1వ అధ్యాయం : విశ్వాసం (ఈమాన్) – దాని విశిష్ఠ లక్షణాలు الإيمان ما هو وبيان خصاله
5 – حديث أبي هُرَيْرَةَ قال كان النبيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بارزًا يومًا للناسِ فأَتاه رجلٌ فقال: ما الإيمان قال: الإيمان أن تؤمنَ بالله وملائكتِهِ وبلقائِهِ وبرسلِهِ وتؤمَن بالبعثِ قال: ما الإسلامُ قال: الإسلامُ أن تعبدَ اللهَ ولا تشركَ به وتقيمَ الصلاةَ وتؤدِّيَ الزكاةَ المفروضةَ وتصومَ رمضانَ قال: ما الإحسان قال: أن تعبدَ الله كأنك تراهُ، فإِن لم تكن تراه فإِنه يراك قال: متى الساعةُ قال: ما المسئولُ عنها بأَعْلَم مِنَ السائل، وسأُخبرُكَ عن أشراطِها؛ إِذا وَلَدَتِ الأَمَةُ رَبَّهَا، وَإِذا تطاولَ رُعاةُ الإبِلِ البَهْمُ في البنيان، في خمسٍ لا يعلمهنَّ إِلاَّ الله ثم تلا النبيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ (إِنَّ الله عنده علم الساعة) الآية: ثم أدبر فقال: رُدُّوه فلم يَرَوْا شيئاً فقال: هذا جبريل جاءَ يُعَلِّمُ الناسَ دينَهم __________ أخرجه البخاري في: 2 كتاب الإيمان: 37 باب سؤال جبريل النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عن الإيمان والإسلام
5. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం :- ఒక రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజలతో సమావేశమయి ఉండగా, ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి “దైవప్రవక్తా! విశ్వాసం అంటే ఏమిటి?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిస్తూ “విశ్వాసం ఉంటే నీవు అల్లాహ్ ను, దైవ దూతలను, దైవప్రవక్తలను, (పరలోకంలో) అల్లాహ్ ముందు హాజరు కావలసి ఉంటుందన్న విషయాన్ని, (మరణానంతరం మానవులు) తిరిగి బ్రతికించబడతారన్న విషయాన్ని నమ్మాలి” అని అన్నారు.
“మరి ఇస్లాం అంటే ఏమిటి?” అని ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు. “ఇస్లాం అంటే (1) నీవు అల్లాహ్ ను మాత్రమే (దేవుని గా భావించి) ఆరాధించాలి. (దైవత్వంలో) మరెవరినీ ఆయనకు సహవర్తులుగా చేయకూడదు. (2) నమాజు (ప్రార్ధనా) వ్యవస్థను నెలగొల్పాలి. (3) జకాత్ (పేదల ఆర్థిక హక్కు)ను విధిగా నెరవేర్చాలి. (4) రమజాన్ నెల ఉపవాసాలు పాటించాలి” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
“ఇహ్సాన్ అంటే ఏమిటి?” ఆ వ్యక్తి తిరిగి ప్రశ్నించాడు. “ఇహ్సాన్ అంటే, నీవు అల్లాహ్ ను ప్రత్యక్షంగా చూస్తున్నట్లు (అత్యంత భయభక్తులతో) ఆయన్ని ఆరాధించాలి. నీవు ఆయన్ని చూడలేకపోయినా ఆయన మాత్రం నిన్ను తప్పకుండా చూస్తున్నాడు. (అన్న యదార్ధాన్ని గుర్తుంచుకో)” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
“దైవప్రవక్తా! మరి ప్రళయం ఎప్పుడొస్తుంది?” మరో ప్రశ్న అడిగాడు ఆ వ్యక్తి. ప్రళయం గురించి ప్రశ్నించేవాడికన్నా సమాధానమిచ్చేవాడికి ఎక్కువేమీ తెలియదు. కాకపోతే ప్రళయ సంభవం గురించి నేను కొన్ని సూచనలు తెలియజేస్తాను. అప్పుడు దాసి తన యజమానిని కంటుంది. (అనాగరికులుగా ఉన్న) పశువుల కాపర్లు పెద్ద పెద్ద భవంతులు కట్టడంలో ఒకర్నొకరు పోటీపడతారు. ఆ ఐదు అగోచర విషయాల్లో ప్రళయం ఒకటి. దాని సంగతి అల్లాహ్ కి తప్ప మరెవ్వరికీ తెలియదు,” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
ఆ తరువాత ఆయన ఆ గడియకు సంబంధించిన జ్ఞానం అల్లాహ్ వద్ద మాత్రమే ఉన్నది. ఆయనే వర్షాన్ని కురిపిస్తాడు. తల్లుల గర్భాలలో పెరుగుతున్న దేమిటో ఆయనే ఎరుగు. తాను రేపటి రోజున ఏమి సంపాదించనున్నదో ఏ ప్రాణీ ఎరుగదు. ఏ భూభాగంపై తనకు మృత్యువు రానున్నదో ఏ వ్యక్తి ఎరుగడు (లుక్మాన్ – 34)” అన్న ఖుర్ఆన్ సూక్తిని పఠించారు.
ఈ సంభాషణ తరువాత ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘ఆ వ్యక్తిని పిలవండి’ అన్నారు. కాని కొందరు సహచరులు వెళ్ళి చూస్తే ఆ వ్యక్తి ఎక్కడా కన్పించలేదు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (అసలు విషయం బయట పెడ్తూ) “ఆ వ్యక్తి (ఎవరో కాదు) జిబ్రయీల్ (దైవదూత). ఈ విధంగా ఆయన ప్రజలకు వారి ధర్మం గురించి చెప్పడానికి వచ్చారు” అని అన్నారు.
[బుఖారీ; 2వ ప్రకరణం – విశ్వాసం, 37వ అధ్యాయం – జిబ్రయీల్…]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
2వ అధ్యాయం – నమాజు కొరకు పరిశుద్ధత అనివార్యం (వాజిబ్) وجوب الطهارة للصلاة
134 – حديث أَبِي هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: لاَ يَقْبَلُ اللهُ صَلاةَ أَحَدِكُمْ إِذَا أَحْدَثَ حَتَّى يَتَوَضَّأَ __________ أخرجه البخاري في: 90 كتاب الحيل: 2 باب في الصلاة
134. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- మీలో ఎవరి వుజూ (ముఖం కాళ్ళు చేతుల పరిశుభ్రత) అయినా భంగమయితే అతను (తిరిగి) వుజూ చేయనంతవరకు అతను చేసే నమాజును అల్లాహ్ స్వీకరించడు.
135. హజ్రత్ ఉస్మాన్ బిన్ అప్పాన్ (రదియల్లాహు అన్హు) గురించి ఉల్లేఖకులు ఇలా తెలిపారు: హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఒక చెంబులో నీళ్ళు తెప్పించి, మొదట తన రెండు ముంజేతులపై నీళ్ళు పోసి కడుక్కున్నారు. తరువాత కుడి చేతిని చెంబులో ముంచి, (పిడికెడు నీళ్ళతో) నోరు పుక్కిలించారు. అలాగే ముక్కులోకి నీళ్ళు ఎక్కించి శుభ్రపరచుకున్నారు. ఆ తరువాత మూడుసార్లు ముఖం కడుక్కున్నారు. దాని తరువాత మూడుసార్లు చేతులు మోచేతుల దాకా కడుక్కున్నారు. దాని తర్వాత తడి చేతులతో తల తుడుచుకున్నారు. ఆ పై రెండు కాళ్ళు చీలమండలం వరకు మూడుసార్లు కడుక్కున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారని తెలిపారు – “ఎవరు నా పద్ధతి ప్రకారం వుజూ చేసి, మనసులో ఎలాంటి (ప్రాపంచిక) ఆలోచనలు రానివ్వకుండా పూర్తి ఏకాగ్రతతో రెండు రకాతులు నమాజు చేస్తారో అతని (ఆ తరువాయి నమాజు వరకు) జరగబోయే పాపాలు క్షమించబడతాయి.” *
[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 24వ అధ్యాయం – అల్ ఉజూయె సలాసన్ సలాసా]
* ఇక్కడ ‘పాపాలు’ అంటే చిన్న చిన్న పాపాలని అర్థం; పెద్ద పాపాలు కాదు. (అనువాదకుడు)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 29 ఆయతులు ఉన్నాయి. దైవవాణి అవతరణ, ప్రవక్తల పరంపర, తీర్పుదినం నాటి భయానక పరిస్థితుల గురించి ఈ సూరా ముఖ్యంగా వివరించింది. మొదటి ఆయతులో ‘తక్వీర్’ (చుట్టబడినది) అన్న ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. తీర్పుదినం నాడు చోటు చేసుకునే తీవ్రమైన రోదసీ మార్పుల గురించి ఇందులో చెప్పడం జరిగింది. ఆ రోజు సూర్యుడు చుట్టబడతాడు. నక్షత్రాలు కాంతిని కోల్పోతాయి. పర్వతాలు స్థానభ్రంశం చెందుతాయి. ఆ నాటి బీభత్సం కారణంగా ప్రజలు తమ విలువైన సంపదను కూడా పట్టించు కోకుండా వదిలేస్తారు. అడవి జంతువులు ఒకచోట సమీకరించబడతాయి. సముద్రాలు మరుగుతాయి. ఆత్మలను వాటి శరీరాలతో తిరిగి కలుపడం జరుగుతుంది. ఆ రోజు సజీవంగా సమాధి కావించబడిన ఆడపిల్ల నేనే పాపం చేసాను? నన్నెందుకు హత్య చేసారని ప్రశ్నిస్తుంది. ఆకాశానికి ఉన్న తెరలు తొలగించబడతాయి. స్వర్గవనాలు దగ్గరకు తీసుకురాబడతాయి. మానవుల కర్మల చిట్టాలు తెరువబడతాయి. ఆరోజున ప్రతి ఒక్కరికి తాను చేసిన మంచి లేదా చెడు తెలిసి వస్తుంది. దైవప్రవక్త ముహమ్మద్ (సఅసం) అత్యంత గౌరవనీయుడైన దైవ సందేశహరుడనీ, ఆయన పిచ్చివాడు కాదని, ఆయన దేవుని సందేశాన్ని మానవాళికి చేరవేస్తారని, అల్లాహ్ ఆయనకు తెలియజేసినది తప్ప ఆయనకు మరేవిధమైన అగోచరాల జ్ఞానం లేదని ఈ సూరా విశదీకరించింది. దివ్యఖుర్ఆన్ అల్లాహ్ వాక్కు అని, ఇది యావత్తు మానవాళికి హెచ్చరిక అని ఈ సూరా స్పష్టంగా చెప్పింది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 28 ఆయతులు ఉన్నాయి. ఏకదైవారాధన, ప్రవక్తల పరంపర గురించి ఈ సూరా ముఖ్యంగా వివరించింది.మొదటి ఆయతులో ప్రస్తావనకు వచ్చిన జిన్నులు అన్న పదాన్ని ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. దివ్య ఖుర్ఆన్ ప్రాముఖ్యానికి జిన్నులు కూడా ప్రభావితమయ్యాయని తెలియజేయడం ద్వారా ఖుర్ఆన్ ఔన్నత్యాన్ని విశదీకరించడం జరిగింది. జిన్నులు రెండు రకాలని, కొందరు మంచివారని, కొందరు చెడ్డవారని తెలిపింది. కొందరు జిన్నులు దైవవాణిని విన్న తర్వాత దానిని విశ్వసించారు. ఈ సూరా ఏకదైవారాధన ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పింది. అల్లాహ్ కు భాగస్వాములను చేర్చడం మహాపరాధమనీ, దానికి దూరంగా ఉండాలని బోధించింది. అల్లాహ్ కు కుమారులు ఎవరూ లేరని, ఆయనకు భాగస్వాములు కూడా లేరని, ఆయనకు అగోచరాలు (కంటికి కనబడనివి) అన్నీ తెలుసనీ, అల్లాహ్ ను,ఆయన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను తిరస్కరించిన వారు నరకాగ్నికి ఆహుతి అవుతారని హెచ్చరించింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అల్లాహ్ ఎన్నుకుని తన సందేశాన్ని మానవాళికి చేరవేయడానికి పంపాడని, మానవులు ఆయనకు విధేయత చూపాలని, అల్లాహ్ కు భాగస్వాములుగా ఎవరినీ నిలబెట్టరాదని బోధించింది.
ఖురాన్ తఫ్సీర్ – సూరా అల్ జిన్న్ – పార్ట్ 1 (అయతులు 1-7) వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/TI28ZCm3pN0 [52 నిముషాలు]
ఈ ప్రసంగంలో సూరతుల్ జిన్ (72వ అధ్యాయం)లోని మొదటి ఏడు ఆయతుల (వచనాలు) యొక్క తఫ్సీర్ (వివరణ) ఇవ్వబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో మరియు తాయిఫ్లో తీవ్రమైన తిరస్కరణ, కష్టాలను ఎదుర్కొన్నప్పుడు, అల్లాహ్ ఆయనకు ఓదార్పునివ్వడానికి ఈ సంఘటనను తెలియజేశాడు. మానవులు తిరస్కరించినప్పటికీ, అల్లాహ్ యొక్క మరొక సృష్టి అయిన జిన్నాతులు ఖుర్ఆన్ విని, దాని అద్భుత స్వభావానికి ప్రభావితులై, తక్షణమే విశ్వసించి, షిర్క్ను త్యజించారు. ఈ సూరత్ తౌహీద్ (ఏకదైవారాధన), రిసాలత్ (ప్రవక్తృత్వం) మరియు ఆఖిరత్ (పరలోక జీవితం) యొక్క ప్రాథమిక సూత్రాలను నొక్కి చెబుతుంది. ఇస్లాం పూర్వపు అరబ్బులు జిన్నాతుల శరణు వేడుకోవడం వంటి షిర్క్ చర్యలను, మరియు దాని పర్యవసానాలను ఇది ఖండిస్తుంది. ఖుర్ఆన్ యొక్క మార్గదర్శకత్వం, దానిని శ్రద్ధగా వినడం మరియు దాని బోధనల ప్రకారం జీవించడం యొక్క ప్రాముఖ్యతను ఈ వివరణ స్పష్టం చేస్తుంది.
72:1 قُلْ أُوحِيَ إِلَيَّ أَنَّهُ اسْتَمَعَ نَفَرٌ مِّنَ الْجِنِّ فَقَالُوا إِنَّا سَمِعْنَا قُرْآنًا عَجَبًا (ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) వారికి చెప్పు: నాకు దివ్యవాణి (వహీ) ద్వారా ఇలా తెలియజేయబడింది – జిన్నుల సమూహం ఒకటి (ఖుర్ఆన్ ను ) విన్నది. వారు (తమ వాళ్లతో) ఇలా అన్నారు: “మేమొక అద్భుతమైన ఖుర్ఆన్ ను విన్నాము.”
72:2 يَهْدِي إِلَى الرُّشْدِ فَآمَنَّا بِهِ ۖ وَلَن نُّشْرِكَ بِرَبِّنَا أَحَدًا “అది సన్మార్గం వైపు దర్శకత్వం వహిస్తోంది. అందుకే మేము దానిని విశ్వసించాము. ఇక నుంచి మేము ఎవరినీ – ఎన్నటికీ – మా ప్రభువుకు సహవర్తుల్ని కల్పించము.”
72:3 وَأَنَّهُ تَعَالَىٰ جَدُّ رَبِّنَا مَا اتَّخَذَ صَاحِبَةً وَلَا وَلَدًا “ఇంకా – మా ప్రభువు మహిమ అత్యున్నతమైనది. ఆయన తన కోసం (ఎవరినీ) భార్యగాగానీ, కొడుకుగాగానీ చేసుకోలేదు.”
72:4 وَأَنَّهُ كَانَ يَقُولُ سَفِيهُنَا عَلَى اللَّهِ شَطَطًا “ఇంకా – మనలోని మూర్ఖుడు అల్లాహ్ గురించి సత్యవిరుద్ధమైన మాటలు పలికే వాడు.”
72:5 وَأَنَّا ظَنَنَّا أَن لَّن تَقُولَ الْإِنسُ وَالْجِنُّ عَلَى اللَّهِ كَذِبًا “మనుషులైనా, జిన్నులైనా అల్లాహ్ కు అబద్ధాలు అంటగట్టడం అనేది అసంభవమని మనం అనుకున్నాము.”
72:6 وَأَنَّهُ كَانَ رِجَالٌ مِّنَ الْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍ مِّنَ الْجِنِّ فَزَادُوهُمْ رَهَقًا “అసలు విషయం ఏమిటంటే కొందరు మనుషులు కొందరు జిన్నాతుల శరణు వేడేవారు. ఈ కారణంగా జిన్నాతుల పొగరు మరింత పెరిగిపోయింది.”
72:7 وَأَنَّهُمْ ظَنُّوا كَمَا ظَنَنتُمْ أَن لَّن يَبْعَثَ اللَّهُ أَحَدًا “అల్లాహ్ ఎవరినీ పంపడని (లేక ఎవరినీ తిరిగి బ్రతికించడని) మీరు తలపోసినట్లుగానే మనుషులు కూడా తలపోశారు.”
ఈరోజు సూరతుల్ జిన్ మనం చదవబోతున్నాము. ఒకవేళ రాసుకుంటున్నారంటే త్వరగా రాసుకోండి.
قُلْ (కుల్) (ఓ ప్రవక్తా!) చెప్పు. (72:1)
أُوحِيَ (ఊహియ) నాకు వహీ చేయబడినది. (72:1 నుండి)
సర్వసామాన్యంగా వహీని తెలుగులో దివ్యవాణి లేదా దివ్య సందేశం అని అంటారు. దివ్యవాణి, దివ్య సందేశం చేయబడినది, పంపబడినది.
إِلَيَّ (ఇలయ్య) నా వైపున.
أَنَّهُ اسْتَمَعَ (అన్నహుస్తమ’అ) అదేమనగా, అంటే నాకు వహీ చేయబడిన విషయం ఏమనగా, ఇస్తమ’అ – విన్నారు.
ఇస్తమ’అ అంటే అరబీలో సమి’అ అని కూడా వస్తుంది. మనం రుకూ నుండి నిలబడినప్పుడు కూడా సమి’అల్లాహు లిమన్ హమిద అంటాము. సమి’అ అంటే కూడా విన్నాడు, ఇస్తమ’అ అంటే కూడా విన్నాడు. కానీ ఇస్తమ’అలో కొంచెం శ్రద్ధగా వినే ఒక మాట ఉంటుంది, భావం ఉంటుంది. అయితే కావాలంటే మీరు రాసుకోవచ్చు, ఇస్తమ’అ – శ్రద్ధగా విన్నారు.
نَفَرٌ (నఫరున్) నఫరున్ అంటే చిన్న సమూహం. ఇక్కడ ఎందుకు అంటున్నాము చిన్న సమూహం అని? సర్వసామాన్యంగా అరబీలో మూడు నుండి పది లోపు లెక్క ఏదైతే ఉంటుందో, సంఖ్య ఏదైతే ఉంటుందో, అది ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు, ఐదుగురు కావచ్చు పది వరకు, నఫర్ అని అంటారు. చిన్న సమూహం.
مِّنَ الْجِنِّ (మినల్ జిన్) జిన్నాతులలో నుండి.
فَقَالُوا (ఫకాలూ) వారు అన్నారు. అసలు పదం ఇక్కడ కాలూ, వారు పలికారు, వారు అన్నారు.
إِنَّا (ఇన్నా) నిశ్చయంగా మేము
سَمِعْنَا (సమి’అనా) విన్నాము. చూశారా, ఇక్కడ వచ్చింది. ఇక్కడ సమి’అనా అని వచ్చింది ఎందుకు? ఎందుకంటే అక్కడ కేవలం తెలియజేస్తున్నారు ఇతరులకు. అయితే ఆ విషయం అనేది సమి’అనా అని వచ్చింది.
قُرْآنًا (ఖుర్ఆనన్) ఖుర్ఆన్.
عَجَبًا (అజబా) అద్భుతమైన.
يَهْدِي (యహ్ దీ) మార్గదర్శకత్వం చేస్తుంది.
إِلَى الرُّشْدِ (ఇలర్ రుష్ద్) రుష్ద్ అంటే ఇక్కడ సరైన మార్గం, సరైనది. ఆ, సన్మార్గం అని అంటే కూడా తప్పు కాదు.
فَآمَنَّا بِهِ (ఫ ఆమన్నా బిహీ) కనుక మేము విశ్వసించాము దానిని.
وَلَن نُّشْرِكَ (వలన్ నుష్రిక) మరియు మేము షిర్క్ చేయము.
بِرَبِّنَا (బిరబ్బినా) మా ప్రభువుతో పాటు
أَحَدًا (అహదన్) ఏ ఒక్కరిని.
వలన్ నుష్రిక – మేము షిర్క్ చేయము, మేము భాగస్వామి కల్పించము, సహవర్తున్ని నిలబెట్టము.
وَأَنَّهُ تَعَالَىٰ (వ అన్నహూ త’ఆలా) త’ఆలా అంటే ఉన్నతమైనది, మహోన్నతమైనది.
جَدُّ (జద్దు) ఇక్కడ అల్లాహ్ యొక్క గొప్పతనం, ఔన్నత్యం.
అరబీలో మనం తండ్రి యొక్క తండ్రి, ఆ తాతయ్యను, గ్రాండ్ ఫాదర్ని ఉర్దూలో దాదా అని ఏదైతే అంటారో వారిని కూడా జద్ అనబడుతుంది. ఎందుకంటే ఏ ఫ్యామిలీలో కూడా పెద్దవారు ఎవరైతే ఉంటారో వారికి ఒక పెద్ద గౌరవ స్థానం అనేది కూడా ఉంటుంది, దాని పరంగా జద్ అనబడుతుంది అని అంటారు. ఇక్కడ ఉద్దేశం ఏంటి? మా ప్రభువు ఔన్నత్యం చాలా గొప్పది, ఉన్నతమైనది.
مَا اتَّخَذَ (మత్తఖద) చేసుకోలేదు. అంటే అల్లాహు త’ఆలా విషయం చెప్పడం జరుగుతుంది, అల్లాహు త’ఆలా చేసుకోలేదు.
صَاحِبَةً (సాహిబతన్) ఎవరిని కూడా భార్యగా. సాహిబతన్ – భార్యగా.
شَطَطًا (షతతా) షతతా అన్నటువంటి ఆ అరబీ పదానికి వాస్తవానికి ఏదైనా ఒక హద్దును దాటడం అని కూడా వస్తుంది. ఆ, ఏదైనా హద్దును దాటడం. అయితే ఇక్కడ భావం ఏంటంటే సత్యానికి విరుద్ధంగా హద్దులు దాటడాన్ని, మీరు రాసుకోండి సత్య విరుద్ధమైన, దారుణమైన.
وَأَنَّا ظَنَنَّا (వ అన్నా దనన్నా) మరియు నిశ్చయంగా మేము భావించే వారిమి.
أَن لَّن تَقُولَ (అన్ లన్ తకూల) ఈ లన్ అన్నది ఏదైనా విషయం, మాట, పని, లా అని ఏదైతే మనం అంటామో దానికంటే ఎక్కువ ఖచ్చితమైన భావం, నిరాకరణ భావం లన్ అనే పదంలో ఉంటుంది. లన్ తకూలు – ఎన్నటికీ చెప్పరు.
الْإِنسُ وَالْجِنُّ عَلَى اللَّهِ كَذِبًا (అల్ ఇన్సు వల్ జిన్ అలల్లాహి కదిబా) అల్ ఇన్సు – మానవులు, వల్ జిన్ – జిన్నాతులు, అలల్లాహి – అల్లాహ్ పై, కదిబా – అబద్ధాలు. అంటే జిన్నాతులను మానవులు ఎన్నటికీ అల్లాహ్ పై ఎలాంటి అబద్ధం చెప్పనే చెప్పరు, ఇలా మేము అనుకునే వారిమి.
يَعُوذُونَ (య’ఊదూన) అ’ఊదు అని మనం సూరతుల్ ఫలక్ సూరతున్నాస్ లో చదువుతాము. సర్వసామాన్యంగా ఖుర్ఆన్ ప్రారంభం చేసినప్పుడు అ’ఊదు బిల్లాహి అంటాము. దాని మూలం నుండే వచ్చింది య’ఊదూన. య’ఊదూన అంటే శరణు వేడుకునేవారు.
رَهَقًا (రహకా) రహకా అంటే ఇక్కడ తలబిరుసుతనం వస్తుంది, పొగరు. ఈ రెండు కూడా వస్తాయి, రెండు కూడా రాయండి పర్లేదు.
وَأَنَّهُمْ (వ అన్నహుమ్) మరియు వారు
ظَنُّوا (దన్నూ) భావించేవారు.
كَمَا ظَنَنتُمْ (కమా దనన్ తుమ్) ఎలాగైతే మీరు భావించారో.
أَن لَّن يَبْعَثَ اللَّهُ (అన్ లన్ యబ్’అసల్లాహు) أَحَدًا (అహదా) అల్లాహ్ – అల్లాహ్, లన్ యబ్’అస్ – తిరిగి బ్రతికించడు, అల్లాహ్ అహదా – ఏ ఒక్కరిని.
యబ్’అస్ అన్నటువంటి ఈ పదంలో రెండు భావాలు వస్తాయి. ఒకటి, పంపడం, ప్రవక్తగా ఎవరినైనా చేసి పంపడం. మరొకటి, చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ లేపడం. ఈ రెండు భావాలు ఉంటాయి.
సూరతుల్ జిన్ – పరిచయం మరియు సందర్భం
బిస్మిల్లాహ్ అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.
సూరతుల్ జిన్. ఈ సూరత్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తృప్తిని ఇస్తూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క గౌరవ మర్యాద, గొప్పతనాన్ని తెలియజేస్తూ. ప్రవక్తకు తృప్తి, శాంతి ఏంటి? ఓ ప్రవక్తా ఈ మానవులు ఎవరైతే చిన్నప్పటి నుండి మిమ్మల్ని మంచిగా చూసుకుంటూ అంటే మిమ్మల్ని మంచిగా గ్రహిస్తూ, మీ యొక్క సద్వర్తనను అర్థం చేసుకుంటూ, మీరు ఎంతో మంచివారు అని తెలిసినప్పటికీ కూడా మీ మాట వినకుండా, మీ బోధనను స్వీకరించకుండా మీరు ఏ ఖుర్ఆన్ తిలావత్ చేసి వినిపిస్తున్నారో దానిని వారు తిరస్కరిస్తూ మీ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో దాని గురించి రంది పడకండి. ఈ మానవులు మిమ్మల్ని గ్రహించకుంటే గ్రహించకపోయిరి, కానీ అల్లాహ్ సృష్టిలోని మరొక సృష్టి జిన్నాతులు మిమ్మల్ని విశ్వసించి, మీరు చదివే ఖుర్ఆన్ను విని, దాని పట్ల ఎలా ప్రభావితులయ్యారో ఆ పూర్తి సంఘటన మీకు తెలియజేస్తున్నాను, మీరు చూడండి, వినండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తృప్తిని ఇవ్వడం జరుగుతుంది.
మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర చదివి ఉండేది ఉంటే ఇటు ప్రవక్త వారిపై రెండు సంఘటనలు జరిగి ఉంటాయి కదా. అవిశ్వాసుల దౌర్జన్యాలు ప్రవక్తపై చాలా పెరిగిపోయి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సుమారు 10, 11 సంవత్సరాల వరకు మక్కా వాసుల మధ్యలో అన్ని విధాలుగా వారికి సత్యాన్ని, ధర్మాన్ని బోధించే ప్రయత్నం చేస్తూ వారు వినడం లేదు, చాలా తక్కువ మంది మాత్రమే ఇస్లాం స్వీకరించారు. ఆ మధ్యలోనే హజ్రత్ అబూ తాలిబ్, హజ్రత్ ఖదీజా రదియల్లాహు త’ఆలా అన్హా వారి యొక్క మరణం తర్వాత మరింత ఎక్కువగా దౌర్జన్య కాండలు పెరిగిపోతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాయిఫ్ వెళ్లి అక్కడ వారికి దావత్ ఇస్తారు, కానీ వారు కూడా స్వీకరించకుండా తిరిగి వస్తున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చాలా బాధ పెడతారు, శారీరకంగా చాలా నష్టం చేకూరుస్తారు. ఇలా ఇన్ని రకాల బాధలు ఉన్న సందర్భంలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి వస్తుండగా నఖ్లా అనే ప్రాంతంలో ఉండగా ఈ సంఘటన సంభవిస్తుంది. ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ నమాజ్లో ఖుర్ఆన్ యొక్క తిలావత్ చేస్తూ ఉంటారు, జిన్నాతులు వచ్చి విని వెళ్లి తమ జాతి వారికి ఈ ఖుర్ఆన్ గురించి బోధ చేస్తాయి. అయితే దీనికి సంబంధించిన కొన్ని హదీసుల భావం మనం తెలుసుకుందాము. సహీహ్ ముస్లిం గ్రంథంలోని హదీసులు, ఒకవేళ హదీస్ నెంబర్ మీరు ఇంగ్లీష్, అరబీ పుస్తకాల్లో వెతకాలంటే తెలుసుకోవాలంటే 449 హదీస్ నెంబర్ నుండి ఆ తర్వాత కొన్ని హదీసులు.
సారాంశం ఏమిటంటే నేను ఒక రెండు హదీసుల సారాంశం చెబుతున్నాను. మొదటి హదీస్ హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు. హజ్రత్ మ’అన్ బిన్ యజీద్, మస్రూఖ్, తాబియీ హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు వారి యొక్క శిష్యులు మస్రూఖ్. మస్రూఖ్ని మ’అన్ యొక్క తండ్రి యజీద్ అడుగుతున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ నమాజ్లో ఖుర్ఆన్ తిలావత్ చేస్తున్నప్పుడు జిన్నాతులు వచ్చి విన్నాయి అన్న సంఘటన ప్రవక్తకు ఎవరు తెలియజేశారు? అయితే మస్రూఖ్ చెప్పారు నేను మీ తండ్రి అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ తో విన్నాను. అక్కడ ఒక చెట్టు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేసింది, కొందరు జిన్నాతులు మీ యొక్క తిలావత్ను వింటున్నారు అని. ప్రత్యేకంగా ఈ హదీస్ను ఎందుకు ప్రస్తావించాను అంటే అల్హందులిల్లాహ్ వాస్తవానికి మనందరికీ కూడా ఇందులో ప్రత్యేకంగా ఎవరైతే దావా పని చేస్తూ ఉంటారో ఇతరులకు బోధ చేస్తూ ఉంటారో వారు ఎన్ని సమస్యలు ఎదురైనా ఎంత ఇబ్బంది కలిగినా ప్రజల నుండి వారికి ఎలాంటి ఆపద కలిగినా అల్లాహ్ కొరకు ఓపిక సహనాలు వహిస్తూ ఉండేది ఉంటే అల్లాహు త’ఆలా వారికి తృప్తినిచ్చే కొన్ని సందర్భాలు కూడా కనబరుస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి స్థితిలో ఉన్నారు అక్కడ జిన్నాతులు వచ్చి వినడం, జిన్నాతులు వచ్చి వింటున్న విషయం ప్రవక్తకు తెలియదు. అల్లాహ్ తర్వాత వహీ ద్వారా తెలిపాడు కరెక్టే కానీ అక్కడ చెట్టు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ విషయం తెలియజేసింది. అంటే ఆ చెట్టు కూడా అల్లాహ్ యొక్క అనుమతితోనే ప్రవక్తకు తెలియజేస్తుంది. ఇందులో ప్రవక్త వారి ము’అజిజా (మహిమ) కూడా ఉంది, మరియు కేవలం మానవులే కాదు, అల్లాహు త’ఆలా తన యొక్క దాసునికి సహాయం చేయాలి, అతడు అల్లాహ్ కొరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు అతనికి తృప్తిని ఇవ్వాలి అని అల్లాహ్ కోరినప్పుడు ఏ మార్గం నుండైనా గానీ, చెట్టు నుండి అయినా గానీ ఎలాంటి సహాయం అందిస్తాడు, ఎలాంటి తృప్తిని కలుగజేస్తాడు మనకు ఇందులో బోధపడుతుంది.
మరొక విషయం ఇక్కడ మనం గమనించాల్సింది అది నేను ఇంతకుముందు చెప్పిన 449 హదీస్ నెంబర్లో కూడా కనబడుతుంది. అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు త’ఆలా అన్హు వింటున్నారు, ఉల్లేఖిస్తున్నారు. మరియు దీని తర్వాత హదీస్ నెంబర్ 450లో ఉంది హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖిస్తున్నారు.
ఆ హదీస్ల యొక్క సారాంశం ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ తిలావత్ చేస్తున్నప్పుడు జిన్నాతులు వచ్చి ఖుర్ఆన్ను శ్రద్ధగా విన్నారు మరియు విన్న తర్వాత వారి యొక్క మాట, వారు ఎలా ప్రభావితమయ్యారో ఖుర్ఆన్ ద్వారా దాన్ని ఎలా చెబుతున్నారో ఇక రండి మనం ఖుర్ఆన్ ఆయతుల ద్వారానే తెలుసుకుందాము.
ఇక్కడ ఈ సందర్భంలో మనం మరొక విషయం తెలుసుకోవడం చాలా లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుతం మీరు చదువుతున్నారు సూరత్ అల్-జిన్. కానీ ఈ జిన్నాతుల యొక్క సంఘటన సూరతుల్ అహ్కాఫ్, సూర నెంబర్ 46, ఆయత్ నెంబర్ 29 నుండి సుమారు చివరి వరకు అక్కడ కూడా అల్లాహు త’ఆలా ఈ విషయాన్ని ప్రస్తావించాడు.
ఇక వినండి ఒక్కసారి మీరు శ్రద్ధగా ఆయతుల యొక్క భావాన్ని, అందులో మనకు ఉన్నటువంటి గుణపాఠాలను. అల్లాహ్ ఇక్కడ చెప్తున్నాడు, కుల్ – చెప్పు. ఊహియ ఇలయ్య – నాకు వహీ చేయడం జరిగినది. ఇక్కడే కొంచెం ఆగి మనం ఒక విషయం తెలుసుకోవాలి. అది ఏమిటంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇల్మె గైబ్ (అగోచర జ్ఞానం) లేదు అన్న విషయం ఇక్కడ ఈ ఆయత్ మరియు ఈ ఆయత్లో దీని వ్యాఖ్యానంలో వచ్చిన హదీసుల ద్వారా కూడా తెలుస్తుంది. ఎలా అంటే జిన్నాతులు వచ్చి విన్నారు కానీ ప్రవక్తకు ఆ విషయం తెలియదు. వహీ ద్వారా తెలపడం జరిగినది. అయితే ప్రవక్త ఆలిముల్ గైబ్ కారు, అగోచర జ్ఞానం కలిగిన వారు కారు అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. సరే.
ఇస్తమ’అ నఫరుమ్ మినల్ జిన్ – జిన్నాతులోని కొంతమంది విన్నారు. ఏం విన్నారు? ఈ ఖుర్ఆన్ని విన్నారు. అయితే ఈ ఖుర్ఆన్ను కొంతమంది జిన్నాతులు కూడా శ్రద్ధగా వింటున్నప్పుడు ఓ మక్కా యొక్క అవిశ్వాసుల్లారా! ఇప్పుడు ఉన్నటువంటి ఓ ముస్లింలారా! మీరు ఈ ఖుర్ఆన్ను ఎందుకు శ్రద్ధగా చదవడం లేదు? ఎందుకు శ్రద్ధగా వినడం లేదు? ఎందుకు శ్రద్ధగా అర్థం చేసుకోవడం లేదు? మీరు అష్రఫుల్ మఖ్లూకాత్, సర్వ సృష్టిలో అత్యున్నత, అత్యుత్తమ సృష్టి మీరు. మీరు ఈ ఖుర్ఆన్ను మంచిగా అర్థం చేసుకోవడం, వినడం మీపై ఎక్కువ బాధ్యత ఉన్నది. ఈ బోధ మనందరికీ ఉంది, ఖుర్ఆన్ వినని వారి కొరకు ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే జిన్నాతుల కంటే కూడా ఎక్కువ ఘనత గల వారు మానవులు మరియు మానవుల కొరకే ప్రత్యేకంగా ఆ తర్వాత జిన్నాతుల కొరకు కూడా ఈ ఖుర్ఆన్ అవతరింప చేయడం జరిగినది. అలాంటి ఈ ఖుర్ఆన్ను మానవులు వినకుంటే ఇది చాలా శోచనీయం, బాధాకరమైన విషయం.
ఆ జిన్నాతులు విన్నారు ఆ తర్వాత ఏమన్నారు?
إِنَّا سَمِعْنَا قُرْآنًا عَجَبًا (ఇన్నా సమి’అనా ఖుర్ఆనన్ అజబా) మేమొక అద్భుతమైన ఖుర్ఆన్ ను విన్నాము. (72:1)
అల్లాహు అక్బర్. కానీ ఒక్కసారి తిరిగి రండి వెనక్కి మళ్ళీ మీరు. సూరతుల్ అహ్కాఫ్లో చూడండి ఆయత్ నెంబర్ 29లో యస్తమి’ఊనల్ ఖుర్ఆన్. ఆ జిన్నాతులు ఖుర్ఆన్ను శ్రద్ధగా వింటూ,
فَلَمَّا حَضَرُوهُ قَالُوا أَنصِتُوا (ఫలమ్మా హదరూహు కాలూ అన్సితూ) ప్రవక్త వద్దకు హాజరై శ్రద్ధగా వింటూ, ఖుర్ఆన్ వింటున్నప్పుడు పరస్పరం ఒకరికి ఒకరు మీరు మౌనం వహించండి, ఖుర్ఆన్ను ఇంకా శ్రద్ధగా వినండి అని ఒకరికి ఒకరు చెప్పుకున్నారు. (46:29 నుండి)
అల్లాహు అక్బర్. ఇక్కడ కూడా వచ్చింది ఇస్తమఅ నఫరుమ్ మినల్ జిన్ అని. కానీ అక్కడ సూరత్ అహ్కాఫ్ లో అన్సితు మీరు మౌనం వహించండి. మరియు సూరత్ ఆలే సూరతుల్ ఆరాఫ్ యొక్క చివర్లో మీరు చూస్తే వఇదా కురిఅల్ ఖుర్ఆను ఫస్తమిఊ లహు వ అన్సితు. ఫస్తమిఊ లహు వ అన్సితు. శ్రద్ధగా వినడం. అంటే మనసు పెట్టడం, మనసు దానికి లగ్నం చేయడం, వ అన్సితు ఎలాంటి వేరే డిస్టర్బెన్స్ లేకుండా వినడానికి ప్రయత్నం చేయడం, మౌనం వహించడం. ఈ విధంగా కూడా వారు పరస్పరం ఒకరికి ఒకరు చెప్పుకున్నారు.
అయితే ఇక్కడ ఏముంది మళ్ళీ ఫలమ్మా కుదియ సూరతుల్ అహ్కాఫ్ లో ఎప్పుడైతే ఖురాన్ తిలావత్ పూర్తి అయిపోయిందో వల్లౌ ఇలా కౌమిహిమ్ ఆ విన్న జిన్నాతులు తమ జాతి వారి వైపునకు వెళ్ళిపోయారు ముందిరీన్ వారిని హెచ్చరిస్తూ.
అల్లాహు అక్బర్. చూశారా? ఒక సత్యం తెలిసింది అంటే దాన్ని ఇతరులకు తెలపడం, షిర్క్ యొక్క చెడుతనం తెలిసింది అంటే దాని గురించి హెచ్చరించడం మన బాధ్యత అని వారు వెంటనే తిరిగిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఆగి ప్రవక్తను కలుసుకోలేదు. వెంటనే వెళ్లి జాతి వారు ఏ చెడులో ఉన్నారో, ఏ షిర్క్ చేస్తున్నారో వారిని ఆ షిర్క్ నుండి కాపాడటానికి వెళ్ళిపోయారు.
ఇక్కడ ధర్మవేత్తలు ఏం చెప్తున్నారంటే జిన్నాతులు అల్లాహ్ యొక్క సృష్టి వారు మనకు కనబడకపోయినప్పటికీ వారిలో స్త్రీలు, పురుషులు అందరూ ఉన్నారు, వారికి కూడా సంతానం కలుగుతుంది, వారిలో కూడా పెళ్లిళ్లు ఉన్నాయి మరియు మానవుల్లో ఎలాగైతే వర్గాలు ఉన్నాయో ధర్మపరంగా ఇంకా వేరే రీతిలో జిన్నుల్లో కూడా యూదులు, క్రైస్తవులు, ఇంకా వేరే రకమైన షిర్క్ చేసే వారు, మంచి వారు, పాపం చేసే వారు ఈ విధంగా రకరకాలుగా ఉన్నారు.
