ఇస్లాంలో మస్జిదుల స్థానం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో , టెక్స్ట్ ]

ఇస్లాం లో మస్జిదుల స్థానం
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=gNBBOGOFaVM [26 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో మస్జిద్ (మసీదు) యొక్క ఉన్నతమైన స్థానం మరియు ప్రాముఖ్యత గురించి వివరించబడింది. మస్జిద్ కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదని, అది విశ్వాసం, శాంతి, ఐక్యత మరియు విద్యకు కేంద్రమని వక్త నొక్కిచెప్పారు. మస్జిద్ లు ఇస్లామీయ కోటలని, అక్కడి నుండే ఇస్లాం వెలుగు ప్రపంచమంతటా వ్యాపించిందని తెలిపారు. ప్రవక్త ముహమ్మద్ (స) కాలంలో, సహాబాలు మస్జిద్ ను ఒక విశ్వవిద్యాలయంగా, శిక్షణా కేంద్రంగా ఎలా ఉపయోగించుకున్నారో ఉదాహరణలతో వివరించారు. అబూ హురైరా (ర) వంటి సహాబాలు మస్జిద్ లోనే ఉంటూ జ్ఞానాన్ని ఎలా సంపాదించారో పేర్కొన్నారు. మస్జిద్ లను నిర్మించడం, వాటిని ఆబాద్ (సజీవంగా) చేయడం, మరియు వాటి పట్ల గౌరవం చూపడం యొక్క పుణ్యఫలాలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో విశదీకరించారు. చివరగా, మస్జిద్ లో ప్రవేశించేటప్పుడు, ఉన్నప్పుడు మరియు బయటకు వెళ్ళేటప్పుడు పాటించవలసిన నియమాలు, మర్యాదల గురించి ప్రస్తావించారు.


مَنْ يَهْدِهِ اللهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ
[మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహూ వమన్ యుద్లిల్ ఫలా హాదియ లహూ]
ఎవరికైతే అల్లాహ్ మార్గదర్శకత్వం చూపాడో అతన్ని ఎవరూ త్రోవ తప్పించలేరు. మరియు ఎవరినైతే అల్లాహ్ త్రోవ తప్పించాడో అతనికి ఎవరూ మార్గదర్శకత్వం చూపలేరు.

وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ
[వ అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ]
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు. ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు.

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
[వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ]
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త.

أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللهِ وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ
[అమ్మా బ’అదు ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహి వ ఖైరల్ హద్యి హద్యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం]
ఇక విషయానికొస్తే, నిశ్చయంగా అన్ని మాటలలో ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం. మరియు అన్ని మార్గాలలో ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం.

وَشَرَّ الْأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ وَكُلَّ ضَلَالَةٍ فِي النَّارِ
[వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా వ కుల్ల ముహ్దసతిన్ బిద్’అతున్ వ కుల్ల బిద్’అతిన్ దలాలతున్ వ కుల్ల దలాలతిన్ ఫిన్నార్]
మరియు అన్ని విషయాలలో చెడ్డవి కొత్తగా కల్పించబడినవి. మరియు ప్రతీ కొత్తగా కల్పించబడినది బిద్’అత్. మరియు ప్రతీ బిద్’అత్ మార్గభ్రష్టత్వం. మరియు ప్రతీ మార్గభ్రష్టత్వం నరకానికి దారితీస్తుంది.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడతలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయు గాక.

అభిమాన సోదరులారా, ఈరోజు మనం ఇన్షా అల్లాహ్, ఇస్లాంలో మస్జిదుల స్థానం అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మస్జిద్ అంటే సజ్దా చేసే చోటు అని అర్థం. ప్రత్యేకంగా అల్లాహ్ ఆరాధన కోసం నిర్మించబడిన ఆలయాన్ని మస్జిద్ అంటారు.

మస్జిద్ కి గౌరవప్రదమైన, ఉన్నతమైన, పవిత్రమైన స్థానం ఉంది. ఇది ఈమాన్ మరియు శాంతికి మూలం. ప్రార్థనలు జరుపుకునే ప్రదేశం. ఇక్కడ ప్రార్థనలు స్వీకరించబడతాయి. ఉమ్మతి యొక్క ఐక్యతకు ఇదొక శీర్షిక. హిదాయత్, మంచితనం, స్థిరత్వానికి చిహ్నం. శాస్త్రీయపరమైన, ఆచరణాత్మకమైన, ఆధ్యాత్మికమైన గృహం మస్జిద్.

ఇది ధృడమైన శిక్షణా కేంద్రం. ఈ కేంద్రం నుంచే ఏమీ తెలియని ప్రజలు, గొర్రెలు మేపే సహాబాలు, ప్రపంచ ప్రతినిధులుగా తయారయ్యారు. దీని ఆధారంగానే రాగ ద్వేషాలలో రగిలే ప్రజలు ప్రేమానురాగాలకు ప్రతిరూపాలయ్యారు. ఈ కేంద్రం నుంచే సహాబాలు ఆ తరువాత వారు దీన్, దునియా, పరలోకం యొక్క శాస్త్రాలలో అత్యంత ప్రముఖులు, పట్టభద్రులయ్యారు.

ఇదొక పాఠశాల. దీనిలో విశ్వాసాల శిక్షణ జరుగుతుంది. హృదయాలు ఆధ్యాత్మికంగా శుద్ధి చేయబడతాయి. గొప్ప నాయకులు తయారవుతారు. ఇది ఒక న్యాయ వ్యవస్థ మరియు ఫత్వాలను జారీ చేసే ఓ మండలి. ఆశ్రయం లేని వారికి ఇదొక ఆశ్రయం. దాని మిహరాబు నుంచి అల్లాహ్ యొక్క స్పష్టమైన ఆయతులు పఠించబడతాయి. దీని మింబర్ నుంచి ప్రభావంతమైన ఖుత్బాలు, ఉపన్యాసాలు ఇవ్వబడతాయి.

మస్జిద్ అంటే కేవలం ఆరాధన ఆలయం మాత్రమే కాదు. వాస్తవానికి, మస్జిదులు ఇస్లామీయ కోటలు, ఇస్లాం ధర్మం కేంద్రాలు. ఇక్కడి నుండే ఇస్లాం వెలుగు ప్రపంచంలోని నలుదిశలూ వ్యాపించి విశ్వాన్నంతటినీ జ్యోతిర్మయం చేస్తుంది. ఈ మస్జిద్ల నుంచే సరైన ఇస్లామీయ బోధనలు జనబాహుళ్యంలో ప్రచారం చెందుతాయి. స్వచ్ఛమైన ఏక దైవోపాసనకు ప్రాచుర్యం లభిస్తుంది.

అభిమాన సోదరులారా, ఇక్కడ ముస్లింలందరూ తమ తమ భేదాలన్నీ కట్టిపెట్టి పాలు నీళ్ళల్లా కలిసిపోతారు. అల్పుడు, అధికుడు, పేదవాడు, ధనికుడు, అరబ్బుడు, అరబ్బేతరుడు, నల్లవాడు, తెల్లవాడు అనే భేద భావాలన్నీ మరచి ఒకే వరుసలో నిలుచుంటారు. అటువంటి స్థలం, కేంద్రం మస్జిద్.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, “మీరు ఒక వ్యక్తిని మస్జిద్ కు వస్తూ పోతూ ఉండగా చూస్తే అతని విశ్వాసం గురించి సాక్ష్యం ఇవ్వండి” అన్నారు. ఇది మస్జిద్ యొక్క మహత్యం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో మస్జిద్ గురించి ఏమన్నాడు?

فِي بُيُوتٍ أَذِنَ اللَّهُ أَن تُرْفَعَ وَيُذْكَرَ فِيهَا اسْمُهُ يُسَبِّحُ لَهُ فِيهَا بِالْغُدُوِّ وَالْآصَالِ
(ఏ గృహాల గౌరవ ప్రతిపత్తిని పెంచాలని, మరి వేటిలో తన నామస్మరణ చేయాలని అల్లాహ్‌ ఆజ్ఞాపించాడో వాటిలో ఉదయం సాయంత్రం అల్లాహ్‌ పవిత్రతను కొనియాడుతుంటారు, (24:36)

ఇక్కడ గృహాలు అంటే మస్జిద్. అంటే అర్థమేమిటి? విశ్వాసులు, అల్లాహ్ విధేయులు ఉదయం సాయంత్రం మస్జిదులలో అల్లాహ్ ప్రీతి కోసం నమాజులు చేస్తారు, కడు దీనంగా అల్లాహ్ ను వేడుకుంటారు.

అలాగే,

رِجَالٌ لَّا تُلْهِيهِمْ تِجَارَةٌ وَلَا بَيْعٌ عَن ذِكْرِ اللَّهِ وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ ۙ يَخَافُونَ يَوْمًا تَتَقَلَّبُ فِيهِ الْقُلُوبُ وَالْأَبْصَارُ
(కొందరు) పురుషులు. వర్తకంగానీ, క్రయవిక్రయాలుగానీ అల్లాహ్‌ నామస్మరణ, నమాజు స్థాపన, జకాత్‌ చెల్లింపు విషయంలో వారిని పరధ్యానానికి లోను చేయలేవు. ఏ రోజున హృదయాలు తలక్రిందులై, కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడుతూ ఉంటారు.(24:37)

ఈ ఆయత్ యొక్క అర్థాన్ని మనం గమనించాలి. కొంతమంది ఎలా ఉంటారు? వారిని వారి వర్తకం గానీ, వ్యాపారం, క్రయ విక్రయాలు గానీ అల్లాహ్ నామ స్మరణ, నమాజు స్థాపన, జకాత్ చెల్లింపు విషయంలో పరధ్యానానికి లోను చేయలేవు. అంటే మనిషి చేసే వ్యాపారాలు, క్రయ విక్రయాలు, ఉద్యోగాలు అతని జీవితంలో వస్తూ పోయే సమస్యలు, బాధ్యతలు ఇవన్నీ ఆ విశ్వాసిని, ఆ వ్యక్తుల్ని మస్జిద్ కి పోయి జమాత్ తో నమాజ్ చేయటం లేదా జిక్ర్ చేయటం, అల్లాహ్ ను ఆరాధించటం, జకాత్ ఇవ్వటం వీటిని వారి జీవన సమస్యలు ఆపలేవు. ఎందుకు? ఏ రోజున హృదయాలు తలక్రిందులై కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడతారు. అంటే ప్రళయం గురించి, అల్లాహ్ శిక్ష గురించి వారు భయపడతారు.

لِيَجْزِيَهُمُ اللَّهُ أَحْسَنَ مَا عَمِلُوا وَيَزِيدَهُم مِّن فَضْلِهِ ۗ وَاللَّهُ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ
తమ సత్కార్యాలకు అల్లాహ్‌ ఉత్తమ ప్రతిఫలం ఇవ్వటానికి, అల్లాహ్‌ తన కృపతో మరింత అధికంగా వొసగటానికి (వారు ఈ విధంగా మసలుకుంటారు). అల్లాహ్‌ తాను తలచిన వారికి లెక్క లేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు.(24:38)

అభిమాన సోదరులారా, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ గురించి ఇంకా ఇలా సెలవిచ్చారు,

وَمَا اجْتَمَعَ قَوْمٌ فِي بَيْتٍ مِنْ بُيُوتِ اللهِ يَتْلُونَ كِتَابَ اللهِ وَيَتَدَارَسُونَهُ بَيْنَهُمْ إِلاَّ نَزَلَتْ عَلَيْهِمُ السَّكِينَةُ وَغَشِيَتْهُمُ الرَّحْمَةُ وَحَفَّتْهُمُ الْمَلاَئِكَةُ وَذَكَرَهُمُ اللهُ فِيمَنْ عِنْدَهُ
[వ మజ్ తమ’అ ఖౌమున్ ఫీ బైతిన్ మిన్ బుయూతిల్లాహ్, యత్లూన కితాబల్లాహ్, వ యతదారసూనహూ బైనహుమ్, ఇల్లా నజలత్ అలైహిముస్ సకీనతు, వ గషియతుహుముర్ రహ్మతు, వ హఫ్ఫత్ హుముల్ మలాఇకతు, వ దకరహుముల్లాహు ఫీమన్ ఇందహ్]

అల్లాహ్ గృహాలలోని ఏదైనా ఒక గృహంలో కొంతమంది గుమికూడి దైవ గ్రంథాన్ని పారాయణం చేస్తూ, దాని గురించి పరస్పరం చర్చించుకుంటూ ఉంటే, అల్లాహ్ తరపున నుండి వారి మీద ప్రశాంతత, సకీనత్, ఆవరిస్తుంది. అలాగే రహ్మత్, దైవ కారుణ్యం వారిని కమ్ముకుంటుంది. అలాగే దైవదూతలు వారిని చుట్టుముడతారు. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన ఆస్థానములోని అంటే దైవదూతల మధ్య వారిని పరిచయం చేస్తాడు” (ముస్లిం)

ఇది ఎవరైతే మస్జిద్ లో ఖురాన్ పఠిస్తారో, ఖురాన్ నేర్చుకుంటారో, ఖురాన్ గురించి చర్చించుకుంటారో, దీన్ గురించి నేర్చుకుంటారో, నేర్పుతారో అటువంటి వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గొప్ప ప్రతిఫలం ఇస్తున్నాడు. ఈ ఆయత్ లో నాలుగు విషయాలు ఉన్నాయి. ఒకటి వారి జీవితాలలో వారికి ప్రశాంతత. ఇది డబ్బుతో కొనలేము. ప్రశాంతత ఇది విలువైన, గొప్ప వరం ఇది. రెండవది ఏమిటి? కారుణ్యం. అల్లాహ్ కరుణ లేకపోతే మన జీవితం దుర్భరమైపోతుంది. ఇహము పోతుంది పరము పోతుంది. మూడవది ఏమిటి? దైవదూతలు ప్రేమిస్తారు. నాలుగవది ఏమిటి? సకల లోకాలకు సృష్టికర్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రబ్బుల్ ఆలమీన్ ఆయన దైవ దూతల మధ్య వారి పరిచయం చేస్తాడు. ఎంత అదృష్టవంతులు వారు.

