1.6 బహిష్టు ప్రకరణం | మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  
బహిస్టు ప్రకరణం [PDF]

168 – حديث عَائِشَةَ، قَالَتْ: كَانَتْ إِحْدَانَا إِذَا كَانَتْ حَائِضًا، فَأَرادَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ يُبَاشِرَهَا، أَمَرَهَا أَنْ تَتَّزِرَ فِي فَوْرِ حَيْضَتِهَا، ثُمَّ يُبَاشِرُهَا قَالَتْ: وَأَيُّكُمْ يَمْلِك إِرْبَهُ كَمَا كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَمْلِكُ إِرْبَهُ
__________
أخرجه البخاري في: 6 كتاب الحيض: 5 باب مباشرة الحائض

168. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ అయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- “మాలో ఎవరైనా బహిష్టు అయినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమె దేహానికి దేహం ఆనించ దలచుకుంటే, ఆమెను (లంగోటి లాంటి) లోఉడుపును కట్టుకోమని ఆదేశించేవారు. ఆ తరువాత ఆమె దేహానికి దేహం ఆనించేవారు… లైంగికవాంఛపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కున్న ఇంతటి నిగ్రహశక్తి మీలో ఎవరికైనా ఉందా?” అని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) అన్నారు.

[సహీహ్ బుఖారీ : 6వ ప్రకరణం – హైజ్, 5వ అధ్యాయం – ముబాషిరతిల్ హాయిజ్]

169 – حديث مَيْمُونَةَ، قَالَتْ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا أَرَادَ أَنْ يُبَاشِرَ امْرَأَةً مِنْ نِسَائِهِ، أَمَرَهَا فَاتَّزَرَتْ وَهِيَ حَائِضٌ
__________
أخرجه البخاري في: 6 كتاب الحيض: 5 باب مباشرة الحائض

169. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ మైమూన (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన భార్యలలో ఎవరితోనైనా దేహానికి దేహం ఆనించ దలచుకున్నప్పుడు, * ఆమె బహిష్టు అయి ఉంటే, (లంగోటిలాంటి) లో ఉడుపు కట్టుకోమని ఆమెను ఆదేశించేవారు.

[సహీహ్ బుఖారీ : 6వ ప్రకరణం, – హైజ్, 5వ అధ్యాయం]

* ఇక్కడ మూలభాషలో ‘ముబాషిరత్‘ అనే పదం వచ్చింది. అంటే శరీరంతో శరీరం కలపడం అని అర్థం. అంతేగాని ఇక్కడ సందర్భాన్ని బట్టి లైంగిక సంపర్కం అనే భావం రాదు. ఎందుకంటే దివ్యఖుర్ఆన్ఆ “రుతుస్రావం గురించి ఆజ్ఞ ఏమిటని అడుగుతున్నారు వారు, ఆదొక అపరిశుద్ధావస్థ అనీ, ఆ స్థితిలో భార్యలకు దూరంగా ఉండాలని, వారు (స్నానం చేసి) పరిశుభ్రం కానంత వరకు వారి దగ్గరకు వెళ్ళకూడదని చెప్పెయ్యి” అని ఉంది. (2:222)

ప్రార్థనల (దుఆ) పుస్తకం (కితాబుద్దుఆ) – ముహమ్మద్ ఇక్బాల్ కీలానీ [పుస్తకం]

ప్రార్థనల పుస్తకం (కితాబుద్దుఆ)
సంకలనం: ముహమ్మద్ ఇక్బాల్ కీలానీ
అనువాదం: బద్రుల్ ఇస్లాం
ప్రకాశకులు:  హదీస్ పబ్లికేషన్స్, హైదరాబాద్, ఏ.పి.

ప్రార్థనల పుస్తకం (కితాబుద్దుఆ)
సంకలనం: ముహమ్మద్ ఇక్బాల్ కీలానీ
అనువాదం: బద్రుల్ ఇస్లాం
ప్రకాశకులు: హదీస్ పబ్లికేషన్స్, హైదరాబాద్, ఏ.పి.

[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [205 పేజీలు] [డెస్క్ టాప్ వెర్షన్ బుక్] [26.7 MB]

కలామే హిక్మత్ (వివేక వచనం) -1 [పుస్తకం]

కలామే హిక్మత్ (వివేక వచనం) -1 [పుస్తకం]

డౌన్లోడ్ – కలామే హిక్మత్ (వివేక వచనం) -1
రచయిత : సఫీ అహ్మద్ మదనీ
[88 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

ముందుమాట – [డౌన్లోడ్ PDF]

దరూద్ షరీఫ్ శుభాలు – ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

దరూద్ షరీఫ్ శుభాలు – ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

ఉర్దూ మూలం : మౌలానా ముహమ్మద్ ఇక్బాల్ కీలానీ
తెలుగు అనువాదం : బద్రుల్ ఇస్లాం
ప్రకాశకులు : హదీస్ పబ్లికేషన్స్

డెస్క్ టాప్ వెర్షన్
[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [64 పేజీలు] [ఫైల్ సైజు: 3.24 MB]

మొబైల్ ఫ్రెండ్లీ వెర్షన్
[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [64 పేజీలు] [ఫైల్ సైజు: 12.5 MB]

విషయ సూచిక

  • రూపు రేఖలు
  • వంశధార
  • ప్రవక్త జీవిత చరిత్ర (టూకీగా)
  • తొలిపలుకులు [PDF] [8p]
  1. దరూద్ షరీఫ్ భావం [PDF] [1p]
  2. దైవ ప్రవక్తలందరిపై దరూద్ పంపాలి [PDF]
  3. దరూద్ షరీఫ్ ప్రాశస్త్యం [PDF] [7p]
  4. దరూద్ షరీఫ్ ప్రాముఖ్యత [PDF] [4p]
  5. మస్నూన్ దరూద్ వాక్యాలు [PDF] [9p]
  6. దరూద్ షరీఫ్ పఠించే సందర్భాలు [PDF] [8p]
  7. బలహీనమైన కాల్పనికమైన హదీసులు [PDF] [4p]

బిస్మిల్లా హిర్రహ్మానిర్రహీం

అల్హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, అమ్మాబాద్.

జీవితంలో కాలం అత్యంత విలువైనది. కాలప్రవాహం నిరంతరంగా, నిరాఘాటంగా చాలా వేగంతో ప్రవహిస్తూ ఉంటుంది. కాలచక్రం మన మీద దయతలచి ఎక్కడా ఆగకుండా ముందుకు సాగి పోతూ మనల్ని జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ఆపదలను సహించగలిగేలా చేస్తున్నది. గడిచే కాలం క్షతగాత్ర హృదయాలకు ఉపశమనాన్నీ, ఊరటనూ కలిగిస్తున్నది. ఒకవేళ ఈ కాల ప్రవాహమే గనక ఆగిపోతే భూమిపై మానవ ఉనికికే ప్రమాదం వాటిల్లుతుంది. ప్రతి మనిషీ ఓ శోకమూర్తిలా, కనిపిస్తాడు.

కొన్ని సంవత్సరాల క్రితం నా జీవితం కాల ప్రవాహంలోని సహజమైన ఎగుడు దిగుళ్ళను దాటుకుంటూ అతి వేగంగా ముందుకు సాగిపోతున్న సమయంలో హఠాత్తుగా కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు జరిగాయి. వాటి మూలంగా నాకు రాత్రివేళ నిద్ర, పగటిపూట మనశ్శాంతి కరువయ్యాయి. దైనందిన కార్యకలాపాలన్నీ అస్తవ్యస్తమయిపోయాయి. ఇది నేను “నమాజ్ పుస్తకం” సంకలనం చేస్తున్న కాలం నాటి మాట.

ఈ రోజు దాని గురించి ఆలోచిస్తేనే చెప్పలేని ఆశ్చర్యం కలుగుతున్నది. అల్ప జ్ఞాని, పరిమిత సామర్థ్యం కలవాణ్ణి అయిన నేను ఇంత గొప్ప కార్యం ఎలా చేయగలిగానా అనిపిస్తోంది. వాస్తవం ఏమిటంటే నేను దైవప్రవక్త ప్రవచనాల సంకలనం, క్రోడీకరణ పనిలో పూర్తిగా లీనమయిపోయినందువల్ల బయటి ప్రపంచంలోని అల్లకల్లోల వాతావరణం నా మీద ప్రభావం చూపలేకపోయింది. ఆ విధంగా నేను ఎన్నో సమస్యల నుండి, బాధల నుండి సురక్షితంగా ఉండగలిగాను. అంతేకాదు, నా కార్యక్రమంలోనూ చెప్పదగిన ఆటంకం ఏమీ ఏర్పడలేదు. ఒకవేళ ఆ సమయంలో నేను నమాజ్ పుస్తకం పనిలో నిమగ్నుణ్ణి ఉండకపోయినట్లయితే, ఈ రోజు నా జీవితపు రూపురేఖలే మారిపోయి ఉండేవి. చెప్పొచ్చేదేమిటంటే దైవప్రవక్త ప్రవచనాలకు సంబంధించిన ఈ సంక్షిప్త సంకలనం-జీవితపు అత్యంత కఠినమైన, క్లిష్టతరమైన ప్రయాణంలో నాకు ఓ స్నేహితుడిగా, సానుభూతిపరుడిగా దోహదపడింది. నా దుఃఖంలో పాలు పంచుకున్నది. నా వల్ల ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు జరిగి ఉన్నప్పటికీ అల్లాహ్ నన్నింతగా కరుణిస్తున్నాడంటే ఇదంతా దరూద్ షరీఫ్ శుభాల మూలంగానే జరిగివుంటుందని నా నమ్మకం. హదీసులు చదువుతూ రాస్తూ ఉన్నప్పుడు మాటిమాటికీ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, సత్యప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పేరు వచ్చినప్పుడల్లా ఆయన మీద అల్లాహ్ శాంతీశ్రేయాలు కురవాలని ప్రార్థించినందుకు నాకా మహాభాగ్యం లభించి ఉండవచ్చు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచరుడయిన ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు)తో అన్న మాటలు అక్షరాలా సత్యం. “కాబ్! నువ్వు నీ మొత్తం నీ ప్రార్థనను నా దరూద్ కోసం ప్రత్యేకించుకో. ఇహపరాల్లో నీకు కలిగే దుఃఖాలన్నిటికీ అది ఉపశమనంగా పనికి వస్తుంది” (తిర్మిజీ షరీఫ్).