ఎందుకంటే సూరతుల్ అహ్కాఫ్ లోని ఆయత్ నంబర్ 30 ద్వారా చెబుతున్నారు కొందరు ధర్మవేత్తలు. ఏముంది అక్కడ? వారు వెళ్లి తమ జాతి వారికి చెప్పారు యా కౌమనా ఓ ప్రజలారా ఇన్నా సమీఅనా కితాబన్ నిశ్చయంగా మేము ఒక గ్రంథం గురించి విన్నాము ఉంజిల మింబ అది మూసా అది మూసా తర్వాత అవతరింప చేయబడినది. ముసద్దికం లిమాబైన యదైహ్ అంటే ఈ ఖురాన్ కు ముందు అవతరించిన గ్రంథాలను ధృవీకరిస్తుంది. యహదీ ఇలల్ హక్ సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది. వఇలా తరీకిమ్ ముస్తకీమ్ మరియు సన్మార్గం వైపునకు. చూశారా వారు సత్యాన్ని విన్న వెంటనే వెళ్లి తమ జాతి వారికి తెలుపుతూ ఇది మూసా తర్వాత అవతరించినటువంటి గ్రంథం అని ఈ ఆయత్ ద్వారా చెప్తున్నారు ధర్మవేత్తలు వారు యూదులుగా ఉండినారు. ఆ జిన్నాతులు ఎవరైతే విన్నారో. ఎందుకంటే యూదులు ఈసా అలైహిస్సలాం ను విశ్వసించరు గనక ఈసా అలైహిస్సలాం ప్రస్తావన ఇక్కడ రాలేదు అంటారు.
మనకు ఇందులో బోధన ఏంటి? ఆ జిన్నాతుల కంటే మేలు, మంచివారము మనం. మనం ఈ ఖుర్ఆన్ పట్ల వారి కంటే ఎక్కువ శ్రద్ధ చూపాలి.
సూరతుల్ జిన్లో అజబన్ అని ఏదైతే చూస్తున్నారో దాని యొక్క భావం ఏంటి? అజబన్ అంటే చాలా అద్భుతమైనది. ఏ రకంగా అద్భుతమైనది? ఖుర్ఆన్ దాని యొక్క అరబీ శైలి, అరబీ సాహిత్య ప్రకారంగా చాలా అద్భుతమైనది. మరియు అందులో ఉన్నటువంటి బోధనల ప్రకారంగా చూసుకుంటే కూడా చాలా అద్భుతమైనది. అలాగే ఈ ఖుర్ఆన్ ఇతరులపై ఏ ప్రభావం చూపిస్తుందో దాని ప్రకారంగా కూడా ఇది చాలా అద్భుతమైనది. ఇది చాలా అద్భుతమైన గ్రంథం.
فَآمَنَّا بِهِ (ఫ ఆమన్నా బిహీ) మేము దానిని విశ్వసించాము. (72:2)
అంటే ఖుర్ఆన్ గ్రంథాన్ని విశ్వసించాము. ఇక్కడ చూడండి ఇక ఎంత తొందరగా వారు విశ్వాస మార్గాన్ని అవలంబించారు. సత్యాన్ని విన్నారు అంటే ఏ ఆలస్యం వారు చేయలేదు. అయితే ఇక్కడ ఏంటి ప్రత్యేకంగా మక్కా అవిశ్వాసులకు ఇందులో ఒక రకమైన కొరడాలు ఉన్నాయి. ఖుర్ఆన్ ప్రవక్త వారు తిలావత్ చేస్తూ ఉంటే వారు పరస్పరం ఏమనుకుంటారు? లా తస్మ’ఊ లిహాదల్ ఖుర్ఆన్. సూరత్ హామీమ్ సజ్దాలో ఉంది చూడండి. మీరు ఖుర్ఆన్ను వినకండి, వల్గౌ ఫీహి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ తిలావత్ చేస్తుంటే మీరు అల్లరి చేయండి అని వారు ఒకరికొకరు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ జిన్నాతులు చూడండి అన్సితూ శ్రద్ధగా వినండి, మౌనం వహించండి అని ఒకరికి ఒకరు చెప్పుకుంటున్నారు. మరియు ఈ జిన్నాతులు విన్న వెంటనే విశ్వసించారు. మరియు ఈ మానవులు సంవత్సరాల తరబడి ఖుర్ఆన్ను వింటూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు కానీ అది వారి యొక్క మదిలో దిగడం లేదు, దాన్ని వారు ఇంకా విశ్వసించడం లేదు.
షిర్క్ యొక్క ఖండన మరియు జిన్నాతుల పశ్చాత్తాపం
ఆ తర్వాత ఉంది,
وَلَن نُّشْرِكَ بِرَبِّنَا أَحَدًا (వలన్ నుష్రిక బిరబ్బినా అహదా) మరియు మేము మా ప్రభువుకు ఎవ్వరినీ కూడా భాగస్వామిగా, సాటిగా కల్పించము. (72:2)
షిర్క్ యొక్క ఖండన ఇందులో చాలా స్పష్టంగా ఉంది. వారికి కూడా అర్థమైపోయింది షిర్క్ ఎంత చెడ్డ పని అని. అందుకొరకే ఇక మేము ఎన్నటికీ అల్లాహ్తో పాటు ఎవరినీ సాటిగా కల్పించము, ఎవరినీ కూడా భాగస్వామిగా చేయము. మరియు అల్లాహు త’ఆలాకు ఎలాంటి భార్య గానీ, సంతానం గానీ లేదు, అలాంటి అవసరం అల్లాహ్కు ఏ మాత్రం లేదు అని దాని తర్వాత ఆయతులో చెప్పడం జరుగుతుంది. అందుకొరకే ఉంది,
وَأَنَّهُ تَعَالَىٰ جَدُّ رَبِّنَا (వ అన్నహూ త’ఆలా జద్దు రబ్బినా) మరియు నిశ్చయంగా మా ప్రభువు వైభవం ఎంతో ఉన్నతమైనది. మా ప్రభువు చాలా గొప్పవాడు.
مَا اتَّخَذَ صَاحِبَةً وَلَا وَلَدًا (మత్తఖద సాహిబతన్ వలా వలదా) ఆయన ఎవరినీ కూడా భార్యగా మరియు కుమారునిగా చేసుకోలేదు. (72:3)
ఈ విషయం మనందరికీ కూడా చాలా స్పష్టమైనది. ముష్రికులు దైవదూతలను అల్లాహ్ యొక్క కుమార్తెలు అనేవారు. క్రైస్తవులు ఈసా అలైహిస్సలాంను అల్లాహ్ కుమారుడుగా, యూదులు ఉజైర్ అలైహిస్సలాంని అల్లాహ్ కుమారుడుగా అంటున్నారు. కానీ వాస్తవానికి ఎవరూ కూడా అల్లాహ్ యొక్క భార్య కారు, అల్లాహ్ యొక్క సంతానం కారు.
వాస్తవానికి అల్లాహ్కు భాగస్వామి ఎవరూ లేరు, అల్లాహ్తో పాటు ఎవరిని షిర్క్ చేయకూడదు మరియు అల్లాహ్కు సంతానం, భార్య ఉంది అని నమ్మకూడదు, ఇవన్నీ కూడా తప్పు మాట. కానీ మాలోని కొందరు అవివేకులు, మాలోని కొందరు మూర్ఖులు ఇలాంటి దారుణమైన మాటలు, సత్యానికి విరుద్ధమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ ఆయత్ ద్వారా చాలా స్పష్టంగా తెలిసిపోతుంది అల్లాహ్కు సంతానం ఉంది అని నమ్మడం, అల్లాహ్కు భార్య ఉంది అని నమ్మడం, అల్లాహ్కు భాగస్వాములు ఉన్నారు అని నమ్మడం, లేదా అలా నమ్మకపోయినా అల్లాహ్కు సంతానం ఉంది, భార్య ఉంది మరియు అల్లాహ్కు భాగస్వాములు ఉన్నారు అని నమ్మే వారికి శుభాకాంక్షలు తెలియజేయడం, అలా నమ్మే వారికి ఏదైనా తోడ్పాటు ఇవ్వడం, వారు అలాంటి తప్పుడు విశ్వాసాలతో, షిర్క్ యొక్క నమ్మకాలతో ఏమైనా పండుగలు చేసుకుంటే అందులో వారికి తోడుగా ఉండి వాటిలో పాల్గొనడం, ఇవన్నీ కూడా వాస్తవానికి మూర్ఖత్వం, అవివేకం. ఇవన్నీ కూడా సత్యానికి విరుద్ధమైన మాటలు. 25 డిసెంబర్ క్రిస్మస్ నుండి మొదలుకొని ఫస్ట్ జనవరి వరకు ఏదైతే ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏ రకమైన తప్పుడు పనుల్లో పడి ఉంటారో ఈ ఆయతుల ద్వారా కూడా మనం ఖండించవచ్చు వారికి దీని యొక్క సత్యం తెలియజేయవచ్చును.
ఆయత్ నెంబర్ ఐదును గమనించండి మీరు, చూడండి ఇక్కడ ఆ జిన్నాతులు ఒక సత్యం తెలిసిన తర్వాత వారు తమకు తాము సత్యాన్ని అవలంబించి అంతకు ముందు జ్ఞానం లేక ముందు ఏ తప్పు జరిగిందో దాని గురించి అల్లాహ్ ముందు ఎలా ఒక సాకు తెలుపుకుంటున్నారో, తమ నుండి జరిగిన తప్పును ఒప్పుకుంటూ దానిపై పశ్చాత్తాప పడుతున్నారో ఆ విషయం ఇక్కడ చెప్పడం జరిగినది. ఏంటది? మేము ఇంతకు ముందు అనుకునేవాళ్ళము మానవులు, జిన్నాతులు అల్లాహ్ పై ఎలాంటి అబద్ధం, అసత్యం చెప్పరు అని. కానీ ఇప్పుడు ఈ ఖుర్ఆన్ విన్న తర్వాత మాకు తెలిసింది, ఎంతో మంది ప్రజలు అల్లాహ్కు సంతానం కలుగజేస్తున్నారు. ఎంతో మంది జిన్నాతులు కూడా అల్లాహ్కు సంతానం ఉంది అన్నట్లుగా, అల్లాహ్తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేసి షిర్క్ చేస్తున్నారు, ఇవన్నీ తప్పులు వారు చేస్తున్నారు, వాస్తవానికి వారు అది చేస్తున్నది తప్పు అని మాకు కూడా తెలియలేదు, మేము కూడా అజ్ఞానంలో ఉండి, అంధకారంలో ఉండి ఒక తప్పుడు విషయాన్ని విశ్వసిస్తూ వచ్చాము.
అనేక తఫ్సీర్ గ్రంథాల్లో, అరబీ తఫ్సీర్ గ్రంథాల్లో ఈ విషయం చాలా స్పష్టంగా వచ్చి ఉంది. వారి యొక్క నాయకుడైన ఇబ్లీస్ అతడు కేవలం మానవులనే కాదు, ఎంతో మంది జిన్నాతులను కూడా మోసంలో పడవేసి ఉండినాడు. ఎన్నో రకాల కుఫ్రులో వారిని పడవేసి ఉండినాడు వాడు. అందుకొరకే సామాన్య జిన్నులు వారితో ఏ పొరపాటు జరిగిందో మా పెద్దలు మా వారు ఎప్పుడూ కూడా అల్లాహ్ పై ఏదైనా అబద్ధం చెప్పే అటువంటి ధైర్యం చేస్తారు అని మేము అనుకోలేదు. వారు చెప్పే మాటలు సత్యమే అని వారిని మేము గుడ్డిగా అనుసరించాము. కానీ ఇప్పుడు తెలిసింది మాకు వారు కూడా షిర్క్ చేస్తున్నారు మరియు వారు కూడా అల్లాహ్కు సంతానం కలుగజేస్తున్నారు. అలాంటి విషయాలన్నిటికీ కూడా మేము దూరంగా ఉంటాము అన్నట్లుగా చాలా స్పష్టంగా వారు తెలియజేశారు.
ఆయత్ నెంబర్ ఆరులో ఉంది. దీనిని కొంచెం శ్రద్ధ వహించాలి. తౌహీద్కు సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన మాట ఇక్కడ తెలపడం జరుగుతుంది. ఈ ఆయత్ నెంబర్ ఆరును మనం అర్థం చేసుకుంటే ఈ రోజుల్లో షైతానుల పట్ల, జిన్నాతుల పట్ల ఏదైతే భయం ఉంటుందో చాలా మందికి అది కూడా ఇన్ షా అల్లాహ్ దూరం కావచ్చు. ముందు ఒకసారి అనువాదాన్ని గ్రహించండి.
కాన రిజాలుమ్ మినల్ ఇన్సి – మానవుల్లోని కొందరు పురుషులు, మానవుల్లోని కొంతమంది య’ఊదూన – శరణు కోరేవారు, శరణు వేడుకునేవారు. ఎవరితోని? బిరిజాలిమ్ మినల్ జిన్ – జిన్నాతులోని కొందరి పురుషులతో, జిన్నాతులోని కొంతమందితో. ఏంటి ఈ సంఘటన ఇది? దేని గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది?
ధర్మవేత్తలు అంటారు, చాలా కాలం ముందు జిన్నాతులు మనుషులతో భయపడేవారు. కానీ ఈ మనుషులు ప్రయాణాలు చేస్తూ ప్రయాణ దారిలో ఎక్కడైనా వారికి రాత్రి అయింది అంటే ఎక్కడ వారు రాత్రి ఆగిపోయేవారో, రాత్రి పడుకొని ఇక మళ్ళీ పొద్దున్న మనం ప్రయాణం కొనసాగిద్దాము అని ఏదైనా ఒక చోట ఆగిన తర్వాత వారి యొక్క అల్లాహ్ పై నమ్మకం, విశ్వాసం ఎంత బలహీనమైపోయిందంటే అప్పటివరకు, ఆ రాత్రి ఏదైనా చోట ఆగిన వెంటనే ఈ ప్రాంతంలో ఏ జిన్నాతులైతే ఉన్నారో ఆ జిన్నాతులు, ఆ జిన్నాతుల నాయకుల యొక్క మేము శరణు కోరుతున్నాము, మేము రాత్రి ఇక్కడ ఆగుతున్నాము, బస చేస్తున్నాము, మాకు మీరు ఎలాంటి బాధ, హాని కలిగించవద్దు, మాకు ఎలాంటి నష్టం చేకూర్చవద్దు. ఈ విధంగా కేకలు వేసి జిన్నాతుల యొక్క సహాయం, జిన్నాతుల యొక్క శరణు కోరుతూ జిన్నాతులతో భయపడుతూ ఏమీ మీరు మాకు నష్టం చేకూర్చవద్దని విన్నవించుకోవడం, అర్ధించడం, ప్రాధేయపడటం ఇలా చేసేవారు. వేడుకునేవారు.
ఫజాదూహుమ్ రహకా – మానవులు ఇలా చేయడం ద్వారా ఈ విధంగా ఈ మానవులు వారి, హుమ్ – వారి అంటే జిన్నాతుల తలబిరుసుతనం మరింత అధికం చేశారు. అరే మానవులు కూడా మాతో భయపడుతున్నారు అంటే మమ్మల్ని ఇంత పెద్దగా వారు అనుకుంటున్నారు, భావిస్తున్నారు అని మానవులపై తమ యొక్క ఆధిపత్యం, తమ యొక్క పెత్తనం చలాయించడంలో, నడిపించడంలో, మానవులను భయపెట్టడంలో మరింత అధికమైపోయి తమకు తాము ఒక రకమైన గర్వంలో వచ్చేసారు.
ఈ ఫజాదూహుమ్ రహకా అని ఇప్పుడు మీరు చూస్తున్న ప్రకారంగా అనువాదంలో మానవులు, హుమ్ అంటే జిన్నాతులు. కానీ దీనికి విరుద్ధంగా కూడా అనువాదం చేయడం జరిగింది. అంటే ఏమిటి? ఈ మానవుల్లోని కొంతమంది జిన్నాతుల శరణు వేడుకోవడం ద్వారా ఆ జిన్నాతులు మానవుల యొక్క తలబిరుసుతనం, మానవులను సత్యం నుండి దూరం చేయడాన్ని మరింత పెంచేశాయి. అని ఎప్పుడైతే వారు అంటే మానవులు జిన్నాతులను వేడుకోవడం మొదలు పెట్టారో ఆ జిన్నాతులు దీనిని ఆసరగా తీసుకొని ఈ మానవుల్ని మరింత అల్లాహ్ కు దూరం చేయడం, మరింత సత్యం నుండి దూరం చేయడం, మరింత సత్యాన్ని తిరస్కరించడంలో బలంగా ఉండటం, ఇలాంటి తప్పుడు విషయం అన్నది పెంచేశాయి. అందుకొరకే ఈ రెండు భావాలు కూడా కరెక్టే. చెప్పే ఉద్దేశం ఏమిటి? ఎప్పుడూ కూడా మనం అల్లాహ్ వైపు నుండి వచ్చిన సత్యం ఏమిటో దాన్ని గ్రహించామంటే ఎలాంటి ఇబ్బందిలో ఉండము.
ఇక్కడ మరో విషయం తెలుస్తుంది మనకు, అల్లాహ్ ను ఏదైనా ఆపదలో, కష్టంలో, భయంలో మనం శరణు వేడుకోవడం అల్లాహ్ యొక్క ఆరాధన రకాల్లో చాలా గొప్ప రకం. ఇలా అల్లాహ్ యొక్క ఆరాధన రకాల్లో ఈ గొప్ప రకాన్ని అల్లాహ్ తప్ప వేరే ఎవరికైనా మనం అంకితం చేసామంటే ఘోరమైన షిర్క్ చేసిన వాళ్ళం అవుతాము. అందుకొరకే మనం ఏమంటాము? అ’ఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్. కుల్ అ’ఊదు బిరబ్బిల్ ఫలక్. కుల్ అ’ఊదు బిరబ్బిన్నాస్. ఈ సూరాలన్నిటిలో కూడా మనకు ఈ ఇస్తి’ఆదా, శరణు కోరడం ఇది అల్లాహ్ యొక్క ఇబాదత్ రకాల్లో ఒక ముఖ్యమైనది, ఇందులో మనం అల్లాహ్ కు ఎవరిని కూడా సాటి కల్పించకూడదు అన్నటువంటి భావం స్పష్టంగా ఉంది.
మరొక విషయం ఇందులో మనం గ్రహించాల్సింది, ఎంత షైతానులకు, జిన్నాతులకు ప్రజలు భయపడతారో అంతే అల్లాహ్ నుండి ఇంకా దూరమైపోతారు. ఇంకా షైతానులు వారిని మరింత ఆసరగా తీసుకొని బెదిరిస్తూనే ఉంటారు. అలా కాకుండా అల్లాహ్ ను మొరపెట్టుకొని ఏ భయం కలిగినా అల్లాహ్ శరణు తీసుకొని అల్లాహ్ పై విశ్వాసం బలంగా ఉంచుకుంటే మనకు షైతానుల నుండి ఏ హాని కలగదు, ఎలాంటి నష్టం అనేది జరగదు. అందుకొరకే చూడండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పిన దుఆలలో కూడా ఎన్నో సందర్భాల్లో ఏ ఏ మనకు బాధలు, రంది, చింత, బెంగ ఇంకా ఏదైనా ఆపద, కష్టం వాటన్నిటి నుండి కేవలం అల్లాహ్ యొక్క శరణ మాత్రమే మనం కోరుతూ ఉండాలి అని నేర్పడం జరిగినది. ఉదయం సాయంకాలం చదివే దుఆలలో కూడా ఈ విషయాలు మనకు కనబడతాయి. అల్లాహుమ్మ ఇన్నీ అ’ఊదు బిక మిన్ షర్రి నఫ్సీ వ షర్రిష్షైతాని వ షిర్కిహీ. అల్లాహ్ యొక్క శరణ కోరడం జరుగుతుంది. అల్లాహుమ్మ ఇన్నీ అ’ఊదు బిక మినల్ కుఫ్రి వల్ ఫఖ్రి వ అ’ఊదు బిక మిన్ అదాబిల్ ఖబ్ర్. ఈ విధంగా అల్లాహ్ యొక్క శరణ కోరడం జరుగుతుంది. అల్లాహ్ యొక్క శరణ కోరడం ఇది అసలైన విషయం. ఎంతవరకు మానవులు షైతానులతో భయపడతారో ఆ షైతానులు మరింత మానవుల్ని హిదాయత్ నుండి దూరమే చేస్తారు.
ఆ తర్వాత ఆయతును గనక మనం గమనిస్తే,
وَأَنَّهُمْ ظَنُّوا كَمَا ظَنَنتُمْ أَن لَّن يَبْعَثَ اللَّهُ أَحَدًا (వ అన్నహుమ్ దన్నూ కమా దనన్ తుమ్ అన్ లన్ యబ్’అసల్లాహు అహదా) “అల్లాహ్ ఎవరినీ పంపడని (లేక ఎవరినీ తిరిగి బ్రతికించడని) మీరు తలపోసినట్లుగానే మనుషులు కూడా తలపోశారు.” (72:7)
ఆ ఖుర్ఆన్ విన్నటువంటి జిన్నాతులు వెళ్లి వారి జాతి వారికి తెలియజేస్తున్నారు కదా? అయితే ఏమంటున్నారు? మీరు ఎలాగైతే అల్లాహ్ ఏ ప్రవక్తను పంపడు, చనిపోయిన వారిని తిరిగి లేపడు అని మీరు అనుకునేవారో మానవుల్లో కూడా ఎంతో మంది ఇలాంటి తప్పుడు విశ్వాసంలోనే ఉన్నారు.
ఒకటి నుండి ఏడు వరకు ఈ ఆయతులను గనక మీరు గమనిస్తే చాలా స్పష్టంగా మీకు తౌహీద్, రిసాలత్, ఆఖిరత్ మూడు గురించి తెలుస్తుంది. అందుకొరకే అల్లాహ్ యొక్క గ్రంథం ఖుర్ఆన్ను చాలా శ్రద్ధగా చదువుతూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకు ఇందులో అనేక బోధనలు కలుగుతాయి. జిన్నాతుల లాంటి వారు, మనకంటే తక్కువ స్థానంలో ఉన్నవారు అర్థం చేసుకొని తమ జాతి వారికి హెచ్చరించగలిగితే మనం అంతకంటే ఎక్కువ విలువ గలవాళ్ళము, ఘనత గలవాళ్ళము. తప్పకుండా మనం అల్లాహ్ యొక్క దయతో ఈ ఖుర్ఆన్ను అర్థం చేసుకున్నామంటే మన జాతి వారికి కూడా మంచి రీతిలో మనం బోధ చేయగలుగుతాము.
ఇక ఈ అన్ లన్ యబ్’అసల్లాహు అహదా, బ’అస్ కొన్ని సందర్భాల్లో ఆ ఎవరినైనా ప్రవక్తగా చేసి పంపడం అనే విషయంలో అలాగే ఇంకా చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ లేపడం అనే విషయాల్లో ఖుర్ఆన్లో అనేక సందర్భంలో ఉపయోగించడం జరిగింది.
ఉదాహరణకు స్టార్టింగ్లో సూరె బఖరాలోనే చూస్తే ఆయత్ నెంబర్ 56లో కనబడుతుంది మనకు, సుమ్మ బ’అస్నాకుమ్ మిమ్ బా’అది మౌతికుమ్. మీరు చనిపోయిన తర్వాత మిమ్మల్ని మేము మళ్ళీ తిరిగి బ్రతికించాము. అదే ఒకవేళ ఆయత్ నెంబర్ 129 చూస్తే ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేస్తున్నారు, రబ్బనా వబ్’అస్ ఫీహిమ్ రసూలా. ఓ అల్లాహ్ ఒక ప్రవక్తను వారిలో ప్రభవింపజేయి అని దుఆ చేశారు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. అంటే ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటి? ఈ పదం ఏదైతే ఉందో బ’అస్ రెండు భావాల్లో వస్తుంది. రెండు భావాల్లో. దానికి ఒక ఉదాహరణ మీకు సూరతుల్ బఖరా ఆయత్ నెంబర్ 56 ద్వారా, మరొక ఉదాహరణ సూరతుల్ బఖరా ఆయత్ నెంబర్ 129 ద్వారా తెలపడం జరిగినది. ఇంకా దీనికి మీరు ఆధారాలు చూసుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి.
ఉదాహరణకు నేను ఇది తెలుగు ఖుర్ఆన్, https://teluguislam.net/ab. వల్లాహి వల్లాహి అల్లాహు త’ఆలా జజాఏ ఖైర్ ఇవ్వుగాక మన అబ్దుర్రహ్మాన్ భాయ్ గారికి, ఎంత శ్రమ పడ్డారు వారు, వారి యొక్క ఫ్యామిలీ వారు ఈ ఒకే పేజీలో మొత్తం ఖుర్ఆన్ అరబీ టెక్స్ట్, తెలుగు అనువాదం యొక్క టెక్స్ట్ తీసుకురావడంలో. దీని ద్వారా చాలా చాలా లాభం కలుగుతుంది. మీరు ఎంత గ్రహించారో తెలియదు కానీ నేనైతే చాలా దీని ద్వారా లాభం పొందుతూ ఉంటాను. ఉదాహరణకు ఇక్కడే మీరు చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు చాలా స్పష్టంగా, కేవలం బ’అస్ అన్న పదం నేను రాశాను. బా, ఐన్, సా. మొత్తం 59 రిజల్ట్ ఇక్కడ వచ్చాయి. చూస్తున్నారు కదా మీరు కూడా. ఇప్పుడు ఆయత్ నెంబర్, సూర బఖరా సూర నెంబర్ 2, ఆయత్ నెంబర్ 56. ఇందులో ఏ భావం ఉంది? చనిపోయిన తర్వాత తిరిగి లేపడం భావం ఉంది. ఆ తర్వాత మళ్ళీ మీరు చూడండి సూరతుల్ బఖరా ఆయత్ నెంబర్ 129 లో కనబడుతుంది, రబ్బనా వబ్’అస్ ఫీహిమ్ రసూలా. ఇందులో ప్రవక్తను పంపడం అనే భావంలో ఉంది. ఆ తర్వాత మూడో రిజల్ట్ చూస్తే ఇక్కడ కూడా ఫబ’అసల్లాహున్నబియ్యీన, ప్రవక్తలను పంపడం అన్న భావంలో వచ్చి ఉంది. ఆ, ఇక్కడ ఒక రాజును మా కొరకు పంపు అని ఇందులో కూడా. మరి ఇక్కడ చూస్తే 259వ ఆయత్ నెంబర్లో, ఫ అమాతహుల్లాహు మి’అత ఆమిన్ సుమ్మ బ’అసహ్. అల్లాహు త’ఆలా 100 సంవత్సరాల వరకు అతన్ని చంపి ఉంచాడు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి లేపాడు. నువ్వు నూరేళ్ళు ఈ స్థితిలో పడి ఉన్నావు. కాస్త నీ అన్న పానీయాల వైపు చూడు. ఈ విధంగా మనం ఏదైనా ఒక పదం గురించి వెతకడం, దాని రిజల్ట్ పొందడం గురించి ఇది చాలా చాలా ఉత్తమ వెబ్సైట్. దీనిని మీరు మీ యొక్క ఫేవరెట్ చేసి పెట్టుకోండి. ఎలాగైతే నేను ఇక్కడ ఫేవరెట్ చేసి పెట్టుకున్నాను, స్టార్ గుర్తుని, ఇది. ఈ విధంగా చేసి పెట్టుకుంటే మీకు వెతకడంలో చాలా సులభం అవుతుంది.
అయితే మన టాపిక్ ఏంటి?
أَن لَّن يَبْعَثَ اللَّهُ أَحَدًا (అన్ లన్ యబ్’అసల్లాహు అహదా) ఆ జిన్నాతులు అంటున్నారు మేము కూడా మరియు మానవులు కూడా అల్లాహ్ ఏ ప్రవక్తను పంపడు, అల్లాహ్ ఎవరిని కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేపడు అని అనుకునే వాళ్ళము, కానీ అలా కాదు, తప్పకుండా అల్లాహు త’ఆలా తిరిగి లేపుతాడు అన్నటువంటి స్పష్టమైన విషయం ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ ఆయతులు చదివాము మనము. ఇంకా అల్లాహ్ యొక్క దయతో ఇన్ షా అల్లాహ్ తర్వాత పాఠంలో మిగతా ఆయతులు చదివే ప్రయత్నం చేద్దాము. ఇక్కడి వరకే సెలవు తీసుకుంటున్నాను. జజాకుముల్లాహు ఖైరా, బారకల్లాహు ఫీకుమ్, అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.
ఖురాన్ తఫ్సీర్ – సూరా అల్ జిన్న్ – పార్ట్ 2 (అయతులు 8 -13) వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/r_5kw6e_trk [49 నిముషాలు]
ఈ ప్రవచనంలో సూరహ్ అల్-జిన్ (72వ సూరా) యొక్క 8 నుండి 13వ ఆయతులపై దృష్టి సారించారు. 8 నుండి 13వ ఆయతుల యొక్క పదపదానికీ అనువాదం మరియు వివరణ ఇవ్వబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాకకు ముందు, జిన్నాతులు ఆకాశంలోని వార్తలను దొంగతనంగా వినేవారని, కానీ ప్రవక్త ఆగమనం తర్వాత ఆకాశం కఠినమైన కావలి వారితో, ఉల్కలతో నింపబడిందని వివరించారు. ఈ మార్పుకు కారణం ఖుర్ఆన్ అవతరణ అని గ్రహించిన జిన్నాతులు, దానిని విని విశ్వసించారు. అల్లాహ్ యొక్క శక్తి నుండి తాము ఎప్పటికీ తప్పించుకోలేమని, ఆయనను ఓడించలేమని వారు దృఢంగా నమ్మారు. కీడు జరిగినప్పుడు దానిని నేరుగా అల్లాహ్ కు ఆపాదించకుండా, ‘కీడు ఉద్దేశించబడింది’ అని చెప్పడం ద్వారా జిన్నాతులు చూపిన గౌరవాన్ని ప్రవచకులు నొక్కిచెప్పారు. చివరగా, తమ ప్రభువును విశ్వసించిన వారికి పుణ్యాలలో ఎలాంటి నష్టం గానీ, అన్యాయం గానీ జరగదని ఆయతుల ద్వారా స్పష్టం చేశారు.
72:8 وَأَنَّا لَمَسْنَا السَّمَاءَ فَوَجَدْنَاهَا مُلِئَتْ حَرَسًا شَدِيدًا وَشُهُبًا “మేము ఆకాశంలో బాగా వెదికాము. అది అప్రమత్తులైన పహరాదారులతో, అగ్నిజ్వాలలతో నిండి ఉండటం చూశాము.”
72:9 وَأَنَّا كُنَّا نَقْعُدُ مِنْهَا مَقَاعِدَ لِلسَّمْعِ ۖ فَمَن يَسْتَمِعِ الْآنَ يَجِدْ لَهُ شِهَابًا رَّصَدًا “లోగడ మనం విషయాలు వినటానికి ఆకాశంలో పలుచోట్ల (మాటేసి) కూర్చునే వాళ్ళం. ఇప్పుడు ఎవరైనా చెవి యోగ్గి వినదలిస్తే, తన కోసం కాచుకుని ఉన్న అగ్నిజ్వాలను అతను పొందుతున్నాడు.”
72:10 وَأَنَّا لَا نَدْرِي أَشَرٌّ أُرِيدَ بِمَن فِي الْأَرْضِ أَمْ أَرَادَ بِهِمْ رَبُّهُمْ رَشَدًا “ఇంకా – భూమిలో ఉన్న వారి కోసం ఏదైనా కీడు తలపెట్టబడినదో లేక వారి ప్రభువు వారికి సన్మార్గ భాగ్యం ప్రసాదించగోరుతున్నాడో మాకు తెలియదు.”
72:11 وَأَنَّا مِنَّا الصَّالِحُونَ وَمِنَّا دُونَ ذَٰلِكَ ۖ كُنَّا طَرَائِقَ قِدَدًا “ఇంకా ఏమిటంటే – మనలో కొందరు సజ్జనులుంటే మరికొందరు తద్భిన్నంగా ఉన్నారు. మన దారులు వేర్వేరుగా ఉన్నాయి.”
72:12 وَأَنَّا ظَنَنَّا أَن لَّن نُّعْجِزَ اللَّهَ فِي الْأَرْضِ وَلَن نُّعْجِزَهُ هَرَبًا “మనం భూమిలో అల్లాహ్ ను అశక్తుణ్ణి చేయటం గానీ, పారిపోయి (ఊర్థ్వలోకాల్లో) ఆయన్ని ఓడించటంగాని మనవల్ల కాని పని అని మాకర్ధమైపోయింది.”
72:13 وَأَنَّا لَمَّا سَمِعْنَا الْهُدَىٰ آمَنَّا بِهِ ۖ فَمَن يُؤْمِن بِرَبِّهِ فَلَا يَخَافُ بَخْسًا وَلَا رَهَقًا “మేము మాత్రం సన్మార్గ బోధను వినగానే దానిని విశ్వసించాం. ఇక ఎవడు తన ప్రభువును విశ్వసించినా అతనికి ఎలాంటి నష్టంగానీ, అన్యాయంగానీ జరుగుతుందన్న భయం ఉండదు.”
సూరహ్ అల్-జిన్ (ఆయత్ 8-13) పదపదానికీ అనువాదం
وَاَنَّا [వ అన్నా] నిశ్చయంగా మేము.
لَمَسْنَا [లమస్నా] ఇక్కడ లమస్నా అన్నదానికి వెతికాము అని రాయవచ్చు.
السَّمَآءَ [అస్ సమాఅ] ఆకాశం
లమస్నా యొక్క అసలు భావం, అసలు భావం లమ్స్ అంటారు టచ్ చేయడాన్ని, తాకడాన్ని. దేనినైనా ముట్టుకుంటే అది ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదా. అది మనకు ఏదైతే తెలిసిందో తాకడం ద్వారా. ఓహ్ ఇది వేడిగా ఉంది. అబ్బో ఇది చల్లగా ఉంది. అని మనం కొంచెం తాకిన తర్వాత ఏర్పడుతుంది. ఆ విషయాన్ని అంటారు వాస్తవానికి. కానీ ఇక్కడ ఉద్దేశ ప్రకారంగా వెతికాము అని భావం తీసుకోవడం జరుగుతుంది. ఆ అస్ సమాఅ, ఆకాశం
مِنْهَا [మిన్హా] అక్కడ ఆకాశంలో ఉన్నవారి స్థలాల్లో.
مَقَاعِدَ [మకాఇద] మకాఇద్ అంటే కూర్చునే స్థలాల్లో.
لِلسَّمْعِ [లిస్సమ్అ] వినడానికి.
فَمَنْ [ఫమన్] కనుక ఎవరూ
يَسْتَمِعُ [యస్తమిఉ] వింటాడో, వినే ప్రయత్నం చేస్తాడో.
ఇంతకుముందే వచ్చింది మనకు
اَنَّهُ اسْتَمَعَ [అన్నహుస్తమఅ.] యస్తమిఉ ఇక్కడ వచ్చింది. కానీ ఇక్కడ ఉద్దేశపరంగా యస్తమిఉ వింటాడో వినే ప్రయత్నం చేస్తాడో అని.
الْاٰنَ [అల్ ఆన] ఇప్పుడు.
يَجِدْ [యజిద్] పొందుతాడు.
لَهٗ [లహూ] తన కొరకు.
شِهَابًا [షిహాబన్] అగ్ని జ్వాలను.
رَّصَدًا [రసదా] మాటు వేసి ఉన్నది. కాచుకొని ఉన్నది.
وَاَنَّا [వ అన్నా] మరియు నిశ్చయంగా మేము
لَا نَدْرِيْٓ [లా నద్రీ] మాకు తెలియదు.
اَشَرٌّ [అషర్రున్.] అ. ఇక్కడ ఆ ప్రశ్నార్థకంగా.
شَرٌّ [షర్రున్] కీడు, చెడు.
اُرِيْدَ [ఉరీద] ఉద్దేశింపబడినదా.
بِمَنْ فِى الْاَرْضِ [బి మన్ ఫిల్ అర్ద్] భూమిలో ఉన్నవారి గురించి.
اَمْ [అమ్] లేదా
اَرَادَ [అరాద] కోరాడా, ఉద్దేశించాడా.
بِهِمْ [బిహిమ్] వారి గురించి.
رَبُّهُمْ [రబ్బుహుమ్] వారి ప్రభువు.
رَشَدًا [రషదా.] ఇంతకుముందు ఏం రాసాము మనం రుష్ద్. సరియైన మార్గం. మేలు. రెండు రాసుకోండి.
وَاَنَّا [వ అన్నా] మరియు మేము.
وَاَنَّا مِنَّا [వ అన్నా మిన్నా] మాలో.
الصّٰلِحُوْنَ [అస్ సాలిహూన్] సజ్జనులు, సద్వర్తనులు. సజ్జనులు చాలా బాగుంటుంది. సద్వర్తన అనసరికి క్యారెక్టర్ కి సంబంధమైన అవుతుంది. కానీ సాలిహ్ లో విశ్వాస పరంగా గానీ ఆచరణ పరంగా గానీ, ప్రవర్తన పరంగా గానీ పరస్పర ప్రజలతో బిహేవియర్ మంచి వ్యవహారం విషయంలో గానీ అన్ని రకాలుగా సాలిహ్, మంచి వాళ్ళు. సాలిహూన్, సజ్జనులు.
وَمِنَّا [వ మిన్నా] మరియు మాలో
دُوْنَ ذٰلِكَ [దూన దాలిక్] దానికి భిన్నంగా.
كُنَّا [కున్నా] మేము ఉంటిమి.
طَرَاۤئِقَ قِدَدًا [తరాయిక, కిదదా] వివిధ మార్గాల్లో. వివిధ వర్గాల్లో. మన దారులు వేరు వేరు.
وَّاَنَّا ظَنَنَّآ [వ అన్నా జనన్నా] మేము భావించేవాళ్ళము. ఇక్కడ భావించడం అంటే ఇది నమ్మకం యొక్క భావంలో. ఒక్కొక్కసారి జనన్నా అనుమానంలో కూడా వస్తుంది కానీ ఇక్కడ అలా కాదు.
وَّلَا رَهَقًا [వలా రహకా.] ఏదైనా దౌర్జన్యం, అన్యాయం. రహకా ఇంతకుముందు కూడా వచ్చింది. ఏం రాశారు? తలబిరుస్తనం షేక్. తలబిరుస్తనం వస్తుంది, దౌర్జన్యం అని కూడా వస్తుంది.
ఓకే, పలక, బలపం పక్కకు పెట్టి మాట ఇప్పుడు శ్రద్ధగా వినండి. వ్యాఖ్యానం తఫ్సీర్ మనం మొదలుపెడుతున్నాము.
సూరహ్ అల్-జిన్ (ఆయత్ 8-13) యొక్క తఫ్సీర్ మరియు వివరణ
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్. అల్హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బ’ద్.
సూరతుల్ జిన్, అల్లాహ్ యొక్క దయవల్ల ఇప్పటివరకు మనం ఏడు ఆయత్ లు చదివి ఉన్నాము. ఈరోజు నుండి ఎనిమిదవ ఆయత్ చదవబోతున్నాము. అయితే ఈ ఆయత్ ల యొక్క భావం తెలుసుకునేకి ముందు, దీనికి సంబంధించిన ఒక సంఘటనను మనతో అర్థం చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఏంటి అది? మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాకముందు షైతానుల ఒక అలవాటు ఉండినది. ఏంటి? ఒకరిపై ఒకరు అధిరోహించి, ఎక్కి, ఆకాశం వరకు చేరుకొని, అక్కడ వారు మాటు వేసుకొని ఉండే, దొంగతనంగా వినడానికి అక్కడ దైవదూతల మాటలను, వారు కొన్ని స్థానాలు ఏర్పరచుకొని ఉండిరి. అయితే మన ప్రవక్త ముహమ్మమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇక ప్రవక్తగా ప్రభవింపజేయబడతారు అన్న సందర్భంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ షైతానులు అక్కడి మాటలు ఏమీ దొంగలించకుండా ఉండడానికి అక్కడ వారికి, దొంగచాటున వినే అటువంటి షైతానులకు కఠిన శిక్షగా ఆకాశంలో తారలు ఏవైతే ఉన్నాయో కొన్నిటిని నియమించాడు. ఆ తారలు కొన్ని అగ్ని జ్వాలలతో ఆ షైతానులను కాల్చేస్తుండినవి. అయితే ఈ షైతానులు అక్కడి మాటలు వినడానికి ఎందుకు ప్రయత్నం చేసేవారు? అసలు ఏం జరిగేది? మనం ఖుర్ఆన్ లోని వేరే ఆయత్ ల ద్వారా గ్రహిస్తే తెలుస్తున్న విషయం ఏమిటంటే, ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏదైనా ఆదేశం దైవదూతలకు ఇవ్వడానికి వారికి ఒకే ఒక ఇస్తాడో, వారిని పిలుస్తాడో అల్లాహ్ యొక్క ఔన్నత్యం, గౌరవం, గొప్పతనంతో అందరూ సొమ్మసిల్లిపోతారు. అల్లాహ్ యొక్క మాట విన్న వెంటనే వారందరిలోకెల్లా జిబ్రీల్ అందరికంటే ముందు కోలుకొని అల్లాహ్ యొక్క మాటను చాలా శ్రద్ధగా వింటారు. ఆ తర్వాత ఆయన ఎవరెవరికి ఏ ఆదేశాలు ఇవ్వాలో అవి తెలియపరుస్తాడు. ఆ సందర్భంలో ఆ మాటలు ఒకరి వెనుక ఒకరి దేవదూతలకు చేరుతూ ఉంటాయి. వారు పంపిస్తూ ఉంటారు అల్లాహ్ వారికి ఇచ్చిన ఆదేశం, వారికి తెలిపిన విధానంలో వారు పంపించుకుంటూ ఉంటారు.