ఇంకా అల్లాహ్ యే ఇలా సెలవిచ్చాడు, మస్జిద్ లను ఆబాద్ చేయాలి. అంటే మస్జిద్ లు ఆబాద్ చేయటం అంటే ఏమిటి? మస్జిద్ లు నిర్మించాలి. య’అముర్ అంటే మస్జిద్ ను ఆబాద్ చేయటం, మస్జిద్ ని నిర్మించటం. దానికి అసలు అర్థం ఏమిటి స్వయంగా అల్లాహ్ సెలవిచ్చాడు.

إِنَّمَا يَعْمُرُ مَسَاجِدَ اللَّهِ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَلَمْ يَخْشَ إِلَّا اللَّهَ ۖ فَعَسَىٰ أُولَٰئِكَ أَن يَكُونُوا مِنَ الْمُهْتَدِينَ
అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ విశ్వసిస్తూ, నమాజులను నెలకొల్పుతూ, జకాత్‌ను విధిగా చెల్లిస్తూ, అల్లాహ్‌కు తప్ప వేరొకరికి భయపడనివారు మాత్రమే అల్లాహ్‌ మస్జిదుల నిర్వహణకు తగినవారు. సన్మార్గ భాగ్యం పొందినవారు వీరేనని ఆశించవచ్చు.(9:18)

అంటే మస్జిదుల నిర్వహణకి తగిన వారు, మస్జిదులను ఆబాద్ చేసే వారు ఎవరు? ఈ గుణాలు అల్లాహ్ సెలవిచ్చాడు. అంటే సన్మార్గ భాగ్యం పొందిన వారు కూడా వీళ్ళే అని అల్లాహ్ అంటున్నాడు. అంటే ఈ ఆయత్ లో మస్జిదులను ఆబాద్ చేసే వారి గుణాలు అల్లాహ్ తెలియజేశాడు.

మొదటి గుణం ఏమిటి? వారు అల్లాహ్ ను విశ్వసిస్తారు. అల్లాహ్ పట్ల దృఢమైన, నిజమైన, వాస్తవమైన విశ్వాసం కలిగి ఉంటారు. రెండవది ఏమిటి? వారు అంతిమ దినాన్ని విశ్వసిస్తారు. ఒక రోజు నేను చనిపోవాల్సిందే, ఈ ప్రపంచం అంతం అవ్వాల్సిందే, చనిపోయిన తరువాత అల్లాహ్ కు లెక్క చూపించాల్సిందే, లెక్కల గడియ వస్తుంది, తీర్పు దినం వస్తుంది, ఆ అంతిమ దినం పట్ల విశ్వసిస్తాడు రెండవది. మూడవది ఏమిటి? నమాజులు చేస్తారు, నమాజులు పాటిస్తారు. నాలుగోది జకాత్ విధిగా చెల్లిస్తారు. ఐదవది ఏమిటి? అల్లాహ్ కు మాత్రమే భయపడతారు. ఇది గమనించాల్సిన విషయం ఇది. జీవితం, ప్రాపంచిక జీవితం యొక్క ప్రేమలో పడిపోయి చాలామంది అల్లాహ్ కు తప్ప ప్రతి ఒక్కరితో భయపడుతున్నారు. మనలో చాలా మంది జీవితం ఇలా అయిపోయింది ప్రతిదానికి భయపడటం అల్లాహ్ కు తప్ప. అల్లాహ్ ఏమంటున్నాడు? అల్లాహ్ కు మాత్రమే భయపడండి, వేరే వారితో భయపడకండి. మస్జిద్ ను ఆబాద్ చేసేవారు ఎవరు? నాలుగవ వారు అల్లాహ్ ను మాత్రమే భయపడతారు. వ లమ్ యఖ్ష ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప ఎవ్వరికీ భయపడరు.

ఈ గుణాలు కలిగిన వారికి అల్లాహ్ ఏమంటున్నాడు? య’అమురు మసాజిదల్లాహ్. వీళ్లే మసాజిద్ లను ఆబాద్ చేసేవారు, నిర్వహణకు తగిన వారు. ఇంకా చివరి వాక్యంలో అల్లాహ్ ఏమన్నాడు? ఫ’అసా ఉలాఇక అన్ యకూనూ మినల్ ముహ్తదీన్. సన్మార్గ భాగ్యం, హిదాయత్ ప్రసాదించబడిన వారు వీరేనని ఆశించవచ్చు. ఇది అసలైన అర్థం మస్జిదులను ఆబాద్ చేయటం అంటే.

ఇక అభిమాన సోదరులారా, ఇప్పుడు వరకు మనం మస్జిద్ గురించి, మస్జిద్ స్థానం గురించి, మస్జిద్ నిర్వహణ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మన జీవన విధానం అలా ఉందా? మస్జిదుల విషయంలో. మస్జిదులు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాయి? వాస్తవంగా మస్జిదులను మనం ఆబాద్ చేస్తున్నామా? మస్జిదులకు సంబంధించిన ఆదాబులు పాటిస్తున్నామా? మస్జిదుల హక్కులు పూర్తి చేస్తున్నామా? మనలోని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

ను వేరే విషయానికి వస్తున్నాను, మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు,

مَنْ بَنَى مَسْجِدًا لِلَّهِ بَنَى اللَّهُ لَهُ فِي الْجَنَّةِ مِثْلَهُ
“మన్ బనా లిల్లాహి మస్జిదన్, బనల్లాహు లహూ బైతన్ ఫిల్ జన్నహ్.”
ఎవరైనా అల్లాహ్ కోసం మస్జిద్ ను నిర్మిస్తే, అల్లాహ్ అతని కోసం స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు.

ఇక్కడ ఒక ప్రశ్న మనసులో రావచ్చు, ప్రతి ఒక్కరికీ ఒక మస్జిద్ నిర్మించే స్తోమత ఉంటుందా? ఆర్థికపరంగా. ఇన్నమల్ అ’అమాలు బిన్నియ్యాత్. కర్మల పరంగా అల్లాహ్ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. కర్మలు సంకల్పాలపై ఆధారపడి ఉన్నాయి. అందుకు ప్రతి వ్యక్తికి ఈ స్తోమత ఉండదు. కానీ ప్రతి వ్యక్తి మస్జిద్ నిర్మాణంలో పాలు పంచుకొనవచ్చు, తన శక్తి ప్రకారం.

అలాగే, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

أَحَبُّ الْبِلَادِ إِلَى اللَّهِ مَسَاجِدُهَا، وَأَبْغَضُ الْبِلَادِ إِلَى اللَّهِ أَسْوَاقُهَا
“అహబ్బుల్ బిలాది ఇలల్లాహి మసాజిదుహా వ అబ్గదుల్ బిలాది ఇలల్లాహి అస్వాకుహా.”
అల్లాహ్ దృష్టిలో అన్ని చోట్లలలో కెల్లా అత్యంత ప్రీతికరమైన, శ్రేయస్కరమైన చోటు మస్జిద్. అలాగే అల్లాహ్ దృష్టిలో అన్ని చోట్లలలో కెల్లా అత్యంత హానికరమైన చోటు బజారు

ఈ హదీస్ మనం మనసులో ఉంచుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు మన మస్జిదులు అలా ఉన్నాయా? అత్యంత శ్రేష్టకరమైన, పవిత్రమైన, ప్రీతికరమైన ఉన్నాయా? అల్లాహ్ దృష్టిలో ఉంది, అల్లాహ్ అంటున్నాడు అన్నిటికంటే శ్రేష్టమైన, శ్రేయస్కరమైన, ప్రీతికరమైన, పవిత్రమైన చోటు, స్థలం, కేంద్రం మస్జిద్ అని. కానీ ఇప్పుడు మన మస్జిదులు గీబత్ కి కేంద్రం, చాడీలకి కేంద్రం, ఖియానత్ కి కేంద్రం, లావాదేవీలకి కేంద్రం, రాజకీయాలకు కేంద్రం, ఇలా మారిపోయినాయి. కానీ అత్యంత హానికరమైన, మంచిది కాని స్థలం బజారు. కానీ మనము సహాబాలు, తాబయీన్లు, మన పూర్వీకుల జీవితాలు మనము వారి చరిత్ర చదివితే, వారు బజార్లను, అస్వాఖ్ లను, మస్జిదులుగా మార్చేసేవారు. వారి జీవన విధానం అలా ఉండేది. కొంతమంది సహాబాలు బజార్ కి సోదరులు, ముస్లిములు, తెలిసిన వారు, తెలియని వారు, ఇరుగు పొరుగు వారు కనపడతారేమో, సలాం చెప్దామన్న ఉద్దేశంతో పోయేవారు. అంటే మన పూర్వీకులు హానికరమైన స్థలాన్ని పవిత్రంగా చేసేసారు, అనగా మస్జిద్ గా చేసేసారు, పవిత్రంగా చేసేసేవారు. ఇప్పుడు మనం మస్జిద్ ని సూఖ్ లాగా, బజార్ లాగా చేసేస్తున్నాము. ఈ విషయంలో మనము పరిశీలించాలి, జాగ్రత్తగా ఉండాలి.

అభిమాన సోదరులారా, అలాగే రేపు ప్రళయ దినాన – ఈ హదీస్ మనందరం ఎన్నోసార్లు విన్నాము,

 سَبْعَةٌ يُظِلُّهُمُ اللَّهُ فِي ظِلِّهِ يَوْمَ لاَ ظِلَّ إِلاَّ ظِلُّهُ
సబ్’అతున్ యుదిల్లుహుముల్లాహు ఫీ దిల్లిహీ యౌమ లా దిల్లా ఇల్లా దిల్లుహ్
రేపు ప్రళయ దినాన ఏడు రకాల వ్యక్తులకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన నీడను ప్రసాదిస్తాడు. ఆ రోజు అల్లాహ్ నీడ తప్ప ఏ నీడా ఉండదు.

ఆ ఏడు రకాల వ్యక్తులలో ఒకరు ఎవరు?

رَجُلٌ قَلْبُهُ مُعَلَّقٌ فِي الْمَسَاجِدِ
రజులున్ ఖల్బుహూ ము’అల్లఖున్ ఫిల్ మసాజిద్.
ఏ వ్యక్తి యొక్క హృదయం, ఏ వ్యక్తి యొక్క మనసు మస్జిద్ లో ఉంటుందో, అంటే వారి మనసు మస్జిద్ లోకి నిమగ్నులై ఉంటాయి.

ఇది మస్జిద్ అంటే.

అలాగే, మనిషి తన ఇంట్లో లేక వీధిలో చేసే నమాజ్ కన్నా జమాఅత్ తో చేసే నమాజుకు పాతిక రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని హదీస్ లో ఉంది. ఈ విధంగా ఎక్కువ రెట్లు పుణ్యం లభించడానికి కారణం ఏమిటంటే, మనిషి చక్కగా వుజూ చేసుకొని, కేవలం నమాజు చేసే ఉద్దేశ్యంతో వెళ్తుంటే, ఆ సమయంలో అతను వేసే ప్రతి అడుగుకు అల్లాహ్ ఒక్కొక్కటి చొప్పున అతని అంతస్తులను పెంచుతాడు. అంతే కాదు, అతని వల్ల జరిగే పాపాలను కూడా ఒక్కొక్కటిగా తుడిచి పెట్టేస్తాడు. అతను నమాజ్ చేస్తూ వుజూతో ఉన్నంత వరకు దైవదూతలు అతని మీద శాంతి కురవాలని ప్రార్థిస్తూ, ఓ అల్లాహ్ ఇతనిపై శాంతి కురిపించు, ఓ అల్లాహ్ ఇతన్ని కనికరించు అని అంటూ ఉంటారు.

మస్జిద్ లో ప్రవేశించిన తర్వాత జమాత్ నమాజు కోసం అతను ఎంతసేపు నిరీక్షిస్తాడో, ఎదురు చూస్తూ ఉంటాడో, అంతసేపు అతను నమాజులో ఉన్నట్లుగానే పరిగణించబడతాడు. అల్లాహు అక్బర్. ఒక వ్యక్తి అరగంట ముందు మస్జిద్ కి పోయాడు, ఇరవై నిమిషాల ముందు మస్జిద్ కి పోయాడు, నమాజ్ కోసం వేచి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు జమాత్ కోసం, అంటే ఈ ఎంత సేపు అతను ఎదురు చూస్తున్నాడో అంత సేపు అతను ఎక్కడ ఉన్నాడు? నమాజ్ లోనే ఉన్నాడు. నమాజ్ చేస్తున్నాడు. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు.

