు. ఆయన హూపో పక్షి కోసం నాలుగు చెరగులా సందేశాలు పంపారు. కాని ఆ పక్షి ఎక్కడా లేదు. ఆయన కోపంగా ఆ పక్షి కనుక సరియైన కారణం లేకుండా గైర్హాజరైతే దానిని కఠినంగా శిక్షిస్తానని అన్నారు.
షీబా రాణి బిల్కిస్
చివరకు హూపో పక్షి సులైమాన్ వద్దకు వచ్చింది. తన ఆలస్యానికి కారణాన్ని వివరించింది. “మీకు తెలియని ఒక విషయాన్ని నేను కని పెట్టి వచ్చాను. నేను సబా (షీబా) నుంచి ఒక శుభవార్త తీసుకుని వచ్చాను” అంది. ఈ మాటలు విన్న సులైమాన్ ఆగ్రహం మాయమై ఆయనలో కుతూహలం చోటుచేసుకుంది. ”సబా రాజ్యాన్ని బిల్కిస్ అనే రాణి పాలిస్తోంది. ఆమెకు అన్ని సౌభాగ్యాలు పుష్కలంగా ఉన్నాయి. ఆమె సింహాసనం చాలా అద్భుతంగా ఉంది. కాని ఇంత సంపద ఉన్నప్పటికీ, ఆమె హృదయంలో, ఆ రాజ్య ప్రజల హృదయాల్లో షైతాన్ తిష్ఠవేసుకుని ఉన్నాడు. ప్రజలు ఆమె పట్ల చాలా విశ్వాసంగా ఉన్నారు. వారంతా విశ్వప్రభువైన అల్లాహ్ కు బదులు సూర్యుణ్ణి పూజించడం చూసి నేను నిర్ఘాంతపోయాను” అని ఆ పక్షి వివరించింది.
హూపో పక్షి చెప్పిన మాటలు నిర్ధారించుకోవడానికి సులైమాన్ (అలైహిస్సలాం) ఆ పక్షితో సబా రాణికి ఒక లేఖ పంపారు. రాణికి లేఖ చేరవేసి అక్కడే రహస్యంగా ఉండి రాణి ఏం చేస్తుందో చూడమని పక్షికి సూచనలిచ్చారు.
హూపో పక్షి ఆ లేఖను సబా రాణి ముందు పడవేసి ఎగిరిపోయింది. వెళ్ళి ఓ మూలన దాక్కుని చూడసాగింది. సబా రాణి ఆ లేఖను ఆశ్చర్యంగా తీసుకుని చదివింది. “ఈ లేఖ సులైమాన్ నుంచి పంపబడింది. అనంత కరుణా మయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభం. నాకు వ్యతిరేకంగా బలప్రదర్శనకు దిగవద్దు. లొంగిపోయిన మనిషి మాదిరిగా నా వద్దకు రావాలి…..” ఈ లేఖ చూసి రాణి చాలా ఆందోళనకు గురయ్యింది. వెంటనే తన సలహాదారులను పిలిపించింది. వారు ఆమెతో తాము కేవలం సలహా మాత్రమే ఇవ్వగలమని, ఆదేశాలిచ్చి చర్యలు తీసుకోవలసినది రాణిగారేనని విన్నవించు కున్నారు. వారి ఉద్దేశ్యాన్ని ఆమె గ్రహించింది. వారంతా సులైమాన్తో యుద్ధరంగంలో ఢీకోవాలని భావిస్తున్నారు. కాని ఆమె వారితో, ”స్నేహం, శాంతి యుద్ధం కన్నా మంచివి. వివేక వంతమైనవి. యుద్ధం వల్ల పరాభవాలు వాటిల్లుతాయి. ప్రజలు బానిసలవుతారు. సంపద నాశనం అవుతుంది. నేను సులైమాన్కు కానుకలు పంపాలని భావిస్తున్నాను. మన ఖజానాలోని విలువైన వస్తువుల్ని పంపుదాం. ఈ కానుకలు తీసుకుని వెళ్ళే రాజప్రతినిధులు సులైమాన్ గురించి కూడా తెలుసుకోవచ్చు, అతని సైనిక బలాన్ని కూడా అంచనా వేయవచ్చు” అని చెప్పింది.
కాని ఆమెకు తన మాటలన్నింటినీ హూపో పక్షి వింటుందన్న విషయం తెలియదు. హూపో వెంటనే సులైమాన్ వద్దకు వెళ్ళి ఈ విషయాలు చేరవేసింది.
కానుకలా? లంచాలా?
సులైమాన్ (అలైహిస్సలాం) వెంటనే తన అధీనంలో ఉన్న ఒక జిన్నుతో ఒక మహా ప్రాసాదాన్ని నిర్మించమని ఆదేశించారు. ఆ మహాసౌధంలో రాబోయే అతిథులను స్వాగతిస్తానని చెప్పారు. సబా రాణి వద్ద నుంచి వచ్చిన రాజప్రతినిధులను ఆయన చాలా ఆదరంగా స్వాగతించారు. అద్భుతమైన ఆ భవనాలను చూసి వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. వారు తమ రాణి పంపిన విలువైన కానుకలను సులైమాన్ (అలైహిస్సలాం)కు అందజేశారు. స్నేహానికి గుర్తులుగా వాటిని తమ రాణి పంపిందని, వాటిని స్వీకరించాలని కోరారు. కాని సులైమాన్ ఆ కానుకలను విప్పి చూడకుండానే వారిని ఉద్దేశించి, “అల్లాహ్ నాకు పుష్కలంగా ప్రసాదించాడు. ఒక పెద్ద రాజ్యాన్ని ఇచ్చాడు. ప్రవక్త పదవిని ఇచ్చాడు. కాబట్టి నేను లంచాలకు లొంగే అవకాశం లేదు. నా లక్ష్యం ఒక్కటే, తౌహీద్ (ఏకదైవారాధన)ను వ్యాపింప జేయడం” అన్నారు. అంతేకాదు, ఆ కానుకలను తిరిగి తీసుకువెళ్ళాలని ఆదేశించారు. మీ రాణి తన ఆరాధనా పద్ధతిని మార్చుకోనట్లయితే రాజ్యాన్ని వశపరచు కుంటానని, ప్రజల్ని అక్కడి నుంచి వెళ్ళగొడతానని కఠినంగా చెప్పారు.
రాణి ప్రతినిధులు ఆ కానుకలు తీసుకుని ఆమె వద్దకు చేరుకుని సులైమాన్ (అలైహిస్సలాం) చెప్పిన మాటలు చెప్పారు. అంతేకాదు, సులైమాన్ రాజ్యంలో తాము చూసిన అద్భుతాలను కూడా వివరించారు. సులైమాన్ సందేశం పట్ల ఆమె ఆగ్రహం ప్రదర్శించే బదులు సులైమాన్ రాజ్యాన్ని సందర్శించాలని నిర్ణయించుకుంది. తనకు విశ్వాసపాత్రులైన నౌకర్లతో ఆమె సబా రాజ్యాన్ని వదలి బయలుదేరింది. ఒక సందేశహరుడితో సులైమాన్ (అలైహిస్సలాం) వద్దకు తాను వస్తున్న వర్తమానం ముందుగానే పంపించింది.