అయితే ఈ షైతానులు ఈ ఒక్క మాటను దొంగలించి అందులో పది మాటలు తమ వైపు నుండి కలిపి కింద మనుషుల్లో ఎవరైతే వారి యొక్క అనుయాయులు, వారిని అనుసరించే వారు ఫాలోవర్స్ ఉన్నారో, ఈ విషయం మనకు సహీహ్ ముస్లిం హదీస్ ద్వారా కూడా తెలుస్తుంది. కాహిన్, అర్రాఫ్, జ్యోతిషి అని మనం ఏదైతే అంటామో వారికి తెలియజేస్తారు. ఆ జ్యోతిష్యులు ఆ అందులో ఇక తొంభై మాటలు ఎక్కువగా కలిపి ఇక ప్రజల నుండి తప్పిపోయిన ఏదైనా వస్తువు గానీ వారి యొక్క భవిష్యత్తులో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అన్నటువంటి అగోచర విషయాలు తెలుపుతున్నట్లు, వారి యొక్క భవిష్యత్తు గురించి తెలియజేస్తున్నట్లుగా వారికి చెబుతారు. వాస్తవం ఏమిటంటే, ఒక్క మాట మాత్రమే వారు చెప్పిన వంద మాటల్లో నిజమవుతుంది. కానీ అమాయక ప్రజలు ఆ ఒక్క మాట ఏదైతే నిజమైనదో దాని ద్వారా వారి యొక్క తొంభై తొమ్మిది మాటలు నిజమన్నట్లుగా భావిస్తారు. అయితే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాకముందు ప్రవక్తగా ప్రభవించక ముందు ఆకాశంలో కట్టుదిట్టం పహరాలు, అక్కడ ఎవరూ దొంగచాటున వినకుండా ఉండడానికి అక్కడ చెక్ పాయింట్ లాంటివి అనుకోండి ఎక్కువైపోయాయి. అయితే ఈ జిన్నాతులు చాలా ఆశ్చర్యపడ్డారు ఈ విషయాన్ని చూసి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంతకుముందు ఎప్పుడూ జరగకపోయేది కదా. అయితే ఎప్పుడైతే వారు వచ్చి ఖుర్ఆన్ విన్నారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట, అప్పుడు వారికి అర్థమైంది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన సత్య సందేశాన్ని ప్రజలకు చేరవేయడానికి ఈ విధంగా ఆకాశంలో ఎన్నో రకాల తారలను మా కొరకు మాటు వేసి ఉంచి, మాపై మాటలు వినకుండా శిక్షను పంపించేవారు. వాటి యొక్క ప్రస్తావన ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు కొంచెం మనం ఆయత్ లను చదువుతూ ఈ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
వ అన్నా లమస్నస్ సమాఅ ఫవజద్నాహా ములిఅత్ హరసన్ శదీదన్ వ షుహుబా.
وَاَنَّا لَمَسْنَا السَّمَآءَ فَوَجَدْنٰهَا مُلِئَتْ حَرَسًا شَدِيْدًا وَّشُهُبًا ۙ [వ అన్నా లమస్నస్ సమాఅ ఫవజద్నాహా ములిఅత్ హరసన్ శదీదన్ వ షుహుబా] “మరి నిశ్చయంగా మేము ఆకాశాన్ని గాలించాము. అది కఠినమైన కావలి వారితో, నిప్పు రవ్వలతో నింపబడి ఉండటాన్ని మేము గమనించాము.” (72:8)
మరో అనువాదంలో ఏముంది? మేము ఆకాశంలో బాగా వెతికాము, అది అప్రమత్తులైన పహరాదారులతో, అగ్ని జ్వాలలతో నిండి ఉండటం చూశాము. ఈ ఆయత్ లో మనకు చూడడానికి ఇంతవరకు చెప్పుకున్నటువంటి సంఘటన ఏదైతే తెలుసుకున్నామో, అందులో స్పష్టంగా అర్థమైపోయింది మనకు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ షైతానులు వినకుండా ఉండడానికి అక్కడ మంచి బలవంతమైన షైతానులను ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వాటిని కాపలాదారులుగా పెట్టాడు. అయితే ఇక్కడ మనకు రెండు విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, హరసన్ శదీదా, బలవంతమైన, కఠినమైన, మంచి పహరాదారులు. వ షుహుబా. షుహుబా అంటే ఇక్కడ ఉల్కలు అని కూడా కొందరు అనువాదం చేశారు. ఈ ఉల్కలు మనం వాడుక భాషలో వేటిని అంటారో మీలో ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి ఒకసారి. ఆకాశం నుండి రాలేవి షేక్, ఉల్కలు అంటే. ఆకాశం నుండి రాలే అటువంటివి. గ్రహ సకలాలు అని చెప్తారు సార్ వాస్తవానికి సైన్స్ పరంగా. ఉల్కలు అని అంటారు వాటిని. గ్రహ సకలాల్ని. ఇక్కడ కొంచెం మనం, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. అదేమిటంటే సైన్స్ పరంగా కొన్ని విషయాలు ఏవైతే మనకు తెలుస్తున్నాయో, ధర్మం అన్నది, ఇస్లాం చెప్పేటివి విరుద్ధమేమీ కావు. కొన్ని సందర్భాల్లో ఏదైనా విషయం అర్థం కాకపోతే సైన్స్ పూర్తి రీసెర్చ్ తో జరుగుతుంది అన్నటువంటి వాదనతో దాని వైపు మొగ్గు చూపి కొందరు అల్లాహ్ లేదా ప్రవక్త యొక్క మాటలను తిరస్కరించే ప్రయత్నం చేస్తారు. ఆ భావంలోకి వెళ్లకూడదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏ సత్యాన్ని తెలియజేశాడో అవి ఇంకా సైంటిస్టుల పరిశోధనలకు రాలేదు కావచ్చు అని మనం భావించాలి, వాస్తవం కూడా ఇది. కానీ అల్లాహ్ యొక్క మాట, ప్రవక్త యొక్క మాట సైన్స్ పరిశోధనల కంటే చాలా ఫాస్ట్ గా మరియు చాలా అప్డేట్ గా ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కొందరు తొందరపాటులో ఇది ఇస్లాం దీని గురించి ఏం చెప్తుంది అన్నటువంటి విషయాలను మాట్లాడుతూ వ్యతిరేకత చూపి ఇస్లాంను వంకరగా, ఇస్లాంను తప్పుగా చూపించే ప్రయత్నం అందరూ చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో గానీ, ఏదైతే ఉల్కల ప్రస్తావన వచ్చిందో, లేదా భూకంపం విషయంలో గానీ ఇదంతా కూడా సైన్స్ కు మరియు ధర్మానికి వ్యతిరేకత తీసుకువచ్చే ప్రయత్నం ఏమాత్రం చేయనే చేయకూడదు. ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా మాట అర్థం కాకుంటే అక్కడ మనం క్లియర్ గా ఒక మాట చెప్పవచ్చు. అదేమిటి? అల్లాహ్ చెప్పిన మాటలో ఎలాంటి రద్దు అనేది, ఎలాంటి అబద్ధం అనేది ఉండదు గనుక సైన్స్ పరిశోధనలు జరిపి, జరిపి, జరిపి, జరిపి వారి దృష్టిలో వచ్చిన విషయం అనుభవంలో వచ్చిన విషయం చెప్తారు గనుక ఇంకా వారి పరిశోధనలకు రాలేదు కావచ్చు అన్నటువంటి విషయంపై మనం ఉండాలి. కానీ ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని తారలలో అలాంటి శక్తి వారికి ప్రసాదించి ఉన్నాడు. వారిని కాపలాదారులుగా ఉంచాడు. వారు ఎక్కడ షైతానులను చూస్తారో వాటిని పరిగెత్తించి, వారిని ఆ వారి వెంటపడి వారిని కాల్చేసే ప్రయత్నం చేస్తారు. అయితే మనం కొన్ని సందర్భాల్లో తారా పడిపోయింది లేదా ఉల్కల విషయం ఏదైతే మనం వింటామో లేదా చూస్తామో అయితే వల్లాహు అ’లం ఏదైనా తార షైతానులను కొట్టడానికి ఆ షైతానుల వెంట పరిగెడుతుంది కావచ్చు.
రెండో ఆయత్: వ అన్నా కున్నా నఖ్ ఉదు మిన్హా మకాఇద లిస్సమ్.
وَّاَنَّا كُنَّا نَقْعُدُ مِنْهَا مَقَاعِدَ لِلسَّمْعِ ۖ [వ అన్నా కున్నా నఖ్ ఉదు మిన్హా మకాఇద లిస్సమ్] “మరియు మేము (విషయాలు) వినటానికి ఆకాశంలో కొన్ని చోట్ల కూర్చునేవారము.” (72:9)
అక్కడ మేము కొన్ని కూర్చుండి ఉండే చోట్ల, స్థానాల్లో కూర్చుండే వారిమి లిస్సమ్ వినడానికి. తాను ఇప్పుడు ఎవరైనా అలా వినే ప్రయత్నం చేస్తే వానికి ఆ ఉల్కలు అనేటివి కాల్చేస్తాయి మరియు వారు దాని యొక్క శిక్ష పొందుతారు. ఇది మొదటి మాట దానికే మరింత బలం చేకూరుస్తూ ఆ షైతానులు, ఆ జిన్నాతులు ఎవరైతే విని విశ్వసించారో తమ జాతి వారి వద్దకు వెళ్లి ఈ విషయాలను వారు చెబుతున్నారు. అందులోనే మరొక మాట పదవ ఆయత్ లో వస్తుంది. ఈ పదవ ఆయత్ లో మనకు కొన్ని గుణపాఠాలు ఉన్నాయి. కొన్ని మంచి బోధనలు ఉన్నాయి, గ్రహించాలి. మొదటిది ఏమిటంటే,
వ అన్నా లా నద్రీ అశర్రున్ ఉరీద.
తిలావత్ పరంగా కూడా ప్రత్యేకంగా ఎవరైతే ఇమామ్ గా ఉంటారో, ఖుర్ఆన్ యొక్క తిలావత్ చేస్తూ ఉంటారో తిలావత్ ఎలా చేయాలంటే ప్రత్యేకంగా నమాజ్ లో ఉన్నప్పుడు గానీ, స్వయంగా మన కొరకు ఒంటరిగా మనం తిలావత్ చేసుకుంటున్నప్పుడు గానీ, లేదా ఏదైనా సభలో ఎక్కడైనా ఎవరికైనా ఖుర్ఆన్ మనం వినిపిస్తున్నాము, దాని యొక్క తిలావత్ చేసే విధానం అన్నది ఎంత మంచిగా, సుందరంగా, ఉత్తమంగా ఉండాలంటే ఖుర్ఆన్ యొక్క తిలావత్ ద్వారానే ఎంతో కొంత భావం అర్థమయ్యే రీతిలో తిలావత్ జరగాలి. ఇక్కడ అశర్రున్ అన్న పదం ఏదైతే వచ్చిందో వాస్తవానికి ఇందులో మహా నీచాతి నీచమైన, మహా చెడ్డది అన్నటువంటి భావంలో వస్తుంది. కానీ ఇక్కడ ఆ భావం కాదు. అలాంటి భావం ఉండేది ఉంటే అశర్రున్ డైరెక్ట్ చదవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏముంది, అశర్రున్ ఉరీద బిమన్ ఫిల్ అర్ది అమ్ అరాద బిహిమ్ రబ్బుహుమ్ రషదా. ఈ మానవుల పట్ల ఏదైనా చెడు కోరడం జరిగినదా? ప్రశ్న. ఆ, ఆ అమిన్తుమ్ అని మీరు ఇంతకుముందు చదివారు కదా? ప్రశ్నార్థకంగా ఏదైతే వస్తుందో ఆ రీతిలో ఇక్కడ ‘ఆ’ ఉంది. షర్రున్ వేరే పదము. అంటే ‘ఆ’ ఒక వేరే పదం, ‘షర్రున్’ వేరే పదం. ఇందులో భావంలో ప్రశ్నార్థకం ఉంది. అందుకొరకే దీనిని ఎలా చదువుతారు, “వ అన్నా లా నద్రీ అశర్రున్”. అశర్, అషర్రున్. ఈ తిలావత్ లో రెండు విధానాలు వేరుగా ఉంటాయి. మొదటిది నేను ఏదైతే చదివానో అందులో అతి చెడ్డది అన్నటువంటి భావం వస్తుంది. రెండో విధానం ఏదైతే చదివామో అందులో చెడు కోరబడినదా అన్నటువంటి ప్రశ్న అడుగోవడడం జరుగుతుంది అన్నట్లుగా అర్థమవుతుంది. దీనిని నబరతుస్ సౌత్ అని అంటారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎవరైతే తిలావత్ ఉత్తమ రీతిలో చేసేవారు, ఇమామ్ లు అలాంటి వారు ఈ విషయాన్ని గ్రహించాలి.
రెండో మాట ఇందులో గమనించండి, అశర్రున్ ఉరీద బిమన్ ఫిల్ అర్ద్ అమ్ అరాద బిహిమ్ రబ్బుహుమ్ రషదా. షర్రున్ మరియు రషదా ఇవి రెండు విరుద్ధ పదాలు. షర్ అంటే కీడు, రషదా అంటే మేలు. అయితే మనం మానవులం, అల్లాహ్ పట్ల పాటించే అటువంటి గౌరవ మర్యాద అన్నది ఎలాంటిదంటే, మనం అల్లాహ్ వైపునకు చెడును అంకితం చేయరాదు. అల్లాహ్ వారి పట్ల ఏదైనా చెడు కోరాడా, లేక అల్లాహ్ వారి పట్ల ఏదైనా మేలు కోరాడా? ఈ విధంగా చెప్పడం సరియైన విషయం కాదు. వాస్తవానికి ఈ లోకంలో జరిగేదంతా అల్లాహ్ కు ఇష్టం లేనిది ఏదైనా జరిగిన గాని దానిని ఏమంటారు, ఇజ్నన్ కౌనీ అంటారు. ఒకటి షరయీ ఒకటి కౌనీ. షరయీ అంటే షరియత్ పరంగా జరిగేది. కౌనీ అంటే అల్లాహ్ కు ఇష్టం లేకపోయినా గాని ఈ లోకంలో సంభవిస్తుంది. అందులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను పరీక్షించాలనుకుంటాడు. అయితే అలాంటి అప్పుడు అది కూడా అల్లాహ్ అనుమతితో జరుగుతుంది. కానీ మనం అల్లాహ్ యొక్క గౌరవం మర్యాదను పాటిస్తూ అల్లాహ్ వైపు నుండి చెడు అన్నట్లుగా చెప్పము. ఇది అల్లాహ్ యొక్క గౌరవ మర్యాదలో. ఆ విషయం అర్థమైందని ఆశిస్తున్నాను. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా తొందరపాటులో ఉండి మన ఆలోచన ఎక్కడైనా ఉంటే, లేక మన యొక్క నాలాంటి తక్కువ జ్ఞానం గలవారు తొందరగా అర్థం కాకపోవచ్చు ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాను. మనం మన తల్లిదండ్రుల ద్వారా లేదా మనకు విద్య చెప్పే అటువంటి గురువుల ద్వారా స్పష్టంగా గమనిస్తాము. వారి ముందు ఏదైనా పొరపాటు జరిగింది అని. కానీ ఇదిగో నువ్వు తప్పు చేసావు అని ఈ విధంగా చెప్పము. ఎందుకు? పెద్దలు. వారిని గౌరవించాలి. వారితో మర్యాదగా ఎంతో సభ్యత, సంస్కారంతో మనం మెలగాలి. అందుకని అలా చెప్పడం సరియైనది కాదు. ఏం చెబుతాము? ఒక్కసారి ఈ మాటను మీరు మరోసారి ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఈ చెప్పిన విషయాన్ని ఒక్కసారి మీరు విని చూసుకోండి. కరెక్టే చెప్పారు కదా! ఈ విధంగా కొంచెం గౌరవంగా మాట్లాడుతాము. అఊజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ అల్లాహ్ కొరకు ఎగ్జాంపుల్ కాదు, మనకు అర్థం కావడానికి చెప్తున్నాను. మనం మన పెద్దల పట్ల మానవుల్లో వారి యొక్క గౌరవార్థం మాట విధానంలో తేడా ఉంటుంది. అదే మన పిల్లవాడు మనకంటే చిన్నవాడు ఎవరైనా స్టూడెంట్ తప్పు చేస్తే అతన్ని దండించే విధానం, మనకంటే పెద్దవారు ఏదైనా తప్పు చేస్తే వారికి చెప్పే విధానంలో తేడా ఉంటుంది. అయితే నేను ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటి? జిన్నాతులు అల్లాహ్ పట్ల ఎంత మర్యాద పాటించాలో ఇక్కడ మనకు కనబడుతుంది. వారు అల్లాహ్ విషయంలో, అల్లాహ్ చెడును కోరాడా అని అనకుండా ఏమన్నారు, ఉరీద బిమన్ ఫిల్ అర్ద్. భూమిలో ఉన్న వారికి ఏదైనా కీడు ఉద్దేశించబడినదా? ఉరీద. దీనిని ఏమంటారు, ఫెయల్ మజ్హూల్ అని అంటారు. కానీ అదే తర్వాత ఏమొచ్చింది? అమ్ అరాద బిహిమ్ రబ్బుహుమ్. వారి ప్రభువు వారి కొరకు కోరాడా. రషదా మేలు. ఈ ఆయత్ ద్వారా మనకు బోధపడే మరొక విషయం ఏమిటంటే ఈ లోకంలో ఏ మంచి జరిగినా, ఏ కీడు జరిగినా అల్లాహ్ వైపు నుండి జరుగుతుంది కానీ మనం అందులో ఏ పాత్ర మనది లేదు, అందులో మనకు ఏ పాపం గానీ ఎలాంటి మనపై బాధ్యత అనేది ఉండదు అని కాదు. ఎందుకంటే అల్లాహ్ మనకు ఏ బుద్ధి జ్ఞానాలు ప్రసాదించాడో, మనకు మంచి చెడును ఎన్నుకొని పాటించే అటువంటి శక్తి సామర్థ్యాలను ప్రసాదించాడో అందుకని మనం దానికి బాధ్యులం అవుతాము. ఏదైతే మన ఏదైనా కొరత వల్ల, పొరపాటు వల్ల మన నుండి ఏదైనా తప్పు జరుగుతుందో దానికి బాధ్యులం మనం అవుతాము. దానిని మనం అల్లాహ్ పై వేయరాదు.
ఆ తర్వాత గమనించండి: వ అన్నా మిన్నస్ సాలిహూన వ మిన్నా దూన దాలిక్ కున్నా తరాయిక ఖిదదా.
وَاَنَّا مِنَّا الصّٰلِحُوْنَ وَمِنَّا دُوْنَ ذٰلِكَ ۗ كُنَّا طَرَاۤئِقَ قِدَدًا ۙ [వ అన్నా మిన్నస్ సాలిహూన వ మిన్నా దూన దాలిక్ కున్నా తరాయిక ఖిదదా] “మరియు మాలో కొందరు పుణ్యాత్ములు ఉన్నారు, మరికొందరు వేరే రకం వారు ఉన్నారు. మేము వివిధ వర్గాలుగా విడిపోయి ఉన్నాము.” (72:11)
మాలో కొందరు పుణ్యాత్ములు ఉన్నారు మరియు వారికి భిన్నంగా ఉన్నారు. మొన్నటి క్లాస్ లో స్టార్టింగ్ లోనే చెప్పడం జరిగింది. ఎలాగైతే మానవుల్లో అన్ని రకాల మనుషులు ఉన్నారో, వివిధ ధర్మాలను అవలంబించేవారు, మతాలను అవలంబించేవారు, మస్లక్ లను, ఫిర్కాలను అవలంబించేవారు. అలాగే జిన్నాతులో కూడా ఉన్నారు. కాకపోతే అందులో కూడా పుణ్యాత్ములు ఉన్నారు. లేరని కాదు. అదే విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. కున్నా తరాయిక ఖిదదా మేము వివిధ మార్గాల్లో ఉంటిమి. ఈ సందర్భంలో కూడా మనకు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొన్ని హదీసులు గుర్తు చేసుకోవాలి. ప్రళయం వచ్చేవరకు ఈ ప్రజల మధ్యలో భేదాభిప్రాయాలు మరియు ఇలాంటి వివిధ వర్గాలు ఇవన్నీ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే చెప్పారో లా తజాలు తాయిఫతున్ మిన్ ఉమ్మతీ, నా అనుచర సంఘంలో ఒక వర్గం ఉంటుంది, ఒక జమాత్ ఉంటుంది, తాయిఫా, వారు ప్రళయం వరకు కూడా సత్యంపై, అల్లాహ్ యొక్క ధర్మంపై ఉంటారు. వారిని విడనాడిన వారు ఎలాంటి నష్టం వారికి చేకూర్చలేరు. వారిని వదిలి వెళ్లిన వారు స్వయం సత్యం నుండి దూరం అవుతారు తప్ప, వారు ఎలాంటి ధర్మం విషయంలో ధర్మంపై స్థిరంగా ఉన్న వారికి ఇహ పరాల్లో ఏ కీడు కలగజేయలేరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మీరు ఎక్కడ ఉన్న ఏ కాలంలో ఉన్న, ఏ చెడు మీ మధ్యలో ప్రబలినా గానీ, మంచి వారు కూడా ఉంటారు, మీరు వారిని వెతకాలి మరియు అలాంటి మంచి వారి యొక్క తోడుగా ఉండి వారి యొక్క మార్గాన్ని అవలంబించాలి. అయితే ఈ హదీస్ ఆయత్ ఇప్పుడు ఈ సూరహ్ జిన్ లో చదివినటువంటి ఆయత్ నంబర్ 11 మరియు ప్రవక్త వారి ఈ హదీస్ బుఖారీ ముస్లిం ఇత వేరే గ్రంథాల్లో వచ్చి ఉంది. దాని ఆధారంగా ధర్మవేత్తలు ఏమంటున్నారంటే జిన్నాతులో కూడా ఇహలోకంలో మనుషుల్లో ఉన్నటువంటి ఫిర్కాలు, వర్గాలు ఉన్నాయి. సత్యంపై, మన్హజె సలఫ్ పై మరియు అలాగే వేరే షియా ఇత వేరే వర్గాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వారిలో కూడా జిన్నాతులో విభజించబడి ఉన్నారు.
ఆ తర్వాత ఆయత్ 12:
وَّاَنَّا ظَنَنَّآ اَنْ لَّنْ نُّعْجِزَ اللّٰهَ فِى الْاَرْضِ وَلَنْ نُّعْجِزَهٗ هَرَبًا ۙ [వ అన్నా జనన్నా అల్లన్ ను’జిజల్లాహ ఫిల్ అర్ది వలన్ ను’జిజహూ హరబా] “మేము భూమిలో అల్లాహ్ ను ఓడించలేమని, పారిపోయి కూడా ఆయన పట్టు నుండి తప్పించుకోలేమని మేము గట్టిగా నమ్ముతున్నాము.” (72:12)
ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే వారి యొక్క నమ్మకం, ఖుర్ఆన్ ని విశ్వసించిన తర్వాత జిన్నాతుల యొక్క నమ్మకం ఎంత మంచిగా ఉండిందో గమనించండి. ఇహ లోకంలో మేము ఈ భూమిలో గానీ, భూమిని తప్ప ఇంకా వేరే ఎక్కడైనా గానీ అల్లాహ్ ను వదలి ఎక్కడికి పారిపోయినా గానీ మేము అల్లాహ్ యొక్క పట్టు నుండి తప్పించుకొని పోయే అవకాశమే లేదు. మేము అల్లాహ్ యొక్క విధేయతకు దూరమై అల్లాహ్ యొక్క శిక్ష నుండి తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు. మనం ఎంత అశక్తులం, ఎంత బలహీనులం అంటే అల్లాహ్ ను ఆజిజ్ చేయడం, ఆయన మనపై గెలుపు పొందకుండా, ఆయన మనల్ని పట్టుకోకుండా మనం ఆయనపై గెలుపు పొందే రీతిలో ఏదైనా మార్గం ముమ్మాటికి ఉండదు. ఈ విషయం చెప్పడానికే ఈ రెండు పదాలు ఇక్కడ వచ్చి ఉన్నాయి. అల్లన్ ను’జిజల్లాహ ఫిల్ అర్ద్ వలన్ ను’జిజహూ హరబా. అల్లాహు అక్బర్. ఈ సందర్భంలో నాకు సహీ హదీస్ గుర్తుకొస్తుంది ఏదైతే మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి పడుకునే ముందు కూడా చదివి పడుకోవాలి. ఎవరైతే ఈ దుఆ చదివి పడుకుంటారో, ఒకవేళ వారు ఆ రాత్రి చనిపోతే ఫిత్రతే ఇస్లాం పై వారి యొక్క చావు అవుతుంది అని ప్రవక్త వారు శుభవార్త ఇచ్చారు. అల్లాహుమ్మ ఇన్నీ అస్లంతు నఫ్సీ ఇలైక, వ ఫవ్వజ్తు అమ్రీ ఇలైక, వ వజ్జహ్తు వజ్హీ ఇలైక, రగ్బతన్ వ రహబతన్ మిన్క ఇల్లా ఇలైక, ఆ లా మల్జఅ వలా మన్జా మిన్క ఇల్లా ఇలైక్. ఇక్కడ ఈ పదం గమనించండి. నేను నిన్నే విశ్వసించాను. నేను నా కార్యమును నీకే సమర్పించుకున్నాను. నా ముఖాన్ని నీ వైపునకే అంకితం చేసుకున్నాను. భయపడి వచ్చినా నీ వైపునకే రావాలి. ఏదైనా ఆశతో వచ్చినా నీ వైపునకే రావాలి. నీ తప్ప మాకు ఏదైనా భయం నుండి రక్షణ కల్పించే స్థలం మరియు ఏదైనా ఆశకు సంబంధించిన మంచి ఏదైనా జరుగుతుంది అంటే నీ తప్ప వేరే ఎక్కడా లేదు. ఇందులో ఎంత బలమైన విశ్వాసం మనకు నేరపడటం జరిగిందో గమనించండి.
అలాగే ఇంకా మనం గమనించగలిగితే సూరతుజ్ జారియాత్ లో చూడండి. అల్లాహ్ ఏమంటున్నాడు, ఫఫిర్రూ ఇలల్లాహ్. మీరు అల్లాహ్ వైపునకు పరిగెత్తండి. ఇక్కడ ఎందుకు ఈ ఆయత్ ని తీసుకుంటున్నాము? సర్వసామాన్యంగా మనిషి ఇహలోకంలో ఎవరితో భయపడుతున్నాడో అతని వైపునకే పరిగెత్తడు. ఏం చేస్తాడు? అంతకంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు గలవాని వైపునకు పరిగెత్తి అక్కడ శరణు తీసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ లోకంలో అల్లాహ్ కంటే గొప్ప శక్తి గలవాడు మరెవడూ లేడు గనుక అల్లాహ్ తో భయపడి వేరే ఎటువైపునకో పరిగెత్తరాదు, కేవలం అల్లాహ్ వైపునకే పరిగెత్తాలి. అదే మాట ఇక్కడ, మేము ఆ అల్లాహ్ ను వదలి ఎక్కడికైనా పారిపోవాలన్నా పారిపోయే అటువంటి శక్తి మాకు లేదు. లేదా ఈ భూమిలో అల్లాహ్ ను ఓడించి మేము గెలుపు పొందాలన్న అలాంటి శక్తి ఏమీ లేదు. మరి అలాంటి అప్పుడు అల్లాహ్ కు అవిధేయత ఎందుకు చూపాలి? అల్లాహ్ మాటను ఎందుకు ధిక్కరించాలి? సత్య ధర్మాన్ని వదిలి ఎందుకు జీవించాలి?
ఆ తర్వాత చెబుతున్నారు, ఈరోజు పాఠంలోని చివరి ఆయత్, ఆయత్ నంబర్ 13. మా పరిస్థితి ఎలాంటిదంటే, 12 యొక్క సంక్షిప్త భావం, మా పరిస్థితి ఎలాంటిదంటే మేము అల్లాహ్ ను తప్ప ఏ ఏ దేవతలను నమ్ముకుంటామో, ఎవరెవరిని పెద్దగా భావిస్తామో వారు మాకు మా క్లిష్ట పరిస్థితుల్లో ఏ సహాయము చేయలేరు. మరియు అల్లాహ్ ను వదలి మేము వారిని నమ్ముకొని అల్లాహ్ యొక్క పట్టు నుండి ఈ భూమిలో ఎక్కడికి మనం దాగి ఉండలేము, ఎటు కూడా పారిపోయి శరణు పొందలేము. అందుకొరకే మేము ఈ మార్గదర్శకత్వాన్ని విన్న వెంటనే విశ్వసించాము. మేము విశ్వసించాము. ఇక ఈ విశ్వాసం అల్లాహ్ పై ఎంత గొప్పది అంటే, ఎవరూ తన ప్రభువుని విశ్వసిస్తాడో ఆ ప్రభువు విషయంలో ఎలాంటి భయం అవసరం లేదు. ఫలా యఖాఫు బఖ్సన్ వలా రహకా. అతని పుణ్యాల్లో ఏ కొరత జరగదు, పాపాల్లో ఏ హెచ్చింపు జరగదు. అతడు ఎంత పుణ్యం చేశాడో అతనికి సంపూర్ణంగా దాని యొక్క ప్రతిఫలం ఇవ్వడం జరుగుతుంది. మరియు అతడు ఏ పాపాలు చేశాడో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతడి యొక్క పాపాల కారణంగా అతనిపై కోపగించి ఏదైనా అతనికి ఎక్కువ శిక్ష ఇస్తాడా, లేదు. అల్లాహ్ వద్ద సంపూర్ణ న్యాయం ఉంది. ఖుర్ఆన్ లో ఈ విషయం అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అనేక లా యలిత్కుమ్ మిన్ అ’మాలీకుమ్ షైఆ. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మీ పుణ్యాల్లో ఎలాంటి తగ్గింపు చేయడు. మరో కొన్ని సందర్భాల్లో అయితే అల్లాహ్ ఏం చెప్పాడు? ఖర్జూరపు ముక్కపై, ఖర్జూరపు బీజముపై ఏ పల్చని పొర ఉంటుందో అంత కూడా మీపై ఏ అన్యాయం జరగదు. ఏ అన్యాయం జరగదు. అంతటి న్యాయవంతుడైన అల్లాహ్, ఆ అల్లాహ్ ను విశ్వసించిన వారు చాలా అదృష్టవంతులు, వారు చాలా మంచి పని చేసిన వారు. ఈ జిన్నాతులకు సంబంధించిన మరికొన్ని బోధనలు మరియు వారికి ఇంకా మానవులకు ఒకవేళ సన్మార్గంపై ఉండేది ఉంటే ఎలాంటి మేలు జరుగుతాయి తర్వాత ఆయతులలో రానున్నది. ఇక్కడివరకే ఈ పాఠాన్ని మనం ముగించేస్తున్నాము. జజాకుముల్లాహు ఖైరన్ వ బారకల్లాహు ఫీకుమ్ వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఏదైనా ప్రశ్న ఉందా మీ దగ్గర? సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.
“ఇంకా – మనలో కొందరు ముస్లింలై (దైవవిధేయులై)ఉంటే, మరికొందరు సన్మార్గం నుండి తొలగి ఉన్నారు. కనుక విధేయతా వైఖరిని అవలంబించినవారు సన్మార్గాన్ని అన్వేషించుకున్నారు.”
“అయితే నా బాధ్యతల్లా అల్లాహ్ వాణిని, ఆయన సందేశాలను (ప్రజలకు) అందజేయటమే. ఇక ఇప్పుడు ఎవరైనా అల్లాహ్ మాటను, అతని ప్రవక్త మాటను వినకపోతే వారికొరకు నరకాగ్ని ఉంది. అందులో వారు కలకాలం ఉంటారు.”
వారు తమ ప్రభువు సందేశాన్ని అందజేశారని తెలియటానికి (ఈ ఏర్పాటు జరిగింది). ఆయన వారి పరిసరాలన్నింటినీ పరివేష్టించి, ఒక్కో వస్తువును లెక్కపెట్టి ఉంచాడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, మానవ చరిత్రలో విగ్రహారాధన ఎలా ప్రారంభమైందో వివరించబడింది. ఆదం (అలైహిస్సలాం) తరువాత వెయ్యి సంవత్సరాల పాటు మానవజాతి ఏక దైవారాధనపై ఉంది. వద్, సువా, యగూస్, యఊక్, నసర్ అనే ఐదుగురు పుణ్యాత్ముల మరణానంతరం, షైతాన్ వారి విగ్రహాలను తయారుచేయించి, రాబోయే తరాలను వాటి ఆరాధన వైపు మళ్లించాడు. ఈ బహుదైవారాధనను నిర్మూలించడానికి, అల్లాహ్ తన మొదటి రసూల్ (సందేశహరుడు)గా నూహ్ (అలైహిస్సలాం)ను పంపాడు. ఆయన 950 సంవత్సరాలు ఏకదైవారాధన వైపు ప్రజలను పిలిచినా, కొద్దిమంది తప్ప ఎవరూ విశ్వసించలేదు. ప్రజల తిరస్కరణ, ఎగతాళి, మరియు హెచ్చరికల అనంతరం, అల్లాహ్ ఆదేశంతో నూహ్ (అలైహిస్సలాం) ఒక ఓడను నిర్మించారు. మహా జలప్రళయం సంభవించి, అవిశ్వాసులందరూ (నూహ్ కుమారునితో సహా) మునిగిపోయారు మరియు నూహ్, ఆయనతో ఉన్న విశ్వాసులు మాత్రమే రక్షించబడ్డారు. తూఫాను తరువాత, నూహ్ యొక్క ముగ్గురు కుమారుల సంతానం ద్వారా మానవజాతి మళ్ళీ వ్యాపించింది, అందుకే ఆయనను “మానవుల రెండవ పితామహుడు” అని కూడా పిలుస్తారు.
అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్.
“నిశ్చయంగా మేము నూహును అతని జాతి వారి వద్దకు పంపాము – నీ జాతి వారిపై వ్యధాభరితమైన శిక్ష వచ్చి పడకముందే వారిని హెచ్చరించు” అని (ఆదేశించి). (71:1)
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా మనందరి చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
సోదర సోదరీమణులారా, మీ అందరికీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ప్రసంగం యొక్క ముఖ్య విషయాలు
ఈనాటి ప్రసంగంలో మనం, ఈ భూమి మీద మానవులు నివాసం ఏర్పరుచుకున్న తరువాత అందరికంటే ముందు విగ్రహారాధన ఎవరు ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారు? విగ్రహారాధన మానవులు చేయడానికి అసలైన కారణం ఏమిటి? ప్రజలను మళ్ళీ సృష్టితాల ఆరాధన నుండి తప్పించి, సృష్టికర్త ఆరాధన వైపు పిలవటానికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రథమంగా పంపించిన రసూల్ ఎవరు? ఆయన పేరు ఏమిటి? ఎన్ని సంవత్సరాలు ఆయన ఎలా ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు? తరువాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా విశ్వాసులకు ఎలాంటి రక్షణ కల్పించాడు? అవిశ్వాసులకు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఏ విధంగా శిక్షించాడు? ఈ విషయాలన్నీ ఇన్షా అల్లాహ్ ఈ ప్రసంగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇంతకు ముందు ప్రసంగాలలో మిత్రులారా మనం, భూమి మీద మొదటి జంట ఆదం మరియు హవ్వా అలైహిస్సలాం వారిని అల్లాహ్ ఈ భూమి మీదికి పంపిన తర్వాత, వారు బ్రతికి ఉన్నంత కాలము వారి సంతానానికి అల్లాహ్ గురించి, అల్లాహ్ ఆరాధన గురించి నేర్పించి వెళ్లారు. వారి తర్వాత షైతాను కొన్ని కుయుక్తులు పన్ని, ప్రజలలో కొన్ని దురలవాట్లు ఏర్పడేటట్టు చేశాడు. కానీ ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము మానవుల మనుగడ ఈ భూమి మీద ప్రారంభమైన వెయ్యి సంవత్సరాల వరకు, అంటే మానవుని చరిత్ర ఈ భూమి మీద మొదలైన తర్వాత నుండి వెయ్యి సంవత్సరాల వరకు ప్రజలు కేవలం ఒకే ఒక ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే ఆరాధించుకుంటూ వచ్చారు. మధ్యలో షైతాను వలలో చిక్కి కొంతమందిలో కొన్ని దురలవాట్లు వచ్చాయి కానీ వారు మాత్రం ఒక అల్లాహ్ నే నమ్మారు, ఒక అల్లాహ్ నే ఆరాధించుకుంటూ వచ్చారు.
తర్వాత వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత, ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం, ఆది దంపతుల మరణం తర్వాత, షీస్ అలైహిస్సలాం, ఇద్రీస్ అలైహిస్సలాం వారి మరణం తర్వాత, వెయ్యి సంవత్సరాల మానవ చరిత్ర ఈ భూమి మీద నడిచిన తర్వాత, అప్పుడు ప్రజలు రెండు రకాలుగా మారిపోయారు. ఒక రకం ఎవరంటే అల్లాహ్ ను తలచుకుంటూ, అల్లాహ్ ను ఆరాధించుకుంటూ, అల్లాహ్ మీద భయభక్తితో జీవితం గడుపుకునే దైవభక్తులు. మరో రకమైన ప్రజలు ఎవరంటే అల్లాహ్ ఆరాధనకు దూరమైపోయిన వారు, దైవ భీతికి, దైవ భక్తికి దూరంగా ఉంటున్న వారు మరి కొంతమంది. ఇలా దైవభక్తితో జీవించుకున్న వాళ్ళు కొందరు, దైవభక్తికి దూరమైపోయిన వారు కొందరు. అలా రెండు రకాలుగా ప్రజలు మారిపోయారు.
విగ్రహారాధన ప్రారంభం
అయితే ఇక్కడ మరొక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి అదేమిటంటే, ఎవరైతే దైవ భీతితో భక్తులుగా జీవించుకుంటున్నారో వారిలో ఒక ఐదుగురు ప్రసిద్ధి చెంది ఉన్నారు. వారి ప్రస్తావన ఖురాన్లో కూడా వచ్చి ఉంది, 71వ అధ్యాయం, 23వ వాక్యంలో. వారి పేర్లు వద్, సువా, యగూస్, యఊక్, నసర్. ఈ ఐదు పేర్లు కూడా దైవ భీతితో జీవించుకుంటున్న దైవభక్తుల పేర్లు అని అబ్దుల్లా ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు తెలియజేసి ఉన్నారు.
అయితే ఈ ఐదు మందిని ఎవరైతే దైవ భీతికి దూరంగా ఉంటున్నారో వారు సైతం ఈ ఐదు మందిని అభిమానించేవారు. ప్రజలు వారు దైవభక్తులని గౌరవిస్తూ అభిమానించేవారు.
ఇక షైతాన్ మానవుని బద్ధ శత్రువు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని గురించి ముందే తెలియజేసి ఉన్నాడు, మానవుల బద్ధ శత్రువు, బహిరంగ శత్రువు అని. అతను మానవులను మార్గభ్రష్టత్వానికి గురి చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెంటనే ఎప్పుడైతే ప్రజలు కొంతమంది దైవ భీతితో జీవించుకుంటున్నారో, మరికొంతమంది దైవ భీతికి దూరమైపోయారో అన్న విషయాన్ని గమనించాడో, అతను దైవ భీతికి దూరంగా ఉంటున్న వారి వద్దకు వచ్చాడు. వచ్చి ఈ దైవ భీతి పరులు ఎవరైతే బాగా ప్రసిద్ధి చెందారో, వద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీరి మరణానంతరం ప్రజల వద్దకు వచ్చి, ఏమండీ మీ పూర్వీకులు ఈ ఫలా ఫలా వ్యక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జీవించుకునేవారు కదండీ. వారు మరణించిన తర్వాత వారి మీద ఉన్న మీ అభిమానాన్ని మీరు ఎలా చాటుకుంటారండి? అని వాడు ఏం చేశాడంటే కొన్ని ప్రతిమలు తయారుచేసి, ఏమండీ ఇవి మీరు అభిమానించే దైవ భీతిపరుల ప్రతిమలు. ఈ ప్రతిమలు మీరు మీ వద్ద ఉంచుకొని వారి అభిమానాన్ని చాటుకోండి, వారిని తలుచుకోండి అని తెలియజేశాడు.