ఈ విధంగా మస్జిద్, మస్జిద్ స్థానం, మరియు మన పూర్వీకులు దాని గురించి చాలా వివరాలు ఉన్నాయి. మనము సహాబాల, తాబయీన్ ల చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది. ఉదాహరణగా ఒక్క విషయం చెబుతున్నాను. అన్నిటికంటే అత్యధికంగా హదీసులు చెప్పిన వారు, రివాయత్ చేసిన వారు, అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు. ఆయన పాఠశాల ఏది? మస్జిద్. ఆయన చదువుకున్న యూనివర్సిటీ ఏది? మస్జిద్. ఆయనకి తినటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఒకసారి ఆయన వారి రోషం ఎటువంటిది అంటే అవసరం ఉన్నా కూడా చెయ్యి చాపేవారు కాదు. రెండు మూడు రోజులు అయిపోయింది, అన్నం తినలేదు. అడగటానికి బుద్ధి పుట్టటం లేదు. ఆయన మస్జిద్ బయట వీధిలో ఏ ఉద్దేశంతో పోయారు? సహాబాలు కనపడతారు, వారికి సలాం చెప్తే నన్ను చూసి, నా ముఖాన్ని చూసి వారు అర్థం చేసుకుంటారు అని ఉద్దేశంతో వీధిలో పోయి నిలబడితే అబూబకర్ రదియల్లాహు అన్హు వచ్చారు. ఇది నేను పూర్తి వివరంగా చెప్పదలచలేదు సమయం లేదు. అబూబకర్ కి ఆయన సలాం చెప్తే అబూబకర్ రదియల్లాహు అన్హు వఅలైకుం సలాం చెప్పి ముందుకు సాగిపోయారు. ఆయన బాధపడ్డారు మనసులో. ఆ తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ వచ్చారు రదియల్లాహు అన్హు. ఆయన కూడా వఅలైకుం సలాం చెప్పి ముందుకు సాగిపోయారు. ఈయన మనసులో కుమిలిపోతున్నారు, బాధపడిపోతున్నారు. నా ముఖం వారు గమనించలేదా? నన్ను వారు పట్టించుకోవటం లేదా? అని చెప్పి. ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. చిరునవ్వుతో వఅలైకుం సలాం చెప్పి తోడుగా తీసుకుపోయారు. తీసుకుని పోయి ఇంట్లో ఏముంది అని అడిగితే కొంచెం పాలు ఉంది. అబూ హురైరా మనసులో సంతోషం. పండగ మనసులో. ఈరోజు నాకు పండగ, పాలు దక్కింది అని చెప్పి. అప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ అబూ హురైరా, ఇంకా మస్జిద్ లో ఎంత మంది ఉన్నారు అని అడిగారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు మనసులో కొంచెం పాలు, ప్రవక్త గారు ఇలా అడుగుతున్నారు ఇంత మంది వచ్చేస్తే నాకు ఏం మిగులుతుంది అని మనసులో బాధ. పోయి పిలుచుకొని రా. దాదాపు ఒక 20, 30 మంది వచ్చారు. ఇప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హు ఓకే అల్హందులిల్లాహ్ కొంచెమైనా సరే వస్తుంది అనుకున్నారు. అప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హుతో, అందరికీ పంచు అని చెప్పారు. అప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హు మనసు, అందరికీ నేను పంచాలా? అంటే లాస్ట్ లో ఎవరు తాగాలి నేను. మిగులుతుందా మిగలదా? ఆ తర్వాత అందరికీ పంచారు. అందరూ కడుపు నిండా తాగారు. ఓ అబూ హురైరా, ఇంకా ఎవరున్నారు? ఓ ప్రవక్త నేను మీరు ఇద్దరే ఉన్నాం ప్రవక్త అంటే, నువ్వు తాగు అని చెప్పారు. అబూ హురైరా తాగారు. ప్రవక్రా నేను తాగేసాను. ఇంకోసారి తాగు. ఇంకోసారి తాగు. మూడు సార్లు తాగారు. నాలుగోసారి, దైవప్రవక్త ఇంకా ఇంకోసారి తాగండి అంటే, ఓ దైవప్రవక్త, ఇక్కడ వరకు వచ్చేసింది, ఇప్పుడు తాగలేను. ఆ తర్వాత ప్రవక్త గారు తాగారు. ఇది మోజిజా (మహిమ) . చెప్పటం ఏమిటంటే అటువంటి సహాబీ, ఇల్లు లేని సహాబీ, గృహం లేని సహాబీ, ఆర్థిక పరంగా ఏమీ లేని సహాబీ, వారి విశ్వవిద్యాలయం మస్జిద్, వారి పాఠశాల మస్జిద్, వారి శిక్షణా కేంద్రం మస్జిద్. అందరికంటే అత్యధికంగా హదీసులు రివాయత్ చేశారు అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు. అంత పేదరికంలో ఒకసారి ప్రవక్త గారు వరాన్ని ప్రసాదించారు. ఏం కోరుకుంటావు కోరుకో అని. అప్పుడు ఆయన జ్ఞానాన్ని కోరుకున్నారు. మెమరీ శక్తిని కోరుకున్నారు. ప్రపంచాన్ని కోరుకోలే, ఇల్లుని కోరుకోలే, ధనాన్ని కోరుకోలే. ఇల్లు లేదు ఉండటానికి, దుస్తులు లేవు. అటువంటి స్థితిలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇమాముల్ అంబియా, ఎన్నో వందల గొర్రెలు దానం చేసిన వారు. అడిగిన వారికి ఇచ్చేసేవారు. అటువంటి ఇమామ్-ఏ-కాయినాత్ అడుగుతున్నారు, ఓ అబూ హురైరా ఏం కావాలా అని చెప్పి. దానికి అబూ హురైరా, ఆ పేదవాడు ఏం కోరుకున్నారు? జ్ఞానం కోరారు, ఇల్మ్ కోరారు, జ్ఞాపక శక్తి కోరారు. అందుకోసమే ఆయన ఏమి రాసినా, ఏమి విన్నా ఆయన మనసులో అలాగే ఉండిపోయేది. అందరికంటే ఎక్కువగా హదీసులు ఆయనే రివాయత్ చేశారు.

కావున అభిమాన సోదరులారా సమయం అయిపోయింది, మస్జిద్ కి సంబంధించిన కొన్ని ఆదాబులు తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి.

ఒకటి, దుఆ చేస్తూ సలాం చెబుతూ మస్జిద్ లోకి ప్రవేశించాలి (అల్లాహుమ్మఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక్). రాని వారు నేర్చుకోవాలి. తహియ్యతుల్ మస్జిద్ చేసుకోవాలి పోయిన తర్వాత. అలాగే ఉల్లిపాయలు, తెల్ల ఉల్లిపాయలు, ఇంకా ఏ పదార్థాల వల్ల తినటం వల్ల నోటిలో దుర్వాసన వస్తుందో వాటిని తిని రాకూడదు. ఒకవేళ తిన్న యెడల బ్రష్ చేసుకొని ముఖంలో ఎటువంటి దుర్వాసన లేకుండా చూసుకొని ఆ తర్వాత మస్జిద్ కి రావాలి. ఎందుకంటే ప్రవక్తగారు సెలవిచ్చారు, దేని వల్ల మనిషి బాధపడతాడో, దేని వల్లకి మనిషికి కష్టం కలుగుతుందో, దైవదూతలు కూడా బాధపడతారు అని చెప్పారు. అలాగే మస్జిద్ ను పరిశుభ్రంగా ఉంచాలి, నిశ్శబ్దంగా కూర్చొని భయభక్తులు గలవారై అల్లాహ్ స్మరణ చేయాలి. ప్రశాంతంగా కూర్చోవాలి. గోల చేయడం, పరిహాసాలాడటం, లావాదేవీలు జరపటం, మస్జిద్ ని అగౌరవపరిచినట్లు అవుతుంది. మస్జిద్ ను వచ్చిపోయే మార్గంగా చేసుకోకూడదు. ప్రవేశించాక నమాజ్ చేయడమో, పారాయణం చేయడమో, జిక్ర్ చేయడమో, ఆరాధించడం చేయాలే గానీ, ఇదే మస్జిద్ కి హక్కు. అలాగే మస్జిద్ నుంచి పోయేటప్పుడు అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫద్లిక్ అనే దుఆ చేసుకుంటూ పోవాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించు గాక. ఆమీన్. వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42432

నమాజ్ కొరకు త్వరపడటం యొక్క ప్రాముఖ్యత – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా]

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

మొదటి ఖుత్బా :-

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

ఓ ముస్లింలారా! అల్లాహ్ యొక్క భయాన్ని ఆయన దైవభీతిని కలిగి ఉండండి, ఆయనకు విధేయత చూపండి, అవిధేయత నుంచి దూరంగా ఉండండి. మరియు తెలుసుకోండి! నమాజ్ అతి ఉన్నతమైన ఆచరణలలో ఒకటి.  అల్లాహ్ ఇతర ఆరాధనల కంటే ఎక్కువగా దీనికి ఎంతో ప్రాముఖ్యతను ప్రసాదించాడు. నమాజ్ యొక్క ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకత ఏమిటంటే; అల్లాహ్ దీనిని ఆకాశాలలో విధి గావించాడు ఇది చూడడానికి 5 నమాజులే కానీ పుణ్యఫలం పరంగా 50 నమాజుల పుణ్యఫలం లభిస్తుంది. నమాజ్ ద్వారా పాప ప్రక్షాళన జరుగుతుంది, నమాజ్ కొరకు మస్జిద్ వైపు వెళ్లడం మరియు తిరిగి రావడం కూడా ఆరాధనలోని భాగమే, అదే విధంగా దీని ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకత ఏమిటంటే; ఈ నమాజు కొరకు పరిశుభ్రత పొందడం తప్పనిసరి.

ఓ విశ్వాసులారా! నమాజ్ యొక్క ఈ ప్రాధాన్యత దృష్ట్యా అల్లాహ్ దీని కొరకు త్వరపడమని ఆదేశిస్తున్నాడు, మరియు దీనికి సంబంధించి గొప్ప ప్రతిఫలాన్ని పెట్టాడు. అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “పురుషుల పంక్తుల్లో అత్యంత శ్రేష్ఠమైనది మొదటి పంక్తి. అత్యంత హీనమైనది చివరి పంక్తి. స్త్రీల పంక్తుల్లో అత్యంత శ్రేష్ఠమైనది చివరి పంక్తి. అత్యంత హీనమైనది మొదటి పంక్తి”. (ముస్లిం)

అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “తొలి పంక్తిలో చేరటానికి ఎంతటి ఘనత ఉందో ప్రజలకు  తెలిస్తే, దానిని పొందటానికి వారు తప్పకుండా లాటరీ వేసుకుంటారు”. (ముస్లిం)

అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “అజాన్ చెప్పటానికి, తొలి పంక్తిలో చేరటానికి ఎంతటి ఘనత ఉందో ప్రజలకు తెలిస్తే, దానిని పొందటానికి పరస్పరం లాటరీ వేసుకోవటం తప్ప గత్యంతరం లేదని భావిస్తే, వారు తప్పకుండా లాటరీ వేసుకుంటారు. మరియు నమాజ్ కొరకు త్వరపడడం వల్ల లభించే పుణ్యఫలం ఎంతో తెలిస్తే వారు ఒకరిని మించి ఒకరు పోటీపడతారు. అదేవిధంగా ఇషా మరియు ఫజ్ర్ నమాజులను సామూహికంగా చేయడంలో ఎంత పుణ్యముందో ప్రజలకు తెలిస్తే వాటి కోసం మోకాళ్ళు ఈడ్చుకుంటూ నడవవలసి వచ్చిన సరే వారు తప్పకుండా వస్తారు.” (బుఖారీ-ముస్లిం)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఈ హదీసులో(ما في النداء) దీని అర్థం అజాన్ ఇచ్చే వారికి లభించే అటువంటి పుణ్యఫలం మరియు “ یستهموا” దీని అర్థం లాటరీ వేయడం మరియు” تهجير ” దీని అర్థం త్వరపడటం మరియు” عتمة” దీని అర్థం ఇషా నమాజ్.

బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారు: “నిస్సందేహంగా అల్లాహ్ తొలి పంక్తుల్లో ఉండేవారిపై కారుణ్యాన్ని కురిపిస్తాడు. మరియు దైవదూతలు వారి పాప క్షమాపణ కొరకు దువా చేస్తారు”. (అబూ దావుద్)

ప్రవక్త వారి ఈ ఆదేశంలో దైవదూతలు వారి కొరకు దువాలు చేస్తారు. దీని యొక్క అర్థం ఏమిటంటే దైవదూతలు మొదటి పంక్తిలో ఉండే వారి కొరకు పుణ్యం మరియు క్షమాపణ యొక్క దువా చేస్తారు ఎందుకంటే అరబ్బీలో సలాహ్ అంటే దుఆ అని అర్థం కూడా వస్తుంది.

ఇర్బాజ్ బిన్ సారియ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు మొదటి పంక్తి వారి కొరకు మూడుసార్లు మరియు రెండవ పంక్తి వారి కొరకు ఒకసారి మగ్ ఫిరత్ (పాప క్షమాపణ) దుఆ చేసేవారు.(నసాయి)

అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం: తన సహచరులు వెనుక (పంక్తుల్లో) ఉండిపోవటం చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని మందలిస్తూ, “ముందుకు రండి, మీరు నన్ను అనుసరించండి. మీ తర్వాత వచ్చిన వారు మిమ్మల్ని అనుసరిస్తారు. (జాగ్రత్త!) ప్రజలు గనక ఎప్పుడూ వెనకే ఉంటే అల్లాహ్ కూడా వారిని వెనకబాటు తనానికి గురిచేస్తాడు” అని అన్నారు. (ముస్లిం)

ఆయిషా (రదియల్లాహు అన్హ) కథనం ప్రకారం మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలియజేశారు; “ఎవరైతే మొదటి పంక్తులకు దూరంగా ఉంటారో అల్లాహ్ తఆల వారిని తన కారుణ్యానికి కూడా దూరంగా ఉంచుతాడు”.(అబూ దావుద్)

అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక, ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన తౌబా (పశ్చాత్తాపం) చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.  