సులైమాన్ ఆదేశపాలన కోసం జిన్నుల పోటీ
సులైమాన్ (అలైహిస్సలాం) తన అధీనంలో ఉన్న జిన్నులను పిలిచి సబా రాణి రాక ముందే ఆమె సింహాసనాన్ని తన వద్దకు ఎవరు తీసుకువస్తారని అడిగారు. ఒక జిన్ను, ”ఈ సమావేశం ముగిసేలోపే ఆ సింహాసనాన్ని మీ ముందు ఉంచుతాను. నేను నిస్సందేహంగా బలం కలవాడిని. ఇలాంటి పనులు చేయడానికి నమ్మక స్తుడిని” అన్నాడు. కాని ఈ పని చేయడానికి జిన్నులు పోటీపడ్డారు. ఇంతలో ప్రత్యేక జ్ఞానం కలిగిన ఒక జిన్ను, “నేను రెప్పపాటులో ఆ సింహాననాన్ని మీ ముందు ఉంచుతాను” అంటూ మాట పూర్తయ్యేలోపే సింహాసనాన్ని ముందు ఉంచాడు. సులైమాన్ (అలైహిస్సలాం) ఆశ్చర్యంగా, ”ఇదంతా అల్లాహ్ అనుగ్రహం నేను కృతజ్ఞత చూపుతానో లేదో అని ఆయన పరీక్షిస్తున్నాడు” అన్నారు. ఆ తర్వాత ఆయన ఆ జిన్నుతో ఆ సింహాసనం ఆకారాన్ని మార్చమన్నారు.
సబా రాణి ఆగమనం
బిల్కీస్ సులైమాన్ రాజప్రాసాదంలోకి వచ్చినప్పుడు ఆమెను ఘనంగా స్వాగతించడం జరిగింది. ఆ తర్వాత సులైమాన్ (అలైహిస్సలాం) తన వద్ద ఆకారం మార్చి ఉన్న సింహాసనాన్ని ఆమెకు చూపించి ఆమె సింహాసనం కూడా అలాంటిదేనా అని ప్రశ్నించారు. ఆమె ఆ సింహాసనాన్ని పదే పదే చూసింది. తాను చూస్తున్న సింహాసనం తన సింహాసనం అయ్యే అవకాశం లేదని భావించింది. ఎందుకంటే, తన సింహాసనం తన రాజభవనంలో ఉంది. కాని తన సింహాసనానికి ఈ సింహాసనానికి పోలికలు చాలా ఉండడం చూసి ఆమె ఆశ్చర్యంగా, “ఈ సింహాసనం నా సింహాసనాన్ని చాలా విధాలుగా పోలి ఉంది” అంటూ జవాబిచ్చింది. ఆమె చాలా తెలివైన, దౌత్యపరమైన నైపుణ్యం ఉన్న మహిళగా సులైమాన్ (అలైహిస్సలాం) గుర్తించారు.
ఆ తర్వాత ఆయన అమెను ఒక పెద్ద హాలులోకి ఆహ్వానించారు. ఆ గది లో నేల అంతా గాజుతో పరచబడి ఉంది. ఆమె గాజు నేలను చూసి అదంతా నీరుగా భ్రమపడింది. ఆమె అక్కడ అడుగుపెట్టేటప్పుడు తన దుస్తులు తడవకుండా కొద్దిగా కాలిమడమల పైకి లాక్కుంది. సులైమాన్ (అలైహిస్సలాం) ఆమెను చూస్తూ ఇక్కడ నీరు లేదు, గాజుతో చేసిన నేల అని చెప్పారు. ఆమె ఆశ్చర్య పోయింది. అలాంటి నిర్మాణాన్ని ఆమె అంతకుముందు ఎన్నడూ చూడలేదు. తన ముందు ఉన్నది విజ్ఞానవివేకాలు మూర్తీభవించిన అసాధారణ వ్యక్తి అని ఆమె గుర్తించింది. ఆయన కేవలం ఒక రాజ్యానికి పాలకుడు మాత్రమే కాదని, అల్లాహ్ ప్రవక్త కూడా అని తెలుసుకుంది. ఆమె తన ఆరాధనా పద్ధతులలోని తప్పులకు పశ్చాత్తాపపడింది. సూర్యుణ్ణి పూజించే అలవాటు మానుకుంది. అల్లాహ్ ను ఒకే ఒక్క దేవునిగా విశ్వసించింది. తన రాజ్యంలోని ప్రజలను కూడా అదే విధంగా చేయాలని కోరింది. (చదవండి దివ్యఖుర్ఆన్ : 6:84, 21:81-82, 34:12-14, 27:15-44, 2-103, 38:32-40)
అశ్వప్రేమికుడు సులైమాన్ (అలైహిస్సలాం)
సులైమాన్ (అలైహిస్సలాం) కాలంలో ప్రజలు గుర్రాలపై ప్రయాణాలు చేసేవారు. యుద్ధరంగంలో సైనికులకు యుద్ధ సామగ్రిని, ఆయుధాలను చేరవేయడానికి గుర్రాలనే ఉపయోగించేవారు. వస్తురవాణాకు, వాహనాలు లాగడానికి కూడా గుర్రాలనే వాడేవారు. గుర్రాల పట్ల చాలా శ్రద్ధ చూపేవారు. వాటికి చక్కని శిక్షణ ఇచ్చేవారు. సులైమాన్ (అలైహిస్సలాం) గుర్రపుశాలలో చాలా గుర్రాలు ఉండేవి. గుర్రాలంటే ఆయనకు చాలా శ్రద్ధ ఉండేది. ఒకసారి ఆయన తన గుర్రపుశాలలో గుర్రాలను చూస్తూ వాటిని ప్రేమగా నిమురుతూ చాలాసేపు గడిపారు. సూర్యుడు అస్తమించే సమయం అయిపోయింది. అస్ర్ నమాజు సమయం దాటిపోతోంది. ఆయన తాను చేస్తున్న ఆలస్యాన్ని గుర్తించి వెంటనే, “నేను ఈ సంపదను నా ప్రభువు సంస్మరణార్థం ప్రేమించాను.”…..”వాటిని నా వద్దకు తిరిగి తీసుకు రండి” అన్నారు. (చదవండి దివ్యఖుర్ఆన్: 38:32-33)
సులైమాన్ (అలైహిస్సలాం) విచిత్ర మృతి
సులైమాన్ (అలైహిస్సలాం) పాలనలో అనేక పనులను జిన్నులే చేస్తుండేవి. జిన్నులు చేసిన పాపాలకు శిక్షగా వాటితో ఈ పనులు చేయించడం జరిగేది. అగ్నితో సృష్టించబడిన జిన్నులు తమకు సమస్త శక్తులున్నాయని, తాము అగోచరాలను కూడా చూడగలమని, భవిష్యత్తును తెలుసుకోగలమని ప్రజలను నమ్మించడం వంటి పాపాలకు పాల్పడేవారు. తన అనుచరుల్లో ఇలాంటి తప్పుడు విశ్వాసాలు చోటుచేసుకోకుండా చూడవలసిన బాధ్యత ఒక ప్రవక్తగా సులైమాన్ (అలైహిస్సలాం) పై ఉంది. భవిష్యత్తు తెలుసుకునే శక్తి జిన్నులకు గాని, ప్రవక్తలకు గాని ఎవరికీ లేదని, కేవలం అల్లాహ్ కు తప్ప అలాంటి శక్తి మరెవ్వరికీ లేదని ప్రజలు తెలుసుకునేలా చేయడం ఆయన బాధ్యత. ఈ దిశగా ఆయన చేసిన ప్రయత్నాలు ఆయన మరణానంతరం కూడా కొనసాగడం చెప్పుకోదగిన విశేషం.