చూడటానికి మాట చాలా మధురంగా కనిపిస్తుంది కదండీ. ఒక అభిమాని యొక్క ప్రతిమను తీసుకొని వచ్చి మీరు ఇతన్ని అభిమానిస్తున్నారు కాబట్టి ఇతని ప్రతిమను మీ దగ్గర ఉంచుకోండి అని చెప్తే ఎవరు వద్దంటాడండి? అలాగే ఆ ప్రజలు ఏం చేశారంటే, షైతాను మానవుని రూపంలో వచ్చి ఆ విధంగా చెబుతూ ఉంటే, ఇదేదో మంచిగానే ఉంది కదా అనుకొని తీసుకుపోయి వెళ్లి విగ్రహాలను ఇళ్లల్లో ఉంచుకున్నారు. చూడండి, ప్రతిమలు ఇళ్లల్లోకి కేవలం అభిమానం అనే ఒక కారణంతోనే వచ్చాయి. అవి ఆరాధ్యులు, మన కోరికలు తీర్చే దేవుళ్ల రూపాలు అన్న ఆలోచనతో అవి ఇళ్లల్లోకి రాలేదు.
మనం అభిమానించే మన దైవ భీతిపరుల ప్రతిమలు అని అవి ఇళ్లల్లోకి వచ్చాయి. వారు బ్రతికి ఉన్నంత కాలం, ఎవరైతే ఆ విగ్రహాలను, ఆ ప్రతిమలను ఇళ్లల్లోకి తీసుకొని వెళ్లారో వారు జీవించినంత కాలము వాటిని చూసుకుంటూ మన పూర్వీకులు, మన పూర్వీకులు ఒకప్పుడు ఉండేవారు, ఒకప్పుడు భక్తి శ్రద్ధలతో జీవించుకునేవారు అని చెప్పుకుంటూ జీవించారు. ముఖ్యంగా ఆ దైవ భీతిపరులు ఎక్కడైతే దైవ ఆరాధనలో సమయం గడిపేవారో, అదే చోట ఆ విగ్రహాలను ప్రతిష్టించుకున్నారు అని కూడా కొంతమంది ధార్మిక పండితులు తెలియజేశారు. ఏది ఏమైనప్పటికినీ మానవుల మధ్యకి ప్రతిమలు, విగ్రహాలు వచ్చాయి. ప్రారంభంలో అవి కేవలము అభిమానించబడ్డాయి అంతేగాని ఆరాధించబడలేదు.
రోజులు గడిచాయి. మానవుల ఆయుష్షు ముగిస్తూ పోయింది. ఒక తరం గడిచింది, తర్వాత తరం గడిచింది. ఆ విధంగా తరాలు గడిచిన తర్వాత విగ్రహాలు మాత్రము అవి అలాగే నిలబడి ఉన్నాయి. ఒక రెండు, మూడు తరాలు గడిచిన తర్వాత అవి ఒక పురాతన వస్తువులాగా మారిపోయింది. దాని చరిత్ర ఎవరికీ తెలియదు, తర్వాత వచ్చిన తరాల వారికి.
అప్పుడు షైతాన్ మళ్ళీ మానవుని రూపంలో వారి మధ్యకు వచ్చి, తర్వాతి తరాల వారి వద్దకు వచ్చి, ఏమండీ మీ పూర్వీకులు వీటినే ఆరాధించుకునేవారు, మీరెందుకండి విస్మరిస్తున్నారు వీటిని? మీ పూర్వీకులు వీటిని ఆరాధిస్తుండగా నేను చూశాను అని అతను నమ్మజబితే, తర్వాత తరాల వారు అతని మాటలను నమ్మి వెంటనే ఆ ప్రతిమలను, ఆ విగ్రహాలను ఆరాధించడం ప్రారంభించేశారు.
చూశారా, షైతాను ఎలా క్రమంగా, నెమ్మదిగా ప్రజలను అల్లాహ్ ఆరాధన నుండి తప్పించి విగ్రహారాధన వైపుకి తీసుకెళ్ళిపోయాడో? అభిమానం అన్న ఒక విషయాన్ని ఆయుధంగా మలుచుకున్నాడు. తరువాత ఆ విగ్రహాలను ఇళ్లల్లో తీసుకొని వెళ్లి, ముందు ప్రతిష్టింపజేసి, తర్వాత తరాల వారికి మాత్రము వారే మీ దేవుళ్ళు అన్నట్టుగా చిత్రీకరించి చెప్పగానే తర్వాత తరాల వారు తెలియని వాళ్ళు ఏం చేశారంటే, అమాయకత్వానికి గురయ్యి వారు ఆ విగ్రహాలను పూజించడం ప్రారంభించారు. విగ్రహారాధన వెయ్యి సంవత్సరాల తర్వాత ఈ భూమండలం మీద ప్రారంభమైంది. షైతాను వలలో చిక్కుకొని ప్రజలు ఆ విధంగా విగ్రహారాధన చేశారు.
ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) వారి పిలుపు
అప్పుడు పైనుంచి గమనిస్తున్న అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, ఇదేమిటండీ మానవులు రాళ్ళను, విగ్రహాలను పూజించడం ప్రారంభించేశారో అని వెంటనే వారిలో నుంచే ఒక ఉత్తమమైన వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకొని వారి మధ్యకు ప్రవక్తగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రభవింపజేశాడు. ఆయన పేరే నూహ్ అలైహిస్సలాం.
నూహ్ అలైహిస్సలాం ప్రవక్త పదవి దక్కిన తర్వాత ప్రజల మధ్యకు ప్రవక్తగా వెళ్లి ముందుగా నూహ్ అలైహిస్సలాం వారి జాతి ప్రజలకు ఇచ్చిన పిలుపు ఏమిటంటే, ఖురాన్ లో ఏడవ అధ్యాయం 59వ వాక్యంలో మనం చూస్తే కనిపిస్తుంది అక్కడ, నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు:
(యా కౌమి అ`బుదుల్లాహ మాలకుమ్ మిన్ ఇలాహిన్ గైరుహూ) “ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దేవుడు లేడు.” (7:59)
ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన తప్ప వేరెవరూ మీ ఆరాధనకు అర్హులు కారు. అంటే నూహ్ అలైహిస్సలాం ప్రజల వద్దకు వెళ్లి మొదటి దైవ వాక్యం వినిపించింది ఏమిటంటే, మీ ఆరాధనలకు అర్హుడు కేవలం ఒక అల్లాహ్ మాత్రమే. కాబట్టి నా జాతి ప్రజలారా మీరు అల్లాహ్ ను ఆరాధించండి, అల్లాహ్ ఆరాధన వైపుకి రండి అని పిలుపునిచ్చారు.
ఇక్కడ ఒక విషయం మనం గుర్తులో పెట్టుకోవాలి అదేమిటంటే, ఈ భూమండలం మీద మానవుని చరిత్ర మొదలైన తర్వాత ప్రజలకు విగ్రహారాధన నుండి తప్పించి అల్లాహ్ ఆరాధన వైపుకి రండి అని పిలిచిన మొదటి రసూల్ నూహ్ అలైహిస్సలాం. ఆ గౌరవం ఆయనకే దక్కింది.
నూహ్ అలైహిస్సలాం కేవలం ప్రజలకు అల్లాహ్ ను ఆరాధించండి అని చెప్పడమే కాదండి, అల్లాహ్ ను ఆరాధించిన వలన మీకు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎలాంటి అనుగ్రహాలు ప్రసాదిస్తాడు అన్న విషయాలు కూడా తెలియజేశారు. ఖురాన్లో మనం చూసినట్లయితే 71వ అధ్యాయం 10వ వాక్యము నుండి 12వ వాక్యం వరకు ఆయన చెప్పిన మాటలు తెలపబడ్డాయి. ఆయన ఏమన్నారంటే:
(ఫకుల్తుస్తగ్ఫిరూ రబ్బకుమ్ ఇన్నహూ కాన గఫ్ఫారా. యుర్సిలిస్ సమాఅ అలైకుమ్ మిద్రారా. వయుమ్దిద్కుమ్ బి అమ్వాలివ్ వబనీన వయజ్అల్ లకుమ్ జన్నతివ్ వయజ్అల్ లకుమ్ అన్హారా) “మీరు మీ ప్రభువును క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు. (అలా చేస్తే) ఆయన మీపై ఆకాశం నుండి ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. సిరిసంపదలతో, సంతానంతో మీకు సహాయం చేస్తాడు. మీ కోసం తోటలను ఉత్పాదనం చేస్తాడు, మీ కొరకు కాలువలను ప్రవహింపజేస్తాడు.” (71:10-12)
మీరు బహుదైవారాధన చేసి పాపానికి ఒడిగట్టారు కదా. మీరు అల్లాహ్ తో క్షమాపణ వేడుకోండి. క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. ఆయన నిశ్చయంగా క్షమించేవాడు. క్షమించిన తర్వాత ఆయన మీ కోసం ఏం చేస్తాడంటే, ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీ సిరిసంపదల్లోనూ, పుత్ర సంతతిలోనూ పురోభివృద్ధిని వసగుతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు, ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు.
మీ పాపాలు మన్నిస్తాడు, వర్షాలు కురిపిస్తాడు, నదులు ప్రవహింపజేస్తాడు, మీకు సంతానం ప్రసాదిస్తాడు, పంటలు పండిస్తాడు. ఈ విధంగా అల్లాహ్ అనుగ్రహాలు మీకు దొరుకుతూ ఉంటాయి అని నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ ఆరాధన వైపు పిలుస్తూ అల్లాహ్ ప్రజలకు ప్రసాదించే అనుగ్రహాల గురించి కూడా తెలియజేశారు.
జాతి ప్రజల తిరస్కరణ మరియు ఎగతాళి
అయితే ప్రజల స్పందన ఎలా ఉండేది? అది మనం చూసినట్లయితే, ఎప్పుడైతే నూహ్ అలైహిస్సలాం ఈ విషయాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లారో ప్రజలు ఏమనేవారంటే:
إِنَّا لَنَرَىٰكَ فِى ضَلَٰلٍ مُّبِينٍ
(ఇన్నాల నరాక ఫీ దలాలిమ్ ముబీన్) “మేమైతే నిన్ను స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లు చూస్తున్నాము.” (7:60) ఓ నూహ్, నువ్వు స్పష్టమైన అపమార్గానికి గురైనట్లు మాకు కనిపిస్తుంది అన్నారు. మరికొంతమంది ఏమన్నారంటే:
(మా సమిఅనా బిహాజా ఫీ ఆబాయినల్ అవ్వలీన్) “ఇలాంటి మాటను మేము మా తాతముత్తాతల కాలంలో ఎన్నడూ వినలేదు.” (23:24) అనగా ఇతను చెప్పే దానిని మేము ఇదివరకు ఎన్నడూ మా తాత ముత్తాతల కాలంలో విననేలేదు. మా తాత ముత్తాతల కాలంలో ఇలా ఒక దేవుణ్ణి ఆరాధించాలి, అల్లాహ్ ని దేవుణ్ణి, అల్లాహ్ ని ఆరాధించాలన్న మాటలు మనం విననేలేదే అని కొంతమంది మాట్లాడారు. మరి కొంతమంది ఏమన్నారంటే:
وَلَوْ شَآءَ ٱللَّهُ لَأَنزَلَ مَلَٰٓئِكَةً
(వలౌ షా అల్లాహు లఅన్జల మలాయికతన్) “అల్లాహ్యే గనక తలచుకుంటే దైవదూతలను దించి ఉండేవాడు.” (23:24) ప్రజలను అల్లాహ్ వైపు పిలవాలనే ఒక ఉద్దేశం అల్లాహ్ కు ఉండినట్లయితే మానవుడిని ఎందుకు పంపిస్తాడు? ఒక దైవదూతను పంపించేవాడు కదా అని అన్నారు.
అప్పుడు నూహ్ అలైహిస్సలాం, చూడండి ప్రజలు నూహ్ అలైహిస్సలాం వారికి నువ్వు మార్గభ్రష్టత్వానికి గురైపోయావు అంటున్నారు, మనిషిగా నువ్వు మా వద్దకు ప్రవక్తగా రావడం ఏంటి, దైవదూత రావచ్చు కదా అంటున్నారు, మా తాత ముత్తాతల కాలంలో ఇలాంటి మాటలు మనం ఎప్పుడూ వినలేదే అంటున్నారు. అయితే నూహ్ అలైహిస్సలాం ఎంతో మృదు స్వభావంతో ప్రజలకు ఎంత మధురమైన మాటలు చెప్తున్నారో చూడండి. ఆయన అన్నారు, “నా జాతి ప్రజలారా, నేను దారి తప్పలేదు. నేను సర్వలోకాల ప్రభువు తరపున పంపబడిన ప్రవక్తను. నేను మీ మేలు కోరేవాడిని.”
ప్రతి జాతిలో కొంతమంది పెద్దలు ఉంటారండి. నూహ్ అలైహిస్సలాం వారి జాతిలో కూడా పెద్దలు ఉండేవారు కదా, వారు నూహ్ అలైహిస్సలాం వారి మాటలు విని ఏమనేవారంటే:
يُرِيدُ أَن يَتَفَضَّلَ عَلَيْكُمْ
(యురీదు అన్ యతఫద్దల అలైకుమ్) “ఇతను మీపై ఆధిపత్యం చెలాయించాలని కోరుతున్నాడు.” (23:24) ఇతను మీపై పెత్తరికాన్ని కోరుకుంటున్నాడు. మరికొంతమంది పెద్దలు ఏమనేవారంటే:
إِنْ هُوَ إِلَّا رَجُلٌۢ بِهِۦ جِنَّةٌ
(ఇన్ హువ ఇల్లా రజులుమ్ బిహీ జిన్నతున్) “ఇతను పిచ్చిపట్టిన మనిషి తప్ప మరెవరూ కారు.” (23:25) అనగా ఇతనికి పిచ్చి పట్టినట్టుంది. మరికొంతమంది అయితే ఏకంగా నూహ్ అలైహిస్సలాం వారి వద్దకు వచ్చి ఒక షరతు పెట్టేశారు. ఏంటి ఆ షరతు? నూహ్ అలైహిస్సలాం ప్రజలకు దైవ వాక్యాలు వినిపిస్తూ ఉంటే కొంతమంది నూహ్ అలైహిస్సలాం వారి మాటలు విని విశ్వసించి ముస్లింలుగా, విశ్వాసులుగా జీవించుకుంటున్నారు. అయితే వారందరూ కూడా హోదాపరంగా, ధనంపరంగా బలహీనులు. వారి గురించి వచ్చి ఈ జాతి పెద్దలు నూహ్ అలైహిస్సలాం వారి వద్ద షరతు పెడుతున్నారు. ఏమంటున్నారంటే:
أَنُؤْمِنُ لَكَ وَٱتَّبَعَكَ ٱلْأَرْذَلُونَ
(అను’మినులక వత్తబఅకల్ అర్జలూన్) “(ఓ నూహ్!) నిన్ను అనుసరిస్తున్న వారంతా అధములే కదా! మరి మేము నిన్ను ఎలా విశ్వసిస్తాము?” (26:111) అదేమిటంటే, ఓ నూహ్, మేము నీ మాటను విశ్వసిస్తాం, నీ మాటను అంగీకరిస్తామయ్యా, అయితే నీ వద్ద ఉన్న ఈ బలహీనులు, అధములు వీరిని నువ్వు నీ వద్ద నుండి గెంటివేయి.
మేము నిన్ను విశ్వసించాలా? చూడబోతే అధములు మాత్రమే నిన్ను అనుసరిస్తున్నారు. కాబట్టి మేము నీ మాట వినాలంటే ఈ అధములని నీ వద్ద నుండి నువ్వు గెంటేయాలి అన్నారు. చూడండి, చులకనగా చూస్తున్నారు విశ్వాసులను. అహంకారం అండి, హోదాలలో ఉన్నారు కదా, జాతి పెద్దలు కదా, గర్వం. ఆ అహంకారంతో, గర్వంతో ఏమంటున్నారంటే వారిని నువ్వు గెంటేస్తే నేను నీ మాట వింటాము అంటున్నారు.
అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, “ఏమండీ, నేను ఏదో హోదా కోరుకుంటున్నాను, లేదా ధనం కోరుకుంటున్నాను, మీ నాయకుడిని అయిపోవాలి ఇలాంటి కోరికలతో నేను మీకు ఈ వాక్యాలు వినిపిస్తున్నానని మీరు అనుకుంటున్నారా? వాస్తవం ఏమిటంటే:
وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ
(వమా అస్అలుకుమ్ అలైహి మిన్ అజ్ర్) “నేను దీనికై మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు.” (26:109) నేను ఈ బోధనలకు ప్రతిఫలంగా ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. అలాగే:
وَمَآ أَنَا۠ بِطَارِدِ ٱلْمُؤْمِنِينَ
(వమా అన బితారిదిల్ ము’మినీన్) “నేను విశ్వాసులను తరిమివేసేవాడను కాను.” (26:114) నేను మాత్రం విశ్వాసులను ఎట్టి పరిస్థితుల్లో గెంటివేసేవాడిని కాను. విశ్వాసులు వాళ్ళు ధనపరంగా బలహీనులా, బలవంతులా, ఇది కాదు. విశ్వాసం వారిది ఎంత దృఢమైనదనే దానిని బట్టి వారిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా గౌరవ స్థానాలు కేటాయిస్తాడు కాబట్టి నేను మాత్రం వీరిని నా వద్ద నుండి గెంటివేయను అని నూహ్ అలైహిస్సలాం వారు వారికి తెలియజేశారు.
నూహ్ అలైహిస్సలాం వారు జాతి ప్రజల మధ్య ఇంచుమించు 950 సంవత్సరాల వరకు రేయింబవళ్ళు కష్టపడి దైవ వాక్యాలు ప్రజలకు తెలియజేశారు. ఖురాన్లోని 29వ అధ్యాయం 14వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:
(ఫలబిస ఫీహిమ్ అల్ఫ సనతిన్ ఇల్లా ఖమ్సీన ఆమన్) “అతను వారి మధ్య యాభై తక్కువ వెయ్యి సంవత్సరాలు ఉన్నాడు.” (29:14) అనగా 50 తక్కువ వెయ్యి సంవత్సరాలు, 50 తక్కువ వెయ్యి సంవత్సరాలు అంటే 950 సంవత్సరాలు నూహ్ అలైహిస్సలాం వారి మధ్య ఉన్నాడు. రాత్రిపూట వారికి దైవ వాక్యాలు వినిపించారు, పగలుపూట వారికి దైవ వాక్యాలు వినిపించారు. అందరూ కలిసి ఉన్నచోట వెళ్లి దైవ వాక్యాలు వినిపించారు. ఏకాంతంలో వెళ్లి కలిసి వారికి అల్లాహ్ వైపు పిలిచారు, దైవ వాక్యాలు వినిపించారు. బహిరంగంగా కూడా దైవ వాక్యాలు ప్రకటించారు, ఏకాంతంలో కూడా వెళ్లి వారికి అల్లాహ్ వాక్యాలు తెలియజేశారు. ఇలా నూహ్ అలైహిస్సలాం ఎన్ని రకాలుగా వారికి అల్లాహ్ వాక్యాలు వినిపించినా వారు మాత్రం ఏం చేసేవారంటే, చెవుల్లో వేళ్ళు పెట్టుకునేవారు, తలల మీద బట్టలు కప్పుకునేవారు.
అంతే కాదండి, వారిలో ఎవరికైనా మరణం సమీపిస్తే మరణించే ముందు కుటుంబ సభ్యుల్ని దగ్గరికి పిలిచి హితవు చేసేవారు. ఏమని? ఎట్టి పరిస్థితుల్లో మీరు నూహ్ మాట వినకండి. నూహ్ ఎటువైపు మిమ్మల్ని పిలుస్తున్నాడో అటువైపు మీరు వెళ్ళకండి. నూహ్ మాటల్ని మీరు పట్టించుకోకండి. అలాగే మనం పూజిస్తున్న వద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీళ్ళ ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో మీరు వదలకండి అని చెప్పేవారు. దీని ప్రస్తావన ఖురాన్లో కూడా ఉంది:
(వకాలూ లా తజరున్న ఆలిహతకుమ్ వలా తజరున్న వద్దవ్ వలా సువాఅవ్ వలా యగూస వయఊక వనస్రా) “మరియు వారు ఇలా అన్నారు: ‘మీరు మీ దైవాలను ఎంతమాత్రం వదలకండి. వద్దును, సువాను, యగూసును, యఊకును, నస్రును అసలే వదలకండి’.” (71:23)
చివరికి అన్ని సంవత్సరాలు నూహ్ అలైహిస్సలాం వారు కష్టపడినా ఎంతమంది విశ్వసించారంటే, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము ఇంచుమించు 80 మంది మాత్రమే విశ్వసించారు. 950 సంవత్సరాల కష్టానికి ఫలితంగా కేవలం ఇంచుమించు 80 మంది మాత్రమే విశ్వసించారు. అప్పుడు నూహ్ అలైహిస్సలాం జాతి ప్రజలను హెచ్చరించారు. ఏమని హెచ్చరించారంటే:
إِنِّىٓ أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
(ఇన్నీ అఖఫు అలైకుమ్ అజాబ యౌమిన్ అజీమ్) “నిశ్చయంగా నేను మీ విషయంలో ఒక మహత్తర దినపు శిక్షకు భయపడుతున్నాను.” (7:59) అనగా మీ విషయంలో ఒక మహా దినం నాటి శిక్ష గురించి నాకు భయంగా ఉంది. ఒక శిక్ష మీకు వచ్చి పట్టుకుంటుందన్న భయం నాకు కలుగుతూ ఉంది, కాబట్టి మీరు దైవ శిక్షకు భయపడండి, అల్లాహ్ వైపుకు రండి అని అల్లాహ్ శిక్ష గురించి వారిని హెచ్చరించారు.
అయితే జాతి ప్రజలు, జాతి పెద్దలు ఆ మాట విని నూహ్ అలైహిస్సలాం వారితో ఏమనేవారంటే:
(ఖాలూ యా నూహు కద్ జాదల్తనా ఫ అక్సర్త జిదాలనా ఫ’తినా బిమా తఇదునా ఇన్ కుంత మినస్ సాదిఖీన్) “ఓ నూహ్! నీవు మాతో వాదించావు. చాలా ఎక్కువగా వాదించావు. నీవు గనక సత్యవంతుడివే అయితే, నీవు మమ్మల్ని భయపెడుతున్న ఆ శిక్షను తీసుకురా చూద్దాం.” (11:32) అనగా, ఓ నూహ్, నువ్వు మాతో వాదించావు, మరీ మరీ వాదించావు, మరి నువ్వు సత్యవంతుడవే అయితే మమ్మల్ని హెచ్చరించే దానిని అనగా ఆ దైవ శిక్షని తీసుకురా అని చెప్పేవారు. ఎంత పెద్ద మాట అండి! అల్లాహ్ శిక్ష మిమ్మల్ని పట్టుకుంటుంది అని ప్రవక్త హెచ్చరిస్తూ ఉంటే, జాతి ప్రజలు, జాతి పెద్దలు ఏమంటున్నారంటే, ఈ హెచ్చరికలు నోటితో చెప్పటం కాదు, ఒకవేళ నువ్వు చెప్పేది నిజమే అయితే తీసుకురా చూద్దాం ఆ దైవ శిక్ష ఎలా ఉంటాదో అంటున్నారంటే ఎంతటి అహంకారము. షైతాను వారిని ఎలా అంధులుగా చేసేసాడో చూడండి.
మరి కొంతమంది అయితే ఏకంగా నూహ్ అలైహిస్సలాం వారి మీదకే తిరగబడిపోయారు. వారేమన్నారంటే:
(లఇల్ లమ్ తంతహి యా నూహు లతకూనన్న మినల్ మర్జుమీన్) “ఓ నూహ్! నీవు గనక (ఈ పని నుండి) విరమించుకోకపోతే, నిశ్చయంగా నీవు రాళ్లతో కొట్టి చంపబడతావు.” (26:116) వారేమంటున్నారంటే, నువ్వు గనుక ఈ పనిని మానుకోకపోతే నిన్ను రాళ్లతో కొట్టడం, చంపడం ఖాయం. దైవ శిక్ష వచ్చి పడుతుంది అని మమ్మల్ని బెదిరించడం కాదు, ఇలాంటి మాటలు నువ్వు మానుకోకపోతే నిన్నే మేమందరం కలిసి రాళ్లతో కొట్టి చంపేస్తాము, ఇది ఖాయం అని చెప్పారు.
దైవ ఆదేశం మరియు ఓడ నిర్మాణం
అలాంటప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఒక మాట తెలియజేశాడు. ఏంటి ఆ మాట?
(అన్నహూ లయ్ యు’మిన మిన్ కౌమిక ఇల్లా మన్ కద్ ఆమన్) “ఇంతకు ముందే విశ్వసించిన వారు తప్ప, నీ జాతి వారిలో మరింకెవరూ విశ్వసించరు.” (11:36) ఓ నూహ్, నీ జాతి వారిలో ఇంతవరకు విశ్వసించిన వారు తప్ప ఇక మీదట ఎవరూ విశ్వసించబోరు. ఇప్పటివరకు ఎంతమంది అయితే విశ్వసించారో వారే విశ్వాసులు. ఇక నీ జాతిలో ఏ ఒక్కడూ కూడా విశ్వసించేవాడు లేడు అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేయగా నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ తో ప్రార్థన చేశారు. ఏమన్నారు?
(రబ్బి ఇన్న కౌమీ కజ్జబూన్. ఫఫ్తహ్ బైని వబైనహుమ్ ఫత్హవ్ వనజ్జినీ వమన్ మఇయ మినల్ ము’మినీన్) “నా ప్రభూ! నా జాతి వారు నన్ను ధిక్కరించారు. కనుక నాకూ, వారికీ మధ్య ఒక స్పష్టమైన తీర్పు కావాలి. నాకూ, నాతో పాటు ఉన్న విశ్వాసులకూ మోక్షం ప్రసాదించు.” (26:117-118) అనగా, నా ప్రభు, నా జాతి వారు నన్ను ధిక్కరించారు, కాబట్టి నీవు నాకూ, వారికి మధ్య ఏదైనా అంతిమ నిర్ణయం చెయ్యి. నన్నూ, నాతో ఉన్న విశ్వాసులను కాపాడు. ఇక నిర్ణయం నీ వైపే వదిలేస్తున్నాను ఓ అల్లాహ్, నీవే ఫలితం తేల్చేయి, నన్ను, నాతో పాటు ఉన్న విశ్వాసులను మాత్రము నువ్వు రక్షించు కాపాడు అని నూహ్ అలైహిస్సలాం వారు దుఆ చేయగా, ప్రార్థన చేయగా అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఒక ఆదేశం ఇచ్చాడు. ఏంటది?
(వస్నఇల్ ఫుల్క బిఅ’యునినా వవహ్యినా వలా తుఖతిబ్నీ ఫిల్ లజీన జలమూ ఇన్నహుమ్ ముగ్ రఖూన్) “నీవు మా కళ్లెదుట, మా ఆదేశానుసారం ఓడను నిర్మించు. దుర్మార్గుల విషయంలో నాతో మాట్లాడకు. వారు ముంచివేయబడటం ఖాయం.” (11:37) అనగా, మా కళ్ల ముందరే, మా వహీ అనుసారం ఒక ఓడను తయారు చెయ్యి, మా ముందు దుర్మార్గుల ఊసు ఎత్తకు, వారంతా ముంచివేయబడేవారే. అంటే మా ఆదేశాల ప్రకారము ఒక ఓడను నువ్వు తయారు చేసుకో అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఆదేశాలు ఇచ్చేశాడు.
నూహ్ అలైహిస్సలాం విషయాన్ని అర్థం చేసుకొని అల్లాహ్ తో మరొక్కసారి ప్రార్థిస్తున్నారు, ఏమన్నారంటే:
(రబ్బి లా తజర్ అలల్ అర్జి మినల్ కాఫిరీన దయ్యారా. ఇన్నక ఇన్ తజర్హుమ్ యుజిల్లా ఇబాదక వలా యలిదూ ఇల్లా ఫాజిరన్ కఫ్ఫారా) “నా ప్రభూ! నీవు భూమిపై ఒక్క అవిశ్వాసిని కూడా సజీవంగా వదలొద్దు. ఒకవేళ నీవు వారిని వదిలిపెడితే వారు నీ దాసులను మార్గభ్రష్టుల్ని చేస్తారు. వారు జన్మనిచ్చేది కూడా అవిధేయులకూ, కృతఘ్నులకూ మాత్రమే.” (71:26-27) నా ప్రభు, నీవు భూమండలంపై ఏ ఒక్క అవిశ్వాసిని సజీవంగా వదిలిపెట్టకు. ఒకవేళ నువ్వు గనుక వీళ్ళను వదిలిపెడితే, వీళ్ళు నీ దాసులను మార్గం తప్పిస్తారు, వీళ్ళకు పుట్టబోయే బిడ్డలు కూడా అవిధేయులు, కరుడుగట్టిన అవిశ్వాసులై ఉంటారు. కాబట్టి అవిశ్వాసుల్ని ఎవరినీ నువ్వు వదలొద్దు, వారు మార్గభ్రష్టత్వానికి గురయ్యిందే కాకుండా వారి సంతానాన్ని కూడా వారు మార్గభ్రష్టులుగా మార్చేస్తున్నారు కాబట్టి ఏ ఒక్కరినీ నువ్వు వదలొద్దు ఓ అల్లాహ్ అని మరొక్కసారి ప్రార్థన చేసేశారు.
అల్లాహ్ ఆదేశం ప్రకారం నూహ్ అలైహిస్సలాం ఓడను నిర్మిస్తున్నారు. నూహ్ అలైహిస్సలాం ఏ ప్రదేశంలో అయితే ఓడ నిర్మిస్తున్నారో, అది సముద్రానికి చాలా దూరంగా ఉండే ప్రదేశం. ధార్మిక పండితులు, ముఖ్యంగా చరిత్రకారులు నూహ్ అలైహిస్సలాం వారి పుట్టుక, నూహ్ అలైహిస్సలాం వారు నివసించిన ప్రదేశం గురించి ఏమన్నారంటే ఇరాక్ లోని కనాన్ ప్రదేశంలో ఆయన జీవించారు, నివసించారు ఆ రోజుల్లో అని తెలియజేశారు. అసలు విషయం అల్లాహ్ కే తెలియాలి. అయితే ఒక విషయం మాత్రము నిజం, అదేమిటంటే నూహ్ అలైహిస్సలాం వారు నివసించిన ప్రదేశము సముద్రానికి దూరమైన ప్రదేశం. అలాంటి ప్రదేశంలో నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ ఆదేశంతో ఓడను నిర్మిస్తున్నారు. ఓడ నిర్మిస్తూ ఉంటే ఆ జాతి ప్రజలు, ఆ జాతి పెద్దలు అటువైపు నుంచి వస్తూ వెళుతూ ఆ ఓడ నిర్మాణాన్ని చూసి పరస్పరము నవ్వుకునేవారు, విశ్వాసులను చూసి హేళన చేసేవారు. ఇదేంటి ఈ ఎడారిలో మీరు పడవ నడిపిస్తారా? ఇక్కడ మీరు పడవ నిర్మిస్తున్నారు, ఇది మూర్ఖత్వం కాదా? పడవ ఎక్కడైనా ఎడారిలో నడుస్తుందా? అంటూ హేళన చేసేవారు. అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారితో ఒకే మాట అనేవారు. అదేమిటంటే:
(ఇన్ తస్ఖరూ మిన్నా ఫఇన్నా నస్ఖరు మిన్కుమ్ కమా తస్ఖరూన్) “ఒకవేళ మీరు మమ్మల్ని చూసి నవ్వితే, మీరు నవ్వుతున్న విధంగానే మేము కూడా మిమ్మల్ని చూసి నవ్వుతాము.” (11:38) అనగా మీరు మా స్థితిపై నవ్వుతున్నట్లే మేము కూడా ఒకనాడు మీ స్థితిపై నవ్వుకుంటాము. అంటే ఎలాగైతే మీరు మమ్మల్ని చూసి ఈరోజు నవ్వుకుంటున్నారు కదా, ఒకరోజు త్వరలోనే రాబోతోంది, ఆ రోజు మేము నవ్వుతాం, అప్పుడు మీరు ఏడుస్తారు అన్న విషయాన్ని నూహ్ అలైహిస్సలాం వారికి తెలియజేశారు.
అలాగే నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో మరొక్కసారి ప్రార్థించారు. ఏమన్నారంటే:
(రబ్బిగ్ఫిర్లీ వలివాలిదయ్య వలిమన్ దఖల బైతియ ము’మినవ్ వలిల్ ము’మినీన వల్ ము’మినాత్) “నా ప్రభూ! నన్నూ, నా తల్లిదండ్రులను, విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారినీ, విశ్వాసులైన పురుషులందరినీ, స్త్రీలందరినీ క్షమించు.” (71:28) నన్నూ, నా తల్లిదండ్రులను విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారందరినీ, విశ్వాసులైన సమస్త పురుషులను, స్త్రీలను క్షమించు.
మహా జలప్రళయం మరియు రక్షణ
ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఒక నిర్ణీత సమయాన్ని నూహ్ అలైహిస్సలాం వారికి తెలియజేశాడు. ఏమన్నాడంటే ఎప్పుడైతే పొయ్యి, పొయ్యిలో నుంచి నీళ్ళు ఉప్పొంగుతాయో అప్పుడు మా ఆదేశము వచ్చి పొయ్యి పొంగినప్పుడు ఈ ఓడలోకి ప్రతి జీవరాశి నుండి రెండేసి, అనగా ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువు చొప్పున ఎక్కించుకో. నీ ఇంటి వారలను కూడా తీసుకో, ఎవరి విషయంలోనైతే ముందుగానే మాట ఖరారైందో వారిని వదిలేయి, ఇంకా విశ్వాసులందరినీ కూడా ఎక్కించుకో. అయితే అతని వెంట విశ్వసించిన వారు బహు కొద్దిమంది మాత్రమే. (11:40).
మా ఆదేశం వచ్చినప్పుడు పొయ్యి ఉప్పొంగినప్పుడు నీళ్లు ఉప్పొంగినప్పుడు ప్రతి జాతిలో నుండి ఒక్కొక్క జంటని ఒక్కొక్క జంటని ఓడలోకి ఎక్కించుకో, విశ్వాసులను కూడా నీతో పాటు తీసుకో అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేయగా, నూహ్ అలైహిస్సలాం ఆ రోజు కోసం ఎదురు చూడగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నిర్ణయించిన ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు ఆకాశం నుండి జోరున వాన కురిసింది, నీళ్లలో నుంచి కూడా నీళ్లు ఉప్పొంగి పైకి వచ్చేసాయి. అప్పుడు నూహ్ అలైహిస్సలాం విశ్వాసులందరినీ తీసుకొని పడవ ఎక్కేశారు. అలాగే ప్రతి జాతిలో నుండి, ప్రతి జీవిలో నుండి ఒక్కొక్క జంటని ఒక్కొక్క జంటని పడవలోకి ఎక్కించుకున్నారు.
ఆ తర్వాత చూస్తూ ఉండంగానే నీటి మట్టం పెరుగుతూ పోయింది, పడవ నీటిపై తేలడం ప్రారంభించింది. అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, నూహ్ అలైహిస్సలాం వారితో పాటు కూర్చున్న ఉన్నవారితో అన్నారు,
بِسْمِ ٱللَّهِ مَجْر۪ىٰهَا وَمُرْسَىٰهَآ
(బిస్మిల్లాహి మజ్రేహా వముర్సాహా) “దీని ప్రయాణం, దీని మజిలీ అల్లాహ్ పేరుతోనే ఉన్నాయి.” (11:41) అనగా అల్లాహ్ పేరుతోనే ఇది నడుస్తుంది మరియు ఆగుతుంది. ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం మరియు విశ్వాసులందరూ అల్లాహ్ తో దుఆ చేశారు.
(అల్ హందులిల్లాహిల్ లజీ నజ్జానా మినల్ కౌమిజ్ జాలిమీన్) “దుర్మార్గులైన జనుల బారి నుండి మమ్మల్ని కాపాడిన అల్లాహ్కే సర్వస్తోత్రాలు.” (23:28) దుర్మార్గుల బారి నుంచి మమ్మల్ని రక్షించిన అల్లాహ్ కు కృతజ్ఞతలు.
ఇలా ఆ పడవ నీటిపై తేలుతున్నప్పుడు నూహ్ అలైహిస్సలాం మరియు విశ్వాసులు దుఆ పఠిస్తూ ఉంటే నూహ్ అలైహిస్సలాం పడవలో నుంచి బయటికి చూడగా బయట నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు కనిపించాడు. అతని పేరు యామ్ లేదా కనాన్. నూహ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నలుగురు బిడ్డల్ని ప్రసాదించాడు. ఆ నలుగురిలో ఒకడు యామ్ లేదా కనాన్. అతను నూహ్ అలైహిస్సలాం వారి మాటను విశ్వసించలేదు. నూహ్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యుల్లో నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి కూడా నూహ్ అలైహిస్సలాం వారిని విశ్వసించలేదు. నూహ్ అలైహిస్సలాం వారి నలుగురు కుమారులలో ఒక్క కుమారుడు కనాన్ లేదా యామ్ అతను కూడా విశ్వసించలేదు. అవిశ్వాసులతో స్నేహము చేసి వారి మాటల్లో పడి తండ్రినే, ప్రవక్తనే, బోధకుడినే తిరస్కరించేశాడు. బయట నిలబడి ఉన్నాడు. అవిశ్వాసి కదా, విశ్వాసులతో పాటు పడవలోకి రాలేదు.
బయట నిలబడి ఉంటే నూహ్ అలైహిస్సలాం కుమారుణ్ణి చూసి ఏమన్నారంటే:
(యా బునయ్యర్కమ్ మఅనా వలా తకుమ్ మఅల్ కాఫిరీన్) “ఓ నా కుమారా! మాతో పాటు (ఈ ఓడలో) ఎక్కు. అవిశ్వాసులతో చేరిపోకు.” (11:42) బాబు, మాతో పాటే వచ్చి కూర్చో, అవిశ్వాసులతో వెళ్ళకు నాయనా. తండ్రి తండ్రే కదండీ, రక్త సంబంధీకుడు కదండీ. బిడ్డను చూసి ఏమన్నారంటే బాబు, మాతో పాటు వచ్చి పడవలో కూర్చో నాయనా, విశ్వాసులతో పాటు వచ్చి కలిసిపో నాయనా, అవిశ్వాసులతో పాటు ఉండకు నాయనా అని నూహ్ అలైహిస్సలాం బిడ్డను పిలిస్తే అతను ఏమంటున్నాడో చూడండి. అవిశ్వాసి కదండీ, అవిశ్వాసులతో స్నేహం చేశాడు కదండీ. కాబట్టి మాట కూడా అవిశ్వాసి లాగే అతని నోటి నుంచి వస్తుంది. అతను ఏమన్నాడంటే:
(సఆవీ ఇలా జబలియ్ య’సిమునీ మినల్ మా’) “నన్ను నీటి నుండి కాపాడే ఏదైనా పర్వతాన్ని ఆశ్రయిస్తాను.” (11:43) ఏమండీ, ఎంత జోరున వాన కురుస్తా ఉంది అంటే నీటి మట్టం ఎంత తొందరగా పెరుగుతూ ఉంది అంటే ఇలాంటి తూఫానులో ఈ పడవ అసలు నిలుస్తుందా అండి? నేను నా ప్రాణాలు రక్షించుకోవడానికి ఏదైనా ఎత్తైన పర్వతాన్ని ఆశ్రయిస్తాను, అది నన్ను ఈ నీళ్ల నుండి కాపాడుతుంది అని చెప్తున్నాడు. దానికి నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, “లేదు నాయనా, ఈరోజు అల్లాహ్ ఎవరిని రక్షిస్తాడో వారు మాత్రమే రక్షించబడతారు. వాళ్ళు తప్ప మరెవ్వరూ ఈరోజు రక్షించబడే వాళ్ళు ఉండరు. కాబట్టి నా మాట విను నాయనా, వచ్చి మాతో పాటు పడవలో ఎక్కి కూర్చో నాయనా” అంటే అతను మాత్రం ససేమిరా అంటున్నాడు. అంతలోనే చూస్తూ ఉండగా ఒక పెద్ద అల వచ్చింది, ఆ అల తాకిడికి అతను వెళ్లి నీళ్లల్లో పడిపోయినాడు, నీటిలో మునిగి మరణిస్తున్నాడు.