స్తోత్రం మరియు దరూద్ తరువాత

మీరు తెలుసుకోండి! అల్లాహ్ మీపై కనికరించు గాక! ఇస్లాంలో నమాజుకు చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది, ఇంత గొప్ప ప్రాధాన్యత మరి యే ఇతర ఆరాధనకు లేదు. ఇస్లాం యొక్క ముఖ్య మూల స్తంభాలలో ఒకటి. ఇది లేకుండా ధర్మం స్థిరంగా ఉండలేదు.

ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు; “ఏమిటి నేను మీకు ధర్మం యొక్క అసలు మరియు దాని మూల స్తంభం మరియు దాని యొక్క శిఖరం గురించి తెలియజేయనా?” అప్పుడు నేను ఇలా అన్నాను, ఎందుకు కాదు మహా ప్రవక్తా! తెలియజేయండి. ప్రవక్త వారు ఇలా అన్నారు: “ధర్మం యొక్క అసలు ఇస్లాం, దాని మూల స్తంభం నమాజ్, మరియు దాని శిఖరం అల్లాహ్ మార్గంలో పోరాడటం”. (తిర్మిజి)

దాసుడు మరియు అల్లాహ్ మధ్య ఇది సంభాషణకు ఒక సాధన, ఎందుకంటే నమాజులో అల్లాహ్ యొక్క పొగడ్త, ఆయన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం జరుగుతుంది.  నమాజ్ ఆరాధన హృదయం, నాలుక మరియు శరీర అవయవాల పై ఆధారపడి ఉంది ఉదాహరణకు అల్లాహ్ యొక్క పొగడ్త, దువా చేయడం, ఖురాన్ పఠించడం, అల్లాహ్ ను స్తుతించడం, తక్బీర్ చెప్పడం, మరియు శరీర అవయవాలతో ఏకాగ్రచిత్తంతో ఆచరించడం మరియు రుకూ, సజ్దా చేయడం మరియు అందులో వినయ వినమ్రతలు కనబరుస్తూ తమ చూపుని కిందికి వాల్చుకొని అల్లాహ్ ముందు తలవంచి నిల్చోవడం.

إنَّ الصَّلَوَةَ تَنْهَى عَنِ الْفَحْشَاءِ وَالْمُنكَرِ وَلَذِكْرُ اللَّهِ أَكْبَرُ
నిశ్చయంగా నమాజ్‌ సిగ్గుమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్‌ స్మరణ చాలా గొప్ప విషయం (అన్న సంగతిని మరువరాదు). (29:45)

షేఖ్ సాది (రహిమహుల్లాహ్) పై ఆయత్ యొక్క వివరణలో ఇలా తెలియజేస్తున్నారు:- నమాజ్ యొక్క ఒక లక్ష్యం దాని కంటే గొప్పది అనగా హృదయం మరియు నాలుక మరియు శరీరంతో అల్లాహ్ యొక్క స్మరణ చేయడం. ఎందుకంటే అల్లాహ్ తన దాసులను దాని కొరకే పుట్టించాడు, దాసులవైపు నుంచి చేసేటువంటి ఆరాధనలలో అతి గొప్ప ఆరాధన నమాజ్. నమాజులో తప్ప మనిషి యొక్క శరీర అవయవాల ద్యారా ఇలాంటి ఆరాధన జరగదు. అందుకే అల్లాహ్ అంటున్నాడు (وَلَذِكْرُ اللَّهِ أَكْبَرُ) అల్లాహ్ స్మరణ అన్నింటి కంటే గొప్పది.

ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి, అల్లాహ్ మీపై కరుణించుగాక! అల్లాహ్ మీకు ఒక పెద్ద ఆచరణకై  అజ్ఞాపించి ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ ఇలా అన్నాడు.

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا

నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి. (అల్ అహ్ జాబ్ 33:56)

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్దితో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు. ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమానబరుచు. నీవు మరియు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి. మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين

రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ
జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి

పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్

మస్జిదె ఖుబా (Masjid-e-Quba) ప్రత్యేకతలు [వీడియో]

మస్జిదె ఖూబ ప్రత్యేకతలు – షరీఫ్ మదనీ [3 నిముషాలు]
https://www.youtube.com/watch?v=QOclavePcwo

మదీనాలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మొట్ట మొదట నిర్మించిన మస్జిద్, మస్జిదె ఖుబా.

ఇబ్నుల్ ఖయ్యిం (రహిమహుల్లాహ్) ప్రకారం (జాద్ అల్ మాద్ 3/58) లో దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మదీనాలో ప్రవేశించిన సందర్భాన్ని వివరిస్తూ:

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం రాకపై సంతోషపడుతూ, ముస్లింలు తక్బీర్ (అల్లాహు అక్బర్) చెబుతూ, ఆయనను కలవడానికి వెళ్లారు… దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఖుబా వరకు వెళ్లి బనూ అమ్ర్ ఇబ్న్ ఔఫ్ వద్ద ఆగారు. వారి మధ్య దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పద్నాలుగు రోజులు ఆగారు. అప్పుడే ఖుబా మస్జిద్ ను స్థాపించారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రవక్తగా నియమించబడ్డాక స్థాపించిన మొదటి మస్జిద్ ఇది.

ప్రఖ్యాత ఇస్లామీయ విద్వాంసులు ముహమ్మద్ అల్ అమీన్ అల్ శంఖీతి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు:

ప్రజానికానికి నిర్మించబడ్డ మస్జిద్ లలో, మొట్ట మొదటి మస్జిద్, మస్జిదె హరాం. ముస్లింల ద్వారా నిర్మించబడ్డ మొదటి మస్జిద్, మస్జిదె ఖుబా. మస్జిదుల్ హరాం ఇబ్రాహీం అలైహిస్సలాం ద్వారా నిర్మించబడ్డది. మస్జిదె ఖుబా అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ద్వారా నిర్మితమయింది.

అల్లాహ్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను మస్జిదె ఖుబాలో ప్రార్ధించండని ప్రోత్సహించారు. ఎందుకంటే, ఈ మస్జిద్ భయభక్తుల పునాదిపై నిర్మించబడింది. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు:

“అయితే తొలినాటి నుంచే భయభక్తుల పునాదిపై నిర్మించబడిన మస్జిదు నువ్వు నిలబడటానికి అన్ని విధాలా తగినది. బాగా పరిశుద్ధతను పొందటాన్ని ఇష్టపడే వారు అందులో ఉన్నారు. బాగా పరిశుద్ధతను పాటించేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు.” (ఖుర్ఆన్ సూరా తౌబా 9:108)

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:

“ఎవరైతే తన ఇంట్లో పరిశుద్ధులై, ఖుబా మస్జిద్ లో నమాజ్ చేస్తారో, వారికి ఉమ్రా చేసినంత ప్రతిఫలం లభిస్తుంది.” (సునన్ ఇబ్న్ మాజా 1476, 1477 & జామి అత్ తిర్మిజి 324)

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నడుస్తూ లేదా స్వారి చేస్తూ ప్రతి శనివారం మస్జిదె ఖుబాకు వెళ్ళేవారు. అక్కడ రెండు రకాతులు నమాజ్ చేసేవారు. (సహీహ్ బుఖారీ vol 2:1191, 1192 & సహీహ్ ముస్లిం 1399)

మదీనాకు వెళ్ళే వారు, అక్కడ నివసించే వారు మస్జిదె ఖుబాకు వెళ్ళడం మరియు అక్కడ నమాజ్ చేయడం వల్ల సున్నత్ ను పాటించిన మరియు ఉమ్రా చేసిన ప్రతిఫలం లభిస్తుంది. సహల్ ఇబ్న్ హనీఫ్ ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఎవరైతే ఈ మస్జిద్ – అంటే మస్జిదె ఖుబా – కు వచ్చి నమాజ్ చేస్తారో, వారికి ఉమ్రాకు సమానమైన ప్రతిఫలం లభిస్తుంది.” (ముస్నద్ అహ్మద్ 3/437; అల్ నసాయి 699; షేక్ అల్బాని గారు దీన్ని సహీహ్ అల్ తర్ఘీబ్ 1180,1181 లో ధృవీకరించారు).

సఫ్ (లైన్)లో ఖాలీ స్థలం వదలకండి, స్వర్గంలో గృహం పొందండి

మేము మస్జిద్ నిర్మాణం కొరకు దానం చేసాము, కానీ వారు సొంత ఖర్చులకు వాడుకుంటే మాకు పుణ్యం లభిస్తుందా? [వీడియో]

బిస్మిల్లాహ్

[7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

జకాతు & సదఖా మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/zakah/

ముగ్గురు అల్లాహ్ పూచీలో (హామీలో) ఉన్నారు [ఆడియో]

బిస్మిల్లాహ్

[9:05 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అబూ ఉమామ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెలిపారు:

“ముగ్గురు అల్లాహ్ యొక్క హామీ/పూచీ(జమానత్)లో ఉన్నారు. బ్రతికివుంటే వారికి మంచి ఉపాధి లభిస్తుంది వారివైపు నుండి అల్లాహ్ సరిపోతాడు.ఒకవేళ చనిపోతే అల్లాహ్ వారిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. మొదటి వ్యక్తి ఇంట్లోకి ప్రవేశిస్తూ సలాం చేసేవాడు. అతను అల్లాహ్ యొక్క పూచీలో ఉంటాడు. రెండవ వ్యక్తి మస్జిద్ వైపునకు వెళ్ళేవాడు. అల్లాహ్ యొక్క పూచీలో అతను కూడా ఉంటాడు. మూడో వ్యక్తి అల్లాహ్ యొక్క మార్గంలో బయలుదేరిన వ్యక్తి. అతను కూడా అల్లాహ్ యొక్క హామీలో ఉంటాడు.”

عَنْ أَبِي أُمَامَةَ أَنّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ ثَلاثَةٌ كُلُّهُمْ ضَامِنٌ عَلَى اللَّهِ إِنْ عَاشَ رُزِقَ وَكُفِيَ وَإِنْ مَاتَ أَدْخَلَهُ اللَّهُ الْجَنَّةَ مَنْ دَخَلَ بَيْتَهُ فَسَلَّمَ فَهُوَ ضَامِنٌ عَلَى اللَّهِ وَمَنْ خَرَجَ إِلَى الْمَسْجِدِ فَهُوَ ضَامِنٌ عَلَى اللَّهِ وَمَنْ خَرَجَ فِي سَبِيلِ اللَّهِ فَهُوَ ضَامِنٌ عَلَى اللَّهِ

504 صحيح ابن حبان كتاب البر والإحسان باب إفشاء السلام وإطعام الطعام

499 المحدث شعيب الأرناؤوط خلاصة حكم المحدث صحيح في تخريج صحيح ابن حبان

Abu Umamah reported: The Messenger of Allah, peace and blessings be upon him, said,

Three people have a guarantee from Allah. If he lives he will have provision to suffice him, and if he dies he will enter Paradise: one who enters and greets with peace has a guarantee from Allah, one who goes out to the mosque has a guarantee from Allah, and one who goes out in the way of Allah has a guarantee from Allah.

Source: Ṣaḥīḥ Ibn Ḥibbān 504. Grade: Sahih (authentic) according to Al-Mundhiri

ధర్మపరమైన నిషేధాలు – 16 : షిర్క్ సాధనాలను అంతమొందించుటకు సమాధి ఉన్న మస్జిదులో నమాజు చేయకు [వీడియో]

బిస్మిల్లాహ్

[4:36 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ధర్మపరమైన నిషేధాలు 16

16- షిర్క్ సాధనాలను అంతమొందించుటకు సమాధి ఉన్న మస్జిదులో నమాజు చేయకు [1]

وَأَنَّ المَسَاجِدَ للهِ فَلَا تَدْعُوا مَعَ اللهِ أَحَدًا] {الجنّ:18}

మసీదులు అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కనుక వాటిలో అల్లాహ్ తో పాటు ఇతరులెవ్వరినీ ప్రార్థించకండి[. (జిన్ 72: 18).


[1]  సమాధిపై మస్జిద్ నిర్మిచబడితే దానిని పడగొట్టుట లేదా మస్జిదులో సమాధి చేయబడితే శవాన్ని అందులో నుండి తీసి స్మశానం (ఖబ్రి- స్తాన్)లో సమాధి చేయుట విధిగా ఉంది. ఇలాగే షిర్క్ ఉపద్రవాల నుండి రక్షణ పొందగలుగుతాము.

పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

జునుబీ’ (అశుద్ద స్థితిలో ఉన్నవారి) పై నిషిద్ధ విషయాలు [వీడియో, టెక్స్ట్]

‘జునుబీ’ (అశుద్ద స్థితిలో ఉన్నవారి) పై నిషిద్ధ విషయాలుఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) : పార్ట్ 7A
https://youtu.be/4tRtuTItZkY [30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
శుద్ధి & నమాజు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, ‘ఫిఖ్ అత్-తహారా వస్-సలాహ్’ (పారిశుధ్యం మరియు నమాజ్ ఆదేశాలు) అనే అంశంపై ఏడవ తరగతిలో భాగంగా, జునూబీ (అశుద్ధావస్థలో ఉన్న వ్యక్తి)కి నిషిద్ధమైన పనుల గురించి వివరించబడింది. జునూబీ అంటే స్వప్నస్కలనం లేదా భార్యాభర్తల సంభోగం కారణంగా అశుద్ధతకు లోనైన స్త్రీ లేదా పురుషుడు. వీరికి నిషిద్ధమైనవి నాలుగు ప్రధాన పనులు: 1) నమాజ్ చేయడం, 2) కాబా తవాఫ్ చేయడం, 3) దివ్య ఖుర్ఆన్ గ్రంథాన్ని ముట్టుకోవడం, మరియు 4) మస్జిద్‌లో ఆగడం లేదా నివసించడం. ప్రతి అంశానికి ఖుర్ఆన్ ఆయతులు, హదీసుల నుండి ఆధారాలు, మరియు నలుగురు ఇమామ్‌ల ఏకాభిప్రాయం (ఇజ్మా)తో సహా వివరణ ఇవ్వబడింది. అశుద్ధావస్థలో నమాజ్ చేయరాదు కానీ దాని కోసం నమాజ్‌ను ఆలస్యం చేయడం లేదా వదిలివేయడం తప్పు అని, వెంటనే స్నానం చేసి నమాజ్ ఆచరించాలని స్పష్టం చేయబడింది.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు

أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ
(అల్ హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సఃబిహి అజ్మయీన్, అమ్మా బ’ద్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన కుటుంబ సభ్యులు మరియు ఆయన సహచరులందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.

సోదర మహాశయులారా సోదరీమణులారా! ఫిఖ్ అత్-తహారా వస్-సలాహ్ (Fiqh al-Taharah wa’l-Salah), పరిశుభ్రత మరియు నమాజ్‌కు సంబంధించిన ఆదేశాల ఈ క్లాస్ ఏదైతే మనం మొదలుపెట్టామో, అల్లాహ్ యొక్క దయవల్ల ఈ రోజున ఏడవ క్లాస్ మనం మొదలుపెట్టబోతున్నాము.

అయితే ఈనాడు మనం చదివేటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో, పరిశుద్ధ స్థితిలో లేనివారు, ప్రత్యేకంగా అశుద్ధావస్థలో ఉన్నవారు అంటే జునూబీ (Junubi) అని ఎవరినైతే అనడం జరుగుతుందో, వారిపై నిషిద్ధములు ఉన్నవి ఏమిటి మరియు తయమ్ముమ్‌కు సంబంధించి కొన్ని ఆదేశాలు ఖుర్ఆన్ హదీస్ ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

అయితే రండి, ‘జునూబీ‘ అన్న పదం ఏదైతే ఉందో, అరబీలో జునూబీ అన్న పదం స్వప్నస్కలనం వల్ల లేదా భార్యాభర్తల సంభోగం కారణంగా అశుద్ధతకు లోనైన వ్యక్తిని, స్త్రీ అయినా పురుషుడు అయినా, జునూబీ అని అంటారు.

అయితే, ఈ అశుద్ధ స్థితిలో ఎవరైతే ఉంటారో, ఆ కొంత కాలం, ఆ కొంత సమయం ఏదైతే వారు అశుద్ధంగా ఉంటారో అప్పుడు ఏ కార్యాలు చేయడం వారిపై నిషిద్ధంగా ఉంటాయి? అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్లు నాలుగు విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఒకటి నమాజ్, రెండవది తవాఫ్, మూడవది దివ్య ఖుర్ఆన్ ను ముట్టుకోవడం, నాలుగవది మస్జిద్ లో ఉండడం, అక్కడ కూర్చోవడం, పడుకోవడం, నిలవడం.

అయితే రండి, ఈ నాలుగు విషయాలకు కొంత వివరణ మనం తెలుసుకుందాము. నమాజ్, తవాఫ్, దివ్య ఖుర్ఆన్ ను ముట్టుకోవడం, మస్జిద్ లో ఆగడం. ఇవి నాలుగు పనులు జునూబీ చేయరాదు.

అయితే, వీటికి సంబంధించి మనం ధర్మాదేశాలు చూస్తే గనక, అక్కడ ఎన్నో దలీల్ (ఆధారాలు), నిదర్శనాలు ఉన్నాయి.

ఉదాహరణకు, అల్లాహు త’ఆలా సూరతున్ నిసా ఆయత్ నెంబర్ 43లో తెలిపాడు:

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَقْرَبُوا۟ ٱلصَّلَوٰةَ وَأَنتُمْ سُكَـٰرَىٰ حَتَّىٰ تَعْلَمُوا۟ مَا تَقُولُونَ وَلَا جُنُبًا إِلَّا عَابِرِى سَبِيلٍ حَتَّىٰ تَغْتَسِلُوا۟

విశ్వసించిన ప్రజలారా! మీరు (తాగిన) మత్తులో ఉన్నప్పుడు నమాజు దరిదాపులకు కూడా పోకండి. మీరు పలికేదేమిటో మీకు అర్థం కాగలిగినప్పుడే (నమాజు చెయ్యాలి). లైంగిక అశుద్ధావస్థలో కూడా – స్నానం చేయనంతవరకూ – నమాజు చేయరాదు. (మస్జిదు) దారిగుండా సాగిపోయేటి పరిస్థితి అయితే అది వేరే విషయం! (4:43)

నమాజ్‌కు సమీపించకూడదు. ఇక్కడ ఎవరు? రెండవ విషయం, వలా జునుబన్ (వలా జునుబన్) – జునూబీ, అశుద్ధావస్థలో ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పటివరకు? హత్తా తఘ్ తసిలూ – స్నానం చేసే వరకు. స్నానం చేసిన తర్వాతనే వారు నమాజ్ చేయాలి, అంతకుముందు నమాజ్ చేయడానికి అవకాశం లేదు. ఈ నమాజ్ చేయడం వారిపై నిషిద్ధం.

ఇక ఈ అశుద్ధ స్థితిలో నమాజ్ చేయడం నిషిద్ధం అని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుల్లో ఎంతోమంది యువకులు, యువతులు ఈ ఆదేశం, అల్లాహు త’ఆలా ఏదైతే ఇచ్చాడో, తప్పుడు భావం తీసుకుని నమాజ్‌ను వదులుతూ ఉన్నారు. ఎందరినో చూడడం జరుగుతుంది, వేరే నమాజ్‌లు వారు పూర్తి పాబందీగా చేసినప్పటికీ, రాత్రి అశుద్ధావస్థకు లోనయ్యారు, స్వప్నస్కలనం జరిగింది, వారిని మేల్కొలిపినప్పటికీ, వారు ఫజ్ర్ నమాజ్ జమాఅత్‌తో చేయడానికి రారు. ఇళ్లల్లో తల్లులు లేపినా పిల్లల్ని, వారు చాలా అశ్రద్ధ వహిస్తారు. ఏందంటే నేను స్నానం చేసేది ఉంది, ఇప్పుడు ఈ చల్లదనం, ఇప్పుడు ఇంత తొందరగా చేయాలంటే నాతో కుదరదు, నేను 7 గంటల తర్వాత లేచి స్నానం చేసి అప్పుడు నమాజ్ చేసుకుంటాను.

అయితే సోదర మహాశయులారా, ఈ ఆయత్ ద్వారా చెప్పదలచిన విషయం ఏమిటంటే, అశుద్ధావస్థలో నమాజ్ చేయడం సరియైన విషయం కాదు. ఇలాంటి మనిషి తప్పకుండా స్నానం చేసి నమాజ్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది కానీ, “నమాజ్ ఆలస్యం చేయండి, నమాజ్ దాని సమయం దాటినా పర్వాలేదు, మీరు ఆలస్యంగా చేసుకున్నా అభ్యంతరం లేదు”, అలాంటి మాట ఇక్కడ చెప్పడం జరగలేదు. ఈ విషయం గుర్తుంచుకోవాలి.

అశుద్ధావస్థలో ఉన్న వారిపై నమాజ్ నిషిద్ధం అన్న దాని గురించి హదీసులలో కూడా ఆధారం ఉంది. మనకు సహీహ్ బుఖారీ హదీస్ నెంబర్ 275 మరియు సహీహ్ ముస్లింలో హదీస్ నెంబర్ 605, ఇలా స్పష్టంగా కనబడుతుంది.

అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు:

ఉఖీమతిస్సలాహ్ – నమాజ్ కొరకు ఇఖామత్ చెప్పడం జరిగింది. వ ఉద్దిలతిస్ సుఫూఫు ఖియామా – అందరూ పంక్తుల్లో నిలబడి సఫ్‌లన్నీ కూడా సక్రమంగా చేయబడ్డాయి. ఫ ఖరజ ఇలైనా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం – నమాజ్ చేయించడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేశారు. ఫలమ్మా ఖామ ఫీ ముసల్లా – ప్రవక్త నమాజ్ చేయించే, ఇమామత్ చేయించే స్థలం ఏదైతే ఉందో అక్కడ నిలబడిన నిలబడ్డారు, జకర – అప్పుడు గుర్తుకొచ్చింది అన్నహు జునుబున్ – ప్రవక్త అశుద్ధావస్థలో ఉన్నట్లు, స్నానం చేయవలసిన అవసరం ఉంది అని ప్రవక్త వారికి గుర్తుకొచ్చింది. ఫ ఖాల లనా – అబూ హురైరా అంటున్నారు, ప్రవక్త వారు మా సహాబాలందరినీ ఉద్దేశించి చెప్పారు, మకానకుమ్ – మీరు ఇలాగే నిలబడి ఉండండి. సుమ్మ రజ’అ ఫఘ్ తసల – ప్రవక్త వెళ్ళిపోయారు, స్నానం చేశారు. సుమ్మ ఖరజ ఇలైనా – మళ్ళీ ప్రవక్త మా మధ్యలో వచ్చారు, వ ర’సుహు యఖ్తుర్ – తల నుండి నీళ్లు, నీళ్ల యొక్క చుక్కలు, నీళ్ల బొట్లు పడుతూ ఉన్నాయి. ఫ కబ్బర ఫ సల్లైనా మా’అహు – అల్లాహు అక్బర్ అని తక్బీరె తహ్రీమా అన్నారు. మేము ప్రవక్త వెంట నమాజ్ చేసుకున్నాము.

ఈ హదీస్ ద్వారా కూడా ఏం తెలిసింది? ప్రవక్త మరిచిపోయారు. అయితే, నమాజ్ చేయించడానికి వచ్చేశారు కానీ నిలబడి ముసల్లా మీద నమాజ్ స్టార్ట్ చేసేకి ముందుగా గుర్తుకు వచ్చేసింది, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే ఆ విషయాన్ని, ఏదైతే గుర్తుకు వచ్చిందో, సహాబాలను అక్కడే ఉండమని చెప్పి వెళ్ళిపోయారు మరియు నమాజ్ స్నానం చేసిన తర్వాతనే వచ్చి నమాజ్ చేయించారు.

సోదర మహాశయులారా, కనీసం ఒక ఆధారం మనం తెలుసుకున్నా అల్హందులిల్లాహ్ సరిపోతుంది. కానీ మీకు ఈ హదీసుల పట్ల కూడా మంచి అవగాహన కలిగి ఉండాలి అని నిదానంగా ఇలాంటి దలీల్ అన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అందుకొరకు శ్రద్ధ వహించండి, నోట్స్ తయారు చేసుకుంటూ ఉండండి మరియు పాఠం జరిగిన తర్వాత, క్లాస్ తర్వాత ఈ పాఠాలను మీరు నెమరువేసుకుంటూ ఉండండి, రివ్యూ చేసుకుంటూ ఉండండి. దీని ద్వారా విద్య అనేది ఇంకా బలపడుతుంది, మీ మనసుల్లో నాటుకుపోతుంది, ఇంకా మీరు ఈ విషయాలు మర్చిపోకుండా ఉండాలంటే మీ వెనక వారికి, క్లాసులో పాల్గొనలేని వారికి చెబుతూ ఉండాలి కూడా.

అశుద్ధావస్థలో ఉన్నటువంటి జునూబీపై రెండవది ఏదైతే నిషిద్ధంగా ఉందో, అది కాబతుల్లాహ్ యొక్క తవాఫ్. దీనికి సంబంధించి ఎన్నో ఆధారాలు మనకు కనబడతాయి. సర్వసామాన్యంగా నేను ఏదైతే చెబుతూ ఉంటానో, మన మధ్యలో నాలుగు ఫిఖ్‌లు ఏవైతే ఫేమస్‌గా ఉన్నాయో, అంతకంటే ఎక్కువ ఫిఖ్‌లు కూడా ఇమామ్‌లు కూడా ఉండిరి, కానీ ఇవి నాలుగు ఫేమస్ అయిపోయాయి, హనఫీ, మాలికీ, షాఫియీ, హంబలీ. ఈ నాలుగు ఫిఖ్‌లలో కూడా ఏకీభవంగా తవాఫ్ చేసే వ్యక్తి కూడా తప్పకుండా పరిశుద్ధావస్థలో ఉండడం మరియు తవాఫ్ చేసేకి ముందు అతను వుదూ చేసుకోవడం చాలా నొక్కి చెప్పడం జరిగింది.

ఇంతకుముందు నేను ఏదైతే నమాజ్ గురించి ఒక ఆయత్ వినిపించానో, సూరత్ అన్-నిసా ఆయత్ నెంబర్ 43, దాని ద్వారా కూడా ఆధారం తీసుకోవడం జరుగుతుంది.