ఒక గనిలో జిన్నుల పనిని పర్యవేక్షిస్తూ ఆయన తన చేతికర్రకు ఆనుకుని కూర్చుని ఉన్నారు. ఆ విధంగా కూర్చున్న స్థితిలోనే ఆయన తుదిశ్వాసను విడిచారు. చాలా సమయం వరకు ఆయన (అలైహిస్సలాం) మరణం గురించి ఎవరికీ తెలియదు. ఆయన (అలైహిస్సలాం) అక్కడ కూర్చున్నట్లే చాలా మందికి కనబడ్డారు. సులైమాన్ (అలైహిస్సలాం) చూస్తున్నారన్న భయంతో జిన్నులు విరామం లేకుండా పని కొనసాగిస్తూ పోయారు. ఈ సంఘటనను దివ్యఖుర్ఆన్ ఇలా వివరించింది. “ఆ తరువాత సులైమాన్ పై మేము మరణ నిర్ణయాన్ని అమలు జరిపినప్పుడు, జిన్నాతులకు అతని మరణం గురించి తెలియజేసిన వస్తువు అతని చేతి కర్రను తింటూ ఉన్న చెదపురుగు తప్ప మరొకటేదీ కాదు, ఈ విధంగా సులైమాన్ పడిపోగా, తమకు అగోచర విషయాలు తెలిసి ఉంటే అవమానకరమైన ఈ బాధకు గురి అయి ఉండేవారము కాము అని జిన్నాతులకు స్పష్టంగా తెలిసి పోయింది.”
ఆ విధంగా ఆయన మరణం కూడా ఆయన అనుచరులకు ఒక పాఠంగా మిగిలింది. జిన్నులేకాదు, ఎవరూ కూడా భవిష్యత్తును గురించి తెలుసుకునే అవకాశం లేదన్నది అందరికీ తెలిసివచ్చింది. (చదవండి దివ్యఖుర్ఆన్ : 34:14)
గ్రహించవలసిన పాఠాలు
సరియైన విధంగా న్యాయం చేయాలంటే, తీర్పు చెప్పేముందు ఇరు పక్షాల వాదనను పూర్తిగా వినాలి. న్యాయం జరిగిందని ప్రజలు తెలుసుకునేలా ఉండాలి.
వయసులో చిన్నవాడైన తన కుమారుడి వివేకాన్ని గుర్తించి తండ్రి తన స్వంత నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు.
ప్రార్థనలతో సహా వివిధ పనులకు తగిన విధంగా సమయాన్ని విభజించు కోవాలి. ప్రవక్తలు, చాలామంది పాలకులు ఇహపరలోకాల విధులు నిర్వర్తించడానికి తగిన విధంగా సమయాన్ని విభజించుకునేవారు.
మనిషి ఆధ్యాత్మిక శక్తి అతని ధార్మిక విశ్వాసంలో ఉంది.
మంచి పనులు జాతిని పతనానికి గురికాకుండా కాపాడుతాయి. అయితే విదేశీ దాడుల నుంచి కాపాడుకోవడానికి సైనిక ఏర్పాట్లు అవసరం.
ఆత్మసమీక్ష : మనిషి తన ఆచరణల విషయంలో ఏమాత్రం అనుమానం వచ్చినా తక్షణం అల్లాహ్ వైపునకు మరలి మార్గదర్శనం కోసం ప్రార్థించాలి.
అల్లాహ్ సృష్టి పట్ల సులైమాన్ (అలైహిస్సలాం) చాలా శ్రద్ధ తీసుకునేవారు, చివరకు ఒక చీమకు కూడా హాని కలుగడాన్ని ఇష్టపడలేదు.
వివేకజ్ఞానాలు ఉన్న సులైమాన్ (అలైహిస్సలాం) కూడా ఒక పక్షి నుంచి నేర్చుకు న్నారు. ఆ పక్షి సలహా తీసుకుని ఆ ప్రకారం వ్యవహరించారు.
పరస్పర సంప్రదింపులు: బిల్కిస్ ఒక స్త్రీ, ఆమె ఒక పాలకురాలు కూడా. అయినప్పటికీ అల్లాహ్ ఆమె పాలనాశైలిని గుర్తించాడు. ఆమె ఇతరులతో సంప్రదింపులు జరిపింది, కాని వారిచ్చిన తప్పుడు సలహాలను పాటించ లేదు.
శాంతి అన్నది సంతోషాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. యుద్ధాలు, పోరాటాలు వినాశానికి కారణమవుతాయి.
లంచాలకు, అవినీతికి ఎన్నడూ లొంగరాదు.
సులైమాన్ (అలైహిస్సలాం) మరణం కూడా మానవాళికి గుణపాఠం వంటిది. మనిషి జిన్నులను కూడా పాలించగలడు. అవి మనిషిపై ఆధిపత్యాన్ని సాధించలేవు. వాటికి భవిష్యత్తును తెలుసుకునే శక్తి కాని, అగోచరాలను గ్రహించే శక్తి కాని లేవు.
బైబిలులో కింగ్స్.. చాప్టర్ 2లో సులైమాన్ (అలైహిస్సలాం) దేవుని ఆదేశాలకు విరుద్ధంగా 700 మంది మహిళలను వివాహం చేసుకున్నారని, 300 మంది మహిళలను ఉంచుకున్నారని, ఆ మహిళలు ఆయన్ను విగ్రహారాధన చేసేలా ప్రలోభపెట్టారని, ఆయన అనేక విగ్రహారాధనాలయాలు కట్టించాడని, తన భార్యల కోసం బలిపీఠాలు కట్టించాడని ఇలాంటి అనేక అసత్య ఆరోపణలు ఉన్నాయి. కాని దివ్యఖుర్ఆన్ ఈ అసత్య ఆరోపణలను, అలాగే బ్లాక్ మ్యాజిక్కు పాల్పడ్డాడన్న ఆరోపణలన్నింటినీ ఖండిస్తోంది. (చదవండి దివ్యఖుర్ఆన్ 2-102)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మక్కా విశిష్టత (Importance of Makkah) https://youtu.be/TLNWmdSKxEk [43 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, మక్కా నగరం యొక్క ఇస్లామీయ ప్రాముఖ్యత, ఘనత మరియు పవిత్రత గురించి వివరించబడింది. అల్లాహ్ తన సృష్టిలో కొన్ని ప్రదేశాలకు, కాలాలకు మరియు వ్యక్తులకు ఇతరులపై ఘనతను ప్రసాదించాడని, ఇది ఆయన సంపూర్ణ వివేకం మరియు శక్తికి నిదర్శనమని ప్రసంగం మొదలవుతుంది. మక్కా అల్లాహ్ కు అత్యంత ప్రియమైన ప్రదేశమని, అది మానవాళి కోసం నిర్మించబడిన మొట్టమొదటి ఆరాధన గృహం (కాబా) ఉన్న నగరమని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో స్పష్టం చేయబడింది. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం చరిత్ర, ఆయన తన భార్య హాజర్ మరియు కుమారుడు ఇస్మాయిల్ ను ఆ నిర్జన ప్రదేశంలో వదిలి వెళ్ళడం, జమ్ జమ్ బావి ఆవిర్భావం మరియు మక్కా నగరం ఎలా ఏర్పడిందో వివరించబడింది. మక్కా యొక్క పవిత్రత (హరమ్), అక్కడ వర్తించే ప్రత్యేక నియమాలు, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో దానికున్న ప్రాముఖ్యత కూడా చర్చించబడ్డాయి. చివరగా, కాబా మరియు హజర్ అల్-అస్వద్ (నల్లరాయి) గురించి ఉన్న కొన్ని అపోహలను తొలగించి, వాటి వాస్తవ ఇస్లామీయ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రసంగం ముగుస్తుంది.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వబరకాతుహు. అల్ హందులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహ్, అమ్మా బ’అద్.