అల్లాహ్ తన గ్రంథంలో ఒకచోట ఇలా అన్నాడు :

”ఓ ముహమ్మద్ చెప్పేయండి, విశ్వాసులకు ఈ ఖురాన్ మార్గదర్శకం వహిస్తుందని, ఉపశమనాన్ని కలిగిస్తుందనీను”.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాల విషయంలో కూడా నిస్సందేహంగా మనం ఈ మాట అనవచ్చు. ఆయన పలుకులు ప్రజలకు సన్మార్గం చూపించటంతో పాటు, ఉపశమనాన్ని కూడా ఇస్తాయి. ఇమామ్ రమావీ (రహిమహుల్లాహ్) తనకు సుస్తీ చేసినప్పుడల్లా తాను “నాకు హదీసు చదివి వినిపించండి. అందులో ఉపశమనం ఉంది” అని అంటారని బాగ్దాద్ చరిత్ర గ్రంథంలో వ్రాశారు. భారత ఉపఖండ ఆధ్యాత్మిక చరిత్రలో ప్రసిద్ధికెక్కిన ప్రముఖ హదీసువేత్త హజ్రత్ షాహ్ వలీయుల్లాహ్ గారి గురించి తెలియని వారుండరు. ఆయన తండ్రిగారైన షాహ్ అబ్దుర్రహీమ్ తరచూ ఇలా అంటుండేవారు: “మాకు ధర్మసేవ చేసే భాగ్యమంతా దరూద్ షరీఫ్ శుభాల మూలంగానే లభించింది”.

పండితులు సఖావీ (రహిమహుల్లాహ్) ‘ఖైలుల్ బదీ’ అనే గ్రంథంలో అనేకమంది హదీసువేత్తల స్వప్న విశేషాలను పొందుపరిచారు. ఆ గ్రంథం ప్రకారం కొంతమంది హదీసువేత్తలు హదీసులు వ్రాసే సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రస్తావన వచ్చినప్పుడల్లా దరూద్ షరీఫ్ పఠించటం, వ్రాయటం చేసేవారు. దాని మూలంగా వారి పాపాలన్నిటినీ మన్నించటం జరిగింది.

దైవప్రవక్త హదీసులు మరియు దరూద్ షరీఫ్ మహిమల్ని, శుభాలను స్వానుభవంతో గ్రహించిన నేను ”శుచీ శుభ్రతల పుస్తకం” తర్వాత “దైవప్రవక్త విధానానుసరణ” పుస్తకాన్ని రచించే ముందు ”దరూద్ షరీఫ్ శుభాలు” అనే పుస్తకం సంకలనం చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. అల్ హమ్దులిల్లాహ్! అల్లాహ్ నా ఆశను నెరవేర్చాడు. ఈ పుస్తకంలోని మేళ్లన్నీ కూడా అల్లాహ్ కృపతో, ఆయన అనుగ్రహంతో జరిగినవే. పోతే ఇందులోని లోపాలన్నీ నా స్వయంకృతాలు.

తనకు సలాం చేసే వారికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సమాధిలో నుంచి ప్రతి సలాం చేస్తారని ప్రామాణికమైన హదీసు ద్వారా తెలుస్తోంది.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధిలో ఉండి ప్రజల సలాం ఎలా వింటారు? వారి సలాంకు జవాబు ఎలా చెబుతారు? అనే విషయాలను గురించి చర్చించినప్పుడు మనం ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రాపంచిక జీవనం దృష్ట్యా సాధారణ మానవులకు ఏ విధంగా మరణం సంభవిస్తుందో అదేవిధంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు కూడా మరణం సంభవించింది. దివ్య ఖురాన్లో అల్లాహ్ పలుచోట్ల దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొరకు ‘మరణం’ అనే పదాన్ని ఉపయోగించాడు.

“ఓ ప్రవక్తా! నీవూ మరణిస్తావు, వారూ మరణిస్తారు.” (అజ్ జుమర్ : 30)

ఆలి ఇమ్రాన్ సూరాలో ఇలా ప్రకటించబడింది :

”ముహమ్మద్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కారు. అతనికి పూర్వం ఇంకా ఎందరో ప్రవక్తలు గతించారు. అలాంటప్పుడు ఒకవేళ అతను మరణిస్తే లేక హత్య చేయబడితే మీరు వెనుకంజవేసి మరలిపోతారా?” (ఆలి ఇమ్రాన్: 144)

అంబియా సూరాలో ఇలా చెప్పబడింది:

“ఓ ప్రవక్తా! శాశ్వత జీవితాన్ని మేము నీకు పూర్వం కూడా ఏ మానవునికీ ప్రసాదించలేదు. ఒకవేళ నీవు మరణిస్తే వారు మాత్రం శాశ్వతంగా జీవించి ఉంటారా?’ (అంబియా సూరా, 34వ సూక్తి)

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించినప్పుడు ఆయన ప్రియ సహచరుడయిన హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) తన ఉపన్యాసంలో ఇలా ఎలుగెత్తి చాటారు :

”ముహమ్మద్ ను పూజించేవారు ముహమ్మద్ కు మరణం సంభవించిందన్న సత్యాన్ని గ్రహించాలి” (బుఖారీ షరీఫ్).

దైవప్రవక్త మరణానంతరం ఆయన పవిత్ర భౌతిక కాయానికి స్నానం చేయించి, వస్త్ర సంస్కారాలు చేయటం జరిగింది. ఆ తర్వాత జనాజా నమాజ్ ఆచరించి ఆయన భౌతిక కాయాన్ని సమాధిలో ఉంచి మట్టితో పూడ్చేయటం జరిగింది. ఇది వాస్తవం. కనుక ప్రాపంచిక జీవితం దృష్ట్యా ఆయనకు మరణం సంభవించిందనే విషయంలో ఎలాంటి సందేహానికీ తావులేదు. అయితే ఆయన సమాధి జీవితం మాత్రం ఇతర దైవప్రవక్తలు, పుణ్యాత్ములు, అమరవీరులు, సజ్జనులందరి కంటే ఎంతో మెరుగ్గా, ఎక్కువ పరిపూర్ణంగా ఉంటుంది. సమాధి జీవితం గురించి ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ జీవితం మరణానికి ముందు ఉండే ప్రాపంచిక జీవితం లాగుండదు. అలా అని అది పూర్తిగా పరలోక జీవితం కూడా కాదు. దాని వాస్తవిక స్థితి కేవలం అల్లాహ్ కు మాత్రమే తెలుసు. దివ్యఖురాన్లో అల్లాహ్ ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా ఇలా ప్రకటించాడు:

“అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని “మృతులు” అని అనకండి. వాస్తవానికి వారు సజీవులు. కాని మీరు వారి జీవితాన్ని గ్రహించలేరు.” (అల్బఖర : 154వ సూక్తి)

సమాధి జీవితం గురించి వివరిస్తూ అల్లాహ్ ”మీరు ఆ స్థితిని గ్రహించలేరు” అని స్పష్టంగా చెప్పిన తర్వాత – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజల సలాం విని దానికి జవాబు చెప్పగల్గుతారంటే బహుశా ఆయన మనలాగే బ్రతికే ఉన్నారేమో? ఆయన సలాం వినగలిగినప్పుడు మనం చెప్పుకునే మాటలు మాత్రం ఎందుకు వినలేరు? అంటూ భౌతికంగా ఆలోచించటానికి ప్రయత్నించకూడదు. మన విశ్వాసం (ఈమాన్) కోరేదేమంటే మనం అల్లాహ్, దైవప్రవక్త ఆదేశాలను యధాతథంగా ఆచరించాలి. ఏ విషయంలోనయితే షరీఅత్ మౌనం వహించిందో అలాంటి విషయాల్లో అనవసర సందేహాలకు, సంశయాలకు లోనవకుండా తెలిసిన విషయాలనే ఆచరించటానికి ప్రయత్నించాలి. ధర్మం, విశ్వాసాల రక్షణకు ఇదే అత్యంత సురక్షితమైన మార్గం.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “అల్లాహ్ కొంతమంది దూతలకు ఒక బాధ్యతను అప్పగించాడు. వారు భువిలో సంచరిస్తూ ఉంటారు. ప్రజల్లో ఎవరయినా దరూద్ పఠిస్తే దాన్ని దైవప్రవక్తకు (అంటే నాకు) చేరవేస్తూ ఉంటారు” (అహ్మద్, నసాయి, దారిమి).

ఈ హదీసు ద్వారా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎల్లప్పుడూ తన సమాధిలోనే ఉంటారనీ, ఆయన సర్వాంతర్యామి కారని స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవేళ ఆయనే గనక సర్వాంతర్యామి అయితే దైవదూతలు ఆయనకు దరూద్ చేరవేయవలసిన అవసరం ఏముంటుంది చెప్పండి?!

మరికొన్ని హదీసుల ప్రకారం దైవదూతలు ఫలానా దరూద్ ఫలానా అతని కుమారుడు పఠించాడని కూడా ఆయనకు తెలియపరుస్తారని బోధపడుతుంది. దీని ద్వారా కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అగోచర జ్ఞానం లేదని తెలుస్తోంది. ఒకవేళ ఆయనకే గనక అగోచర జ్ఞానముంటే దైవదూతలు ఫలానా వ్యక్తి దరూద్ పఠించాడని ఆయనకు తెలియజేయవలసిన అవసరం ఏముంది?

ప్రస్తుత కాలంలో ఇస్లాం ధర్మంలో క్రొత్తపోకడలు (బిద్అత్ లు) తామర తంపరలుగా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ప్రార్థనలు, సంకీర్తనల్లో ఎన్ని కల్పిత విషయాలు చేర్చబడ్డాయంటే వాటి మూలంగా సంప్రదాయబద్ధమైన (మస్నూన్) ప్రార్ధనలు, సంకీర్తనలు మరుగున పడిపోతున్నాయి. ఆఖరికి దరూద్, సలామ్ లలో కూడా ఎన్నో కల్పితమైన, సంప్రదాయ విరుద్ధమైన విషయాలు చోటు చేసుకున్నాయి. ఉదా:- దరూదె తాజ్, దరూదె లిఖ్ఖి, దరూదె ముఖద్దస్, దరూదె అక్బర్, దరూదె మాహీ, దరూదె తస్ జైనా మొదలగునవి. వీటిలో ప్రతి ఒక్క దరూద్ పఠనానికి ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించబడింది. పుస్తకాల్లో వాటికి వేర్వేరు ప్రయోజనాలు ఆపాదించబడ్డాయి. మరి చూడబోతే వాటిలో ఏ ఒక్క దరూద్ వాక్యాలు కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేత ప్రవచించబడినట్లు రుజువు కావటం లేదు. కనుక వాటిని పఠించే పద్ధతి, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలు అన్నీ మాయమాటలు మాత్రమే.

షరీఅత్లో కల్పితమైన, సంప్రదాయ విరుద్ధమైన చర్యలకు పాల్పడటం మూలంగా కలిగే నష్టమేమిటో తెలుసుకోవటానికి ప్రతి ముస్లిం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశాలను దృష్టిలో పెట్టుకోవాలి. లేకపోతే ఈ కొద్దిపాటి అమూల్యమైన జీవితంలో ఖర్చు చేయబడే సమయం, ధనం, ఇతర శక్తి సామర్ధ్యాలన్నీ ప్రళయదినాన వృధా అయిపోయే ప్రమాదముంది..