అలాగే హజ్రత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా వారికి హజ్ చేసే సందర్భంలో ఆమె నిలవారి ఏదైతే మొదలైపోయిందో, బహిష్టు, ఆ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏం చెప్పారు: ఇఫ్’అలీ మా యఫ్’అలుల్ హాజ్, ఘైర అల్లా తతూఫిల్ బైత్ హత్తా తత్ హురీ – ఇంకో ఉల్లేఖనంలో హత్తా తఘ్ తసిలీ. ఓ ఆయిషా, నీవు ఈ నెలవారి రక్తస్రావంలో ఉన్నావని బాధపడకు, హజ్ విషయంలో నీకు ఏదైనా ఆటంకం కలిగింది అన్నట్లుగా నీవు నొచ్చుకోవద్దు ఎందుకంటే నీవు ఈ స్థితిలో ఉండి కూడా హాజీ ఏ ఏ పనులు చేస్తాడో అవన్నీ చేయవచ్చును నువ్వు, కేవలం ఒక్క తవాఫ్ తప్ప. తవాఫ్ చేయకూడదు, పరిశుద్ధమై స్నానం చేసే వరకు తవాఫ్ చేయకు.

ఈ హదీస్ సహీహ్ బుఖారీలో ఉంది 305, సహీహ్ ముస్లింలో ఉంది 1211. ఈ హదీస్ ద్వారా కూడా ధర్మవేత్తలందరూ ఏకీభవించారు. స్త్రీ నెలవారి రక్తస్రావం జరుగుతుంది అంటే ఆమె అశుద్ధావస్థలో ఉన్నట్లు. అశుద్ధావస్థలో ఉన్నవారు తవాఫ్ చేయకూడదు.

ఇదే కాకుండా హజ్రత్ సఫియా బిన్తె హుయై ఇబ్ను అఖ్తబ్ రదియల్లాహు త’ఆలా అన్హా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర భార్య, ఆమెకు సంబంధించిన ఒక హదీస్ ద్వారా కూడా ఈ విషయం తెలుస్తుంది.

మరియు అలాగే ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం ఉంది, సునన్ నసాయిలో, నసాయి కుబ్రా 3944, అలాగే బైహఖీలో 9573 మరియు ఈ హదీసును కొందరు ధర్మవేత్తలు మౌఖూఫ్ మరియు సహీహ్ అని చెప్పారు. కానీ ఈ మాట చెప్పేవారు ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు అయినప్పటికీ, హదీస్ పరిభాషలో, ఇస్తిలాహె హదీస్లో దీనిని హుక్ముర్ రఫ్’అ అని అంటారు, హుక్ముల్ మర్ఫూ అని అంటారు. అంటే, ఇలాంటి మాట సహాబీ తన ఇష్టానుసారం చెప్పడానికి హక్కు ఉండదు, వారు ప్రవక్తతో విని ఉంటారు, తెలుసుకొని ఉంటారు కానీ ప్రవక్త చెప్పారు అన్నటువంటి మాట ఆ సందర్భంలో వారు చెప్పలేదు. ఏంటి విషయం?

అత్తవాఫు బిల్ బైతి సలాహ్ – కాబతుల్లాహ్ యొక్క తవాఫ్ కూడా సలాహ్, నమాజ్ లాంటిది. కాకపోతే ఈ తవాఫ్‌లో మాట్లాడే అటువంటి, నడిచే అటువంటి అనుమతి ఇవ్వడం జరిగింది. నమాజ్‌లో మాట్లాడే, నడిచే అనుమతి కూడా లేదు.”

సోదర మహాశయులారా, తవాఫ్ చేయకూడదు అన్నటువంటి ఈ విషయం ఏదైతే ఉందో, దీని గురించి మనకు ఈ ఆధారాలు ఏవైతే తెలిశాయో, వీటిపై మనం తృప్తి ఉండి, ఎప్పుడూ మనం తవాఫ్ చేసినా అశుద్ధావస్థలో ఉండకుండా పరిశుభ్రతలో ఉండి, వుదూ చేసుకొని తవాఫ్ చేసే ప్రయత్నం చేయాలి.

ఇక రండి, మూడో విషయం అశుద్ధావస్థలో ఏమి చేయరాదు? ఖుర్ఆన్ ను తాకకూడదు అన్నటువంటి విషయం. అయితే ఖుర్ఆన్ ను తాకకూడదు అన్నటువంటి విషయం ఏదైతే ఉందో, దీని గురించి కూడా హనఫీ, మాలికీ, షాఫియీ, హంబలీ, ఈ నాలుగు ఫిఖ్‌లలో, నాలుగు ఫిఖ్‌లలో జునూబీ – జునూబీ అంటే ఎవరో తెలిసింది కదా, అశుద్ధావస్థలో ఉన్న వ్యక్తి – ఖుర్ఆన్ ను ముట్టుకోకూడదు, ఖుర్ఆన్ ను తాకకూడదు అని ఏకీభవించారు. మరియు ఇమామ్ ఇబ్ను అబ్దిల్ బర్ర్, ఇమామ్ ఇబ్ను అబ్దిల్ బర్ర్ ఈ విషయంలో అందరి ఏకాభిప్రాయం ఉంది, ఇజ్మా ఉంది అని కూడా స్పష్టంగా తెలిపారు. ఈ విషయం అల్-ఇస్తిద్కార్ లో ఉంది. అలాగే ఇమామ్ షౌకానీ రహిమహుల్లాహ్ కూడా ఈ విషయం తెలిపారు, నైలుల్ అవ్తార్ లో ఈ మాట ఆయన రాశారు.

దీనికి సూరతుల్ వాఖిఆ, ఇందులోని ఆయత్ ద్వారా కూడా దలీల్ తీసుకోవడం జరుగుతుంది. కొందరు సూరత్ అల్-వాఖిఆలో వచ్చిన ఆయత్ ను దేవదూతల గురించి అని, అది లౌహె మహ్ఫూజ్ గురించి అని అంటారు. కానీ సర్వసామాన్యంగా అధికమంది ధర్మవేత్తలు ఈ ఆయత్ నే ఆధారంగా తీసుకున్నారు మరియు ఇమామ్ ఖుర్తుబీ రహిమహుల్లాహ్ తఫ్సీరె ఖుర్తుబీలో చెప్పారు: అన్నహు ఇదా కాన లా యజూజు లహు అల్-లుబ్సు ఫిల్ మస్జిద్, ఫ అహ్రా అల్లా యజూజ లహు మస్సుల్ ముస్హఫ్, వలల్ ఖిరాఅతు ఫీహి ఇద్ హువ అ’జము హుర్మతన్. మనం నాలుగో విషయం తెలుసుకోబోతున్నాము మస్జిద్ లో ఉండకూడదు అని. అక్కడ వివరాలు వస్తాయి దానికి సంబంధించి. అయితే ఇమామ్ ఖుర్తుబీ ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావించారు. జునూబీ మస్జిద్ లో ఆగకూడదు, అక్కడ నిలువకూడదు. అయితే, మస్జిద్ లో జునూబీ నిలువకూడదు అని ఆదేశం ఉన్నప్పుడు, ఫ అహ్రా అల్లా యజూజ లహు మస్సుల్ ముస్హఫ్ – అయితే అతను ముస్హఫ్ ను, ఖుర్ఆన్ గ్రంథాన్ని తాకకపోవడం, ముట్టుకోకపోవడం ఇది మరీ చాలా అవసరమైన విషయం. వలల్ ఖిరాఅతు ఫీహి – దానిని ముట్టుకొని, చూసి చదవడం కూడా ఇది యోగ్యం లేదు. ఇద్ హువ అ’జము హుర్మతన్ – ఖుర్ఆన్ గ్రంథం, దీని యొక్క గౌరవప్రదం అనేది మస్జిద్ కంటే కూడా ఎక్కువగా ఉంది.

అంతేకాకుండా, మరొక హదీస్ ద్వారా కూడా దలీల్ తీసుకుంటారు ఎందరో ధర్మవేత్తలు. తబరానీ, దారుఖుత్నీ ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో ఈ హదీస్ వచ్చి ఉంది. షేక్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహుల్ జామిఅలో దీనిని ప్రస్తావించారు. హదీస్ నెంబర్ 7780. ఏంటి హదీస్? లా యమస్సుల్ ఖుర్ఆన ఇల్లా తాహిరున్ – ఖుర్ఆన్ ను పరిశుభ్రంగా ఉన్న వ్యక్తే ముట్టుకోవాలి, తాకాలి. అయితే జునూబీ మనిషి ఖుర్ఆన్ ను ముట్టుకోకూడదు, తాకకూడదు.

అయినా మీరు గమనించండి, ఈ జనాబత్ అనేది ఏదైతే ఉందో, ఈ అశుద్ధావస్థ ఏదైతే ఉందో, అది చాలా తక్కువ సమయమే ఉంటుంది. స్త్రీలకు నెలవారి లేదా ప్రసవ రక్తం స్రవించే సందర్భంలో ఒక కొన్ని రోజుల వరకు వారు ఆ అశుద్ధావస్థలో ఉంటారు, వారి విషయం వేరు. కానీ జనాబత్ అన్నది ఏదైతే ఉందో, స్వప్నస్కలనం లేదా భార్యాభర్తల సంభోగం కారణంగా అశుద్ధావస్థ, ఇది చాలా తక్కువ సమయం ఉంటుంది. అందుకొరకు ఈ సమయంలో ఖుర్ఆన్ ను ముట్టుకోకపోవడం, తాకకుండా ఉండడమే మేలైన విషయం.

ఈ కొన్ని ఆయత్ హదీసులు కాకుండా, సహాబాల యొక్క అతర్, వాటి ద్వారా కూడా దీనికి ఆధారం తీసుకోవడం జరుగుతుంది. ఇందులో సల్మాన్ ఫార్సీ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం ఉంది. ఇమామ్ ఇబ్ను అబీ షైబా తన ముసన్నఫ్‌లో 1106, మరియు ఇమామ్ బైహఖీ మరియు ఇమామ్ దారుఖుత్నీ ఇంకా ఇమామ్ జైల’యీ రహిమహుల్లాహ్ నస్బుర్ రాయాలో కూడా దీనిని ఉల్లేఖించారు.

సల్మాన్ ఫార్సీ రదియల్లాహు త’ఆలా అన్హు ఒక ప్రయాణంలో ఉండగా, అబ్దుర్రహ్మాన్ బిన్ యజీద్ బిన్ జాబిర్ ఉల్లేఖిస్తున్నారు, ఆయన చెప్పారు: సల్మాన్ ఫార్సీ రదియల్లాహు త’ఆలా అన్హు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లారు. తిరిగి వచ్చేసిన తర్వాత నేను అడిగాను, మీరు వుదూ చేసుకోండి, ల’అల్లనా నస్’అలుక అన్ ఆయిన్ మినల్ ఖుర్ఆన్ – మేము నీతో ఖుర్ఆన్‌లోని కొన్ని ఆయతుల గురించి అడగాలనుకుంటున్నాము. అప్పుడు సల్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు: సలూనీ, ఫ ఇన్నీ లా అముస్సుహు – అడగండి, నేను ఖుర్ఆన్‌ను ముట్టుకోను, తాకను. ఇన్నహు లా యమస్సుహు ఇల్లల్ ముతహహరూన్ – ఈ ఖుర్ఆన్‌ను తాకడానికి పవిత్రంగా, పరిశుభ్రంగా ఉండడం తప్పనిసరి. అప్పుడు మేము వారితో అడిగాము, ఫ ఖర’అ అలైనా ఖబ్ల అన్ యతవద్ద’అ – అయితే సల్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు వుదూ చేసుకునేకి ముందు, ఖుర్ఆన్‌ను తాకకుండా, ఖుర్ఆన్ ఆయత్ మాకు చదివి వినిపించారు.

ఈ విధంగా సోదర మహాశయులారా, మనకు అల్లాహ్ యొక్క దయవల్ల ఖుర్ఆన్ ను ముట్టుకోకూడదు అన్నటువంటి విషయం గురించి ఈ ఆధారాలు తెలిసినవి.

జునూబీ, అశుద్ధావస్థలో ఉన్న వ్యక్తిపై నిషిద్ధం ఉన్న నాలుగో విషయం ఏదైతే ఉందో, మస్జిద్ లో ఆగడం, మస్జిద్ లో నిలవడం. దీనికి సంబంధించి కూడా ఖుర్ఆన్ లోని సూరత్ అన్-నిసాలోని ఆయత్ 43 ఏదైతే ఇంతకుముందు మనం చెప్పుకున్నామో, వలా జునుబన్ ఇల్లా ఆబిరీ సబీలిన్ హత్తా తఘ్ తసిలూ, ఈ ఆయత్ ద్వారానే దలీల్ తీసుకోవడం జరుగుతుంది.

మాషాఅల్లాహ్. తబారకల్లాహ్. గమనించండి. అందుకొరకే నేను మాటిమాటికి చెబుతూ ఉంటాను. నాకు అరబీ వచ్చయ్యా, అరె ఖుర్ఆన్ అయితే నా భాషలో తర్జుమా, అనువాదం ఉంది కదా నేను చదివి తెలుసుకుంటాను, ఇట్లాంటి మోసాలకు గురి కాకూడదు, నాకు జ్ఞానం ఉంది, నేను స్వయంగా ధర్మ విద్య నేర్చుకుంటాను అన్నటువంటి మాటల్లో పడి మనిషి పెడమార్గంలో పడే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఉలమాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటే, క్లాసులలో పాల్గొని ఉండేది ఉంటే, ఇంకా దానికి సంబంధించిన వ్యాఖ్యానాలు చదువుతూ ఉంటే, ఒక్కొక్క ఆయత్ ద్వారా ఎన్ని ధర్మ విషయాలు ధర్మవేత్తలు మనకు తెలియజేస్తూ ఉంటారు.