أَعُوذُ بِاللَّهِ السَّمِيعِ الْعَلِيمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ శాపగ్రస్తుడైన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.
నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన (దైవ) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడాను. అందులో స్పష్టమయిన సూచనలున్నాయి. మఖామె ఇబ్రాహీం (ఇబ్రాహీం నిలబడిన స్థలం) ఉన్నది. అందులోకి ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు. (3:96-97)
సర్వ స్తోత్రములు, అన్ని రకాల పొగడ్తలు, ప్రశంసలు అన్నీ కూడా మనందరి ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. ఆయనే మనందరి ఏకైక, ఏ భాగస్వామి లేని నిజమైన ఆరాధ్యుడు. ఆ తర్వాత, లెక్కలేనన్ని సలాత్ సలాం, కరుణలు, శాంతులు ప్రత్యేకంగా చిట్టచివరి ప్రవక్త, దయామయ మహనీయ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఇతర ప్రవక్తలందరిపై కురియు గాక.
సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా! అల్లాహు త’ఆలా సర్వ సృష్టికర్త, సర్వ అధికారుడు, ఎలాంటి ఏ భాగస్వామి లేనివాడు. ఆయన కోరినది సృష్టిస్తాడు మరియు తన సృష్టిలో ఎవరికి ఏ హోదా, అంతస్తు, ఎవరికి ఎలాంటి ప్రత్యేకత ఇవ్వాలో ఇస్తాడు. అందులో అతన్ని అడిగేవారు ఎవరూ లేరు.
لَا يُسْأَلُ عَمَّا يَفْعَلُ وَهُمْ يُسْأَلُونَ ఆయన తన చేష్టలకు ఎవరికీ జవాబు చెప్పుకోవలసిన అవసరం లేదు, కాని వారే (మానవులే) జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. (21:23)
అల్లాహ్ చేసిన దానిలో అల్లాహ్ ను ప్రశ్నించేవాడు ఎవడూ లేడు.
وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు. (28:68)
అల్లాహు త’ఆలా కోరినది సృష్టిస్తాడు, యఖ్తార్, ఎన్నుకుంటాడు. అల్లాహు త’ఆలా ఈ విధంగా తన సృష్టిలో ఎన్నుకోవడంలో అద్వితీయుడు, అతనికి ఏ భాగస్వామి లేడు. అతడు ఒకరితో ఏదైనా సలహా, సంప్రదింపులు చేసి, వారి కోరికలను అనుసరించడానికి ఏదైనా లొంగిపోయి ఉంటాడు, న’ఊదు బిల్లాహ్, ఇలాంటి ప్రసక్తి ఏ మాత్రం లేదు. అయితే ఇలా అల్లాహు త’ఆలా అద్వితీయుడు కావడం, ఎన్నుకునే విషయంలో ఇది అతని యొక్క, అతని యొక్క రుబూబియ్యత్, ఆ అల్లాహ్ యొక్క సంపూర్ణ వివేకం మరియు అతడే సర్వశక్తిమంతుడు అన్నదానికి గొప్ప నిదర్శనం.
అల్లాహ్ యొక్క ఘనత మరియు ఆయన ఎంపికలు
అయితే అల్లాహు త’ఆలా కొందరి ప్రజలను మరికొందరిపై, కొందరు ప్రవక్తలను మరికొందరి ప్రవక్తలపై, కొన్ని ప్రాంతాలను మరికొన్ని ప్రాంతాలపై, కొన్ని నెలలను మరికొన్ని నెలలపై, కొన్ని రోజులను మరికొన్ని రోజుల పై, కొన్ని రాత్రులను మరికొన్ని రాత్రులపై, కొన్ని సత్కార్యాలను మరికొన్ని సత్కార్యాలపై ఘనత ప్రసాదించాడు. సర్వ సృష్టిలో, అంటే అల్లాహ్ తప్ప సర్వమూ వాటిలన్నింటిలోకెల్లా, వాటన్నిటిలోకెల్లా అత్యుత్తములు, అతి గొప్పవారు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. విశ్వాసాల్లో, సత్కార్యాల్లో, అన్ని విషయాల్లో అతి గొప్ప ఘనత గలది తౌహీద్, లా ఇలాహ ఇల్లల్లాహ్. అల్లాహ్ మాత్రమే ఏ భాగస్వామి లేకుండా ఆరాధ్యనీయుడు అని నమ్మడం, విశ్వసించడం, అలా ఆచరించడం.
ఇస్లామీయ 12 నెలల్లో రమదాన్ మాసానికి చాలా గొప్ప ఘనత ఉంది. రాత్రుల్లో లైలతుల్ ఖద్ర్ కి చాలా గొప్ప ఘనత ఉంది. మరియు రోజుల్లో, పగల్లో యౌమున్నహర్, ఖుర్బానీ చేసేటటువంటి రోజు, ఈదుల్ అద్ హా అది చాలా గొప్ప ఘనత గల రోజు. అయితే ప్రదేశాల్లో, ప్రాంతాల్లో అల్లాహ్ కు అత్యుత్తమ, అతి ప్రియమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే, మొట్టమొదటి స్థానంలో అది మక్కతుల్ ముకర్రమా.
మక్కతుల్ ముకర్రమా గురించి ఈ రోజు నేను జియోగ్రాఫికల్ పరంగా నేను మాట్లాడను. మక్కాకు అల్లాహు త’ఆలా ఈ రకంగా కూడా ఏ ఘనతలు ప్రసాదించి ఉన్నాడో దాని యొక్క వివరణలోకి వెళ్ళను. కానీ అల్లాహ్ కు అత్యంత ప్రియమైన ప్రదేశం ఇది అని మనకు అంటే మక్కా అని ముస్నద్ అహ్మద్ యొక్క హదీస్ ద్వారా కూడా తెలుస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు?