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయినా ధర్మంలో షరీఅత్ పరంగా నిరాధారమైన పనికి శ్రీకారం చుడితే ఆ పని త్రోసిపుచ్చదగినది” (బుఖారీ- ముస్లిం). అంటే అల్లాహ్ సన్నిధిలో దానికి ఎలాంటి పుణ్యం లభించదన్నమాట! వేరొక హదీసులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ధర్మంలో తలెత్తే ప్రతి క్రొత్త పోకడ మార్గభ్రష్టతే, మార్గభ్రష్టత నరకానికి గొనిపోతుంది” అని హెచ్చరించారు. (అబూ నయీమ్).

ఈ సందర్భంగా ఇమామ్ బుఖారీ, ఇమామ్ ముస్లింలు వెలికితీసిన ఒక హదీసుని ప్రస్తావించటం చాలా ఉపయోగకరంగా ఉంటుందనుకుంటాను. ముగ్గురు మనుషులు దైవప్రవక్త సతీమణుల దగ్గరికి వెళ్ళి దైవప్రవక్త ఆరాధనా పద్ధతిని గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారిలో ఒకతను ‘నేను ఇప్పట్నుంచి ప్రతి రోజూ రాత్రంతా జాగారం చేస్తాను. అసలు విశ్రాంతే తీసుకోను’ అని ప్రతినబూనాడు. రెండో వ్యక్తి, “నేను రేపట్నుంచి నిరంతరాయంగా ఉపవాసముంటాను. ఈ వ్రతాన్ని ఎన్నటికీ విరమించను” అని ఒట్టేసుకున్నాడు. “నేనయితే ఎన్నటికీ వివాహం చేసుకోను. అసలు స్త్రీలనే ముట్టుకోను’ అని ప్రమాణం చేశాడు మూడోవ్యక్తి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు ఈ విషయం తెలియగానే ఆయన వారిని హెచ్చరిస్తూ, “అల్లాహ్ సాక్షి! నేను మీ అందరి కంటే ఎక్కువగా అల్లాహ్ కు భయపడేవాడిని, నిష్టాగరిష్టుణ్ణి. అయినప్పటికీ నేను రాత్రిపూట ఆరాధనలు చేస్తాను, పడుకుంటాను కూడా. ఉపవాసాలుంటాను, అప్పుడప్పుడూ వాటిని విరమిస్తాను కూడా. అంతేకాదు, నేను స్త్రీలను వివాహం కూడా చేసుకున్నాను. కనుక జాగ్రత్త! ఎవరయితే నా విధానం పట్ల వైముఖ్య ధోరణికి పాల్పడతాడో అతనితో నాకెలాంటి సంబంధం లేదు” అని అన్నారు.

ప్రియ పాఠకులారా!

కాస్త ఆలోచించండి, ఆ ముగ్గురు వ్యక్తులు తమ ఉద్దేశ్యం ప్రకారం తాము వీలైనన్ని ఎక్కువ సత్కార్యాలు చేస్తున్నామనీ, ఎక్కువ పుణ్యం సంపాదించు కుంటున్నామని భావించారు. కాని వారు అవలంబించిన విధానం కల్పితమైనది. సంప్రదాయ విరుద్ధమైనది, కనుక దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి మాటల్ని తీవ్రంగా నిరసించారు. దరూద్ సలామ్ ల సంగతి కూడా అంతే.

కల్పితమైన, సంప్రదాయ విరుద్ధమైన దరూద్ లు, సలామ్ లు పఠించటం వృధా ప్రయాస మాత్రమే. పైగా దానివల్ల దైవప్రవక్త అప్రసన్నతకు, దైవాగ్రహానికి గురి కావలసి వస్తుంది. అంచేత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించిన దరూద్-సలామ్ లను మాత్రమే పఠించాలి. గుర్తుంచుకోండి! ప్రపంచంలోని ఇతర సాధువులు, పుణ్యాత్ములందరూ కలిసి తయారు చేసిన ఎన్నో పలుకుల కన్నా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శుభ అధరాల నుండి వెలువడిన ఒక్క పలుకు ఎంతో అమూల్యమైనది, శ్రేష్ఠమైనదీను.

ఈ పుస్తకం సంకలనం కోసం హదీసుల్ని ఎంపిక చేసినప్పుడు ‘సహీహ్’ మరియు ‘హసన్’ కోవలకు చెందిన హదీసుల్ని మాత్రమే ఎంపిక చేసి పుస్తక ప్రామాణికతను కాపాడటానికి అన్ని విధాలా కృషి చేయటం జరిగింది. అయినప్పటికీ ఇందులో ఏదయినా బలహీనమైన హదీసు దొర్లిందని విద్యావంతులు మాకు తెలియపరిస్తే మేము వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.

ఈ పుస్తకాన్ని సిద్ధపరచటంలో మిత్రులు జనాబ్ హాఫిజ్ అబ్దుర్రహ్మాన్ (రక్షణ శాఖ) గారు చెప్పదగిన పాత్రను నిర్వహించారు. మా నాన్నగారు హాఫిజ్ ముహమ్మద్ ఇద్రీస్ కైలానీ ముసాయిదాను పునఃపరిశీలించటంతో పాటు వ్రాత, ప్రచురణ పనుల్ని దగ్గరుండి జరిపించారు. మా నాన్నగారు హజ్రత్ మౌలానా ముహమ్మద్ ఇస్మాయీల్ సలఫీ (రహిమహుల్లాహ్), హజ్రత్ మౌలానా ముహమ్మద్ అతావుల్లాహ్ హనీఫ్ (రహిమహుల్లాహ్) లాంటి ప్రసిద్ధ పండితుల దగ్గర శిష్యరికం చేసిన ప్రముఖుల్లో ఒకరు. దస్తూరీలో బాగా పేరు మోసిన వ్యక్తి. ఉపాధి నిమిత్తం దస్తూరీ పని చేసిన కాలంలోనే ఆయన ఆరు ప్రామాణిక గ్రంథాలయిన (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం, సుననె తిర్మిజీ, సుననె నసాయి, సుననె అబూదావూద్, సుననె ఇబ్నెమాజా లనే గాక మిష్కాత్ షరీఫ్, దివ్యఖురాన్ కు సంబంధించిన అనేక వ్యాఖ్యాన గ్రంథాలను కూడా ఆయన తన చేత్తో వ్రాశారు. మౌలానా అతావుల్లాహ్ హనీఫ్ గారు తన ప్రసిద్ధ గ్రంథమైన “తాలీఖాతె సలఫియా” (నసాయీ షరీఫ్ వ్యాఖ్యాన) గ్రంథాన్ని వ్రాయటం కోసం ప్రత్యేకంగా మా నాన్నగారినే ఎన్నుకున్నారు.

అల్లాహ్ నాన్నగారికి ప్రత్యేక కరుణాకటాక్షాల్ని అనుగ్రహించాడు. యాభై ఎనిమిదవ పడిలో ఆయనకు దివ్యఖురాన్ ను కంఠస్తం చేసే మహాభాగ్యాన్ని ప్రసాదించాడు. విద్యాభ్యాసం పూర్తయినప్పటి నుంచే ఆయన దస్తూరీ పనితోబాటు తన సొంత ఊర్లో ధర్మప్రచార కార్యక్రమాల్ని కూడా నిర్వర్తించటం మొదలుపెట్టారు. అయితే గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా-దైవకృపతో ఆయన ఉపాధిని కూడా లెక్కచేయకుండా పూర్తి ఏకాగ్రతతో ఈ బాధ్యతను నిర్వహిస్తున్నారు. హదీస్ పబ్లికేషన్స్ తరఫున ప్రచురణ కార్యక్రమం మొదలయినప్పటి నుంచి ముసాయిదాలను పునఃపరిశీలించటం, వాటిని వ్రాయించటం, ప్రచురించటం ఆ తర్వాత వాటిని పంపిణీ చేయటం మొదలగు పనులన్నిటినీ ఆయనే నిర్వర్తిస్తున్నారు.

మహాశయులారా !

నాన్నగారు జనాబ్ హాఫిజ్ ముహమ్మద్ ఇద్రీస్ కైలానీ గారికి అల్లాహ్ ఆరోగ్యాన్నీ, ఆయుష్షును* ప్రసాదించాలని కోరుకోమని విన్నవించుకుంటున్నాను. దానివల్ల మనకు దైవగ్రంథ, దైవప్రవక్త ప్రవచనాల ప్రచార కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షణలో నిర్వహించే అవకాశం లభిస్తుంది. అలాగే కేవలం దైవప్రసన్నతను బడసే ఉద్దేశ్యంతో, దైవప్రవక్త ప్రవచనాల పట్ల తమకున్న ప్రేమాభిమానాల మూలంగా తమ అమూల్యమైన సమయాన్ని, శక్తి సామర్థ్యాలను, పవిత్ర సంపాదనను ఖర్చుపెట్టి తద్వారా దైవగ్రంథం, దైవప్రవక్త ప్రవచనాల ప్రాచుర్యం కోసం పాటుపడుతున్న ప్రభృతులందరి కోసం కూడా దైవాన్ని ప్రార్థించండి. దైవం వారందరికీ ఇహపరాల్లోనూ తన అనుగ్రహాలను ప్రసాదించుగాక! ప్రళయదినాన వారికి దైవప్రవక్త సిఫారసుకు నోచుకునే భాగ్యాన్ని ప్రాప్తించుగాక! (ఆమిన్).

సంకలనకర్త తండ్రిగారైన హాఫిజ్ ముహమ్మద్ ఇద్రీస్ కైలానీ (రహిమహుల్లాహ్) క్రీ.శ. 1992 అక్టోబర్ 13వ తేదీనాడు శాశ్వతంగా ఇహలోకాన్ని వీడిపోయారు. ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్. పాఠకులు ఆయన మన్నింపు కోసం, పరలోకంలో ఆయన అంతస్తుల పెరుగుదల కోసం అల్లాహ్ ను ప్రార్థించాలని కోరుకుంటున్నాం.

రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్సమీవుల్ అలీం. వతుబ్ అలైనా ఇనక అంతత్తవ్వాబుర్రహీమ్”.
(ప్రభూ! మేము చేసిన ఈ సేవను స్వీకరించు. నిస్సందేహంగా నీవు అన్నీ వినేవాడవు. సర్వం తెలిసినవాడవు. ప్రభూ! మమ్మల్ని క్షమించు. నిస్సందేహంగా పశ్చాత్తాపాన్ని అంగీకరించే వాడవు, కరుణించే వాడవు నీవే)

ముహమ్మద్ ఇక్బాల్ కైలానీ
కింగ్ సవూద్ యూనివర్సిటీ, సౌదీ అరేబియా

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ ﷺ قَالَ: «الْمَلَائِكَةُ تُصَلِّي عَلَى أَحَدِكُمْ مَا دَامَ فِي مُصَلاهُ الَّذِي صَلَّى فِيهِ مَا لَمْ يُحْدِتْ تَقُوْلُ اللَّهُمَّ اغْفِرْ لَهُ اللَّهُمَّ ارْحَمْهُ.– رَوَاهُ الْبُخَارِيُّ

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగాప్రవచించారు: మీలో ఎవరయినా తను నమాజ్ చేసిన స్థలంలో పరిశుద్ధావస్థలో కూర్చొని ఉన్నంత వరకు (అంటే అతని వుజూ భంగం కానంత వరకు) దైవదూతలు అతనిపై దరూద్ పంపుతూ, “అల్లాహ్! ఇతన్ని మన్నించు, ఇతన్ని కరుణించు” అని ప్రార్థిస్తూఉంటారు. (బుఖారీ – నమాజ్ ప్రకరణం)

عَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ : قَالَ رَسُولُ اللَّهِ ﷺ : إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى مَيَامِنِ الصُّفُوفِ . رَوَاهُ أَبُو دَاوُدَ

హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:. “పంక్తుల్లో కుడివైపున వుండే వారిపై అల్లాహ్ కారుణ్యాన్ని కురిపిస్తాడు. దైవదూతలు కూడా వారిని అల్లాహ్ కరుణించాలని కోరుకుంటూ ఉంటారు”. (అబూదావూద్-హసన్ – అల్ బానీగారి సహీహ్ సుననె అబూదావూద్, మొదటి సంపుటి 628వ హదీసు)

عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا أَنَّهُ قَالَ: لاَ تُصَلُّوْا صَلَاةٌ عَلَى أَحَدٍ إِلَّا عَلَى النَّبِيِّ وَلكِنْ يُدْعَى لِلْمُسْلِمِينَ وَالْمُسْلِمَاتِ بِالاِسْتِغْفَارِ. رَوَاهُ إِسْمَاعِيْلُ الْقَاضِي

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ప్రబోదనం :- “దైవప్రవక్తలపై తప్ప మరెవరి పైనా దరూద్ పంపకండి. అయితే ముస్లిం స్త్రీ పురుషుల కోసం మాత్రం మన్నింపు ప్రార్థనలు చేయండి”.

(దీనిని ఇస్మాయీల్ ఖాజీగారు “ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి” గ్రంథంలో పేర్కొన్నారు. ఇది సహీహ్ కోవకు చెందిన హదీసు) (అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం, 75వ హదీసు)

عَنْ أَنَسٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: (مَنْ صَلَّى عَلَيَّ صَلَاةَ وَاحِدَةً صَلَّى اللهُ عَلَيْهِ عَشْرَ صَلَوَاتٍ وَحُطَّتْ عَنْهُ عَشَرُ خَطِيئَاتٍ وَرُفِعَتْ لَهُ عَشَر دَرَجَاتٍ– رَوَاهُ النَّسَائِيُّ

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయినా నాపై ఒకసారి దరూద్ పరిస్తే అల్లాహ్ అతనిపై పదిసార్లు కారుణ్యం కురిపిస్తాడు. అతని పది పాపాలను మన్నిస్తాడు. ఇంకా అతని పది అంతస్తులను పెంచుతాడు“. (నసాయి-సహీహ్) (అల్బానీగారి సహీహ్ సునని నసాయి గ్రంథం, మొదటి సంపుటి 1230వ హదీసు)

عَنِ ابْنِ مَسْعُوْدٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ : أَوْلَى النَّاسِ بِي يَوْمَ الْقِيَامَةِ أَكْثَرُهُمْ عَلَيَّ صَلَاةٌ. رَوَاهُ التَّرْمِذِيُّ

హజ్రత్ ఇబ్న్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు. “నాపై అత్యధికంగా దరూద్ పఠించేవాడు ప్రళయ దినాన నాకు అందరికన్నా సమీపంలో ఉంటాడు.” (తిర్మిజీ – సహీహ్) [అల్ బానిగారి మిష్కాతుల్ మసాబీహి గ్రంథం, మొదటి భాగం 923 న హదీసు]

عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرٍو رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ اللَّهِ ﷺ: (مَنْ صَلَّى عَلَى أَوْ سَأَلَ لِي الْوَسِيلَةَ حَقَّتْ عَلَيْهِ شَفَاعَتِي يَوْمَ الْقِيَامَةِ». رَوَاهُ إِسْمَاعِيلُ الْقَاضِي فِي فَضْلِ الصَّلَاةِ عَلَى النَّبِيِّ ﷺ

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయినా నాపై దరూద్ పఠిస్తే, నాకు ‘వసీలా’ (స్వర్గంలో ఒక ఉన్నత స్థానం) లభించాలని అల్లాహ్ ను కోరుకుంటే, ప్రళయ దినాన నేను వారి గురించి తప్పకుండా సిఫారసు చేస్తాను

(ఇస్మాయీల్ ఖాజీగారు దీనిని ‘ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి’ గ్రంథంలో పేర్కొన్నారు. ఇది ‘సహీహ్’ కోవకు చెందిన హదీసు).[అల్ బానిగారి ‘ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి’ గ్రంథం 50వ హదీసు]

عَنْ أُبَيّ بن كعب رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قُلْتُ  يَا رَسُولَ اللهِ، إِنِّي أُكْثِرُ الصَّلَاةَ عَلَيْكَ، فَكَمْ أَجْعَلُ لَكَ مِنْ صَلَاتِي؟ فَقَالَ: «مَا شِئْتَ». قَالَ: قُلْتُ: الرُّبُعَ. قَالَ: «مَا شِئْتَ، فَإِنْ زِدْتَ فَهُوَ خَيْرٌ لَكَ». قُلْتُ: النِّصْفَ. قَالَ: «مَا شِئْتَ، فَإِنْ زِدْتَ فَهُوَ خَيْرٌ لَكَ». قَالَ: قُلْتُ: فَالثُّلُثَيْنِ. قَالَ: «مَا شِئْتَ، فَإِنْ زِدْتَ فَهُوَ خَيْرٌ لَكَ». قُلْتُ: أَجْعَلُ لَكَ صَلَاتِي كُلَّهَا. قَالَ: «إِذَاً تُكْفَى هَمَّكَ، وَيُغْفَرُ لَكَ ذَنْبُكَ. رَوَاهُ الترمذي

హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) కథనం: నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో మాట్లాడుతూ “దైవప్రవక్తా! నేను మీపై అత్యధికంగా దరూద్ పంపుతూ ఉంటాను, వాస్తవానికి నేను నా ప్రార్ధన (దుఆ)లో ఎంతసేపు మీపై దరూద్ పఠించాలి.” అని అడిగాను. అందుకాయన “నీకిష్టమయినంత సేపు” అని అన్నారు. “నా ప్రార్థనలో నాల్గో వంతు మీ దరూద్ కోసం కేటాయిస్తే సరిపోతుందా?” అని అడిగాను. ”సరిపోతుంది. కాని అంతకన్నా ఎక్కువ సేపు దరూద్ పరిస్తే అది నీకే మంచింది” అని అన్నారాయన, నేను “సగం ప్రార్థన దరూద్ కోసం కేటాయిస్తాను” అన్నాను. దానికాయన “సరే, నీ యిష్టం. కానీ అంతకన్నా ఎక్కువ సేపు దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అని అన్నారు. నేను మళ్లీ “అయితే మూడింట రెండు వంతుల ప్రార్థన దాని కోసమే కేటాయించమంటారా?” అని అడిగాను. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ”నీ యిష్టం. ఇంకా ఎక్కువ సమయం దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అని అన్నారు. చివరికి నేను “మరయితే నా ప్రార్ధన అంతా దరూద్ కోసమే ప్రత్యేకించుకుంటాను” అని అన్నాను. అప్పుడాయన “ఈ పద్ధతి నీ దుఃఖ విచారాలన్నిటినీ దూరం చేస్తుంది. నీ పాపాల మన్నింపుకు దోహదపడుతుంది” అని చెప్పారు. (తిర్మిజీ-హసన్) [అల్ బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ రెండో సంపుటి 1999వ హదీసు]

عَنْ عَبْدِ الرَّحْمَنِ بْنِ عَوْفٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : خَرَجَ رَسُولُ اللهِ ﷺ حَتَّى دَخَلَ نخلا فَسَجَدَ فَأَطَالَ السُّجُوْدَ حَتَّى خَشِيْتُ أَنْ يَكُوْنَ اللهُ قَدْ تَوَفَّاهُ قَالَ : فَجِئْتُ أَنْظُرُ فَرَفَعَ رَأْسَهُ فَقَالَ : مَالَكَ؟ فَذَكَرْتُ لَهُ ذَلِكَ قَالَ: فَقَالَ : إِنَّ جِبْرِيلَ عَلَيْهِ السَّلامُ قَالَ لِي: أَلا أُبَشِّرُكَ أَنَّ اللهَ عَزَّ وَجَلَّ يَقُولُ لَكَ مَنْ صَلَّى عَلَيْكَ صَلَاةٌ صَلَّيْتُ عَلَيْهِ وَمَنْ سَلَّمَ عَلَيْكَ سَلَّمْتُ عَلَيْهِ». رَوَاهُ أَحْمَدُ

హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒక రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటి నుండి బయలుదేరి ఖర్జూరపు తోటలోకి వెళ్ళారు. అక్కడ ఆయన సజ్దా చేశారు. చాలా సేపటి వరకు అలాగే ఉండిపోయారు. ఎంతసేపటికీ సజ్దా నుండి లేవకపోవటంతో అదే స్థితిలో ఆయన ప్రాణం గాని పోయి వుంటుందేమోనని భయమేసింది నాకు! నేనాయన వైపు అలాగే చూస్తుండిపోయాను. అంతలో ఆయన తల పైకెత్తి ‘ఏమయింది?’ అని అడిగారు. నేను నాకు తోచింది చెప్పాను. అప్పుడాయన నాతో ఇలా అన్నారు :

”(నేను సజ్దా స్థితిలో ఉన్నప్పుడు) జిబ్రయీల్ దూత నన్ను సంబోధిస్తూ, “ఓ ముహమ్మద్! నేను మీకో శుభవార్త తెల్పనా? మీపై దరూద్ పంపిన వ్యక్తిపై తాను కారుణ్యాన్ని కురిపిస్తాననీ, మీ శాంతిని కోరేవారిపై తానూ శాంతిని అవతరింపజేస్తానని అంటున్నాడు అల్లాహ్” అని చెప్పారు. (అహ్మద్-సహీహ్) [అల్బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం 7వ హదీసు]

عَنْ أَبِي الدَّرْدَاءِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ ﷺ: «مَنْ صَلَّى عَلَيَّ حِيْنَ يُصْبِحُ عَشْرًا وَحِيْنَ يُمْسِي عَشْرًا أَدْرَكَتْهُ شَفَاعَتِي يَوْمَ الْقِيَامَةِ». رَوَاهُ الطَّبَرَانِي

హజ్రత్ అబూదర్దా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయితే ఉదయం పదిసార్లు, సాయంత్రం పదిసార్లు నాపై దరూద్ పఠిస్తారో, ప్రళయ దినాన వారికి నా సిఫారసు లభిస్తుంది“.(తబ్రానీ-హసన్) [అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం. 11వ హదీసు]