తండ్రి ప్రేమ ఉప్పొంగింది. కళ్ళ ముందరే బిడ్డ నీళ్లల్లో మునిగి మరణిస్తూ ఉంటే చూడలేకపోయారు, చలించిపోయారు. వెంటనే అల్లాహ్ తో దుఆ చేసేసారు, “ఓ అల్లాహ్, నా బిడ్డ, నా సంబంధీకుడు, నా రక్తం, నా కళ్ళ ముందరే మరణిస్తున్నాడు” అంటే అల్లాహ్ తో దుఆ చేయగా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వెంటనే నూహ్ అలైహిస్సలాం వారిని హెచ్చరించాడు. ఏమన్నారంటే:
يَٰنُوحُ إِنَّهُۥ لَيْسَ مِنْ أَهْلِكَ
(యా నూహు ఇన్నహూ లైస మిన్ అహ్లిక) “ఓ నూహ్! అతను నీ కుటుంబీకుడు కాడు.” (11:46) ఓ నూహ్, ముమ్మాటికి వాడు నీ కుటుంబీకుడు కాడు, వాడి పనులు ఏ మాత్రము మంచివి కావు.
إِنِّىٓ أَعِظُكَ أَن تَكُونَ مِنَ ٱلْجَٰهِلِينَ
(ఇన్నీ అఇజుక అన్ తకూన మినల్ జాహిలీన్) “నీవు అజ్ఞానులలో చేరకుండా ఉండాలని నేను నీకు ఉపదేశిస్తున్నాను.” (11:46) అవిశ్వాసుల గురించి నువ్వు నాతో ప్రార్థించకు, నేను నీకు… అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అంటున్నాడు, నువ్వు అజ్ఞానులలో ఒకనివి కారాదని నేను నీకు ఉపదేశిస్తున్నాను అన్నాడు.
నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, అతను నీ కుమారుడు కాదు, అతని పనులు మంచివి కావు అంటున్నాడంటే కొంతమంది ఇక్కడ అపార్థం చేసుకున్నారు. అంటే నూహ్ అలైహిస్సలాం ఆ… నూహ్ అలైహిస్సలాం వారి ఆ కుమారుడు నూహ్ అలైహిస్సలాం కు పుట్టినవాడు కాదు, అక్రమ సంపాదము అన్నట్టుగా కొంతమంది అపార్థం చేసుకున్నారు. అస్తగ్ఫిరుల్లాహ్ సుమ్మ అస్తగ్ఫిరుల్లాహ్. ఎంత మాత్రమూ ఇది సరైన విషయము కాదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రవక్తలకు అలాంటి అసభ్యమైన గుణము కలిగిన మహిళలను సతీమణులుగా ఇవ్వడు. నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి విశ్వసించకపోయినంత మాత్రాన ఆమె నూహ్ అలైహిస్సలాం వారిని ద్రోహం చేసింది అనేది కాదండి ఇక్కడ విషయము. అతను విశ్వాసి కాదు, అవిశ్వాసులతో పాటు ఉండి అవిశ్వాసానికి గురయ్యాడు, సొంత తండ్రినే, దైవ బోధకుడినే తిరస్కరించాడు. కాబట్టి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతన్ని అవిశ్వాసుల జాబితాలో ఉంచుతున్నాడు అన్న విషయం అక్కడ మనం అర్థం చేసుకోవాలి.
నూహ్ అలైహిస్సలాం వారి కళ్ల ముందరే నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు మరణించాడు. నూహ్ అలైహిస్సలాం మరియు నూహ్ అలైహిస్సలాం వారితో పాటు జంతువులు, విశ్వాసులు అందరూ కూడా ఆ ఓడలోనే ఉన్నారు. ఎప్పుడైతే ఆ ఓడ నీటిపై నడుస్తూ ఉందో అప్పుడు వారందరూ అల్లాహ్ తో దుఆ చేశారు. ఏమని దుఆ చేశారంటే:
(రబ్బి అన్జిల్నీ మున్జలమ్ ముబారకవ్ వఅంత ఖైరుల్ మున్జిలీన్) “ప్రభూ! నన్ను శుభప్రదమైన చోట దించు. నీవు అత్యుత్తమంగా దించేవాడవు.” (23:29) ఓ అల్లాహ్, ఓ మా ప్రభు, నన్ను శుభప్రదమైన చోట దించు. నీవు ఎంతో సురక్షితంగా దించేవాడవు అని అల్లాహ్ తో దుఆ చేసుకున్నారు. సురక్షితమైన ప్రదేశాన్ని మమ్మల్ని తీసుకొని వెళ్లి దించు అల్లాహ్ అని అల్లాహ్ తో దుఆ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ రోజు ఎలాంటి తూఫాను వచ్చింది, నీటి మట్టం ఎంత పెరిగింది, ఎంతెంత పెద్ద అలలు ఆ రోజుల్లో వచ్చాయి అంటే అది కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ లో 11వ అధ్యాయం 42వ వాక్యంలో తెలియజేశాడు:
وَهِىَ تَجْرِى بِهِمْ فِى مَوْجٍ كَٱلْجِبَالِ
(వహియ తజ్రీ బిహిమ్ ఫీ మౌజిన్ కల్ జిబాల్) “ఆ ఓడ పర్వతాల వంటి అలల మధ్య వారిని తీసుకుపోసాగింది.” (11:42) అనగా ఆ ఓడ వారిని పర్వతాల్లాంటి అలల్లో నుంచి తీసుకుపోసాగింది. ఒక్కొక్క అల పర్వతం అంత పెద్దదిగా ఉండింది అంటే ఎన్ని నీళ్లు వచ్చి ఉంటాయి, ఎంత పెద్దగా నీటి మట్టం పెరిగిపోయి ఉంటుంది. అంత పెద్ద నీటి మట్టంలో నూహ్ అలైహిస్సలాం తో పాటు ఉన్నవారు మాత్రమే, ఓడలో ఉన్నవారు మాత్రమే రక్షించబడ్డారు. మిగతా వారందరూ, అవిశ్వాసులందరూ కూడా నీటిలో మునిగి మరణించారు.
తర్వాత ఆ ఓడ ఒక పర్వతం పైకి వచ్చి ఆగింది. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దయతో, అల్లాహ్ అనుగ్రహంతో వర్షము ఆగింది, నీళ్లు కూడా ఇంకిపోయాయి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అటు ఆకాశాన్ని మరియు ఇటు భూమిని కూడా ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశంతో వర్షం ఆగిపోయింది, నీళ్లు భూమిలోకి ఇంకిపోయాయి. ఆ పడవ నీటి మీద నుంచి తేలుకుంటూ తేలుకుంటూ జూదీ అనే ఒక పర్వతం పైకి వచ్చి ఆగింది.
وَٱسْتَوَتْ عَلَى ٱلْجُودِىِّ
(వస్తవత్ అలల్ జూదియ్యి) “ఆ ఓడ జూదీ పర్వతంపై నిలిచింది.” (11:44) ఖురాన్ లో ఆ పర్వతం పేరు ప్రస్తావన వచ్చి ఉంది. వస్తవత్ అలల్ జూదియ్యి అనగా ఓడ జూదీ పర్వతంపై నిలిచింది. మరి ఈ జూదీ పర్వతం ఎక్కడ ఉంది అంటే చరిత్రకారులు తెలియజేసిన విషయం టర్కీ దేశంలో ఆ పర్వతం ఉంది అని తెలియజేశారు.
అలాగే ఎప్పుడైతే ఆ పర్వతం మీద పడవ ఆగిందో, నీళ్లు పూర్తిగా భూమిలోకి ఇంకిపోయాయో, ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం వారితో పాటు నూహ్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యులలో ముగ్గురు కుమారులు, వారి పేరు సామ్, హామ్, యాఫిస్, మూడు పేర్లు. నాలుగో కుమారుడు మాత్రం నీటిలో తూఫాన్ లో మునిగిపోయి మరణించాడు. ముగ్గురు కుమారులు విశ్వాసులు. వాళ్ళ సతీమణులు కూడా విశ్వాసులు. ఆ విధంగా నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారులు మరియు ముగ్గురు కోడళ్ళు, అలాగే మిగతా 80 మంది విశ్వాసులు, జంతువులు వారందరూ కూడా నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత, నీళ్లు ఇంకిపోయిన తర్వాత భూమి మీదికి వాళ్ళు ఓడపై నుంచి దిగి వచ్చేశారు.
నూహ్ (అలైహిస్సలాం) వారి వారసత్వం
ఇక్కడ చివరిగా మనము కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి, అదేమిటంటే వారు భూమి మీదికి వచ్చిన తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రణాళిక ప్రకారము వారికి ఎంత ఆయుష్షు ఉండిందో అన్ని రోజులు వారు అల్లాహ్ ను ఆరాధించుకుంటూ జీవించారు. అయితే నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానము మాత్రమే ముందుకు సాగింది. మిగతా వారి ఎవరి సంతానము కూడా ప్రపంచంలో ముందుకు సాగలేదు. వారి ఆయుష్షు పూర్తి అయ్యాక వారు మరణించారు అంతే, కానీ వారి సంతానం మాత్రం ముందుకు సాగలేదు. కేవలం నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానం మాత్రమే ముందుకు సాగింది అని ధార్మిక పండితులు తెలియజేశారు.
ముఖ్యంగా మనం చూచినట్లయితే నూహ్ అలైహిస్సలాం వారి ఒక కుమారుడు సామ్. సామ్ సంతానము తెల్ల రంగు కలవారు. వారు అరబ్బులు, ఇశ్రాయేలు వంశీయులు వీళ్ళందరూ సామ్ సంతానము ప్రపంచంలో వ్యాపించారు. అలాగే రెండవ కుమారుడు హామ్. ఇతని సంతానము నల్ల రంగు గలవారు. ఇథియోపియా, సూడాన్ మరియు ఇతర ఆఫ్రికా దేశాలలో వారి సంతానము వ్యాపించింది. మూడవ కుమారుడు యాఫిస్. ఇతని సంతానము ఎర్ర ఛాయ కలిగినవారు. టర్క్ వాసీయులు మరియు తూర్పు ఆసియా వాసులు వీరందరూ కూడా యాఫిస్ కుమారులు, యాఫిస్ సంతానము అని ధార్మిక పండితులు తెలియజేశారు.
ఆ ప్రకారంగా చూస్తే తూఫాను తర్వాత ఈ భూమండలం మీద నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానమే వ్యాపించింది కాబట్టి నూహ్ అలైహిస్సలాం వారిని ఆదమే సానీ, అబుల్ బషర్ సానీ అని బిరుదు ఇవ్వడం జరిగింది. అనగా మానవుల రెండవ పితామహుడు. అబుల్ బషర్ సానీ మానవుల రెండవ పితామహుడు అని నూహ్ అలైహిస్సలాం వారికి బిరుదు ఇవ్వడం జరిగింది.
అలాగే నూహ్ అలైహిస్సలాం చాలా కష్టపడి జాతి ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయనకు ఇచ్చిన ప్రవక్త పదవి బాధ్యతలను చాలా చక్కగా నెరవేర్చారు, కష్టపడ్డారు కాబట్టి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయన కీర్తి ప్రపంచంలో ఉంచాడు. ఖురాన్లో 37వ అధ్యాయం 78వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు, “వతరక్నా అలైహి ఫిల్ ఆఖరీన్” అనగా రాబోయే తరాల వారిలో అతని సత్కీర్తిని మేము మిగిల్చి ఉంచాము అన్నాడు. చూడండి, నేడు కూడా నూహ్ అలైహిస్సలాం వారిని, ఆయన జీవిత చరిత్రని మనము ఎంతో చర్చించుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం.
ఖురాన్లో ఒక ఐదు మంది ప్రవక్తల్ని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ అని ఒక ప్రత్యేకమైన గౌరవ స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ ఎవరు అంటే ధార్మిక పండితులు తెలియజేశారు, నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ విధంగా ఈ ఐదు మంది ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ అని కీర్తి పొందారు. అంటే ఆ ఐదు మందిలో నూహ్ అలైహిస్సలాం వారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన కీర్తి ప్రపంచంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఉంచి ఉన్నాడు.
అలాగే ఖురాన్ లో నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన తొమ్మిది సూరాలలో వచ్చి ఉంది. తొమ్మిది సూరాలలో ఒకటి సూర ఆరాఫ్, సూర యూనుస్, సూర హూద్, సూర అంబియా, సూర ము’మినూన్, సూర షుఅరా, సూర అంకబూత్, సూర సాఫ్ఫాత్, సూర కమర్. తొమ్మిది సూరాలలో నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన వచ్చి ఉంది. మరొక్క ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక పూర్తి అధ్యాయం, ఒక పూర్తి సూర, సూర నూహ్ అని 71వ అధ్యాయం, పూర్తి ఒక సూర అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఆయన పేరుతో అవతరింపజేసి ఉన్నాడు. ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం జీవించినంత కాలం భక్తులతో, విశ్వాసులతో విశ్వాసంగా, భక్తిగా జీవించారు, ఆ తర్వాత ఆయన మరణము సంభవించింది. ఇలా నూహ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ముగిసింది. ఆ తర్వాత జరిగిన విషయాలు ఇన్షా అల్లాహ్ రాబోయే ప్రసంగాలలో విందాం. చివరిగా నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరినీ ఏక దైవారాధన చేసుకుంటూ, షిర్క్ బహు దైవారాధన నుండి దూరంగా ఉంటూ అల్లాహ్ ని నమ్ముకొని, అల్లాహ్ నే ఆరాధించుకుంటూ, అల్లాహ్ నే వేడుకుంటూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
—
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
“తుదకు మా ఆదేశం వచ్చి, పొయ్యిపొంగినప్పుడు, “ఈ ఓడలోకి ప్రతి (జీవ)రాసి మంచి రెండేసి (ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువ) చొప్పున ఎక్కించుకో.నీ ఇంటివారలను కూడాతీసుకో. ఇంకా విశ్వాసులందరిని కూడా ఎక్కించుకో” అని మేము నూహ్ కు చెప్పాము.(ఖుర్ఆన్ 11 : 40).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో వక్త పవిత్ర ఖురాన్ యొక్క ఘనత, విశిష్టత మరియు ప్రాముఖ్యతను వివరించారు. ఖురాన్ అల్లాహ్ చేత పంపబడిన చివరి ఆకాశ గ్రంథమని, ఇది మానవాళికి రుజుమార్గం చూపే మార్గదర్శకమని తెలిపారు. పూర్వపు గ్రంథాలైన తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ కాలగర్భంలో కలిసిపోయినా లేదా మార్పులకు లోనైనా, ఖురాన్ మాత్రం అల్లాహ్ సంరక్షణలో సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. ఖురాన్ పఠనం ద్వారా కలిగే పుణ్యాలు, అది కఠినమైన హృదయాలను కూడా ఎలా మెత్తబరుస్తుందో ఉమర్ (రజిyయల్లాహు అన్హు), తుఫైల్ బిన్ అమర్ దౌసీ వంటి వారి జీవిత ఉదాహరణల ద్వారా వివరించారు. ఖురాన్ ను కంఠస్థం చేయడం (హిఫ్జ్) వల్ల కలిగే గొప్పతనం, ఇహపర లోకాలలో లభించే గౌరవం, మరియు ఇది ఆత్మకు, శరీరానికి ఔషధంగా ఎలా పనిచేస్తుందో తెలియజేశారు. చివరగా, ఖురాన్ ను చదవడం, అర్థం చేసుకోవడం మరియు ఆచరించడం ద్వారా ముస్లింలు పొందే సాఫల్యాన్ని గుర్తుచేశారు.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త పాలకుడు, పోషకుడైన అల్లాహ్ యే కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.
సోదర సోదరీమణులారా! మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
ఈనాటి ప్రసంగంలో మనం ఖురాన్ ఘనతల గురించి తెలుసుకోబోతున్నాం.
ఆకాశ గ్రంథం అంటే ఏమిటి?
ఖురాన్ చివరి ఆకాశ గ్రంథము, ఇది మనందరికీ తెలిసిన విషయము. అయితే ఆకాశ గ్రంథము అని దేనిని అంటారు అన్న విషయాన్ని తెలుసుకొని మనం మాటను ఇన్షా అల్లాహ్ ముందుకు కొనసాగిద్దాం.
ఆకాశ గ్రంథము అంటే, భూమండలం మీద మానవులు ఎప్పుడెప్పుడైతే దారి తప్పిపోయి మార్గభ్రష్టులు అయిపోయారో, అలా దారి తప్పిపోయిన మానవులను మళ్లీ రుజుమార్గం పైకి తీసుకొని రావడానికి సుబ్ హాన వ త’ఆలా మానవుల్లోనే కొంతమంది ప్రవక్తలను ఎన్నుకున్నాడు. ఆ ప్రవక్తల వద్దకు దైవదూత ద్వారా వాక్యాలు పంపించాడు. దైవదూత తీసుకొని వచ్చిన వాక్యాలు ప్రవక్త మానవులకు తెలియజేసి శిష్యుల ద్వారా రాయించారు, ఒకచోట భద్రపరిచారు. అలా భద్రపరచబడిన దైవ వాక్యాల సమూహాన్ని ఆకాశ గ్రంథము అంటారు, దైవ గ్రంథము అని అంటారు.
ఇలాంటి గ్రంథాల ప్రస్తావన మనకు ఖురాన్ లో అనేక చోట్ల అనేక గ్రంథాల ప్రస్తావన కనిపిస్తుంది. సుహుఫ్ ఇబ్రాహీమ్ అని, అలాగే తౌరాత్ అని, ఇంజీల్ అని, జబూర్ అని, ఖురాన్ అని ఇలా కొన్ని ఆకాశ గ్రంథాల దైవ గ్రంథాల ప్రస్తావన మనకు ఖురాన్ లో కనబడుతుంది.
సుహుఫ్ ఇబ్రాహీమ్, ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఇవ్వబడ్డాయి. తౌరాత్ గ్రంథము మూసా అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. జబూర్ గ్రంథము దావూద్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. ఇంజీల్ గ్రంథము ఈసా అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. ఖురాన్ గ్రంథము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వబడింది.
అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఖురాన్ కు పూర్వం వచ్చిన దైవ గ్రంథాలు, అది ఇంజీల్ కావచ్చు, జబూర్ కావచ్చు, తౌరాత్ కావచ్చు, సుహుఫ్ ఇబ్రాహీమ్ కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు, అవి ఏవీ కూడా నేడు ప్రపంచంలో అసలు రూపంలో భద్రంగా లేవు. కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి, మరికొన్ని మానవుల కల్పితాలకు గురి అయిపోయాయి. కానీ, ఖురాన్ లో మాత్రం అలా జరగలేదు. ఖురాన్ సురక్షితంగా ఉంది. ఇన్షా అల్లాహ్ ఈ ప్రసంగంలో ఖురాన్ ని సుబ్ హాన వ త’ఆలా ఎలా సురక్షితంగా ఉంచాడో వివరంగా నేను కొన్ని విషయాలు మీకు తెలుపుతాను.
మొత్తానికి ఆకాశ గ్రంథం అంటే ఏమిటో అన్నది మనం తెలుసుకున్నాం. ఖురాన్ చివరి ఆకాశ గ్రంథము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వబడింది. ఆయన ద్వారా మనందరి వరకు సుబ్ హాన వ త’ఆలా ఆ గ్రంథాన్ని, ఆ గ్రంథంలో ఉన్న వాక్యాలని చేరవేర్చాడు.
ఖురాన్ పఠనం యొక్క ఘనత
అయితే ఈ ఖురాన్ గ్రంథానికి అనేక ఘనతలు ఉన్నాయండి. మొదటి ఘనత ఏమిటంటే, ఈ ఖురాన్ లోని ప్రతి అక్షరానికి బదులుగా పారాయణము చేస్తున్న భక్తునికి పది పుణ్యాల చొప్పున ఇవ్వబడతాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిర్మిజీ గ్రంథంలోని ఉల్లేఖనంలో ఉదాహరించి మరి తెలియజేసి ఉన్నారు. ఒక వ్యక్తి ‘అలిఫ్ లామ్ మీమ్’ అని పఠిస్తే, అతనికి ‘అలిఫ్’ కి బదులుగా పది పుణ్యాలు, ‘లామ్’ కి బదులుగా పది పుణ్యాలు, ‘మీమ్’ కి బదులుగా పది పుణ్యాలు, మొత్తం ముప్పై పుణ్యాలు అతనికి దక్కుతాయి అని ప్రవక్త వారు ఉదాహరించి మరి తెలియజేశారు.
ఆ ప్రకారంగా ఒక భక్తుడు ఖురాన్ లోని ఒక సూరా ఒక అధ్యాయం పఠిస్తే ఎన్ని పుణ్యాలు పొందుతాడు? ఒక్క పేజీ చదివితే ఎన్ని పుణ్యాలు దక్కించుకుంటాడు? ఒక్క పారా చదివితే ఎన్ని పుణ్యాలు అతనికి దక్కుతాయి? పూర్తి ఖురాన్ పారాయణము పూర్తి చేస్తే, అతను ఎన్ని లక్షల కోట్ల పుణ్యాలు సంపాదించుకుంటాడో ఆలోచించండి మిత్రులారా! ఇంతటి పుణ్యాలు మనిషికి దక్కేలా చేస్తున్న గ్రంథం ఒక ఖురాన్ మాత్రమే. ఇతర గ్రంథాలకు ప్రతి అక్షరానికి బదులుగా పదేసి పుణ్యాలు దక్కుతాయి అన్న ఘనత, విశిష్టత లేదు. ఒక్క ఖురాన్ కు మాత్రమే ఉంది కాబట్టి, ఇది ఖురాన్ యొక్క ఘనత, ప్రత్యేకత మిత్రులారా.
ఖురాన్: మానవాళికి మార్గదర్శి
అలాగే ఖురాన్ మానవులకు రుజుమార్గం వైపుకు మార్గదర్శకత్వం చేస్తుంది. దీనికి ఆధారంగా మనం చూస్తే, ఖురాన్ గ్రంథము రెండవ అధ్యాయము, నూట ఎనభై ఐదవ వాక్యంలో సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు.
స్వయంగా అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఈ ఖురాన్ మానవులకు రుజుమార్గం వైపు దారి చూపిస్తుంది. ఏది సత్యం, ఏది అసత్యం అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖురాన్ లో స్పష్టం చేసేసి ఉన్నాడు అని అల్లాహ్ తెలియజేశాడు. కాబట్టి ఈ ఖురాన్ మానవులందరికీ రుజుమార్గం వైపు దారి చూపిస్తుంది, మార్గదర్శకత్వం చేస్తుంది. దీనికి ప్రవక్త వారి కాలం నాటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. నేటికీ కూడా అనేక ఉదాహరణలు మనము చూస్తూనే ఉన్నాం.
ప్రవక్త కాలంలోని ఉదాహరణలు – తుఫైల్ బిన్ అమర్ దౌసీ (రజియల్లాహు అన్హు )
ఇప్పుడు మనం ప్రవక్త వారి జీవిత కాలంలోని ఒక రెండు ఉదాహరణలు మనం తెలుసుకుంటున్నాం ఇన్షా అల్లాహ్.
మొదటి ఉదాహరణ తుఫైల్ బిన్ అమర్ దౌసీ రజియల్లాహు అన్హు వారిది. ఈయన దౌస్ తెగకు చెందిన వ్యక్తి, మక్కాకు ఒకసారి వచ్చారు. చదువుకున్న వ్యక్తి, జ్ఞానం ఉన్న వ్యక్తి. అయితే మక్కా పెద్దలు ఆ రోజుల్లో ప్రవక్త వారికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్న రోజులవి. మక్కా పెద్దలు ఈయన దగ్గరికి కూడా వెళ్లి, “ముహమ్మద్ వారి మాట వినకండి, ముహమ్మద్ వారి మాట వింటే మీరు దారి తప్పిపోతారు, భార్య బిడ్డలకు దూరమైపోతారు, తల్లిదండ్రులకు దూరమైపోతారు” అని రకరకాలుగా ఆయనకు చెప్పి భయపెట్టేశారు. ఆయన ఆ మాటలన్నీ నిజమేమో అని నమ్మేసి, ప్రవక్త వారి మాటలు వినకూడదు అని నిర్ణయించుకున్నారు. కానీ, అల్లాహ్ తలిచిందే జరుగుతుంది అన్నట్టుగా, ఒకరోజు కాబా పుణ్యక్షేత్రం వద్ద ఆయన ప్రదర్శనలు చేస్తూ ఉంటే, సమీపంలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్ పారాయణము చేస్తూ ఉన్నారు. ఆ శబ్దం ఆయన చెవిలో పడింది.
ఆ శబ్దాన్ని ఎప్పుడైతే ఆయన వినేశారో, ఆయన మనసులో ఒక ఆలోచన కలిగింది. “నేను చదువుకున్న వ్యక్తిని, ఏది మంచి ఏది చెడు అని నేను నిర్ణయించుకోగలను. అలాంటప్పుడు ముహమ్మద్ వారి మాట నేను వినడానికి ఎందుకు భయపడాలి? ఎందుకు దూరంగా ఉండాలి? ఆయన మాట విని చూస్తాను, మంచిదా కాదా అని నిర్ణయించుకుంటాను. అంతమాత్రాన నేను కంగారు పడటం ఎందుకు, దూరంగా ఉండే ప్రయత్నం చేయడం ఎందుకు?” అని ఆ శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో అక్కడికి వెళ్లారు. చూస్తే ప్రవక్త వారు ఉన్నారు.
ప్రవక్త వారి వద్దకు వెళ్లి, “ఏమండీ! మీరు ప్రజలకు ఏమి చెబుతున్నారు? మీరు చెబుతున్న ఏ మాటలను బట్టి ప్రజలు మీ గురించి ఈ విధంగా చెబుతున్నారు? ఆ మాటలు నాకు కూడా చెప్పండి” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనను కూర్చోబెట్టుకొని, అటు ఇటు ఏమీ మాట్లాడకుండా ఖురాన్ లోని దైవ వాక్యాలు పఠించి వినిపించారు. ఖురాన్ పారాయణము చేస్తూ ఉంటే, ఖురాన్ లోని దైవ వాక్యాలు ఆయన విన్న తర్వాత ఏమన్నారంటే: “నేను సాక్ష్యం ఇస్తున్నాను, మీరు చెబుతున్నది ఇది కవిత్వము కాదు, మీరు చెబుతున్నది ఇది మంత్రతంత్రము కాదు. నేను కవిత్వము విని ఉన్నాను, నేను మంత్రతంత్రాలు ఎలా ఉంటాయో తెలిసినవాడిని. కానీ మీరు పలుకుతున్నది మాత్రం అది కవిత్వము కాదు, మంత్రతంత్రము కాదు, ముమ్మాటికీ ఇది దేవుని వాక్యము” అని అప్పటికప్పుడే ఆయన కలిమా చదివి ఇస్లాం స్వీకరించారు, ముస్లిం అయిపోయారు అల్హందులిల్లాహ్.
చూసారా! ఖురాన్ ద్వారా దారి తప్పిపోయిన వాళ్లు మళ్లీ దారి పైకి వచ్చేస్తారు. ఈ ఖురాన్ రుజుమార్గం వైపుకి దారి చూపిస్తుంది.
ప్రవక్త కాలంలోని ఉదాహరణలు – జిమాద్ అజ్దీ (రజియల్లాహు అన్హు)
మరొక ఉదాహరణ విందాం. జిమాద్ అజ్దీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు. ఈయన అజ్ద్ తెగకు చెందిన వాళ్లు. ఈయన కూడా మక్కాకు వచ్చారు. కాకపోతే ప్రవక్త వారితో ఆయనకు పరిచయం ఉంది. మక్కా పెద్దలు ఈయన దగ్గరికి కూడా వెళ్లారు. ఈయన దగ్గరికి వెళ్లి ఏమన్నారంటే, “ఏమండీ! మీకు మంత్రించడం వచ్చు కాబట్టి, మీ మిత్రునికి పిచ్చి పట్టినట్లు ఉంది, ఏదేదో వాగుతూ ఉన్నాడు, కొంచెం మంత్రించి వైద్యము చేయొచ్చు కదా” అని చెప్పారు. ఆయన నిజమేమో అని నమ్మి, ప్రవక్త వారితో పరిచయం ఉండింది కాబట్టి చక్కగా ప్రవక్త వారి దగ్గరికి వెళ్లి, “ప్రజలు ఈ విధంగా మీ గురించి చెబుతున్నారు, అలాంటిది ఏమైనా మీకు సమస్య ఉంటే చెప్పండి, నేను మంత్రించి మీకు వైద్యం చేస్తాను” అన్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు కూడా కూర్చోబెట్టుకొని, నేను ఏమి చెబుతున్నానో నువ్వు విను అని సూరా ఇఖ్లాస్, సూరా ఫలఖ్, చిన్న చిన్న సూరాలు – ‘ఖుల్ హువల్లాహు అహద్’ అని ఒక సూరా ఉంది కదా, అలాగే ‘ఖుల్ అరూజు బి రబ్బిల్ ఫలఖ్’ అని సూరా ఉంది కదా – ఈ చిన్న చిన్న సూరాలు పఠించి వినిపించగానే, వెంటనే ఆయన కూడా ప్రవక్త వారి సమక్షంలో సాక్ష్యం పలికారు. “అయ్యా! మంత్రతంత్రాలు ఎలా ఉంటాయో నేను మంత్రాలు నేర్చుకొని ఉన్న వాడిని కాబట్టి, విని ఉన్న వాడిని కాబట్టి నాకు తెలుసు. మీరు చెబుతున్నది ఇది మంత్రతంత్రము ఎప్పటికీ కానే కాదు. అలాగే మీరు చెబుతున్నది ఇది కవిత్వము కూడా కాదు. ఇది స్పష్టమైన దేవుని వాక్యమే” అని ఆయన కూడా సాక్ష్యం ఇచ్చి, కలిమా చదివి, అప్పటికప్పుడే ఆయన కూడా ముస్లిం అయిపోయారు, ఇస్లాం స్వీకరించారు అల్లాహు అక్బర్.
రెండు ఉదాహరణలు ప్రవక్త వారి జీవిత కాలం నుండి నేను వినిపించానండి. నేటికీ కూడా అనేకమంది వివిధ భాషలలో అనువాదం చేయబడి ఉన్న దైవ గ్రంథం ఖురాన్ ని చదువుతూ ఉన్నారు. చదివి అల్హందులిల్లాహ్ రుజుమార్గాన్ని పొందుతూ ఉన్నారు. అల్హందులిల్లాహ్ ఇస్లాం స్వీకరించి ముస్లింలు అయిపోయాము, ఖురాన్ ను చదివి తెలుసుకున్నాము అని సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. అనేక ఉదాహరణలు మీరు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో చూడవచ్చు మిత్రులారా.
మొత్తానికి ఖురాన్ కి ఉన్న ఘనత ఏమిటంటే, ఖురాన్ ద్వారా ప్రజలు రుజుమార్గం పైకి వస్తారు.
ఖురాన్ సురక్షితమైన గ్రంథం
అలాగే ఖురాన్ ఎలాంటి తప్పులు లేని సురక్షితమైన గ్రంథము. ఖురాన్ గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:
ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ [జాలికల్ కితాబు లా రైబ ఫీహ్] “ఈ గ్రంథం (అల్లాహ్ గ్రంథం అన్న విషయం) లో ఎంతమాత్రం సందేహం లేదు.” (2:2)
అంటే ఇవి దైవ వాక్యాలు అన్న విషయంలో అనుమానానికి తావే లేదు అన్నారు. మరి అనుమానానికే తావు లేనప్పుడు తప్పులు దాంట్లో ఎక్కడి నుంచి వస్తాయి? అసలు తప్పులు లేని గ్రంథము ఈ ఖురాన్ గ్రంథం.
గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఖురాన్ లో తప్పులు ఉన్నాయి అని ప్రవక్త వారి కాలంలో కూడా ఎవరూ నిరూపించలేకపోయారు. ఆయన తర్వాత నుండి ఇప్పటివరకు కూడా ఎవరూ ఖురాన్ లో తప్పులు ఉన్నాయి అని నిరూపించలేకపోయారు. ఇన్షా అల్లాహ్ ప్రళయం వరకు కూడా ఇందులో తప్పులు ఉన్నాయి అని ఎవరూ నిరూపించలేరు.
కానీ ఆశ్చర్యకరమైన ఒక విషయం చెబుతాను. అదేమిటంటే, ఖురాన్ లో తప్పులు ఉన్నాయి అని ప్రపంచానికి నిరూపించడానికి కొంతమంది ముస్లిమేతరులు, పండితులు ఖురాన్ ని పఠించారు. తప్పులు వెతకడానికి పఠించారు. పఠిస్తూ ఉన్నారు, తప్పులు వెతుకుతూ ఉన్నారు, చదువుతూ పోతూ ఉన్నారు. చివరికి ప్రభావితులైపోయి సురక్షితమైన గ్రంథం ఖురాన్, దైవ వాక్యాలతో నిండిన గ్రంథం ఖురాన్, సత్యమైన దేవుని గ్రంథం ఖురాన్ అని వారు కూడా అల్హందులిల్లాహ్ కలిమా చదివి ఇస్లాం స్వీకరించేశారు. ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలామంది పండితులు తప్పులు వెతకడానికి మాత్రమే ఖురాన్ చదివారు. కానీ అల్హందులిల్లాహ్ దారి పైకి వచ్చేశారు, ఇస్లాం స్వీకరించేశారు. ఇది ఖురాన్ యొక్క ఘనత మిత్రులారా.
ఖురాన్ ద్వారా హృదయాల మార్పు
అలాగే ఖురాన్ ద్వారా హృదయాలు మెత్తబడతాయి. కొంతమంది యొక్క మనస్తత్వం మరియు వారి గుండె చాలా గట్టిది. కానీ ఖురాన్ చదివితే ప్రజల గుండెలు, ప్రజల హృదయాలు మెత్తబడతాయి. దీనికి ఉదాహరణగా మనం చూసినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలోని ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు వారు. గొప్ప బలవంతుడు, ధైర్యవంతుడు మరియు కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తి, గట్టి మనుస్కుడు.
ఒకరోజు అనుకోకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట దైవ వాక్యాలు వినేశారు. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పఠిస్తూ ఉన్నారు. అల్లాహ్ తెలియజేసిన సూరా హాక్కా లోని వాక్యాలు.
وَمَا هُوَ بِقَوْلِ شَاعِرٍ ۚ قَلِيلًا مَّا تُؤْمِنُونَ – وَلَا بِقَوْلِ كَاهِنٍ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ – تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ “ఏ కవి పుంగవుడో పలికిన మాట కానే కాదు. మీరు విశ్వసించేది చాలా తక్కువ.ఇది ఏ జ్యోతిష్యుని పలుకో అంతకన్నా కాదు. మీరు హితబోధను గ్రహించేది బహుస్వల్పం.నిజానికి సకల లోకాల ప్రభువు తరఫున అవతరించింది.” (69:41-43)
అవి విన్న తర్వాత కొంచెం ఇస్లాం వైపుకి, ప్రవక్త వారి వైపుకి మొగ్గు చూపించారు. కానీ మళ్లీ ఉదయాన్ని చూస్తే, మక్కా పెద్దలు రకరకాలుగా ప్రవక్త వారి గురించి చెబుతూ ఉంటే అయోమయంలో పడిపోయారు. మక్కా పెద్దలు చెబుతున్నది నమ్మాలా? లేదా ప్రవక్త ముహమ్మద్ వారు చెబుతున్నది నమ్మాలా? తేల్చుకోలేకపోతున్నారు, అయోమయమైన పరిస్థితిలో ఉన్నారు, చిరాకు వచ్చేసింది. దీనికి పరిష్కారం ఏమిటంటే ముహమ్మద్ వారిని చంపేస్తే సరిపోతుంది అని కత్తి పట్టుకొని బయలుదేరిపోయారు.
దారిలో నుఐమ్ అనే ఒక వ్యక్తి చూసుకున్నారు. చూసుకొని “ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు?” అని అడిగారు. “ముహమ్మద్ వారిని చంపడానికి” అని చెప్పేశారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, “అయ్యా, ముహమ్మద్ వారి విషయం తర్వాత, ముందు మీ చెల్లెలు ఫాతిమా, మీ బావ సయీద్, వాళ్లిద్దరూ కూడా ఇస్లాం స్వీకరించేశారు, నీకు తెలుసా?” అని చెప్పారు. ముందే కోపంలో ఉన్నారు. కుటుంబ సభ్యుల్లో చెల్లెలు, బావ ఇద్దరు కూడా ఆయనకు తెలియకుండానే ఇస్లాం స్వీకరించేశారు అన్న మాట వినగానే, కోపం రెట్టింపు అయిపోయింది. మరింత కోపంలో ఆయన అక్కడి నుంచి చక్కగా చెల్లెలి ఇంటికి వెళ్లిపోయారు.
ఆ సమయానికి ఖబ్బాబ్ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ఉమర్ వారి చెల్లెలకు, బావకు ఖురాన్ నేర్పిస్తూ ఉన్నారు. శబ్దం విని ఆయన, ఖబ్బాబ్ రజియల్లాహు అన్హు వారు వెళ్లి ఇంట్లో దాక్కున్నారు. చెల్లెలు బావ ఇద్దరూ కూడా ఆ ఖురాన్ పత్రాలు దాచిపెట్టేసి తర్వాత తలుపు తెరిచారు.
ఉమర్ రజియల్లాహు అన్హు వారు కోపంలో ఉన్నారు, ఆ పారాయణము చేసే శబ్దం కూడా వినేసి ఉన్నారు. “నేను శబ్దం విన్నాను, అలాగే మీ గురించి కూడా నేను తెలుసుకున్నాను. మీరు తాతముత్తాతల ధర్మాన్ని వదిలేశారంట, ముహమ్మద్ తీసుకొని వచ్చిన కొత్త ధర్మాన్ని మీరు అంగీకరించేశారంట. ఏదో మీరు చదువుతూ ఉన్నారు, నేను శబ్దం బయటి నుంచి విన్నాను” అని అలా ఎందుకు చేశారు అని కొట్టడం ప్రారంభించేశారు. బావను చితకబాదేశారు, చెల్లెలను చితకబాదేశారు. చివరికి చెల్లె తలకు గాయమయింది. ఆమె తిరగబడి ఉమర్ రజియల్లాహు అన్హు వారికి సమాధానం ఇస్తూ, “ఓ ఉమర్! నువ్వు వినింది నిజమే. మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటను విన్నాము, నమ్మాము, విశ్వసించాము. ఇక నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో. ఇక మేము మాత్రము ఆ మార్గాన్ని వదిలేది లేదు, ఆ ధర్మాన్ని వదిలేది లేదు” అని చెప్పేశారు.
చెల్లెలు తిరగబడి మాట్లాడుతూ ఉంటే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు కొంచెం వెనక్కి తగ్గి, ఆశ్చర్యపోయి, “ఏంటమ్మా! మీలో ఇంత మార్పు తీసుకొని వచ్చిన ఆ మాటలు ఏమిటి? నాకు కూడా వినిపించండి” అన్నారు. “చెల్లెలు ముందు మీరు వెళ్లి స్నానం చేసుకొని రండి” అంటే, వెళ్లి స్నానం చేసుకొని వచ్చారు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఖురాన్ పత్రాలలో సూరా తాహా కు చెందిన కొన్ని వాక్యాలు ఉన్నాయి, అవి ఆయన చేతికి ఇచ్చారు. ఆయన ఆ వాక్యాలు చదివారు. ఆ వాక్యాలు చదివి ఎంత ప్రభావితులైపోయారంటే, “ముహమ్మద్ వారు ఎక్కడున్నారో చెప్పండి, నేను కూడా వెళ్లి ఆయన మాటను అంగీకరించాలనుకుంటున్నాను” అని చెప్పారు.
ఆ మాట వినగానే అక్కడ దాక్కొని ఉన్న ఖబ్బాబ్ రజియల్లాహు అన్హు వారు బయటికి వచ్చి ఉమర్ రజియల్లాహు అన్హు వారికి శుభవార్త తెలియజేశారు. “ఓ ఉమర్! మీకు శుభవార్త ఏమిటంటే, కొద్ది రోజుల క్రితమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో దుఆ చేసి ఉన్నారు. ‘ఓ అల్లాహ్! ముస్లింలకు, ఇస్లాంకు ఉమర్ లేదా అబూ జహల్ వీరిద్దరిలో ఎవరికో ఒకరికి హిదాయత్ ప్రసాదించి బలం ఇవ్వు’ అని కోరి ఉన్నారు. అల్లాహ్ మీ అదృష్టంలో, మీ విధిరాతలో ఇస్లాం యొక్క భాగ్యం రాసాడని నాకు తెలుస్తూ ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దారే అరఖమ్ లో ఫలానా చోట సహాబాలతో సమావేశమై ఉన్నారు, మీరు అక్కడికి వెళ్లండి” అనగానే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు అక్కడికి వెళ్లారు.
అక్కడ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద శిక్షణ పొందుతూ ఉన్నారు, విద్య నేర్చుకుంటూ ఉన్నారు, ఇస్లామీయ విద్యలు నేర్చుకుంటూ ఉన్నారు. ఉమర్ వచ్చేసాడు అని తెలియగానే కంగారు పడిపోయారు. ఎందుకంటే ఆయన కోపిష్టుడు, ఇస్లాం స్వీకరించలేదు. ఏం ఉద్దేశంతో వచ్చారో, ఏం చేస్తారో ఏమో అని కంగారు పడిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, “ఆయన్ని నా దగ్గరికి రానియ్యండి” అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఆయన వెళ్లారు. వెళ్లిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో కలిమా చదివి ఇస్లాం స్వీకరించేశారు.