వల్లాహి, ఇన్నకి లఖైరు అర్దిల్లాహ్, వ అహబ్బు అర్దిల్లాహి ఇలల్లాహ్. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ఓ మక్కా, నీవు అల్లాహ్ భూమిలో అత్యంత ఖైర్, మేలు, శుభం ఉంది నీలో మరియు అల్లాహ్ కు, అల్లాహ్ యొక్క ఈ భూమిలో అత్యంత ప్రియమైన ప్రదేశం నీవు.
వలవ్ లా అన్నీ ఉఖ్రిజ్తు మిన్కి మా ఖరజ్తు. నన్ను ఈ మక్కా నుండి వెలివేయడం జరిగింది, లేదా అంటే నేను మక్కా నుండి వెళ్లి మదీనాలో స్థావరం అక్కడ వలస చేసి అక్కడ ఉండటం అలా చేసేవాడిని కాదు.
అల్లాహు త’ఆలా ఈ మక్కా నగరం, దీని యొక్క ప్రమాణాలు చేసి ఉన్నాడు, లా ఉక్సిము బిహాదల్ బలద్ అని.
అల్లాహు త’ఆలా ఈ సర్వ భూమండలంపై తన ఆరాధనా కేంద్రంగా నిర్మించడానికి ఆదేశం ఇచ్చినటువంటి ఆ ప్రదేశం మక్కాలో ఉంది. ఆ ఆయతులే నేను ఆరంభంలో చదివాను, సూరత్ ఆలి ఇమ్రాన్, సూర నెంబర్ 3, ఆయత్ నెంబర్ 95.
నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన (దైవ) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడాను. (3:96)
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో అబూ దర్ రదియల్లాహు త’ఆలా అన్హు ప్రశ్నించారు, అయ్యు మస్జిదిన్ వుది’అ ఫిల్ అర్ది అవ్వల్. ప్రప్రథమంగా ఈ భూమండలంపై నిర్మించబడినటువంటి మస్జిద్ ఏ మస్జిద్ అని అడిగినప్పుడు, అల్ మస్జిదుల్ హరాం. కాబతుల్లాహ్, దాని చుట్టూ ఉన్నటువంటి మస్జిద్-ఎ-హరాం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. సహీ బుఖారీ, సహీ ముస్లిం లోని హదీస్.
సోదర మహాశయులారా, ఇబ్రాహీం అలైహిస్సలాం కాలం కంటే ముందు ఎందరో ప్రవక్తలు ఈ ప్రపంచంలో వచ్చారు. ఆదం అలైహిస్సలాం ఆది మానవులతో పాటు ప్రవక్త కూడా. ఆదం అలైహిస్సలాం తర్వాత ఇద్రీస్, షీత్ అలైహిస్సలాం లాంటి ప్రవక్తలు కూడా వచ్చారు. కానీ షిర్క్ ను ఖండిస్తూ, తౌహీద్ ను ధ్రువపరుస్తూ, తౌహీద్ వైపునకు ప్రజలను ఆహ్వానించడానికి వచ్చినటువంటి మొట్టమొదటి రసూల్ నూహ్ అలైహిస్సలాం. ఆ తర్వాత హూద్ అలైహిస్సలాం, సాలిహ్ అలైహిస్సలాం ఎందరో వచ్చారు. మనకు కొన్ని ఉల్లేఖనాల ద్వారా వారు కూడా హజ్ చేశారు అన్నటువంటి విషయం తెలుస్తుంది. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఇచ్చిన ఆదేశం ప్రకారం నూహ్ అలైహిస్సలాం కాలంలో వచ్చిన తూఫాన్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే కాబతుల్లాహ్ ఉన్నదో దాని చుట్టుపక్కల ఆ మక్కా నగరం, ఆ కాబతుల్లాహ్ చుట్టుపక్కల ఉన్నటువంటి పర్వతాలు, ఆ పర్వతాలు ఉండినవి కానీ కాలాల తరబడి ఎవరూ కూడా అక్కడ వచ్చి నివసించేవారు కాదు.
అయితే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ అతని యొక్క పనులలో ఎలాంటి హిక్మత్, ఔచిత్యాలు ఉంటాయో, ఎలాంటి వివేకాలు ఉంటాయో అన్నీ మనము గ్రహించలేము. కేవలం అల్లాహు త’ఆలా తన దయ కరుణతో తెలిపిన కొన్ని విషయాలు తప్ప.
అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం మొదటి భార్య సారాతో ఏ సంతానము కలగలేదు. ఆ తర్వాత రెండో భార్య హాజర్ తో అల్లాహు త’ఆలా ఇస్మాయిల్ అలైహిస్సలాం లాంటి ఒక సుపుత్రున్ని ప్రసాదిస్తాడు. ఇంకా పాలు త్రాగే వయసులోనే ఉంటాడు. అప్పుడు అల్లాహ్ యొక్క అనుమతితో ఇబ్రాహీం అలైహిస్సలాం పాలు త్రాగే బాలుడైన ఇస్మాయిల్ మరియు అతని యొక్క తల్లి హాజర్ ఇద్దరినీ ఈ ప్రాంతానికి తీసుకువచ్చి వదిలేస్తారు. అదే విషయాన్ని స్వయంగా ఖురాన్ లో తెలిపాడు. స్వయంగా ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేస్తూ అంటున్నారు, ఇంద బైతికల్ ముహర్రమ్. ఓ ప్రభువా, నేను నా యొక్క భార్య మరియు కుమారున్ని ఇక్కడికి తీసుకువచ్చి వదిలాను. ఎక్కడ? గైరి జీ జర్’ఇన్. అక్కడ ఎలాంటి ఒక చెట్టు లేదు, ఒక మొక్క లేదు. మరియు అక్కడ నీటి యొక్క సౌకర్యం కూడా లేదు. కానీ అల్లాహు త’ఆలా చూడడానికి ఇలాంటి ఈ పరీక్ష పెట్టినా, ఇక ముందుకు ఇక్కడ ఈ నగరాన్ని ప్రజలు వచ్చి నివసించడానికి సౌలభ్యంగా ఉండడానికి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఏర్పాటు చేశాడు.