عَنْ عَبْدِ اللَّهِ بْنِ مَسْعُوْدٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: كُنتُ أُصَلِّي وَالنَّبِيُّ ﷺ وَأَبُو بَكْرٍ وَعُمَرُ رَضِيَ اللهُ عَنْهُمَا مَعَهُ ,فَلَمَّا جَلَسْتُ بَدَأْتُ بالثَّناءِ عَلَى اللهِ ثُمَّ الصَّلَاةِ عَلَى النَّبِيِّ ثُمَّ دَعَوْتُ لِنَفْسِي فَقَالَ النَّبِيُّ ﷺ: «سَلْ تُعْطَهُ، سَلْ تُعْطَة» رَوَاهُ التَّرْمِذِيُّ

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం : ఓ రోజు నేను నమాజ్ చేస్తుండగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆయనతో పాటు అబూబక్ర్, ఉమర్ (రదియల్లాహు అన్హుమా)లు కూడా (నాకు సమీపంలోనే) కూర్చొని ఉన్నారు. నేను (నమాజ్ ముగించుకొని దుఆ కోసం) కూర్చొని ముందుగా అల్లాహ్ ను స్తుతించాను. తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై దరూద్ పఠించి ఆ తర్వాత నా స్వయం కోసం దుఆ చేసుకున్నాను. అది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “(అలాగే) అల్లాహ్ ను ప్రార్థించు, నీకు తప్పకుండా ప్రసాదించబడుతుంది. (మళ్లీ) అల్లాహ్ ను ప్రార్థించు, నీకు తప్పకుండా ప్రసాదించటం జరుగుతుంది” అని పురికొల్పారు. (తిర్మిజీ-హసన్) [అల్ బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ మొదటి సంపుటి 486 వ హదీసు]

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ أَنّ رَسُوْلَ اللهِ ﷺ قَالَ: «مَنْ صَلَّى عَلَيَّ وَاحِدَةً صَلَّى اللَّهُ عَلَيْهِ عَشْرًا» . رَوَاهُ مُسْلِمٌ

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయినా నాపై ఒకసారి దరూద్ పఠిస్తే అల్లాహ్ అతని మీద పదిసార్లు కారుణ్యాన్ని కురిపిస్తాడు“.(ముస్లిం – నమాజ్ ప్రకరణం)

عَنْ أَبِي طَلْحَةَ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُولَ اللهِ ﷺ ، جَاءَ ذَاتَ يَوْمِ وَالْبُشْرَى فِي وَجْهِهِ فَقُلْنَا إِنَّا لَنَرَى الْبُشْرَى فِي وَجْهِكَ فَقَالَ: «إِنَّهُ أَتَانِي الْمَلَكُ جِبْرِيلُ فَقَالَ : يَا مُحَمَّدُ إِنَّ رَبَّكَ يَقُوْلُ أَمَا يُرْضِيْكَ الله ﷺ أَنَّهُ لَا يُصَلِّي عَلَيْكَ أَحَدٌ إِلا صَلَّيْتُ عَلَيْهِ عَشْرًا، وَلا يُسَلَّمْ عَلَيْكَ أَحَدٌ إِلا سَلَّمْتُ عَلَيْهِ عَشْرًا». رَوَاهُ النَّسَائِيُّ (حسن)

హజ్రత్ అబూ తల్హా (రదియల్లాహు అన్హు) కథనం: ఓ రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో ఆయన ముఖారవిందం ఆనందాతిశయంతో వెలిగిపోతూ ఉంది. అది చూసి మేము ”ఈ రోజు మీ ముఖారవిందంలో సంతోషం తొణకిసలాడుతున్నట్లు కన్పిస్తుందే” అని అన్నాం. అప్పుడాయన మాకు ఇలా తెలియజేశారు. “నా దగ్గరకు జిబ్రయీల్ దూత వచ్చి ఓ శుభవార్త చెప్పి వెళ్ళారు. అల్లాహ్ నన్ను ఉద్దేశ్యించి, ”ముహమ్మద్! ఎవరయినా మీపై ఒకసారి దరూద్ పఠిస్తే, నేనతని పై పదిసార్లు కారుణ్యాన్ని కురిపిస్తాను. ఎవరయినా ఒకసారి మీపై శాంతి కలగాలని కోరుకుంటే నేను వారిపై పదిసార్లు శాంతిని అవతరింపజేస్తాను. ఇది మీకు సంతోషకరమే కదా! అని అడుగుతున్నాడట!” (నసాయి-హసన్)[అల్బానీగారి సహీహ్ సుననె నసాయి మొదటి సంపుటి1216వ హదీసు]

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رَسُولُ اللهِ ﷺ: «مَنْ صَلَّى عَلَيَّ مَرَّةً وَاحِدَةً كَتَبَ اللهُ لَهُ عَشْرَ حَسَنَاتٍ – رَوَاهُ إِسْمَاعِيلُ الْقَاضِيُّ فِي فَضْلِ الصَّلَاةِ عَلَى النَّبِيِّ . (صحیح)

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు : “ఎవరయినా నాపై ఒకసారి దరూద్ పఠిస్తే, అల్లాహ్ అతని కర్మల పత్రంలో పదిపుణ్యాలు జమ చేస్తాడు”. (దీనిని ఇస్మాయీల్ ఖాజీ ‘ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి’ గ్రంథంలో పేర్కొన్నారు. ఇది సహీహ్ కోవకు చెందిన హదీసు) [అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం 11వ హదీసు]

عَنْ عَامِرِ بْنِ ربيعة عَنْ أَبِيْهِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : سَمِعْتُ النَّبِيَّ ﷺ يَقُولُ: (مَا مِنْ عَبْدٍ يُصَلِّي عَلَيَّ إِلا صَلَّتْ عَلَيْهِ الْمَلَائِكَةُ مَا صَلَّى عَلَيَّ فَلْيُقِلَّ أَوْ لَيُكْثِرُه . رَوَاهُ إِسْمَاعِيلُ الْقَاضِيُّ فِي فَضْلِ الصَّلاةِ عَلَى النَّبِيِّ (حسن)

హజ్రత్ ఆమిర్ బిన్ రబీఆ తన తండ్రి నుండి చేసిన కథనం ప్రకారం, తను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచిస్తుండగా విన్నారు: “ఏ ముస్లిం వ్యక్తి అయినా నాపై దరూద్ పఠిస్తూ ఉన్నంత వరకు దైవదూతలు అతనిపై కారుణ్యం కురవాలని ప్రార్థిస్తూనే ఉంటారు. కనుక ఇక మీ యిష్టం. దరూద్ తక్కువగానయినా పఠించండి లేదా ఎక్కువగానయినా పఠించండి”.

(దీనిని ఇస్మాయీల్ ఖాజీ ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథంలో పేర్కొన్నారు. ఇది ‘హసన్’ కోవకు చెందిన హదీసు) [అల్ బానీగారి మిష్కాతుల్ మసాబీహ్ గ్రంథం మొదటి సంపుటి 725వ హదీసు]

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ ﷺ: «مَا مِنْ أَحَدٍ يُسَلِّمُ عَلَيَّ إِلا رَدَّ اللهُ عَلَى رُوْحِي حَتَّى أَرُدَّ عَلَيْهِ السَّلاَمَ». رواه أبو داود (حسن)

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయినా నాకు సలాం చేస్తే, ఆ సమయంలో అల్లాహ్ నా ఆత్మను (భూలోకానికి) త్రిప్పి పంపిస్తాడు. దాంతో నేను నాకు సలాం చేసిన వారికి ప్రతి సలాం చేస్తాను”. (అబూ దావూద్-హసన్) [అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథంలోని 6వ హదీసు]

గమనిక: దరూద్ షరీఫ్ పఠనంపై లభించే పుణ్య పరిమాణం గురించి వివిధ హదీసుల్లో వివిధ రకాలుగా పేర్కొనటం జరిగింది. మొత్తానికి ఆ పుణ్యం దాన్ని పఠించేవారి చిత్తశుద్ధి, భక్తివిశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలి.

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: «رَغِمَ أَنْفُ رَجُلٍ ذَكَرْتُ عِنْدَهُ فَلَمْ يُصَلِّ عَلَيَّ وَرَغِمَ أَنْفُ رَجُلٍ دَخَلَ عَلَيْهِ رَمَضَانُ ثُمَّ انْسَلَخَ قَبْلُ أَنْ يُغْفَرَ لَهُ، وَرَغِمَ أَنْفُ رَجُلٍ أَدْرَكَ عِنْدَهُ أَبْوَاهُ الْكِبَرَ فَلَمْ يُدْخِلَاهُ الْجَنَّة». رَوَاهُ التَّرْمِذِيُّ (صحیح)

హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా శపించారు: “తన ముందు నా పేరు ప్రస్తావించబడినప్పటికీ నాపై దరూద్ పంపని వాడు నాశనమయిపోవు గాక! పూర్తి రమజాన్ మాసాన్ని పొందినప్పటికీ తన పాపాలను ప్రక్షాళనం చేసుకోలేకపోయినవాడు నాశనమయిపోవు గాక! తన జీవితంలో ముసలివారయిన తల్లిదండ్రుల్ని పొందినప్పటికీ వారికి సేవ చేసుకొని స్వర్గంలోకి ప్రవేశించలేక పోయినవాడు నాశనమయిపోవు గాక!” (తిర్మిజీ – సహీహ్) (అల్ బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ, మూడో సంపుటి 2810 వ హదీసు)

عَنْ كَعْبِ بْنِ عُجْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رَسُولُ اللهِ ﷺ: « أَحْضُرُوا الْمِنْبَرَ فَحَضَرْنَا فَلَمَّا ارْتَقَى الدَّرَجَةَ قَالَ آمِيْنَ ثُمَّ ارْتَقَى الدَّرَجَةَ الثَّانِيَةَ فَقَالَ: آمِيْنَ ثُمَّ ارتَقَى الدَّرَجَةَ الثَّالِثَةَ فَقَالَ: آمِيْنَ، فَلَمَّا فَرَغَ نَزَلَ عَنِ الْمِنْبَرِ قَالَ: فَقُلْنَا لَهُ: يَا رَسُولَ الله لَقَدْ سَمِعْنَا مِنْكَ الْيَوْمَ شَيْئًا مَا كُنَّا نَسْمَعُهُ قَالَ: إِنَّ جِبْرِيلَ عَرَضَ لِي فَقَالَ : بَعُدَ مَنْ أَدْرَكَ رَمَضَانَ فَلَمْ يُغْفَرْ لَهُ، فَقُلْتُ: آمِيْنَ فَلَمَّا رَقِيْتُ الثَّانِيَةَ قَالَ: بَعُدَ مَنْ ذُكِرْتَ عِنْدَهُ فَلَمْ يُصَلِّ عَلَيْكَ. فَقُلْتُ : آمِيْنَ. فَلمَّا رَقِيْتُ الثَّالِثَةَ قَالَ : بَعُدَ مَنْ أَدْرَكَ أبَوَيْهِ الْكِبَرَ أَوْ أَحَدَهُمَا فَلَمْ يُدْخِلاهَ الْجَنَّةَ. فَقُلْتُ : آمِيْنَ ». رَوَاهُ الْحَاكِمُ (صحیح)

హజ్రత్ కాబ్ బిన్ ఉజ్రా (రదియల్లాహు అన్హు) కథనం: ఒక రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మింబర్ (వేదిక)ను తీసుకొచ్చి పెట్టమని ఆదేశించారు. మేము అలాగే తీసుకొచ్చి పెట్టాం. ఆయన వేదిక తొలి మెట్టు ఎక్కినప్పుడు ‘ఆమీన్’ అని అన్నారు. రెండో మెట్టు ఎక్కినప్పుడు ‘ఆమీన్’ అని అన్నారు. మూడో మెట్టు ఎక్కినప్పుడు కూడా ‘ఆమీన్’ అని అన్నారు. ఉపన్యాసం ముగించి వేదిక దిగి క్రిందికి రాగానే సహాబాలు (సహచరులు) ఆశ్చర్యంతో, “ఈ రోజు విూరు విచిత్రంగా ప్రవర్తించారు. (ఖుత్బా సమయంలో) మీరలా అనటం మేము ఇంతకు ముందెన్నడూ వినలేదు. (విషయం ఏమిటి దైవప్రవక్తా?!)” అని అడిగారు.

అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విషయాన్ని వివరిస్తూ ”జిబ్రయీల్ (అలైహిస్సలాం) వచ్చి “రమజాన్ మాసం పొందినప్పటికీ తన పాపాలను ప్రక్షాళనం చేయించుకోలేక పోయినవాడు నాశనమవుగాక!” అని శపించారు. నేనందుకు “ఆమీన్” అని అన్నాను. ఆ తర్వాత నేను రెండో మెట్టు ఎక్కుతున్నప్పుడు జిబ్రయీల్ ‘తన ముందు మీ శుభనామం ప్రస్తావనకు వచ్చినప్పటికీ మీ పై దరూద్ పంపనివాడు నాశనమయిపోవుగాక!’ అని శపించారు. నేనందుకు ”ఆమీన్” అని పలికాను. మూడో మెట్టు ఎక్కుతున్నప్పుడు జిబ్రయీల్, “ముసలి వారయిన తల్లిదండ్రుల్ని లేక వారిరువురిలో ఏ ఒక్కరినయినా పొంది వారికి సేవలు చేసుకొని స్వర్గాన్ని పొందలేకపోయినవాడు నాశనమవుగాక!” అని శపించారు. నేనందుకు కూడా ‘ఆమీన్’ అని అన్నాను” అని చెప్పారు. (హాకిమ్ – సహీహ్) (అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం 19 హదీసు)

عَنْ عَلِيٍّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رَسُوْلُ اللهِ ﷺ : «الْبَخِيْلُ الَّذِي مَنْ ذُكِرْتُ عِنْدَهُ فَلَمْ يُصَلِّ عَلَيَّ». رَوَاهُ التَّرْمِذِيُّ

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం, ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “తన ముందు నా పేరు ప్రస్తావించబడినప్పటికీ నాపై దరూద్ పఠించనివాడు పిసినిగొట్టు.” (తిర్మిజీ-సహీహ్) (అల్ బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ మూడో సంపుటి 2811వహదీసు)

عَنْ أَبِي ذَرٍّ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُوْلَ اللهِ ﷺ قَالَ: « إِنَّ أَبْخَلَ النَّاسِ مَنْ ذُكِرْتُ عِنْدَهُ فَلَمْ يُصَلِّ عَلَيَّ » – رَوَاهُ إِسْمَاعِيْلُ الْقَاضِي فِي فَضْلِ الصَّلَاةِ عَلَى النَّبِيِّ (صحیح)

హజ్రత్ అబూ జర్ర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “తన ముందు నా పేరు ప్రస్తావించబడినప్పటికీ నాపై దరూద్ పఠించనివాడు ప్రజలందరిలోకెల్లా మహా పిసినిగొట్టు”. (ఖాజీ ఇస్మాయీల్ దీనిని ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథంలో పేర్కొన్నారు. ఇది సహీహ్ కోవకు చెందిన హదీసు) (అల్ బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం 37వ హదీసు)

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رَسُولُ اللهِ ﷺ: « مَا فَعَدَ قَوْمٌ مَقْعَدًا لَمْ يَذْكُرُوا فِيه اللهَ عَزَّ وَجَلَّ وَيُصَلُّوْا عَلَى النَّبِيِّ إِلا كَانَ عَلَيْهِمْ حَسْرَةٌ يَوْمَ الْقِيَامَةِ وَإِنْ دَخَلُوا الْجَنَّةَ لِلثَّوَابِ » رَوَاهُ أَحْمَدُ وَابْنُ حَبَّانِ وَالْحَاكِمُ وَالْخَطِيْبُ . (صحیح)

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “కొంతమంది ఒకచోట సమావేశమై ఆ సమావేశంలో అల్లాహ్ ను జ్ఞాపకం చేసుకోకపోతే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పంపకపోతే ప్రళయదినాన ఆ సమావేశం వారి పాలిట దుఃఖదాయకంగా (తలవంపుగా) పరిణమిస్తుంది. వారు సత్కార్యాల ఆధారంగా స్వర్గంలో ప్రవేశించేవారయినా సరే” (అహ్మద్, ఇబ్నె హిబ్బాన్, హాకిమ్, ఖతీబ్- సహీహ్) (అల్బానీగారి సిల్సిలతుల్ అహాదీసుస్సహీహా ‘మొదటి సంపుటి 76వ హదీసు)

عَنِ ابْنِ عَبَّاسِ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: « مَنْ نَسِيَ الصَّلاةَ عَلَيَّ خطئ طريقَ الْجَنَّةِ » . رَوَاهُ ابْنُ مَاجَةَ (صحیح)

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు : “నాపై దరూద్ పంపటం మరిచిపోయినవాడు స్వర్గమార్గం తప్పిపోతాడు” (ఇబ్నెమాజా-సహీహ్) (అల్బానీగారి సహీహ్ సుననె ఇబ్నెమాజా మొదటి సంపుటి 740వ హదీసు.)

عَنْ أَنس رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رَسُوْلُ اللهِ ﷺ:« كُلُّ دُعَاءِ مَحْجُوْبٌ حَتَّى يُصَلِّيَ عَلَى النَّبِيُّ » . رَوَاهُ الطَّبَرَانِيُّ (حسن)

హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై దరూద్ పఠించనంతవరకు ఏ దుఆ స్వీకృతిని పొందజాలదు“. (తబ్రానీ-హసన్) (అల్బానీగారి సిల్సిలతుల్ అహాదీసుస్సహీహా ఐదో సంపుటి 2035వ హదీసు)

عن فضالة بْنِ عبيد رَضِيَ اللهُ عَنْهُ قَالَ : سَمِعَ النَّبِيُّ ﷺ رَجُلًا يَدْعُو فِي صَلَاتِهِ فَلَمْ يُصَلِّ عَلَى النَّبِيُّ . فَقَالَ النَّبِيُّ ﷺ: «( عجل هذا ) ، ثُمَّ دَعَاهُ فَقَالَ لَهُ أَوْ لِغَيْرِهِ إِذَا صَلَّى أَحَدُكُمْ فَلْيَبْدَا بِتَحْمِيدِ اللَّهِ والثناء عَلَيْهِ ثُمَّ لَيُصَلِّ عَلَى النبي ﷺ ثُمَّ لَيَدْعُ بَعْدُ مَا شَاءَ» . رَوَاهُ التَّرْمِذِيُّ (صحیح)

హజ్రత్ ఫజాలా బిన్ ఉబైద్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక వ్యక్తి నమాజ్లో దరూద్ పఠించకుండా దుఆ చేస్తుండగా చూసి ‘ఇతను తొందరపడ్డాడు’ అని అన్నారు. ఆ తర్వాత అతణ్ణి దగ్గరకు పిలిచి అతన్నో లేక మరో వ్యక్తినో ఉద్దేశ్యించి, “మీలో ఎవరయినా నమాజ్ చేసేటప్పుడు దైవస్తోత్రంతో ప్రారంభించాలి. ఆ తర్వాత (తషహుద్ లో కూర్చున్నప్పుడు) దైవప్రవక్తపై దరూద్ పఠించాలి. దాని తర్వాత తమకు ఇష్టమొచ్చింది ప్రార్థించుకోవాలి” అని చెప్పారు. (తిర్మిజీ-సహీహ్) (అల్బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ మూడో సంపుటి 2767వ హదీసు)

عَنْ أَبِي أَمَامَةَ بْنِ سَهْلِ رَضِيَ اللهُ عَنْهُ أَنَّهُ أَخْبَرَهُ رَجُلٌ مِنْ أَصْحَابِ النَّبِيِّ ﷺ أَنَّ السُّنَّةَ فِي الصَّلَاةِ عَلَى الْجَنَازَةِ أَنْ يُكَبَّرَ الإِمَام ثُمَّ يَقْرَأْ بِفَاتِحَةِ الْكِتَابِ بَعْدَ التكبيرة الأولَى سِرًّا فِي نَفْسِهِ ثُمَّ يُصَلِّي عَلَى النَّبِيِّ ﷺ وَيُخَلَّص الدُّعاءَ لِلْجَنَازَةِ فِي التَّكْبِيرَاتِ وَلَا يَقْرَأْ فِي شَيْءٍ مِنْهُنَّ ثُمَّ يُسَلَّمْ سِرًّا فِي نَفْسِهِ. رَوَاهُ الشَّافِعِيُّ.