ఆయన కలిమా చదివి ఇస్లాం స్వీకరిస్తున్న దృశ్యాన్ని, అక్కడ కూర్చొని భయపడుతూ ఉన్న ఆ శిష్యులందరూ, సహాబాలు చూసి ఒక్కసారిగా ఎంత సంతోషపడిపోయారంటే, బిగ్గరగా “అల్లాహు అక్బర్” అని పలికారు. వారందరూ పలికిన ఆ శబ్దము మక్కా వీధుల వరకు కూడా వెళ్లింది.
అంటే అర్థం ఏమిటండీ? ఖురాన్ చదివి, అప్పటికే చంపాలి అనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి ఎంత మారుమనసు పొందారంటే, ఆయన హృదయం ఎంతగా మెత్తబడిపోయింది అంటే, వచ్చి ప్రవక్త వారి శిష్యుడిగా మారిపోయారు. ప్రవక్త వారిని హతమార్చడానికి వచ్చిన వ్యక్తి, దారిలో ఖురాన్ వాక్యాలు చదివారు, ప్రవక్త వారి వద్దకు వచ్చి శిష్యుడిగా మారిపోయారు. చూసారా! కాబట్టి ఖురాన్ పారాయణము ద్వారా హృదయాలు మెత్తబడతాయి అనటానికి ఇది గొప్ప ఉదాహరణ మిత్రులారా.
ఖురాన్ సంరక్షణ
అలాగే ఖురాన్ కి చాలా ఘనతలు ఉన్నాయండి. చాలా విషయాలు ఇంకా తెలుసుకోవలసి ఉంది కాబట్టి, క్లుప్తంగా ఇన్షా అల్లాహ్ మీ ముందర ఉంచే ప్రయత్నం చేస్తాను. ఖురాన్ సురక్షితమైన గ్రంథం. ఇంతవరకే మనం విని ఉన్నాం, ఇతర గ్రంథాలన్నీ కూడా కల్పితాలకు గురైపోయాయి, లేదా కాలగర్భంలో కలిసిపోయాయి అని. కానీ ఖురాన్ అలా కాదు. ఖురాన్ గ్రంథం సురక్షితంగా ఉంది. ఖురాన్ గ్రంథంలోని పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:
إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ [ఇన్నా నహ్ను నజ్జల్ నజ్జిక్ర వ ఇన్నా లహూ లహాఫిజూన్] “మేమే ఈ ఖుర్ఆన్ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము.” (15:9)
మేమే ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాము మరియు మేమే దీనిని సురక్షితంగా ఉంచుతూ ఉన్నాము అన్నారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖురాన్ గ్రంథాన్ని ఎలా సురక్షితంగా ఉంచుతూ వస్తూ ఉన్నాడు అన్నది రెండు ఉదాహరణలు మీ ముందర ఉంచుతున్నాను చూడండి ఇన్షా అల్లాహ్.
ప్రపంచవ్యాప్తంగా ఒకే ఖురాన్
మొదటి ఉదాహరణ ఏమిటంటే, మీరు ఇండియాలో ఖురాన్ చూడండి, అరేబియా దేశాలలోని ఖురాన్ చూడండి, యూరప్ దేశాలలో ఖురాన్ చూడండి, ఇతర ఖండాలలో, ప్రపంచంలో ఏ మూలన ఏ దేశంలో ఖురాన్ ఉన్నా మీరు చూడండి, ప్రతి చోట మీకు ఒకే రకమైన ఖురాన్ కనిపిస్తుంది.
ఒక దేశంలో వంద సూరాల ఖురాన్, మరొక దేశంలో యాభై సూరాల ఖురాన్, మరొక దేశంలో నూట పద్నాలుగు సూరాల ఖురాన్ – కనిపించదు. పూర్తి ప్రపంచంలో నూట పద్నాలుగు సూరాలు, నూట పద్నాలుగు అధ్యాయాలు కలిగిన ఖురాన్ మాత్రమే మీకు కనిపిస్తుంది. అదే మీరు వేరే గ్రంథాలని చూడండి. వేరే గ్రంథాలు మీరు చూస్తే, ఒక దేశంలో కొన్ని పుస్తకాలతో నిండిన గ్రంథము కనిపిస్తే, మరొక దేశంలో అంతకు మించిన పుస్తకాలతో నిండిన గ్రంథము కనిపిస్తుంది. ఒకచోట ఎక్కువ పుస్తకాలు ఉన్న గ్రంథము, మరొక చోట తక్కువ పుస్తకాలు ఉన్న గ్రంథము. వీళ్లేమంటారంటే అందులో ఎక్కువైపోయింది అంటారు. వాళ్లేమంటారంటే అందులో కొన్ని తీసేశారు అంటారు. మొత్తానికి తీయటమో లేదా జొప్పించటమో జరిగింది స్పష్టంగా.
కానీ ఖురాన్ లో అలా జరగలేదు. పూర్తి ప్రపంచంలో అల్హందులిల్లాహ్ ఒకే రకమైన ఖురాన్ కనిపిస్తుంది. ఇది ఖురాన్ సురక్షితంగా ఉంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ.
ఖురాన్ కంఠస్థం (హిఫ్జ్)
మరొక ఉదాహరణ, అదేంటంటే: నేడు భూమండలం మీద మస్జిద్ లలో గాని, మదరసాలలో గాని, లైబ్రరీలలో గాని, ఇంకా ఎక్కడైనా గాని ఖురాన్ ఉంది అంటే, ఆ ఖురాన్ గ్రంథాలన్నీ తీసుకొని వెళ్లి ఒక సముద్రంలో పడవేసేస్తే, ఖురాన్ గ్రంథము ప్రపంచంలో నుంచి తొలగిపోదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే కాగితాలలోనే ఈ ఖురాన్ భద్రంగా లేదు, మానవుల గుండెల్లో కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గ్రంథాన్ని భద్రంగా ఉంచి ఉన్నాడు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఏడు సంవత్సరాల కుర్రాడు, తొమ్మిది సంవత్సరాల అమ్మాయి, పూర్తి ఖురాన్ గ్రంథం “అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్” నుంచి మొదలెట్టి “ఖుల్ అరూజు బి రబ్బిన్ నాస్” అనే సూరా వరకు పూర్తి ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసేసి ఉన్నారు. ఇలా ఖురాన్ కంఠస్థం చేసిన వాళ్లను ‘హుఫ్ఫాజ్‘ అని అంటారు. ఇలాంటి హుఫ్ఫాజ్ లు ప్రతి దేశంలో అల్హందులిల్లాహ్ వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో ఉన్నారు పూర్తి ప్రపంచంలో అల్హందులిల్లాహ్.
పూర్తి కాగితాలలో ఉన్న ఖురాన్ గ్రంథాలన్నీ తీసుకొని పోయి సముద్రంలో పడవేసినా, ఈ ఖురాన్ ని కంఠస్థం చేసిన ఈ హుఫ్ఫాజ్ లు ప్రతి దేశంలో ఉన్నారు, వాళ్లు మళ్లీ మరుసటి రోజే ఖురాన్ ని మళ్లీ రాయగలరు, ముద్రించగలరు, సిద్ధం చేసుకోగలరు. కాబట్టి ఖురాన్ ప్రపంచంలో నుంచి తొలగిపోదు, అది కాగితాలలోనే కాదు, హృదయాలలో కూడా భద్రంగా ఉంది. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ ఖురాన్ ని సురక్షితంగా ఉంచుతూ వస్తూ ఉన్నాడు.
ఒక ప్రశ్న, అదేమిటంటే: ఖురాన్ గురించి ఇంత గొప్పగా చెప్పాను కదా, ఒక్కసారి ఆలోచించి చూడండి. ఖురాన్ కాకుండా వేరే గ్రంథాలు ఇవి కూడా దేవుని గ్రంథమే అని పలుకుతున్నారు కదా, అందులోని సగం గ్రంథం ప్రపంచం లోనుంచి తీసుకొని వెళ్లి సముద్రంలో పడవేస్తే, ఆ సగం గ్రంథాన్ని కంఠస్థం చేసిన వాళ్లు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారా? లేదా పావు గ్రంథాన్ని కూడా చూడకుండా కంఠస్థం చేసిన వాళ్లు ప్రపంచంలో ఉన్నారా? అంటే లేరు అనే సమాధానం వస్తుంది. కాబట్టి ఖురాన్ ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎంత భద్రంగా ఏ విధంగా ఉంచాడో చూడండి, ఇది ఖురాన్ యొక్క ఘనత మరియు ప్రత్యేకత.
ఇహపర లోకాలలో గౌరవం
అలాగే ఖురాన్ ద్వారా ప్రపంచంలో కూడా గౌరవం, పరలోకంలో కూడా గౌరవం దక్కించుకుంటాడు భక్తుడు, విశ్వాసుడు. ఎలాగంటే చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క విధానాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
إِنَّ اللَّهَ يَرْفَعُ بِهَذَا الْكِتَابِ أَقْوَامًا [ఇన్నల్లాహ యర్ ఫఉ బిహాజల్ కితాబి అఖ్వామన్] “నిశ్చయంగా అల్లాహ్ ఈ గ్రంథం ద్వారా ఎన్నో జాతులకు (లేదా సముదాయాలకు) సాఫల్యం ప్రసాదిస్తాడు (గౌరవం ప్రసాదిస్తాడు).”
మరొక ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేశారు:
خَيْرُكُمْ مَنْ تَعَلَّمَ الْقُرْآنَ وَعَلَّمَهُ [ఖైరుకుమ్ మన్ తఅల్లమల్ ఖుర్ఆన వ అల్లమహు] “మీలో ఎవరైతే ఖురాన్ ను నేర్చుకుంటారో మరియు ఇతరులకు నేర్పిస్తారో, వారు సమాజంలోని ఉత్తమమైన వాళ్లు” అని చెప్పేశారు.
ఉత్తమమైన వారు అన్న యొక్క ఘనత, గౌరవం వారికి ప్రపంచంలో దక్కింది. దీనికి ప్రాక్టికల్ గా ఒక మాట చెబుతాను చూడండి. మనం ప్రతిరోజు మస్జిద్ కి వెళ్తాం. నమాజు ఐదు పూటలా ఆచరిస్తాం. ఇమాం గారు ఫర్జ్ నమాజు ఆచరిస్తున్నప్పుడు ఒక్క విషయాన్ని గమనించండి. వెనకాల నిలబడిన వాళ్లలో ఇంజనీర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, టీచర్లు ఉంటారు, ప్రిన్సిపల్ లు ఉంటారు, పండితులు ఉంటారు, కోటీశ్వరులు ఉంటారు, ఇంకా ఏదేదో నేర్చుకొని ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు. కానీ వాళ్లందరూ వెనుక ఉంటే, వారి ముందర ఒక వ్యక్తి ఇమాం గా నిలబడి అందరికీ నమాజు చేయిస్తారు. ఆయన దగ్గర ఇంజనీరింగ్ పట్టా ఉండదు, అలాగే డాక్టర్ పట్టా ఉండదు, ఆయన గొప్ప కోటీశ్వరుడు కూడా కాడు. కానీ అందరి ముందర నిలబడి అందరికీ నమాజు చేయించే గౌరవం ఆయనకు దక్కుతా ఉంది అంటే ఆయన దగ్గర ఏముందో తెలుసా? ఆయన హృదయంలో ఖురాన్ వాక్యాలు ఉన్నాయి. ఖురాన్ వాక్యాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో ఆయనకు ఆ గౌరవం ఇచ్చాడు. ఆయన గురువుగా అందరికీ నమాజు చేయిస్తారు, అందరూ ఆయనను గౌరవిస్తూ ఆయన వెనకాల నమాజు చేసుకొని వస్తారు. అల్హందులిల్లాహ్, ప్రపంచంలో ఇది అల్లాహ్ ఇచ్చిన గౌరవం.
పరలోకంలో కూడా గౌరవం దక్కుతుంది. అదేంటో కూడా ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు: ఎప్పుడైతే లెక్కంపు రోజు వస్తుందో, ఆ లెక్కంపు రోజున ఖురాన్ గ్రంథము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో సిఫారసు చేస్తుంది. “ఓ అల్లాహ్! ఫలానా భక్తుడు ప్రపంచంలో ఖురాన్ గ్రంథాన్ని నేర్చుకున్నాడు, పఠించాడు, అందులో ఉన్న విషయాల ప్రకారం అమలు పరిచాడు కాబట్టి ప్రజలందరి ముందర ఆయనకు గౌరవం వచ్చేలాగా చేయండి”.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలందరి ముందర ఆయనకు గౌరవం వచ్చేలాగా గౌరవ కిరీటము ధరింపజేస్తాడు. అల్లాహు అక్బర్! ఒక రాజు పిలిచి ఒక వ్యక్తికి అవార్డు ఇచ్చేస్తే దాన్ని ఎంత గౌరవంగా భావిస్తాడు మనిషి? పేపర్లలో, న్యూస్ ఛానల్ లలో ప్రతి చోట అదే సంచలనమైన వార్తగా మారిపోతుంది. ఆయన ఫలానా అవార్డు దక్కించుకున్నాడు, ఫలానా ప్రధాని చేతి మీద లేదా రాజు చేతి మీద ఆ అవార్డు ఆయన తీసుకున్నాడు చూడండి, చూడండి అని ప్రతి వీడియోలో ఆయనదే వీడియో, ప్రతి పేపర్లలో ఆయనదే ఫోటో కనిపిస్తుంది. కానీ పూర్తి ప్రపంచానికి రారాజు, విశ్వానికి మొత్తానికి రారాజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఆ రోజు మానవులందరి ముందర ఆ భక్తుని తల మీద కిరీటం ధరింపజేస్తాడు.
అంతేకాదండి, మళ్లీ ఖురాన్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో అంటుంది: “ఓ అల్లాహ్! మరింత గౌరవం వచ్చేలాగా ఆయనకి గౌరవించండి” అంటే, అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఖరీదైన బట్టలు ధరింపజేస్తాడు.
అంతేకాదండి, మళ్లీ ఖురాన్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో అడుగుతుంది: “ఓ అల్లాహ్! ఇతని తల్లిదండ్రులకు కూడా గౌరవం వచ్చేలాగా చేయండి” అంటే, అప్పుడు ఆ భక్తుని యొక్క తల్లిదండ్రులకు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులందరి ముందర కిరీటము ధరింపజేస్తాడు. అల్లాహు అక్బర్! ఏ తల్లిదండ్రులైతే వారి బిడ్డలకు ప్రపంచంలో ఖురాన్ నేర్పిస్తారో, ఖురాన్ ప్రకారంగా జీవించుకోవడానికి మార్గదర్శకత్వం చేస్తారో, అలాంటి తల్లిదండ్రులు కూడా పరలోకంలో లెక్కంపు రోజున గౌరవం పొందుతారు మిత్రులారా.
ఒక్కసారి ఆలోచించండి. ఒక్క ఖురాన్ ద్వారా ప్రపంచంలో కూడా గౌరవము ఉంది, పరలోకంలో కూడా గౌరవము ఉంది. ఖురాన్ ను కాకుండా వేరే గ్రంథాల వలన ఇలాంటి గౌరవం కలుగుతుంది అన్న విశిష్టత ఉందా? లేదు. ఒక ఖురాన్ కు మాత్రమే ఉంది, ఇది ఖురాన్ యొక్క ఘనత మిత్రులారా.
అంతేకాదండి, ఖురాన్ కి ఉన్న మరో ఘనత ఏమిటంటే, ఖురాన్ ద్వారా మానవుడు స్వర్గంలోని ఉన్నతమైన స్థానాలకు చేరుకుంటాడు. ఎలాగా? ఎలాగంటే తిర్మిజీ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు: స్వర్గవాసులు స్వర్గానికి చేరినప్పుడు, ఖురాన్ గ్రంథాన్ని నేర్చుకొని, కంఠస్థం చేసి, పఠించి, దాని ప్రకారంగా అమలు పరిచిన భక్తులతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంటాడు: “ఓ భక్తుడా! ఎలాగైతే నీవు ప్రపంచంలో ప్రశాంతంగా ఖురాన్ పారాయణము చేసేవాడివో, ఈరోజు స్వర్గంలో కూడా ఖురాన్ పారాయణము చేస్తూ పో మరియు స్వర్గం యొక్క స్థానాలు ఎక్కుతా పో” అని చెప్పేస్తాడు. అతను ఖురాన్ పారాయణము మొదలెట్టి, స్వర్గపు యొక్క స్థాయులు ఎక్కుతా పోతాడు. ఎక్కడైతే ఆయన ఖురాన్ పారాయణము పూర్తి అయిపోతుందో, అప్పటివరకు ఎంత పైకి వెళ్ళిపోతాడో, అంత పైకి వెళ్లిపోయి అక్కడ స్థిరపడిపోతాడు. అల్లాహు అక్బర్! ఇది ఖురాన్ యొక్క ఘనత మిత్రులారా.
అంతే కాదండి, ఖుర్ఆను ద్వారా సమాధి శిక్షల నుండి రక్షణ లభిస్తుంది అని కూడా తెలియజేయడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే ప్రపంచంలో ఖుర్ఆన్ పారాయణం చేస్తారో, ముఖ్యంగా ప్రతిరోజు పడుకునే ముందు సూరా ముల్క్ 67వ అధ్యాయాన్ని పఠిస్తారో అలాంటి భక్తులకు సమాధి శిక్షల నుండి రక్షణ లభిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
చూశారా? ప్రపంచంలో గౌరవం, సమాధి శిక్షల నుండి రక్షణ, మరియు పరలోకంలో గౌరవం, స్వర్గంలోని ఉన్నత స్థానాలు, ఎన్ని ఘనతలు దక్కుతున్నాయో చూడండి మిత్రులారా ఈ ఖుర్ఆన్ ద్వారా. మరి,
ఖుర్ఆన్ – స్వస్థత మరియు కారుణ్యం
ఖుర్ఆను ద్వారా మనుషులు స్వస్థత కూడా పొందగలరు. పదిహేడవ అధ్యాయం 82వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
وَنُنَزِّلُ مِنَ الْقُرْآنِ مَا هُوَ شِفَاءٌ وَرَحْمَةٌ لِلْمُؤْمِنِينَ “మేము అవతరింపజేసే ఈ ఖుర్ఆన్ విశ్వాసుల కొరకు ఆసాంతం స్వస్థత, కారుణ్య ప్రదాయిని.” (17:82)
అంటే, ఇది స్వస్థత ఇస్తుంది అని అన్నారు. మనిషికి శారీరక వ్యాధులు ఉంటాయి, మానసిక వ్యాధులు కూడా ఉంటాయి. హృదయాలలో మనిషికి అసూయ, అహంకారం, ఇలాంటి కుళ్ళు బుద్దులు, కొన్ని దురలక్షణాలు ఉంటాయి, అవి హృదయాలలో ఉంటాయి. ఖుర్ఆన్ పఠిస్తే, ఖుర్ఆన్ ప్రకారంగా నడుచుకుంటే ఆ రోగాలన్నీ దూరమైపోతాయి, మనిషి స్వస్థత పొందుతాడు, మంచి స్వభావము కలిగిన వ్యక్తిగా మారిపోతాడు. అలాగే శారీరక వ్యాధులకు కూడా ఖుర్ఆన్ పారాయణము ద్వారా స్వస్థత లభిస్తుంది అని తెలియజేయడం జరిగి ఉంది.
ఖుర్ఆన్ – సమగ్ర గ్రంథం
అంతే కాదండి, మనిషికి మేలు చేసే అన్ని విషయాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ లో తెలియజేసి ఉన్నాడు. కాకపోతే దాని బాగా లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ఖుర్ఆన్ చదివి చూడండి. ప్రపంచం ఎలా మొదలైందో కూడా తెలియజేయడం జరిగింది. ప్రపంచం మొదలైన తర్వాత నేటి వరకు ఏ విధంగా నడుచుకుంటూ వస్తూ ఉంది అనేది కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ప్రళయం వరకు ఏమేమి సంభవిస్తాయో అది కూడా చెప్పడం జరిగింది. ప్రళయం తర్వాత మరణానంతరం ఏమేమి జరుగుతుందో అవి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనిషికి అవసరమైన అన్ని విషయాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇందులో తెలియజేశేశాడు. ఇప్పుడు ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఏమంటారంటే, ఏమండీ, సైన్స్ గురించి కూడా ఉందా ఖుర్ఆన్ లో అంటారు. సైన్స్ గురించి కూడా ఉంది. ఖుర్ఆన్ మరియు సైన్స్ అనే ఒక పుస్తకం ఉంది, అది చదవండి ఇన్ షా అల్లాహ్ తెలుస్తుంది. మరిన్ని విషయాలు కూడా ఉన్నాయి. అవి పరిశీలించి ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది మిత్రులారా.
ఇక చివరిగా మనం చూసినట్లయితే, ఖుర్ఆన్ లాంటి మరొక గ్రంథము ఎవ్వరూ సృష్టించలేరు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పదిహేడవ అధ్యాయము 88వ వాక్యంలో తెలియజేశాడు, మానవులందరూ కలిసిపోయినా, మానవులతో పాటు జిన్నాతులు, షైతానులు కూడా కలిసిపోయినా, అందరూ కలిసి ప్రయత్నించినా ఖుర్ఆన్ లాంటి మరొక గ్రంథము తయారు చేయలేరు.
అలాగే, ఖుర్ఆన్ సులభమైన గ్రంథము. యాభై నాలుగవ అధ్యాయము 22వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు, వలఖద్ యస్సర్నల్ ఖుర్ఆన. మేము ఖుర్ఆన్ గ్రంథాన్ని సులభతరం చేసేశాము అని అన్నారు. కాబట్టి ఖుర్ఆను గ్రంథాన్ని పిల్లలు కూడా నేర్చుకోవచ్చు, పెద్దలు కూడా నేర్చుకోవచ్చు, పురుషులు, మహిళలు, అందరూ కూడా ఖుర్ఆను గ్రంథాన్ని నేర్చుకోవచ్చు, చదవవచ్చు, కంఠస్థం చేయవచ్చు, అర్థం చేసుకోవచ్చు, అల్ హందులిల్లాహ్.
మిత్రులారా, నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను, ఇలాంటి మహిమలు, ఘనతలు, ప్రత్యేకతలు కలిగిన ఖుర్ఆను గ్రంథాన్ని చదువుకొని, కంఠస్థం చేసుకొని, అర్థం చేసుకొని, దాని ప్రకారంగా నడుచుకునే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఖుర్ఆను ద్వారా ప్రపంచంలోనూ, పరలోకంలోనూ గౌరవమైన స్థానాల వద్దకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ చేర్చుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, “తబర్రుక్ వాస్తవికత” (శుభాన్ని ఆశించడం యొక్క వాస్తవికత) అనే అంశంపై చర్చించబడింది. వక్త తబర్రుక్ను రెండు రకాలుగా విభజించారు: ధర్మసమ్మతమైనది (మష్రూ) మరియు నిషిద్ధమైనది (మమ్నూ). ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ద్వారా ధృవీకరించబడిన తబర్రుక్ మాత్రమే ధర్మసమ్మతమైనదని, ఉదాహరణకు మూడు మస్జిద్లకు (మస్జిద్-ఎ-హరామ్, మస్జిద్-ఎ-నబవి, మస్జిద్-ఎ-అఖ్సా) ప్రయాణించడం, జమ్ జమ్ నీరు త్రాగడం, మరియు ఖురాన్ను పఠించి, అర్థం చేసుకుని, ఆచరించడం ద్వారా శుభం పొందడం వంటివి వివరించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వ్యక్తిత్వం, ఆయన వస్తువులు, మరియు ఆయన శరీరం నుండి వేరైన భాగాల (వెంట్రుకలు) ద్వారా శుభం పొందడం కేవలం ఆయనకు మాత్రమే ప్రత్యేకం అని, సహాబాలు ఇతరులతో ఇలా చేయలేదని స్పష్టం చేశారు. ఖురాన్ మరియు సున్నత్లలో ఆధారం లేని ఏ వస్తువు, ప్రదేశం, లేదా వ్యక్తి ద్వారా శుభాన్ని ఆశించడం నిషిద్ధమైన తబర్రుక్ అని, ఇది షిర్క్కు దారితీస్తుందని హెచ్చరించారు. దర్గాలు లేదా ఇతర సమాధుల వద్దకు శుభం కోసం ప్రయాణించడం హరామ్ అని హదీసుల ఆధారంగా వివరించారు.
الْحَمْدُ لِلَّهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنُؤْمِنُ بِهِ وَنَتَوَكَّلُ عَلَيْهِ، (అల్ హందులిల్లాహి నహ్మదుహూ వ నస్త ఈనుహూ వ నస్తగ్ ఫిరుహూ వ ను’మిను బిహీ వ నతవక్కలు అలైహ్.) సర్వ స్తోత్రాలు అల్లాహ్ కొరకే. మేము ఆయనను స్తుతిస్తున్నాము, ఆయన సహాయాన్ని కోరుతున్నాము, ఆయన క్షమాపణను వేడుకుంటున్నాము, ఆయనను విశ్వసిస్తున్నాము మరియు ఆయనపైనే నమ్మకం ఉంచుతున్నాము.
وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، (వ న ఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ ఫుసినా వ మిన్ సయ్యిఆతి అ’అమాలినా) మేము మా ఆత్మల చెడు నుండి మరియు మా కర్మల చెడు నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము.
مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ، (మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహూ, వ మన్ యుద్ లిల్హు ఫలా హాదియ లహ్.) అల్లాహ్ ఎవరికి మార్గనిర్దేశం చేస్తాడో, వారిని ఎవరూ మార్గభ్రష్టులుగా చేయలేరు. మరియు ఆయన ఎవరిని మార్గభ్రష్టులుగా వదిలేస్తాడో, వారికి ఎవరూ మార్గనిర్దేశం చేయలేరు.
وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، (వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహ్.) అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు.
وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، (వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహ్.) మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.
أَرْسَلَهُ بِالْحَقِّ بَشِيرًا وَنَذِيرًا، وَدَاعِيًا إِلَى اللَّهِ بِإِذْنِهِ وَسِرَاجًا مُنِيرًا. (అర్సలహూ బిల్ హఖ్ఖి బషీరవ్ వ నజీరా. వ దాఇయన్ ఇలల్లాహి బి ఇజ్నిహీ వ సిరాజమ్ మునీరా.) ఆయన (అల్లాహ్) అతన్ని (ముహమ్మద్ను) సత్యంతో శుభవార్తలు అందించేవాడిగా, హెచ్చరించేవాడిగా, తన అనుమతితో అల్లాహ్ వైపుకు ఆహ్వానించేవాడిగా మరియు ప్రకాశవంతమైన దీపంగా పంపాడు.
أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ (అమ్మా బ’అద్ ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్) నిశ్చయంగా, అన్ని మాటలలోకెల్లా ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం (ఖురాన్).
وَخَيْرُ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صلى الله عليه وسلم (వ ఖైరల్ హద్ యి హద్ యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు అన్ని మార్గాలలోకెల్లా ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గం.
وَشَرُّ الأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلُّ مُحْدَثَةٍ بِدْعَةٌ (వ షర్రల్ ఉమూరి ముహ్ దసాతుహా, వ కుల్లు ముహ్ దసతిన్ బిద్ అహ్) మరియు అన్ని కార్యాలలోకెల్లా చెడ్డ కార్యం (ధర్మంలో) కొత్తగా కల్పించబడినది, మరియు ప్రతి కొత్త కల్పన ఒక బిద్అత్ (ఆవిష్కరణ).
وَكُلُّ بِدْعَةٍ ضَلاَلَةٌ وَكُلُّ ضَلاَلَةٍ فِي النَّارِ (వ కుల్లు బిద్ అతిన్ దలాలహ్, వ కుల్లు దలాలతిన్ ఫిన్నార్) మరియు ప్రతి బిద్అత్ ఒక మార్గభ్రష్టత్వం, మరియు ప్రతి మార్గభ్రష్టత్వం నరకానికి దారి తీస్తుంది.
సర్వ స్తోత్రాలు, అన్ని విధముల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. కారుణ్య శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.
అభిమాన సోదరులారా, నాటి ఈ జుమా ప్రసంగాంశం, తబర్రుక్ వాస్తవికత. తబర్రుక్ అనే విషయంలో మన సమాజంలో అనేక విధాల అపార్థాలు, ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల ఆధారంగా కాకుండా బిద్అతులు చోటు చేసుకున్నాయి. ఇన్షా అల్లాహ్ ఈరోజు తబర్రుక్ వాస్తవికత ఏమిటో తెలుసుకుందాం.
తబర్రుక్ అర్థం మరియు రకాలు
తబర్రుక్ అంటే బరకత్ నుంచి. బరకత్ పొందటం, శుభాలను పొందడం, శుభాలను ఆశించడం, శుభాలు కలగడం అనే అర్థాలు వస్తాయి తబర్రుక్ అంటే. అత్తబర్రుక్ బిష్షై అంటే ప్రత్యేకమైన ఓ వస్తువు ద్వారా శుభాన్ని కోరటం.
ఈ తబర్రుక్ రెండు రకాలు. మష్రూ తబర్రుక్ (ధర్మ సమ్మతమైన తబర్రుక్). రెండవది మమ్నూ తబర్రుక్ (నిషిద్ధమైన తబర్రుక్).
ధర్మసమ్మతమైన తబర్రుక్ (మష్రూ తబర్రుక్ )
ధర్మ సమ్మతమైన తబర్రుక్ అంటే, ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల ద్వారా రూఢి అయిన తబర్రుక్. ఉదాహరణకు, శుభం కొరకు, మేలు కొరకు, శుభం పొందటానికి మస్జిద్-ఎ-హరామ్ వైపుకు పయనించటం, ప్రయాణించటం. అది హదీసులో ఉంది. అలాగే మస్జిద్-ఎ-నబవి ప్రయాణించటం, అలాగే మస్జిద్-ఎ-అఖ్సా వైపు పోవటం. అంటే ఈ మూడు మస్జిదుల గురించి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, శుభం కొరకు, మేలు కొరకు, పుణ్యం కొరకు ఈ మూడు మస్జిదుల వైపుకు ప్రయాణం చేయవచ్చు. ఇది ధర్మ సమ్మతమైన తబర్రుక్ పొందటం.
అలాగే జమ్ జమ్ నీరు, దాని గురించి స్పష్టమైన హదీసులు ఉన్నాయి, దాని యొక్క శుభం గురించి.
అలాగే ఖురాన్. స్వయంగా ఖురాన్ గ్రంథం తబర్రుక్తో నిండి ఉన్నది. స్వయంగా ఖురాన్ గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర అన్ఆమ్ ఆయత్ నంబర్ 155లో ఇలా తెలియజేశాడు:
وَهَـٰذَا كِتَابٌ أَنزَلْنَاهُ مُبَارَكٌ فَاتَّبِعُوهُ وَاتَّقُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ మరియు ఈ ఖురాన్ మేము అవతరింపజేసిన ఒక శుభప్రదమైన గ్రంథం. కాబట్టి మీరు దీనిని అనుసరించండి, భయభక్తులతో మెలగండి. తద్వారా మీరు కరుణించబడే అవకాశం ఉంది.
అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖురాన్ గురించి సూర సాద్, ఆయత్ 29లో ఇలా తెలియజేశాడు:
كِتَابٌ أَنزَلْنَاهُ إِلَيْكَ مُبَارَكٌ لِّيَدَّبَّرُوا آيَاتِهِ وَلِيَتَذَكَّرَ أُولُو الْأَلْبَابِ ఇదొక శుభప్రదమైన గ్రంథం. బరకత్తో కూడిన గ్రంథం, తబర్రుక్తో నిండియున్న గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటందుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చుకునేందుకు దీనిని నీ వైపుకు పంపాము అని అల్లాహ్ సెలవిచ్చాడు.
ఇక ఖురాన్తో బరకత్ పొందటం, ఖురాన్తో తబర్రుక్ ఆశించటం, ఇలాంటి చాలా ఆయతులు ఖురాన్లో ఉన్నాయి. నేను రెండు ఆయతులు పఠించాను, అన్ఆమ్ మరియు సూర సాద్ లోనిది.
ఖురాన్ ద్వారా తబర్రుక్ పొందాలంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దీంట్లో కండిషన్ పెట్టాడు. ఖురాన్ శుభప్రదం, ఎప్పుడు? ఖురాన్ని అనుసరిస్తే. ఖురాన్ని ఎప్పుడు అనుసరించాలి? పఠించాలి, పారాయణం చేయాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు అనుసరించవచ్చు. అలాగే ఖురాన్ శుభప్రదం ఎప్పుడు? చింతన చేస్తే, గుణపాఠం నేర్చుకుంటే, మన జీవితాలు ఖురాన్ పరంగా ఉంటే ఈ ఖురాన్ మనకోసం బరకత్గా మారిపోతుంది, మన జీవితాలలో శుభం జరుగుతుంది, శుభం మనం పొందవచ్చు, శుభాన్ని ఆశించవచ్చు ఖురాన్ ద్వారా, అంటే ఖురాన్ను పఠించి, ఖురాన్ పారాయణం చేసి, ఖురాన్ చింతన చేసి, గుణపాఠం నేర్చుకొని ఆచరించినట్లయితే, ఈ ఖురాన్ ద్వారా మనకి బరకత్ వస్తుంది, శుభం అవుతుంది. అలా కాకుండా, కేవలం తబర్రుక్ ఉద్దేశంతో పఠించడం లేదు, ఖురాన్ తెరిచి చూడటం లేదు, అర్థం చేసుకోవడం లేదు, కేవలం బరకత్ ఉద్దేశంతో అందమైన దుస్తులు, అందమైన ఒక చిట్టీలో, ఖరీదైన దుస్తులలో దాన్ని బంద్ చేసి, ప్రయాణం చేసేటప్పుడు వాహనంలో, కొత్త ఇల్లు కట్టేటప్పుడు ఇంట్లో, దుకాణంలో, కేవలం తబర్రుక్ ఉద్దేశంతో, చదవటం లేదు, అర్థం చేసుకోవటం లేదు, పారాయణం లేదు, ఏమీ లేదు, అది సమంజసం కాదు. ఖురాన్ ద్వారా తబర్రుక్ పొందటం స్వయంగా అల్లాహ్ తెలియజేశాడు. ఖురాన్ ద్వారా, ఖురాన్ ఆ గ్రంథమే బరకత్తో కూడిన గ్రంథం. ఆ ఖురాన్ ద్వారా మనం బరకత్ పొందాలంటే పఠించాలి, పారాయణం చేయాలి, అర్థం చేసుకోవాలి, దాని అనుగుణంగా నడుచుకోవాలి. దీని ద్వారా ఖురాన్ మనకి బరకత్ అవుతుంది.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తబర్రుక్
అసలు విషయం ఏమిటంటే, ఖురాన్ తర్వాత అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో శుభాన్ని పొందటం. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా శుభాన్ని పొందటం, తబర్రుక్ ఆశించటం,
ఇవి రెండు విధాలు. ఒకటి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో తబర్రుక్ పొందటం, వ్యక్తిత్వంతో ఆయన ఉన్నప్పుడు. సహాబాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను చుంబించేవారు, శుభప్రదమైన చేతులను పట్టుకునేవారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చేతులను పట్టుకొని తమ ముఖాన్ని పైన స్పర్శించుకునేవారు, తిప్పుకునేవారు, శుభం ఉద్దేశంతో, తబర్రుక్ ఉద్దేశంతో. అది అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వ్యక్తిత్వంతో తబర్రుక్ని పొందటం.
రెండవది, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం శుభప్రదమైన శరీరంతో, శుభవంతమైన శరీరంతో వేరైన వస్తువులు, వేరైన భాగాలు. ఆయన శుభవంతమైన శిరోజాలు, తల వెంట్రుకలు. ఆయన శరీరంకి ముట్టిన దుస్తులు, ఆయన వాడిన పాత్రలు. అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి సంబంధించిన, ఆయన వాడిన, ఆయన తొడిగిన పాత్రలు, వస్తువులతో తబర్రుక్ పొందటం.
ఇది ధర్మ సమ్మతమైనది అని మనకు పలు హదీసుల ద్వారా తెలుస్తుంది. ఉదాహరణకి ఒక రెండు, మూడు హదీసులు మనం పరిశీలిద్దాం. ముస్లిం గ్రంథంలో హదీస్ ఉంది, అస్మా బిన్తె అబీ బకర్ రదియల్లాహు అన్హా ఈ హదీస్ కి కథనం ఉల్లేఖులు. ఆమె ఇలా అంటున్నారు, అస్మా బిన్తె అబీ బకర్ రదియల్లాహు అన్హా ఎవరంటే, అబూబకర్ గారి కూతురు, ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క అక్క అస్మా రదియల్లాహు అన్హా. అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు యొక్క తల్లి అస్మా రదియల్లాహు అన్హా. ఆవిడ రదియల్లాహు అన్హా ఇలా తెలియజేశారు, ఒక ప్రవక్త గారి ఒక జుబ్బాని తీశారు, జుబ్బా, చొక్కా. అస్మా రదియల్లాహు అన్హా ఒక జుబ్బాని తీసి, ఈ జుబ్బా ఆయిషా రదియల్లాహు అన్హా బ్రతికున్నంత కాలం ఆవిడ దగ్గర ఉండింది ఈ జుబ్బా. ఆయిషా రదియల్లాహు అన్హా పరమపదించిన తర్వాత ఆ జుబ్బాని నేను నా దగ్గర పెట్టుకున్నాను. ఆ జుబ్బా ఎవరిది? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాడిన జుబ్బా, తొడిగిన జుబ్బా అది. ఇప్పుడు ఆ జుబ్బా నా దగ్గర ఉంది. ఇప్పుడు మనం మనలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే, కీడు జరిగితే, స్వస్థత కోసం, చికిత్స కోసం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధరించిన ఆ జుబ్బాని మనం నీళ్ళలో వేసి, ఆ జుబ్బాని పిండితే, ఆ నీళ్ళతో మనం ఆరోగ్యం కోసం వాడేవారము, చికిత్స నిమిత్తం ఆ నీళ్లు వాడేవారము, అని అస్మా బిన్తె అబీ బకర్ రదియల్లాహు అన్హుమా సెలవిస్తున్నారు. అంటే ఈ హదీస్ ప్రామాణికమైన హదీస్, ముస్లిం గ్రంథంలో ఈ హదీస్ ఉంది.
అలాగే ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది. సహల్ బిన్ స’అద్ రదియల్లాహు త’ఆలా అన్హు ఇలా తెలియజేశారు, ఆయన దగ్గర ఒక పాత్ర ఉండింది, మంచి నీళ్లు తాగే పాత్ర, గ్లాస్ లాంటిది, పాత్ర ఉండింది. ఆ పాత్ర, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పాత్రలో నీళ్లు ఒకప్పుడు తాగారు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికి ఉండగా ఆ పాత్రలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మంచి నీళ్లు తాగారు. ఆ పాత్ర సహల్ బిన్ స’అద్ రదియల్లాహు త’ఆలా అన్హు దగ్గర ఉండింది. ఆ పాత్ర తీసి సహల్ రదియల్లాహు అన్హు తబర్రుక్ కోసం, శుభం పొందటం కోసం తాగారని అబూ హాజిమ్ తెలియజేశారు. ఆ తర్వాత అదే పాత్రను నాకు కావాలని ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లాహి అలైహి కోరారు. ఎవరిని? సహల్ బిన్ స’అద్ రదియల్లాహు అన్హుని. ఆ పాత్ర నాకు ఇస్తారా అని కోరితే, సహల్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ గారికి కానుకగా ఆ పాత్రను ఇచ్చేశారు. అర్థం ఏమిటంటే, రిజల్ట్ ఏమిటంటే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాడిన పాత్ర ఆయన అనుచరులు ఆ తర్వాత తాబయీన్లు తబర్రుక్గా, శుభం కోరటం కోసం వాడేవారు. అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాడిన పాత్రలు, ధరించిన దుస్తులు తబర్రుక్ కోసం వాడవచ్చు అని ఈ బుఖారీ హదీస్ ద్వారా రూఢి అవుతుంది.
అలాగే అబూ జుహైఫా రదియల్లాహు అన్హు కథనం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణ నిమిత్తం మధ్యాహ్న సమయంలో బయలుదేరారు. ఒక ప్రయాణంలో మధ్యాహ్నం బయలుదేరారు. దారిలో బతహా ప్రదేశంలో నమాజ్ నిమిత్తం ఆగటానికి. దారిలో నమాజ్ చేయడానికి, జొహర్ మరియు అసర్ నమాజ్ చేయడానికి. ఆ స్థలం పేరు బతహా. అక్కడ ఆగి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేసి జొహర్, అసర్ నమాజ్ చేశారు. సహాబాలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవంతమైన చెయ్యితో, చెయ్యి పట్టుకొని సహాబాలు తమ ముఖం పైన తిప్పుకున్నారు. ఈ హదీస్ రావి జుహైఫా అంటున్నారు, నేను కూడా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవంతమైన చెయ్యిని పట్టుకొని నా ముఖం పైన తిప్పాను, ఉంచాను. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవంతమైన చెయ్యి చల్లగా, కస్తూరి కంటే ఎక్కువ సువాసనగా ఉండింది, అని తెలియజేశారు. అంటే ఈ విధంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వాడిన వస్తువుల ద్వారా, స్వయంగా ఆయన బ్రతికి ఉన్నంతకాలం, స్వయంగా ఆయన వ్యక్తిత్వంతో తబర్రుక్ తీసుకోవటం, తబర్రుక్ ని పొందటం ఇది ధర్మ సమ్మతము.