ఇక్కడ సహీ బుఖారీలో ఆ వివరణ ఏదైతే వచ్చి ఉందో, ఖురాన్ యొక్క తఫ్సీర్ మరియు సహీ బుఖారీలో వచ్చిన హదీసులు, వాస్తవంగా పూర్తి మనం వినాలి. అందులో తండ్రికి, భార్యకు, భర్తకు ప్రతి ఒక్కరికి మన సమాజంలోని ప్రతి ఒక్కరికి ఎన్నో గుణపాఠాలు ఉన్నాయి. గమనించండి. ఆ గుణపాఠాల గురించి ఇప్పుడు నేను వివరాలు ఇవ్వలేను ఎందుకంటే నా అంశం ఫద్లు మక్కా, మక్కా విశిష్టత ఉంది. కానీ అక్కడ చిన్న విషయం ఒకటి ఏం తెలియజేస్తున్నానంటే, హాజర్ అలైహస్సలాం తన కుమారుడు పాలు త్రాగే వాడు, ఏమైనా ఎదిగినటువంటి బాలుడు కాదు. తీసుకొని ఆ ప్రదేశంలో ఉండి ఇబ్రాహీం అలైహిస్సలాం అక్కడి నుండి వెళ్లిపోతారు. ఇబ్రాహీం, ఎవరి ఆధారంగా మమ్మల్ని వదిలి వెళ్తున్నావు అని అంటే, అల్లాహ్ వైపున చూపిస్తే, ఆ తల్లి హాజర్ ఎంత గొప్ప మాట అంటుంది, ఎంతటి గొప్ప విశ్వాసం, అల్లాహ్ పై ఎలాంటి నమ్మకం, ఎలాంటి ప్రగాఢమైన బలమైన విశ్వాసమో గమనించండి. “అలాంటప్పుడు అల్లాహు త’ఆలా మమ్మల్ని వృధా చేయడు.” అక్కడి నుండి మొదలవుతుంది మక్కా నగరం. ఆ తర్వాత జుర్హుమ్ వంశానికి సంబంధించిన వారు వస్తారు.
అయితే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అదే మక్కాలో జన్మించారు. అక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వహీ రావడం ప్రారంభమైంది. సుమారు 53 సంవత్సరాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో జీవించారు. ప్రవక్త పదవి పొందడానికి 40 సంవత్సరాలు ముందు, ప్రవక్త పదవి పొందిన తర్వాత 13 సంవత్సరాలు. అక్కడే అనేక మంది గొప్ప సహాబాలు వచ్చారు. ఆ సహాబాల యొక్క ప్రస్తావన ముహాజిరీన్ అని, వస్సాబిఖూనల్ అవ్వలూన్ అని అల్లాహు త’ఆలా సూరతు తౌబాలో కూడా వారిని ప్రశంసిస్తూ ప్రస్తావించాడు.
అల్లాహు త’ఆలా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కా నుండే బైతుల్ మఖ్దిస్, బైతుల్ మఖ్దిస్ నుండి మళ్ళీ ఆకాశాల వైపునకు, గగన ప్రయాణం, ఇస్రా వ మి’రాజ్ జరిగినది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ నగరాన్ని చాలా ప్రేమించేవారు. బుఖారీ, ముస్లిం యొక్క హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చిన తర్వాత అక్కడ వారి యొక్క సహాబాలు, వారి యొక్క ఆరోగ్యాలు కొంచెం అనారోగ్యానికి గురి అవ్వడం, అక్కడి యొక్క వాతావరణం అనుకూలంగా ఉండకపోవడం, ఆ సందర్భంలో ప్రవక్త దుఆ ఏం చేశారు? అల్లాహుమ్మ హబ్బిబ్ ఇలైనల్ మదీనత కమా హబ్బబ్త మక్కత అవ్ అషద్ద్. ఓ అల్లాహ్, మక్కా పట్ల ఎలాంటి ప్రేమ మాకు నీవు కలుగజేశావో, అలాంటిది అంతకంటే ఎక్కువ ప్రేమ నీవు మాకు మదీన విషయంలో కూడా… సోదర మహాశయులారా, సోదరీమణులారా, మనం మక్కా గురించి తెలుసుకుంటున్నాము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ప్రేమించేవారని.
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేశారు ఈ మక్కా నగరం గురించి. ఇబ్రాహీం అలైహిస్సలాం చేసిన దుఆలను గమనించండి, మక్కా యొక్క విశిష్టతను మీరు గ్రహించండి. ఒక దుఆ చేశారు, సూరత్ ఇబ్రాహీం 37,
فَاجْعَلْ أَفْئِدَةً مِّنَ النَّاسِ تَهْوِي إِلَيْهِمْ ఫజ్’అల్ అఫ్’ఇదతమ్ మినన్నాసి తహ్వీ ఇలైహిమ్. కనుక ప్రజలలో కొందరి మనసులు వారి వైపుకు మొగ్గేలా చేయి (14:37)
ఓ అల్లాహ్, ప్రజల యొక్క హృదయాలు, ప్రజల యొక్క హృదయాలు ఈ మక్కా వైపునకు తిరిగి రావాలి. మక్కా యొక్క ప్రేమ వారి హృదయాల్లో నాటుకోవాలి. అలాంటి భాగ్యం నీవు కలుగజేయి.
అంతేకాదు, సూరతుల్ బఖరా ఆయత్ నెంబర్ 126 లో తెలుస్తుంది, ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేశారు,
وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ اجْعَلْ هَٰذَا بَلَدًا آمِنًا రబ్బిజ్’అల్ హాదా బలదన్ ఆమినా. నా ప్రభూ! నీవు ఈ ప్రదేశాన్ని శాంతి నగరంగా చెయ్యి. (2:126)
ఓ మా ప్రభువా, ఈ మక్కా నగరాన్ని నీవు అమ్న్ ఓ అమాన్, శాంతి నిలయంగా చేయు. అల్లాహు అక్బర్. అల్లాహు త’ఆలా దానిని ఎలా శాంతి నిలయంగా చేశాడో గమనించండి.
ఏమిటీ, మేము హరమ్ను (మక్కా పుణ్యక్షేత్రాన్ని) సురక్షితమైన క్షేత్రంగా చేయటాన్ని వారు చూడటం లేదా? మరి (చూడబోతే) వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఎగరేసుకుపోబడుతున్నారు. (29:67)
వారు గమనించడం లేదా? మేము హరమ్ ని ఎంత శాంతి నిలయంగా చేశాము, ఎంత ప్రశాంతతమయిన ప్రదేశంగా చేశాము, ఈ మక్కా చుట్టుపక్కల ఉన్నవారు దొంగతనాలు, దోపిడీలు, లూటీలు ఇంకా కిడ్నాప్ లు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ మక్కా వారు ఎంత ప్రశాంతంగా ఉంటున్నారు. ఈ సూరత్ అన్ కబూత్ లో ఉన్నటువంటి ఆయత్ మీరు ఒకవేళ వినకుంటే, చిన్న సూరా మీకు కూడా గుర్తు ఉంది కదా,
ఖురైషులను అలవాటు చేసిన కారణంగా,(అంటే) చలికాలపు, ఎండాకాలపు ప్రయాణాలకు వారిని అలవాటు చేసిన కారణంగా,వారు ఈ (కాబా) గృహం యెక్క ప్రభువునే ఆరాధించాలి.ఆయనే వారికి ఆకలిగొన్నప్పుడు అన్నం పెట్టాడు. భయాందోళనల స్థితిలో భద్రత కల్పించాడు. (106:1-4)
చుట్టుపక్కన మక్కా నగరానికి చుట్టుపక్కన ఉన్న ప్రజలందరూ కూడా భయాందోళనలో జీవితాలు గడుపుతూ ఉంటారు. కానీ మక్కాలో ఉండే వారు, అల్లాహు త’ఆలా వారికి ఎంతటి గొప్ప ప్రశాంతత, అమ్న్ ఓ అమాన్ ప్రసాదించాడు. ఇమాం ఖుర్తుబి రహిమహుల్లాహ్ తమ తఫ్సీర్ లో తెలియజేశారు, ఇన్న మక్కత లమ్ తజల్ హరమన్ ఆమినన్ మినల్ జబాబిరతి వ మినజ్ జలాజిల్. అల్లాహు త’ఆలా మక్కాను చాలా కాపాడాడు. అక్కడ ఎంతటి గొప్ప శాంతి ప్రసాదించాడంటే ఇంతటి వరకు, ఇప్పటి వరకు ఏ దుర్జన్యపరుడైన రాజు వశపరచుకోలేకపోయాడు మరియు అక్కడ ఇప్పటి వరకు ఎలాంటి భూకంపాలు కూడా రాలేదు.