మస్జిద్ లో నిలవడం జునూబీపై నిషిద్ధం అన్న దాని గురించి ఈ ఆయత్ నుండి ఎలా దలీల్ తీసుకున్నారో చెప్పండి? ఇల్లా ఆబిరీ సబీలిన్. జునూబీ ఎవరైతే ఉన్నారో వారు నమాజ్‌కు, నమాజ్ చేసే స్థలానికి అక్కడికి రాకూడదు. కానీ నమాజ్ చేసే స్థలం ఏదైతే ఉంటుందో, ఇల్లా ఆబిరీ సబీల్ – అలా దాటుతూ వెళ్ళవచ్చు. అయితే, నమాజ్ చేసే స్థలం అంటే ఇక మస్జిద్. సర్వసామాన్యంగా. అయితే ఆ మస్జిద్, దానికి కూడా ఒక గౌరవ స్థానం అల్లాహ్ ప్రసాదించాడు. అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ ఆయత్ ఏదైతే అవతరించిందో ఇది నమాజ్ గురించి, నమాజ్ చేసే స్థలం గురించి కూడా అని ధర్మవేత్తలు దీని గురించి ఏకీభవించారు. హనఫీ, మాలికీ, షాఫియీ, హంబలీ, అందరూ దీనిని ఏకీభవించారు.

ఒకవేళ ఎవరికైనా అనుమానం రావచ్చు, సర్వసామాన్యంగా మేము అంటూ ఉంటాము, మనం కేవలం ఖుర్ఆన్ హదీస్‌ను ఫాలో కావాలి. ఇక ఎవరైతే ఖుర్ఆన్ హదీస్ కాకుండా ఈ మస్లక్‌లలో పడి ఉన్నారో, హనఫీ, షాఫియీ, హంబలీ, మాలికీ, ఈ విధంగా ఇది మంచి విషయం కాదు, అంధీ తఖ్లీద్ (గుడ్డి అనుకరణ) అనేది ఇది చాలా ప్రమాదకరం అని చెబుతూ ఉంటారు. మరి ఈ మస్లే మసాయిల్, ఈ ధర్మ విషయాలు బోధిస్తున్నప్పుడు మాటిమాటికి హనఫీ, మాలికీ, షాఫియీ, హంబలీ అందరూ దీనిని ఏకీభవించారు అని వాటిని ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఇది తెలుసుకోవాల్సిన విషయం. చూడండి, ఇదే మన్హజె సలఫ్. మనకు సహాబాలు ఎలా ఖుర్ఆన్ హదీసులను అర్థం చేసుకున్నారో, ధర్మవేత్తలు ఎలా అర్థం చేసుకున్నారో, వాటిని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని అదే రకంగా మనం అనుసరించాలి. ఎప్పుడైనా ఎవరైనా, ఎక్కడైనా వారితో పొరపాటు జరిగితే వారి గురించి అల్లాహ్ వారిని మన్నించుగాక అని దుఆ చేస్తూ, ఖుర్ఆన్ హదీస్‌కు చేరువగా, దగ్గరగా ఎవరి మాట ఉందో తీసుకోవాలి, ఖుర్ఆన్ హదీస్‌ను అనుసరించాలి. అల్లాహ్ యొక్క దయ కలిగితే వేరే సందర్భాలలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చెబుదాము.

అయితే, జునూబీ అశుద్ధావస్థలో ఉన్న వ్యక్తి మస్జిద్ లో నిలవకూడదు. ఈ ఆయత్ ద్వారా దలీల్ తీసుకోవడం జరిగింది. ధర్మ పండితులందరూ కూడా ఏకీభవించారు. తఫ్సీర్ ఇబ్ను కసీర్ లో ఈ మాట ఉంది. అలాగే సౌదీ అరబ్ లోని ఇఫ్తా కమిటీ, ఫత్వా కమిటీ ఏదైతే ఉందో వారు కూడా దీనిని ఏకీభవించారు. కానీ ఇందులో ఒక విషయం, ఖుర్ఆన్ ఆయత్ ద్వారానే మనకు తెలుస్తుంది. ఎవరికైనా వేరే ఏ గత్యంతరం లేక మస్జిద్ నుండి దాటి వెళ్ళవలసిన అవసరం వస్తే, వారు తప్పకుండా అలా వెళ్ళవచ్చు. ఇందులో అనుమానం లేదు. ఫిఖ్ షాఫియీ, హంబలీ అలాగే ఇమామ్ ఇబ్ను తైమియా, ఇబ్ను బాజ్, ఇబ్ను ఉసైమీన్ వీరందరి ఫత్వాలు కూడా ఇలాగే ఉన్నాయి.

ఇక్కడ ఒక విషయం. ఈ రోజుల్లో కొన్ని సందర్భాల్లో ఇప్పుడు లాక్డౌన్ కారణంగా కాకపోవచ్చు కానీ అంతకుముందు కూడా మస్జిద్ లో పడుకుంటారు కొందరు. అయితే మస్జిద్ లో పడుకోవడం పాపం తప్పేమీ లేదు. కానీ ఎవరైతే మస్జిద్ లో పడుకుంటున్నారో వారు ఈ విషయాన్ని, ఈ అంశాన్ని శ్రద్ధగా ఎల్లవేళల్లో మదిలో నాటుకొని ఉండాలి. అదేమిటి? ఒకవేళ నిద్రలో వారికి స్వప్నస్కలనం జరిగిందంటే, వెంటనే వారు వెళ్లి స్నానం చేసేయాలి. అరె ఫజర్ నమాజ్ కొరకు ఇంకా మూడు గంటలు ఉన్నాయి కదా, ఇంకా రెండు గంటలు ఉన్నాయి కదా అని అలాగే అక్కడ పడుకొని ఉండిపోవడం, ఇది మంచి విషయం కాదు.

సోదర మహాశయులారా, ఈ విధంగా మనం అల్లాహ్ యొక్క దయవల్ల ఈ అశుద్ధావస్థలో ఏ ఏ పనులు చేయరాదు అన్నటువంటి విషయం ఆ మనం తెలుసుకున్నాము. అయితే, ఖుర్ఆన్ చదవవచ్చు కానీ ఖుర్ఆన్ ను తాకకూడదు అని సల్మాన్ ఫార్సీ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క మాట ద్వారా కూడా మనం అర్థం చేసుకున్నాము ఈ మధ్యలో. కానీ ఎలాగైనా అశుద్ధావస్థ అనేది జనాబత్‌కు సంబంధించింది, ఎక్కువ సేపు ఉండదు గనుక మనం కావాలని మరీ ఆలస్యం చేయకూడదు. కావాలని ఖుర్ఆన్ ను తాకడం గాని, చదవడం గాని చేయకుండా ఉండి, అల్లాహ్ యొక్క జిక్ర్ చేస్తూ ఉండడం, ఇందులో అభ్యంతరం లేదు.

మరి ఏ ధర్మ పండితులైతే ఖుర్ఆన్ చూడకుండా చదవవచ్చు అని అన్నారో, వారు తీసుకున్నటువంటి దలీళ్లలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్, అన్న నబి సల్లల్లాహు అలైహి వసల్లం, రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కాన యద్కురుల్లాహ అలా కుల్లి అహ్యానిహి – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎల్లవేళల్లో అల్లాహ్ యొక్క జికర్ చేస్తూ ఉండేవారు. ఇమామ్ బుఖారీ ము’అల్లఖన్ ఈ హదీస్‌ను ప్రస్తావించారు 634 కంటే ముందు, సహీహ్ ముస్లింలో 373లో ఈ హదీస్ ఉంది.

కానీ హజ్రత్ అలీ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఆచరణ గురించి ముసన్నఫ్ అబ్దుర్రజాఖ్‌లో అలాగే ఇమామ్ అబూ ను’అయమ్ అస్సలాలో, ఇమామ్ దారుఖుత్నీ సునన్‌లో ఆ మరియు ఇంకా వేరే ధర్మవేత్తలు ప్రస్తావించారు, అలీ రదియల్లాహు త’ఆలా అన్హు ఒక సందర్భంలో చెప్పారు: ఇఖ్ర’ఉల్ ఖుర్ఆన మా లమ్ యుసిబ్ అహదుకుమ్ జనాబ, ఫ ఇన్ అసాబత్హు జనాబతున్ ఫలా, వలా హర్ఫన్ వాహిదా – మీలో ఎవరైనా జనాబత్, అశుద్ధావస్థకు లోనయ్యారంటే వారు ఖుర్ఆన్ లోని ఒక అక్షరం కూడా చదవకూడదు.

అయితే, మరి అలీ రదియల్లాహు త’ఆలా అన్హు చదవకూడదు అని అంటున్నారు కదా? మరి కొందరు ధర్మవేత్తలు ఏమన్నారు? చదవవచ్చు అని అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ ద్వారా దలీల్ తీసుకున్నారు. అయితే, అలీ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఈ మాట ద్వారా వేరే కొందరు ధర్మవేత్తలు ఏమంటారంటే, అలీ రదియల్లాహు అన్హు చెప్పిన మాట కరెక్టే, చదవకండి అని. కానీ అక్కడ వివరణ లేదు, ఖుర్ఆన్ చూసి చదవడమా లేకుంటే చూడకుండా చదవడమా అని. ఖుర్ఆన్ ను పట్టుకొని చదవడమా లేక మనకు కంఠస్థం ఉన్న దానిలో నుండి చదవడమా? ఈ విధంగా కూడా ఒక దలీల్ ఇవ్వడం జరిగింది.


ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

జమాఅతు నుండి కొన్ని రకాతులు తప్పిపోయిన వ్యక్తి ఆదేశాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[2:24 నిముషాలు]
జమాఅతు నుండి కొన్ని రకాతులు తప్పిపోయిన వ్యక్తి ఆదేశాలు
నమాజ్ పాఠాలు: 3 వ పాఠం: నమాజు ఆదేశాలు – పార్ట్ 1
https://teluguislam.net/?p=8594
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

మస్బూఖ్:

జమాతుతో ఒకటి లేదా ఎక్కువ రకాతులు తప్పిపోయిన వ్యక్తిని మస్బాఖ్ అంటారు.

ఇమాం రెండవ సలాం త్రిప్పిన తర్వాత ఈ వ్యక్తి సలాం త్రిప్పకుండా తప్పిపోయిన రకాతులు వెరవేర్చాలి.

అతను ఇమాంతో ఏ రకాతులో కలిసాడో అదే అతనిది మొదటి రకాతు.

ఇమాంను రుకూ స్థితిలో పొందినవాని ఆ రకాతు అయినట్లే. ఇమాంను రుకూలో పొందకుంటే ఆ రకాత్ తప్పిపోయినట్లే లెక్క.

జమాతు నిలబడిన తర్వాత వచ్చేవారు జమాతును ఏ స్థితిలో చూసినా అదే స్థితిలో కలవాలి. వారు రుకూ, లేదా సజ్దా ఇంకే స్థితిలో ఉన్నా సరే. వారు మరో రకాతు కొరకు నిలబడే వరకు నిరీక్షించవద్దు.

నిలబడి తక్బీరె తహ్రీమ అల్లాహు అక్బర్ అనాలి. రోగి లాంటి ఏదైనా ఆటంకం ఉన్నవారు కూర్చుండి అల్లాహు అక్బర్ అంటే ఏమీ తప్పు లేదు.

నమాజు నిధులు – పార్ట్ 10 (చివరి భాగం): సలాంకు ముందు మరియు తర్వాత చేసే దుఆలు, జిక్ర్ ఘనతలు [ఆడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ ఆడియో (mp3) వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

[27:53 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

నమాజు నిధులు (Treasures of Salah) – పూర్వపు పాఠాలు మరియు పుస్తకం ఇక్కడ వినండి/చదవండి
https://teluguislam.net/2011/02/24/treasures-of-salah-namaz-telugu-islam/

12 – సలాంకు ముందు దుఆ:

సలాంకు ముందు దుఆ విషయంలో ఏ ఘనత లేకున్నా అది దుఆ అంగీకార శుభసందర్భమవడమే చాలు. అదెలాగంటే నమాజీ అప్పుడు తన ప్రభువు వైపునకు మరలి, ఆయనతో మొరపెట్టు కుంటాడు. అతను నమాజులోనే ఉన్నాడు గనక ఇది దుఆ అంగీకారానికి ఎంతో ఉత్తమం.

అలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః “మీలో ఎవరైనా నమాజు చేస్తున్నప్పుడు అత్తహియ్యాతు లిల్లాహి… చదవాలి, దాని పిదప తనకిష్టమున్న దాన్ని అర్థించుకోవాలి, మరో ఉల్లేఖనంలో ఉంది “ఇంకేదైనా దుఆ ఎంచుకోవాలి”. (బుఖారి, ముస్లిం).

అబూ ఉమామ ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త ను ఎవరో అడిగారు, ‘ఏ దుఆ ఎక్కువ వినబడుతుంది’ అని. దానికి ప్రవక్త ఇలా చెప్పారుః “మధ్య రాత్రిలో మరియు ఫర్జ్ నమాజుల చివరి భాగంలో”. (తిర్మిజి 3499). హదీసులో అరబీ పదం ‘దుబురుస్సలవాత్’ అని ఉంది, అయితే సామాన్యంగా దీని భావం నమాజు చివరి భాగం, అంటే సలాంకు ముందు అని. అయితే ఒకప్పుడు నమాజు తర్వాత అని కూడా చెప్పబడుతుంది.