బుఖారీలోనే ఇంకో హదీసులో ఇలా ఉంది:
فَجَعَلَ النَّاسُ يَأْخُذُونَ مِنْ فَضْلِ وَضُوئِهِ فَيَتَمَسَّحُونَ بِهِ (ఫ జ’అలన్నాసు య’ఖుజూన మిన్ ఫద్లి వుజూఇహీ ఫ యతమస్సహూన బిహీ) అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేస్తే, వుజూలో మిగిలిన నీళ్లను సహాబాలు తీసుకునేవారు. ఆ నీళ్లను తమ శరీరం పైన పూసుకునేవారు, ముఖం పైన పూసుకునేవారు, తమ పైన జల్లుకునేవారు, తబర్రుక్ ఉద్దేశంతో.
అభిమాన సోదరులారా, అలాగే ముస్లిం గ్రంథంలో ఒక హదీస్ ఉంది, హజ్ సమయంలో అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మినా రోజు అది ఖుర్బానీ ఇచ్చిన తర్వాత, క్షవరం చేసుకున్నప్పుడు, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ శుభవంతమైన శిరోజాలను కుడి వైపు, ఎడమ వైపు సహాబాలకు పంచారు. తబర్రుక్ ఉద్దేశంతో సహాబాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవంతమైన శిరోజాలను తమ వద్ద ఉంచుకున్నారు.
దీంతో ఏమర్థమవుతుంది? అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికున్నంత కాలం ఆయన వ్యక్తిత్వంతో తబర్రుక్ పొందవచ్చు, ఆయన వాడిన, వేసుకున్న, ధరించిన దుస్తుల ద్వారా, ఆయన శరీరం నుంచి వేరైన, అది వెంట్రుకలు, ద్వారా, అలాగే ఆయన వాడిన పాత్రల ద్వారా సహాబాలు తబర్రుక్ పొందారని రూఢి అయ్యింది, ఇది ధర్మ సమ్మతమే. కాకపోతే, ఇది కేవలం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకే పరిమితం. ప్రత్యేకంగా ఆయన కొరకే ఇది.
అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని పోల్చుకుంటూ ఇతర ఔలియాలు, ధర్మ పండితులు, పుణ్య పురుషులు, సజ్జనుల విషయంలో ఇలా చేయటం షిర్క్ అవుతుంది. ధర్మ పండితులు ఇతరులకి, దర్గాలకి పోయి శుభాన్ని కోరటం, ఇది ఫలానా పీర్ జుబ్బా అని, ఇది ఫలానా ఔలియా చొక్కా అని, ఇది ఫలానా ఔలియా పాత్ర అని, ఇది ఫలానా ఔలియాకి ఇది, ఇది అని, అది అని, ఇది ఔలియాలు, బుజుర్గులు, పీర్లు, ధర్మ పండితులు, పుణ్య పురుషులు, సజ్జనులు ఎవరైనా సరే. అంతెందుకు? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత అందరి కంటే ఉత్తములు ఎవరు? అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు. ఉమ్మతె ముహమ్మదియాలో, ప్రవక్తల పరంపర తర్వాత, ప్రవక్తల తర్వాత, ఉమ్మతె ముహమ్మదియాలో అందరికంటే పెద్ద వలీ ఎవరు? అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు. ఎవరైతే ప్రపంచంలో వలీ, వలీ, వలీ అని పేరు పొందారో, వారికంటే పెద్ద వలీ అబూబకర్ రదియల్లాహు అన్హు. ఆ తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు. ఆ తర్వాత ఉస్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు. ఆ తర్వాత అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు త’ఆలా అన్హు. ఆ తర్వాత అషర ముబష్షరా. పది మంది సహాబాలకి ప్రవక్త గారు స్వయంగా ఒకే హదీసులో స్వర్గం శుభవార్త ఇచ్చారు. ముహాజిర్లు, అన్సార్లు, అంత పెద్ద పెద్ద సహాబాల ద్వారా ఎవరైనా ఇతర సహాబాలు, తాబయీన్లు శుభాన్ని ఆశించారా? తబర్రుక్ పొందారా? తబర్రుక్ నిమిత్తం ఇలా చేశారా? స్వయంగా ఈ నలుగురు ఖలీఫాలు, అషర ముబష్షరా, ముహాజిరీన్లు, అన్సార్లు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో కాకుండా, ఆయన జుబ్బా, ఆయన వాడిన పాత్ర, ఆయన శరీరం నుంచి వేరైన ఆ శుభవంతమైన శిరోజాలు, ఇవి కాకుండా, ప్రవక్త గారు ఎక్కడ నమాజ్ చేశారో, ప్రవక్త సమాధి నుంచి శుభం తీసుకున్నారా? మనకంటే ఎక్కువగా ధర్మం తెలిసిన వారు. ప్రవక్త గారి జీవితాన్ని చూసిన వారు. ఖురాన్ యొక్క అర్థం ప్రవక్తతో తెలుసుకున్న వారు. అటువంటి సహాబాలు కూడా, ఇది తబర్రుక్ అనేది చేయలేదు. అది ఒక ప్రత్యేకంగా ఉంది, దేని ద్వారా తబర్రుక్ తీసుకోవాలి అనేది ఖురాన్లో అల్లాహ్ తెలియజేశాడు, హదీసులలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఖురాన్ మరియు హదీస్ పరంగా ఉంటే అది ధర్మ సమ్మతం, అది చేయాలి. మంచి విషయం.
ఉదాహరణకు ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. జమ్ జమ్ నీరు ఉంది. వర్షపు నీళ్లు ఉంది. వర్షపు నీరు శుభవంతమని, ఎందుకు? దాంతో ప్రయోజనం ఉంది. తాగుతాము, బ్రతుకు ఉంది, పంటలు పండుతాయి, దాంతో మేలు జరుగుతుంది. శుభవంతమైనది. హజరె అస్వద్ ఉంది. ప్రవక్త గారు ముద్దాడారు. స్వర్గం నుంచి వచ్చిందని చెప్పారు. శుభవంతమైన ఉద్దేశంతో మనం కూడా ముద్దాడతాం. ఆ విధంగా దేని గురించి ఖురాన్లో ఉందో తబర్రుక్ పొందవచ్చు అని, దేని గురించి ప్రవక్త గారు స్వయంగా చెప్పారో తబర్రుక్ ఉంది అని, మరి ఏ విషయాల గురించి ప్రాక్టికల్గా సహాబాలు అమలు చేశారో వాటితో తబర్రుక్ పొందటం, ఆశించటం ధర్మ సమ్మతమే. అవి కాకుండా ప్రస్తుతం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేరు, పరమపదించారు. అంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో తబర్రుక్ పొందేది లేదు, అది అయిపోయింది. రెండవది, ఆయన శరీరం నుంచి వేరైన వస్తువులు, ఆయన దుస్తులు, పాత్రలు, వెంట్రుక, అవి ఇప్పుడు ప్రపంచంలో ప్రామాణికమైన హదీసుల ద్వారా రూఢి అవ్వలేదు, ఎక్కడ ఉన్నాయి అనేది. నిజంగానే ప్రామాణికమైన హదీసుల ద్వారా ఇప్పుడు కూడా రూఢి అయితే అది ధర్మ సమ్మతమే, తబర్రుక్ ఉద్దేశంతో వాడవచ్చు. కాకపోతే రూఢి అవ్వలేదు, ప్రవక్త యొక్క సంబంధించిన వస్తువులు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం శరీరంతో వేరైన వస్తువులు ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయి అనేది ప్రామాణికమైన హదీసుల ద్వారా రూఢి లేదు కాబట్టి. ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ తబర్రుక్తో కూడిన అన్ని విషయాలన్నీ పాత ఇండియాలోనే ఉన్నాయి. ఇది ఫలానా ఔలియా, ఇది ఫలానా పీరు, ఇది ఫలానా సహాబీ, ఇది ఫలానా వ్యక్తిది పగడా, ఇది ఫలానా వ్యక్తిది పగడి, ఇది ఫలానా వ్యక్తిది జుబ్బా, ఇది ఫలానా వ్యక్తిది పాత్ర, ఇది ఫలానా ఔలియా గ్లాసు, ఇది ఫలానా ఔలియా వెంట్రుక, ఇది ఫలానా ఔలియా పాదము, ఇది ఫలానా ఔలియా చెప్పులు, ఇవంతా పాత ఇండియాలోనే ఉన్నాయి, అరబ్ దేశాల్లో లేవే? అంటే మనము సృష్టించుకున్నాము. ఒకవేళ ఉన్నా, ఆ తబర్రుక్ అనేది కేవలం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకే పరిమితం, ప్రత్యేకం. ఆయన తప్ప సహాబాలకి అది లేదు. అబూబకర్ రదియల్లాహు కంటే పెద్ద వలీ ఉన్నారా? ఉమర్ కంటే పెద్ద వలీ ఉన్నారా? ఖులఫా-ఎ-అర్బా కంటే పెద్ద వలీలు ఉన్నారా? వారి ద్వారానే వారి అనుచరులు, వారి స్నేహితులు ఆ తర్వాత తాబయీన్లు వారి ద్వారా తబర్రుక్ పొందలేదు కదా, అంటే అది ధర్మ సమ్మతం కాదు అని అర్థం అయిపోయింది.
నిషిద్ధమైన తబర్రుక్ (మమ్నూ తబర్రుక్)
కాకపోతే ఒక హదీస్ ద్వారా మనము తెలుసుకుందాము. ఒక సందర్భంలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హునైన్ కి పోయారు. అబూ వాఖిద్ అల్లైసీ తెలియజేస్తున్నారు, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో పాటు హునైన్ కి పోయాము.
خَرَجْنَا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِلَى حُنَيْنٍ (ఖరజ్నా మ’అన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హునైన్) మేము దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో పాటు హునైన్ కి పోయాము.
అది యుద్ధ సమయంలో.
وَنَحْنُ حُدَثَاءُ عَهْدٍ بِكُفْرٍ (వ నహ్ను హుదసాఉ అహ్దిన్ బికఫ్రిన్) అప్పుడు మేము కొత్త కొత్తగా ఇస్లాం స్వీకరించాము. అంటే అప్పుడే మేము ఇస్లాం స్వీకరించిది, కొత్తగా ముస్లిములము. కొత్తగా ఇస్లాం స్వీకరించాము.
وَلِلْمُشْرِكِينَ سِدْرَةٌ يَعْكُفُونَ عِنْدَهَا وَيَنُوطُونَ بِهَا أَسْلِحَتَهُمْ (వ లిల్ ముష్రికీన సిద్రతున్ య’అకిఫూన ఇందహా వ యనూతూన బిహా అస్లిహతహుం) అక్కడ ఆ హునైన్ ఆ స్థలంలో ఒక రేయి చెట్టు ఉండింది. ముష్రికీన్లు, బహుదైవారాధకులు ఆ రేయి చెట్టు పైన తమ ఆయుధాలను వ్రేలాడదీసేవారు, తబర్రుక్ ఉద్దేశంతో. చేసేది ఎవరు? ముష్రికీన్లు, తబర్రుక్ ఉద్దేశంతో అలా చేసేవారు.
అది చూసి ఈ కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారు, “ఓ దైవ ప్రవక్త,” దానికి జాతు అన్వాత్ అని పేరు ఉంది హదీస్ పుస్తకంలో, ఆ రేయి చెట్టు పైన అది వారు ఆయుధాలు వ్రేలాడదీస్తారు కదా, దాని పేరు జాతు అన్వాత్. ఈ కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారు దైవ ప్రవక్తతో, “ఓ దైవ ప్రవక్త, ఏ విధంగా అయితే ఆ బహుదైవారాధకులు, ఆ ముష్రికీన్లు తబర్రుక్ నిమిత్తం, శుభం పొందటానికి ఈ చెట్టు పైన ఆయుధాలు వ్రేలాడదీస్తున్నారు కదా, మా కోసం కూడా మీరు ఒక అన్వాత్ని తయారు చేయండి” అన్నారు, తబర్రుక్ కోసం.
అప్పుడు అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసహనంతో ఏమన్నారంటే:
قُلْتُمْ وَالَّذِي نَفْسِي بِيَدِهِ كَمَا قَالَ قَوْمُ مُوسَى: اجْعَل لَّنَا إِلَٰهًا كَمَا لَهُمْ آلِهَةٌ (ఖుల్తుమ్ వల్లజీ నఫ్సీ బియదిహీ కమా ఖాల ఖవ్ము మూసా: ఇజ్అల్ లనా ఇలాహన్ కమా లహుమ్ ఆలిహహ్) అల్లాహ్ సాక్షిగా, ఆ దేవుని సాక్షిగా ఎవరి చేతిలో అయితే నా ప్రాణం ఉందో, అంటే అల్లాహ్ సాక్షిగా, మీరు చెప్పిన మాట చాలా పెద్ద మాట. ఏ విధంగా అయితే మూసా జాతి ప్రజలు మూసా అలైహిస్సలాంని కోరారు. మూసా అలైహిస్సలాం బనీ ఇస్రాయిల్. ఆ బనీ ఇస్రాయిల్లో బహుదైవారాధకులు షిర్క్ చేసేవారు ఆ ఆవు దూడని పూజించేవారు కదా. మూసా అలైహిస్సలాంకి విశ్వసించిన వారు కూడా అడిగారు: “ఓ మూసా అలైహిస్సలాం, వారికి ఏ విధంగా ఇలాహ్ ఉన్నాడో, అలాగే మాకు కూడా ఒక ఇలాహ్ తయారు చేయండి” అన్నారు.
ఇన్నకుమ్ కౌమున్ తజ్హలూన్ (నిశ్చయంగా మీరు ఇంకా అజ్ఞానులే) అని సమాధానం ఇచ్చారు. అంటే అది ఉపమానంగా ఇస్తూ అంతిమ దైవ ప్రవక్త, “ఇప్పుడు కూడా మీకు ఇంకా పాత జ్ఞాపకాలే ఉన్నాయా? పాత ఆచారాలే ఉన్నాయా? ఇంకా మీ ఈమానంలో, మీ విశ్వాసంలో ఇంకా తేడా రాలేదా?” అని అసహనంగా ప్రవక్త గారు బాధపడ్డారు. అంటే, ఇది అధర్మమైన తబర్రుక్, మమ్నూ తబర్రుక్. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఉన్నా కూడా, ఈ చెట్ల ద్వారా, పుట్టల ద్వారా, పండ్ల ద్వారా తబర్రుక్ లేదు అని ఈ హదీస్ ద్వారా రూఢి అయిపోయింది. ఈ హదీస్ ముస్నద్ అహ్మద్ లో ఉంది, ఇది సహీ హదీస్ ఇది.
అలాగే చివర్లో, బుఖారీ కితాబు ఫద్లిస్సలాత్లో ఒక హదీస్ ఉంది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:
لاَ تُشَدُّ الرِّحَالُ إِلاَّ إِلَى ثَلاَثَةِ مَسَاجِدَ الْمَسْجِدِ الْحَرَامِ وَمَسْجِدِ الرَّسُولِ -صلى الله عليه وسلم- وَمَسْجِدِ الأَقْصَى (లా తుషద్దుర్రిహాలు ఇల్లా ఇలా సలాసతి మసాజిద్: అల్ మస్జిదిల్ హరామ్, వ మస్జిదిర్రసూల్, వ మస్జిదిల్ అఖ్సా.)
ఈ భూమండలంలో అన్నిటికంటే పవిత్రమైన స్థలాలు ఏమిటి? మస్జిద్లు. ఎక్కడైనా సరే, పవిత్రంగా, అన్నిటికంటే పవిత్రం. కాకపోతే, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ తెలియజేశారు, శుభాలు పొందే ఉద్దేశంతో, తబర్రుక్ ఉద్దేశంతో ప్రయాణం చేయటం నిషిద్ధం, హరామ్. అది మస్జిద్ అయినా సరే.
ఫలానా దేశంలో ఫలానా మస్జిద్ ఉంది, అక్కడ పోయి నమాజ్ చేస్తే పుణ్యం వస్తుంది, శుభం కలుగుతుంది, తబర్రుక్ ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రయాణం చేయటం హరామ్. మూడు మస్జిద్లు తప్ప. మస్జిద్-ఎ-హరామ్ (మక్కా), మస్జిద్-ఎ-నబవి (మదీనా), మస్జిద్-ఎ-అఖ్సా (ఫలస్తీన్). ఈ మూడు మస్జిద్లు తప్ప, అంటే ఈ మూడు మస్జిద్లు శుభం పొందే ఉద్దేశంతో, తబర్రుక్ ఉద్దేశంతో ప్రయాణం చేయవచ్చు. హదీస్ ద్వారా రూఢి అయ్యింది, ధర్మ సమ్మతం. ఈ మూడు మస్జిద్లు తప్ప ప్రపంచంలో ఎక్కడైనా సరే, మస్జిద్ అయినా సరే, తబర్రుక్ ఉద్దేశంతో ప్రయాణం చేయటం హరామ్.
అయితే, దర్గా విషయం ఏమిటి? దర్గాకి పోతున్నారు, స్త్రీలు, పురుషులు, హిజాబ్ లేదు, చాలా ఖురాన్కి, హదీస్కి విరుద్ధంగా, మరి తబర్రుక్. ప్రవక్త గారి సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమాధితో తబర్రుక్ లేదు. ఆయన మదీనాలో నడిచిన వీధులతో తబర్రుక్ లేదు. ఆయన యుద్ధాలు చేసిన యుద్ధ మైదానం ద్వారా తబర్రుక్ లేదు. దేని ద్వారా తబర్రుక్ ఉందో, అది రూఢి అయ్యింది ఖురాన్, హదీస్లో ఉంది. అవి తప్ప అది మస్జిద్ అయినా, సమాధి అయినా, దర్గా అయినా, ఔలియా అయినా, సజ్జనులైనా, పుణ్య పురుషులైనా తబర్రుక్ అనేది లేదు. ఒకవేళ తబర్రుక్గా భావిస్తే, వాటి ద్వారా శుభాన్ని కోరితే, అది షిర్క్ క్రిందికి వస్తుందని ధర్మ పండితులు తెలియజేశారు.
అభిమాన సోదరులారా, ఇవి సారాంశం, ధర్మ సమ్మతమైన తబర్రుక్, నిషిద్ధమైన తబర్రుక్.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఖురాన్ మరియు హదీస్ను అర్థం చేసుకొని, దాని అనుగుణంగా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ త’ఆలా మనందరికీ ఖురాన్ మరియు హదీస్ యొక్క సరైన అవగాహన కలిగే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్, సుమ్మా ఆమీన్. వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ఖుర్ఆన్ యొక్క అనేక గొప్ప ప్రత్యేకతలు మరియు ఘనతలు వివరించబడ్డాయి. ఇది అల్లాహ్ చే స్వయంగా ప్రళయం వరకు భద్రపరచబడిన, ఎలాంటి సందేహాలకు తావులేని ఏకైక గ్రంథమని నొక్కి చెప్పబడింది. ఖుర్ఆన్ పఠనం హృదయాలకు శాంతిని, మార్గదర్శకత్వాన్ని మరియు శారీరక, ఆత్మిక రోగాలకు స్వస్థతను ఇస్తుందని ఉమర్ (రదియల్లాహు అన్హు) మరియు తుఫైల్ (రదియల్లాహు అన్హు) వంటి వారి ఇస్లాం స్వీకరణ గాథలతో వివరించబడింది. ఖుర్ఆన్ పారాయణ ప్రతి అక్షరానికి పది పుణ్యాలను ఇస్తుందని, ఇది ఇహలోకంలోనే కాక, సమాధిలో మరియు పరలోకంలో కూడా తన సహచరుడికి రక్షణగా, సిఫారసుగా నిలిచి స్వర్గంలో ఉన్నత స్థానాలకు చేరుస్తుందని చెప్పబడింది.
అల్ హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్త’ఈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను’మినుబిహి వ నతవక్కలు అలైహ్. వ న’ఊదుబిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యి’ఆతి అ’మాలినా. మై యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహ్, వ మై యుద్లిల్ ఫలా హాదియ లహ్.వ అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహ్. వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహ్. అర్సలహు బిల్ హఖ్ఖి బషీరవ్ వ నదీరా. అమ్మా బ’అద్
ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్. వ ఖైరల్ హద్యి హద్యి ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం. వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా. వ కుల్ల ముహ్దసతిన్ బిద్’అహ్, వ కుల్ల బిద్’అతిన్ దలాలహ్. వ కుల్ల దలాలతిన్ ఫిన్ నార్.
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ ఓ విశ్వాసులారా! అల్లాహ్కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి. (3:102)
يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً ۚ وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا మానవులారా! మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి, దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి, ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరిపేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహ్కు భయపడండి. బంధుత్వ సంబంధాల తెగత్రెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మీపై నిఘావేసి ఉన్నాడు.(4:1)
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَمَن يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا ఓ విశ్వాసులారా! అల్లాహ్కు భయపడండి. మాట్లాడితే సూటిగా మాట్లాడండి (సత్యమే పలకండి).తద్వారా అల్లాహ్ మీ ఆచరణలను చక్కదిద్దుతాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఎవరయితే అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత కనబరచాడో అతను గొప్ప విజయం సాధించాడు. (33:70-71)
ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు అభిమాన సోదరులారా.
ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకతలు
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క విధానం ఏమిటంటే భూమి మీద నివసిస్తున్న ప్రజలు మార్గభ్రష్టత్వానికి గురైనప్పుడు మనుషుల్లోనే ఒక మనిషిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్తగా, బోధకునిగా ఎంచుకొని ఆ బోధకుని వద్దకు, ప్రవక్త వద్దకు దూత ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తమ వాక్యాలను పంపిస్తే ఆ దైవ వాక్యాలు అందుకున్న ఆ ప్రవక్త మానవులకు దైవ వాక్యాలు వినిపించేవారు.
ఆ విధంగా ప్రవక్త జీవించినంత కాలం దైవ వాక్యాలు వస్తూ ఉంటే, ఆ దైవ వాక్యాలన్నింటినీ ఒకచోట పొందుపరిచి, ఒక గ్రంథంలాగా, ఒక పుస్తకంలాగా తయారు చేసి ఉంచేవారు. అలా మనం చూచినట్లయితే చాలామంది ప్రవక్తలు ఈ ప్రపంచంలో వేర్వేరు సందర్భాలలో, వేర్వేరు ప్రదేశాలలో వచ్చారు. వారి వద్దకు దైవ గ్రంథాలు వచ్చాయి. అయితే ఆ పరంపరలో వచ్చిన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైతే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పంపించిన అంతిమ గ్రంథం ఖుర్ఆన్ గ్రంథం.
అభిమాన సోదరులారా, ఈనాటి జుమా ప్రసంగంలో మనం ఇన్ షా అల్లాహ్ ఈ ఖుర్ఆన్ కు సంబంధించిన ప్రత్యేకతలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ లోని సూర బఖరా, రెండవ అధ్యాయం, 231వ వాక్యంలో తెలియజేశాడు, ఈ ఖుర్ఆన్ గ్రంథం ప్రజల కొరకు ఒక గొప్ప అనుగ్రహము. నిజమే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని ప్రజల కొరకు ఒక గొప్ప అనుగ్రహంగా పంపించాడు. అయితే ఈ గొప్ప అనుగ్రహానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? మనం అల్లాహ్ ను విశ్వసించే వాళ్ళము, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించే వాళ్ళము, ఖుర్ఆన్ గ్రంథాన్ని తమ గ్రంథముగా భావించే వారమైన మనము ఈ ఖుర్ఆన్ గ్రంథానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
ఖుర్ఆన్ యొక్క భద్రత
అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ అల్లాహ్ పంపించిన అంతిమ గ్రంథము. ఇక ప్రళయం వరకు మరొక గ్రంథము రాదు. కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథానికి కల్పించిన ఒక గొప్ప ఘనత, ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఖుర్ఆన్ గ్రంథము ప్రవక్త జీవిత కాలము నాటి నుండి ఇప్పటి వరకు కూడా సురక్షితంగానే ఉంది, ప్రళయం సంభవించినంత వరకు కూడా సురక్షితంగానే ఉంటుంది. ఇన్ షా అల్లాహ్. ఎందుకో తెలుసా? ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వయంగా ఈ గ్రంథానికి రక్షించే బాధ్యతను తీసుకొని ఉన్నాడు. ఈ విషయాన్ని మనము ఖుర్ఆన్ లోని 15వ అధ్యాయం 9వ వాక్యంలో చూడవచ్చు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తున్నాడు:
إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ (ఇన్నా నహ్ను నజ్జల్ నజ్ జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్) మేమే ఈ ఖుర్ఆన్ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము.(15:9)
అనగా, మేమే ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేశాము మరియు మేమే దీనిని రక్షిస్తాము అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వాక్యంలో తెలియజేసి ఉన్నాడు. అభిమాన సోదరులారా, ఒక్క విషయం తెలుసుకోవలసిన ఉంది. అదేమిటంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత కాలం నుండి కూడా ఇప్పటి వరకు రక్షిస్తూ వస్తున్నాడు, ప్రళయం వరకు కూడా రక్షిస్తాడు. ఎలా రక్షిస్తున్నాడో కూడా చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పుస్తక రూపంలో కూడా దాన్ని రక్షిస్తూ ఉన్నాడు, మానవుల హృదయాలలో కూడా దానిని సురక్షితంగా ఉంచి ఉన్నాడు.
ఈ రోజు మనం కువైట్ లో ఉన్న గ్రంథాన్ని తీసుకున్నా, ఇండియాలో ఉన్న గ్రంథాన్ని తీసుకున్నా, అమెరికాలో ఉన్న గ్రంథాన్ని తీసుకున్నా ఏ దేశంలో ఉన్న గ్రంథాన్ని మనం చూచినా పూర్తి ఖుర్ఆన్ ఒకేలాగా ఉంటుంది. ఒక దేశంలో ఒకలాంటి ఖుర్ఆన్, మరో దేశంలో మరోలాంటి ఖుర్ఆన్ మీకు కనిపించదు. ప్రపంచ నలుమూలలా మీరు ఎక్కడికి వెళ్లి చూసినా ఒకే రకమైన ఖుర్ఆన్ దొరుకుతుంది.
అలాగే, ఖుర్ఆన్ కి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎలా రక్షిస్తున్నాడో చూడండి. ఈ రోజు ఇప్పటికి ఇప్పుడే ప్రపంచంలో ఉన్న పూర్తి ఖుర్ఆన్ గ్రంథాలన్నిటినీ తీసుకుని వెళ్లి సముద్రంలో పడివేసినా, మళ్లీ రేపు ఈ సమయానికల్లా ప్రతి దేశంలో ఉన్న హాఫిజ్ లు, ఎవరైతే ఖుర్ఆన్ గ్రంథాన్ని కంఠస్థం చేసి ఉన్నారో, వాళ్ళందరూ వారి వారి దేశాలలో మళ్లీ ఖుర్ఆన్ ను రచించుకోగలరు. ఎందుకంటే ఖుర్ఆన్ ని ప్రారంభం నుండి చివరి వరకు, అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ నుండి ఖుల్ అ’ఊదు బిరబ్బిన్ నాస్ సూరా వరకు కూడా కంఠస్థం చేసిన హాఫిజ్ లు ప్రతి దేశంలో ఉన్నారు. అల్ హమ్దులిల్లాహ్. ఏడు సంవత్సరాల అబ్బాయి, అమ్మాయి కూడా ఖుర్ఆన్ ని కంఠస్థం చేసినవాళ్ళు నేడు ప్రపంచంలో ఉన్నారు.
అభిమాన సోదరులారా, ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజల హృదయాలలో ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని సురక్షితంగా ఉంచి ఉన్నాడు. అలాగే గ్రంథ రూపంలో కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గ్రంథాన్ని సురక్షితంగా ఉంచి ఉన్నాడు. అదే మనం ఖుర్ఆన్ గ్రంథాన్ని వదిలేసి మరొక గ్రంథాన్ని చూచినట్లయితే, ఆ గ్రంథములోని ఒక్క చాప్టర్ నేడు ప్రపంచంలో నుంచి అదృశ్యం చేసేస్తే ఆ చాప్టర్ ని మళ్ళీ రచించుకోవడానికి వాళ్ళ వద్ద ఎలాంటి ఆయుధం లేదు. ఎందుకంటే ఖుర్ఆన్ తప్ప వేరే గ్రంథాన్ని కంఠస్థం చేసినవాళ్లు ఎవరూ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనే లేరు. కాబట్టి ఇది ఖుర్ఆన్ యొక్క ఘనత, ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకత అభిమాన సోదరులారా.
సందేహాలకు అతీతమైన గ్రంథం
అలాగే ఖుర్ఆన్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఖుర్ఆన్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అనేక విషయాలను ప్రస్తావించి ఉన్నాడు. ఖుర్ఆన్ లో ప్రస్తావించబడి ఉన్న విషయాలలో ఏ ఒక్క విషయాన్ని కూడా ఇది తప్పు అని నిరూపించడానికి ఎవరికీ ఆస్కారము లేదు. ప్రవక్త వారి జీవితకాలం నుండి నేటి వరకు కూడా ఎవరూ ఖుర్ఆన్ లో ఉన్న వాక్యాలను తప్పు అని నిరూపించలేకపోయారు. ప్రళయం వరకు కూడా ఇన్ షా అల్లాహ్ నిరూపించలేరు. ఎందుకంటే ఇది నిజమైన ప్రభువు అల్లాహ్ యొక్క వాక్యము కాబట్టి, ఇందులో ఉన్న ఏ ఒక్క వాక్యాన్ని కూడా ఎవరూ తప్పు అని నిరూపించలేరు. అదే విషయాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర బఖరా, రెండవ అధ్యాయం, రెండవ వాక్యంలో తెలియజేస్తున్నాడు:
ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ (దాలికల్ కితాబు లా రైబ ఫీహ్) “ఇది అల్లాహ్ గ్రంథం. ఇందులో ఎలాంటి సందేహం లేదు.” (2:2)
ఈ గ్రంథంలో ఎంతమాత్రం సందేహము లేదు. అదే విషయాన్ని మనం వేరే గ్రంథాలలో చూచినట్లయితే అభిమాన సోదరులారా, పరస్పర విరుద్ధమైన విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకచోట దేవుడు ఒక్కడు అంటే, ఒకచోట దేవుడు ఇద్దరు, ముగ్గురు అని చెప్పబడి ఉంటుంది. అంటే పరస్పర విరుద్ధమైన విషయాలు వేరే గ్రంథాలలో కనిపిస్తాయి. కానీ ఖుర్ఆన్ ఎలాంటి సందేహాలు లేని సురక్షితమైన గ్రంథము.
అల్లాహ్ ఖుర్ఆన్ పై చేసిన ప్రమాణం
అలాగే అభిమాన సోదరులారా, ఈ ఖుర్ఆన్ గ్రంథానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథం మీద ప్రమాణం చేసి ఉన్నాడు. సాధారణంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మామూలు విషయాల మీద ప్రమాణం చేయడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గొప్ప ఘనుడు కాబట్టి, ఆయన గొప్ప గొప్ప విషయాల మీదనే ప్రమాణం చేస్తాడు, సాధారణమైన విషయాల మీద ప్రమాణం చేయడు. అలా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథం మీద ప్రమాణం చేసి ఉన్నాడు. ఆ విషయాన్ని మనము చూచినట్లయితే సూర యాసీన్, 36వ అధ్యాయము, రెండవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తున్నాడు:
يس وَالْقُرْآنِ الْحَكِيمِ (యాసీన్ వల్ ఖుర్ఆనిల్ హకీమ్) “యాసీన్. వివేకంతో నిండిన ఈ ఖుర్ఆన్ సాక్షిగా!” (36:1-2) అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ మీద ప్రమాణం చేసి ఉన్నాడు. ఇది ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకత.
మార్గదర్శకత్వం చూపే గ్రంథం
అలాగే, ఖుర్ఆన్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఖుర్ఆన్ ప్రజలకు మార్గదర్శకత్వం చూపిస్తుంది. ఎవరైతే మార్గభ్రష్టత్వానికి గురై ఉన్నారో, ఎవరైతే అవిశ్వాస అంధకారంలో జీవిస్తూ ఉన్నారో వారందరికీ ఈ ఖుర్ఆన్ రుజు మార్గాన్ని చూపిస్తుంది, మార్గదర్శకత్వాన్ని చూపిస్తుంది. ఖుర్ఆన్ చదివిన వాళ్ళు చాలామంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో కూడా మార్గాన్ని పొందారు. నేడు కూడా ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివి చాలామంది అంధకారం నుండి బయటికి వస్తున్నారు, రుజు మార్గాన్ని పొందుతూ ఉన్నారు. ఇలాంటి చాలా ఉదాహరణలు మనకు ప్రవక్త జీవిత కాలం నుండి నేటి వరకు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఒకటి రెండు ఇన్ షా అల్లాహ్ ఉదాహరణలు నేను మీ ముందర ఉంచదలుచుకున్నాను.
ఒక ఉదాహరణ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో తుఫైల్ బిన్ అమర్, దౌస్ తెగకు చెందిన ఒక వ్యక్తి మక్కాకు వచ్చారు. ఆనాడు మక్కాలో నివసిస్తున్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విరోధులైనవారు కొంతమంది తుఫైల్ గారికి ఏమన్నారంటే, “చూడయ్యా, మక్కాలో ఒక మాంత్రికుడు ఉన్నాడు, అతని పేరు ముహమ్మద్.” విరోధులు కదా, అందుకే ఇలా చెప్తున్నారు. “అతని మాటలు నువ్వు వినకు. ఎందుకంటే అతని మాటలు నీవు వింటే నీ మీద అతని మంత్రజాలం వచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వు అతని మాటల్లో పడిపోతావు. నీ తల్లిదండ్రులకు, నీ ఊరి వారికి దూరం అయిపోతావు. కాబట్టి అతని మాటలు నువ్వు వినకు. అతనితో నువ్వు దూరంగా ఉండు. నీ మంచి కొరకు చెప్తున్నామయ్యా” అన్నారు.
వారి మాటలని నిజమని నమ్మేసిన ఆ తుఫైల్ బిన్ అమర్ దౌసీ, ముహమ్మద్ వారికి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే అనుకోకుండా ఒకసారి మక్కాలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటే, ప్రవక్త వారు ఏదో ఒక మూలన ఖుర్ఆన్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే, ఆ శబ్దాన్ని నెమ్మదిగా వినేశారు. అప్పుడు ఆయన మనసులో ఒక ఆలోచన తట్టింది. అదేమిటంటే, నేను బాగా చదువుకున్న వ్యక్తిని, మంచి చెడును బాగా గ్రహించగల శక్తి ఉన్నవాడిని. నేను ముహమ్మద్ గారి మాటలు కూడా విని చూస్తాను. మంచిదైతే మంచిదనుకుంటాను, మంచిది కాకపోతే చెడ్డదనిపిస్తే దాన్ని వదిలేస్తాను. అంతగా అతనితో భయపడిపోవాల్సిన అవసరం ఏముంది? అలా అనుకొని ఆయన ముహమ్మద్ వారు ఖుర్ఆన్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే, ఆయన దగ్గరికి వెళ్లి, ఆయన చదువుతున్న గ్రంథాన్ని, చదివి వినిపించమని కోరగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివి వినిపించారు.
ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివి వినిపించిన తర్వాత వెంటనే అక్కడికక్కడే తుఫైల్ గారు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, “ఓ ముహమ్మద్ గారు, మీరు పఠిస్తున్న ఈ పలుకులు ఇవి మంత్ర తంత్రాలు కావు. అలాగే కవిత్వము కూడా ఇది ఎప్పటికీ కాజాలదు. మీరు ఏదో గొప్ప వాక్యాలు పలుకుతున్నారు. నిశ్చయంగా ఇది దేవుని వాక్యమే అవుతుంది కానీ ప్రజల వాక్యాలు కానే కాజాలవు. నేను సాక్ష్యం ఇస్తున్నాను మీరు ప్రవక్త అని. నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లాహ్ యే దేవుడు అని” అని అక్కడే సాక్ష్యం ఇచ్చి ఇస్లాంలో చేరిపోయారు. చూశారా అభిమాన సోదరులారా.
అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆయన పేరు జమ్మాద్ అజ్దీ. ఆయనకు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విరోధులు, శత్రువులు ఏమని చెప్పారంటే, “ఏమయ్యా, నీ స్నేహితుడు ముహమ్మద్ ఉన్నాడు కదా, అతనికి పిచ్చి పట్టిందయ్యా. ఏదేదో వాగేస్తున్నాడు. నీకు ఏదో మంత్ర తంత్రాలు వచ్చు కదా. పోయి అతనికి వైద్యం చేయించవచ్చు కదా. నీ స్నేహితుడు కదా, నీ స్నేహితుడికి మంచి బాగోగులు నువ్వు చూసుకోవాలి కదా” అని శత్రువులు చెప్పగా ఆయన నిజమే అని నమ్మాడు. నిజమే అని నమ్మి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో స్నేహం ఉంది కాబట్టి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్లి ఏమన్నారంటే, “ఏమండీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు నా స్నేహితులు కాబట్టి మీ మంచి కోరి నేను ఒక విషయాన్ని మీ ముందర ఉంచుతున్నాను. అదేమిటంటే మీకు పిచ్చి పట్టిందని నాకు కొంతమంది చెప్పారు. నాకు వైద్యం చేయడం వచ్చు. కాబట్టి నేను మీకు వైద్యం చేయాలనుకుంటున్నాను. మీరు వైద్యం చేయించుకోండి” అన్నారు.
దానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, “అయ్యా, నేను ఏ మాటలు చెబుతూ ఉంటే వాళ్ళు నన్ను మాంత్రికుడు అని, పిచ్చివాడు అని అంటున్నారో ఆ మాటలు కొన్ని నేను నీకు కూడా వినిపిస్తాను. నువ్వు విను. విన్న తర్వాత నువ్వే నిర్ణయించుకో. నేను చెప్తున్నది పిచ్చివాని మాటలా, మంత్ర తంత్రాలా, ఏంటి అనేది నువ్వు విని ఆ తర్వాత నిర్ణయించు” అని చెప్పారు. “సరే చెప్పండి ఓ ప్రవక్త” అని చెప్పగా అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ లోని రెండు చిన్న సూరాలు వినిపించారు. సూర ఇఖ్లాస్, సూర ఫలఖ్. రెండు చిన్న సూరాలు వినిపించగానే, అక్కడికక్కడే ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చేయి పట్టుకొని ఏమన్నాడంటే, “నేను కవుల నోటి నుండి కవిత్వాన్ని విని ఉన్నాను. నేను మాంత్రికుల నోటి నుండి మంత్ర తంత్రాలు విని నేర్చుకొని ఉన్నాను. నేను సాక్ష్యం పలుకుతున్నాను మీరు చదివింది ఇది మంత్రము కాదు. నేను సాక్ష్యం పలుకుతున్నాను మీరు చదివింది ఇది కవిత్వము కాదు. ఇది దేవుని మాట. ఎందుకంటే ఇది కవిత్వానికి అతీతము, ఇది మంత్ర తంత్రాలకు అతీతమైన పలుకులు” అని అప్పటికప్పుడే ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేయి పట్టుకొని అల్లాహ్ యే ప్రభువు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ ప్రవక్త అని సాక్ష్యం పలికి ఇస్లాం స్వీకరించారు.
చూశారా అభిమాన సోదరులారా, అంటే ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏమిటంటే, ఖుర్ఆన్ అంధకారంలో ఉన్నవారికి మార్గదర్శకత్వం చూపిస్తుంది. ఎవరైతే మార్గభ్రష్టత్వంలో ఉన్నారో వారందరికీ రుజు మార్గం తీసుకువస్తుంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని హిదాయత్ అనగా మార్గదర్శకత్వంగా చేసి పంపించాడు. ఇది ఖుర్ఆన్ యొక్క ఘనత.
హృదయాలకు నెమ్మదినిచ్చే గ్రంథం
అలాగే, మనం ఖుర్ఆన్ కు సంబంధించిన మరొక ప్రత్యేకత చూచినట్లయితే, ఖుర్ఆన్ ద్వారా హృదయాలు నెమ్మదిస్తాయి. కఠిన వైఖరి ఉన్నవారి హృదయాలు కూడా మెత్తబడిపోతాయి. వారి శరీర రోమాలు నిలిచి నిలబడిపోతాయి ఖుర్ఆన్ గ్రంథాన్ని అర్థం చేసుకుంటే గనుక. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో మక్కాలో ఒక గొప్ప యువకుడు ఉండేవాడు. చాలా ధైర్యశాలి. బలవంతుడు కూడా. అతనికి ఎదుర్కోవాలంటే మక్కా వాసులు వణికిపోతారు. అలాంటి ధైర్యవంతుడు, అలాంటి శక్తిమంతుడు. ఆయన ఎవరో కాదు, ఆయన పేరే ఉమర్.