అల్లాహు త’ఆలా సూరత్ ఆలి ఇమ్రాన్ ఆయత్ నెంబర్ 97 లో ఈ ఆయత్ ఏదైతే స్టార్టింగ్ లో తిలావత్ చేయబడిందో, అక్కడ ఈ అమ్న్ ఓ అమాన్, ప్రశాంతత, శాంతి గురించి ఎంత గొప్ప విషయం చెప్పాడు, వమన్ దఖలహు కాన ఆమినా. ఎవరైతే ఈ మక్కా నగరం, మస్జిదుల్ హరాం, ఇందులో ప్రవేశిస్తాడో అతనికి శాంతియే శాంతి ఉంది.
కనుక చూడండి, అల్లాహు త’ఆలా ఇక్కడ ఈ మక్కా నగరానికి ఇంతటి గౌరవం ఏదైతే ప్రసాదించాడో అది ఎప్పటి నుండి? ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేదా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కాలం నుండి కాదండి. ఎప్పటి నుండి? అల్లాహు త’ఆలా భూమ్యాకాశాలను పుట్టించాడో అప్పటి నుండి. సహీ బుఖారీ లోని హదీస్, ఇన్నల్లాహ హర్రమ మక్కత యౌమ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్. ఫహియ హరామున్ బి హురామిల్లాహి ఇలా యౌమిల్ ఖియామా. అల్లాహు త’ఆలా భూమ్యాకాశాలను పుట్టించినప్పటి నుండి మక్కాకు ఒక ప్రత్యేక గౌరవం ప్రసాదించాడు. అల్లాహు త’ఆలా ఈ గౌరవాన్ని ప్రళయ దినం నాటికి ఉంచుతానని కూడా వాగ్దానం చేసి ఉన్నాడు.
అయితే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు ఫతహ్-ఎ-మక్కా సందర్భంలో ఏ కొన్ని క్షణాల గురించి అయితే అనుమతి ఇవ్వడం జరిగిందో, ఆ విషయాన్ని కూడా మనం గమనించామంటే చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ చాలా స్పష్టంగా చెప్పారు, ఇంతకుముందు ఎన్నడూ కూడా ఇక్కడ ఏ రక్తపాతం గురించి అనుమతి లేకుండినది, ప్రళయం వరకు కూడా లేదు అని.
అంతేకాదు సోదర మహాశయులారా, ఇబ్రాహీం అలైహిస్సలాం దాని చుట్టుపక్క ప్రాంతాలకు ఎన్నో కిలోమీటర్ల వరకు ప్రశాంతత ఉండాలని అల్లాహు త’ఆలా తో దుఆ ఏదైతే చేశారో, సహీ బుఖారీ, సహీ ముస్లిం లో వచ్చి ఉంది, ఇన్న ఇబ్రాహీమ హర్రమ మక్కా. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడి ప్రశాంతత గురించి ఇచ్చిన బోధనల్లో, సహీ బుఖారీ మరియు ముస్లిం లో వచ్చిన ఈ హదీస్ కూడా చాలా ప్రాముఖ్యత గలది. లా యహిల్లూ లిమ్ రి’ఇన్ యు’మిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్, అన్ యస్ఫిక బిహా దమా. అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని విశ్వసించే ఏ వ్యక్తి కూడా అక్కడ రక్తం ప్రవహింప చేయడు, రక్తపాతానికి ఒడిగట్టడు. అంతేకాదు, సహీ ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ ను గమనించండి, లా యహిల్లూ లి అహదికుమ్ అన్ యహ్మిల బి మక్కత అస్సిలాహ్. మీరు మక్కాలో నడుస్తున్నప్పుడు ఎలాంటి ఆయుధాలు ధరించి అక్కడ నడవడం ఇది సమంజసం కాదు.
అంతేకాదండి, అల్లాహు అక్బర్, మక్కాకు అల్లాహు త’ఆలా ప్రసాదించినటువంటి విశిష్టత కేవలం మానవులకే కాదు, అక్కడి యొక్క ఆ ప్రాంతానికి, అక్కడ వచ్చే, తిరిగే అటువంటి పక్షులకు, అక్కడ పెరిగే అటువంటి వృక్షాలకు, ఇంకా ఎవరి నుండి ఏదైనా వస్తువు తప్పిపోయి పడిపోతే దానికి కూడా ఎంతటి మర్యాద అనండి, గౌరవం అనండి, ఎంతటి రెస్పెక్ట్ ఉందో మనకు సహీ హదీసుల్లో తెలుస్తుంది.
సహీ బుఖారీ మరియు ముస్లిం లో వచ్చిన హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అక్కడి వృక్షాలను నరికేయరాదు. అక్కడ వేట, షికారీ చేయరాదు. మరియు ఎవరికైనా ఏదైనా పడిపోయిన వస్తువు దొరికినా, దానిని అతను ఎత్తుకోకూడదు. ఎవరైనా దాన్ని తీసుకున్నాడంటే, సంవత్సరం అయినా గానీ తన వద్ద ఉంచి, భద్రంగా అది ఎవరిది అని వెతుకుతూ ఉండి, అతని వరకు చేర్పించే ప్రయత్నం చేయాలి. అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా?
అందు గురించే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ సందర్భంలో, ఏ సందర్భంలో అండి? ప్రవక్త ఏదైతే హజ్ చేశారో, లక్ష కంటే పైగా సహాబాలు ప్రవక్త వెంట ఉన్నారో, అందులో హ్యూమానిటీ కి సంబంధించిన, మానవత్వానికి సంబంధించిన గొప్ప నియమ, నిబంధనలు, సూత్రాలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే తెలిపారో, ఒక్కసారి ఈ హదీస్ ను గమనించండి. సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం లో వచ్చిన హదీస్,
ఇన్న దిమా అకుమ్, వ అమ్వాలకుమ్, వ అ’రాదకుమ్, అలైకుమ్ హరామున్, క హుర్మతి యౌమికుమ్ హాదా, ఫీ బలదికుమ్ హాదా, ఫీ షహ్రికుమ్ హాదా.