హజ్రత్ అబూ ఉమామా బిన్ సహ్లి (రదియల్లాహు అన్హు) కథనం, ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరుల్లో ఒకాయన తనకు ఈ విషయం తెలిపారు. “జనాజా నమాజ్లో ఇమామ్ మొదటి తక్బీర్ తర్వాత మెల్లిగా ఫాతిహా సూరా పఠించటం, (రెండో తక్బీర్ తర్వాత) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పఠించటం, (మూడో తక్బీర్ తర్వాత) మృతుని కోసం చిత్తశుద్ధితో ప్రార్థించటం, ఈ తక్బీరుల్లో ఖురాన్ పారాయణం చేయకుండా ఉండటం, (నాల్గో తక్బీర్ తర్వాత) మెడ త్రిప్పుతూ మెల్లిగా సలాం చేయటం సున్నత్ (సంప్రదాయం)“. (షాఫయీ) (ముస్నదె షాఫయీ-581 వ హదీసు)

عَنْ عَبْدِ اللهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ رَضِيَ اللهُ عَنْهُمَا أَنَّهُ سَمِعَ النَّبِيِّ ﷺ يَقُولُ : إذَا سَمِعْتُمُ الْمُؤَذَنَ فَقُوْلُوْا مِثْلَ مَا يَقُوْلُ ثُمَّ صَلُّوْا عَلَيَّ فَإِنَّهُ مَنْ صَلَّى عَلَيَّ صَلَاةٌ صَلَّى اللهُ عَلَيْهِ بِهَا عَشْرًا، ثُمَّ سَلُوْا اللهَ لِي الْوَسِيْلَةَ فَإِنَّهَا مَنْزِلَةٌ فِي الْجَنَّةِ لا تَنْبَغِي إِلا لِعَبْدِ مِنْ عِبَادِ اللهِ وَأَرْجُوْ أَنْ أَكُونَ أَنَا هُوَ فَمَنْ سَأَلَ اللَّهَ لِي الْوَسِيلَةَ حَلَّتْ لَهُ الشَّفَاعَةُ». رَوَاهُ مُسْلِمٌ.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) తెలియజేశారు: “ముఅజ్జన్ (అజాన్ ఇచ్చేవాని) ప్రకటన విన్నప్పుడు, అతను అనే పలుకులే మీరూ పలకండి. ఆ తర్వాత నాపై దరూద్ పఠించండి. నాపై ఒకసారి దరూద్ పఠించేవారిని అల్లాహ్ పదిసార్లు కరుణిస్తాడు. ఆ తర్వాత నాకు ‘వసీలా’ లభించాలని అల్లాహ్ ను ప్రార్థించండి. వసీలా అనేది స్వర్గంలో ఒక (ఉన్నత స్థానం). స్వర్గవాసులందరిలో అది కేవలం ఒకే ఒక్కరికి లభిస్తుంది. ఆ ఒక్కణ్ణి నేనేనని నా అభిప్రాయం. కనుక నాకు వసీలా లభించాలని ప్రార్థించే వ్యక్తికి నా సిఫారసు తప్పకుండా లభిస్తుంది“. (ముస్లిం – నమాజ్ ప్రకరణం.)

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ ﷺ: « لَا تَتَّخِذُوا قَبْرِي عيدا وَلا تَجْعَلُوا بُيُوتَكُمْ قُبُورًا وَحيثُما كُنتُمْ فَصَلُّوا عَلَيَّ فَإِنَّ صَلاتِكُمْ تَبْلُغُنِي ». رَوَاهُ أَحْمَدُ

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “నా సమాధిని తిరునాళ్ళగా చేయకండి. మీ ఇండ్లను శ్మశానాలుగా మార్చుకోకండి. మీరెక్కడున్నా సరే నాపై దరూద్ పంపుతూ ఉండండి. మీ దరూద్ నాకు చేరవేయబడుతుంది”. (అహ్మద్-సహీహ్) (అల్బానీగారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథంలోని 20వ పుట)

عَنْ أَبِي بَكْرِ الصَّدِّيقِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رَسُوْلُ اللهِ ﷺ: «أَكْثِرُوا الصَّلَاةَ عَلَيَّ فَإِنَّ اللَّهَ وَكُل بِي مَلَكًا عِنْدَ قَبْرِي فَإِذَا صَلَّى عَلَيَّ رَجُلٌ مِنْ أُمَّتِي قَالَ لِي ذلِكَ الْمَلَكُ : يَا مُحَمَّدَ إِنَّ فُلانَ ابْنَ فُلَانِ صَلَّى عَلَيْكَ السَّاعَةَ . رَوَاهُ الدَّيْلَمِي (حسن)

హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “నాపై అత్యధికంగా దరూద్ పంపండి. అల్లాహ్ నా సమాధి దగ్గర ఓ దూతను నియమిస్తాడు. నా అనుచరుడెవడయినా నాపై దరూద్ పంపితే, ఆ దైవదూత నాతో, “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)! ఫలానా అతను ఫలానా సమయంలో మీపై దరూద్ పంపాడు’ అని చెబుతాడు“. (దైలమీ -హసన్)(అల్ బానీగారి సిల్సిలతుల్ అహాదీసుస్సహీహా నాల్గో సంపుటి 1530వ హదీసు)

عَنِ ابْنِ مَسْعُوْدٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رَسُولُ اللهِ ﷺ :إِنَّ للهِ مَلائِكَة سيَّاحِيْنَ فِي الْأَرْضِ يُبَلِّغُونِي مِنْ  أمتي السَّلَامَ. رَوَاهُ النَّسَائِيُّ (صحیح)

హజ్రత్ ఇబ్నె మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “నా అనుచరులు నాకు చెప్పే సలాములను నాకు చేరవేయటానికి అల్లాహ్ కొంతమంది దూతల్ని నియమించాడు. వారు భూమిమీద తిరుగుతూ ఉంటారు”. (నసాయి-సహీహ్) (అల్ బానీగారి సహీహ్ సుననె నసాయి 1215వ హదీసు)

عَنْ أَبِي مَسْعُوْدٍ الأَنْصَارِيُّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ : «أَكْثِرُوا الصَّلاةَ عَليَّ فِي يَوْمِ الْجُمْعَةِ فَإِنَّهُ لَيْسَ يُصَلِّ عَلَيَّ أَحَدٌ يَوْمَ الْجُمْعَةِ إِلَّا عُرِضَتْ على صلاته». رَوَاهُ الْحَاكِمُ وَالْبَيْهَقِي

హజ్రత్ అబూ మస్ ఊద్ అన్సారీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “జుమా నాడు నాపై అత్యధికంగా దరూద్ పంపండి. ఎందుకంటే జుమా నాడు ఎవరయినా నాపై దరూద్ పరిస్తే అది తప్పకుండా నాకు సమర్పించబడుతుంది“. (హాకిమ్, బైహఖీ-సహీహ్) (అల్బానీ గారి సహీహ్ జామె సగీర్ మొదటి సంపుటి 1219వ హదీసు)

عَنْ أَوْسِ بْنِ أَوْسٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ ﷺ: “إِنَّ مِنْ أَفْضَلِ أَيَّامِكُمْ يَوْمَ الْجُمْعَةِ فِيْهِ خُلِقَ آدَمُ، وَفِيْهِ قُبِضَ ، وَفِيْهِ الْنَّفْخَةُ، وَفِيْهِ الصَّعْقَةُ، فَأَكْثِرُوْا عَلَيَّ مِنَ الصَّلَاةِ فِيْهِ فَإِنَّ صَلاتِكُمْ مَعْرُوْضَةٌ عَلَيَّ قَالَ قَالُوا : يَا رَسُوْلَ اللهِ ﷺ وَكَيْفَ تُعْرَضُ صَلَاتُنا عَلَيْكَ وَقَدْ أَرَمْتَ؟ فَقَالَ : إِنَّ اللهَ عَزَّوَجَلَّ حَرَّمَ عَلَى الْأَرْضِ أَجْسَادَ الأَنْبِيَاءِ – رَوَاهُ ابو داود (صحيح)

హజ్రత్ ఔస్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “మీ రోజుల్లో జుమా రోజు ఎంతో ఘనమైనది. ఆ రోజునే ఆదం పుట్టించబడ్డారు. ఆ రోజునే మరణించారు. ఆ రోజునే శంఖం పూరించబడుతుంది. ఆ రోజునే మృతుల్ని తిరిగి లేపే ఆజ్ఞ అవుతుంది. కనుక ఆ రోజు మీరు నాపై అత్యధికంగా దరూద్ పంపండి. మీ దరూద్ నాకు చేరవేయబడుతుంది“.

అది విని అనుచరులు, “దైవప్రవక్తా! మేము పంపే దరూద్ తమకు ఎలా చేరవేయబడుతుంది. అప్పటికి మీ ఎముకలు (సయితం) కృశించిపోయి ఉంటాయి కదా! (లేక) మీ దేహం మట్టిలో కలిసిపోయి ఉంటుంది కదా!” అని సందేహపడగా, “అల్లాహ్ దైవప్రవక్తల శరీరాల్ని మట్టికొరకు నిషేధం చేశాడు” అని చెప్పారాయన (సల్లల్లాహు అలైహి వసల్లం). (అబూదావూద్-సహీహ్) (అల్బానీగారి సహీహ్ సుననె అబూదావూద్ మొదటి సంపుటి 925)

عَنْ فَضَالَةَ بْن عُبَيْدٍ قَالَ: بَيْنَ رَسُولُ اللهِ ﷺ قَاعِدٌ إِذْ دَخَلَ رَجُلٌ فَصَلَّى فَقَالَ: اللَّهُمَّ اغْفِرْ لِي وَارْحَمْنِي. فَقَالَ رَسُولُ اللهِ : عَجَّلْتَ أَيُّهَا الْمُصَلِّي، إذَا صَلَّيْتَ فَقَعَدْتَ فَاحْمَدِ اللَّهَ بِمَا هُوَ أَهْلُهُ وصَلَّ عَلَيَّ ثُمَّ ادْعُهُ، قَالَ : ثُمَّ صَلَّى رَجُلٌ آخَرٌ بَعْدَ ذَلِكَ فَحَمِدَ اللهَ وَصَلَّى عَلَى النَّبِيِّ ﷺ فَقَالَ ا أَيُّهَا الْمُصَلِّي أَدْعُ تُجَبْ». رَوَاهُ التَّرْمِذِي (صحیح)

హజ్రత్ ఫజాలా బిన్ ఉబైద్ (రదియల్లాహు అన్హు) కథనం: ఒకరోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (మస్జిదులో) కూర్చొని ఉండగా ఒక వ్యక్తి లోనికి ప్రవేశించాడు. నమాజ్ చేసిన తర్వాత అతను “ఓ అల్లాహ్! నన్ను క్షమించు. నా మీద దయజూపు” అని ప్రార్థించటం మొదలు పెట్టాడు. అది చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతన్ని ఉద్దేశ్యించి, “ఓయీ నమాజ్ చేసిన వ్యక్తి! నువ్వు ప్రార్థించటంలో తొందరపడ్డావు. నమాజ్ చేసుకున్న తర్వాత దుఆ కోసం కూర్చున్నప్పుడు ముందుగా తగిన విధంగా అల్లాహ్ ను స్తుతించు. తర్వాత నాపై దరూద్ పఠించు. ఆ తర్వాత నీ కోసం దుఆ చేసుకో” అని ఉపదేశించారు..