మూడవ నిధి  (నిక్షేపం)

నమాజు తర్వాత చేయునటువంటి అజ్కార్

నమాజు తర్వాత చేయవలసిన అజ్కార్ వివిధ వాక్యాల్లో ఉన్నవి. అలాగే వాటి పుణ్యాలు కూడా వివిధ రకాలుగా ఉన్నవి. అందులో కొన్నిః

సలాం తర్వాత 3 సార్లు అస్తగ్ ఫిరుల్లాహ్ అనాలి.

اللَّهُمَّ أَعِنِّي عَلَى ذِكْرِكَ وَشُكْرِكَ وَحُسْنِ عِبَادَتِك
అల్లాహుమ్మ అఇన్నీ అలా జిక్రిక వ షుక్రిక వ హస్ని ఇబాదతిక. (అబూదావూద్ 1522).
(అల్లాహ్! నేను నీ ధ్యానం చేయటానికి, నీకు కృతజ్ఞతలు తెలుపుకోటానికి, తగురీతిలో నిన్ను ఆరాధించటానికి నాకు సహాయం చెయ్యి).

కొన్ని దుఆల గురించి ఇక్కడ చెప్పాము, సలాం తర్వాత పూర్తి దుఆలు తెలుసుకొనుటకు మా పుస్తకం “రేయింబవళ్ళ ముఖ్యమైన దుఆలు” అనే పుస్తకం చదవండి.

ఈ నాటి మన ముఖ్య అంశంలోని రెండవ భాగం సలాం తర్వాత జిక్ర్ ఘనత, ఏ జిక్ర్ ఘనత వచ్చి ఉందో ఆ ఘనతల గురించి చెప్పే ముందు చాలా ముఖ్యమైన ఓ విషయం తెలుసుకోండి:

షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లాహ్ చెప్పారు : شرح منظومة أصول الفقه وقواعده ” (ص176-177) .

నమాజు తర్వాత చేసే జిక్ర్ నాలుగు రకాలుగా వచ్చి ఉంది, ఒక్కోసారి ఒక్కో రకాన్ని పాటించడం ఉత్తమం.

(1) సుబ్ హానల్లాహ్ 10సార్లు, అల్ హందులిల్లాహ్ 10సార్లు, అల్లాహు అక్బర్ 10సార్లు. (అబూదావూద్ 5065).
(2) సుబ్ హానల్లాహ్ 33సార్లు, అల్ హందులిల్లాహ్ 33సార్లు, అల్లాహు అక్బర్ 33సార్లు, 1సారి: లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లాషరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. (ముస్లిం 597). అయితే సుబ్ హానల్లాహ్, అల్ హందులిల్లాహ్, అల్లాహు అక్బర్ ఈ మూడు పదాలు కలిపి 33సార్లు చదవవచ్చు. (బుఖారీ 843, ముస్లిం 595).
(3) సుబ్ హానల్లాహ్ 33సార్లు, అల్ హందులిల్లాహ్ 33సార్లు, అల్లాహు అక్బర్ 34సార్లు. (ముస్లిం 596).
(4) సుబ్ హానల్లాహ్ 25సార్లు, అల్ హందులిల్లాహ్ 25సార్లు, అల్లాహు అక్బర్ 25సార్లు, లాఇలాహ ఇల్లల్లాహ్ 25సార్లు. (నిసాయీ 1350, షేఖ్ అల్బానీ సహీ అన్నారు).

(1)  పాపాల మన్నింపు:

صحيح مسلم 597 مَنْ سَبَّحَ اللهَ فِي دُبُرِ كُلِّ صَلَاةٍ ثَلَاثًا وَثَلَاثِينَ، وَحَمِدَ اللهَ ثَلَاثًا وَثَلَاثِينَ، وَكَبَّرَ اللهَ ثَلَاثًا وَثَلَاثِينَ، فَتْلِكَ تِسْعَةٌ وَتِسْعُونَ، وَقَالَ: تَمَامَ الْمِائَةِ: لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ غُفِرَتْ خَطَايَاهُ وَإِنْ كَانَتْ مِثْلَ زَبَدِ الْبَحْرِ

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ఇలా సెలవిచ్చారుః “ప్రతి నమాజు తర్వాత ఎవరు 33 సార్లు సుబ్ హానల్లాహ్, 33 సార్లు అల్లాహు అక్బర్, 33 సార్లు అల్ హందులిల్లాహ్, మరి లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్ చదివి వంద పూర్తి చేస్తాడో అతని పాపాలు సముద్రపు నురుగంత ఉన్నా క్షమించబడతాయి”. (ముస్లిం 597).

(2) అనుగ్రహం, ఉన్నత స్థానాలు మరియు భోగబాగ్యాలు + స్వర్గ ప్రవేశం + 1500 పుణ్యాలు

صحيح البخاري 6329 عَنْ أَبِي هُرَيْرَةَ، قَالُوا: يَا رَسُولَ اللَّهِ ذَهَبَ أَهْلُ الدُّثُورِ بِالدَّرَجَاتِ وَالنَّعِيمِ المُقِيمِ. قَالَ: «كَيْفَ ذَاكَ؟» قَالُوا: صَلَّوْا كَمَا صَلَّيْنَا، وَجَاهَدُوا كَمَا جَاهَدْنَا، وَأَنْفَقُوا مِنْ فُضُولِ أَمْوَالِهِمْ، وَلَيْسَتْ لَنَا أَمْوَالٌ. قَالَ: «أَفَلاَ أُخْبِرُكُمْ بِأَمْرٍ تُدْرِكُونَ مَنْ كَانَ قَبْلَكُمْ، وَتَسْبِقُونَ مَنْ جَاءَ بَعْدَكُمْ، وَلاَ يَأْتِي أَحَدٌ بِمِثْلِ مَا جِئْتُمْ بِهِ إِلَّا مَنْ جَاءَ بِمِثْلِهِ؟ تُسَبِّحُونَ فِي دُبُرِ كُلِّ صَلاَةٍ عَشْرًا، وَتَحْمَدُونَ عَشْرًا، وَتُكَبِّرُونَ عَشْرًا»

అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః (ఓ రోజు కొందరు పేద ప్రజలు ప్రవక్త వద్దకు వచ్చి) ‘ప్రవక్తా! ధనికులు తమ సిరిసంపదల మూలంగా ఉన్నత స్థానాలు అధిరోహించడానికి, శాశ్వతపు భోగభాగ్యా లు పొందడానికి మాకంటే ముందు వెళ్ళారు’ అని ఫిర్యాదు చేశారు. “అది ఎలా?” అని ప్రవక్త అడిగారు. వారన్నారుః ‘వారు మా లాగా నమాజు చేస్తారు, మా లాగానే ధర్మ యుద్ధాలు కూడా చేస్తారు. డబ్బు ఉన్నందున వారు (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెడుతున్నారు, మా వద్ద ఆ డబ్బు లేదు. అప్పుడు ప్రవక్త చెప్పారుః “నేను మీకో విషయం తెలియజేయనా? మీరు దాన్ని పాటించి మిమ్మల్ని మించిపోయిన వాళ్ళతో సమానులవుతారు, మీ కంటే వెనక ఉన్న వాళ్ళతోను మించిపోతారు, మీ లాంటి ఈ పద్దతిని అనుసరించే వాడు తప్ప మీ లాంటి ఆచరణ తెచ్చేవాడు మరొకడు ఉండడు. ఆ విషయం: ప్రతి నమాజు తర్వాత 10 సార్లు సుబ్ హానల్లాహ్, 10 సార్లు అల్ హందులిల్లాహ్, 10 సార్లు అల్లాహు అక్బర్ పలకండి”. (బుఖారీ 6329).

أبو داود 5065 – صحيح: عنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرٍو، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: «خَصْلَتَانِ، أَوْ خَلَّتَانِ لَا يُحَافِظُ عَلَيْهِمَا عَبْدٌ مُسْلِمٌ إِلَّا دَخَلَ الْجَنَّةَ، هُمَا يَسِيرٌ، وَمَنْ يَعْمَلُ بِهِمَا قَلِيلٌ، يُسَبِّحُ فِي دُبُرِ كُلِّ صَلَاةٍ عَشْرًا، وَيَحْمَدُ عَشْرًا، وَيُكَبِّرُ عَشْرًا، فَذَلِكَ خَمْسُونَ وَمِائَةٌ بِاللِّسَانِ، وَأَلْفٌ وَخَمْسُ مِائَةٍ فِي الْمِيزَانِ، … قَالُوا: يَا رَسُولَ اللَّهِ كَيْفَ هُمَا يَسِيرٌ وَمَنْ يَعْمَلُ بِهِمَا قَلِيلٌ؟ قَالَ: «… وَيَأْتِيهِ فِي صَلَاتِهِ فَيُذَكِّرُهُ حَاجَةً قَبْلَ أَنْ يَقُولَهَا»

ప్రవక్త ప్రవచించారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః “రెండు గుణాలున్నాయి, వాటిని పాటించిన ముస్లిం భక్తుడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. అవి తేలికైనవి, కాని వాటిని పాటించేవారు అరుదు. ప్రతి నమాజు తరువాత 10 సార్లు సుబ్ హానల్లాహ్, 10 సార్లు అల్ హందులిల్లాహ్, 10 సార్లు అల్లాహు అక్బర్ చెప్పాలి. ఇవి (ఐదు నమాజుల్లో చేస్తే) నోటి పై 150 అవుతాయి, కాని (ప్రళయదినాన) త్రాసులో 1500 అవుతాయి”. (అబూ దావూద్ 5065, తిర్మిజి 3410, నిసాయి 1348, ఇబ్ను మాజ 926).

నోటి పై 150, దీని సంఖ్య ఇలా ఉంటుంది:

10 సుబ్ హానల్లాహ్ + 10 అల్ హందిలిల్లాహ్ + 10 అల్లాహు అక్బర్ = 30.
30 × 5 (నమాజులు) = 150

త్రాసులో 1500 యొక్క సంఖ్య ఇది:
150 × 10 పుణ్యాలు = 1500 పుణ్యాలు

(3) ఆయతుల్ కుర్సీ = స్వర్గ ప్రవేశం

النسائي الكبرى 9848 – صحيح : عَنْ أَبِي أُمَامَةَ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «مَنْ قَرَأَ آيَةَ الْكُرْسِيِّ فِي دُبُرِ كُلِّ صَلَاةٍ مَكْتُوبَةٍ لَمْ يَمْنَعْهُ مِنْ دُخُولِ الْجَنَّةِ إِلَّا أَنْ يَمُوتَ» صحيح الجامع 6464

అబూ హూరైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ఆదేశించారుః “ఎవరు ప్రతి నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో వారి స్వర్గ ప్రవేశానికి మరణమే అడ్డు”. (నిసాయి ).

(4) ప్రత్యేకంగా ఫజ్ర్ మరియు మగ్రిబ్ తర్వాత చేసే జిక్ర్ ఘనత

النسائي 1354 –صحيح: عَنْ أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «مَنْ سَبَّحَ فِي دُبُرِ صَلَاةِ الْغَدَاةِ مِائَةَ تَسْبِيحَةٍ، وَهَلَّلَ مِائَةَ تَهْلِيلَةٍ، غُفِرَتْ لَهُ ذُنُوبُهُ، وَلَوْ كَانَتْ مِثْلَ زَبَدِ الْبَحْرِ»

షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ వారి సహీహుత్ తర్గీబ్ హదీసు నం. 472-477లో “లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లాషరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు యుహ్ యీ వయుమీతు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్” ఘనతలో వచ్చిన హదీసుల సారాంశం:

لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ، يُحْيِي وَيُمِيتُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ
లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లాషరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు యుహ్ యీ వయుమీతు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్

ఈ జిక్ర్ ఫజ్ర్, మగ్రిబ్ తర్వాత 10 సార్లు చదవాలి. (కొన్ని ఉల్లేఖనాల్లో అస్ర్ తర్వాత అని ఉంది). అయితే ఒక్కసారి చదివినందుకు లభించే ఘనతలు ఇలా ఉన్నాయి:

  • 1️⃣ ఒక్క విశ్వాస బానిసను విముక్తి కలిగించినంత పుణ్యం,
  • 2️⃣ 10 పుణ్యాలు లిఖించబడతాయి, موجبات
  • 3️⃣ 10 పాపాలు మన్నించబడతాయి, موبقات
  • 4️⃣ 10 స్థానాలు పెంచబడతాయి,
  • 5️⃣ ప్రతి చెడు (مكروه) నుండి కాపాడుకోవడం జరుగుతుంది,
  • 6️⃣ షైతాన్ నుండి రక్షించబడతుంది,
  • 7️⃣ ఆ రోజు షిర్క్ తప్ప ఏ పాపం వల్ల అతను పట్టుబడడు,
  • 8️⃣ ఉదయం వరకు అల్లాహ్, షైతాన్ నుండి అతని రక్షణ కొరకు ఆయుధాలు ధరించిఉన్న దైవదూతలను పంపుతాడు
  • 9️⃣ ఆ రోజు అతనికంటే ఉత్తముడు, ఘనతగలవాడు మరెవడూ ఉండడు.

(కొన్ని ఉల్లేఖనాల్లో రెండు కాళ్ళు మలుచుకునేకి ముందు చదవాలన్న ప్రస్తావన ఉంది).

దుఆలు పుస్తకాలు