ప్రజలారా, ఈ మక్కా నగరం ఎంత గౌరవ, మర్యాద గల ప్రదేశమో తెలుసు కదా? ఇప్పుడు మనం ఏ నెలలో ఉన్నామో, జిల్ హిజ్జా నెల, ఇది కూడా ఎంతటి గౌరవ, ప్రాముఖ్యత గల నెలనో తెలుసు కదా? మరియు ఈ రోజు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అరఫాలో ప్రసంగిస్తున్నారు. ఈ రోజు కూడా ఎంతటి గౌరవప్రదమైన రోజో తెలుసు కదా? ఇక గౌరవప్రదమైన రోజు, గౌరవప్రదమైన నెల, గౌరవప్రదమైన ప్రదేశంలో ఉండి, వీటన్నింటిని గుర్తిస్తూ నేను చెబుతున్నాను శ్రద్ధగా వినండి. మీ యొక్క రక్తం అంటే మీ యొక్క ప్రాణం, మీ యొక్క ధనం, మీ యొక్క పరువు, మానాలు కూడా చాలా గౌరవమైనవి, విలువ గలవి. వాటిని ఎవరూ కూడా అక్రమంగా దాడి చేయడం, ఒకరిని నరికేయడం, హత్య చేయడం, ఒకరి ధనం పై అన్యాయంగా దోచుకునే ప్రయత్నం చేయడం, ఒకరి యొక్క మానవ పరువులో ఏదైనా జోక్యం చేసుకోవడం, హరాం, ఎంతమాత్రం కూడా దీనికి అనుమతి లేదు. ఇక్కడ మీరు గమనించండి, ఒక వ్యక్తిని తిట్టకూడదు, ఒక వ్యక్తిని హత్య చేయకూడదు, ఒకరి సామాను, ఒకరి యొక్క వస్తువులను దొంగలించకూడదు అన్న విషయాన్ని ప్రవక్త, క బలదికుమ్ హాదా, మీ యొక్క ఈ బలద్, ఈ నగరం యొక్క గౌరవం ఎలా ఉందో అంతకంటే గొప్పగా ఉంది అన్నటువంటి విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గుర్తు చేస్తున్నారు.
మక్కా గురించి అపోహలు
అందుకొరకే, ముస్లిమేతరులలో ఉన్నటువంటి మరొక అపోహ ఏమిటంటే, ఈ కాబతుల్లాహ్, న’ఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అసల్ ఒక విగ్రహాల గృహం అని. అయితే హదీస్ తో దీనిని వారు నిరూపించే ప్రయత్నం చేస్తారు, ఫతహ్-ఎ-మక్కా సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విగ్రహాలను అయితే పడేశారో, దానిని తీసుకుంటారు. ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి యొక్క విగ్రహాలు, వాటిని ప్రస్తావిస్తారు. కానీ మనం ఒకవేళ నిజంగా చూస్తే, ఖురాన్ ఆయతులు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి, మానవ చరిత్ర, ఏ చరిత్రనైతే భద్రంగా ఉందో దానిలో తెలుస్తున్న విషయం ఏమిటి? మొట్టమొదటి మానవుడు ఆది మానవుడు, ఆదం అలైహిస్సలాం, వారి యొక్క సంతానం కాలాల తరబడి షిర్క్ కు పాల్పడలేదు.
كَانَ النَّاسُ أُمَّةً وَاحِدَةً మానవులందరూ ఒకే ఒక సమాజంగా ఉండేవారు. (2:213)
ఒకే ఒక ధర్మం, ఏకదైవారాధనపై అందరూ నిలిచి ఉన్నారు. ఎంతవరకు? ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు, వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువగా. ఆదం అలైహిస్సలాం చనిపోయిన తర్వాత వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువగా. ఆ తర్వాత మెల్లి మెల్లిగా వారిలో షిర్క్ అనేది పాకింది. దానిని ఖండించడానికే ప్రవక్తలను పంపడం జరిగింది. కాబతుల్లాహ్, దీని యొక్క పునాది తౌహీద్ పై, ఏకదైవారాధనపై ఉండినది. అమర్ బిన్ లుహై మొట్టమొదటి చెడ్డ వ్యక్తి, అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని నరకంలో చూసినట్లు కూడా హదీస్ లో తెలియపరిచారు. అతడు మొట్టమొదటిసారిగా షిర్క్ కు పునాది వేశాడు. దానిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించారు, షిర్క్ నుండి పరిశుభ్రం చేశారు కాబా గృహాన్ని. కానీ ఇది వాస్తవానికి విగ్రహాలయం మాత్రం కాదు. సోదర మహాశయులారా, చివరిలో సూరతుల్ నమ్ల్ ఆయత్ 91 ద్వారా మన యొక్క ఈ నాటి ప్రసంగాన్ని సమాప్తం చేద్దాము.
నేను ఈ నగరం (మక్కా) ప్రభువును మాత్రమే ఆరాధిస్తూ ఉండాలని నాకు ఆదేశించబడింది. ఆయన దీన్ని పవిత్ర మైనదిగా చేశాడు. అన్నింటికీ ఆయనే యజమాని. నేను విధేయులలో ఒకడిగా ఉండాలని కూడా నాకు ఆజ్ఞాపించబడింది. (27:91)
నాకు ఆదేశం ఇవ్వడం జరిగింది ఈ నగరం యొక్క ప్రభువుని ఆరాధించాలి అని. ఆయనే ఈ నగరానికి చాలా గొప్ప గౌరవప్రదమైన స్థానం కలుగజేశాడు. అతనికే సర్వాధికారం ఉంది, సర్వ సర్వమూ అతని యొక్క ఆధీనంలో ఉంది. మరియు నేను విధేయులలో, ముస్లింలలో ఉండాలి, అయి ఉండాలి అని కూడా నాకు ఆదేశం ఇవ్వడం జరిగింది.
అయితే ఈ ఆయత్ ను చివరిలో ప్రస్తావించడానికి ముఖ్య కారణం ఏంటి? మనం ఎప్పుడైనా అల్లాహ్ ప్రసాదించిన గౌరవాన్ని, అది ప్రాంతానికి సంబంధించినా, ఏ వ్యక్తికి సంబంధించినా, ఏదైనా నెలకు సంబంధించినా, ఏదైనా కార్యానికి సంబంధించినా ప్రస్తావిస్తున్నప్పుడు దాని యొక్క గొప్పతనం, దాని యొక్క గౌరవంలో మనం అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని మర్చిపోకూడదు. మనం వాస్తవంగా అల్లాహ్ ను గౌరవిస్తున్నాము. అందుకొరకే అల్ హుబ్బు ఫిల్లాహ్ వల్ బుగ్దు ఫిల్లాహ్. అల్లాహ్ ఏ ఏ విషయాలను ప్రేమిస్తాడో వాటన్నిటినీ ప్రేమించడం. అల్లాహ్ ఏ ఏ విషయాలను ద్వేషిస్తాడో వాటన్నిటినీ ద్వేషించడం మన విశ్వాసంలోని ఒక ముఖ్యమైన భాగం. అర్థమైంది కదా?
అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో నేను దుఆ చేస్తున్నాను. ఈ మక్కా విశిష్టత గురించి ఏ విషయాలైతే మనం తెలుసుకున్నామో దాని యొక్క గౌరవాన్ని కాపాడే అటువంటి భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. దీని విషయంలో ఎవరు ఏ తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారో అల్లాహ్ వారికి హిదాయత్ ప్రసాదించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.