మరో వ్యక్తి సమాజ్ చేసుకున్న తర్వాత ”ముందుగా అల్లాహ్ ను స్తుతించాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పఠించాడు. అది చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఓయీ నమాజ్ చేసిన వ్యక్తీ! ప్రార్థించు, నీ ప్రార్ధన తప్పకుండా స్వీకరించబడుతుంది” అని అన్నారు. (తిర్మిజీ-సహీహ్) (అల్బానీ గారి సహీహ్ సుననె తిర్మిజీ మూడో సంపుటి 2865వ హదీసు)

عَنْ أُبي بْنِ كَعْبٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قُلْتُ يَا رَسُولَ اللَّهِ وَ إِنِّي أُكْثِرُ الصَّلَاةَ عَلَيْكَ فَكَمْ أَجْعَلُ لَكَ مِنْ صَلَاتِي ؟ قَالَ : مَاشِئتَ. قُلْتُ : الرُّبْعَ. قَالَ: مَا شِئتَ فَإِنْ زِدْتَ فَهُوَ خَيْرٌ لَكَ . قُلْتُ : فَالنَّصْفَ . قَالَ : مَا شِئْتَ فَإِنْ زِدْتَ فَهُوَ خَيْرٌ لَكَ . قُلْتُ: فَالثُّلُتَيْنِ . قَالَ : مَا شِئتَ فَإِنْ زِدْتَ فَهُوَ خَيْرٌ لَكَ . قُلْتُ : أَجْعَلُ لَكَ صَلَاتِي كُلَّهَا . قَالَ : إذا يُكْفَى هَمَّكَ وَيُغْفَرُ لَكَ ذَنْبُكَ . رَوَاهُ الترمذي (حسن)

హజ్రత్ ఉబై బిన్ కాబ్(రదియల్లాహు అన్హు) కథనం: నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో మాట్లాడుతూ, “దైవప్రవక్తా! నేను అత్యధికంగా మీపై దరూద్ పంపుతూ ఉంటాను. అసలు నా ప్రార్ధనలో ఎంత సేపు మీపై దరూద్ పఠించాలి?” అని అడిగాను. అందుకాయన, ”నీకిష్టమయినంతసేపు” అని అన్నారు. “నా ప్రార్థనలో నాల్గోవంతు మీ దరూద్ కోసం కేటాయిస్తే సరిపోతుందా?” అని అడిగాను, ”సరిపోతుంది. కాని * అల్బానీ గారి సహీహ్ సుననె తిర్మిజీ మూడో సంపుటి 2865వ హదీసు. అంతకన్నా ఎక్కువ సేపు దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అని అన్నారాయన. నేను “సగం ప్రార్థన (దుఆ) దరూద్ కోసం కేటాయిస్తాను” అని అన్నాను. దానికాయన ”సరే, నీ యిష్టం. కానీ అంతకన్నా ఎక్కువసేపు దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అన్నారు. నేను మళ్లీ “అయితే మూడింట రెండు వంతుల ప్రార్థన దానికోసమే కేటాయించమంటారా?” అని అడిగాను. ఆయన “నీ యిష్టం. ఇంకా ఎక్కువ సమయం దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అని అన్నారు. చివరికి నేను, ”మరయితే నా ప్రార్థన అంతా దరూద్ కోసమే ప్రత్యేకించుకుంటున్నాను” అని అన్నాను. అప్పుడాయన “ఈ పద్ధతి నీ దుఃఖవిచారాలన్నిటినీ దూరం చేస్తుంది. నీ పాపాల మన్నింపుకు దోహదపడుతుంది” అని చెప్పారు. (తిర్మిజీ-హసన్)(అల్బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ రెండోసంపుటి 1999వ హదీసు)

عَنْ عَلِيّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ : قَالَ رسول الله ﷺ : الْبَخِيلُ الَّذِي مَنْ ذُكِرْتُ عَنْدَهُ فَلَمْ يُصَلُّ عَلَيَّ». رَوَاهُ التَّرْمِذِيُّ (صحیح)

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: ”తన దగ్గర నా ప్రస్తావన వచ్చినప్పటికీ నాపై దరూద్ పఠించనివాడు పరమ పిసినిగొట్టు.” (తిర్మిజీ-సహీహ్) (అల్బానీగారి సహీహ్ సుననె తిర్మిజీ మూడో సంపుటి 2811వ హదీసు)

عَنْ فَاطِمَةَ رَضِيَ اللهُ عَنْهَا بِنْتِ رَسُوْلِ اللهِ ﷺ قَالَتْ : كَانَ رَسُوْلُ اللهِ ﷺ إِذَا دَخَلَ الْمَسْجِدَ يَقُولُ: «بِسْمِ اللهِ وَالسَّلَامِ عَلَى رَسُوْلِ اللَّهِ ، اللَّهُمَّ اغْفِرْ لِي ذُنُونِي، وَافْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ، وَإِذَا خَرَجَ قَالَ: بِسْمِ اللَّهِ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللهِ ، اللَّهُمَّ اغْفِرْ لِي ذُنُوبِي وَافْتَحْ لِي أَبْوَابَ فَضْلِكَ رَوَاهُ ابْنُ مَاجَةَ

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుమార్తె హజ్రత్ ఫాతిమా (రదియల్లాహు అన్హా ) కథనం; దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మస్జిద్ కి ప్రవేశించేటప్పుడు ఇలా పలికేవారు.

“బిస్మిల్లాహి వస్సలాము అలా రసూలిల్లాహి అల్లాహుమ్మగ్ఫోర్లీ జునూబీ, వఫతహ్లీ అబ్వాబ రహ్మతిక”, (అల్లాహ్ పేరుతో మస్జిద్లోకి ప్రవేశిస్తున్నాను. దైవప్రవక్తపై శాంతి కురియు గాక! అల్లాహ్! నా పాపాలను మన్నించు. నా కోసం నీ కారుణ్య ద్వారాలను తెరిచి ఉంచు.)

తిరిగి మస్జిద్ నుండి వెడలినప్పుడు ఈ విధంగా ప్రార్థించేవారు.

“బిస్మిల్లాహి వస్సలాము అలా రసూలిల్లాహి, అల్లాహుమ్మ్ఫరీ జునూబీ వఫతహ్లీ అబ్వాబ పబ్లిక”. (అల్లాహ్ పేరుతో వెడలుతున్నాను. దైవప్రవక్తకు శాంతి కల్గుగాక! దేవా! నా పాపాలను మన్నించు. నీ కటాక్ష ద్వారాలను నా కోసం తెరిచి ఉంచు.)(ఇబ్నెమాజా-సహీహ్)(అల్బానీగారి సహీహ్ సుననె ఇబ్సెమాజా మొదటి సంపుటి 625వ హదీసు)

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: «مَا جَلَسَ قَوْمٌ مَجْلِسًا لَمْ يَذْكُرُوا اللهَ فِيْهِ، وَلَمْ يُصَلَّوْا عَلَى نَبِيِّهِمْ إِلا كَانَ عَلَيْهِمْ يَرَةً فَإِنْ شَاءَ عَذَبَهُمْ وَإِنْ شَاءَ غَفَرَ لَهُمْ . رَوَاهُ التَّرْمِذِيُّ (صحیح)

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: కొంతమంది ఏదయినా ఒక చోట సమావేశమై ఆ సమావేశంలో అల్లాహ్ ను జ్ఞాపకం చేసుకోకపోతే, తమ ప్రవక్తపై దరూద్ పంపకపోతే ఆ సమావేశం వారిపాలిట తలవంపుగా పరిణమిస్తుంది. అల్లాహ్ వారిని శిక్షించనూవచ్చు లేదా మన్నించనూ వచ్చు. (తిర్మిజీ-సహీహ్)(అల్బానీగారి సహీహ్ సునవె తిర్మిజీ మూడో సంపుటి 2691వ హదీసు)

عَنْ أَبِي الدَّرْدَاءِ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: «مَنْ صَلَّى عَلَيَّ حَيْنَ يُصْبِحُ عَشْرًا وَحِيْنَ يُمْسِي عَشْرًا أَدْرَكَتْهُ شَفَاعَتِي يَوْمَ الْقِيَامَةِ». رَوَاهُ الطَّبَرَانِيُّ (حسن)

హజ్రత్ అబూదర్దా(రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: ఎవరయినా నాపై ఉదయం వేళ పదిసార్లు. తిరిగి సాయంత్రం పూట పదిసార్లు దరూద్ పఠిస్తే ప్రళయదినాన వారికి నా సిఫారసు లభిస్తుంది.(తబ్రానీ-హసన్)(అల్బానీగారి సహీహ్ జామే ఉస్-సగీర్ 6233వ హదీసు)

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: كَانَ إِذَا سَلَّمَ النَّبِيُّ ﷺ مِنَ الصَّلاة قَالَ ثَلَاثَ مَرَّاتٍ : سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُوْنَ، وَسَلَامٌ عَلَى الْمُرْسَلِيْنَ، وَالْحَمْدُ للهِ رَبِّ الْعَالَمِينَ. رَوَاهُ أَبُوْ يَعْلِي (حسن)

హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం: దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సలాం చేసి నమాజ్ ముగించిన తర్వాత మూడుసార్లు ఈ విధంగా ప్రార్థించేవారు. “సుబహాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిపూన్వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హము లిల్లాహి రబ్బిల్ ఆలమీన్”, నీ ప్రభువు పరిశుద్ధుడు, గొప్ప గౌరవోన్నతులు కలవాడు, వారు కల్పిస్తున్న అన్ని విషయాలకూ అతీతుడు. దైవప్రవక్తలపై శాంతి వర్షించుగాక! సకలలోక ప్రభువే సకల స్తోత్రాలకూ అర్హుడు. (అబూయాలా – జయీఫ్)(ఈ హదీసు ఆధారాల రిత్యా బలహీనమైనది. వివరాలకోసం జయీఫ్ జామే ఉస్-సగీర్ 4419, అజ్జయిఫా 4201 లు చూడండి)

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

హదీసు పబ్లికేషన్స్ వారు ప్రచురించిన పుస్తకాలు క్రింది లింక్ దర్శించి డౌన్లోడ్ చేసుకోగలరు.
https://teluguislam.net/hadith-publications-books/

తలాఖ్ ఆదేశాలు – ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

తలాఖ్ ఆదేశాలు - ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

ఉర్దూ మూలం : మౌలానా ముహమ్మద్ ఇక్బాల్ కీలానీ
తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
ప్రకాశకులు : హదీస్ పబ్లికేషన్స్

[మొబైల్ ఫ్రెండ్లీ బుక్]
[PDF] [80 పేజీలు] [3 MB]

[డెస్క్ టాప్ బుక్ పుస్తకం]
[PDF] [80 పేజీలు] [67.4 MB]

విషయసూచిక

అన్ని చాఫ్టర్లు PDF లింకులు గా క్రింద ఇవ్వబడ్డాయి. లింక్ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చదవవచ్చు.

  • మహిళాభ్యుదయ సంఘాలకు మనవి [1p]
  • 1. ముందు మాట [28p]
    • కఠినమైన మార్గం
    • విడాకుల సాంప్రదాయిక పద్ధతి
    • ముఖ్య నియమ నిభందనలు
    • ఒక విడాకుతో వేరుపడటం
    • రెండు విడాకులతో వేరు పడటం
    • మూడు విడాకులతో విడిపోయే ధర్మ సమ్మతమైన పద్ధతి
    • ఖులా
    • ఏక కాలంలో మూడు విడాకులు
    • హలాలా
    • ఇస్లాం – సమత్వం, సమతూకంతో కూడిన ధర్మం
    • వివాహ చట్టాలు
    • విడాకులు
    • నియోగ చట్టం
    • ఇస్లాం మరియు మనిషి గౌరవ మర్యాదలు
    • ముగింపు

హదీసుల పరంగా చాఫ్టర్లు

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

హదీసు పబ్లికేషన్స్ వారు ప్రచురించిన పుస్తకాలు క్రింది లింక్ దర్శించి డౌన్లోడ్ చేసుకోగలరు.
https://teluguislam.net/hadith-publications-books/