ఆయన ఇస్లాం స్వీకరించక పూర్వం ప్రజల మాటలు వింటూ ఉండేవాడు. ప్రజలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విరుద్ధంగా ఏవేవో చెప్తా ఉంటే అది నిజమని నమ్మేవాడు. అయితే ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో కాబతుల్లా వద్ద ఖుర్ఆన్ గ్రంథం పఠిస్తూ ఉంటే అనుకోకుండా ఒకరోజు వినేశాడు. నచ్చింది. ప్రజలు చూస్తే ఆయన మంచివాడు కాదు అని ప్రచారం చేస్తున్నారు. ఈయన చూస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి నుండి విన్న ఖుర్ఆన్ గ్రంథము ఆయనకు నచ్చింది. అయోమయంలో పడిపోయాడు. ఎవరి మాట నిజమని నమ్మాలి? ప్రవక్త వారి మాట నిజమని నమ్మాలా? లేదా మక్కా పెద్దలు చెప్తున్న మాటలు నిజమని నమ్మాలా? అయోమయంలో పడిపోయాడు, కన్ఫ్యూజన్.
చివరికి ఆ కన్ఫ్యూజన్ ఎంత ఎక్కువైపోయిందంటే, ఇదంతా ముహమ్మద్ వల్లే కదా జరుగుతా ఉండేది, కాబట్టి ముహమ్మద్ నే లేకుండా చేసేస్తే ఈ కన్ఫ్యూజనే ఉండదు అని అలా అనుకొని ఆయన కత్తి పట్టుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చంపడానికి బయలుదేరిపోయాడు. దారి మధ్యలో ఒక వ్యక్తి చూసుకున్నాడు. ఆయన అర్థం చేసుకున్నాడు, ఈ రోజు ఉమర్ బయలుదేరాడు, ఎవరికో ఒకరికి ఈ రోజు ప్రాణం తీసేస్తాడు అని. వెంటనే ఆయన ఏమన్నారంటే, “ఓ ఉమర్, ఎక్కడికి వెళ్తున్నావు?” అని ప్రశ్నించాడు. ఉమర్ వారు ఉన్న ఉద్దేశాన్ని వ్యక్తపరిచేసాడు. “ఈ ముహమ్మద్ వల్ల నేను అయోమయంలో పడిపోయి ఉన్నాను కాబట్టి, సమస్య పరిష్కారం కోసం వెళ్తున్నాను” అని చెప్పేసాడు.
అప్పుడు ఆయన అన్నారు, “అయ్యా, ముహమ్మద్ విషయం తర్వాత. ముందు నీ చెల్లెలు, నీ బావ ఇద్దరు ఇస్లాం స్వీకరించేశారు. ముహమ్మద్ మాటల్లో వచ్చేసారు. ముందు వాళ్ళ గురించి నువ్వు శ్రద్ధ తీసుకో. వాళ్ళ గురించి ముందు నువ్వు తెలుసుకో” అన్నారు. ముందే కోపంలో ఉన్నారు. వారి ఇంటివారు, సొంత వాళ్ళ చెల్లెలు, బావ ఇద్దరు ఇస్లాం స్వీకరించేశారు అన్న విషయాన్ని తెలుసుకోగా, అగ్గి మీద ఆజ్యం పోసినట్టు అయిపోయింది. మరింత కోపం ఎక్కువైపోయింది. కోపం ఎక్కువైపోయేసరికి చక్కగా అక్కడి నుండి చెల్లి ఇంటికి వెళ్ళాడు.
దూరం నుంచి ఉమర్ వస్తున్న విషయాన్ని గ్రహించిన వారి చెల్లి వెంటనే ఖుర్ఆన్ చదువుతూ ఉండింది, కొన్ని పత్రాలు తీసుకుని. అవి బంద్ చేసేసి ఒకచోట దాచి పెట్టేసింది. ఆ తర్వాత వెళ్లి తలుపు తీయగా ఉమర్ వారు కోపంతో ప్రశ్నిస్తున్నారు. “నేను వచ్చే ముందు విన్నాను, చప్పుడు విన్నాను నేను. మీరు ఏదో చదువుతా ఉన్నారు. ఏంటి అది?” అని ప్రశ్నించాడు. “నేను వినింది నిజమేనా? మీరు ముహమ్మద్ మాటల్ని నమ్ముతున్నారంట కదా. తాత ముత్తాతల ధర్మాన్ని, మార్గాన్ని వదిలేశారంట కదా. నిజమేనా?” అని ప్రశ్నించాడు.
అప్పుడు ఆవిడ అంది, “లేదు లేదు” అని ఏదో రకంగా ఆయనను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన వినే స్థితిలో లేడు. చెల్లెలు మాట తడబడుతూ ఉంటే, “ఆ నేను వినింది నిజమే” అని నమ్మేసి వెంటనే చెల్లెల్ని, బావని ఇద్దరినీ చితకబాదేశాడు. ఎంతగా కొట్టారంటే చెల్లి తలకు గాయమై రక్తం ప్రవహించింది. వెంటనే చెల్లి ఏమనింది అంటే, “ఓ ఉమర్, నువ్వు వినింది నిజమే. మేము ముహమ్మద్ వారు తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించాము. అల్లాహ్ యే ప్రభువు అని నమ్మేసాము. తాత ముత్తాతల మార్గాన్ని వదిలేసాము. నువ్వు చంపుతావో, ఏమి చేస్తావో చేసుకో. ఇప్పుడు మేము మాత్రం ముహమ్మద్ తీసుకుని వచ్చిన ధర్మాన్ని మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో వదలమంటే వదలము. ఏం చేస్తావో చేసుకో” అని.
అంత కఠినంగా చెల్లెలు మాట్లాడేసరికి ఉమర్ వారు ఆశ్చర్యపోయారు, అవాక్కయ్యారు. ఆ తర్వాత ఆయన ఆశ్చర్యంగా ప్రశ్నించాడు, “అమ్మా, నీకు అంత ప్రభావితం చేసిన ఆ వాక్యాలు ఏమిటో, నాకు కూడా కొంచెం వినిపించు చూద్దాం” అన్నాడు. అప్పుడు చెల్లెలు అన్నారు, “లేదయ్యా, ముందు వెళ్లి నువ్వు స్నానం చేసిరా, ఆ తర్వాత వినిపిస్తాను.” వెళ్లి స్నానం చేసి వచ్చారు. ఆ తర్వాత ఉమర్ గారి చెల్లెలు వద్ద ఉన్న కొన్ని పత్రాలు అతనికి ఇవ్వగా, ఉమర్ ఆ పత్రాలను తీసుకుని చదివారు. చదివిన తర్వాత ఎంతగా ఆయన హృదయం నెమ్మబడిపోయిందంటే, కొద్ది నిమిషాల క్రితం ముహమ్మద్ వారిని చంపాలనే ఉద్దేశంతో వచ్చిన ఆ వ్యక్తి, ఆ పత్రాలలో ఉన్న దేవుని వాక్యాలు చదివిన తర్వాత ఆయన హృదయం ఎంత మెత్తబడిపోయిందంటే, “సుబ్ హా నల్లాహ్! ఎంత మంచి పలుకులు ఇందులో ఉన్నాయి! ముహమ్మద్ వారు ఎక్కడ ఉన్నారో చెప్పండి. నేను ముహమ్మద్ వారు తీసుకువచ్చిన మాటను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను” అన్నాడు.
చూశారా. అభిమాన సోదరులారా, ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో వెళ్లిపోయారు. చూసిన వాళ్ళు కంగారుపడిపోయారు, ఉమర్ వచ్చేసాడు ఏం చేసేస్తాడో ఏమో అని. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో వెళ్లి, “ఓ దైవ ప్రవక్త, నేను ఇస్లాం స్వీకరిస్తున్నాను. అల్లాహ్ యే ప్రభువు, మీరు అల్లాహ్ పంపించిన అంతిమ ప్రవక్త” అని సాక్ష్యం ఇస్తున్నాను అని చెప్పగా అక్కడ ఉన్న సహాబాలందరూ “అల్లాహు అక్బర్” అని బిగ్గరగా పలికారు. అంటే ఈ ఉదాహరణ ద్వారా తెలిసివచ్చే విషయం ఏమిటంటే, ఖుర్ఆన్ లో ఎలాంటి శక్తి అల్లాహ్ పెట్టి ఉన్నాడంటే కఠిన మనస్తత్వం కలిగిన వారి మనసు కూడా నెమ్మదిగా మారిపోతుంది. హృదయాలు నెమ్మదిస్తాయి అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ.
ఖుర్ఆన్ పారాయణ యొక్క పుణ్యం
అలాగే అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ కు ఉన్న మరొక గొప్ప విశిష్టత, అలాగే ఖుర్ఆన్ కు ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఖుర్ఆన్ గ్రంథాన్ని చదవడానికి తీసుకుని వ్యక్తి ప్రారంభిస్తే, ఒక్కొక్క అక్షరానికి బదులుగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వ్యక్తికి పదేసి పుణ్యాలు ప్రసాదిస్తాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉదాహరించి మళ్లీ చెప్పారు, “ఎవరైనా ఒక వ్యక్తి అలిఫ్ లామ్ మీమ్ అని చదివితే అవి మూడు అక్షరాలు అవుతాయి. అలిఫ్ ఒక అక్షరము, లామ్ ఒక అక్షరము, మీమ్ ఒక అక్షరము. అలిఫ్ లామ్ మీమ్ అని చదవగానే ఆ వ్యక్తికి మూడు అక్షరాలు చదివిన పుణ్యం, అనగా ముప్పై పుణ్యాలు అతనికి లభిస్తాయి” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
అభిమాన సోదరులారా, ఆ ప్రకారంగా ఖుర్ఆన్ పూర్తి గ్రంథాన్ని చదివితే ఎన్ని పుణ్యాలు మనిషికి లభిస్తాయి ఆలోచించండి. ఇలా పుణ్యాలు లభించే మరొక గ్రంథం ఏదైనా ఉందా? ఇంతటి విశిష్టత కలిగిన మరొక గ్రంథం ఏదైనా ఉందా? ఏ గ్రంథానికైనా ఇలాంటి ఘనత ఉందా అభిమాన సోదరులారా? లేదు, కాబట్టి ఇది ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకత.
శారీరక మరియు ఆత్మిక రోగాలకు స్వస్థత
అలాగే, ఖుర్ఆన్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందవచ్చు. ఎలాంటి స్వస్థత అండి? మనిషి మనసులో కొన్ని రోగాలు ఉంటాయి, మనిషి శరీరానికి సంబంధించిన కొన్ని రోగాలు ఉంటాయి. మనిషి మనసులో ఉన్న రోగాలకు కూడా ఈ ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందవచ్చు, మనిషి శరీరంలో ఉన్న రోగాలకు కూడా ఈ ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందవచ్చు. దీనికి సంబంధించిన చాలా ఉదాహరణలు ఉన్నాయి అభిమాన సోదరులారా. మనసులో అహంకారం ఉంటుంది, మనసులో అసూయ ఉంటుంది, మనసులో కుళ్ళు ఉంటుంది. ఇలా చాలా రోగాలు ఉంటాయి. ఖుర్ఆన్ ద్వారా ఈ రోగాలన్నీ తొలగిపోతాయి. ఎవరైతే ఖుర్ఆన్ గ్రంథాన్ని ఎక్కువగా పఠిస్తూ ఉంటారో వాళ్ళ మనసులో నుంచి అహంకారం తొలగిపోతుంది, వాళ్ళ మనసులో నుంచి అసూయ తొలగిపోతుంది, వాళ్ళ మనసులో నుంచి కుళ్ళు అనేది తొలగిపోతుంది. ఇలా మనసులో ఉన్న రోగాలన్నీ తొలగిపోతాయి, స్వస్థతని ఇస్తుంది ఈ ఖుర్ఆన్ గ్రంథం. అలాగే శరీరానికి సంబంధించిన చాలా వ్యాధులకు కూడా ఈ ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందవచ్చు అభిమాన సోదరులారా.
సమగ్ర విజ్ఞానం గల గ్రంథం
అలాగే ఈ ఖుర్ఆన్ కు ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఖుర్ఆన్ ఇది ఎలాంటి గ్రంథం అంటే మానవుని చరిత్ర ఎప్పటి నుంచి మొదలైంది అది కూడా ఇందులో చెప్పబడింది. ప్రళయం వచ్చే వరకు ఈ ప్రపంచంలో ఏమేమి జరగబోతుంది, ప్రళయం సంభవించిన తర్వాత పరలోకంలో ఏమి జరుగుతుంది, ఇవన్నీ విషయాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. అలాగే మనిషికి లాభం చేకూర్చే విద్యలన్నీ కూడా ఈ ఖుర్ఆన్ లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రశ్నించవచ్చు, “మనిషికి లాభం చేకూర్చే విద్యలన్నీ ఖుర్ఆన్ లో ఉన్నాయని మీరు చెప్తున్నారు, సరే గానీ, సైన్స్ కూడా ఖుర్ఆన్ లో ఉందా?” అని మీరు ప్రశ్నించవచ్చు అభిమాన సోదరులారా. ఉంది. సైన్స్ కి సంబంధించిన విషయాలు కూడా ఖుర్ఆన్ లో ఉన్నాయి. వైద్యానికి సంబంధించిన విషయాలు కూడా ఖుర్ఆన్ లో ఉన్నాయి. ఆ విధంగా చూసుకునిపోతే చాలా విషయాలు ఖుర్ఆన్ లో ఉన్నాయి. గుర్తించాల్సిన అవసరం ఉంది. గుర్తించే వాళ్ళ అవసరం ఉంది. ఉన్నారా ఎవరైనా గుర్తించేవాళ్లు అని ఖుర్ఆన్ పిలుపునిస్తుంది, “రండి, నాలో ఉన్నాయి చాలా విషయాలు ఇమిడి ఉన్నాయి. ఎవరైనా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా, రండి చదివి అర్థం చేసుకోండి. గ్రహించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, రండి చదివి గ్రహించండి” అని ఖుర్ఆన్ పిలుపునిస్తుంది. గ్రహించాల్సిన అవసరం ఉంది అభిమాన సోదరులారా. మనిషికి మేలు చేసే విద్యలన్నీ ఈ ఖుర్ఆన్ గ్రంథంలో ఉన్నాయి. ఇది ఖుర్ఆన్ యొక్క గొప్పతనం.
పరలోకంలో ఖుర్ఆన్ ద్వారా కలిగే లాభాలు
అలాగే, పరలోకంలో కూడా ఈ ఖుర్ఆన్ గ్రంథము ద్వారా మనిషికి ఎంతో లబ్ధి జరుగుతుంది, లాభం జరుగుతుంది. అది కూడా ఇన్ షా అల్లాహ్ రెండు మూడు విషయాలు చెప్పేసి నా మాటను ముగిస్తాను, సమయం ఎక్కువ పోతుంది. పరలోకంలో మనిషికి ఖుర్ఆన్ ద్వారా ఎలాంటి లాభం వస్తుందంటే అభిమాన సోదరులారా, మరణించిన తర్వాత ముందుగా మనిషి ఎక్కడికి వెళ్తాడండి? సమాధి లోకానికి వెళ్తాడు. సమాధి లోకంలో వెళ్ళినప్పుడు ప్రతి మనిషికి అక్కడ ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో మూడు ప్రశ్నలు ఉంటాయి. మొదటి ప్రశ్న ఏమిటంటే నీ ప్రభువు ఎవరు? నీ ప్రవక్త ఎవరు? రెండవ ప్రశ్న. నీ ధర్మం ఏమిటి? మూడవ ప్రశ్న.
ఎవరైతే ప్రపంచంలో ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివి నా ప్రభువు అల్లాహ్ అని గ్రహించి ఉంటాడో, నా ధర్మము ఇస్లాం అని గ్రహించి ఉంటాడో, నా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ అని గ్రహించి ఉంటాడో, అతను ఆ సమాధి లోకంలో ఆ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పేస్తాడు. ఆ తర్వాత నాలుగవ ప్రశ్న రూపంలో దూతలు అతనికి ఏమని ప్రశ్నిస్తారంటే, “నీ ప్రభువు అల్లాహ్ అని, నీ ధర్మం ఇస్లాం అని, నీ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ అని నీకు ఎలా తెలిసింది?” అని నాలుగవ ప్రశ్న సమాధి లోకంలో దూతలు అడుగుతారు. అప్పుడు మనిషి అక్కడ అంటాడు, “నేను దైవ గ్రంథమైన ఖుర్ఆన్ ని చదివి ఈ విషయాలు తెలుసుకున్నాను, నమ్మాను, ఆ ప్రకారంగా నడుచుకున్నాను” అంటాడట. అప్పుడు దూతలు అతనికి శుభవార్త వినిపిస్తారట, “నీ జీవితం శుభము కలుగుగాక, నీ రాకడ నీకు శుభము కలుగుగాక. నీవు విశ్వసించింది వాస్తవమే, నువ్వు నడుచుకునింది కూడా వాస్తవమైన మార్గమే. ఇదిగో చూడు, నీకు త్వరలోనే లెక్కింపు జరిగిన తర్వాత స్వర్గంలో ఫలానా చోట నీవు సుఖంగా ఉంటావు, నీ గమ్యస్థానాన్ని నువ్వు చూచుకో” అని దూతలు అతనికి చూపించేస్తారట. అతను సంతోషపడిపోతాడు అభిమాన సోదరులారా.
చూశారా? సమాధి లోకంలో పరీక్షలో నెగ్గాలంటే ఈ ఖుర్ఆన్ గ్రంథము ఉపయోగపడుతుంది. అలాగే మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, సమాధిలో మనిషిని పూడ్చివేసిన తర్వాత దూతలు అతని తల వైపు నుంచి వస్తారట. దూతలు ఎప్పుడైతే అతని తల వైపు నుంచి వస్తారో, ఖుర్ఆన్ గ్రంథం వెళ్లి వారికి ఎదురుగా నిలబడి చెబుతుందట, “ఈ వ్యక్తి ప్రపంచంలో ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివిన వాడు కాబట్టి మీకు ఇక్కడ మార్గము లేదు వెనక్కి వెళ్లిపోండి” అని చెప్పేస్తుందట. అల్లాహు అక్బర్. చూశారా.
ఆ తర్వాత దూతలు అతని కుడి వైపు నుంచి వచ్చే ప్రయత్నం చేస్తారట. అప్పుడు మానవుడు ప్రపంచంలో చేసిన దానధర్మాలు అక్కడికి వచ్చి, “మీరు ఎక్కడికి వస్తూ ఉన్నది? ఈ భక్తుడు ప్రపంచంలో దానధర్మాలు చేసేవాడు కాబట్టి, మీకు ఇక్కడ మార్గము లేదు వెనక్కి వెళ్లిపోండి” అని దానధర్మాలు వచ్చి అక్కడ ఎదురు నిలబడిపోతాయి. ఆ తర్వాత దూతలు ఆ వ్యక్తి యొక్క కాళ్ళ వైపు నుంచి వచ్చే ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రపంచంలో అతను నమాజ్ చదవటానికి ఇంటి నుండి మస్జిద్ వరకు వస్తూ, వెళ్తూ, వస్తూ, వెళ్తూ ఉన్నాడు కదా, ఆ నడవడిక వచ్చి అక్కడ నిలబడిపోయి దూతలతో అంటుందట, “మీరు ఎక్కడికి వస్తున్నది? ఈ భక్తుడు ప్రపంచంలో ఈ కాళ్ళతోనే నడిచి నమాజ్ కు వెళ్లి నమాజ్ ఆచరించేవాడు కాబట్టి మీకు ఇక్కడ మార్గం లేదు, వెనక్కి వెళ్లిపోండి” అని చెప్పి ఎదురు నిలబడిపోతుందట. చూశారా అభిమాన సోదరులారా. సమాధి లోకంలో భక్తునికి ఉపయోగపడుతుంది ఈ ఖుర్ఆన్ గ్రంథం.
ఇక పరలోకంలో ఎప్పుడైతే యుగాంతం సంభవించిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలందరినీ మళ్లీ లేపి అక్కడ లెక్కింపు తీసుకుని ఉంటాడు కదా, దాన్ని హషర్ మైదానం అంటారు, పరలోకం అంటారు. ఆ పరలోకంలో లెక్కింపు జరిగేటప్పుడు కొంతమంది వ్యక్తులు ఆ లెక్కింపులో ఫెయిల్ అయిపోతారు. ఇరుక్కుపోతారు ప్రశ్న జవాబులు చెప్పలేక. అలాంటి స్థితిలో తల్లి గానీ, తండ్రి గానీ, స్నేహితుడు గానీ, సోదరి గానీ, భార్య గానీ, బిడ్డలు గానీ ఎవరూ ఆ రోజు వచ్చి ఆదుకునేవారు ఉండరు. అతను ఇరుక్కుపోతాడు లెక్కింపులో. కంగారుపడిపోతూ ఉంటే, ఖుర్ఆన్ గ్రంథం వస్తుంది అతనికి స్నేహితునిగా, ఆదుకునేవానిగా. ఆ ఖుర్ఆన్ గ్రంథం వచ్చి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో సిఫారసు చేస్తుంది. “ఓ అల్లాహ్, ఈ భక్తుడు ప్రపంచంలో ఖుర్ఆన్ చదివేవాడు కాబట్టి ఇతని విషయంలో నేను సిఫారసు చేస్తున్నాను. ఇతనిని మన్నించి నీవు స్వర్గానికి పంపించు” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ఈ ఖుర్ఆన్ గ్రంథము ఆ భక్తుని కోసం సిఫారసు చేస్తే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ ఖుర్ఆన్ యొక్క సిఫారసును అంగీకరించి ఆ భక్తునికి స్వర్గంలోకి పంపించేస్తాడట.
చూశారా అభిమాన సోదరులారా. ఎవరూ పనికిరాని ఆ రోజులో ఖుర్ఆన్ గ్రంథం మనిషికి, భక్తునికి పనికి వస్తుంది. ఎవరూ రక్షించలేని ఆ రోజులో ఖుర్ఆన్ గ్రంథం వచ్చి ఆ మనిషికి, ఆ భక్తునికి రక్షిస్తుంది. అంతటితోనే మాట పూర్తి కాలేదు అభిమాన సోదరులారా.
మరొక విషయం ఏమిటంటే, స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ భక్తునితో అంటారట, ఏమని అంటాడో తెలుసా? “ఓ భక్తుడా, నీవు ప్రపంచంలో ఎలాగైతే ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివేవాడివో, ఇక్కడ కూడా స్వర్గంలో ఖుర్ఆన్ గ్రంథాన్ని చదువుతూ ఈ స్వర్గం యొక్క స్థాయిల్ని నువ్వు ఎక్కుతూ వెళ్తూ ఉండు, ఎక్కుతూ వెళ్తూ ఉండు. ఎక్కడైతే నీ ఖుర్ఆన్ పారాయణం పూర్తి అవుతుందో అప్పటివరకు నువ్వు ఎంత పైకి ఎక్కగలవో ఎక్కు. అక్కడ, ఎక్కడైతే నీ ఖుర్ఆన్ పారాయణం ఆగిపోతుందో అదే నీ స్థానము” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రకటిస్తాడు. చూశారా. ఈ ఖుర్ఆన్ గ్రంథము రేపు స్వర్గంలో ఉన్నతమైన శిఖరాలకు చేరుస్తుంది. ఇది ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకత అభిమాన సోదరులారా.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇన్ షా అల్లాహ్ మరిన్ని విషయాలు వేరే జుమా ప్రసంగంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చివరిగా నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, “ఓ అల్లాహ్, ఖుర్ఆన్ గ్రంథం యొక్క ప్రత్యేకతలని అర్థం చేసుకుని ఖుర్ఆన్ గ్రంథాన్ని గౌరవిస్తూ, ఖుర్ఆన్ లో ఉన్న వాక్యాలని అర్థం చేసుకుంటూ చదివే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. అల్లాహ్, ప్రతిరోజు ఖుర్ఆన్ గ్రంథాన్ని పఠించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. ఓ అల్లాహ్, ఖుర్ఆన్ ద్వారా ప్రపంచంలో కూడా మాకు గౌరవాన్ని ప్రసాదించు, పరలోకంలో కూడా మాకు స్వర్గం ప్రసాదించు.” ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో ‘వసీలా’ (అల్లాహ్కు సామీప్యం పొందడానికి ఒక సాధనం) అనే ఇస్లామీయ భావన గురించి వివరించబడింది. ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం వసీలా యొక్క సరైన అవగాహనను, మరియు సాధారణ అపోహలను వక్త స్పష్టం చేశారు. వసీలా అంటే అల్లాహ్ యొక్క సామీప్యాన్ని ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా వెతకడం అని ఆయన వివరించారు. ఈ ప్రసంగం ఆరు రకాల “ధర్మ సమ్మతమైన వసీలా”పై దృష్టి పెట్టింది: 1. అల్లాహ్ యొక్క అందమైన పేర్లు మరియు గుణగణాల ద్వారా. 2. ఒకరి విశ్వాసం (ఈమాన్) మరియు సత్కార్యాల ద్వారా. 3. తౌహీద్ (ఏకేశ్వరోపాసన) ద్వారా. 4. అల్లాహ్కు తమ అవసరాన్ని మరియు నిస్సహాయతను వ్యక్తపరచడం ద్వారా. 5. అల్లాహ్ ముందు తమ పాపాలను ఒప్పుకోవడం ద్వారా. 6. జీవించి ఉన్న ఒక పుణ్యాత్ముడిని తమ కోసం అల్లాహ్తో ప్రార్థించమని (దుఆ) కోరడం ద్వారా. మరణించిన ప్రవక్తలు, పుణ్యాత్ములు లేదా వారి సమాధుల ద్వారా వసీలాను వెతకడం ధర్మసమ్మతం కాదని వక్త నొక్కి చెప్పారు.
اَلْحَمْدُ لِلّٰهِ وَحْدَهُ (అల్ హందులిల్లాహి వహ్ దహు) అన్ని పొగడ్తలు ఏకైకుడైన అల్లాహ్ కే.
وَ الصَّلَاةُ وَ السَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ (వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు) ఆయన తర్వాత ప్రవక్త ఎవరూ రారో, ఆయనపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమం లోకి మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం.
أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహ్ మతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం అల్లాహ్ ను వేడుకోవటానికి ఎవరి సహాయమైనా అవసరమా? అంటే మధ్యవర్తి అవసరమా? అల్లాహ్ ను దుఆ చేయటానికి, అర్థించటానికి, వేడుకోవటానికి లేదా మా దుఆలు స్వీకరింపబడటానికి మధ్యవర్తి అవసరమా? ఒకరి సహాయం అవసరమా? వసీలా అవసరమా? అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో వసీలా గురించి తెలియజేశాడు, కాకపోతే మన సమాజంలో ఒక వర్గం దానికి తప్పుడు అర్థం తీసుకుంటుంది. సహాబాలు, తాబయీన్లు, సజ్జనులు, పూర్వీకులు, ధర్మ పండితులు, ముహద్దసీన్లు, అయిమ్మాలు (ఇమాములు) తీసుకోలేని అర్థం వీళ్ళు తీసుకుంటున్నారు. దాని వాస్తవం ఏమిటి? ఇన్ షా అల్లాహ్ ఆధారంగా, ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ఆధారంగా తెలుసుకుందాం.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర మాయిదా, ఆయత్ 35 లో ఇలా తెలియజేశాడు:
وَابْتَغُوا إِلَيْهِ الْوَسِيلَةَ (వబ్తగూ ఇలైహిల్ వసీల) ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. (5:35)
ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి అని అల్లాహ్ తెలియజేశాడు. ఈ ఆయత్ లో వసీలా అనే పదం ఉంది.
వసీలా అంటే ఏమిటి?
అసలు వసీలా అంటే అర్థం ఏమిటి? వసీలా అంటే ఏదేని ఆశయాన్ని సాధించటానికి, సామీప్యం పొందటానికి అవలంబించబడే మార్గం లేక సాధనం. ఇది వసీలా యొక్క అర్థం. సింపుల్ గా చెప్పాలంటే, అల్లాహ్ సామీప్యం కొరకు సృష్టితాలను సాధనంగా చేసుకోవటం.
అభిమాన సోదరులారా! అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి అంటే ఆయనకు దగ్గర చేర్చే సత్కార్యాలను చేయమని అర్థం. కానీ కొంతమంది అసలు ఈ వసీలాను వదిలేసి, ఖురాన్ లో ఏ వసీలా గురించి చెప్పడం జరిగిందో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ వసీలా గురించి చెప్పారో, దాని నిజమైన అర్థం ఏమిటి, వాస్తవమైన భావం ఏమిటి అది పక్కన పెట్టి, దర్గా, సమాధులను, పుణ్య పురుషులను, ప్రవక్తలను, దైవదూతలను, ఔలియాలను, చనిపోయిన వారిని సాధనంగా చేసుకుంటున్నారు. ఇది ముమ్మాటికీ ఖురాన్ కి, హదీసులకు లకు విరుద్ధం.
వసీలా రకాలు
అభిమాన సోదరులారా! ఇక, వసీలా రెండు రకాలు. ధర్మ సమ్మతమైన వసీలా, అధర్మమైన వసీలా.
ఈరోజు మనం ధర్మ సమ్మతమైన వసీలా గురించి తెలుసుకుందాం. ఏ వసీలా సమ్మతంగా ఉందో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి తెలియజేశారో, ధర్మ సమ్మతమైన వసీలా ఏమిటి ఈరోజు మనము తెలుసుకుందాం, ఇన్ షా అల్లాహ్.
ధర్మ సమ్మతమైన వసీలా
ధర్మ సమ్మతమైన వసీలాలో ఒకటి, గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం.
وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا (వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా) అల్లాహ్ కు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. (7:180)
మొదటి ధర్మ సమ్మతమైన వసీలా ఏమిటి? అల్లాహ్ నామాలను, గుణగణాలను సాధనంగా చేసుకోవటం. అల్లాహ్ నామాన్ని, అల్లాహ్ గుణాలను వసీలాగా తీసుకోవటం. ఇది సూర ఆరాఫ్ ఆయత్ నంబర్ 180. వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా – అల్లాహ్ కు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. ఇది గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం, అంటే దుఆ చేసేటప్పుడు, వేడుకునేటప్పుడు, ప్రార్థించేటప్పుడు అల్లాహ్ నామాల ద్వారా, అల్లాహ్ గుణ విశేషణాల ద్వారా వేడుకోవటం, అల్లాహ్ యొక్క నామాలను, అల్లాహ్ యొక్క గుణాలను సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం. ఇది మొదటి విషయం.
ఆ తర్వాత రెండవది, విశ్వాసం మరియు సత్కర్మలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేయటం. విశ్వాసాన్ని, సత్కర్మలను. దీనికి ఉదాహరణ, బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఒక పేరు పొందిన ఒక హదీస్ ఉంది, ఫేమస్ హదీస్, గుహ వారి హదీస్. దీనికి ఒక ప్రబల తార్కాణం. ఆ వివరంగా ఉంది హదీస్, నేను కేవలం దాంట్లో యొక్క సారాంశం మాత్రమే చెప్తున్నాను.
ఆ ముగ్గురు వ్యక్తులు, బనీ ఇస్రాయీల్ లో, గుహలో తల దాచుకున్నారు. గాలుల మూలంగా, వర్షాల మూలంగా కొండరాయి విరిగి ఆ గుహ ముఖాన్ని మూసేసింది. ఆ ముగ్గురు వ్యక్తులు గుహ లోపల ఉండిపోయారు. బయటికి రావాలంటే కొండరాయి వచ్చి పడిపోయింది, ఆ ముఖ ద్వారం బంద్ అయిపోయింది. ఆ ముగ్గురు వ్యక్తులు బయటికి రాలేరు, శబ్దం బయటికి రాదు, అది ఊరు కాదు, ఎవరో సహాయం చేసే వారు ఎవరూ లేరు, మాట వినే వారు ఎవరూ లేరు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏదో ఒక దారి చూపిస్తే తప్ప వారికి వేరే మార్గమే లేదు. అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు ఏం చేశారు? ఆ ముగ్గురు తమ తమ జీవితంలో చేసుకొన్న సత్కర్మలను ఆధారంగా చేసుకుని దుఆ చేశారు. ఒక వ్యక్తి అయితే తమ అమ్మ నాన్నల పట్ల ఏ విధంగా వ్యవహరించాడో అది సాధనంగా చేసుకున్నాడు, అమ్మ నాన్నల పట్ల సత్ప్రవర్తన గురించి. ఇంకో వ్యక్తి దానధర్మాల గురించి, ఇంకో వ్యక్తి వేరే విషయం గురించి, ఆ ముగ్గురు వ్యక్తులు తమ తమ సత్కర్మలను, చేసుకొన్న పుణ్యాలను సాధనంగా చేసుకొని, ఆధారంగా చేసుకొని అల్లాహ్ ను వారు దుఆ చేశారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి దుఆలను ఆలకించి, వారి ప్రార్థన స్వీకరించి, వారికి ఆ బండరాయిని తప్పించి, కొండరాయిని తప్పించారు. వారు ముగ్గురు అల్హందులిల్లాహ్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అంటే దీంతో ఏం అర్థం అవుతుంది? విశ్వాసం మరియు సత్కర్మలను సాధనంగా, వసీలాగా చేసి వేడుకోవచ్చు. ఇది రెండో విషయం.
మూడో విషయము, అల్లాహ్ సన్నిధిలో ఆయన “తౌహీద్ ను ఆశ్రయించటం. అల్లాహ్ యొక్క తౌహీద్ ను ఆశ్రయించి దుఆ చేయటం, తౌహీద్ ను వసీలాగా చేసుకోవటం. ఇది యూనుస్ అలైహిస్సలాం ఇలా దుఆ చేశారు. సూర అంబియా ఆయత్ 21:87:
فَنَادَىٰ فِي الظُّلُمَاتِ أَن لَّا إِلَٰهَ إِلَّا أَنتَ سُبْحَانَكَ (ఫనాదా ఫిజ్జులుమాతి అల్ లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక) అతను చీకట్లలో నుంచి, “అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు.” అని మొరపెట్టు కున్నాడు(21:87)
ఇది యూనుస్ అలైహిస్సలాం చేప కడుపులో చేసిన దుఆ ఇది. చీకట్లో, కటిక చీకట్లో, సముద్రం చీకటి, మళ్లా చేప కడుపు, ఆ చీకటి. కటిక చీకట్లో యూనుస్ అలైహిస్సలాం చేసిన దుఆ ఇది. చీకట్లో ఇలా మొరపెట్టుకున్నారు: “ఓ అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు.” లా ఇలాహ ఇల్లా అంత – తౌహీద్ ని ఆశ్రయించారు. లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక – “నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీవు పవిత్రుడవు.” అంటే మూడో విషయం, అల్లాహ్ సన్నిధిలో ఆయన తౌహీద్ ని, ఏకత్వాన్ని ఆశ్రయించి దుఆ చేయటం.
నాలుగో విషయం, అల్లాహ్ వైపు మరలి తన అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వ్యక్తపరచి దానిని సాధనంగా చేసుకోవటం. అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వసీలాగా చేసుకొని అల్లాహ్ ను అడగటం, వేడుకోవటం. ఇది అయ్యూబ్ అలైహిస్సలాం చేసిన దుఆ. ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు, దాదాపు 18 సంవత్సరాలు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఎంత ఆయన సహనం, ఓర్పు, ఆయనకు వచ్చిన పరీక్ష. అభిమాన సోదరులారా! అయ్యూబ్ అలైహిస్సలాం అనారోగ్యానికి గురైనప్పుడు, ఆ ఆయన యొక్క నిస్సహాయ స్థితిని ఆయన వసీలాగా చేసుకొని అల్లాహ్ కు ప్రార్థించారు, వేడుకున్నారు. అయ్యూబ్ అలైహిస్సలాం చేసిన దుఆ ఏమిటి? సూర అంబియా ఆయత్ 83:
أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ (అన్నీ మస్సనియద్దుర్రు వ అంత అర్హముర్రాహిమీన్) “నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకీ అపారంగా కరుణించేవాడవు” (21:83)
అని దుఆ చేసుకున్నారు, వేడుకున్నారు. అంటే తన నిస్సహాయ స్థితిని సాధనంగా చేసుకున్నారు.
అభిమాన సోదరులారా, అలాగే ఐదవది, తమ పాపాలను అంగీకరిస్తూ దైవ సన్నిధిలో వాటిని సాధనంగా చేసుకోవటం, పాపాలను అంగీకరిస్తూ, ఒప్పుకుంటూ దానికి సాధనంగా చేసుకుని వేడుకోవటం. ఇది మూసా అలైహిస్సలాం దుఆ చేశారు. సూర ఖసస్, ఆయత్ 16లో:
قَالَ رَبِّ إِنِّي ظَلَمْتُ نَفْسِي فَاغْفِرْ لِي (ఖాల రబ్బీ ఇన్నీ జలంతు నఫ్సీ ఫగ్ ఫిర్లీ) “నా ప్రభూ! నాకు నేనే అన్యాయం చేసుకున్నాను. కనుక నన్ను క్షమించు.” (28:16)
అభిమాన సోదరులారా, ఇది ఐదవది.
ఆరవది ఏమిటంటే, ఇది చాలా గమనించి వినాలి, అపార్థం చేసుకోకూడదు. ఆరవది, బ్రతికి ఉన్న సత్పురుషుల దుఆలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం. పరమపదించిన ఔలియాలు, పరమపదించిన ప్రవక్తలు, పరమపదించిన సత్పురుషులు కాదు. బ్రతికి ఉన్న సత్పురుషుల దుఆలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం.
దీనికి ఉదాహరణ ఏమిటి? సహాబాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో వెళ్లి ఇలా రిక్వెస్ట్ చేసుకునేవారు, విన్నవించుకునేవారు: “ఓ దైవప్రవక్త, వర్షం లేదు, కరువు వచ్చేసింది, మీరు దుఆ చేయండి.” అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు, అల్లాహ్ దుఆ స్వీకరించేవాడు, వర్షం వచ్చేది.
అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత – ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది – అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత సహాబాలు, మరి అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను వసీలాగా చేసుకోవచ్చు కదా? లేకపోతే ఆయన సమాధి వారి దగ్గరే ఉంది కదా? మస్జిద్ లోనే, పక్కనే ఉంది కదా? మదీనాలోనే ఉంది కదా? ఆ సమాధి దగ్గరికి పోయి వసీలాగా అడగవచ్చు కదా? లేదు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, సహాబాలు ఆయన పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు దగ్గరికి పోయి దుఆ చేయమని కోరేవారు. ఇది చాలా గమనించే విషయం. సహాబాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, ప్రవక్త గారి పేరుతో వసీలాగా దుఆ చేయలేదు. ప్రవక్త గారి యొక్క సమాధి దగ్గరికి పోయి వసీలాగా చేసుకోలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత కాలం, ప్రవక్త గారితో దుఆ చేయించేవారు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, సహాబాలు ఆయన పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు బ్రతికి ఉన్నారు కాబట్టి, ఆయన దగ్గరికి పోయి దుఆ చేయమని వేడుకునేవారు, అడిగేవారు, రిక్వెస్ట్ చేసుకునేవారు.
కావున, ఇవి నేను చెప్పిన ఆరు రకాలు, ఇవి మాత్రమే ధర్మ సమ్మతమైన వసీలా.
మొదటిది ఏమిటి? అల్లాహ్ యొక్క నామాలను, గుణాలను వసీలాగా చేసుకోవటం.
రెండవది, విశ్వాసం మరియు సత్కర్మలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం.
మూడవది, అల్లాహ్ సన్నిధిలో అల్లాహ్ యొక్క తౌహీద్ ను ఆశ్రయించటం.
నాలుగవది, అల్లాహ్ వైపు మరలి అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వ్యక్తపరచి దానిని సాధనంగా చేసుకోవటం.
ఐదవది, తమ పాపాలను అంగీకరిస్తూ దైవ సన్నిధిలో వాటిని సాధనంగా చేసుకోవటం.
ఆరవది, బ్రతికి ఉన్న సత్పురుషులు, పుణ్యాత్ముల దగ్గరికి పోయి దుఆ చేయమని కోరటం. వారు కూడా దుఆ చేస్తారు.
ఈ విధంగా, ఇవి తప్ప ఇంకా ఇతర రకమైన వసీలా ధర్మ సమ్మతం కాదు. అది ధర్మ సమ్మతం కాని వసీలా, అధర్మమైన వసీలా. అది ఏమిటో, ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (వ ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) మా ఆఖరి ప్రార్థన ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు.
وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (వస్సలాము అలైకుమ్ వ రహ్ మతుల్లాహి వ బరకాతుహు) మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.